difficulties
-
యాదాద్రి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు
-
మండే ఎండలు X మధుమేహం!
సాక్షి, హైదరాబాద్: ఎండలు మండిపోతున్నాయి. 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఇంట్లోంచి బయటికి రావడానికి జంకుతున్నారు. ఇళ్లలో ఉన్నా వేడి తీవ్రతను తట్టుకోలేక అల్లాడుతున్నారు. సాధారణ వ్యక్తులకే ఇంత ఇబ్బంది ఉంటే.. మధుమేహ బాధితులకు మరిన్ని సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.వారికి సాధారణ ఆరోగ్య సమస్యలతోపాటు కిడ్నీ, గుండె సంబంధ వ్యాధుల ఇబ్బంది పెరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగానే మధుమేహం ఉన్నవారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని.. వారికి వైరల్, ఇతర ఉష్ణమండల వ్యాధులు త్వరగా సంక్రమించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహులు డీహైడ్రేషన్కు ఎక్కువగా గురవుతారని అంటున్నారు. ఎన్నో సమస్యలకు చాన్స్.. ∗ వైద్య నిపుణులు చెప్తున్న మేరకు.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహ బాధితులకు అధిక ఉష్ణోగ్రతల వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గి, మూత్ర విసర్జన తగ్గుతుంది. తల తిరగడం, తలనొప్పి, నోరు, కళ్లు పొడిబారడం వంటివి ఉంటాయి. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇవన్నీ కిడ్నీలు, గుండె సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ∗డయాబెటిస్ బాధితులు కాస్త ఎక్కువగా, కనీసం రోజుకు 4 నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలి. కూల్డ్రింక్స్, రోడ్లపై దొరికే చల్లటి పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. ∗రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేలా తృణధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. సాధారణ అన్నం, టిఫిన్లు, మైదాతో కూడిన తినుబండారాలను బాగా తగ్గించాలి. ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. ∗వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి. ఎండ వేళల్లో బయటికి వెళ్లొద్దు. ∗ఆల్కాహాలిక్ పానీయాలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ వల్ల మూత్ర విసర్జన ఎక్కువవుతుంది. శరీరంలోని నీటి శాతం వేగంగా తగ్గి, డీహైడ్రేషన్కు, కిడ్నీల సమస్యకు దారితీస్తుంది. ∗అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో.. చురుకుగా ఉండటానికి తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరి. చల్లని ప్రదేశాలలో, ఇంటి లోపల ఈ వ్యాయామాలు చేయాలి. -
జనగామ ఎవరికీ?.. పొన్నాలను వెంటాడుతున్నదేంటి?
ఆయన ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో చక్రం తిప్పారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. పీసీసీ చీఫ్గానూ పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆ నేతకు వచ్చే ఎన్నికల్లో సీటు బాధ మొదలైంది. తన ప్రత్యర్థి సీటు తన్నుకుపోతాడనే భయం మొదలైంది. తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ కష్టాలు మొదలయ్యాయి. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్రెడ్డిని ఏఐసిసి ఇటీవలే నియమించింది. దాంతో జనగామ అసెంబ్లీ టికెట్ కూడా ఆయనే ఎగరేసుకుపోతారేమోననే అనుమానం పొన్నాలను వెంటాడుతోంది. గత ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో రాహుల్ గాంధీ అండతో టిక్కెట్ దక్కించుకున్న పొన్నాల లక్ష్మయ్య ఈసారి మాత్రం ముందుగానే అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో ఏఐసిసి పెద్దలను కలుసుకుంటూ తన గోడు వెళ్లబోసుకుంటున్నారు. మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తనకే తెలియకుండా తన జిల్లా అయిన జనగామ డీసీసీ అధ్యక్షుడిగా తన వ్యతిరేకవర్గ నాయకుడిని నియమించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా కొమ్మూరి నియామకాన్ని రద్దు చేయించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్రెడ్డి రికమండేషన్తో జనగామ డీసీసీ అధ్యక్ష పదవిని కొమ్మూరి ప్రతాప్రెడ్డి దక్కించుకున్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతాప్రెడ్డికి ఏకంగా పీసీసీ చీఫ్తో పాటు కోమటిరెడ్డి మద్దతు ఇస్తుండడంతో పొన్నాల ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. 2014, 2018 ఎన్నికలలో పొన్నాల ఓటమి పాలు కావడం, వయసు 79 సంవత్సరాల వయస్సుతో వయో భారం పెరగడం ఆయనకు ప్రతికూల అంశాలుగా మారాయి. చదవండి: తెలంగాణలో కమ్మలకు, వెలమలకు చెడిందా? అయితే 2014 ఎన్నికల్లో 52వేల ఓట్లు, 2018 ఎన్నికల్లో 62 వేల ఓట్లు పొన్నాల తెచ్చుకోగలిగారు. అదే కొమ్మూరి ప్రతాప్రెడ్డి 2014లో బీజేపీ తరపున బరిలో దిగి దాదాపు 21 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఏజ్ ఫ్యాక్టర్తో పాటు పీసీసీ చీఫ్ ఆశీస్సులు కొమ్మూరికి కలిసి వస్తుండగా.. పొన్నాల మాత్రం అధిష్టానంపైనే భారం వేశారు. కొమ్మూరి ప్రతాపరెడ్డి నియామకం రద్దు చేయించడానినికి పట్టువదలని విక్రమార్కుడిలా పొన్నాల తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరి ఈ వృద్ధ నేత ప్రయత్నం ఫలిస్తుందా ? డీసీసీ పదవి రద్దు సంగతేమో గానీ, కనీసం జనగామ టికెట్ అయినా దక్కించుకుంటారా ? అంటూ జనగామ కాంగ్రెస్లో చర్చ నడుస్తోంది. -
తెలంగాణ మొత్తం తిరగాల్సిందే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఏళ్ల తరబడి ఎదురు చూపుల తరువాత విడుదలైన నోటిఫికేషన్ల ప్రకా రం ఉద్యోగాలు సాధించేందుకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలు రాసేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 1 నుంచి 23వ తేదీ వరకు ‘తెలంగాణ రెసి డెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు’ఆధ్వర్యంలో గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, పీఎల్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్, ఫిజికల్ డైరెక్టర్.. తదితర 9 రకాల ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి హాల్టికెట్లను ఆన్లైన్లో పెట్టారు. అయితే ఇప్పటికీ పలువురు అభ్యర్థులకు కొన్ని పరీక్షల హాల్టికెట్లను వెబ్సైట్లో చూపించడం లేదు. కొన్ని డౌన్లోడ్ కావటం లేదు. కొందరికి మాత్రం కొన్ని పరీక్షల హాల్టికెట్లు డౌన్లోడ్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. హాల్టికెట్లు చూసి పలువురు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. జేఎల్, డీఎల్, టీజీటీ, పీజీటీ, పీఎల్ పరీక్షలకు పేపర్–1 (జనరల్ స్టడీస్), పేపర్–2 (మెథడాలజీ), పేపర్–3 (సబ్జెక్టు) ఉన్నాయి. పరీక్షలు రాసే విషయంలో అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలు చూస్తే కళ్లు తిరిగే పరిస్థితి ఉందని అంటున్నారు. మూడు పేపర్లకు మూడు జిల్లాలు.. మంచిర్యాలకు చెందిన నికిత అనే అభ్యర్థి టీజీటీకి దరఖాస్తు చేయగా, ఆమెకు పేపర్–1 హైదరాబాద్లో, పేపర్–2 మంచిర్యాలలో, పేపర్–3కి వరంగల్లో సెంటర్లు ఇచ్చారు. అలాగే నిజామాబాద్కు చెందిన రమాదేవి నిజామాబాద్లో పరీక్ష కేంద్రం ఆప్షన్ ఇవ్వగా, ఆమెకు పేపర్–1 రంగారెడ్డి జిల్లా, పేపర్–2 మేడ్చల్, పేపర్–3కి కరీంనగర్ జిల్లాలో సెంటర్లు ఇచ్చారు. ఖమ్మంకు చెందిన బిందుకు పేపర్–1 ఖమ్మంలో, పేపర్–2 కొత్తగూడెంలో, పేపర్–3కి సత్తుపల్లిలో సెంటర్లు ఇచ్చారు. ఈ పరీక్షలను ఆగస్టు 4, 14, 22 తేదీల్లో రాయాల్సి ఉంది. ఇక్కడే మరో పెద్ద సమస్య వచ్చిపడింది. వీళ్లు టీజీటీతోపాటు పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జేఎల్ పరీక్షలకు కూడా దరఖాస్తు చేశారు. ఈ పరీక్షల కేంద్రాలు ఏయే జిల్లాల్లో కేటాయిస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో సగం జిల్లాల్లో తిరగాల్సిన పరిస్థితి.. మొత్తం 9 విభాగాల పరీక్షల్లో కీలకమైన పీజీటీ, టీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలకు మూడు చొప్పున పేపర్లకు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలు ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్వహించడం లేదని విమర్శలు వస్తున్నాయి. టీజీటీ పరీక్షలు ఆగస్టు 4, 14, 22 తేదీల్లో ఉన్నాయి. కాగా, ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు.. ఆగస్టు 9, 10, 16, 19, 21 తేదీల్లో పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలు రాయాల్సి ఉంది. వీరికి టీజీటీ తరహాలోనే వివిధ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తే ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వందల కిలోమీటర్ల మేర ఆగస్టు నెలంతా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు ఉన్న మహిళా అభ్యర్థులు నరకయాతన పడాల్సిన పరిస్థితులు కల్పించారని మండిపడుతున్నారు. ఒక అభ్యర్థి ఇలా పోటీ పరీక్షలు రాసేందుకు వివిధ జిల్లాలు తిరగాలంటే రూ. వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న ఎన్ఆర్ఐ
ఆ నియోజకవర్గంలో చంద్రబాబుకు ఇష్టుడైన లాబీయిస్ట్కే చుక్కలు చూపిస్తున్నాడట ఓ ఎన్ఆర్ఐ. చంద్రబాబు తరపున ఢిల్లీలో లాబీయింగ్ చేసే ఆ మాజీ ఎమ్మెల్యేకే ఇప్పుడు టిక్కెట్ కష్టాలు ఎదురవుతున్నాయట. కొత్త నేతల తాకిడితో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆ నేత ఎవరో చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఏమి జరుగుతుందో ఊహించడం కష్టమే. కొత్తగా వచ్చే జూనియర్ నేతల వ్యూహాలతో తలపండిపోయిన నాయకులు కూడా ఉక్కిరిబిక్కిరవుతుంటారు. బొల్లినేని రామారావు నెల్లూరు జిల్లా ఉదయగిరికి ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాని ఢిల్లీలో చంద్రబాబు తరపున లాబీయింగ్ చేసే వ్యక్తిగానే నియోజకవర్గంలో చెప్పుకుంటారు. చంద్రబాబు దగ్గర చాలా పలుకుబడి ఉందని చెప్పుకునే బొల్లినేని రామారావును కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ తన తెలివితేటలతో చిత్తు చేస్తున్నారట. దీంతో బొల్లినేని రామారావు వేసవి ఎండలకు మించి పొగలు..సెగలు కక్కుతున్నారట. ఆయన బాధ చూసి అనుచరులు కూడా ఆందోళన చెందుతున్నారట. ఎన్నికలకు ఏడాది గడువుండగానే ఉదయగిరి టిక్కెట్ కోసం తెలుగుదేశంలో సిగపట్లు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లినేనికి సొంత గ్రామం నుంచే చిక్కులు ఎదురవుతున్నాయి. బాగా డబ్బు సంపాదించుకువచ్చిన ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ దెబ్బకు బొల్లినేని దిక్కుతోచని స్థితిలో పడ్డట్లు టాక్. బొల్లినేని రామారావుకి పార్టీ క్యాడర్లో పరపతి తగ్గిపోయింది. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి జనాల్లో తిరగక పోవడంతో క్యాడర్కు దిక్కు లేకుండా పోయింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కాకర్ల సురేష్ మూడు నెలలు నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చదవండి: అక్కడ చంద్రబాబే నిప్పు రాజేస్తున్నారా..? బొల్లినేని వర్గంతో సంబంధం లేకుండా ఆయన స్వంతంగా కార్యక్రమాలు చేస్తున్నారట. పార్టీలో సరైన నాయకుడు లేకపోవడంతో..బొల్లినేని యాంటీ వర్గం కాకర్లకు సహాయ సహకారాలు అందిస్తోందని.. ఇప్పటివరకు జనానికి దూరంగా ఉన్న బొల్లినేనికి కాకర్ల సురేష్ కార్యక్రమాలతో చెమటలు పడుతున్నాయనీ ఉదయగిరిలో టాక్ వినిపిస్తుంది.. ఎన్ఆర్ఐ కావడం.. కొద్దో గొప్పో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటంతో టీడీపీ నాయకత్వం కూడా సురేష్కే మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ గమనించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావ్.. పార్టీలో పూర్వ వైభవం కోసం అగచాట్లు పడుతున్నారట. మొన్నటికి మొన్న వింజమూరులో కాకర్ల సురేష్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నాలు ప్రారంభించగా.. అతని కంటే ముందే బొల్లినేని ఆ ప్లాన్ను అమలు చేసి తన ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి లాబీయుస్టాగా ముద్రపడ్డ బొల్లినేనికి ఉదయగిరిలో ఓ జూనియర్ ఎన్ఆర్ఐ టిక్కెట్ విషయంలో గట్టి పోటీ ఇస్తున్నారు. చదవండి: పవన్ అంటే ఆటలో అరటి పండే..! -
‘బాధ్యత తెలియదని అలా మాట్లాడాను.. ఇలా చేస్తారని ఊహించలేదు’
తిరువళ్లూరు(తమిళనాడు): పనికి వెళ్లడం లేదని బంధువుల ముందు మామ మందలించడం.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో అవమాన భారంగా భావించిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కాంచీపురం జిల్లా వాలాజాబాద్ సమీపంలోని అయ్యంపేటకు చెందిన కలైఅరసన్ (37) క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ తిరుమేణి పంచాయతీ వసినంపట్టు గ్రామానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె నిత్య(30)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు హేమనాథ్ (06) ఉన్నాడు. క్యాటరింగ్ పనుల ద్వారా కలైఅరసన్కు సరైన ఆదాయం రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో భార్య కుమారుడితో కలిసి మూడు నెలల క్రితం అత్తారింటికి వచ్చాడు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్నాడు. రెండు రోజుల క్రితం నిత్య తండ్రి లోకనాథన్ తన బంధువుల ముందు అల్లుడిని పనులకు వెళ్లాలని మందలించాడు. అప్పటి నుంచి కలైఅరసన్ మనస్తాపంతో ఉన్నాడు. దీనికి తోడు అప్పులు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పురుగుల మందును మొదట కుమారుడికి ఇచ్చారు. అనంతరం నిత్య, కలైఅరసన్ సైతం పురుగుల మందును తాగి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి మప్పేడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శక్తివేల్ మృతదేహాలను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఖాళీగా ఉంటే బాధ్యత తెలియదని అలా మాట్లాడానని.. ఇంత పనిచేస్తారని ఊహించలేదని మామ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: ‘నా లక్ష్మిని లోకంలో లేకుండా చేశాను’.. వీడియో రికార్డు చేసి.. చివరికి బిగ్ ట్విస్ట్ -
మంచి మాట: ఉన్నంతవరకూ ఉన్నతంగానే...
కష్టానికి కష్టం వస్తేనూ, నష్టం నష్టపోతేనూ బావుణ్ణు; మనిషి కష్టం లేకుండానూ, నష్టపోకుండానూ బావుంటాడు’ ఇలా అనుకోవడం బావుంటుంది. కానీ వాస్తవంలో ప్రతిమనిషికీ జీవితంలో, జీవనంలో కష్టాలు, నష్టాలు కలుగుతూనే ఉన్నాయి, కలుగుతూనే ఉంటాయి. మనిషినే కాదు ప్రపంచాన్ని కూడా కష్టాలు, నష్టాలు కుదిపేస్తూనే ఉన్నాయి, కుదిపేస్తూనే ఉంటాయి. జీవనంలో కలుగుతూ ఉండే కష్టాలు, నష్టాలవల్ల నిస్తేజమూ, కలవరమూ, గందరగోళమూ ఎవరికైనా తప్పవు. జీవితం అన్నాక కష్టం, నష్టం ఒకటి తరువాత ఒకటిగా, ఒకదానిపై ఒకటిగా వస్తూనే ఉంటాయి. వచ్చిన కష్టం ఏదైనప్పటికీ, కలిగిన నష్టం ఎంతదైనప్పటికీ మనిషి వాటిని తట్టుకోగలగాలి. కష్టాలకు, నష్టాలకు లొంగిపోకూడదు, కుంగిపోకూడదు. మనిషి లొంగిపోయాడు, కుంగిపోయాడు కదా అని కష్టాలు,నష్టాలు మనిషిని వదిలెయ్యవు. లొంగిపోయిన, కుంగిపోయిన మనిషి కష్టాలు, నష్టాలు ఉద్ధృతం అవుతాయి. మనిషి తన మనసుతో, మెదడుతో కష్టాలను, నష్టాలను నిలువరించి అధిగమించాలి. చచ్చినట్టు బతకడం నుంచి నచ్చినట్టు బతకడంలోకి వెళ్లేందుకు మనిషి ప్రయత్నించాలి. అందువల్ల కష్టాలు, నష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మనిషి తనను తాను తయారుచేసుకోగలుగుతాడు. తాను చచ్చేలోపు ఉచ్ఛ స్థితికి చేరుకోవాలన్న ఆలోచన చెయ్యాలి. ఆ స్థితిని సుసాధ్యం చేసుకోవడం మనిషి నేర్చుకోవాలి. అందువల్ల కష్టాలు, నష్టాలు తనను నిస్తేజంలోకి నెట్టెయ్యకుండా మనిషి నిలదొక్కుకోగలడు. మనుషులమై పుట్టామని గుర్తుంచుకుందాం; ఏ కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా చేవను ఊతంగా చేసుకుందాం. జరిగిపోయిన వాటి గురించీ, కలిగిన కష్టాలు, నష్టాల గురించీ చింతిస్తూ ఉండిపోవడం పిరికితనం. మనం పిరికితనానికి బలి కాకూడదు. పిరికితనం నుంచి మనం ధైర్యంతో బయటపడాలి. కష్టం, నష్టం నుంచి విముక్తం అవడానికి మనకు ధైర్యం కావాలి. మనం ధైర్యంతో కదలాలి. ‘ఉన్నంతవరకూ ఉన్నతంగానే ఉందాం, అనే చింతన వస్తే ఏ కష్టం లోనైనా, ఎంత నష్టంలోనైనా మనకు చైతన్యం వస్తుంది. ఆ చైతన్యమే కష్టాలు, నష్టాల నుంచి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టం కలిగినప్పుడూ, నష్టం కలిగినప్పుడూ మనిషికి నిస్పృహ వచ్చేస్తుంది. ఇక్కడే మనిషి జాగ్రత్తగా ఉండాలి. నిస్పృహ అనే మత్తుకు మనిషి అలవాటు పడకూడదు. ఆవరించిన నిరాశను అంతం చేసుకోవాలి. అటుపైన మతిలో సదాశ పుట్టాలి. మనిషి ఆశపడాలి. కష్టాలు, నష్టాలు కలిగాక వాటికి అతీతం అవ్వాలనే ఆశ కావాలి. సుఖపడాలని మనిషి ఆశపడాలి. బాగా బతకడానికి అవకాశాలు ఎప్పటికీ బతికే ఉంటాయి. ఆ విషయాన్ని మనం సరిగ్గా పసికట్టాలి. దెబ్బతిన్న తరువాత బాగు పడాలనుకోవడం దోషం కాదు. దెబ్బతిన్న తరువాతైనా, దెబ్బ తిన్నందుకైనా మనిషి బాగుపడి తీరాలి. మళ్లీ పుడతామో లేదో మనకు తెలియదు; మరణించాక మనకు పని ఉండదు; బాగా బతకాలని గట్టిపట్టుపడదాం. కష్టం, నష్టంవల్ల మనల్ని మనం కోల్పోకూడదు. జీవనం జారిపోతే జీవితం పండదు. మనిషికి ఆశ కావాలి. మనిషి తన బతుకును తాను ఆస్వాదించడం నేర్చుకోవాలి. బతుకును ఆస్వాదించడం తెలిస్తే కష్టాలనూ, నష్టాలనూ ఓడించడం తెలుస్తుంది. కష్టనష్టాలపై గెలుపు మనిషికి పొలుపు. మనకు గతాన్నీ, వర్తమానాన్నీ ఇచ్చిన కాలం భవిష్యత్తునూ ఇస్తుంది. కష్టానికీ, నష్టానికీ మనం పతనం అయిపోవడం కాదు, కలిగిన కష్టాన్నీ, నష్టాన్నీ పతనం చెయ్యడానికి మనం ఉపక్రమించాలి. ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఊపిరిలోకి తీసుకుని ఉద్యుక్తులమై మనం ఉన్నతమైన ప్రగతిని సాధించాలి. ఏ చీకటైనా తొలగిపోవాల్సిందే. ఎంతటి తుఫానైనా ఆగిపోవాల్సిందే. చీకటి మూగినప్పుడు సంయమనంతో ఉంటే ఉదయాన్ని చూడగలం. తుఫాను ముంచుకొచ్చినప్పుడు అప్రమత్తంగా ఉంటే ప్రశాంత వాతావరణంలోకి వెళ్లగలం. భూకంపం వచ్చాక కూడా అభివృద్ధి జరుగుతుందని, జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. కష్టాలు, నష్టాలు దెబ్బలలా, దెబ్బలమీద దెబ్బలలా తగులుతున్నప్పుడు జీవితం పగిలిపోలేదని గ్రహించాలి. మనం ఉన్నందుకు, మనకు ఉనికి ఉన్నందుకు మనకు పటుత్వం ఉండాలి. కష్టాలు, నష్టాలు కలిగినా నేడు అనే వేదికపైన మనం నిలదొక్కుకుని ఉండగలిగితే రేపు వస్తుంది. ఆ రేపు మనల్ని కష్టాలు, నష్టాలు వీడిపోయిన ఎల్లుండిలోకి తీసుకెళుతుంది. – రోచిష్మాన్ -
Zerodha ceo Nithin Kamath: ముందు చూపుతోనే.. హాయిగా ‘విశ్రాంతి’!
‘‘వాతావరణంలో మార్పులు మానవాళిని అంతం చేయకపోతే.. ఇప్పటి నుంచి వచ్చే 25 ఏళ్లలో చాలా దేశాలకు రిటైర్మెంట్ సంక్షోభం పెద్ద సమస్యగా మారుతుంది. గత తరాలకు దీర్ఘకాలం పాటు రియల్ ఎస్టేట్, ఈక్విటీ బుల్ మార్కెట్లు రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవడానికి సాయపడ్డాయి. కానీ, భవిష్యత్తులో ఇలా ఉండకపోవచ్చు’’. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జీరోధా వ్యవస్థాపకుల్లో ఒకరైన నితిన్ కామత్ నేటి యువతరాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి. సాంకేతిక పురోగతితో పదవీ విరమణ కాలం తగ్గిపోతుంటే, వైద్య రంగంలో పురోగతితో జీవించే కాలం పెరుగుతుందని అంచనా వేశారు. వచ్చే 20 ఏళ్లకు పదవీ విరమణ వయసు 50కు తగ్గి.. 80 ఏళ్ల వరకు జీవిస్తామని.. రిటైర్మెంట్ తర్వాత కూడా 30 ఏళ్ల పాటు జీవించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. జీవితంలో పదవీ విరమణ తర్వాత దశను సరైన ప్రణాళికతోనే సుఖవంతం చేసుకోగలరంటూ కామత్ ఇచ్చిన సూచనలు ప్రతి ఒక్కరికీ మేల్కొలుపు. వయసు సహకరించి పనిచేస్తున్న దశలోనే.. పనిచేయని దశ కోసం ప్రణాళిక వేసుకోకపోతే వృద్ధాప్యంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తమ పిల్లలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాము పిల్లలకు భారం కాకూడదనే ఎవరైనా కోరుకుంటారు. అలా కోరుకునే వారు ఆ దిశగా ముందు నుంచే అడుగులు వేసుకుంటూ వెళ్లాలి. మరి రిటైర్మెంట్ తర్వాత జీవితానికి ఎంత కావాలి? అందుకు ఎంత పెట్టుబడులు పెట్టాలి..? ఈ అంశాలపై అవగాహన కల్పించే కథనం ఇది. అవసరాల్లో రాజీ పడలేం మనలో ఒక్కొక్కరు ఒక్కో జీవిత దశలో ఉండొచ్చు. కొందరు ఇప్పుడే ఉద్యోగం ఆరంభిస్తే, మరికొందరు ఇప్పటికే కొన్నేళ్ల ఉద్యోగ కాలాన్ని పూర్తి చేసుకుని ఉండొచ్చు. సంపాదించే వయసులో మన అవసరాలు ఏదో రకంగా తీరిపోతుంటాయి. ఒక విధమైన జీవనశైలికి అలవాటు పడి ఉంటాం. కోరుకున్న మాదిరి జీవితాన్ని కొనసాగిస్తాం. రిటైర్మెంట్ తర్వాత కూడా ఇదే మాదిరి జీవితాన్ని సాఫీగా కొనసాగించడమే అసలైన సవాలు. ఇందుకోసం ఇప్పుడు నెలవారీ జీవనానికి ఎంత అయితే ఖర్చు చేస్తున్నామో.. పదవీ విరమరణ అనంతరం కూడా ప్రతి నెలా అంతే మొత్తం ఖర్చు చేసేందుకు సరిపడా పొదుపు చేసుకోవాలి. ముందుగా మొదలు పెడితే ఈజీ 25 ఏళ్లకు కెరీర్ మొదలు పెట్టారని అనుకుంటే, 55–60 ఏళ్లకు రిటైర్ అవుతారని అనుకుంటే ఇన్వెస్ట్ చేయడానికి 30–35 ఏళ్ల కాలం మిగిలి ఉంటుంది. కనుక నెలకు రూ.10వేల చొప్పున, ఏటేటా దీనిపై 10 శాతం చొప్పున పెట్టుబడిని పెంచుతూ వెళితే 30 ఏళ్లకే రూ.6.91 కోట్లు (ఏటా 11 శాతం కాంపౌండెడ్ వృద్ధి అంచనా ప్రకారం) సమకూరుతుంది. అందుకే విశ్రాంత జీవన నిధి కోసం పెట్టుబడికి కెరీర్ ఆరంభంలోనే శ్రీకారం చుట్టాలి. దానివల్ల ఓ పెద్ద లక్ష్యం తేలిక అవుతుంది. 25 ఏళ్లలో రూ.7 కోట్లు సమకూరేందుకు ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి (ఏటాటా 10 శాతం పెంచుతూ) ఉంటే, 30 ఏళ్ల సమయం ఉన్న వారు ఇందులో సగం రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా 35 ఏళ్ల వ్యవధి ఉంటే ఇంకా తక్కువే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందుకే ఈ కాంపౌండింగ్ మహిమను ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే. నిపుణుల సాయం అవసరమే రిటైర్మెంట్ అవసరాలన్నవి ప్రత్యేకమైనవి. ఇక్కడి నుంచి మరో 25–35 ఏళ్ల తర్వాతి జీవనం కోసం నిధిని సమకూర్చుకోవాలి. అలా ఏర్పడే నిధి అక్కడి నుంచి మరో 20–30 ఏళ్ల పాటు మన జీవితానికి ఆధారంగా నిలబడాలి. కనుక ప్రతి నెలా ఆర్జన ఎంత? పదవీ విరమణకు ఉన్న కాలం ఎంత? ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? పెట్టుబడుల పరంగా రిస్క్ తీసుకోగలరా? ఆశిస్తున్న రాబడులు ఏ మేరకు? ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటి తర్వాత ప్రతి నెలా ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలో అంచనాకు రావాలి. ఆశిస్తున్న రాబడులకు తగిన సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే, అందులోనూ ఎన్నో విభాగాలున్నాయి. వాటిల్లో రాబడులు, రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. పైగా రిటైర్మెంట్ ఒక్కటే కాదు, జీవిత బీమా, ఆరోగ్య బీమా కూడా కీలకమే. అందుకే కెరీర్ ఆరంభించిన వారు పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు, లేదా ఫైనాన్షియల్ ప్లానర్ సాయంతో పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతైనా అవసరం ఎంత కావాలి? ఇప్పుడు ప్రతి నెలా కుటుంబ అవసరాల కోసం నికరంగా రూ.50,000 ఖర్చు అవుతుందని అనుకుందాం. ఇప్పటి నుంచి పదవీ విరమణకు మరో 25 ఏళ్ల కాలం మిగిలి ఉంది. రిటైర్మెంట్ తర్వాత కనీసం 20 ఏళ్ల పాటు జీవించి ఉంటామని అంచనా వేసుకునేట్టు అయితే.. ఆ 20 ఏళ్ల కాలానికి కూడా ప్రతి నెలా రూ.50,000 కావాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.6 లక్షలు అవసరపడతాయి. రిటైర్మెంట్ విషయంలో కొందరికి భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. కొందరు ఇప్పటికంటే వృద్ధాప్యంలో ఇంకా మెరుగ్గా జీవించాలని కోరుకోవచ్చు. అటువంటి వారి విషయంలో ఈ అంచనాలు మారిపోతాయి. కనుక అందరికీ అర్థమయ్యేందుకే దీన్ని ఓ ప్రామాణిక ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. విశ్రాంత జీవితానికి సంబంధించి ప్రణాళికలో ముందు రెండు అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. 1. ఇప్పటి నెలవారీ అవపసరాల ఆధారంగా రిటైర్మెంట్ నాటికి ఎంత నిధి సమకూర్చుకోవాలి. ఇప్పుడు నెలకు రూ.50,000 ఖర్చు అవుతోంది. అంటే ఏడాదికి రూ.6 లక్షలు. పదవీ విరమణ తర్వాత కూడా ఏటా రూ.6 లక్షలు ఆదాయాన్ని ఇచ్చేంత నిధిని సమకూర్చుకోవాలి. 2. ఇంత మేర నిధి పోగు చేసుకునేందుకు ఇప్పటి నుంచి ప్రతి నెలా ఎంత మేర ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలన్నది మరో ముఖ్యమైన విషయం. ∙ రిటైర్మెంట్ తర్వాత 20 ఏళ్ల పాటు జీవించి ఉంటామనే అంచనా ప్రకారం.. ఏటా రూ.6 లక్షల చొప్పున 20 ఏళ్ల కోసం మొత్తం రూ.1.2 కోట్లు కావాల్సి ఉంటుంది. 2047 నాటికి ఈ మేరకు నిధి మనకు కావాలి. కానీ, రూ.50,000 అన్నది నేటి కరెన్సీ విలువ ప్రకారం జీవనానికి అవుతున్న వ్యయం. ద్రవ్యోల్బణం ప్రభావంతో ఏటేటా కరెన్సీ విలువ తగ్గుతూ, జీవన వ్యయం పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ నిధికి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా జోడించాలి. దీర్ఘకాలంలో సగటున 5 శాతం వార్షిక ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేసుకుంటే.. 20 ఏళ్ల తర్వాత రూ.6 లక్షలు ఏమూలకూ సరిపోవు. ఇప్పటి నుంచి 25 ఏళ్ల పాటు రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకుంటాం కనుక అన్నేళ్ల కాలానికి ఏటా 5 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కలిపి చూస్తే.. ఇప్పుడు ఏడాది జీవనానికి రూ.6 లక్షలు అవుతుంటే, 2047లో ఇది రూ.2,031,813 అవుతుంది. అంటే అప్పుడు ఒక ఏడాది జీవనానికి రూ.20.31 లక్షలు కావాలి. అంతేకాదు, అప్పటి నుంచి ఏటేటా ఇది మరో 5 శాతం (ద్రవ్యోల్బణం మేర) పెరుగుతుందని భావించొచ్చు. ఈ ప్రకారం 2048లో రూ.21.33 లక్షలు కావాలి. 2067వ సంవత్సరంలో జీవన వ్యయం రూ.రూ.53.91 లక్షలుగా ఉంటుంది. ఇక 2047 నుంచి 2067 సంవత్సరం వరకు, 20 ఏళ్ల కాలానికి జీవన వ్యయం కోసం (5 శాతం ద్రవ్యోల్బణం కలిపి) మొత్తం రూ.7.25 కోట్లు కావాల్సి వస్తుంది. అంటే మన చేతిలో సంపాదన కోసం మిగిలిన ఈ 25 ఏళ్లలో.. విశ్రాంత జీవనం కోసం రూ7.25 కోట్ల నిధిని సమకూర్చుకోవాలన్నది అంచనా. నిధిని ఎలా సమకూర్చుకోవాలి? రిటైర్మెంట్ తర్వాత 20 ఏళ్ల జీవిత అవసరాలకు కావాల్సిన రూ.7.25 కోట్లు సమకూర్చుకోవడం ఎలా..? ఇందుకోసం ఈ రోజు నుంచే పెట్టుబడులు ఆరంభించాలి. ఒకటికి మించిన సాధనాలను ఇందుకోసం ఎంపిక చేసుకోవచ్చు. 50 శాతం రియల్ ఎస్టేట్పై, 10 శాతం ఫిక్స్డ్ డిపాజిట్లలో, బంగారంలో 10 శాతం, ఈక్విటీల్లో 15 శాతం చొప్పున పెట్టుబడులు పెడుతూ, 15 శాతం నగదుగా ఉంచుకునేట్టు (ఇది అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల పోర్ట్ఫోలియో విధానం) అయితే.. రాబడి ఏ మేరకు వస్తుందో చూద్దాం. రియల్ ఎస్టేట్పై దీర్ఘకాలంలో 8–10 శాతం, ఎఫ్డీలపై 6–7 శాతం, బంగారంపై 8–9 శాతం, ఈక్విటీల్లో 10–11 శాతం వస్తుందని అనుకుంటే.. అప్పుడు మొత్తం మీద అన్ని రకాల పెట్టుబడులపై సగటున 8.25 శాతం వార్షిక రాబడి వస్తుంది. ఇది కొంత రక్షణాత్మకంగా వేసిన అంచనాయే. ఈక్విటీల్లో 10 ఏళ్లకు మించిన కాలంలో రిస్క్ దాదాపు ఉండదు. సగటు రాబడి ఎంత లేదన్నా వార్షికంగా 11 శాతం చొప్పున వస్తుంది. కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో రిటైర్మెంట్ కార్పస్ను సమకూర్చుకోవడం రిటైల్ ఇన్వెస్టర్లకు అన్నింటిలోకి మెరుగైన మార్గం అవుతుంది. నెలవారీగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏటేటా పెరిగే ఆదాయానికి అనుగుణంగా ఈ పెట్టుబడి మొత్తాన్ని 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు మొదటి నెల రూ.5,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే.. ఏటా 11 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి ప్రకారం 25 ఏళ్ల తర్వాత (300 నెలలకు) ఈ మొత్తం రూ.67,927 అవుతుంది. రెండో ఏడాది 10 శాతం అధికంగా రూ.5,500, మూడో ఏట రూ.6,050 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. ఇలా అయితే 25 ఏళ్లకు సమకూరే నిధి రూ.1.7 కోట్లుగా ఉంటుంది. కానీ, మనం చెప్పుకున్న ఉదాహరణ ఆధారంగా రిటైర్మెంట్ కోసం రూ.7.25 కోట్లు కావాలి. అందుకుని ప్రతి నెలా రూ.5 వేలకు బదులు.. రూ.20 వేల చొప్పున ఆరంభించి, ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. దీంతో 25 ఏళ్లకు రూ.7 కోట్ల నిధి ఏర్పడుతుంది. అంచనా మాత్రమే.. పదవీ విరమణ తర్వాత వృద్ధాప్యంలో మన జీవన అవసరాలు ఇప్పటి మాదిరిగా ఉండవు. కొంత మారొచ్చు. ఖరీదైన డెనిమ్ వస్త్రాలు అవసరపడకపోవచ్చు. వినోదం, విహారం కోసం ఖర్చు పెరగొచ్చు. ఎందుకంటే అప్పుడు చేతిలో తగినంత ఖాళీ సమయం ఉంటుంది. అందుకుని అప్పటి అవసరాలు ఎలా ఉంటాయని ఇప్పుడే అంచనాకు రాలేం. ఆరోగ్య సమస్యల కారణంగా తరచూ వైద్యం అవసరపడొచ్చు. అందుకే ఇప్పుడు నెలవారీ అవుతున్న వ్యయాన్ని ఓ ప్రామాణికంగా తీసుకున్నాం అంతే. రిటైర్మెంట్ తర్వాత ఫలానా విధంగా జీవితాన్ని కొనసాగించాలనే కచ్చితమైన స్పష్టత, ప్రణాళిక ఉన్న వారు ఆ మేరకు అంచనాకు వచ్చి నిధిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.+ టిప్స్ ► చాలా ముందుగానే పెట్టుబడులు ఆరంభించాలి. ► పెట్టుబడి సాధనాల మధ్య వైవిధ్యం ఉండాలి. ► అన్నింటిలోకీ ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయి. ► అవసరం లేనివి, విలువ తరిగిపోయే వాటిని రుణాలపై కొనుగోలు చేయవద్దు. ► ఆర్జించే వ్యక్తి తనతోపాటు, కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ రక్షణనిచ్చే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. లేకపోతే ఒక ఆరోగ్య సమస్య కారణంగా ఆర్థిక జీవితం తలకిందులు అయిపోవచ్చు. ► ఉద్యోగం శాశ్వతం కాదు. కనుక పనిచేసే చోట ఆరోగ్య బీమా రక్షణ ఉన్నా కానీ, విడిగా ఆరోగ్య బీమా ప్లాన్ కూడా ఉండాలి. ► టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం. అనుకోనిది జరిగితే వచ్చే బీమా పరిహారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే, నెలవారీ కుటుంబ అవసరాలను తీర్చేంత సరిపడా ఆదాయం ఆ నిధి నుంచి రావాలి. – నితిన్ కామత్, జీరోధా సీఈవో -
కుమ్మరి వృత్తి.. దక్కని తృప్తి.. సాంప్రదాయాన్ని వదులుకోలేక..
తాళ్లపూడి(తూర్పుగోదావరి): దీపావళి వస్తుందంటే చాలు కుమ్మర్లకు చేతి నిండా పని, వీధులన్నీ మట్టి ప్రమిదలతో కళకళలాడుతూ ఉంటాయి. ప్రమిదలు, చిచ్చు బుడ్లు తదితర తయారీలో వారంతా నిమగ్నమై ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ కుమ్మర్లకు ఆదరణ తగ్గింది. సీజన్లో తప్ప మిగతా రోజుల్లో పని లేక ఇబ్బంది పడుతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులు, ప్రజల అభిరుచులు మారడంతో మట్టి పాత్రల వినియోగం తగ్గడంతో కుమ్మర్లకు పని లేకుండాపోతోంది. ఆర్థికంగా అవస్థలు తప్పడంలేదు. దీంతో వారు వలసపోతున్నారు. తాతల కాలం నుంచి వస్తున్న కులవృత్తిని, సాంప్రదాయాన్ని వదులుకోలేక పలువురు ఈ పనులే చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చదవండి: వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు ఈ వృత్తినే నమ్ముకొని.. ఆధునిక కాలంలో మట్టి పాత్రలకు బదులు స్టీల్, రాగి, కంచు, సీవండి, ప్లాస్టిక్ తదితర వాటిని వినియోగిస్తున్నారు. దీంతో కుమ్మరులు ఉపాధిని కోల్పోతున్నారు. కొవ్వూరు నియోజక వర్గంలో సుమారు 4 వేల మంది వరకూ కుమ్మర్లు ఉండేవారు. ప్రస్తుతం 400 మంది ఉన్నారు. తాళ్లపూడి మండలంలో సుమారు 150 నుంచి 200 కుటుంబాలు వరకూ ఉండేవి. ప్రస్తుతం కేవలం 25 కుటంబాలు వారు మాత్రమే కుమ్మర వృత్తిని కొనసాగిస్తున్నారు. వేగేశ్వరపురంలో 13 కుంటుబాలు, తాళ్లపూడిలో నాలుగు కుటుంబాలు ఈ వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి తగిన ప్రొత్సాహం మాత్రం లభించడం లేదు. పెద్దేవం, అన్నదేవరపేట, తిరుగుడుమెట్ట, రాగోలపల్లి తదితర గ్రామాల్లో కుమ్మర్లు ఉన్నారు. వారు పురాతన శాలలపై ఆధారపడకుండా ఇటీవల కరెంట్ శాలలు రూ.20 వేలు పెట్టి సొంతంగా కొనుక్కున్నారు. వాటిపై కేవలం ప్రమిదలు, చిచ్చుబుడ్లు మాత్రమే తయారు చేయడం జరుగుతుంది. పెరిగిన ముడిసరుకుల ధరలు మట్టి వస్తువులు తయారీలో ఉపయోగించే ముడి సరుకుల ధరలు పెరిగాయి. ఆవ శాలలో కాల్చడానికి మట్టి, ఊక, వంట చెరకు ధరలు గతంలో కంటే రెట్టింపయ్యాయి. ఖర్చులు పోగా వచ్చే లాభం సరిపోవడంలేదని కుమ్మర్లు వాపోతున్నారు. వేసవిలో కుండలు చేయడం ద్వారా ఇతల మట్టి పాత్రలు కుడా తయారు చేస్తున్నారు. ఈ దీపావళికి వివిధ ఆకృత్తుల్లో ఆకర్షణీయంగా ప్రమిదలు తయారు చేస్తున్నారు. 1000 ప్రమితలు రూ.850 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. 100 చిచ్చుబుడ్లు రూ.500 నుంచి రూ.600 వరకూ కొనుగోలు చేస్తున్నారు. అది కూడా కొందరు వ్యక్తులు ముందుగా కాంట్రాక్ట్ కుదుర్చుకుని చేయించుకుంటున్నారు. ఏటా దీపావళి సీజన్ నుంచి కార్తిక మాసం సీజన్లో మాత్రమే కొంత ఉపాధి దొరుకుందని కుమ్మర్లు వాపోతున్నారు. కుమ్మరిని ప్రోత్సహించాలి ఇటీవల కురిసిన వర్షాలకు దీపావళి సీజన్లో పని చేయడానికి అవకాశం లేదు. కుమ్మరి వృత్తిని ప్రోత్సాహించాలి. నేను రూ.20 వేలు పెట్టి కరెంట్ శాల కొన్నాను. మార్కెట్లో ముడిసరుకుల ధరలు పెరిగిపోయాయి. దీనివల్ల లాభాలు రావడంలేదు. కుటుంబం అంతా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం రుణాలు ఇవ్వలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాయం చేయండి. – శ్రీకాకోళపు పద్మ, వేగేశ్వరపురం దీపావళి సీజన్లోనే పని మారుతున్న రోజుల్లో కుమ్మరి వృత్తికి ఆదరణ కరువైంది. దీపావళి సీజన్లో మాత్రమే పని ఉంటోంది. మిగతా రోజుల్లో ఉండదు. ఆర్థికంగా నిలదొక్కుకోలేక కుమ్మర వృత్తిని చేయడానికి ముందుకు రావడంలేదు. దీంతో ఇతర పనులకు వెళ్లక తప్పడం లేదు. ప్రభుత్వం కరెంట్ శాలలు, ఇతర పనిముట్లపై సబ్సిడీ ఇవ్వాలి. మమ్మల్ని ఆదుకోవాలి. – శ్రీకాకొళపు వెంకటేశ్వరరావు, వేగేశ్వరపురం -
కష్టాలు చుట్టుముట్టినా.. చెదరని బాలుడి సంకల్పం.. చెల్లిని భుజాన ఎత్తుకొని!
సాక్షి, మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఏ పిల్లలైనా ఆడిపాడడం తప్పా మరో లోకం తెలీదు. కానీ, చిన్నతనంలోనే తన కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తన కష్టంగా బావించి బాధ్యతలను తన భుజంపై మోస్తూ.. చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ.. చదువు కోసం పోరాటం చేస్తున్న 11ఏళ్ల బాలుడే వినయ్. ఏ చీకూచింతా లేని ఆ బాలుడి కుటుంబంలో భవన కూలీగా పనిచేసే తండ్రి ప్రమాదవశాత్తు పైఅంతస్తు నుంచి కింద పడి నడుము విరిగిపోవడంతో కష్టాలు చుట్టుముట్టాయి. తండ్రికి తల్లిలా మారి.. బాలుడి తండ్రి మల్లయ్య భవన నిర్మాణ కూలీగా పనిచేసేవాడు. అయితే, పని చేసే చోట ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడడంతో మల్లయ్య వెన్నుముక విరిగిపోయింది. నాటి నుంచి మంచంపై నుండి కదల్లేని పరిస్థితి. దీంతో ఇళ్లు గడిచేందుకు ఆదాయం లేకపోవడంతో తల్లి లక్ష్మీ చేసే కష్టం మాత్రమే వీరికి ప్రధాన ఆదాయమైంది. తల్లి ఉదయం కూలి పనికి వెళ్తే తండ్రిని, ఏడాదిన్నర వయస్సున చెల్లిని ఇంటి వద్దే ఉండి చూసుకునే బాధ్యత వినయ్ మీదనే పడింది. ఈ విషయాన్ని కొద్దిగా ఆలస్యంగా ఉపాధ్యాయులు గుర్తించారు. అనారోగ్యంతో ఉన్న తండ్రి అన్నం తినలేని పరిస్థితి, చిన్న వయస్సు ఉన్న చెల్లి అన్నం తినలేని పరిస్థితి. వారి ఇద్దరికి వినయ్ క్రమం తప్పకుండా అన్నం తినిపించి, సాయంత్రం తల్లివచ్చే వరకు వారి ఆలనా పాలన చూసుకునే వాడు. ఇన్ని ఇబ్బందులు ఉన్న కానీ చదువుకోవాలని ఉత్సాహం ఉన్న వినయ్ వీరిద్దరినీ చూసుకుటూ చదువుపై ఉన్న మక్కువతో బడికి వస్తున్నాడని గ్రహించారు. దీంతో తన చెల్లిని తనతో పాటు స్కూల్కు తీసుకువచ్చేందుకు ఉపాధ్యాయులు అనుమతించారు. అంతేగాక తండ్రి ఇబ్బందులు తీర్చేందుకు వినయ్ పాఠశాల మధ్యలో వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. ఆదుకునేవారు లేక.. అప్పులు చేసి వైద్యం తండ్రి మలయ్యకు ప్రమాదం జరిగిన తర్వాత కార్మిక శాఖ నుంచి కానీ, ప్రభుత్వం నుండి సహాయం అందలేదు. ప్రమాదం జరిగిన ఇంటి యజమాని కొంత డబ్బుమాత్రమే ఇచ్చారు. దీంతో వైద్యానికి కొంత మేర డబ్బు సరిపోయిన మిగిలిన డబ్బును అప్పు రూపంలో సమకూర్చారు. దీంతో కుటుంబం అప్పుల పాలైంది. ఇప్పటికి గాయాలు మానకపోవడంతో వారానికి ఓ సారి రూ.2వేల వరకు ఖర్చు చేసి వైద్యం చేయించుకునే పరిస్థితి. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ పింఛన్ కోసం దరఖాస్తులు చేశారు. ఇప్పటికి పింఛన్ రాలేదు. ఇళ్లు గడవలేని పరిస్థితి ఇబ్బందులు, భార్యా పిల్లలను పోషించేందుకు మల్లయ్య దిక్కుతోచక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీ జాగాను అమ్మేశారు. తన కన్న కొడుకును అందరికంటే బాగా ప్రైవేటు పాఠశాలల్లో చదివించాలన్న తన కోరిక నెరవేరకపోగా, పిల్లలు తనమూలంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయాడు. తల్లీ లక్ష్మీ, కొడుకు నవీన్ చెల్లిని భుజాన ఎత్తుకొని స్కూలుకి.. మహబూబ్నగర్ రూరల్ మండలం మణికొండ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు వినయ్. మల్లయ్య, లక్ష్మి దంపతులకు వినయ్తోపాటు ఏడాదిన్నర కూతురు ఉంది. అయితే, మొదటి నుంచి బాలుడికి చదువుకోవాలని ఉత్సాహం ఎక్కువ. పాఠశాలకు విద్యార్థులందరూ ఒక్కరే వెళ్తే వినయ్ మాత్రం తనతో పాటు తన ఒకటిన్నర సంవత్సరాల వయస్సు ఉన్న తన చెల్లి గౌతమిని కూడా తనతో పాటు తరగతి గదిలోకి తీసుకెళ్లే వారు. మధ్యాహ్న భోజనం తనకు పెట్టిన భోజనంలో చెల్లికి కూడా తినిపించే వాడు వినయ్. ఈ విషయంపై పాఠశాల ఉపాధ్యాయులు ఓ సారి మందలించారు. అంత చిన్న వయస్సు ఉన్న పాపను పాఠశాలకు తీసుకురావద్దని వాదించారు. కానీ వినయ్ నుంచి ఎటువంటి సమాధానం వచ్చేది కాదు. చివరకు విషయం ఏంటని తెలుసుకునే ఆరా తీసిన ఉపాధ్యాయులకు గుండె తరుక్కు పోయే విషయాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది. బడి మానిపిస్తారేమోనని.. అమ్మ కూలి పనికి వెళ్లడంతో ఇంటి వద్ద నాన్నకు ఏవైనా ఇబ్బందులు వచ్చినా నేనే చూసుకోవాలి. చెల్లి చిన్నది కావడంతో ఆమెను పాఠశాలకు తీసుకెళ్లి అన్నం పెట్టాలి. ఏవైనా ఇబ్బందులు వస్తే చూసుకోవాలి. కొన్ని రోజులు ఇంటి వద్దే ఉన్నా. దీంతో బడి పూర్తిగా మానిపిస్తారేమో అనుకుని, బడికి వెళ్తూ చెల్లిని, నాన్నను చూసుకుంటున్నారు. – వినయ్, విద్యార్థి సహాయం చేసి ఆదుకోండి వెన్నెన్నుముక విరిగాక రెండు కాళ్లు పనిచేయడం లేదు. వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేశాం. అయినా ఇప్పటికి గాయాలు మానలేదు. సమస్య తీరలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా. దీంతో కూలిపనికి వెళ్లి ఒక్కదాన్నే కుటుబాన్ని పోషిస్తున్నా. పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దమనసుతో ప్రభుత్వం, సంస్థలు, వ్యక్తులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాం. – లక్ష్మీ, వినయ్ తల్లి -
కుల ‘పెద్ద’ల కుటిలం.. అంత్యక్రియలకు కూడా ఆంక్షలు.. మాట వినలేదని
జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో కులపెద్దల కట్టుబాటుతో ఓ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పంచాయితీ పెద్దలను గౌరవించలేదని ఆ కుటుంబంపై కక్షగట్టారు. కులస్తులు దూరంగా ఉండాలని ఆంక్షలు విధించారు. దీంతో బాధిత కుటుంబంలో వ్యక్తి మృతిచెందినా అంత్యక్రియలకు ఎవరూ హాజరుకాలేదు. చివరకు అంత్యక్రియలకు సాయపడిన ఓ సామాజిక కార్యకర్తపై కూడా కన్నెర్ర చేశారు. అతడి కిరాణా షాపులో ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయొద్దని కట్టుబాటు విధించారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మగ్గిడి ఎల్లయ్య (93)కు ముగ్గురు కుమార్తెలు. ఇందులో చిన్న కుమార్తెకు పెళ్లి చేసి వేరే ఇంటికి పంపగా, మిగతా ఇద్దరు కుమార్తెలు మగ్గిడి నర్సమ్మ, మగ్గిడి భూమవ్వలకు ఇల్లరికం పెళ్లి చేశాడు. తనకున్న భూమి నుంచి వచ్చే ఆదాయాన్ని తన పోషణ అనంతరం సమంగా తీసుకోవాలని సూచించాడు. ఈ క్రమంలో భూమవ్వ తనను పోషించడం లేదని కొద్దిరోజుల క్రితం తన పేరున ఉన్న భూమిని నర్సమ్మ పేరున రిజిస్ట్రేషన్ చేశాడు. దీంతో కొంతకాలంగా నర్సవ్వ, భూమవ్వల మధ్య భూవివాదం కొనసాగుతోంది. ఇదే అంశంపై భూమవ్వ కుల పెద్దలను ఆశ్రయించగా పంచాయితీ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 7న ఉదయం ఎల్లయ్య మృతిచెందాడు. దీంతో తాము చెప్పిన తీర్పునకు కట్టుబడి ఉంటేనే అంత్యక్రియలకు హాజరవుతామని కులపెద్దలు తేల్చిచెప్పారు. కులస్తులు ముందుకు రాకపోవడంతో నర్సమ్మ సాయంత్రం వరకూ ఎదురుచూసింది. దీంతో అంత్యక్రియలకు సహకరించాలని బాధితులు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కాసారపు రమేశ్తోపాటు మరికొందరిని సంప్రదించగా వారు ముందుకొచ్చి కార్యక్రమం పూర్తి చేశారు. దీంతో రమేశ్ కిరాణా దుకాణానికి ఎవరూ వెళ్లవద్దని కులపెద్దలు కట్టుబాటు పెట్టారు. దీంతో 17 రోజులుగా ఎవరూ రమేశ్ కిరాణా దుకాణానికి వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో మగ్గిడి నర్సవ్వతో పాటు, ఆమె మనుమడు, కాసారపు రమేశ్లు గురువారం జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కులపెద్దల అరాచకంపై ఫిర్యాదు చేశారు. -
బకాయిల కుప్పలు .. విద్యార్థులకు తిప్పలు
►రెండు సంవత్సరాలుగా నిధులు అందకపోవడంతో రూ.5.5 లక్షల అప్పు చేసి ఫీజు చెల్లించిన చైతన్యపురికి చెందిన పీజీ వైద్య విద్యార్థిని తండ్రి రెండు నెలలుగా హైదరాబాద్ బీసీ సంక్షేమ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్, పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాల బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో, ప్రభుత్వ పథకంపైనే ఆధారపడిన విద్యార్థులు అప్పులు చేసి కాలేజీల యాజమాన్యాలకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. రెండేళ్లుగా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. 2019–20 విద్యా సంవత్సరం బకాయిలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. ఇక 2020–21కి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధుల పంపిణీ ఇంకా మొదలే కాలేదు. రెండేళ్లకు కలిపి మొత్తం రూ.3017.41 కోట్ల బకాయిలున్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావం.. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన పథకాలనూ ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. క్రమం తప్పకుండా జరగాల్సిన నిధుల విడుదలలో జాప్యం కారణంగా కొన్నిచోట్ల కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నాయి. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అందక పోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించడం కష్టతరంగా మారుతోందని యాజమాన్యాలు అంటున్నాయి. జాడలేని నెలవారీ నిధులు మూడేళ్ల క్రితం ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. మొదట్లో ప్రతి విద్యా సంవత్సరం చివర్లో నిధులను మంజూరు చేసేవారు. అయితే పెద్దమొత్తంలో నిధులు ఒకేసారి విడుదల చేయడం భారంగా మారుతుండటంతో నెలవారీగా నిధులు విడుదల చేయాలని భావించింది. సాధారణ, వృత్తి విద్యా కోర్సులకు వేరువేరుగా పద్దుల కింద నిధులు విడుదల చేయాలని నిర్ణయించి చర్యలు చేపట్టింది. తొలి రెండు మూడు నెలలు నిధుల విడుదల సాఫీగా జరిగినప్పటికీ.. ఆ తర్వాత క్రమం తప్పింది. దీంతో బకాయిలు పేరుకుపోతూ వచ్చాయి. దీంతో రెండేళ్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు పలు కాలేజీల్లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు యాజమాన్యాల ఒత్తిడితో తామే వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించి ధ్రువపత్రాలు పొందాల్సి వస్తోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత.. చెల్లించిన ఫీజులను తిరిగి ఇచ్చేస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. జూనియర్ విద్యార్థుల విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తుండటంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. ఇలా ఫీజులు చెల్లించినవారు సంక్షేమ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదనే సమాధానం ఎదురవుతోంది తప్ప ఫలితం ఉండటం లేదు. వనపర్తి జిల్లా గోపాల్పేట హరిజనవాడకు చెందిన లావణ్య అనే బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థిని కాలేజీ ఫీజులు చెల్లించలేక గతనెల 19న బలవన్మరణానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. దరఖాస్తులు పరిశీలనకే పరిమితం... 2020–21 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలకు సంబంధించి 12.85 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు. గతేడాది ఆగస్టులో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రియ కొనసాగింది. దాదాపుగా నూరు శాతం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ మొదలైన నెల రోజుల తర్వాత నుంచి వాటి వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు కావాలి. అయితే కోవిడ్–19 నేపథ్యంలో పరిశీలన ఆలస్యమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పరిశీలన ప్రారంభించిన సంక్షేమాధికారులు ఇప్పటివరకు 80 శాతం ప్రక్రియ పూర్తి చేశారు. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన పథకాల కోసం రూ.2,250 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. అయినా ఇప్పటివరకు అటు ఫీజు రీయింబర్స్మెంట్కు గానీ, ఉపకార వేతనాలకు కానీ నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. ఇక 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా రూ.767.41 కోట్ల మేర బకాయి ఉంది. వీటికి సంబంధించి సంక్షేమ శాఖ అధికారులు బిల్లులు సిద్ధం చేసినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. తక్షణమే నిధులు విడుదల చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విషయమై ఆర్థిక మంత్రితో సహా పలువురికి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. ఇతర పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. విద్యార్థులకు బకాయి పడ్డ నిధులను ఇవ్వకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన నిధులు విడుదల చేయాలి. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. – ఆర్.కృష్ణయ్య, అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం దిక్కుతోచని స్థితిలో కాలేజీలు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్పైనే ఆధారపడి ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు చదువుతున్న వాళ్లు 85 శాతం ఉన్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయి. అప్పులు చేసి బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు ఏకంగా కాలేజీలనే మూసేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోకుంటే రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. – గౌరి సతీష్, కన్వీనర్, తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం -
మనోబలమే మహౌషధం
దేశ రక్షణకు ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడే వీర సైనికులలో వున్నది ఈ మనోబలమే! శత్రువులు మూకుమ్మడిగా చుట్టూముట్టినా, శరీరాన్ని ఛిద్రం చేస్తున్నా ప్రతిఘటించాలన్న కాంక్షవారికుండటానికి కారణం అబ్బురపరిచే వారి మానసిక స్థైర్యమే. కష్టాలు ఒక్కసారిగా చుట్టిముట్టినప్పుడు మనిషి నిబ్బరంగా ఉండగలగటమే ధీరత్వం అంటే! క్లిష్ట పరిస్థితులలో నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. ఆశ సన్నగిల్లుతుంది. మనసు నిలకడను కోల్పోతుంది. ఏదో తెలియని భీతి మనసులో తిష్ఠ వేస్తుంది. దాంతో కుంగిపోతాడు. మానసిక ప్రశాంతతకు దూరమవుతాడు. ఆశాæకిరణం కనుచూపు మేరలో లేదని, తను ఈ గడ్డుకాలం నుంచి బైట పడలేననే భయం ఏర్పడుతుంది. తన జీవితాన్ని అర్ధంతరం గా ముగించే ప్రయత్నం కూడా చేస్తాడు. ఈ కరోనా కష్ట కాలంలో మనలో చాలామంది ఈ స్థితిలోనే ఉన్నాం. శారీరక వ్యాయామం వల్ల శరీరం మాత్రమే దృఢమవుతుంది. కాని ప్రశాంతతకు దూరమైన మనసు బలహీనమవుతుంది. అది మన లోని శక్తిని నీరుకారుస్తుంది. అసహనంతో అకారణమైన, అసమంజసమైన కోపాన్ని కుటుంబ సభ్యుల మీద చూపి, వారి ప్రేమకు దూరమయేలా చేస్తుంది. వారిది కూడ తనలాంటి మానసిక స్థితేనా? అన్న ఆలోచన, విచక్షణ వివేచనలు కోల్పోయిన మనసుకు తోచదు. అది తన కుటుంబానికే కాక సమాజానికి, దేశానికి చేటు చేస్తుంది. మరెలా దీన్ని అధిగమించాలి? ఓర్పుతో మాత్రమే దీన్ని అలవరుచుకోవాలి. ఓర్పే నేటి గడ్డు కాలంలో గొప్ప రక్షణ కవచం. ‘దుర్దశే మనిషి వ్యక్తిత్వానికి గీటురాయి ‘ అన్నాడు ప్రపంచ విఖ్యాత నాటకకర్త షేక్సి్పయర్. అదే మనిషిలోని ధీ శక్తిని వెలికి తీసే అవసరాన్ని, అవకాశాన్ని కల్పిస్తుంది. మనిషి వ్యక్తిత్వానికి పరీక్ష పెట్టే కష్టాలు, అననుకూలతలు ఏర్పడినప్పుడు మనిషి కి మనోబలం అవసరం. మనోబలమున్న ధీరులలో స్వీయ క్రమశిక్షణ, స్వీయ ఆదేశాలు, ఆచరణ అంతర్వాహినిగా ఉంటాయి. మనోబలం వల్ల ఈ కష్టాల ఊబి నుండి బైట పడగలిగే శక్తి చేకూరుతుంది. సాధారణంగా మనోబలం కలవారు తక్కువ మాట్లాడతారు. ఎక్కువ పని చేస్తారు. కొందరయితే మౌనంగా, గంభీరంగా వుంటారు. నిరంతరం కార్యనిర్వహణలో నిమగ్నమై వుంటారు. ఎంత మనోబలం వున్నా బాగా శ్రమించి పనిచేస్తేనే ఆశించిన ఫలితం దక్కుతుంది. మనం కూడా మంచి ఆలోచనలతో, పట్టుదలతో కృషి చేయాలి. మానసికంగా బలంగా వున్నప్పుడు, శారీరకంగా శక్తిమంతుడు కాకపోయినా ఏమైనా చేయగలనన్న ధీమా ఉంటుంది. ఎవరినైనా, దేన్నైనా ఎదుర్కొనే సంసిద్ధత వస్తుంది. ఆ మానసిక సంసిద్ధతే నేడు కావలసింది. దానిని అందరూ అలవరచుకుంటూ, పెంచుకుంటూ మానసికంగా బలోపేతులు కావాలి. ఎవరు కాలం కంటే ముందు పరుగులు తీయగలరో, ఎవరు సంకల్పంతో కాల పరిధుల్ని, అవధుల్ని అధిగమించగలరో వారే విజేతలు. పరిమిత జీవిత కాలంలో అపరిమిత కృషితో అద్భుత ఫలితాలు సొంతం చేసుకున్నవారే కాలాతీతవ్యక్తులు. వారే శాస్త్రజ్ఞులు, సంస్కర్తలు, దేశభక్తులు, త్యాగమూర్తులు, దేశరక్షణలో ప్రాణత్యాగాలు చేసే పరమ యోధులు. మన కృషి తీవ్రతను బట్టి గమ్యం సమీపమో, సుదూరమో నిర్ణయమవుతుంది. సమీప గమ్యమే మన లక్ష్యమైనపుడు సంకల్పబలం దాన్ని తప్పకుండా సుసాధ్యం చేస్తుంది. మనోబలం అందుకు దన్నుగా నిలుస్తుంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను రూపుమాపటానికి, అభ్యుదయ మార్గంలో సమాజాన్ని నడిపించటానికి రాజా రామమోహన రాయ్, కందుకూరి వీరేశలింగం, జ్యోతి రావు ఫూలే వంటి అనేక మంది సంస్కర్తలు తమ జీవితాన్ని సమాజం కోసం ధార పోశారు. సమాజం నుంచి ఎన్నో ప్రతికూలతలు, అవమానాలు, బెదిరింపులు ఎదుర్కొన్నారు. అయినా, మొక్కవోని మనోబలంతో అనుకున్న లక్ష్యాలను సాధించారు. ఈ తరం న్యూటన్గా ప్రపంచం కొనియాడిన స్టీఫెన్ విలియం హాకింగ్స్ నరాలకు సంబంధించిన వ్యాధి పీడితుడై, శరీరం చచ్చుబడినా, తన అమోఘమైన మేధస్సుతో అనేక పరిశోధనలు, ఆవిష్కరణలు చేసాడు. మనోబలానికి ఇంతకన్నా నిలువెత్తు నిదర్శనం ఏముంటుంది? దేశ రక్షణకు ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడే వీర సైనికులలో వున్నది ఈ మనోబలమే! శత్రువులు మూకుమ్మడిగా చుట్టూముట్టినా, శరీరాన్ని ఛిద్రం చేస్తున్నా ప్రతిఘటించాలన్న కాంక్ష వారికుండటానికి కారణం అబ్బురపరిచే వారి మానసిక స్థైర్యమే. అనేక ప్రకృతి వెపరీత్యాలకు, మానవ ప్రేరిత విధ్వంసాలకు, ప్రజ అతలాకుతలమైంది. కాని, గుండె దిటవు చేసుకుంటూ తునాతునకలైన ఆశను మనోబలంతో ప్రోది చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూనే ఉంది. ఇన్ని విపత్తులను దాటటానికి మనోబలమే కారణం. మనోబలమే మనిషికి నిజమైన శక్తి! ప్రస్తుత కాలంలో జనాన్ని వణికిస్తూ, భయభ్రాంతులను చేస్తున్న కరోనాను సులభంగా జయించటానికి అవసరమైనది ఈ మనోబలమే! కాబట్టి మనోబలాన్ని రక్షణ కవచంగా చేసుకుని ధైర్యంగా ముందుకు వెళదాం. కరోనా మహమ్మారి బారిన పడకుండా కాపాడుకుందాం. – బొడ్డపాటి చంద్రశేఖర్ -
కరోనా కర్మకాండ!
► చెన్నైలో ఈనెల 19న కరోనాతో డాక్టర్ మరణించాడు. అంత్యక్రియల కోసం కుటుంబసభ్యులు, స్నేహితులు శ్మశానవాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లగా స్థానికులు అడ్డగించారు. అక్కడ ఖననం చేస్తే వైరస్ వ్యాపిస్తుందనే భయంతో దాడి చేశారు. అంబులెన్స్ డ్రైవర్ సహా పలువురు గాయపడ్డారు. దాడి నుంచి తప్పించుకోవడానికి ఆ డాక్టర్ కుటుంబం పరుగెత్తాల్సి వచ్చింది. చివరకు పోలీసు భద్రతతో అతని కుటుంబసభ్యులు లేకుండానే ఒక స్నేహితుడు, మరో ఇద్దరి సాయంతో డాక్టర్కు చివరి వీడ్కోలు పలికారు. ► అలాగే ఆదివారమే జార్ఖండ్లోని రాంచీలో ఒక వ్యక్తి కరోనాతో చనిపోయాడు. మృతదేహాన్ని శ్మశానవాటికలో పాతిపెట్టాలని రాంచీ జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుమారు 200 మంది ప్రజలు శ్మశానవాటిక వెలుపల పెద్ద ఎత్తున నిరసన తెలిపి అడ్డుకున్నారు. శవాన్ని వేరే చోట పాతిపెట్టాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని శ్మశానవాటికలో ఖననం చేస్తే అక్కడి ఎలుకలు వైరస్ను తమ ఇళ్లలోకి తీసుకొస్తాయని నినదించారు. సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కాలంలో చివరికి కర్మకాండలు చేయడం కూడా సమస్యగా మారింది. కరోనాపై పోరాడుతున్న ఒకరిద్దరు డాక్టర్లు మొదలు చనిపోయే సామాన్యుల వరకు వారికి అంతిమ సంస్కారాలు చేయడం కష్టంగా మారింది. అనేక రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు కరోనా చావులు ఆయా కుటుంబాల్లో జీవిత వేదనగా చేదుజ్ఞాపకంగా మిగులుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే మృతదేహాలను ఖననం చేస్తామని చెప్పినా ప్రజలు అంగీకరించడంలేదు. చెన్నైలో డాక్టర్ మృతదేహం ఖనన ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ సంఘటన అనంతరం అక్కడి డీఎండీకే పార్టీ అధినేత విజయ్కాంత్ తన యాజమాన్యంలోని ఒక కాలేజీలో కొంత స్థలాన్ని కరోనాతో చనిపోయే రోగుల మృతదేహాల ఖననానికి కేటాయించారు. దేశంలో పలుచోట్ల, తెలంగాణలో అక్కడక్కడ ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. సాధారణ పరిస్థితుల్లో చనిపోయిన మృతదేహాలను కూడా ఖననం చేసేందుకు సమీపంలో ఉండే స్థానికులు అడ్డుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కరోనాతో చనిపోయిన చెన్నై డాక్టర్కు నివాళి అర్పిస్తూ, అలాగే డాక్టర్లపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, వారిని అనేకచోట్ల ఇళ్లల్లోకి రానీయని పరిస్థితులపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) బుధవారం రాత్రి 9 గంటలకు ‘వైట్ అలెర్ట్’కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ రోజు రాత్రి 9 గంటలకు అన్ని ఆసుపత్రుల్లోని వైద్యులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపాలని కోరింది. అలాగే వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలపై జరుగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా జరిగే వైట్ అలెర్ట్లోనూ పాల్గొనాలని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రుడావత్ లక్ష్మణ్ ఓ ప్రకటనలో కోరారు. ఎలా చనిపోయినా ‘కరోనా’జాగ్రత్తలే... కరోనా అనుమానిత లక్షణాలతో చనిపోయినవారి శాంపిళ్లను సేకరించకూడదని, వారిని కరోనా పాజిటివ్ వ్యక్తులుగానే పరిగణించి ఖననం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దాంతోపాటు తాజాగా చెన్నై, రాంచీ సహా దేశవ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి మృతదేహాల ఖననాలకు ఎదురైన అడ్డంకులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా మళ్లీ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో కరోనాతోనే కాకుండా ఏ విధంగా చనిపోయినా, ఆయా మృతదేహాలను కరోనా పాజిటివ్తో చనిపోయిన వారికి తీసుకునే జాగ్రత్తల ప్రకారమే కర్మకాండలు చేయాలని ఆదేశించింది. ఆసుపత్రుల్లోనూ, ఇళ్లలోనూ ఎక్కడ చనిపోయినా ఈ పద్ధతి పాటించాలని కోరినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. కరోనా అనుమానిత, నిర్ధారిత మృతుల అంత్యక్రియలకు ముందు కేవలం ముగ్గురు లేదా ఐదు మంది కుటుంబ సభ్యులు, బంధువులకు మాత్రమే కడచూపు అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులను మార్చురీ లోపలికి అనుమతించడం కాని మృతదేహాన్ని ముట్టుకోవడానికి అనుమతి ఉండదు. ముఖం కనిపించే విధంగా మృతదేహాన్ని ప్లాస్టిక్ షీట్లో చుట్టి, లీక్ ప్రూఫ్ జిప్ బ్యాగులో ప్యాక్ చేస్తారు. మృతుడి ముఖం కనిపించేలా బ్యాగు ముందటి భాగం పారదర్శకంగా ఉంటుంది. ఇటువంటి వాటిని అన్ని ఆసుపత్రులు సమకూర్చుకోవాలి. ఈ పద్ధతి రాష్ట్రంలో ఏ విధంగా చనిపోయిన వ్యక్తుల మృతదేహాలకైనా వర్తిస్తుంది. ఎందుకంటే కరోనా అనుమానంతో చనిపోయిన వారి శాంపిళ్లను సేకరించి నిర్ధారణ పరీక్షలు చేయడాన్ని ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో తాజా నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా సహా ఇతరత్రా మృతదేహాల అంత్యక్రియలు సాఫీగా జరిగేందుకు ఇప్పటికే రాష్ట్రంలో ఒక కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ షీట్లో మృతదేహాన్ని చుట్టడానికి ముందు రసాయన క్రిమిసంహారక మందులు కలిగిన నీటి మిశ్రమాన్ని శవంపై చల్లుతారు. అనంతరం శరీరాన్ని ప్లాస్టిక్ షీట్లో చుట్టి ఆపై తెల్లటి కాటన్ వస్త్రంతో చుడతారు. ఇకనుంచి అన్ని మృతదేహాలను ఇలాగే ఖననానికి ముందు ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. -
ధర్మానికి లోబడడమే ధైర్యం
ధైర్యవంతులే జీవితంలో ఏదో ఒకటి సాధిస్తారు. కాని ధైర్యంగా కార్యాలు తలపెట్టడమంటే ప్రమాదాలను ఆహ్వానించడమే! అయినప్పటికీ వెరపకుండా ధర్మానికి లోబడి ముందుకు వెళుతూ ఉంటే విజయం వెన్నంటి నడుస్తుంది. ఒక ఊరిలో ఓ నిరుపేద కూలీ ఉండేవాడు. జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. అనేక ఎదురుదెబ్బలు తిన్నాడు. ఎన్నోకష్టాలు భరించాడు. అయినా ఏనాడూ కుంగిపోలేదు. ఎప్పుడూ సంతోషంగా, హాయిగా, నవ్వుతూ ఉండేవాడు. చూసేవాళ్లకు చాలా ఆశ్చర్యం వేసేది. ఇన్నిన్ని బాధలు భరిస్తూ కూడా ఇంత హాయిగా ఎలా ఉండగలుగుతున్నావూ.. అని అతడిని అడిగేవారు. దానికతను ‘‘అల్లాహ్ ఏ ప్రాణి పైనా దాని శక్తికి మించిన బాధ్యత మోపడు. మనం వద్దని అనుకున్నంత మాత్రాన రానున్నవి రాకమానతాయా? ఇదొక్కటి తెలుసుకుంటే చాలు’’ అని చిరునవ్వుతో సమాధానం చెప్పేవాడు.అందుకే, కష్టాల కరవాలం దూసుకొస్తున్నప్పుడు ధైర్యంగా, ఒడుపుగా దాని పిడిని పట్టుకోవాలంటారు పెద్దలు. అలా కాకుండా భయపడుతూ, బెదురుతూ పట్టుకోబోతే పిడివైపుకు బదులు మరో భాగం చేతికి దొరికి గాయాలు కావచ్చు. ప్రమాదం ఏర్పడవచ్చు. ధైర్యసాహసాలు కూడా సరైన విధంగా, యుక్తిగా ప్రయోగిస్తేనే చక్కని సాధనంగా ఉపకరిస్తాయి. కష్టాలకు, కన్నీళ్లకు బెదిరిపోకుండా నిలకడను, శక్తిని ప్రసాదిస్తాయి. భయం, పిరికితనం అన్నవి మనిషిని జీవచ్ఛవంగా మారుస్తాయి. ఉత్సాహం నీరుగారి పోతుంది. ధైర్యసాహసాలంటే మరేమిటోకాదు. మనిషి ధర్మానికి కట్టుబడి జీవించడం. తన విధి, బాధ్యతలను విలువైనవిగా గుర్తించడం. ఏదీ సాధించలేకపోవడానికి, ఏదో ఒకటి సాధించడానికి మధ్యన ఉన్న బేధమే ధైర్యం. మనిషికి అటువంటి తర్ఫీదునిచ్చి ధర్మానికి బద్ధునిగా చేస్తుంది రమజాన్ – మదీహా -
బీఎల్వోల బాధలు పట్టవా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల్లో మహిళా బీఎల్వో (బూత్ లెవల్ ఆఫీసర్లు)లు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గురువారం లోక్సభ ఎన్నికల పోలింగ్ విధుల్లో బీఎల్వోలకు సరైన సౌకర్యాలు లేక, మండుటెండలో విలవిలలాడాల్సిన పరిస్థితి ఎదురైంది. పలు చోట్ల కూర్చోవడానికి సరిపడా కుర్చీలు, తాగడానికి నీరు కూడా లేక ఇబ్బందులు పడ్డారు. కొన్ని జిల్లాల్లో చెట్ల నీడలు, గోడల పక్కన కూర్చుని విధులు నిర్వర్తించుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. వీరికి కనీస సదుపాయాలు కల్పించాల్సిన జిల్లా ఎన్నికల యంత్రాంగం అవేమీ పట్టనట్లు వ్యవహరించిందని పలువురు బీఎల్వోలు ఆవేదన చెందారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, భూపాలపల్లి, జనగాం జిల్లాల్లో సరైన వసతుల్లేక బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీటికి తోడు ఏజెంట్ల బెదిరింపులు, ఓటరు స్లిప్పుల పంపిణీలో తప్పిదాలతో నానా చీవాట్లు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాద్లోని ఓ పోలింగ్ కేంద్రంలో కమలమ్మ అనే అటెండర్ స్పృహ తప్పి పడిపోయింది. ఇలాంటి ఘటనలు పోలింగ్ సమయంలో తరచూ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. అంగన్వాడీలే అధికం.. బీఎల్వో డ్యూటీ చేసే వాళ్లలో 80 శాతం అంగన్వాడీ కార్యకర్తలే ఉండగా మిగిలిన 20 శాతం ఆశ కార్యకర్తలు, సాక్షరభారత్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. చాలీ చాలని జీతాలతో పగలనక రాత్రనక కష్టపడి పనిచేసినా అధికారుల నుంచి, ఓటర్ల నుంచి చీవాట్లు తప్పడం లేదని వాపోతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు డోర్ టు డోర్ సర్వే చేసే సమయంలో రాజకీయ నాయకులు పార్టీలకు ప్రచారం చేస్తున్నారా అంటూ వేధింపులకు పాల్పడుతున్నారని, అలాగే ప్రతి సంవత్సరం బీఎల్వోలకు రావాల్సిన రెమ్యునరేషన్ ఏడు వేల రూపాయలను కూడా ఆర్డీవో స్థాయి అధికారులు చెల్లించకుండా వేధిస్తున్నారని, ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని ఇలా పలు సమస్యలతో సతమతమవుతున్నట్లు పలువురు ఆవేదన చెందుతున్నారు. గతేడాది బీఎల్వో రెమ్యునరేషన్ విషయమై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో 2017 సంవత్సరం రెమ్యునరేషన్ మాత్రమే చెల్లించారని, అది కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల బీఎల్లోలకు అందడం లేదని వాపోతున్నారు. నో వాటర్, నో టిఫిన్.. మండుటెండలో విధులు నిర్వర్తిస్తున్న బీఎల్వోలలో కొంతమంది దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీరు కూడా లేక ఉదయం 7 గంటల నుంచి విధుల్లో ఉన్న బీఎల్వోలకు కనీసం టిఫిన్ కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు పలువురు బీఎల్వోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎల్వోల విధులు.. ►ఓటరు స్లిప్పులు అందించడం ►కొత్త ఓటర్లను నమోదు చేయడం ►డోర్ టు డోర్ సర్వే చేయడం ►ఓటరు కార్డులో ఏవైనా తప్పులుంటే 8సీ ఫామ్ సంబంధిత తహసీల్దార్కి అందించడం పట్టించుకునేవారు లేరు.. బీఎల్వో డ్యూటీ చేసే అంగన్వాడీ కార్యకర్తల్లో వయసు పైబడిన వారు పోలింగ్ కేంద్రాల్లో వసతుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలనే కనీస గౌరవం కూడా లేకుండా ఏజెంట్ల బెదిరింపులు, రాజకీయనాయకులు ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. ఏటా ఇవ్వాల్సిన రూ.7 వేలు కూడా చెల్లించకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులు దృష్టి సారించి మా సమస్యలు పరిష్కరించాలి. భిక్షపమ్మ, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ స్టేట్ ప్రెసిడెంట్ -
వజ్రాల బేహారి
ఒక ముఖ్యమైన వ్యవహారం– ఆ రాత్రి నన్ను చాన్సరీ లేన్ వద్ద వుండేలా చేసింది. కొంచెం తలనొప్పిగా కూడా ఉండటం వల్ల ఇతరత్రా ఏ పనిమీదా మనసు పోలేదు. ఆ రోజు ఆకాశం నిర్మలంగా, మనోజ్ఞంగా ఉంది. నది గట్టు వైపు అడుగులేశాను. నల్లని నీళ్ళల్లో ప్రతిఫలిస్తున్న దీపాల తళుకులు– వాటర్లూ వంతెన ఆర్చి కన్నా ఎత్తులో కనిపిస్తూ– తీరం హద్దునుచూపిస్తున్నాయి. కనువిందు చేస్తున్న ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తూ, వేడెక్కిన మెదడును చల్లార్చుకో సాగాను. ‘ఈ రాత్రి వెచ్చగా వుంది కదూ?’ ఎవరిదో కంఠస్వరం వినబడితే అటు చూశాను ఒక బక్కపల్చటి వ్యక్తి పిట్టగోడ నానుకొని నిల్చున్నాడు. అతని ముఖం దీనాతిదీనంగా, కళావిహీనంగా వుంది. మాసిపోయిన అతని కోటు కాలరు పైకి లేచి వుండి, గొంతు చుట్టూ బిగించబడి వుంది. అతడు ధరించిన దుస్తులు పేదరికానికి ప్రతీకగా ఉన్నాయి. కుతూహలంగా చూశానతని వైపు. అతనికి నాతో ఏం పని? డబ్బు యాచించడానికా? లేక తన దీన చరిత్ర వినిపించడానికా? నుదురు, కళ్లు అతడు తెలివైన వాడని తెలియజేస్తున్నాయి. ‘అవును.’ అని సమాధానమిచ్చాను. ‘మానసిక విశ్రాంతి పొందాలంటే లండన్కు మించిన ప్రదేశం మరొకటి ఉండదు. రోజంతా వ్యాపార వ్యవహారాలతో అలసిన గుండెల్ని సేదతీర్చడానికి, బాధ్యతలను ఒకసారి సింహావలోకనం చేసుకోవడానికి ఇంతకంటే అనువైన చోటు మరెక్కడుంటుందో నాకు తెలియదు’ అన్నాడు. వాక్యానికీ వాక్యానికీ మధ్య దీర్ఘ విరామమిచ్చి మాట్లాడాడు. ‘మీరు, ఈ భూప్రపంచంలో తినడానికి కూడా తిండి దొరకని అభాగ్య వ్యధిత జీవితాల గురించి, ఒక్క పెన్నీ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడానికి వెనుదీయని మనుషుల గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరముంది. లేకుంటే మీరు ఈ లోకంలో అనామకునిగా మిగిలిపోతారు. నాలాగే తల చెడుపుకొని, మానసికంగా విసిగి వేసారి, ఎన్నో కష్టాలు పడిన వ్యక్తిగా నాకనిపించడం లేదు మీరు. ఈ మానవ సమాజం– డబ్బు, పేరు ప్రతిష్టలు, సంఘంలో పలుకుబడి, హోదాల మీద ఆధారపడి– మనుగడ సాగిస్తూ ఉన్నది. ఎవరికి తగిన వృత్తిలోకి వారు దిగిపోవడం మంచిదని చాలామంది అభిప్రాయం... కానీ నా అభిప్రాయాలూ, ఆశయాలు భిన్నమైనవి. నాకు నేను నిర్దేశించుకున్న జీవిత లక్ష్యాలు సంక్లిష్టతతో కూడుకున్నవి. ప్రపంచవ్యాప్తంగా గొప్ప కీర్తి గడించుకోవాలనే వాంఛ, ప్రగాఢంగా వుంది నాలో. కానీ నా జీవిత చరమాంకంలో మిగిలేది నిరాశా నిస్పృహలు, పశ్చాతాపంతో కరిగిపోయిన నా ఈ శరీరం, వ్యధిత హృదయం తప్ప మరేమీ మిగలదేమోననిపిస్తుంది.’’ అతని వైపు ఆశ్చర్యంగా చూశాను. నేనెప్పుడైనా నా జీవితంలో ఒక అత్యంత నికృష్ట నిరాశా జీవిని చూసి వుండటం గాని జరిగి వుంటే– ఇదుగో నా ముందు నిలుచున్నటువంటి దీన వదనుడే అయివుంటాడు. నేను బిగ్గరగా నవ్వేశాను.‘మీకు అన్ని విషయాలూ చెప్పడమే మంచిది. ఇటువంటివి ఇతరులకు చెప్పుకోవడంలో ఎంతో మానసిక సుఖముంది. అందునా మీ వంటి వారితో. నిజం చెప్పాలంటే నా వద్ద ఒక పెద్ద వ్యాపారానికి సంబంధించిన వ్యవహారమే ఉంది. మీరూహించనంత భారీ వ్యాపారం. కానీ అందులో లెక్కలేనన్ని చిక్కులు, ఇబ్బందులు ఉన్నాయి. ఇంతదాకా వచ్చి అసలు విషయం చెప్పకపోతే ఎలా? ఎన్నో కష్టాలు పడి, నా ఈ చేతులతో స్వయంగా తయారు చేసినట్టి ఖరీదైన వజ్రాలున్నాయి నా వద్ద.. ’ వజ్రాలు అనే మాటను నొక్కి పలుకుతూ. ‘ఓహో! నీకిప్పుడేమీ పనీ పాటా లేనట్లుంది. అందుకే అలా మాట్లాడుతున్నావు. అవునా?‘ అన్నాను. ‘మీ వెటకారపు మాటలు నా మనసును గాయపరుస్తున్నాయి’ అని అసహనం వ్యక్తపరుస్తూ అకస్మాత్తుగా, మురికితో అట్టలు కట్టివున్న అతని కోటు గుండీలు టకాటకా విప్పాడు. ఒక దారం ఆధారంగా అతని మెడలో వేలాడుతున్న కాన్వాసు సంచిని బయటికి తీశాడు. ఆ సంచిలోంచి ఒక గోధుమరంగులో వున్న గులకరాయిలాంటి వస్తువు నా చేతికిచ్చి... ‘నేను భౌతిక శాస్త్రం, ఖనిజ శాస్త్రాలలో కొంచెం ప్రావీణ్యం సంపాదించాను. మీ చేతిలో వున్న గులకరాయివంటి వస్తువు ఏమిటో గుర్తించారా?... శాస్త్రీయ పద్ధతిలో, ఒక నిర్దుష్ట క్రమాన్ననుసరించి తయారు చేసిన గోధుమరంగు షట్భుజ వజ్రం సార్! అతి ఖరీదైన వజ్రం!’ అని చెప్పాడు. అది రమారమి నా బొటనవేలి అగ్రభాగమంత వుంది. వెనక్కి వంపులు తిరిగిన ఉపరితల ముఖాలతో, సహజసిధ్ధమైన షడ్భుజవజ్రం లాగానే ఉంది. నా జేబులోనుండి చిన్న కత్తి తీసుకొని దానిమీద గట్టిగా గీరాను. ఒక్క గీతకూడా పడలేదు. నా చేతి గడియారం అద్దం మీద కూడా అలాంటి పరీక్ష చేశాను. ఆశ్చర్యంతో, నమ్మలేనట్లు అతని వంక చూశాను. అది వజ్రమే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ‘‘ఎక్కడి నుండి వచ్చింది నీకిది?‘ అడిగాన్నేను. ‘నేనే తయారుచేశాను. దయచేసి దాన్ని నాకు వాపసిచ్ఛేయండి’ అన్నాడు.అతను ఆత్రంగా అందుకొని దాన్ని యథాస్థానంలో ఉంచి, జాకెట్ గుండీలను బిగించాడు. ‘నేను మీకు ఈ వజ్రాన్ని వంద పౌండ్లకు అమ్ముతాను..’ అతను వెంటనే ఆశగా గొణిగాడు. ఆ మాటలతో నాలో మళ్ళీ అనుమానం తలెత్తింది... ఒకవేళ అది నిజంగా వజ్రమే అయివుంటే, కేవలం వంద పౌండ్లకెందుకమ్మజూపుతాడు? ఇద్దరం ఒకరి కళ్ళలోనికొకరు చూసుకొన్నాం. అతని ముఖంలో ఆత్రుత కనిపిస్తూ వుంది. ఆ ఆత్రుత వెనుకనున్న నిజాయితీని పసిగట్టగలిగాను. మొదట అనుమానపడినా, బాగా ఆలోచిస్తే అది అచ్చమైన వజ్రమే అని నమ్మకం కుదిరింది. పైగా ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త హెన్రీ మొయిసన్ తయారు చేసిన వజ్రాల గురించి నాకు కొంత తెలుసు. కానీ అవి పరిమాణంపరంగా మరీ చిన్నవి. నేను పెద్ద ధనికుణ్ణి కాను. వంద పౌండ్లు నా మొత్తం ఆదాయంలో పూడ్చలేని లోటు. పైగా వివేకవంతుడెవరూ ఆ గుడ్డివెలుతురులో, గబ్బువాసన గొట్టే బికారిని నమ్మి, అతని వద్ద నుంచి వజ్రాన్ని కొనుగోలుచేయడు. అది అత్యంత ఖరీదైన వజ్రం. నేను తల పంకించాను. ‘మీకు ఇలాంటి విషయాలలో ఏదో కొంత అవగాహన ఉన్నట్టుంది. అందుకే నన్ను గురించి ఇంకా కొంచెం చెప్పాలనుకుంటున్నాను. అందువలన మంచి బేరం కుదరడానికి అవకాశముంటుంది.’ అంటూ నది వైపుగా అతని వీపు తిప్పి, ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకొని ఒక దీర్ఘనిశ్వాసం వదిలాడు. ‘నా పట్ల వున్న అనుమానం తొలగి, మీకు నాపై విశ్వసనీయత పాదుకొల్పాలంటే, వజ్రాలను ఏ విధంగా తయారు చేశానో మీకు చెప్పడం మంచిది’అలా మాట్లాడుతున్నప్పుడు ఇదివరకటిలా కాకుండా, అతని కంఠస్వరములో– కొంచెం సున్నితత్వం, సరళత, చదువుకున్న వాడి తరహా సంతరించుకొన్నాయి. ‘మామూలు బొగ్గును తగినటువంటి రసాయన ద్రావణంలో ముంచి ఉద్గారాలను వేరుచేయాలి.అవసరమైనంత మేరకు వేడిచేసి, తగిన ఒత్తిడి కలిగించాలి. అప్పుడవి చిన్నచిన్న వజ్రాలుగా మారతాయి. ఎంతోమంది రసాయన శాస్త్రజ్ఞులు ఏళ్లపర్యంతం కృషి చేసి ఎన్నో ప్రయోగాలు చేశారు. కానీ ఏ ఒక్కరు కూడా కచ్చితమైన నిష్పత్తిలో, నిర్దిష్టమైన ద్రావణంతో కలిపి, కచ్చితమైన ఉష్ణ ఒత్తిడిని కలిగించి బొగ్గును కరిగించలేక పోయారు. ఫలితంగా అతి చిన్న వజ్రాలు మాత్రమే ఉత్పత్తయ్యాయి. అవి సాధారణ ఆభరణాలపాటి విలువకూడా చేయలేదు. నేను ఈ సమస్య పరిష్కారం కోసం అవిరామ కృషి చేశాను. ఆఖరి రక్తపు బొట్టును సైతం ధారపోశాను. కచ్చితమైన విధానాన్ని అనుసరించి వజ్రాలు తయారుచేసే స్థాయికి చేరుకునేటప్పటికి నా వయస్సు పదిహేడు. ప్రస్తుతం నాకు ముప్పై రెండు. దాదాపు రెండు దశాబ్దాల నిర్విరామ కృషి, శక్తి సామర్థ్యాలను నా ఈ ఆశయ సాధన కోసమే వినియోగించాను. ఈ తంత్రాన్ని సరియైన పద్ధతిలో ఉపయోగించగలిగితే కోటాను కోట్ల విలువైన వజ్రాలను ఉత్పత్తి చేయవచ్చు’ అతని కళ్ళు నా వంక ఆకలితో చూస్తున్నాయి. అతను తిరిగి చెప్పసాగాడు. ‘నేను ఇరవైఒకటో పడిలో ఉండగా నా వద్ద వెయ్యి పౌండ్లు వుండేవి. ఆ డబ్బుతో నా పరిశోధన సాగించాను. ముఖ్యంగా బెర్లిన్ లో ఒకటి రెండు సంవత్సరాలు విద్యాభ్యాసం చేశాను. ఆ తర్వాత సొంతగా చదువుకున్నాను. నా పరిశోధనల రహస్యాన్ని బయటికి పొక్కకుండా చూసుకోవడం నా శక్తికి మించిన పనైంది. ఈ విషయం మరెవరికైనా తెలిసిందంటే వారు కూడా కృత్రిమ పద్ధతుల ద్వారా వజ్రాలు చేయడం మొదలు పెడతారు. అప్పుడు వజ్రాలు విలువలేని బొగ్గు ముక్కల్లాగా పరిగణించబడతాయి. అందుకని ఒంటరిగానే నేనీ పని చేయడం తప్పనిసరైంది. మొదట్లో నాకొక చిన్న లాబరేటరీ ఉండేది. నా ప్రయోగాలన్నీ కేంటీస్ నగరంలో సర్వవిధాల అసౌకర్యంగా ఉన్న గదిలోనే నిర్వహించుకొన్నాను. నేనక్కడే ఎండుగడ్డి చాపపైన, నేలమీద, ప్రయోగశాల పరికరాల మధ్యనే నిద్రపోయేవాడిని. ఉన్న డబ్బంతా ఖర్చైపోయింది. నా దౌర్భాగ్యస్థితిని తలచుకొని నన్ను నేను అమితంగా అసహ్యించుకొనేవాడిని. సైన్సు సబ్జక్ట్ బోధించి అంతో ఇంతో డబ్బు ఇబ్బంది తొలగించుకుందామనుకొంటే నాకు యూనివర్సిటీ డిగ్రీలు లేవు. సైన్సు పాఠాలు బోధించే సమర్థత నాకు లేదు. కెమిస్ట్రీ చదువుకున్నాను తప్ప ఇతరత్రా విద్యార్హతలు లేవు. అన్నింటినీ మించి అతి తక్కువ డబ్బుకోసం విలువైన నా సమయాన్ని, శ్రమను వృథా పరుచుకోవడానికి నా మనసు అంగీకరించలేదు’‘మూడేండ్ల క్రితం, లోహాల్ని కరిగించి మిశ్రమాన్ని రూపొందించే ప్రక్రియకు సంబంధించిన ముఖ్య సమస్యను పరిష్కరించగలిగాను. తుపాకీ గొట్టంలోనికి లోహమిశ్రమాన్ని బొగ్గుతో సమ్మిళితంచేసి, దట్టించి కూరాను. తరువాత అందులో నీళ్లు పోసి, గట్టిగా మూత బిగించి, తగిన స్థాయిలో వేడిచేశాను. అది పేలిపోయింది. నా గది కిటికీలను, ప్రయోగ సంబంధిత పరికరాలను చాలామేరకు ధ్వంసం చేసేసిందా పేలుడు. ఏదేమైనా, కొంచెం వజ్రపుపొడి లభించింది. ఆ సమస్య ద్వారా గడించిన అనుభవాన్ని పురస్కరించుకొని, ప్యారీస్ ల్యాబరేటరీస్లో డ్యాబ్రిస్ అనే రసాయన శాస్త్రజ్ఞుడు తయారుచేసిన పొడుల గురించి చేసిన పరిశోధనలను అధ్యయనం చేశాను. డ్యాబ్రిస్– పకడ్బందీగా స్క్రూలతో బిగించబడి, అంత సులభంగా పేలని అత్యంత బలిష్టమైన స్టీల్ సిలిండర్ లోపల డైనమైట్ ను పెట్టి పేల్చాడు. రాళ్లను రేణువులుగా మార్చగలిగాడు. నేను అతని విధానాన్ని అనుసరించి మళ్ళీ ప్రయోగం మొదలు పెట్టాను. అధిక ఉష్ణోగ్రతకు కరిగి ద్రవస్థితికి మారిన లోహమిశ్రమం మీద అత్యధిక పీడన కలిగింపజేసే సమస్యను ఒక కొలిక్కి తెచ్చాను. ఒక స్టీలు సిలిండర్ సంపాదించి, నా దగ్గరున్న రసాయన సామగ్రినంతా అందులో వేసి కూరాను. దాన్నలాగే వదలిపెట్టి వాహ్యాళికెళ్ళాను.’‘అది ఇంటిని మొత్తం పేల్చేస్తుందని అనుకోలేదా? చుట్టుపక్కల జనం ఉంటారనే స్పృహ కూడా నీకు లేకపోయిందా?‘ అని అడిగాను. ‘సైన్సు పట్ల నాకున్న శ్రద్ధ అటువంటిది. నా గది కింది భాగంలో వీధిలో పళ్లు అమ్ముకొనే కుటుంబం, వెనుకభాగంలో డాక్యుమెంట్ రైటర్, పై అంతస్తులో ఇద్దరు పూలమ్మే ఆడవాళ్ళున్నారు. కొందరు బయటికెళ్ళి వుంటారనుకొంటాను.‘నేను వెళ్ళేటప్పుడు పరిస్థితి ఎలా వుందో, తిరిగి వచ్చేటప్పటికి కూడా అలాగే ఉంది. సిలిండర్ పేలలేదు. తరువాత కొన్ని సమస్యలనెదుర్కొన్నాను. స్థిరమైన, స్పష్టమైన రూపురేఖలేర్పడి స్ఫటికాలు రూపొందాలంటే, కాలవ్యవధి అనే అంశం అత్యంత ప్రధానమైనది. తొందర పడితే చిన్న చిన్న రేణువుల్లాంటివి మాత్రమే మిగులుతాయి. సుదీర్ఘకాలం సహనంతో వేచివుంటేనే పెద్ద పెద్ద వజ్రాల్ని పొందవచ్చు. అందుకని ఆ పరికరం క్రమంగా చల్లబడేందుకు రెండేండ్ల పాటు కదిలించకూడదని నిర్ణయించుకున్నాను.అప్పుడు నా వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. ఆ యంత్రాన్ని పరిరక్షించుకోడానికీ, గది అద్దె చెల్లించడానికి, నా ఆకలి తీర్చుకోడానికి కూడా నా చేతిలో ఒక్కటంటే ఒక్క పెన్నీ కూడా లేదు. న్యూస్ పేపర్లమ్మాను. గుర్రాలను మేపాను. కార్లు తుడిచాను. తోపుడు బండి వాడికి సహాయకుడిగా పనిచేశాను. వారంలో ఒకసారి నాకు చేయడానికి పనేమీలేని ఒకరోజు నేనేమీ తినలేదు. ఒక యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ ఎదుట మెహర్బానీ ప్రదర్శించాలని, నాకు ఆరు పెన్నీలిచ్చాడు– అది నా అదృష్టం. ఆ డబ్బుకూడా ప్రయోగాల కోసమే ఖర్చుపెట్టాను. చివరకు, సిలిండరును పక్కకు తీసి స్క్రూలను ఊడదీశాను. నుసిగా మారిన పొడిని ఉలితో గోకి, ఒక ఇనుప పళ్లెంలోకి చేర్చి సుత్తితో బాగా కొట్టాను. ఇంకా నేను అనుసరించిన కొన్ని ప్రక్రియల తరువాత, చివరకు మూడు పెద్ద సైజు వజ్రాలు, అయిదు చిన్నపాటి వజ్రాలు తయారయ్యాయి.నేను నేలమీద కూర్చొని సుత్తితో బాదుతున్న సమయంలో, నా గది వాకిలి తెరుచుకొని నా పొరుగునున్న డాక్యుమెంట్ రైటర్ లోపలికొచ్చాడు. అతడు మామూలుగానే తాగిన మైకంలో ఉన్నాడు. తలుపుకానుకొని నిల్చుని ‘నువ్వు ఈ ఇంటిని బాంబులు పెట్టి పేల్చాలని చూస్తున్నావు. ఇప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తున్నాను.’ అంటూ ఏదేదో వదరుతూనే ఉన్నాడు. నేనప్పటికే జాగ్రత్త పడివున్నాను. నా ఈ రహస్యం పోలీసులకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇన్నేళ్లు నేను పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరై పోతుందనుకొంటూ, ఆ డాక్యుమెంట్ రైటర్ గాడి కాలరు పట్టుకొని, కిందపడేసి తొక్కాను. తరువాత వజ్రాల్ని పోగుచేసుకొని బయటికొచ్చేశాను. పేరుపొందిన నగల వ్యాపారస్తుని వద్ద కెళ్ళాను. అతడు నన్ను కొంచెం సేపు వేచి ఉండమని చెప్పి, పోలీసులను పిలవమని గుమాస్తాతో గుసగుసలాడడం గమనించి, నేను అప్రమత్తమై ‘వేచివుండలేన’ని చెప్పి అక్కడి నుంచి బయట పడ్డాను. దొంగ నగలు కొనుక్కొనే ఒక దుర్మార్గుడు తారసపడ్డాడు. పరిశీలించడానికని అతని చేతికి ఒక వజ్రమిచ్చాను. వాపసిమ్మని అడిగితే, పోలీసులకు పట్టిస్తానని బెదిరించాడు.ప్రస్తుతం నా మెడలో వెలకట్టలేని వజ్రాల సంచి కట్టుకొని పిచ్చివాడిలా తిరుగుతున్నాను. అన్నమూ, ఆశ్రయంలేక అలమటిస్తున్నాను. నమ్మతగిన వ్యక్తిగా అనిపించింది మీరొక్కరే. మీ ముఖం నాకు నచ్చింది. ప్రస్తుతం నా పరిస్థితి చాలా దారుణంగా వుంది.’ అంటూ నా కళ్ళల్లోకి చూశాడు దీనంగా. ‘ఇటువంటి పరిస్థితులలో నేను వజ్రాన్ని కొంటానని ఎలా అనుకున్నావు? వందలకు వందలు నేను జేబులో పెట్టుకు రాను. ఇక అసలు విషయానికొస్తే, నువ్వు చెప్పిన కథ నేను పూర్తిగా నమ్మలేదు. అయినా నీకిష్టమైతే రేపు నా ఆఫీసుకొచ్చి కలుసుకో.’ అని చెప్పాను.‘మీరు నన్ను దొంగ అనుకుంటున్నారా? నన్ను పోలీసులకు పట్టించాలనే ఈ ఎత్తు వేశారు. నేను మీ ఉచ్చులో పడను’.‘నువ్వు దొంగవు కాదనే నమ్ముతున్నాను. ఇదిగో నా కార్డు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోనవసరం లేదు. ఎప్పుడైనా కలుసుకోవచ్చు’ అని చెప్పాను.అతను నామాటలు విశ్వసించి వెళ్లిపోయాడు. అదే అతణ్ని కడసారి చూడడం. నేను బయటికెళ్లినప్పుడొకసారి అతడొచ్చాడని,ఆ వ్యక్తి చాలా బలహీనంగా ఉన్నాడని, విపరీతంగా దగ్గుతున్నాడని, ఎటువంటి సమాచారం ఇచ్చివెళ్ళలేదనీ, నా ఆఫీసులో పనిజేసే ఉద్యోగి చెప్పాడు. తరువాత ఆ వజ్రాల బేహారి మళ్ళీ కనబడలేదు. ఒకసారి అతడు– తనకు బ్యాంక్ నోట్లు తప్ప చెక్కులు పంపకూడదని కొన్ని చిరునామాలు ఉటంకిస్తూ – రెండు ఉత్తరాలు రాశాడు. నేను బాగా ఆలోచించాను. అతడు నిజంగా పిచ్చివాడా? గులకరాళ్ళతో వ్యాపారం చేసే మోసగాడా? కృత్రిమ వజ్రాలు తయారు చేసేవాడా? చివరిది నమ్మతగినదిగా వుంది. నేను జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని జారవిడుచుకొన్నాననిపిస్తుంది. అతనేమై ఉంటాడా? అని ఆలోచించాను. బహుశా అతను మరణించి ఉంటాడు. అతడు మేధను మథించి, కడుపుకట్టుకొని సృష్టించిన అమూల్యమైన వజ్రాలు నేలపాలైవుంటాయి. వాటిలో నా బొటనవేలి ఊర్ధ్వ భాగమంత భారీ వజ్రం కూడా ఉంటుంది. లేకుంటే అతనింకా మెడలో హారంగా ధరించి, అతన్ని అనుమాన దృక్కులతో చూసే ప్రజలకు, వజ్రాలను అమ్మడానికి నిరర్థక ప్రయత్నం చేస్తూ వీధులవెంబడి తిరుగుతూవుంటాడు. నా తెగింపు లేని తనాన్ని తిట్టుకొంటూ వుంటాడు.ఏళ్లతరబడి దరిద్రమనుభవించి, అతడు ఎంతో విలువైన వజ్రాలు తయారు చేశాడు. కానీ వాటివల్ల కించిత్తు కూడా లబ్ధి పొందలేక పోయాడు. నేను ఒక్కొక్కసారి అనుకొంటుంటాను– అతనడిగిన వంద పౌండ్లు కాకపోయినా, కనీసం ఐదు పౌండ్లు చెల్లించే ధైర్యం చేసి వుండాల్సిందని. ఇంగ్లిష్ మూలం : హెచ్.జి. వెల్స్ అనువాదం: శొంఠి జయప్రకాష్ -
మానుకైనా వస్తుంది
కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా.. అంటారు. మానులకు వచ్చే కష్టాల గురించి మనకు తెలియక అలా అనుకుంటామేమో మరి. మానులకు కష్టాలు వస్తాయా లేదా అనే మాట అంటుంచితే మానుల వల్ల మనుషులకు వచ్చే కష్టాలు తక్కువే. ఏవో విపత్తులు, విలయాలు సంభవించి మానులు విరిగిపడితే తప్ప మనుషులకు కష్టాలు రావు. అందుకే మనిషికి కష్టం వచ్చిందంటే అది మనిషి వల్లనే అయి ఉంటుంది. ఎంత మంది మనుషులున్నారో, మనుషుల వల్ల మనుషులకు అన్ని రకాల కష్టాలు వస్తుంటాయి. కష్టాల పాలయ్యే మనుషుల గురించి, కష్టాల పాల్జేసే మనుషుల గురించి కొత్తగా చెప్పుకోడానికి ఎప్పుడూ ఏమీ ఉండదు. ఫ్రెష్గా అప్పటికప్పుడు పడిపోయినప్పుడు తెలుసుకోవడమే. కష్టం అనేది చిన్న మాట. ఇందులో తీవ్రతలు ఉంటాయి. కష్టాన్ని తట్టుకునే మనిషిని బట్టి ఆ తీవ్రతలు కొద్దివో, పెద్దవో అవుతుంటాయి తప్ప, తీవ్రతకు కొలబద్ద అంటూ ఏమీ ఉండదు. బతకలేకపోవడం అన్నిట్లోకీ పెద్ద కష్టం. డబ్బు లేక బతకలేక పోవడం, ఆరోగ్యం లేక బతకలేకపోవడం, అవమానం తట్టుకోలేక బతకలేకపోవడం, ఆత్మగౌరవం దెబ్బతిని బతకలేకపోవడం.. ఇవన్నీ పెద్ద కష్టాలే. ముఖ్యంగా ఆడపిల్లలు. రక్షణ ఉండాలి వాళ్లకు. అది లేకపోవడం బతకలేకపోవడాన్ని మించిన కష్టం. కొద్దిరోజులుగా వింటున్నాం. జగత్తుకు ఏ చీడో పట్టినట్లు అన్నీ అత్యాచారాల ఘటనలే. అడవిలో మానుల్ని కూడా వదిలిపెట్టేలా లేదు ఈ చీడ. మామూలుగా.. కష్టపడిన వాళ్లపై సానుభూతి ఉంటుంది. కష్టపెట్టినవాళ్లపై కోపం ఉంటుంది. తప్పు ఎటుందీ అని కాకుండా, కష్టం ఎటుందీ అనే దాన్ని బట్టే లోకంలో తీర్పులు ఉంటాయి. తప్పులేదు. తాత్కాలికంగా అలాంటి తీర్పులు అవసరమే. ‘జాగ్రత్తగా లేకపోవడం నీ తప్పే’ అని.. కష్టంలో ఉన్నవాళ్లను ఇంకా కష్టపెట్టలేం కదా. అలాగని జాగ్రత్త చెప్పకుండా ఉండడం కూడా కష్టంలోకి నెట్టడమే అవుతుంది. ఒక అమ్మాయికి కష్టం వచ్చిందంటే అందులో ఆమె కొని తెచ్చుకున్న కష్టం కూడా కొంత ఉంటుందని మమతా మోహన్దాస్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈ మాట ఎవరికీ రుచించలేదు. ‘అందమైన లోకమనీ, రంగురంగులుంటాయని’ నమ్మడం ఆడపిల్ల తప్పెలా అవుతుందని అన్నారు. నిజమే కానీ ఆ రంగుల మధ్య మగవాడి అసలు రంగును పోల్చుకోలేకపోవడం ఆడపిల్ల తప్పే అవుతుంది. – మాధవ్ శింగరాజు -
సినిమా కష్టాలు
-
పాల కోసం కష్టాలపాలు
తుని రూరల్: కాసిని పాల కోసం ఆశపడ్డ ఆ పిల్లి.. ‘తన శత్రువులైన కుక్కలు కూడా పడకూడదురా దేవుడా!’ అనిపించేంత కష్టాల పాలైంది. చివరికి ఓ మనిషి పుణ్యంతో ‘బతుకు జీవుడా!’ అని తల దక్కించుకుంది. ఆదివారం తుని మండలం హంసవరం శివారు జిల్లేడుపాడులో ఎస్సీ కాలనీవాసులు వంటావార్పు చేసుకుని కూలి పనులకు వెళ్లిపోయారు. ఆ సమయంలో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో చొరబడ్డ ఓ పిల్లి పాల కోసం వెతుకులాడుతూ..ఓ చెంబులో తల దూర్చింది. చెంబులో తల ఇరుక్కుపోవడంతో ‘మియాం.. మియాం..’ అంటూ ఎంత గింజుకున్నా నొప్పి తప్ప విముక్తి లభించలేదు. కాసేపటికి అటుగా వెళుతున్న అప్పారావు అనే వ్యక్తి దాన్ని గమనించాడు. ‘అయ్యో! పాపం.. పిల్లి!’ అనుకుని జాలిపడ్డాడు. చెంబు పట్టుకుని పైకి లేపి, ఒడుపుగా లాగడంతో పిల్లి తలతో సహా చెంబు నుంచి జారిపడి, ఉరుక్కుంటూ పోయింది. -
కష్టాలు వింటే కంటనీరొస్తుంది
నెల్లూరు జిల్లా: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టాలు వింటుంటే కంటనీరు వస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మనుబోలు మండలం ధాన్యం కేంద్రంను కాకాణి శుక్రవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా మంత్రి సోమిరెడ్డి వల్లనే రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్ల దగ్గర మంత్రి సోమిరెడ్డి ముడుపులు తీసుకుని రైతులకు కన్నీళ్ళు పెట్టిస్తోన్నాడని ధ్వజమెత్తారు. రైతులు 6 లక్షల టన్నుల బీపీటీ ధాన్యం అమ్మేసిన తర్వాత మంత్రి సోమిరెడ్డి ధాన్యం ధర పెంపు అంటూ ప్రకటన చేయటం సిగ్గుచేటన్నారు. జిల్లా యంత్రాంగం సోమిరెడ్డి మాటలు విని మిల్లర్లపై చర్యలకు వెనుకాడిందని వ్యాఖ్యానించారు. రైతులను బాధించే సోమిరెడ్డిని, రైతు బాంధవుడంటారా అని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో సోమిరెడ్డి వైఫల్యం చెందాడని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ప్రకటించిన ధర కూడా రాకపోవడానికి సోమిరెడ్డి అవినీతే కారణమని ఆరోపించారు. సోమిరెడ్డి ప్రకటనలు చూస్తుంటే,దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగినట్టుందని ఎద్దేవా చేశారు. మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే అధికార యంత్రాంగం, చోద్యం చూస్తుందని విమర్శించారు. -
మధ్యలో ఎక్కడినుంచి వచ్చింది?
ఒక ఊళ్లో ఒకాయన ఉండేవాడు. ఆయనకు విపరీతమైన కోపం. ప్రతిదానికీ ఇంట్లోవాళ్ల మీదా, బయటివాళ్ల మీదా అరిచేవాడు. ఈ కోపగొండి స్వభావం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. దాన్ని తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు ఒక స్నేహితుడి సలహా మీద, ఒక ఊళ్లో ఒక గురువును సంప్రదించడానికి వెళ్లాడు. గురువు శాంతంగా కూర్చునివున్నాడు. చేతులు జోడించి నమస్కరించి, ‘గురూజీ, నన్ను నేను నియంత్రించుకోలేనంత కోపం వస్తుంటుంది నాకు. అది తగ్గడానికి ఏమైనా పరిష్కారం సూచించండి’ అని అడిగాడు. గురువు ఎంతో మృదువుగా, ‘నీ సమస్య విచిత్రంగా ఉన్నదే! ఏదీ, నన్నో సారి చూడనీ’ అన్నాడు. అతడికి అర్థం కాలేదు. అయోమయంగా ముఖం పెట్టి, ‘అంటే నేను దాన్ని ఇప్పుడు మీకు చూపలేను’ అని చెప్పాడు. ‘మరి నాకు ఎప్పుడు చూపగలుగుతావు?’ అడిగాడు గురువు అంతే మెత్తగా. ఆయన ముఖంలో ఏ వ్యంగ్యమూ లేదు. ‘అంటే... అది నాకు అనూహ్యంగా వస్తుంది’ అన్నాడతను. ‘ఊహూ. అట్లా అయితే అది నీ అసలైన స్వభావం కాదన్నమాట’ వివరించే ధోరణిలో చెప్పాడు గురువు. ‘అది నీ అసలైన స్వభావమే అయితే నాకు ఎప్పుడంటే అప్పుడు చూపగలిగేవాడివి. ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు అది నీ దగ్గర లేదు. దీని గురించి ఆలోచించు’. -
దప్పిక తీరే దారేది..!
బజార్హత్నూర్(బోథ్): ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. జిల్లాలో భూగర్భ జలమట్టం అడుగంటిపోతోంది. గుక్కెడు నీటి కోసం జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. పశువులు, మూగజీవాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాగులు, కుంటలు ఎండిపోవడంతో దాహార్తి తీరక అల్లాడిపోవాల్సి వస్తోంది. పశువుల దప్పిక తీర్చేందుకు ప్రభుత్వం గ్రామాల్లో నీటితొట్టిల నిర్మాణానికి గతంలో నిధులు మంజూరు చేసింది. నిర్మాణ బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులకు అప్పగించింది. గుత్తేదారులు, సదరు నేతలు ఇష్టానుసారంగా నీటితొట్టిలు నిర్మించి వదిలేశారు. ఉపాధి హామీ అధికారుల పర్యవేక్షణ లోపించడం, సరైన ప్రణాళికలు లేక నీటి సౌకర్యం లేని చోట నిర్మాణాలు చేపట్టారు. దీంతో అవి మూగజీవాల దాహార్తి తీర్చడం లేదు. 576 నీటితొట్టిల నిర్మాణానికి నిర్ణయం.. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోని గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 576 నీటితొట్టిలు నిర్మించాలని నిర్ణయించారు. గతంలో ఒక్కో నీటితొట్టి నిర్మాణానికి రూ.18వేల చొప్పున ప్రభుత్వం రూ.1.36 కోట్లు మంజూరు చేసింది. నాసిరకంగా నిర్మించడం, నీటి సదుపాయం కల్పించకపోవడంతో చాలా గ్రామాల్లో వృథాగా మారాయి. జిల్లా మొత్తంలో ఇప్పటివరకు దాదాపు 320 నీటితొట్టిలు మాత్రమే నిర్మించినట్లు తెలుస్తోంది. మరో 56 నిర్మాణంలో ఉండగా, మిగతా 200 నీటితొట్టిల నిర్మాణం ఇంకా మొదలే కాలేదు. పశుసంవర్థక శాఖ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మొత్తం 5.45లక్షల వరకు ఉన్నాయి. వీటికి వేసవిలో నీటి సదుపాయం కల్పించాలంటే గ్రామాల్లోని నీటితొట్టిలను వినియోగంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. అవసరం లేని చోట నిర్మించడం, నీటి సదుపాయం లేని ప్రాంతాల్లో నిర్మించినవి నిరుపయోగంగా మారడం వల్ల పశువుల దాహార్తి తీరడం లేదని జిల్లా రైతులు వాపోతున్నారు. పంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగే బోర్ల నుంచి తొట్టిలకు నీరు సరఫరా చేయాల్సి ఉండగా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో మేతకు వెళ్లిన పశువులు దాహార్తి తీర్చుకోవడానికి తొట్టి వద్దకు వచ్చిన నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి. వేసవి దృష్ట్యా అవసరం ఉన్న చోట మూగజీవాలకు నూతనంగా నీటితొట్టెల నిర్మాణం చేపట్టేలా దృష్టి సారించాలని గత నెల 11న కలెక్టర్ డి.దివ్యదేవరాజన్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధికారులను ఆదేశింంచారు. ఉపాధి మామీ పథకం ద్వారా గతంలో 576 నీటితొట్టిలకు నిధులు మంజూరైనా అందులో నిర్మించకుండా ఉన్న 200 నీటితొట్టిల నిర్మాణానికి ప్రస్తుతం ఒక్కో నీటితొట్టికి రూ.24 వేలు పెంచి మళ్లీ నిధులు మంజూరు చేశారు. అయినా ఉపాధి హామీ అధికారులు వాటి నిర్మాణాలపై దృష్టి సారించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మూగజీవాలపై నిర్లక్ష్యం.. వేసవి నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న నీటితొట్టిలను వినియోగంలోకి తేవాలి. పశుసంవర్థకశాఖ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ అధికారుల ఎవరికి వారు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నీటితొట్టికి బోరు ఏర్పాటుతోపాటు విద్యుత్తు కనెక్షన్ కల్పించడంలో దృష్టి సారించడం లేదు. నోరులేని మూగజీవాలపై గ్రామ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రతను తట్టుకోలేక ప్రజలు బెంబేలెత్తుతుంటే రానున్న రెండు నెలల్లో ఈ తీవ్రత మరింత పెరిగి మూగజీవాలకు ముప్పు తిప్పలు తప్పవని వాపోతున్నారు. ఉపయోగంలోకి తేవాలి వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా వాగులు, చెలిమెలు, కుంటలు ఎండిపోతున్నాయి. మేతకు వెళ్లిన పశువులకు దాహార్తి తీర్చడం కష్టంగా మారింది. అక్కడక్కడ బురుద నీళ్లు తాగుతున్నాయి. గ్రామాల్లో నిర్మించిన నీటితొట్టిలు మరమ్మతు చేసి ఉపయోగంలోకి తేవాలి. వేసవిలో నీళ్లు దొరకక పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. – సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్ వేదిక జిల్లా అధ్యక్షుడు దాహార్తి తీర్చడంపై దృష్టి సారించాం జిల్లాలో 18 మండలాల్లో గతంలో నిర్మించిన నీటితొట్టిలను వినియోగంలోకి తెస్తాం. నిరుపయోగంగా ఉన్న నీటితొట్టిలను మరమ్మతులు చేయించడమే కాకుండా అవసరం ఉన్న గ్రామాల్లో నూతనంగా నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తాం. ఇప్పటికే పంచాయతీల వారీగా నీటితొట్టిల వివరాలను సేకరిస్తున్నాం. వేసవిలో మూగజీవాలకు తాగునీటి సమస్య కలగకుండా ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపడతాం. – రాజేశ్వర్ రాథోడ్, డీఆర్డీఏ పీడీ -
కువైట్లో రాష్ట్రవాసుల కష్టాలు తీర్చండి
సాక్షి, హైదరాబాద్: కువైట్లో తెలంగాణవాసులు 50వేల మందికి పైగా ఇబ్బందులు పడుతున్నారని, ఆ దేశ అంబాసిడర్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్కుమార్ చెప్పారు. సొంత దేశానికి వచ్చేందుకు, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని భారత్కు రప్పించాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కువైట్కు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపించాలని, ప్రభుత్వ ఖర్చులతోనే బాధితులను రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. కువైట్ నుంచి వచ్చినవారికి ప్రభుత్వం ఉపాధి, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇతర దేశాల్లో ఉన్న ప్రవాసుల గురించి తమ మేనిఫెస్టోలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన సీఎం కేసీఆర్ ఆ హామీలను విస్మరించారని విమర్శించారు. మంత్రుల గల్ఫ్ పర్యటనలన్నీ జల్సాలకు, బతుకమ్మ సంబరాలకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. ఎన్నారై పాలసీ రూపొందించడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో గల్ఫ్ బాధితుల సంక్షేమ చట్టాన్ని రూపొందించాలని, రూ.వెయ్యి కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్నారు. గల్ఫ్ బాధితులకు సాయం అందించేందుకు టీపీసీసీ నుంచి ఓ బృందం గల్ఫ్ వెళ్లనుందని, వారి బాధితుల సమస్యలపై సీఎం కేసీఆర్కు లేఖ రాసినట్లు చెప్పారు. -
ఏప్రిల్ 1న సీపీఐ 2వ రాష్ట్ర మహాసభలు-చాడ వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ 2వ మహాసభలను వచ్చే ఏడాది ఏప్రిల్ 1న హైదరాబాద్లో నిర్వహించను న్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో మహాసభలను నిర్వహిస్తున్నామని, ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభలను విజయవంతం చేయా లని ఆయన పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపు ఇచ్చారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. దేశంలో సంఘ్ పరివార్ అరాచకాలు ఎక్కువ అయ్యాయని, పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కేంద్ర ప్రభుత్వ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందని విమ ర్శించారు. 56 రోజులపాటు పోరుబాట చేపట్టామని, ఈ కార్యక్రమంలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. తెలంగాణలో ఉద్యమ పార్టీగా సాగుదామని చాడ పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. అవి ప్రభుత్వ హత్యలే!: డీవైఎఫ్ఐ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలు రావడం లేదని నిరుద్యోగులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) పేర్కొంది. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదనే ఓయూలో మురళి, నిర్మల్ పట్టణంలో భూమేశ్ ఆత్మహత్యలకు పాల్పడ్డారని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.విప్లవ్కుమార్, ఎ.విజయ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఓయూ విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీని ఖండిస్తున్నామని, దీనికి నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. -
బారు.. జోరు..
సాక్షి ప్రతినిధి, వరంగల్: వైన్షాప్ టెండర్కు రూ.లక్ష వెచ్చించి దరఖాస్తు చేయడం, వందలాది మందితో పోటీపడి లైసెన్సు దక్కిం చుకున్నా అది రెండేళ్లపాటే ఉంటుండటంతో మద్యం వ్యాపారులు ఇబ్బందులు పడుతు న్నారు. ఈ క్రమంలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎలైట్ బార్’ విధానంతో లాభాల బాటలో పయనిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 820 బార్లకు 2009లో లైసెన్సులు మం జూరు చేశారు. అప్పటి నుంచి ఏటా వీటినే రెన్యువల్ చేస్తూ పోతున్నారు. దీంతో కొత్తగా మద్యం వ్యాపారంలోకి వచ్చే వారికి వైన్షాపులే దిక్కుగా మారాయి. ఇటీవల కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా 2,215 వైన్ షాపులకు లైసెన్సులు జారీ చేశారు. షాపులకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో దరఖాస్తు ధరను ఏకంగా రూ. 25,000 నుంచి రూ. లక్షకు పెంచారు. అయినా డిమాండ్ తగ్గలేదు. సగానికి పైగా షాపులకు పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వీటి ఫలితంగా లైసెన్సుల జారీ ద్వారా రూ. 1,274 కోట్లు ప్రభుత్వ ఖజానాలో చేరితే.. దరఖాస్తుల ద్వారానే రూ. 420 కోట్ల ఆదాయం వచ్చింది. లైసెన్సు ఫీజులో నాలుగో వంతు ఆదాయం వీటి ద్వారానే వచ్చింది. ఈజీగా ఎలైట్.. సాధారణ బార్ లైసెన్సు ఫీజు కంటే 25 శాతం అధిక ఫీజుతో ఎలైట్ బార్లకు లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. ఈ బార్ పొందాలను కుంటే నేరుగా ఎక్సైజ్శాఖ మంత్రికి దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు దరఖాస్తు వస్తుంది. ఎలైట్ బార్ పెట్టేందుకు అనువైన మౌలిక సదుపా యాలు ఉన్నట్లుగా నిర్ధారించి, దరఖాస్తుదారుడి వ్యక్తిగత సమాచారంపై సంతృప్తి చెందితే లైసె న్సు మంజూరు చేయవచ్చు. డిమాండ్ను బట్టి ఒక ఏరియాకు ఎన్నైనా ఎలైట్ బార్లను మం జూరు చేసే వెసులుబాటు ఉంది. దీంతో కొత్తగా మద్యం వ్యాపారంలోకి రావాలనుకునేవారు వీటి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిబంధనలకు నీళ్లు ఎలైట్ బార్ ఏర్పాటు చేయాలంటే కనీసం పది వేల చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఇందులో 2 వేల చ.అడుగుల స్థలం కేవలం మద్యం డిస్ప్లేకు కేటాయించాలి. సెంట్రల్ ఏసీ, సువిశాల పార్కింగ్ సౌకర్యాలు తప్పనిసరి. విదేశీయులకు అసౌకర్యం లేని విధంగా సదుపాయాలు ఉన్నప్పుడు లైసెన్సు మంజూరు చేయాలి. సాధారణ బార్షాప్ లైసెన్సు ఫీజుపై 25 శాతం అదనం చెల్లిస్తే చాలు అధికారులు లైసెన్సులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోందని ప్రతిపక్షాలు అసెంబ్లీలో గొంతు చించుకుంటున్నా.. ఎక్సైజ్శాఖ కొత్త మద్యం దుకాణాలకు లైసెన్సులు మంజూరు చేస్తూ పోతుండటం విమర్శలకు తావిస్తోంది. ఫుల్ డిమాండ్.. ప్రతి 25,000 మంది జనాభాకు ఒక బార్షాప్ను కేటాయించాలని ఎక్సైజ్ నిబంధ నలు ఉన్నాయి. ఈ లెక్కన 8 లక్షల జనాభా ఉన్న వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 30 నుంచి 35 బార్షాపులు ఉండాలి. ఇప్పటికే ఇక్కడ 89 బార్లు, 59 వైన్షాపులు ఉన్నాయి. కొత్తగా ఇక్కడ ఎలైట్ బార్లు నెలకొల్పేందుకు పలువురు పోటీ పడుతున్నారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఎలైట్ బార్ కోసం మంత్రి పద్మారావు పేషీలో 50కి పైగా దరఖాస్తులు చేరినట్లు సమాచారం. ఇందులో ఇప్పటికే 4 బార్లకు అనుమతులు వచ్చాయి. కాగా, వరంగల్ కార్పొరేషన్ పరిధిలో మరో మూడు, కరీంనగర్ జిల్లాలో ఒకటి వంతున ప్రాసెస్లో ఉండగా, ఖమ్మం జిల్లా మధిరలో రెండు, నిజామాబాద్, రామగుండం కార్పొరే షన్ల పరిధిలో ఎలైట్ బార్ల కోసం దరఖాస్తులు మంత్రి పేషీకి చేరుతున్నాయి. -
పార్టీల్లో ప్రజాస్వామ్యంపై చర్చించాలి
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యంపై చర్చ జరగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తుకోసం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అభివృద్ధి చెందాల్సిన అవసరముందన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో శనివారం జర్నలిస్టుల కోసం ‘దీపావళి మంగళ్ మిలన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు జర్నలిస్టులతో సమావేశమయ్యారు. ‘రాజకీయ పార్టీలకు నిధులపై చర్చ జరుగుతోంది. వారి విలువలు, సిద్ధాంతాలు, అంతర్గత ప్రజాస్వామ్యం, కొత్త తరానికి వాళ్లెలాంటి అవకాశాలిస్తున్నారనే అంశాలపై చర్చ జరగాలి. రాజకీయ పార్టీల్లోని ప్రజాస్వామ్యంపై ప్రజలకు పూర్తిగా తెలియదు’ అని మోదీ అన్నారు. మాలో సైద్ధాంతిక సామరస్యం ఉంది ‘రాజకీయ పార్టీల్లో అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. ఇది దేశ భవిష్యత్తుకే కాదు.. ప్రజాస్వామ్యానికీ చాలా అవసరం’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఏ పార్టీ పేరునూ ప్రస్తావించనప్పటికీ.. పరోక్షంగా కాంగ్రెస్పైనే మోదీ విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. సోనియా స్థానంలో రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారన్న వార్తల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జనసంఘ్ సమయంలో, బీజేపీ చిన్న సంస్థగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు పార్టీలో కార్యకర్త నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు సైద్ధాంతిక సామరస్యం కొనసాగుతోందని మోదీ గుర్తుచేశారు. ‘స్వచ్ఛ భారత్’ ప్రాజెక్టు విషయంలో మీడియా చాలా సానుకూలంగా వ్యవహరించిందని ప్రశంసించారు. అధికార పార్టీ, మీడియా మధ్య చాలా అంచనాలు, ఫిర్యాదులు ఉంటాయని.. కానీ సానుకూలంగా ఇవన్నీ పరిష్కారమవ్వాలని మోదీ పేర్కొన్నారు. జీఎస్టీతో ఇబ్బందులున్నాయి. కానీ.. తన ప్రసంగంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ కాంగ్రెస్ను విమర్శించారు. ‘కాంగ్రెస్ గుజరాత్లో కులరాజకీయాలకు తెరలేపింది. అది వారికి తీవ్ర నష్టం చేస్తుంది. గుజరాత్లో మేం 150 సీట్లు సాధించి తీరుతాం’ అని పేర్కొన్నారు. జీఎస్టీ వల్ల చిరు, మధ్యతరగతి వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తొలిసారిగా అమిత్ షా అంగీకరించారు. అయినా వారంతా బీజేపీకే ఓటువేస్తారన్నారు. గుజరాత్కు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని వెల్లడించారు. ‘మోదీ నాయకత్వంలో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం’ అని అన్నారు. ప్రతి ఒక్కరికీ పలకరింపు దీపావళి మిలన్ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పత్రికల ఎడిటర్లు, జర్నలిస్టులతో మోదీ గడిపారు. సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ ఆయన మాట్లాడారు. వారితో కరచాలనం చేశారు. సెల్ఫీలు దిగారు. రాజకీయ చర్చల్లేకుండా అందరికీ శుభాకాంక్షలు చెబుతూ కనిపించారు. జర్నలిస్టులు విధినిర్వహణలో భాగంగా.. చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తన ప్రసంగంలో ప్రధాని పేర్కొన్నారు. 17 ఏళ్ల క్రితం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు మీడియాతో తనకున్న సంబంధాలనూ గుర్తుచేసుకున్నారు. ‘పరిస్థితులు మారాయి. మీడియాతో దూరం కూడా పెరిగింది’ అని మోదీ పేర్కొన్నారు. ‘రక్షణ’లో ఫ్రాన్స్ సహకారం అవసరం భారత్లోనే రక్షణ పరికరాల పరిశోధన, అభివృద్ధి, తయారీ విషయాల్లో ఫ్రాన్స్ నుంచి మరింత సహకారం అందాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీతో మోదీ శనివారం సమావేశమయ్యారు. భారత్, ఫ్రాన్స్ల వ్యూహాత్మక భాగస్వామ్యానికి రక్షణ రంగంలో సహకారం ఓ కీలక స్తంభం అని మోదీ అన్నారు. పరస్పర ప్రయోజనం ఉన్న పలు ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలు కూడా మోదీ, పార్లీ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. వీలైనంత త్వరగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ భారత పర్యటనకు రావాల్సిందిగా తాను కోరుకుంటున్నట్లు మోదీ వెల్లడించారు. -
కార్యసాధన అంటే అది..!
కష్టాలు అందరికీ వచ్చినట్టుగానే రాముడికీ వచ్చాయి. అవి చూసి మనం విచలితులమయినట్టుగానే రాముడు కూడా ఓ క్షణంపాటు విచలితుడయ్యేవాడు. ఒక సన్నివేశంలో భార్య కనపడక రాముడు విపరీతమైన శోకానికి గురయిన సందర్భంలో మహర్షి అంటారు–’’ శోకోనాశయతే ౖధైర్యం, శోకో నాశయతేతం, శోకోనాశయతే సర్వం, నాస్తిశోక సమోరిపు’’... అంటే శత్రువులందరిలోకి పెద్ద శత్రువు శోకమే. ఎప్పుౖడనా సరే, నేనిది సాధించలేకపోయానని దుఃఖానికి వపోయాడా ఇక వాడు వృద్ధిలోకి రాలేడు. శోకం మొట్టమొదట ధైర్యాన్ని పోగొడుతుంది. శోకం అంతకుముందు విన్న మంచి మాటలు మర్చిపోయేటట్లు చేస్తుంది. శోకం వలన మనిషి వృద్ధిలోకి రాకుండా పతనమవుతాడు. ఏ మనిషి సాధించగలడు అంటే– ఎవడు నిరంతరం ఉత్సాహంతో ఉంటాడో వాడు జీవితంలో సాధించనిదంటూ ఉండదు. నిరాశావాదాన్ని వదలడం సంపదకు తొలిమెట్టు. నిరాశావాదం నుండి విముక్తి పొందడం నిజమైన ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం, ఏ పని చేయాలన్నా, దానిలో సఫలతపొందాలన్నా, నిరాశావాదాన్ని ఎవరూ ఆశ్రయించ కూడదు. అందుకే మనసు ఎప్పుడూ నిర్వేదాన్ని పొందకూడదు. అదేవిధంగా కార్యసాధకులు ఎలా ఉండాలంటే, అనుక్షణం తమ కార్యసాధన మీదనే దృష్టి పెట్టాలి. నిద్రాహారమైథునాలు మరచిపోవాలి. ఈ పని పూర్తి చేసి అప్పుడు చూసుకుందాంలే అనుకుంటే, అసలు విషయం కాస్తా కుంటుపడుతుంది. సీతాన్వేషణకోసం సముద్రాన్ని లంఘిస్తున్న హనుమకు సేద తీర్చడం కోసం మైనాకుడు సాగర గర్భం నుంచి తల బయట పెట్టాడు. తన మీద కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లమని కోరాడు. అప్పుడు హనుమ, అవకాశం వచ్చింది కదా అని, అదే పనిగా విశ్రాంతి తీసుకోలేదు. తన పాదాన్ని కాసేపు మైనాకుడి మీద మోపాడు. చేతితో భుజాన్ని తట్టాడు. ప్రయాణాన్ని కొనసాగించాడు. కార్యసాధన అంటే అది. కార్యసాధకులు హనుమను చూసి నేర్చుకోవాలి. -
ఇంట్లో తరచు చికాకులా..?
అన్నీ ఉన్నా కొందరికి అల్లుడి నోట్లో శని అన్నట్లు... కొందరి ఇంట్లో నిత్యం ఏవేవో చికాకులు. ఎవరికీ మనశ్శాంతి ఉండదు, అనారోగ్యాలు, అనవసర కోపతాపాలు వంటివి నిత్యకృత్యంగా కొనసాగుతూ ఉంటాయి. ప్రతికూల గ్రహస్థితులు, ప్రతికూల గ్రహాల దశలు జరిగే సమయంలో ఇలాంటి ఇబ్బందులు పట్టి పీడిస్తాయి. అలాంటి వాటి నుంచి ఉపశమనం పొందాలంటే... ♦ చీమలకు ఆహారంగా చీమల పుట్టల వద్ద పంచదార వేయండి. వీలు కుదిరినప్పుడల్లా ఆడపిల్లలకు మిఠాయిలు తినిపించండి. ఈ పనులకు వారం వర్జ్యాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ♦ కుంకుమ, కర్పూరం పొట్లంగా కట్టి, నిద్రించేటప్పుడు తలదిండు కింద పెట్టుకోవడం వల్ల కొంత వరకు చికాకులు తొలగుతాయి. ♦శివాలయంలో నమక చమక పారాయణం చేస్తూ శివలింగానికి జలాభిషేకం చేయండి. ఇలా కనీసం ఇరవై ఒక్క సోమవారాలు కొనసాగిస్తే ఫలితం ఉంటుంది. ♦ఆంజనేయ ఆలయంలో మంగళవారం సిందూరాన్ని, ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి. ఆలయం బయట ఉండే పేదలకు అరటిపండ్లు పంచిపెట్టండి. ♦ బాగా నూనె ఓడుతూ ఉండే పదార్థాలను తినడం పూర్తిగా మానేయండి. ఇంటి ప్రవేశద్వారానికి పసుపురంగు కర్టెన్లు వాడండి. ♦ ప్రతి శనివారం చందనం కలిపిన నలుగుపిండితో స్నానం చేయండి. తర్వాత ఆంజనేయ ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆలయం వద్ద పేదలకు నువ్వుండలను పంచిపెట్టండి. – పన్యాల జగన్నాథదాసు -
ఖతర్లో భారతీయుల వెతలు
ఖతర్తో ఇతర అరబ్ దేశాలు సంబంధాలు తెంచుకున్న ఫలితంగా అక్కడి నిర్మాణ రంగం కుదేలవ తోంది. ఫలితంగా ఆ రంగంలో ఉపాధి పొందుతున్న భారతీయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. పనిలేక... మరోచోట పనిచేయడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖతర్లో ఉండలేక, స్వదేశానికి తిరిగి రాలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 2022 సాకర్ వరల్డ్కప్కు ఖతర్ ఆతిథ్యమిస్తోంది. అందుకోసం స్టేడియాల నిర్మాణంతో పాటు భారీగా మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆంక్షలు అమల్లోకి వచ్చి నెలన్నర రోజులు దాటడంతో నిర్మాణ రంగానికి అవసరమైన మెటీరియల్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సామగ్రి అందు బాటులో లేక నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. సుమారు 20 లక్షల మంది విదేశీ కార్మికులుంటే వీరిలో అత్యధికులు నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారు. ఖతర్ జనాభాలో 90% మంది విదేశీ కార్మికులే. నిర్మాణాలు నిలిచిపోవడంతో కంపెనీలు కార్మికుల్ని దీర్ఘకాలిక సెలవులపై ఇంటికి పంపేస్తున్నాయి. సాధారణంగా ఏడాదికి ఒక నెల సెలవు ఇచ్చే కంపెనీలు ఇప్పుడు ఐదునెలలు సెలవులు ప్రకటించాయి. కంపెనీ స్పాన్సర్డ్ వీసాలపై ఖతర్కు విదేశీ కార్మికులు వెళుతుంటారు. ఆ కంపెనీ పని కల్పిస్తే సరి. లేదంటే మరోచోట పనిచేయడానికి వారికి ఆస్కారం ఉండదు. దీంతో అక్కడ పనిలేక స్వదేశానికి తిరిగి వెళ్తే మళ్లీ రావడం ఆర్థికభారం కావడంతో ఖతర్ లోని విదేశీ కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయా రు. ఇప్పటికే మూడు లక్షల మంది కార్మికులు ఖతర్ను వదిలివెళ్లినట్లు అంచనా. నిర్మాణాలు నిలిచిపో తుండటం తో విదేశీ కార్మికుల ఖతర్ కల చెదిరిపోతోంది. అలాగే ఖతర్ యజమానులు కొందరు సౌదీ అరేబియా లో తమ ఫామ్హౌస్లలో పనిచేయడానికి, పశువుల కాపరులుగా భారతీయ కార్మికుల్ని నియమిం చుకున్నా రు. ఖతర్ వీసాలపై వీరిని తీసుకొచ్చి తాత్కాలిక అనుమతులతో సౌదీలో పనిలో పెట్టుకున్నారు. ఖతర్ దేశస్తులు వెంటనే సౌదీని వదిలివెళ్లాల్సిందిగా ఆదేశించ డంతో యజమాను లు వెళ్లిపోయారు. రోడ్డుమార్గాన్ని మూసివేసినందువల్ల వారి వద్ద పనిచేస్తున్న భారతీయ కార్మికులు దోహాకు వెళ్లడానికి సౌదీ అనుమతించడం లేదు. దాంతో వీరంతా ఆహారం, డబ్బు లేక రోడ్డునపడ్డారు. వీరిని ఇప్పుడు చట్టవిరుద్ధంగా సౌదీలో ఉంటున్న వారిగా పరిగణిస్తారు. ఖతర్లో 6.5 లక్షల మంది భారతీయులు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని ఆరోపి స్తూ ఖతర్తో అన్నిరకాల సంబంధాల్ని తెంచు కుంటున్నట్లు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రయిన్, ఈజిప్టు జూన్ 5న ప్రకటించాయి. ఖతర్కు ఉన్న ఏకైక రోడ్డు మార్గాన్ని సౌదీ అరేబియా మూసివేసింది. పోర్టుల్లో ఖతర్కు వెళుతున్న నౌకలకు ప్రవేశాన్ని నిరాకరించాయి. విమానాలను రద్దు చేశాయి. తీవ్రవాద సంస్థలకు సాయం చేయకూడదని, అల్ జజీరా టీవీ ఛానల్ను మూసివేయాలని.. కొన్ని డిమాండ్లు పెట్టాయి. వీటికి ఖతర్ సమ్మతించడం లేదు. కువైట్ మధ్యవర్తిత్వం కూడా ఫలించలేదు. ఆర్థికంగా బలమైన దేశం కావడంతో ఖతర్ ఈ ఆంక్షల్ని తట్టుకొని.. ఇరాన్, టర్కీల నుంచి ఆహార పదార్థాలు, ఇతర సామగ్రిని తెచ్చుకుంటోంది. ఖతర్లో 6.5 లక్షల మంది భారతీయ కార్మికులు ఉండగా.. వీరు ఏటా రూ. 27 వేల కోట్లు భారత్కు పంపుతున్నారు. నిర్మాణ రంగం కుదేలవడంతో భారతీయ కార్మికులకు పనిలేకుండా పోతోంది. గతంలో చేసిన పనికి వేతనాలు అందక వీరిలో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జోరుగా వడ్డీ దందా
♦ చిరువ్యాపారులు, రైతులే టార్గెట్ ♦ రూ.3నుంచి రూ.10 వడ్డీ వసూలు ♦ అనుమతి లేని ఫైనాన్స్లే అధికం నేరడిగొండ(బోథ్): జిల్లాలో వడ్డీ వ్యాపారుల దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. సామాన్య ప్రజలు, రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీ వసూలు చేస్తూ వారిని దోచుకుంటున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడుతున్న శ్రమజీవులకు అప్పులు ఇచ్చి అధిక వడ్డీ గుంజుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో పాటు ఖరీఫ్ కూడా మొదలైంది. దీంతో తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం, రైతులు సాగు పెట్టుబడుల కోసం ప్రైవేట్ ఫైనాన్స్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ఇష్టారాజ్యంగా వడ్డీ వేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. తోపుడు బండ్లు, చాయ్ హోటళ్లు, పాన్షాప్లు, ఆటోరిక్షాలు, చిన్నచిన్న మెకానిక్ సెంటర్లను టార్గెట్గా చేసుకుని ఫైనాన్స్ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అవసరాలే ఆసరాగా.. ఖరీఫ్ ప్రారంభం కావడంతో రైతులు పంటల పెట్టుబడుల కోసం అల్లాడిపోతున్నారు. సకాలంలో బ్యాంకుల నుంచి పంట రుణాలు అందడం లేదు. రుణమాఫీ డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో కొందరు, జమ అయినా బ్యాంకు నుంచి నగదు అందక కొందరు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు విధి లేక వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో చిన్నవి.. పెద్దవి కలిపి అనుమతులు పొందినవి, పొందనివి 200లకు పైగా ఫైనాన్స్లు ఉన్నాయి. వీరంతా రూ.100కు రూ.3 నుంచి రూ.10 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారని బాధితుల ద్వారా తెలుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో తమ వద్దకు వచ్చిన రైతులకు చెందిన భూముల పత్రాలను తాకట్టు పెట్టుకుంటున్నారు. ఖాళీ బాండ్ పేపర్ల మీద రైతులతో పాటు వారి కుటుంబ సభ్యుల సంతకాలు చేయించుకుని అప్పులు ఇస్తున్నారు. అనుమతి లేకుండా దర్జాగా ఆఫీసులను ఏర్పాటు చేసుకుని తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రైతులకు ఇచ్చే అప్పుల్లో ముందుగానే వడ్డీలను పట్టుకుని మిగతా డబ్బులు చెల్లిస్తున్నారు. రైతులు పంటలు పండగానే మొత్తం డబ్బులను ఒకేసారి కట్టాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఆలస్యమైనా ఇచ్చిన డబ్బులకు మళ్లీ వడ్డీ వసూలు చేస్తున్నారు. అలాగే చిరు వ్యాపారులకు ఇచ్చే డబ్బుల్లోనూ ముందుగానే వడ్డీ తీసుకుని డబ్బులు చెల్లిస్తున్నారు. రోజువారీగా డబ్బులు వసూలు చేస్తుంటారు. దీంతో అప్పులు తీసుకున్న వారి నుంచి 20శాతం ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజలు కూడా తమ పిల్లల చదువుల కోసం వేలాది రూపాయలు చెల్లించలేక వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్తున్నారు. వడ్డీ ఎక్కువైనా సరే అంటూ పిల్లల భవిష్యత్ కోసం అప్పులు తెచ్చుకుంటున్నారు. వడ్డీ భారాన్ని మోయలేక, తిరిగి చెల్లించలేక నానా యాతన పడుతున్నారు. పట్టించుకునేవారేరి? ఈ ఫైనాన్స్లలో చాలావరకు ప్రభుత్వ ఉద్యోగులున్నట్లు సమాచారం. జిల్లాలోని పలు చోట్ల అడ్డాలుగా ఏర్పాటు చేసుకుని అప్పులు ఇస్తున్నారు. ప్రతీరోజు జిల్లాలో కోట్లలో వ్యాపారం సాగుతోంది. ఇంతా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖాలాలు లేవు. లైసెన్సులు లేకుంటే చర్యలు ఎవరైనా లైసెన్సు లేకుండా ఫైనాన్స్ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా అధికవడ్డీలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కేసులు నమోదు చేస్తాం. ఫైనాన్స్ నిర్వహించేందుకు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అనుమతులు కలిగి ఉండాలి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తాం. – వేముల చంద్రప్రభు, డీఎస్పీ, ఉట్నూర్ -
ఇవేమి రహదారులు!
♦ అధ్వానంగా గ్రామీణ రోడ్లు ♦ బురదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ♦ పట్టించుకోని అధికారులు కెరమెరి: రాష్ట్రంలోని అన్ని మారుమూల గ్రామలకు రవాణా సౌకర్యాలు మెరుగు పడుతున్నా ఇక్కడ మాత్రం ఆ జాడలు కనిపించడం లేదు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముందే వర్షాకాలం ఆపై కచ్చా రోడ్లు ఎటూ వెళ్దామన్నా నరకయాతన అనుభవించాల్సిందే. మండలంలో.. నిషాని గ్రామ పంచాయతీకి చెందిన దేవుడ్పల్లి, చింతపల్లి గ్రామాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేక ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు గ్రామాల్లో మొత్తం 55 కుటుంబాల వరకు ఉంటాయి. 286 మంది జనాభా నివసిస్తున్నారు. అయితే ఇందాపూర్ వరకు బీటీ రోడ్డు ఉన్నప్పటికీ ఇందాపూర్ నుంచి దేవుడ్పల్లి వరకూ బీటీ వేయలేదు. అది కేవలం ఒక కిలో మీటరు మాత్రమే ఉన్నప్పటికీ నిధుల లేమితో ఇక్కడ పనులు నిలిచిపోయాయని సమాచారం. గతంలో చాలా సార్లు తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులను, నాయకులు వేడుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని వాపోతున్నారు. ‘ఉపాధి’ నిధులతో కలగని మోక్షం.. గతంలో మండలానికి సుమారు కోటి రూపాయలతో ఉపాధి హామీలో రోడ్లు మంజూరయ్యాయి. కాని ఈ గ్రామాలకు మాత్రం మోక్షం కలగలేదు. అధికారులకు గుర్తుకు రాలేదో.. మనకెందుకులే అనుకున్నారో ఏమో తెలియదు గాని బీటీ రోడ్లు మంజూరు కాలేదు. వర్షాకాలంలో రోడ్లన్ని బురదగా మారి నడిచేందుకు యోగ్యంగా లేకుండా పోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో రోడ్లపై మొరం వేసినప్పటికీ అది ఎంతో కాలం నిలవడం లేదు. వర్షం వస్తే మళ్లీ గుంతలమయంగా మారుతున్నాయి. రోడ్లకు ఇరువైపులా పొలాలు ఉండడంతో పాములు, తేళ్లు తిరుగుతున్నాయి. రాత్రుళ్లు రైతులు అటుగా వెళ్తే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అధికారులు తక్షణమే స్పందించి తమ గ్రామాలకు మిగిలి ఉన్న రోడ్లకు బీటీ వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపించాం గతంలోనే ఆయా గ్రామాలకు బీటీ రోడ్ల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. అయితే దేవుడ్పల్లి రోడ్డుకు నిషాని కనెక్ట్ రోడ్డు కోసం ప్రతిపాదనలు చేశాం. మరోవైపు ఆ గ్రామం పునరావాసం కింద వేరే ప్రాంతానికి వెల్లేదుంది. – ఆత్మారాం, పీఆర్ఏఈ, కెరమెరి -
సొట్ట బుగ్గల కారు
నాన్న కొన్న కార్ బుజ్జిది! అందంగా ఉంటుంది! రోజూ కడుగుతాడు! ఒక పాలిష్ డబ్బా కూడా కొన్నాడు! రోజూ మెత్తటి బట్టతో కారును తోముతాడు! కార్ బాడీ మీద తన ముఖం కనబడే వరకు తోముతాడు! ఆ తరువాత దాని మీద ఒక కవర్ వేసి ఇంట్లోకి వస్తాడు! ఆ కారు కొని ఐదేళ్లయ్యింది! మా అమ్మను చేసుకుని పాతికేళ్లయ్యింది! నాకు కార్ నడపడం వచ్చు. కానీ ఇప్పటిదాకా నాన్న కార్ను నడపలేదు! నేను నడుపుతాను... అంటే నాన్న టెన్షన్ పడతాడని తెలుసు! ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని ఎప్పుడూ అడగలేదు! అప్పుడెప్పుడో ఓ సారి... ‘నేను కారు నేర్చుకోవాలి’ అని చెప్పా! నెక్ట్స్ డే ఇంటి ముందు కార్ డ్రైవింగ్ స్కూల్ బండి ఒకటి నా కోసం రెడీగా ఉంచాడు! అమ్మ అడిగింది ‘మన కార్లో నేర్చుకోవచ్చు కదా?’ అని. తింటున్న బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో చేతులు కడిగేశాడు. అమ్మ ఊరుకుంటుందా!? వెనకాలే వెళ్లింది. అమ్మ వస్తుందని తెలిసి న్యూస్ పేపర్లో ముఖం దాచుకున్నాడు నాన్న. ‘ప్రపంచంలో అన్ని వార్తల్నీ చదివేయాలని డిసైడ్ చేసుకున్నట్టున్నారు!’ అని అమ్మ రెట్టించింది.నాన్న దగ్గర నుంచి ఉలుకూ పలుకూ లేదు. తలను ఇంకా లోతుగా పేపర్లోకి దూర్చాడు. ‘అమ్మాయికి కార్ నేర్పిస్తే మీ కారేమయినా అరిగిపోతుందా?’ అమ్మ విషయాన్ని వదలడం లేదు. నాన్న లేచి బాత్రూమ్లో దూరాడు. అమ్మ బాత్రూమ్ డోర్ బయట నిలబడి అడిగింది. ‘కడుక్కుంటే పోదు బాధ్యత’ లోపల్నుంచి సౌండ్ లేదు. ‘మరి ఎందుకు కన్నట్టో...?’ నో రెస్పాన్స్ ఫ్రమ్ డాడీ. ‘పడితే రెండు గీతలు పడతాయి...!’ లోపల్నుంచి ట్యాప్ మూసిన సౌండ్... ‘మా అమ్మోళ్లిచ్చిన నగలు అమ్మిపెడతా... దానికి కారు నేర్పించండి’ బాత్రూమ్ డోర్ ఓపెన్ అయింది, చెమటలు కక్కుతూ నాన్న ఇంటి బయట గార్డెన్లోకి వెళ్లాడు. అమ్మ ఫాలో అయింది. నాన్న వేప చెట్టు ఆకులు మెల్లగా ఒకటొకటి తెంపడం మొదలు పెట్టాడు. ‘దానికి ఉండదా... నాన్న నేర్పించాడని చెప్పుకోవాలని..?’ అడిగింది అమ్మ. టెన్షన్లో రెండు రెండు ఆకులు తెంపడం మొదలు పెట్టాడు నాన్న. ‘కార్ మీద ఉన్న ప్రేమలో 10 పర్సెంట్ అమ్మాయి మీద ఉంటే బాగుండేది’. కింద ఉన్న కొమ్మ బోసి పోయింది, టెన్షన్లో నాన్న స్టూల్ తెచ్చుకుని మరీ పైన ఉన్న ఆకులు తెంచడం మొదలు పెట్టాడు. ‘ఎవడో పరాయోడి పక్కన కూర్చుని కారు నేర్చుకోవాలి’. మళ్లీ రెండు రెండు ఆకులు రెట్టింపు స్పీడ్లో నాశనం అయిపోతున్నాయి. ‘ఇది తెలిస్తే దానికి పెళ్లెలా అవుతుంది? పరాయివాడితో పెళ్లి కాకుండా కారు నేర్చుకుంటే సమాజం ఏమంటుంది? ఆలోచించారా!’’ అమ్మ కొట్టిన పాతచింతకాయ పచ్చడి డైలాగ్కి నాన్న ఢమాల్.కొమ్మ విరిగింది. నాన్న కింద పడ్డాడు. అమ్మ పట్టుకుంది.ఆర్గ్యుమెంట్ ఆగిపోయింది! ఇద్దరూ కలిసి కింద పడ్డ ఆకులన్నీ ఏరడం మొదలు పెట్టారు. చిన్న చిన్న గొడవలతో ప్లేట్లు పడేసినా అంతే... ఇద్దరూ కలిసి సర్దుకుంటారు వాటిని. వీళ్ల సంసారంలో గొప్ప సర్దుబాటు అదే. తప్పు ఎవరిదైనా దిద్దు ఇద్దరిదీ. నాన్నకు నేనంటే ప్రేమ లేక కాదు. కారంటే ప్రీతి!. చాలా కష్టపడి పైకి వచ్చాడు. మంచి నీళ్లు, ఒక అరటిపండు తిని మా కోసం డబ్బులు దాచి పెట్టాడు. తన తమ్ముళ్లను కూడా చదివించాడు. ఒక చెల్లెలికి పెళ్లి చేశాడు. ఈ చిన్న ఇల్లు కూడా కూడబెట్టి కూడబెట్టి కట్టాడు! కాదు, కూడబెట్టింది నాన్న! నిలబడి కట్టించింది అమ్మ!గృహప్రవేశానికి నాన్న బంధువులు ఎవరూ రాలా! నాన్న సంపాదనతో చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు కదా, టైమ్ దొరకలా! నాన్న ఏడ్చాడు! చిన్న పిల్లాడిలా ఏడ్చాడు! ‘నేను, సాత్విక ఉన్నాం కదా..! ఎందుకు బాధ పడతారు, మీ తమ్ముళ్లకు, చెల్లెలికి మీరంటే ప్రేమ లేక కాదు. వాళ్లకూ పనులుంటాయిగా అని సర్దిచెప్పింది.’ చొక్కా ఎత్తుకుని కళ్లు తుడుచుకున్నాడు. నాన్నకు ఇప్పుడు 58 ఏళ్లు. మొన్ననే రిటైర్ అయ్యాడు. నేను కారు నేర్చుకుని... ఆ తరువాత ఇంకా ఎన్నో నేర్చుకుని అమెరికాకి వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాను. ఇప్పుడు నాన్నతో వాట్స్ యాప్లో రెగ్యులర్గా టచ్లో ఉంటున్నాను. మొన్న నాన్న కారు ఫొటో పెట్టాడు. అన్నీ సొట్టలు! నిండా గీతలే!! ఒక లైట్ పగిలిపోయింది. ఆ సొట్టలు పడ్డ కారు పక్కన... సొట్ట బుగ్గలేసుకుని ఫుల్గా నవ్వుతూ అమ్మ నిలబడి ఉన్న ఫొటోని కూడా పంపించాడు నాన్న! ఆ ఫొటో కింద నాన్న మెసేజ్! ‘అమ్మకు కారు నడపడం నేనే నేర్పించా...’ ఇదీ... మా అమ్మానాన్నల సంసారం, మా అమ్మ కోసం అన్నీ వదిలేసుకుంటాడు నాన్న. నాన్నకు మా అమ్మ ఎప్పటికీ చిన్న పిల్లే. నేను ఆ వేప చెట్టు కింద పూల కుండీని. సినిమాలో సంసారం సైకిల్ నడపడమంటే మామూలు విషయం కాదమ్మా రఘురామన్ (ప్రకాశ్రాజ్), అను(ఐశ్వర్య) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వారి కూతురు అభి (త్రిష). కూతురంటే నాన్నకు పంచ ప్రాణాలు. మూడేళ్లకు అభిని స్కూల్లో చేరుద్దామని భార్య అంటే.. ‘అప్పుడే ఏంటి తొందర’ అంటూ వద్దని వారిస్తాడు. చివరకు ఎలాగో, కొంత అయిష్టంగానే సరే అంటాడు. ప్రతి రోజూ తన జీపులో కూతుర్ని ఉదయం స్కూల్కి తీసుకెళ్లి, సాయంత్రం తీసుకొస్తుంటాడు. తన ఫ్రెండు సైకిల్లో స్కూల్కి వెళుతోందని తానూ అలాగే వెళతాననీ, సైకిల్ కావాలంటుంది అభి. కూతురి ఇష్టాన్ని అను సపోర్ట్ చేస్తే రఘురామన్ కుదరనే కుదరదు... అని మొండికేస్తాడు. అలకల తర్వాత తప్పనిసరయ్యి సైకిల్ కొనిస్తాడు. కొనిస్తాడు సరే... ఇక జాగ్రత్తల జాబితా మొదలు. ‘ఇలా చూడు అభీ.. సైకిల్ నడపడమంటే మామాలు విషయం కాదమ్మా.. రైట్కి తిరిగేటప్పుడు రైట్ హ్యాండ్, లెఫ్ట్కి తిరిగేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చూపించాలి’’ అంటూ ‘జాగ్రత్తమ్మా.. జాగ్రత్తమ్మా’ అని చెప్పి పంపిస్తాడు ‘ఆకాశమంత’ చిత్రంలో! ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి. ఈ మెయిల్: samsaaram2017@gmail.com – సాత్విక -
గుక్కెడు నీటి కోసం తప్పని ప్రయాస
-
రైతన్న క’న్నీటి’ గాథలు
-
అందరివేళ్లూ ఆయన వైపే..
ముఖ్య అధికారి చెప్పిందే వేదం ఆయన చేతిలోనే జిల్లా విద్యాశాఖ అనవసర జోక్యంతో ఇబ్బందులు పెరుగుతున్న వైఫల్యాల చిట్టా పడిపోతున్న విద్యా ప్రమాణాలు సుపరిపాలన చేస్తూ.. ప్రజలకు.. ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన బాధ్యత జిల్లా అత్యున్నతాధికారిది. రాజ్యాంగం నుంచి సంక్రమించిన అధికారంతో అందరికీ సమానంగా సంక్షేమ ఫలాలు అందించాల్సిన ఉద్యోగం అది. విద్యావ్యవస్థను బలోపేతం చేసి అట్టడుగుస్థాయి వారికి కూడా నాణ్యమైన చదువు అందేలా చర్యలు తీసుకోవచ్చు. ఆ అత్యున్నతాధికారి తీరు దీనికి భిన్నం. సుపరిపాలన కంటే.. టీడీపీ కార్యకర్తలకు సంక్షేమ ఫలాలు అందించడమేనని ఆయన నమ్ముతారని విపక్షాల నుంచి విమర్శలను మూటగట్టుకుంటున్నారు. ఆయన వైఖరి వల్ల విద్యాశాఖతీరు అధ్వానంగా మారింది. చిత్తూరు, సాక్షి: జిల్లాలో విద్యాశాఖ పనితీరు తీసికట్టుగా తయారైంది. ఏ జిల్లాలో అయినా జిల్లా విద్యాశాఖ డీఈవో అజమాయిషీలో ఉంటుంది. ఈ జిల్లాలో సర్వోన్నత అధికారి చేతుల్లోనే నడుస్తోందని ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి. చీటికి మాటికీ విద్యాశాఖలో వేలుపెడుతూ వ్యవస్థను ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నాయి. దీనివల్ల జిల్లాలో విద్యాప్రమాణాలు దెబ్బతింటున్నాయి. విద్యాభివృద్ధికి కేంద్రం నుంచి రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ పథకం ద్వారా ఏటా నిధులు వస్తాయి. అవి దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ఉద్యోగులనే డిప్యుటేషన్పై ఒక డీవైఈవో, ఏవో, సూపరింటెండెంట్, క్లర్క్లను కేంద్రం నియమిస్తుంది. వీరికి జీతభత్యాలు కూడా కేంద్రమే చెల్లిస్తుంది. వీరికి జీతాలు చెల్లించే అధికారం అత్యున్నత అధికారికే కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ అధికారి మాత్రం ఇంతమంది ఉద్యోగులు అవసరం లేదని.. చెబుతూ సూపరింటెండెంట్, క్లర్క్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తరువాత సాధారణ బదిలీల్లో సూపరింటెం డెంట్, క్లర్క్ పోస్టులను నియమించడం చర్చనీయాంశమైంది. ► 2016లో రాష్ట్రమంతా పునశ్చరణ తరగతులు జరిగినా.. జిల్లాలో మాత్రం జరగలేదు. దీనికి ఆ సర్వోన్నతాధికారి అడ్డుపుల్లే కారణమని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆ ని«ధులు వెనక్కి వెళ్లాయి. ►క్లస్టర్ రీసోర్స్ సెంటర్(సీఆర్సీ), మండల్ రీసోర్స్ సెంటర్ (ఎమ్మార్సీ)లకు ప్రతినెలా చెల్లించే నిధులను తగ్గించడంతో ఎమ్మార్వోలు అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సీఆర్సీకి ప్రతి నెలా రూ.22 వేలు ఇవ్వాల్సి ఉండగా.. రూ.11 వేలే ఇస్తున్నారు. ఎమ్మార్సీకి ప్రతినెలా రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.20 వేలతో సరిపుచ్చుతున్నారని మిగిలిన నిధులను ఉపాధ్యాయులే సర్దుకోవాలని ఎమ్మార్వోలు చేతులెత్తేశారు. టీచర్లు ఖర్చులను భరిస్తున్నారు. ►130 మంది సీఆర్పీ, ఎమ్ఐఎస్ కోఆర్డినేటర్లను పనితీరు బాగాలేదని ఆ అత్యున్నతాధికారి ఆదేశాలతో తొలగించారు. ఇప్పటికీ వాటిని భర్తీచేయలేదు. ► సర్వశిక్షాభియాన్ పీవో దగ్గర నుంచి చిన్న ఉద్యోగి వరకు ఇబ్బందులకు గురవుతున్నారని సమాచారం. ప్రతినెలా జీతాల బిల్లుపై సంతకం పెట్టకుండా పక్కన పెడుతున్నారనీ.. దీంతో రెండు మూడు నెలలకొకసారి జీతాలు తీసుకోవాల్సి వస్తోందని ఆ శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. ► రాష్ట్రంలో చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లోనూ ఉపాధ్యాయులకు వర్క్ అలాట్మెంట్ జరిగిపో యింది. ఈ జిల్లాలో డీఈవో ఒప్పుకున్నా అత్యున్నతాధికారి ఒప్పుకోకపోవడం వల్లే ఆగిపోయిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫలితంగా పదోతరగతి ఫలితాల్లో వెనుకబడే అవకాశం ఉందని ఉపాధ్యాయులంటున్నారు. ► ప్రభుత్వ పాఠశాలల్లో 37 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భర్తీకి సర్వోన్నతాధికారి అడ్డుపడుతున్నారని సమాచారం. హెడ్మాస్టర్ పోస్టు లు భర్తీచేయాలని 6 నెలలుగా ఉపాధ్యాయ సంఘా లు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోలేదని తెలుస్తోంది. ► జిల్లా ముఖ్య అధికారి తీరుతో మధ్యాహ్న భోజన వ్యవస్థ కూడా ప్రభావితమైంది. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో ఏజెన్సీల నిర్వాహకులకు బిల్లులు చెల్లించే అధికారం ఎమ్మార్వోకు కట్టబెట్టారు. ఈ జిల్లాలో మాత్రం డీఈవోకు అధికార మిస్తూ ఆయన ఆదేశాలు జారీచేశారు. దీంతో ఏజెన్సీ నిర్వాహకులకు బిల్లుల చెల్లింపులో ఆలస్యం అవుతోంది. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు అప్పులబారిన పడుతున్నారు. ► సర్వశిక్షాభియాన్ ఇంజినీరింగ్ విభాగంలో పని చేసే ఇంజినీరింగ్ ఉద్యోగులు, ఏఈలను కుదించడంతో.. మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర పనులు నిలిచిపోయాయి. -
మణిపూర్లో జనం ఇబ్బందుల మధ్య ఎన్నికలు
(సాక్షి నాలెడ్జ్సెంటర్) మణిపూర్ 11వ అసెంబ్లీ ఎన్నికలు రెండున్నర నెలల్లో జరగాల్సి ఉండగా ఎన్నికల వేడి ఇంకా రాజుకోలేదు. నవంబర్ ఒకటి నుంచీ యునైటెడ్ నాగా కౌన్సిల్(యూఎన్సీ) పిలుపుపై ఆర్థిక దిగ్బంధం అమలవుతోంది. అదే నెల మొదలైన నోట్ల మార్పిడీ తోడవడంతో మణిపూర్ ప్రజలు నిత్యావసరాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మణిపూర్లో నాగా మాతృభూమిలో భాగంగా పరిగణించే కొన్ని ప్రాంతాలను నాగాలాండ్లో కలిపి విశాల నాగాలిం ఏర్పాటు చేయాలనేది ఇక్కడి నాగాల దీర్ఘకాలిక డిమాండ్. 60 అసెంబ్లీ సీట్లున్న ఈ రాష్ట్రంలోని 12 నియోజకవర్గాల్లో నాగాలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. తమ జనాభా ఉన్న జిల్లాల్లో నాగాల ప్రాధాన్యం తగ్గించడానికి కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని దిగ్బంధంతో ప్రతిఘటించాలని యూఎన్సీ భావించింది. ముఖ్యమంత్రి ఓక్రం ఇబోబీ సింగ్ మంత్రివర్గం డిసెంబర్ 8 అర్థరాత్రి సమావేశమై మొత్తం 9లోని ఏడు జిల్లాలను చీల్చి ఏడు కొత్త జిల్లాలు ఏర్పాటుచేసింది. ఒక పక్క మణిపూర్లోని నాగాల సమస్య పరిష్కారానికి నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిం(ఇసాక్-మూయివా)తో కేంద్రం చర్చలు జరుపుతోంది. మరో పక్క ఈ దిగ్బంధం విరమించకపోవడం, నాగాలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ సర్కారు వ్యవహరించడంతో రాష్ట్రంలో ఇంకా ఎన్నికల వేడి మొదలవలేదు. మార్చి4, 8 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, సీఎం ఇబోబీసింగ్ నాయకత్వంలో15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ వరసగా నాలుగో విజయానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది. 2002 అసెంబ్లీ(9వ) ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాక ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఇబోబీ వరుసగా 2007, 2012 ఎన్నికల్లో కూడా పార్టీని విజయపథంలో నడిపించారు. ఇలా విరామం లేకుండా 15 ఏళ్లు సీఎంగా ఉండి మణిపూర్లో ఆయన కొత్త రికార్డు సృష్టించారు. అంతకు ముందు మూడు వేర్వేరు సందర్భాల్లో సీఎంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత రిషాంగ్ కేషింగ్ దాదాపు పదేళ్లు ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించారు. 2002 వరకూ రాజకీయ సుస్థిరతకు దూరమైన మణిపూర్లో టెరిటోరియల్ అసెంబ్లీ ఏర్పడిన 1963 జనవరి నుంచీ 19 సర్కార్లు అధికారంలోకి వచ్చాయి. కాంగ్రెస్ ఆధిపత్యం 2002 ఎన్నికల్లో 20 సీట్లు సాధించిన కాంగ్రెస్ తర్వాత మెజారిటీ కూడగట్టి అయిదేళ్లూ పాలించింది. 2007, 2012 ఎన్నికల్లో రెండుసార్లూ 42 సీట్లు సాధించి రాజకీయంగా ఎదురులేకుండా పాలన సాగించింది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో సైతం రాష్ట్రంలోని రెండు స్థానాలూ గెలుచుకుంది. బీజేపీ తరఫున ఇన్నర్ మణిపూర్ నుంచి పోటీచేసిన టీహెచ్ చావ్బాసింగ్ వరుసగా 1996, 98, 99 ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన అప్పటి ఏబీ వాజ్పేయి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. తర్వాత బీజేపీ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించలేదు. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే, 2002 ఎన్నికల్లో కాషాయపక్షం దాదాపు పది శాతం ఓట్లతో నాలుగు సీట్లు సాధించింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఒక్క సీటూ బీజేపీకి దక్కలేదు. ఈసారి ఎన్నికల్లో మిత్రపక్షం నాగాపీపుల్స్ ఫ్రంట్తో కలిసి అధికారం కోసం పోటీపడుతోంది. విలీనం నుంచి రాజకీయ సంక్షోభం దేశంలోని అనేక ప్రాంతాల మాదిరిగానే మణిపూర్ కూడా రాజరిక పాలనలో వందలాది ఏళ్లు ఉంది. బ్రిటిష్ పాలకుల సార్వభౌత్యాన్ని అంగీకరించాక మణిపూర్ హిందూ రాజకుటుంబం పాలన 1949 వరకూ సాగింది. 1949 అక్టోబర్ 15న భారత్లో ఈ రాజ్యాన్ని మణిపూర్ పాలకుడు విలీనంచేస్తూ షిల్లాంగ్లో సంతకం చేశారు. అప్పటి నుంచీ స్థానిక మెజారిటీ మెయితీ హిందూ వర్గంలోని కొందరు స్వాతంత్య్రం కోసం హింసామార్గాన్ని ఎంచుకున్నారు. 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా మారిన మణిపూర్ను 1972 జనవరిలో పూర్తిస్థాయి రాష్ట్రంగా అవతరించింది. కొన్ని మార్క్సిస్ట్ తీవ్రవాద సంస్థలు కేంద్రంపై 1964 నుంచీ పోరాటం సాగిస్తున్నాయి. మరోపక్క నాగాలు తమ ప్రాంతాలను నాగాలాండ్లో విలీనం చేయాలంటూ పోరుసాగిస్తున్నారు. రాష్ట్రంలో హిందువులు, క్రైస్తవులు దాదాపు సమాన సంఖ్యలో(41 శాతం) ఉన్నారు. పదేళ్లు పాలించిన రిషాంగ్ కేషింగ్ నాగా కావడం విశేషం. మణిపూర్ జనాభా: దాదాపు 30 లక్షలు లోక్సభ సీట్లు: రెండు అసెంబ్లీ: 60 సీట్లు 2012 ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్–42 తృణమూల్ కాంగ్రెస్–7 మణిపూర్స్టేట్ కాంగ్రెస్–5 ఎన్పీఎఫ్–4 -
స్కూల్కు వెళ్లాలంటే ఆ వాగు దాటాల్సిందే..!
-
మళ్లీ అవే బారులు
► వేతన కష్టాలు షురూ.. ► ఇబ్బందులు పడ్డ పెన్షనర్లు ► బ్యాంకులు, ఏటీఎంల క్యూ నిర్మల్ టౌన్ : వేతనజీవుల కష్టాలు ప్రారంభమయ్యాయి. వేతనాలు అలా ఖాతాలో వేయడమే ఆలస్యం బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద బారులు ప్రారంభమయ్యాయి. ప్రతీ నెల వేతనం కోసం ఎదురుచూసే సగటు జీవికి ఈసారి కూడా కష్టాలు తప్పేలా లేవు. బ్యాంకుల్లో తగినంత నగదు లేకపోవడంతో బ్యాంకు అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. అలాగే బ్యాంకుల వద్ద కూడా ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లను చేయలేదు. దీంతో మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు పడాలి అంటూ వారు అసహనం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడి 50 రోజులు దాటినా ఇంకా ఎలాంటి నగదు కొరత వేధిస్తుండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచే బారులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద వేతన జీవులు ఉదయం నుంచే బారులు తీరి కనిపించారు. బ్యాంకుల్లో పూర్తిస్థాయిలో నగదు లేకపోవడంతో మళ్లీ పాత పరిస్థితే కనిపించింది. బ్యాంకుల నుంచి ప్రతీరోజు రూ.10 వేలు డ్రా చేసుకునే వెసులుబాటు ఉన్నా, అంతస్థాయిలో నగదు లేకపోవడంతో పరిమితిని తగ్గించి నగదును ఖాతాదారులకు అందజేశారు. ఏటీఎంలలో కూడా భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరి కనిపించారు. ఎస్బీహెచ్ ప్రధాన ఏటీఎం మూసి ఉండడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎక్కువగా సేవలు అందించిన ఏటీఎం మూసి ఉండడంతో వారు ఇక్కట్లు పడ్డారు. ఏటీఎంలలో రూ.4,500 నగదు వస్తుండడం ఒక్కటే ఇన్ని కష్టాల మధ్య వేతన జీవులకు ఊరట కలిగించే అంశం. తప్పని ఇబ్బందులు రెండు నెలలుగా వేతనాల ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటి నుంచి బ్యాంకు అధికారులు ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. బ్యాంకుల్లో వేతనాల కోసం వచ్చే ఉద్యోగులు, పెన్షనర్లకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. దీంతో పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే మహిళ ఉద్యోగులు సైతం క్యూలైన్లలో వేచి ఉండలేక అవస్థలు పడ్డారు. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ బ్యాంకుల్లో అ లాంటి ఏర్పాట్లు కనిపించలేదు. ఒకవైపు కార్యాలయాలకు వెళ్లాల్సి రావడం మరోవైపు క్యూలైన్లలో నిల్చుండాల్సి రావడంతో వారు అసహనం వ్యక్తంచేశారు. మొదటి తేదీ ఆదివారం రావడంతో సోమవారం పెద్ద సంఖ్యలో ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్దకు చేరుకున్నారు. ఉదయం బ్యాంకులు తెరవకముందే పింఛన్ దారులు పడిగాపులు కాయడం కనిపించింది. వేతన ఇబ్బందులకు మూడో నెల పెద్ద నోట్ల రద్దు అనంతరం రెండు నెలలుగా వేతన కష్టాలను వివిధ ఉగ్యోగులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మూడో నెల కూడా వారికి వేతనాల వెతలు తప్పలేదు. నిత్యావసర సరుకులు, ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు, ఇతర అవసరాల కోసం నగదు అవసరమవుతుంది. కనీస అవసరాలయిన వీటి కోసం కూడా సరిపడా నగదు చేతికి అందకపోతుండడంతో వేతన జీవులు ఆవేదన చెందుతున్నారు. రెండు నెలలుగా తాము కష్టాలను ఎదుర్కొంటున్నామని, ఈ నెల అయినా ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చేస్తుందని వారు ఆశపడ్డారు. అయితే ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. -
అంతటా రద్దీ
కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు కిక్కిరిసిన బ్యాంకులు పాక్షికంగానే పనిచేసిన ఏటీఎంలు రెండు రోజుల సెలవు తర్వాత సోమవారం బ్యాంకులు తెరుచుకోవడంతో ఖాతాదారులు పోటెత్తారు. జిల్లా అంతటా చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని బ్యాంకు శాఖల్లోనూ రద్దీ కన్పించింది. 48 రోజులవుతున్నా ప్రజలకు కరెన్సీ కష్టాలు తీరడం లేదు. బ్యాంకులకు తగినంత నగదు సరఫరా కాకపోవడంతో రోజూ సర్దుబాట్లు చేయాల్సి వస్తోంది. ఒకేసారి రూ.24 వేలు విత్డ్రా తీసుకోవచ్చనే నిబంధన ఉన్నా.. ఇప్పటివరకు ఎక్కడా సాధ్యం కాలేదు. ఖాతాదారులు, నగదు నిల్వలను బట్టి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తున్నారు. అత్యవసరమో లేదా సిఫారసు ఉంటే తప్ప కొంచెం కూడా ఎక్కువ ఇవ్వని పరిస్థితి ఉంది. కరెన్సీ చెస్ట్లు కలిగిన ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్, సిండికేట్ బ్యాంకు తదితర వాటిలోనూ విత్డ్రాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. సర్దుబాట్లు చేయకుంటే ఇబ్బందులు తప్పవని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ (ఆర్ఎం) ఎంవీఆర్ మురళీకృష్ణ, ఏజీఎం శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జిల్లాలోని బ్యాంకుల్లో ఎక్కడా 'నోక్యాష్' బోర్డు పెట్టకున్నా, నగదు సరఫరా ఆలస్యం కావడంతో కొన్ని శాఖల్లో మధ్యాహ్నం తర్వాత విత్డ్రాలు ప్రారంభించారు. మరోవైపు పాత రూ.500, రూ.1,000 నోట్ల డిపాజిట్లు చేసుకునేందుకు విధించిన గడువు ఈ నెల 30తో ముగియనుంది. అయినా పెద్దగా డిపాజిట్లు పెరగలేదని ఏపీజీబీ, సిండికేట్, కెనరా, ఆంధ్రా బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. కొన్ని శాఖల్లో మాత్రమే 10 శాతం మేర పెరుగుదల కనిపిస్తోందని తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ బ్యాంకుల్లో మాత్రం కొంత పెరిగినట్లు సమాచారం. అనంతపురం సాయినగర్లోని ఎస్బీఐ ప్రధానశాఖలో జనం పోటెత్తారు. రెండు రోజుల సెలవు ప్రభావం స్పష్టంగా కనిపించింది. సామాన్యులు, వృద్ధులు, వికలాంగులు, పెన్షనర్లు, ఉద్యోగులు డిపాజిట్లు, విత్డ్రాల కోసం బారులుతీరారు. ఇక్కడ పోలీసు పçహారా మధ్య లావాదేవీలు కొనసాగాయి. ఏటీఎంల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ప్రధాన బ్యాంకులకు చెందిన ఒకట్రెండు ఏటీఎంలు మినహా మిగతావి పనిచేయలేదు. అలాగే కొన్ని ప్రైవేట్ బ్యాంకుల ఏటీఎంలు పాక్షికంగా పనిచేశాయి. బ్యాంకు వేళలు ముగిసిన తర్వాత తాము ఏటీఎంలలో డబ్బు పెడుతున్నట్లు ఆంధ్రాబ్యాంకు చీఫ్ మేనేజర్ పి.అమ్మయ్య తెలిపారు. -
సొమ్ము కోసం వచ్చి సృహ తప్పాడు!
అమడగూరు : మండలంలోని చినిగానిపల్లికి చెందిన గండారెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద సోమవారం సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన పలువురు మాట్లాడుతూ నగదు కోసం ఉదయం నుంచి బ్యాంకు వద్దే కాచుకుని కూర్చున్నామన్నారు. సాయంత్రం వరకూ తిండి, నీరు లేక పోవడంతో బీపీ తగ్గిపోయి ఆయన సృహ తప్పిపడి పోయినట్లు తెలిపారు. వెంటనే అతడిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. కాగా నగదు కోసం ఫీల్డ్ ఆఫీసర్ ఉదయం నుంచి కదిరి బ్యాంకులో వేచి చూసి, డబ్బులివ్వక పోవడంతో వెనక్కి వచ్చినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. -
ఆవేదన.. ఆక్రోశం
రోజురోజుకూ ఎక్కువవుతున్న కరెన్సీ కష్టాలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం పడిగాపులు ఇంకెన్నాళ్లీ కష్టాలంటూ నిట్టూర్పు నగదు లభ్యత అంతంత మాత్రమే ‘అయ్యా..కాటికి కాళ్లు చాపుకున్న దాన్ని. అసలే నడవలేను. పింఛన్ డబ్బు కోసం రోజూ తిరుగుతున్నా. ఈరోజు పక్కింటి వారు రిక్షాలో ఇక్కడికి తీసుకొచ్చారు. మాలాంటి ముసలోళ్లకా ఈ కష్టాలు?! ఇన్ని అవస్థలు పడేదాని కంటే చావడమే మేలు..’- అనంతపురంలోని మరువకొమ్మ కాలనీకి చెందిన లక్ష్మక్క ఆవేదన ఇది. ప్రజల కరెన్సీ కష్టాలకు ఆమె ఆవేదన అద్దం పడుతోంది. ఇలా ఎందరో వృద్ధులు, వికలాంగులు, రైతులు, సామాన్యులు నిత్యం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. చేతిలో డబ్బులేక, బ్యాంకుల్లోనూ దొరక్క అవస్థ పడుతున్నారు. ఇంకెన్నాళ్లీ కష్టాలంటూ ఆవేదనను, ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అర్బన్: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రమూ తగ్గడం లేదు. మూడు రోజుల సెలవుల అనంతరం బ్యాంకులు మంగళవారం తెరుచుకోవడంతో జిల్లా వ్యాప్తంగా జనం పోటెత్తారు. అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, కదిరి తదితర పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల వద్ద కూడా బారులు తీరారు. మరోవైపు ఏటీఎంల చుట్టూ జనం ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. తెరిచివున్న వాటి వద్ద చాంతాడంత క్యూలు కన్పించాయి. బ్యాంకుల్లో నగదు లభ్యత అంతంతమాత్రంగానే ఉంది. దీంతో కొన్ని బ్యాంకుల్లో రూ.3 వేలతోనే సరిపెట్టారు. జిల్లావ్యాప్తంగా 500లకు పైగా ఏటీఎంలు ఉంటే మంగళవారం 15లోపే పనిచేశాయి. అనంతపురం నగరంలోని సాయినగర్ రెండో క్రాస్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం ఒక్కటే పనిచేసింది. ఇక్కడే ఉన్న బ్యాంక్ వద్ద ఉదయం ఎనిమిది గంటల నుంచే ఖాతాదారులు భారీసంఖ్యలో బారులుతీరారు. జిల్లాలోని దాదాపు అన్ని బ్యాంకుల వద్ద ఇదే పరిస్థితి కన్పించింది. బ్యాంకులకు ఈ నెల 11న రూ.90 కోట్లు వచ్చింది. ఈ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నామని బ్యాంకర్లు తెలిపారు. వేతనాల సమయం కాబట్టి కనీసం రూ.200 కోట్లు వస్తేనే కొంత మేర ఉద్యోగులకు సర్దుబాటు చేయడానికి అవకాశం ఉంటుందని ఓ బ్యాంక్ ఉన్నతాధికారి చెప్పారు. నగదు వస్తుందని చెబుతున్నారే తప్ప ఎంత మొత్తం, ఎప్పుడు వస్తుందనే దానిపై స్పష్టత లేదని బ్యాంకర్లు అంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది – రాజ్యలక్ష్మి, గృహిణి, ద్వారకా విలాస్, అనంతపురం డబ్బు కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి రోజూ నేను, మా ఆయన వచ్చి బ్యాంక్ వద్ద గంటల కొద్దీ నిలబడాల్సి వస్తోంది. ఇంటి ఖర్చులకు కూడా కష్టంగా ఉంది. ఏటీఎంలో వచ్చే రూ.2 వేలు చాలడం లేదు. బ్యాంక్లోనూ, ఏటీఎంలోనూ విత్డ్రా మొత్తం పెంచాలి. నాలుగు రోజులుగా తిరుగుతున్నా : రసూల్బీ, విజయనగర్ కాలనీ, అనంతపురం వితంతు పింఛన్ డబ్బు కోసం వారం రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా. మూడు రోజులుగా సెలవు ఉండడంతో ఈ రోజు ఉదయం ఆరు గంటలకే బ్యాంక్ వద్దకు వచ్చి కూర్చున్నా. టోకెన్ ఇచ్చి వెళ్లారు. వాళ్లు ఎప్పుడు పిలిచి డబ్బు ఇస్తారోనని ఎదురు చూస్తున్నా. మాలాంటి పేదలను కష్టపెట్టినోళ్లు ఎవరూ బాగుపడరు. -
టోల్ ప్లాజాల వద్ద చిల్లర కష్టాలు
-
అమ్మో... ఒకటో తారీఖు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇదొక్క చోటే కాదు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎంలో సేవలు నాలుగు రోజులకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రంలోనే వీటి పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో నగదు సమస్యను ఊహించుకోవచ్చు. ఈ నెల 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేసింది మొదలు ఇప్పటివరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పకతప్పదు. ఇకపై ఈ నగదు కష్టాలు ప్రజలకు రెట్టింపు కానున్నాయి. ఒకటో తేదీ వచ్చేసింది... ఇక జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరాల్సిన పరిస్థితి. మరోవైపు జిల్లాలోని అన్ని బ్యాంకుల్లోనూ నగదు కొరత తీరలేదు. రూ.500, రూ.100 డినామినేషన్ నోట్లు తొలివిడతలో రూ.150 కోట్లు నగదు వస్తుందని జిల్లా ఉన్నతాధికారులు పది రోజులుగా చెబుతున్నా ఒక్క నోట్ల కట్ట కూడా జిల్లాకు రాలేదు. కొన్నిచోట్ల ఎస్బీఐ ఏటీఎంలు పనిచేస్తున్నా రూ.2000 నోట్లు తప్ప మరో నోటు కనిపించట్లేదు. ఇవి చేతికొచ్చినా చిల్లర నోట్లు లేక అవసరానికి అక్కరకురాని పరిస్థితి. ఇక పింఛనుదారులకూ కష్టాలు తప్పేట్లు లేవు. నగదురహిత లావాదేవీలు సాధ్యమేనా? రేషన్ మొదలుకొని పింఛను వరకూ, కూరగాయలు మొదలు కిరాణా వరకూ, చిల్లర కొట్టు నుంచి సూపర్ మార్కెట్ల వరకూ... ఇలా ప్రతి లావాదేవీని నగదు రహితంగా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అందుకనుగుణంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను అధికారులు ముమ్మరం చేశారు. అంతవరకూ బాగానే ఉన్నా నగదు లావాదేవీలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఆర్థిక లావాదేవీలు సక్రమంగా సాగాలంటే కనీసం 5 వేల స్వైప్ మిషన్లు అవసరం ఉంటుందని అధికారులే అంచనా వేస్తున్నారు. కానీ ప్రస్తుతం వినియోగంలో ఉన్నవి ఆరొందలకు మించవు. అవీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనకు ముందు వచ్చినవే. ఇటీవల 150 వరకూ వచ్చినా అవి సరిగా పనిచేయట్లేదు. కాగితం మీదే వేతనం... జిల్లాలో టీచర్లు 17 వేల మంది వరకూ ఉన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు ఎనిమిది వేల మంది ఉన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు 20 వేల మంది వరకూ ఉన్నారు. చిరుద్యోగులు మరో ఐదు వేల మంది ఉన్నారు. వీరందరికీ బ్యాంకు ఖాతాల ద్వారానే జీతాలు, వేతనాల చెల్లింపు జరుగుతోంది. వీరందరూ నెల ప్రారంభ వారంలోనే ఏటీఎంలు, బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేయడం అలవాటు. అందుకే ఆ వారం రోజులు జిల్లాలోని ఏటీఎంలన్నీ కిటకిటలాడేవి. ఈనెల 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనేటప్పటికే వారిలో చాలామంది నగదు విత్డ్రా చేశారు. అప్పటికే వివిధ చెల్లింపులకు నగదు పోను మిగిలిన రూ.1000, రూ.500 నోట్లు తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు. కొంతమంది మార్పిడి చేసుకున్నారు. అయితే ఈసారి జీతాలు ఆన్లైన్లోనే చెల్లింపు ఉంటుందని ఆర్థిక శాఖ ప్రకటించింది. అంటే ఒకటో తేదీన కాగితం (ఖాతాలో) మీద జీతం పడినట్లు కనిపిస్తున్నా చేతికి నగదు చెల్లింపులు ఉండవు. ఒకవైపు నగదు చేతిరాకపోగా, చెల్లింపు అవసరాలకు తగినట్లు స్వైప్ మిషన్లు లేవు. దీంతో 1వ తేదీ నుంచి ఏటీఎంలు, బ్యాంకుల ముందు బారులు తీరినా నగదు చేతికొస్తుందో లేదోనని అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి. పెద్ద నోట్లు ‘పని’కి రావట్లేదు:బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఎక్కువగా రూ.2000 నోట్లే ఇస్తున్నారు. అక్కడక్కడా రూ.100 నోట్లు ఇస్తున్నా అవన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోతున్నాయి. మిగతా రూ.50, రూ.20 నోట్లు పరిస్థితీ అంతే. చిల్లర లభ్యత పూర్తిగా తగ్గిపోవడంతో జిల్లాలో వ్యాపారాల పరిస్థితి రోజురోజుకు దీనావస్థకు చేరుతోంది. రూ.2000 నోట్లు తీసుకోవడానికి చిల్లర సమస్య కారణంగా వ్యాపారులు నిరాకరిస్తున్నారు. ఈ సమస్య దృష్ట్యా ఎవ్వరికివారు రూ.100, రూ.50 నోట్లను తమవద్దే ఉంచేసుకుంటున్నారు. పింఛనుదారులకు ఇక్కట్లే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులు జిల్లాలో 14వేల మంది ఉన్నారు. వారందరికీ 1వ తేదీనే బ్యాంకు ఖాతాల్లో పింఛను పడుతోంది. నిత్యావసర సరుకులు, మందులు, ఆసుపత్రికి వెళ్లడానికి ఈ డబ్బే ఎక్కువ మందికి ఆధారం. వారిపై ఆధారపడినవారూ కుటుంబాల్లో ఉంటారు. ఇప్పుడు పింఛను నగదు చేతికొచ్చే అవకాశం లేకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కోనున్నారు. -
అమ్మో..ఒకటో తారీఖు
-
జీవితం కుప్పకూలింది
భూవిలయం, జల ప్రళయం, దావానలం, వాయు ప్రచండం, గగన గమనం... ఇవన్నీ మనిషి చేతిలో ఉండని విపత్తులు, విషాదాలు, ప్రకృతి వైపరీత్యాలు. యుద్ధాలు, ఎమర్జెన్సీలు, పాలనా విధానాలు... ఇవి మాత్రం మానవ స్వయంకృతాలు. ఎలాగూ చేతిలో లేనివాటిని నివారించలేం. నిరోధించలేం. చేజేతులా చేసుకున్నదాన్ని చక్కబెట్టుకోలేమా? పెద్ద నోట్లు రద్దయ్యాక జనజీవనం అస్తవ్యస్తమయింది. రైతులు, చిన్నచిన్న వ్యాపారులు కుప్పకూలిపోయారు. వృద్ధులు రాలిపోయారు. వీరి కోసం ప్రభుత్వం ఏదైనా చేయాలి. ‘పెద్దవాళ్లను’ కట్టడి చెయ్యడం మంచిదే. చిన్నవాళ్ల కష్టాలు కూడా చూడాలి కదా! పండ్లమ్మిన చోటే పడిగాపులు సైదులు పండ్ల వ్యాపారి. సూర్యాపేట ‘వాణిజ్య భవన్’లో పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ముప్ఫై ఏళ్లుగా ఇదే ఆయన జీవనోపాధి. పెద్ద నోట్ల రద్దుతో ఇప్పుడా ఉపాధికి గండి పడింది. రోజుకు సుమారు రు.6 వేల వరకు పండ్ల అమ్మకాలు జరిపే సైదులుకు ఇప్పుడు రూ.500 వ్యాపారం కూడా జరగడం లేదు. గతంలో 10 గెలల అరటిపండ్లు, 5 బాక్సుల ఆపిల్స్, రెండు బాక్సుల దానిమ్మ, ఎనిమిది బాక్సుల కమలాలు అమ్మకానికి తెచ్చుకుంటే సాయంత్రానికి మొత్తం అమ్ముడయ్యేవి. ఇప్పుడు అమ్మకాలు తగ్గి, తెచ్చిన పండ్లు తెచ్చినట్టుగానే పాడైపోతున్నాయి. చిల్లర లేని కారణంగా గిరాకీని వదులుకోవలసి వస్తోంది. పంట డబ్బొచ్చినా పైసా లేదు! నక్కా భగవంతరెడ్డి వృద్ధ రైతు. ఆయనది నల్గొండ జిల్లా పోచంపల్లి మండలంలోని జలాల్పురం గ్రామం. లక్ష రూపాయలకు పైగా పంట డబ్బు పోచంపల్లి కెనరా బ్యాంకులో జమ అయింది. డ్రా చేసుకోడానికి బ్యాంకు దగ్గర పొద్దస్తమానం క్యూలో నిలబడాల్సి రావడంతో, ఇంటి దగ్గర పశువులను చూడ్డానికి రోజుకు రూ.300 ఇచ్చి మనిషిని కూలీకి పెట్టుకున్నారు. ఆ నష్టం ఒకటైతే తను బ్యాంకు క్యూలో నిలుచున్నా రోజుకు రూ.4 వేలకు మించి డ్రా చేసుకోలేకపోయారు. బ్యాంకు వాళ్లు పూర్తి డబ్బు ఇవ్వకపోతే రబీలో దుక్కులకు, విత్తనాలకు, ఎరువులకు కష్టమే అని తీవ్రంగా బాధ పడుతున్నాడు. ఖరీఫ్కి అప్పులు... రబీకి తిప్పలు గగ్గనపల్లి రాజశేఖర్రెడ్డి ఓ రైతు. ఊరు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం కందగట్ల గ్రామం. ఇరవై రోజుల క్రితం 105 క్వింటాళ్ల ధాన్యం విక్రయించగా అకౌంట్లో రూ.1,59,406 లు జమ అయ్యాయి. ఆ డబ్బులు డ్రా చేసుకోడానికి నెమ్మికల్లోని బ్యాంకుకు వెళితే మొదట 20 వేలు ఇచ్చారు. తర్వాత రోజుకు 2 వేలు మాత్రమే ఇస్తున్నారు. వాటికి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలుచోవలసి వస్తోంది. ఖరీఫ్లో పంట కోసం అప్పు తెచ్చాడు. ఆ డబ్బు కోసం వ్యాపారులు రాజశేఖరెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. రబీ సీజన్లో పెట్టుబడి పెట్టడానికి ఏం చేయాలో ఆయనకు పాలుపోవడం లేదు. లక్ష ఉన్నా... రోజుకింత భిక్ష! సంగారెడ్డి జిల్లా చింతకుంట రైతు ఎం.డి. మౌలానా అప్పు చేసి పంట పండించాడు. 70 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. వారం తర్వాత ఆయన ఖాతాలో లక్షా ఆరు వేల రూపాయలు జమ అయ్యాయి. అయితే ఆ డబ్బును పూర్తిగా డ్రా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. వారానికి రూ.2 వేలు మాత్రమే ఇస్తారని తెలిసి హతాశుడయ్యాడు. డబ్బంతా ఒకేసారి ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవని బ్యాంకు అధికారులు కరాఖండిగా చెప్పేశారు. ఇప్పుడేం చెయ్యాలో ఆయనకు దిక్కుతోచడం లేదు. అప్పులోళ్ల దగ్గర మాట పోతోందని ఆవేదన చెందుతున్నాడు. క్యూలోనే తెల్లారుతున్న జీవితాలు నల్లధనానికి చెక్ పెట్టడానికంటూ కేంద్ర సర్కారు తీసుకున్న హఠాత్ నిర్ణయం వయసు, ఆరోగ్యం ఉన్నవాళ్ళకే పెద్ద తలనొప్పిగా మారితే, వయసు మళ్ళినవారికి ఈ కష్టం ప్రాణం తీస్తోంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంకి చెందిన పోలంకి ఇన్నయ్య అగ్నిమాపకదళంలో ఫైర్ ఆఫీసర్గా రిటైరయ్యారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత పాత నోట్లు చెల్లకపోవడంతో కొత్త నోట్లుతీసుకునేందుకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకుకు వచ్చి వెళు తున్నా ఖర్చులకు కొత్త కరెన్సీ దొరకలేదు. నవంబర్ 15వ తేదీ మంగళవారం ఆయన అయిదో రోజు క్యూలో నిలుచున్నాడు. శారీరకంగా, మానసికంగా నలిగిపోయి గుండెపోటుకు గురయ్యాడు. దగ్గరిలోని ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. చేయని పాపానికి పడిన పెద్ద శిక్షతో గుండెలవిసేలా ఏడుస్తున్న ఇన్నయ్య కుటుంబ సభ్యుల లాంటి ఎందరికో ఎవరు జవాబుదారీ? నా మొగుడ్ని తెచ్చిస్తరా? జూలూరి నర్సయ్యది మెదక్జిల్లా వెల్దుర్తి మండలం, అచ్చంపేట. 65 ఏండ్లకు పైనే ఉంటడు. భార్య దుర్గమ్మే అతని తోడు. చలికాలం ఆరోగ్యం అంతంత మాత్రం కావడంతో ఆమె భయపడుతున్నట్టుగానే నర్సయ్యకు సుస్తి చేసింది. దానికి తోడు నోట్ల రద్దు వచ్చి పడింది. ఆమె పాతనోట్లనే తీస్కొని, చుట్టుపక్కల హాస్పిటళ్లకు తిరిగితే ఎవరూ పాతనోట్లు తీసుకోము అన్నారు. అట్లనే హైదరాబాద్ తీస్కొచ్చింది చుట్టాల సాయంతో. హైదరాబాద్లో కూడా చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ తిప్పితే, అక్కడా పాత పెద్దనోట్లు చెల్లవన్నరు. డాక్టర్లు రాసిచ్చిన టెస్టులు చేయించడానికి పోతే పాత నోట్లు తీసుకోలేదు. తిరిగి తిరిగి కాళ్లు అరిగి, భర్తను ఇంటికి తీసుకొస్తే ఇంటికొచ్చిన కాసేపటికే నర్సయ్య ప్రాణం వదిలాడు. ‘ఎంత పనిజేస్తివిరా.. బగమంతుడా.. ’ అంటూ ఆమె గుండెలవిసేలా ఏడ్చింది. ‘గింత అన్యాయమా? పాత నోట్లు డాక్టర్లు తీస్కోకనే మా ఆయనను షెరీఖ్ జేస్కోలే. మనుషుల పానాలతో ఆడుకుంటుండ్రు. ఇప్పుడు నా మొగుడ్ని పాణాలతో తెచ్చిస్తరా’ అని అడుగుతోంది దుర్గమ్మ. డబ్బులకెళితే... దెబ్బలు! మాధవరెడ్డి అనంతపురం, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వాతావరణ పరిశోధన కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నారు. నోట్ల మార్పిడి ప్రకటన జారీ అయ్యాక మూడు రోజులు ఆగి సాయి నగర్ స్టేట్బ్యాంకుకెళ్లాడు. తన వంతు కోసం ఎదురు చూస్తూ క్యూలో గంటలకొద్దీ వేచి ఉన్నాడు. ఇంతలో పోలీసు పటాలం బ్యాంకు దగ్గర దిగింది. రావడం రావడమే రాయలేని భాషతో రెచ్చిపోయింది. అదేమిటని ప్రశ్నించిన వారి మీద విరుచుకుపడింది. నిలదీసిన మాధవరెడ్డిని ఎస్ఐ మీద చేయిచేసుకున్నాడంటూ చితకబాదారు. బూటుకాలితో తంతూ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత మాధవ్రెడ్డి ఏమయ్యాడో తెలియక రెండ్రోజులపాటు అనిశ్చితి కొనసాగింది. భర్త ఆచూకీ చెప్పమని స్టేషన్కొచ్చిన భార్యకు సమాధానం చెప్పలేదు పోలీసులు. చివరకు వదిలిపెట్టారు ‘ఆయన మృదు స్వభావి. పోలీసుల మీద చెయ్యి చేసుకున్నాడంటే ఎవరూ నమ్మరు. అన్యాయంగా అరెస్టు చేశారు’ అంటూ కన్నీళ్ల పర్యంతమవుతోంది భార్య భార్గవి. ఆ రైతు చివరకు అంతకు తెగించాడు! కర్నూలు జిల్లా, తూడిచెర్లకు చెందిన నల్లబోతుల పుల్లయ్య, భార్య వెంకటేశ్వరమ్మ ఏడాదంతా కష్టపడి పంట పండించారు. ఈ ఏడాది కొడుక్కి పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ముహూర్తాలు పెట్టుకున్నారు. ధాన్యం అమ్మితే డెబ్భై వేలు చేతికి వచ్చాయి. పాత నోట్లు చెల్లవనే ప్రకటనతో చేసేదేమీ లేక చేతిలో ఉన్న డబ్బుని బ్యాంకులో వేశారు. వాటిని తిరిగి ఇమ్మంటే బ్యాంకువాళ్లు చిన్న నోట్లు లేవు, కొత్త నోట్లు రాలేదు పొమ్మంటున్నారు. డిసెంబర్ ఒకటో తేదీన కొడుకు పెళ్లి. పెళ్లి కూతురికి ప్రధానం చీర, సారె పట్టుకెళ్లాలి. చేతిలో డబ్బులేదు. ఇంట్లో ఎవరూ పెళ్లికి కొత్త దుస్తులు కొనుక్కోలేదు. బంధువులను పిలుచు కున్నారు. వారికి విందు భోజనం పెట్టాలంటే దినుసులు కొనడానికి పైసల్లేవు. దిక్కుతోచని పుల్లయ్య పురుగుల మందు డబ్బా అందుకున్నాడు. ‘నా డబ్బు నాకు ఇస్తారా, చావమంటారా’ అంటూ బ్యాంకు ముందు డబ్బా మూత తీశాడు. ఆ చిన్న రైతు బ్యాంకులో దాచుకున్న తన రెక్కల కష్టం తాను తీసుకోవడానికి అంతటి అఘాయిత్యానికి పాల్పడాల్సి వచ్చింది. ఉపాసమే ఉన్నం! సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని తహసిల్దార్ ఆఫీస్కు పొయ్యే దారిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది. దాని ప్రహరీ ముందు ఓ జంట కనిపిస్తుందెప్పుడూ. అతని పేరు శివరాజ్. ఆమె అతని భార్య. పొద్దున ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిద్దాక వాళ్లు అక్కడే చెప్పులు కుట్టుకుంటూ ఉంటారు. పెద్దనోట్ల రద్దుతో చిల్లర లేక జనం కూరగాయలే కొనడం లేదు. ఇక చెప్పులు కుట్టించుకునేందుకు ఎవరు వస్తారు? ‘మొన్న ఒకాయన వొచ్చిండు.. కుడి కాలు చెప్పు తెగిపోయింది కుట్టియ్యమని. నా భార్య కుట్టిచ్చింది. పది రూపాయలని జెప్పినం. ‘యాభై నోటుంది.. చిల్లరుందా?’ అని అడిగిండు. అప్పటిదాకా అయిన గిరాకీ నలభై రూపాయలిచ్చి, యాభై నోటు దీస్కున్నం. అంతా సగవెట్టుకొని ఇంటికి వోకుంటా ఏదో సామాన్ దీస్కపోదామని కిరాణ దుకునంకు పోయినం. సామాను దీస్కోని యాభై నోటిస్తే నోటును ఎన్కకు, ముందుకు చూసిన సేఠ్ ‘ఎయ్.. గిది నకిలీ నోటు. చెల్లదు’ అని మా సామాన్ వాపస్ దీస్కోని మా నోటు మాకు ఇచ్చేసిండు. రోజంతా కష్టపడ్డ పైసలు కూడా మాకు దక్కకపోయే. ఏం జేస్తం? ఆ పూట ఉపాసమే ఉన్నం’ అంటూ బాధపడ్డాడు శివరాజ్. నా పెన్షన్ ఇస్తే అన్నం తింటా! ఈమె కత్తి లక్ష్మమ్మ. నెల్లూరు జిల్లా కోవూరు. పంచాయతీ కార్మికుల కాలనీలో నివాసం. భర్త పంచాయతీ స్వీపర్గా పనిచేస్తూ మరణించాడు. భర్త మరణానంతరం లక్ష్మమ్మకు ప్రభుత్వం నుంచి పింఛన్ వస్తోంది. అదే ఆమెకు జీవనాధారం. అయితే 5 నెలల నుంచి ప్రభుత్వం ఫించన్ విడుదల చేయట్లేదు. అందిన చోటల్లా అప్పు చేసి, పొట్ట నింపుకుంటూ ఫించన్ డబ్బు కోసం ఎదురు చూస్తూ గడిపింది. ఇటీవల పెద్ద నోట్ల రద్దుకు ముందు పింఛను డబ్బు ఆమె ఖాతాలో జమ అయింది. దానిని తీసుకుని అప్పులు తీరుద్దామని ఆశతో బ్యాంకుకు వెళితే డబ్బులు లేవనీ, రేపు రావాలనీ పంపేశారు. అలా రోజూ బ్యాంక్కు వెళ్లడం, బ్యాంకు వాళ్లు డబ్బుల్లేవనడం... ఆమె ఉసూరు మంటూ కాళ్లీడ్చుకుంటూ ఇంటికెళ్లడం... చివరకు ఎదురుపడిన అప్పులోళ్లకు ముఖం చూపించలేక ఊరు వదిలి కూతురింటికి వెళ్లిపోయింది. కాలూ చెయ్యి ఆడనప్పుడు బిడ్డ పంచన చేరాలి అని అనుకున్న ఆమె పెద్ద నోట్ల రద్దుతో ఇప్పుడు కూతురి మీద ఆధారపడే స్థితికి చేరుకుంది. ఇది ఆమెను వేదనకు గురి చేస్తోంది. ఈ లెక్కకు బదులేది? ►దేశంలో 90 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బ్యాంకులు లేవు. పెద్ద నోట్ల ఉపసంహరణతో వచ్చే ఇబ్బందుల నుంచి వాళ్ళను గట్టెక్కించే మార్గం ప్రభుత్వం చూసుకోనే లేదు. ►పెద్ద నోట్ల దెబ్బతో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు ఎన్నడూ లేనంతగా తగ్గిపోయాయి. ఇక, అసంఘటిత రంగంలో దాదాపు 4 కోట్ల మందికి ఉపాధి, ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ►మన ‘స్థూల జాతీయోత్పత్తి’ (జి.డి.పి)లో దాదాపు 40 శాతం నగదు లావాదేవీల ద్వారా జరుగుతుంది. ►దేశ యువజనుల్లో నూటికి 31 మందికి అసలు బ్యాంకు ఖాతాలే లేవు. ►భారత్లో దాదాపు 45 కోట్ల మంది శ్రామికులు ఉన్నారు. వారిలో ప్రతి 100 మందిలో 7 మంది మాత్రమే సంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఈ 3.1 కోట్ల మందిలో కూడా దాదాపు 2.4 కోట్ల మంది రాష్ట్ర ప్రభుత్వంలో, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తుంటే, మిగతావాళ్ళు ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ►అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్న 41.5 కోట్ల మందిలో సగం మంది వ్యవసాయ రంగంలో పని చేస్తున్నారు. ►ఇక, భవన నిర్మాణం, చిన్న తరహా తయారీ, రిటైల్ రంగాల్లో ఒక్కోదానిలో 10 శాతం మంది వంతున పనిచేస్తున్నారు. ►అసంఘటిత రంగంలో అత్యధిక మంది రోజు వారీ కూలీలే. పెపైచ్చు, ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్న కనీస వేతనాల కన్నా తక్కువ సంపాదిస్తున్నవాళ్ళు. కాబట్టి, ఒక రకంగా ప్రభుత్వం ‘అన్ ఎకౌంటెడ్ మనీ’ అని చెబుతున్నదంతా నిజానికి ఇలా చలామణీలో ఉన్న డబ్బే అని విశ్లేషకుల మాట! ►2200 కోట్లు ...ఇది ప్రస్తుతం చెల్లకుండాపోయిన నోట్ల సంఖ్య. ఇన్ని కోట్ల నోట్ల స్థానంలో సరికొత్త నోట్లు తేవడానికి చాలా టైమ్ పడుతుందని ఆర్.బి.ఐ. తేల్చేసింది. ►100 కోట్ల పైగా జనాభా ... ఇది మన దేశంలో గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న జన సంఖ్య. కానీ, ఆ ప్రాంతాల్లో ప్రతి లక్ష మందికీ కేవలం 7.8 బ్యాంకు శాఖలే ఉన్నాయి. మనది ‘బ్యాంకులు తక్కువున్న ఆర్థిక వ్యవస్థ’ అనేది అందుకే! ►4 శాతం ... ఇది మొత్తం మన దేశ జనాభాలో టాక్స్ రిటర్న్లు దాఖలు చేసేవారి శాతం. ► 90 శాతం ...లావాదేవీలు మన దేశంలో నగదుతోనే జరుగుతాయి. ► 48.2 కోట్ల మంది ... జీవనోపాధికి ఈ నోట్ల రద్దు దెబ్బతో ముప్పు ఏర్పడింది. మన జనాభాలో వీరంతా డబ్బు రూపంలో సంపాదన చేసేవారే! ఒక శాతం దొంగల్ని పట్టుకోవడానికి 99 శాతం మందిని బాధిస్తారా? ► భారతదేశ ఆర్థికవ్యవస్థ విలువ దాదాపు 2.3 ట్రిలియన్ డాలర్లు (రూ. 156 లక్షల కోట్లు). ► ఇందులో 20 శాతం దొంగ డబ్బే. ఇది ముంబయ్కి చెందిన ‘యాంబిట్ క్యాపిటల్’ చెప్పిన లెక్క. ► దేశ జి.డి.పి.లో 20 శాతం , దాదాపు రూ. 30 లక్షల కోట్లు (నగదే కాక మిగతావన్నీ కలిపి) దొంగ డబ్బు అని వివిధ సంస్థల అంచనా. దేశంలోని లెక్కచూపని డబ్బులో 60 శాతం కేవలం ఒక శాతం బడాబాబుల దగ్గరుంటే, వాళ్ళను పట్టుకోవడానికి 99 శాతం మంది సామాన్యుల్ని బాధిస్తారా? ఏ నోట్లు ఎంత ఉన్నాయి? ►38 శాతం.... రూ. 1000 నోట్లు ►47 శాతం... రూ. 500 నోట్లు ►10 శాతం... రూ. 100 నోట్లు ►4 శాతం... రూ. 100 కన్నా తక్కువ నోట్లు 1 శాతం... చిల్లర నాణాలు కొత్త నోటు... బాగా ఖర్చే ! ► 30 వేలు... ఇది మొత్తం 2.2 లక్షల ఏ.టి.ఎం.ల్లో ఇప్పటికి కొత్త 2వేల నోటుకి తగ్గట్లు రిపేరైనవాటి సంఖ్య. ► 12 వేలు... ఇది ప్రతిరోజూ కొత్త నోటుకి తగ్గట్లు రిపేరవుతున్న ఏ.టి.ఎం.ల సంఖ్య. ►రూ.10 వేలు... ఇది ఒక్కో ఏ.టి.ఎం.ను ఇలా కొత్త నోటుకు తగ్గట్లు మార్చడానికయ్యే ఖర్చు. ►రూ. 200+ కోట్లు... మొత్తం ఏ.టి.ఎం.లను ఇలా మార్చడానికి అవుతున్న ఖర్చు. -
అంతా తూచ్.!
బహిరంగ మల విసర్జన రహితంపై అధికారుల కాకిలెక్కలు గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ఇబ్బందులు వీరంతా పరిగి మండలం బీచిగానిపల్లి పంచాయతీ పరిధిలోని బీచిగానిపల్లి, గొల్లపల్లి, వంగలపల్లి, పాత్రగానిపల్లి గ్రామాల ప్రజలు. అందరూ ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లలో నివాసముంటున్నారు. వీరి ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. కట్టిస్తామని ఇప్పటి వరకూ ఏ అధికారి వెళ్లలేదు. దీంతో తమకు మరుగుదొడ్లు మంజూరు చేయాలంటూ కలెక్టర్ను కోరేందుకు పంచాయతీ సర్పంచి బాలాజీ ఆధ్వర్యంలో ఈనెల 21న కలెక్టరేట్కు వచ్చి వినతిపత్రం సమర్పించారు. సమస్యపై సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల్లో ఆడవారు బహిర్భూమికి వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'అనంత’ను బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్)జిల్లాగా తీర్చిదిద్ధుతున్నాం. గ్రామాలకు గ్రామాలనే మార్చివేస్తాం’ అని చెప్పడమే కాదు... ఈ పేరిట అధికారులు పండుగలు కూడా నిర్వహించుకున్నారు. సన్మానాలు చేయించుకున్నారు. అవార్డులు ప్రకటించుకున్నారు. జిల్లాను ఎక్కడికో తీసుకెళతామంటూ అంతలా గొప్పలకు పోతోంది నిజమేనా అంటే... కాదని క్షేత్రస్థాయిలో తేలిపోతోంది. అవన్నీ ఉత్తుత్తి మాటలే... మరుగుదొడ్ల నిర్మాణంపై అధికారులు కాకిలెక్కలతో కహానీలు చెబుతున్నారనేందుకు గ్రామాల్లోని పరిస్థితులే అద్దం పడుతున్నాయి. బహిరంగ మల విసర్జన రహితంగా జిల్లాను తీర్చిదిద్ధుతామని అధికారులు చెబుతున్నదానికి క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణ విషయంలో మొక్కుబడి నివేదికలతోనే సరిపెడుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టిస్తామంటూ గ్రామాల్లోకి అధికారులు వెళ్లడం లేదనేందుకు బీచిగానిపల్లి పంచాయతీ నిదర్శనం. అధికారులు అక్కడికి వెళ్లి సర్వే చేసి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి ఉంటే వారంతా కలెక్టరేట్కి వచ్చి ఉండేవారు కాదు. ఇప్పటికే జిల్లాలో వందశాతం బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్ధామని చెబుతున్న గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. నత్తనడకన నిర్మాణ పనులు జిల్లాకు స్వచ్ఛభారత్ కింద 37,754 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి వీటిని నిర్మించాల్సి ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 18,754 మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. లక్ష్యంలో 50 శాతానికి మించలేదనే విషయం ఈ లెక్కల ద్వారా స్పష్టమవుతోంది. మరో నాలుగు నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇంత తక్కువ కాలంలో వంద శాతం లక్ష్యం పూర్తి చేయడం సాధ్యం కాదనే విషయం తేలిపోతోంది. -
పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు
రామడుగు: పెద్దనోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. తమ దాచుకున్న రూ. 500, వెరుు్య నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేశారు. తిరిగి విత్డ్రా చేసేప్పుడు సమస్యలు ఎదురవుతున్నారుు. బ్యాంకు అధికారులు చిన్న నోట్లు ఇవ్వకుండా రూ.రెండు వేల నోట్లు ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన ఈ నోట్లు తీసుకోవడం లేదని వాపోతున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవీ.. ఇంటర్నెట్కు రావడం లేదు ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రకటించనప్పటి నుండి నెట్ పనుల కోసం జనాలు రావడం మానేశారు. దీనితో నెట్ బిల్లు కూడా రాని పరిస్థితి వచ్చింది. చిన్న పని కోసం వచ్చేవాళ్లు రూ.రెండు వేల నోటు పట్టుకొని వస్తున్నారు. -అమర్, ఇంటర్నెట్ నిర్వాహకుడు, వెదిర పనులు నిలిపివేశాం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం శుభ పరిణామం. రద్దు చేసిన ప్రభుత్వం అవసరమైన నోట్లు అందజేయడంతో విఫలమైంది. దీంతో కాంట్రాక్ట్ పనులు నిలిపివేయాల్సి వచ్చింది. కూలీలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. -నాగుల రాజశేఖర్గౌడ్, కాంట్రాక్టర్, వెదిర పొలం దున్నుకోలేకపోతున్నాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది, పెద్ద నోట్లు రద్దు చేయడంతో ఉన్న వాటిని బ్యాంకులో వేశాం. తిరిగి తీసుకుంటే రూ.రెండు వేల నోట్ ఇస్తున్నారు. ట్రాక్టర్ వాళ్లకు డబ్బులు ఇవ్వకపోవడంతో దున్నేందుకు రావడంలేదు. -ద్యావ భూంరెడ్డి, రైతు, వెదిర -
వరంగల్ ప్రసూతి ఆస్పత్రిలో ప్రసవ కష్టాలు
-
బాలయ్య అలా...మాల్యా ఇలా?
సమకాలీనం నల్ల సంపదలో పది శాతం కూడా లేని నగదు రూప నల్లధనంపై ఇంత పోరు చేస్తున్న వారు.. బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిల ఖాతాదారుల ఆస్తులను ఎందుకు జప్తు చేయరు? సామాన్యులను ఇన్ని కష్టాలు పెట్టి బ్యాంకులకు చేర్చే లక్షల కోట్ల నల్లధనం వల్ల సమకూరే ప్రయోజనాలను సామాన్యులకు అందిస్తారా? లేక కాకుల్ని కొట్టి గద్దల్ని మేపిన చందంగా కార్పొరేట్లకు మేలు చేస్తారా? బ్యాంకుల మొండి బకాయిలను రద్దు పద్దులకు బదలాయించడాన్ని చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఇద్దరు భారతీయులు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు లక్ష్యాలతో విదేశాలకెళ్లారు. అంతిమంగా విభిన్న ఫలితాలు సాధించారు. ► చేసిన చిన్నపాటి బ్యాంకు అప్పుతీర్చడానికి ఇక్కడి వ్యవసాయం గిట్టుబాటుగాక, రేయింబవళ్లు కష్టపడి నాలుగు డబ్బులు వెనకేసైనా అప్పు తీర్చొచ్చని మెదక్ జిల్లా ధర్మారం రైతు వర్దా? బాలయ్య దుబాయ్ వెళ్లాడు. ఆశించిన సంపాదన కుదరక, వెనక్కి తిరిగి వచ్చి సొంత భూమి అమ్మే క్రమంలో సర్కారు వారి ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయమే పెనుశాపమై కుటుం బంతో సహా విషం తీసుకొని చనిపోయాడు. ► చేసిన పెద్ద మొత్తం బ్యాంకు అప్పు చెల్లించకుండా ఎగ్గొట్టి, కోర్టు శిక్షల నుంచి తప్పించుకోవడానికి ‘కింగ్’ఫిషర్ విజయ్ మాల్యా లండన్ వెళ్లాడు. తను వెనక్కి తిరిగి రాకపోగా 1200 కోట్ల రూపాయల అప్పును మొదట బ్యాంకు నిరర్థక ఆస్తి (ఎన్పీఏ)గా, ఇప్పుడేకంగా రద్దు (రైటాఫ్) పద్దుగా ప్రక టింపజేసుకొని బ్యాంకులు–ఖాతాదారుల సత్సంబంధాల సంస్కృతినే చంపే శాడు. అదీ, సామాన్యునికి కార్పొరేట్కి మధ్య తేడా! అంతే అనుకుంటే పొర పాటు! సదా ప్రజాపక్షం వహించాల్సిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా సామాన్యుల్ని పట్టించుకోకుండా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కార్పొరేట్లకు మేలు చేసే చర్యల వైపే మొగ్గుతున్నాయి. ఇది ప్రమాద సంకేతం. నల్లధనం విధ్వంసానికి చర్యలు సరే సామాన్యుని ఇబ్బందుల్ని పరిష్కరించే చర్యలు చేపట్టండని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి బుధవారం దిశానిర్దేశం చేసింది. ‘మీరేమో ఇది సర్జికల్ స్రై్టక్ అంటున్నారు, ప్రతివాదు లేమో కార్పెట్ బాంబింగ్ (ప్రజలపై విచక్షణా రహితంగా బాంబులు కురిపిం చడం) అంటున్నారు. ఏదైనా లక్ష్యం నల్ల కుబేరులైనపుడు సామాన్యులపై సర్జికల్స్ట్రైక్స్ సరికాదు. అమాయకులకు వాటిల్లే నష్టం (కొల్లేటరల్ డ్యామేజి) ఎక్కువ లేకుండా చూసుకొమ్మ’ని నిర్దిష్టంగా సూచించింది. అదే రోజున మాల్యా మొండి బకాయిల రద్దు అంశం పార్లమెంటులో వివాదాస్పదమ వడం, కుటుంబ సభ్యులందరికీ కోడి కూరలో విషం కలిపి తినిపించి రైతు బాలయ్య ఆత్మహత్య చేసుకోవడం యాదృచ్ఛికమే అయినా, పరస్పరం సంబంధంలేని అంశాలేం కావు. ఒకదానితో మరొకటి ముడిపడిందే! ఇది మన కరెన్సీతో, బ్యాంకులతో, ఆర్థిక వ్యవస్థతో, ప్ర«భుత్వ ప్రాధాన్యాలతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్న అంశం. ముఖ్యంగా సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న నల్ల కుబేరుల కుంభస్థలంపై కొట్టాలని, అవినీతికి, అక్రమ వ్యవహారాలకు, ఉగ్రవాదానికి దన్నుగా నిలుస్తున్న నల్లధనాన్ని నలిపేయా లని కేంద్రం ‘పెద్ద నోటు రద్దు’ నిర్ణయం ప్రకటించిన తర్వాతి పరిణామాలు వెలువరిస్తున్న కీలక సంకేతం! ఎవరికి దన్నుగా ఉంటున్నాం? ఎవరిని ఇబ్బం దుల పాలుచేస్తున్నాం? ఏ సంస్కృతిని నలిపేసి మరే విష సంస్కృతికి ఊపిరి పోస్తున్నాం? అన్నది చాలా కీలకాంశం. వాదన సరే, వాస్తవమేంటి? బ్యాంకుల్ని ముంచిన విజయ్ మాల్యా పన్నెండొందల కోట్లు సహా మొత్తం రూ. 48,000 కోట్ల మొండి బకాయిల్ని రద్దు చేసిన నిర్ణయం ఎవరికి మేలు చేసేది? ‘రద్దంటే రద్దూ కాదు....’ అని మన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఓ సమర్థింపు రాగం తీశారు. అంతా గోప్యంగా జరిగిపోతుండగా, ‘డీఎన్ఏ’ పత్రిక ఇచ్చిన కథనం వల్ల రేగిన వివాదంతో పార్లమెంటు వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ‘రద్దు (రైటాఫ్) పద ప్రయోగం సాంకేతికమే, ఖాతాదారుల నుంచి బకాయలు ఖచ్చితంగా వసూలు చేసి తీరుతాం’ అని వివరణ ఇస్తూ చెప్పకనే ఓ చేదు నిజం చెప్పారు. ‘బ్యాంకు పుస్తకాల్లో లెక్కల కోసం, మొండి బకాయిలు(ఎన్పీఏలు)గా ఉన్న వాటిని ఆ పద్దు నుంచి తొలగించి, మరో పద్దు కింద చూపడం అంతే!’ అన్నారు. అంటే, బ్యాంకుల స్థితిగతుల్ని చూపేటప్పుడు, సాంకేతికంగానే అయినా... వసూలు కావాల్సిన వాటిని బకాయిలుగా కాక, ఇక ఎప్పటికీ వసూలుకు ఆస్కారం లేని పద్దు కింద చూపించడంతో ఇవి లెక్కలోకి రావు. కాబట్టి బ్యాంకు ఆర్థిక స్థితి బాగున్నట్టు కనిపిస్తుంది. ఇది ఎవర్ని మోసం చేయడానికి? అప్పు తీసుకున్నది నిజం, చెల్లించని మాట నిజం, వసూలు చేయాల్సిన అవసరం ఉన్న మాట నిజం, మరి పద్దు మార్పెందుకు? సమా ధానం లేదు. ‘ఏం చేస్తారో తెలీదు, వచ్చే 2017 మార్చి నాటికి వాటిని ఒదిలించుకోండి....’ అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెబుతూ వచ్చిన ‘క్లీన్ అప్’(ప్రక్షాళన)లో భాగంగా జరిగిందే ఇది! నల్లధనంపై తాజాగా కొనసాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకుల డిపాజిట్లు, ఆరోగ్యకర లావాదేవీలు పెరుగనున్న తరుణంలో ఈ చర్యలు అవసరమా? అన్న సందేహం కలుగు తుంది. నల్ల సంపదలో పది శాతం కూడా లేని నల్లధనం (కరెన్సీ)పై ఇంత పోరు చేస్తున్నవారు, బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిల ఖాతా దారుల ఆస్తులను ఎందుకు జప్తు చేయరు? అని సామాన్యులు కూడా ప్రశ్ని స్తున్న తరుణంలో తాజా ‘రద్దు’ అవసరమా? పెద్ద మొత్తాల్లో బ్యాంకుల నుంచి రుణాలు పొంది, తిరిగి చెల్లించని ఇతర ఎగవేత దారులకు ఎటువంటి సంకేతాలిస్తున్నాం? అన్నది ముఖ్యం. మొండి బకాయిల్లో ప్రపంచంలోనే మన పరిస్థితి అధ్వానం. మొత్తం రుణాల్లో ఎన్పీఏలు (మొండి బకాయిలు) 8.6 శాతంగా ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్, గ్రీస్ మాత్రమే మనకంటే అధ్వా నంగా ఉన్న దేశాలంటేనే పరిస్థితి తీవ్రత స్పష్టమౌతోంది. కాకుల్ని కొట్టి గద్దలకేస్తారేమో? ‘సామాన్య, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారికి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా... దీర్ఘకాలికంగా ప్రస్తుత చర్య మేలు చేసేదే’అనే అభిప్రాయం మెజారిటీ ఆర్థిక మేధావి వర్గంలో వ్యక్తమౌతోంది. ఈ చర్యతో చలామణిలో ఉన్న 87 శాతం డబ్బు (రద్దయిన పెద్ద నోట్లు) ఎటు తిరిగి ఈ 50 రోజుల్లో తప్పనిసరిగా బ్యాంకు గవాక్షానికి రావాల్సిందే! అక్కడ ఏ లెక్కకా లెక్క తేలుతుంది. ఫలితంగా దొంగ నోట్లు నూరు శాతం గల్లంతే! ఆకాంక్ష, అంచనా ప్రకారం ఈ దెబ్బతో... లెక్కలకెక్కకుండా మరుగునున్న నల్లధనం బ్యాంకులకు రాకూడదు. తద్వారా అది ఇక శాశ్వతంగా లేకుండా పోవాలి. కానీ, పాత–కొత్త నోట్ల మార్పిడిని సైక్లింగ్ పద్ధ్దతుల్లో జరిపించడం, పరిమితికి లోబడే అయినా తమవి కాని ఖాతాల్లో డిపాజిట్ చేయించి–తిరిగి పొందడం... తదితర పద్ధతుల్లో నల్లధనాన్ని అక్రమార్కులు తెల్ల ధనంగా మారుస్తున్నారని వార్తలొస్తున్నాయి. దీన్ని ఎలా అడ్డుకుంటారో, ఏ పద్ధతిన నియంత్రిస్తారో ప్రభుత్వ ఆర్థిక నిపుణులే చెప్పాలి. ఐటీ కొరడా బెదిరిం పులతో కొన్ని నియంత్రణ చర్యలిప్పటికే చేపట్టారు. పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్న సదాలోచనా పరులూ కొన్ని సూచనలు చేస్తున్నారు. నల్లధనాన్ని నిర్మూలించడానికి ఈ ఒక్క చర్యే సరిపోదు. అక్రమ, సక్రమ పద్ధతుల్లో సంపాదించి, పన్ను పరిధిలోకి తేకుండా పోగు చేసిన నల్ల సంపద అనేక రూపాల్లో ఉంది. అందులో, నల్లధనం (కరెన్సీ) పదిశాతం లోపే (ఏడెనిమిది శాతాన్ని మించదనేది మరో లెక్క) అన్న అభిప్రాయం ఉంది. ఏదైతేనేం, ఇదొక మంచి ప్రారంభం అనుకున్నా... ఇంకా చాలా చర్యలను పరంపరగా కొనసాగించాలని, ఒకదానితో మరొకదాన్ని ముడిపెట్టాలని, అప్పుడే ప్రభా వమైనా, ఫలతిమైనా ఉంటుందని వారి అభిప్రాయం. కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకోవడానికి చేసే రుణమాఫీ అమలుకు ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేసే బ్యాంకర్లు, అధికారిక ఆర్థికవేత్తలు కార్పొరేట్లకిచ్చే దొడ్డిదారి వెసలుబాట్లను ఎందుకు ప్రశ్నించరు? ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వ్యవసాయ రుణ మాఫీ ప్రకటించే వారు, అధికారంలోకి వచ్చాక తమ ఆర్థిక ప్రాథమ్యాలు మార్చు కొని ఆ మేర బడ్జెట్ కేటాయింపులతో మాఫీ చేస్తామన్నా.... ‘అది బ్యాంకుల రుణ సంస్కృతిని, ఖాతాదారుల చెల్లింపు సంస్కృతిని చెడగొడుతుంద’ని నీతి మాటలు చెప్పే పెద్దలు, ఈ కార్పొరేట్ మొండి బకాయిల ‘రద్దు’ ఏ సంస్కృ తిని పెంచుతుందంటారో! మొన్నటి బ్యాంకుల ‘విలీనాలు’, నిన్నటి‘ క్లీన్ అప్’లు, నేటి ‘రద్దు పద్దు’లను చూస్తుంటే రేపటి వెలుగును కూడా చీకటి చేస్తారేమోనని భయమేస్తోంది. ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు రూ. 3 లక్షల కోట్ల నల్ల« దనం బ్యాంకులకు రాదనుకున్నా... పెద్ద మొత్తంలో డబ్బు బ్యాంకు లకు వచ్చి చేరుతుంది. ప్రస్తుత చర్యలతో పాటు తదుపరి చర్యలూ ఇక కఠినతరంగా ఉంటాయి కనుక బ్యాంకింగ్ డిపాజిట్లు, సక్రమ లావాదేవీలు పెరిగి వడ్డీరేట్లు తగ్గుతాయి. ఆ మేర ద్రవ్యోల్బణమూ తగ్గుతుంది. ఈ ప్రయో జనాల్ని సామాన్యులకు అందిస్తారా? లేక కాకుల్ని కొట్టి గద్దల్ని మేపినట్టు కార్పొరేట్లకే మేలు చేస్తారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. బ్యాంకుల మొండి బకాయిలను (ఎన్పీఏలను) రద్దు పద్దులకు బదలాయించిన చర్యలు పంపుతున్న సంకేతాలు ఈ అనుమానాల్ని బలోపేతం చేస్తున్నాయి. కసరత్తు జరక్కే కష్టాల కొలిమి! కుబేరుల నుంచి కూలీల వరకు, చిత్ర పరిశ్రమ నుంచి చిరు వ్యాపారి దాకా దేశంలోని అందరినీ ప్రత్యక్షంగా ప్రభావితుల్ని చేసిన ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయం వెల్లడికి ముందు అవసరమైన కసరత్తు జరగలేదు. జరిగుంటే, తగు ముందస్తు ఏర్పాట్లు, పౌరులకు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకొచ్చేవి. వందనోట్లు, అంతకన్నా చిన్నవి విరివిగా లభించేవి. ఇప్పుడున్న ఏటీఎంలే ఉపయోగపడేలా రూ. 2,000 నోటు తగిన సైజులో వచ్చేది. అసలు అదెం దుకు వచ్చిందో హేతుబద్ధ్దమైన కారణం దొరికేది. వెయ్యి నోటు వస్తుందో, రాదో సందిగ్ధం తొలగేది. కొత్త రూ. 500 నోటు కొరత తీరేది. ఆ కసరత్తు అసలే జరగలేదనడానికి ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులు, రోజు రోజుకూ మారుతున్న ప్రభుత్వ నిర్దేశాలే అందుకు నిదర్శనం. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఎస్బీఐ వంటి బ్యాంకు నిపుణుల సూచనలు, సలహాలు ఎందుకు తీసుకో లేదో అర్థం కాదు. ఇంత పెద్ద నిర్ణయం ప్రకటించి, ఆచరిస్తున్నపుడు తగు కసరత్తు జరిగి ఉండాల్సిందని ఎవరైనా కోరుకుంటారు. ప్రజలకు ఇబ్బం దులు రాకుండా జేసే ముందు చూపును విడనాడి, దూకుడుగా చేసిన ప్రక టనతో ఆశించిన రాజకీయ ప్రయోజనమే ఎక్కువున్నట్టు స్పష్టమౌతోంది. నల్లసంపద/నల్లధనంపై యుద్ధం వద్దని ఎవరూ అనరు. ఈ సర్జికల్ స్రై్టక్తోనే సరిపెడతారా? అసలైన యుద్ధం చేసే ఆలోచన పాలకులకుందా? అన్నదే సందేహం! దేశీయ నల్లధనంపై దాడితో పాటు విదేశీ నల్లధనంపై, వివిధ రూపాల్లోని నల్ల సంపదపై, బ్యాంకుల్ని ముంచుతున్న మొండి బకాయి దారులపై చర్యలకు పూనుకుంటేనే నిజమైన యుద్ధం. అసలు యుద్ధం వేరు. పరిమితమైన సర్జికల్ స్రై్టక్స్ వేరు. సరిహద్దు నుంచి అర కిలోమీటరు లేదా ఒకటిన్నర కిలోమీటర్లకు మించని శతృభూభాగంలో చేసే లక్ష్యిత దాడులే సర్జికల్స్ట్రైక్స్. విజయ్ మాల్యా మొండి బకాయిల రద్దు ద్వారా..... నిర్యుద్ధ భావనలే సర్కారు సంకేతాలయితే, ఇన్ని కష్టాలు, త్యాగాలతో రేపటి వెలు గుల కోసం నిరీక్షిస్తున్న దేశ పౌరులు స్వల్ప పరిధికి పరిమితమైన ఈ సర్జికల్ స్ట్రైక్స్ తో సరిపెట్టుకోవాల్సిందే! ఈ–మెయిల్ dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
ఇంకా తిప్పలే..
రాయపర్తి : పెద్ద నోట్ల రద్దుతో ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులు ఇంకా కొనసాగుతూనే ఉన్నారుు. సోమవారం బ్యాంకులకు సెలవు రావడంతో జిల్లాలోని పలు మండల కేంద్రాల్లోని బ్యాంకుల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు వారు క్యూలో నిల్చోగా.. తమ వంతు వచ్చే సరికి ఆలస్యం కావడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాల్లోని ఏటీఎం కేంద్రాల్లో నగదు పెట్టినా.. కొద్దిసేపటల్లోనే అవి ఖాళీ అయ్యారుు. దీంతో లైన్లో నిల్చున్న వారు ఉస్సూరుమంటూ వెనుతిరిగారు. కాగా, రాయపర్తికి చెందిన పలువురు తమ పిల్లలను పాఠశాలలకు పంపించకుండా ఎస్బీహెచ్లో లైన్లో నిల్చోబెట్టడం కనిపించింది. -
ధనాగ్రహం
నల్లధనానికి మేం వ్యతిరేకం కాదు నోట్ల రద్దుపై ముందస్తు ఏర్పాట్లు చేయనందునే ఇబ్బందులు పాల ప్యాకెట్లకూ పైసా లేక సామాన్యుడు విలవిల సర్కారు తీరుపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కరుణాకరరెడ్డి మండిపాటు మండుటెండలో చేపట్టిన నిరసన దీక్ష మద్దతు పలికిన కార్యకర్తలు..ప్రజలు తిరుపతి మంగళం: నల్లకుబేరుల మాటెలా ఉన్నా నోట్ల రద్దు నిర్ణయం సామాన్య వర్గాలను భూకంపం మాదిరిగా కుదిపేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుల ఇబ్బందులపై మంగళవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం వరకు కరుణాకరరెడ్డితో పాటు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మండుటెండలో కూర్చున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వీరు నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ నల్లకుబేరుల భరతం పడతానన్న ప్రధాని మోదీ సామాన్య, మధ్యతరగతి గుండెల్లో గునపాలు దింపారని దుయ్యబట్టారు. నల్లధనాన్ని వెలికితీయాలన్న మోదీ కాంక్ష మంచిదే అరుునప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం దారుణమన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు కూలిపనులు, వ్యాపారాలు మానుకుని బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటలసేపు క్యూల్లో జాగారం చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పాల ప్యాకెట్లు కొనుక్కోవాలన్నా డబ్బులు లేవన్నారు. వైద్యం చేరుుంచుకో లేక రోగులు ప్రాణాలు కోల్పోరుున సంఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. జనం ఇబ్బందులపై ముందుగా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం వల్ల నల్ల కుబేరులెవరూ ఇబ్బందులు పడడంలేదన్నారు. బీజేపీ, టీడీపీ నాయకులు తమ నల్లధనాన్ని ఎప్పుడో తెల్లధనంగా మార్చేసుకున్నారన్నారని ఆరోపించారు. నిజంగా నల్లధనం వెలికితీయాలనుకుంటే చంద్రబాబు దేశ విదేశాల్లో దాచి ఉంచిన రూ.లక్షల కోట్లు నల్లధనాన్ని వెలికితీయాలని ఆయన ప్రధానిని డిమాండ్ చేశారు. జిల్లాలో సైన్స కాంగ్రెస్ సభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, మరోపక్క నోట్ల రద్దుతో జనం ఇబ్బందులు పడుతుంటే కలెక్టర్ సిద్ధార్థజైన్ ఎక్కడికి వెళ్లారో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ చంద్రబాబుకు బినామీలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. కరుణాకరరెడ్డితో పాటు పార్టీనాయకులను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. దీనిని నిరసిస్తూ పార్టీ నాయకులు పోలీస్స్టేషన్ వద్ద బైఠారుుంచారు. గంట తర్వాత కరుణాకరరెడ్డిని విడుదల చేశారు. సాయంత్రం 4గంటలకు తిరుపతి ప్రెస్క్లబ్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాలగిరి ప్రతాప్రెడ్డి, ఎస్కె.బాబు, రాజేంద్ర, కొమ్ము చెంచయ్యయాదవ్, ముద్రనారాయణ, ఎంవీఎస్.మణి, వెంకటేష్రెడ్డి, కట్టా గోపీయాదవ్, పుల్లూరు అమరనాథరెడ్డి, హరిప్రసాద్రెడ్డి, ఎస్కె.ఇమామ్, మబ్బు నాదమునిరెడ్డి, కోటూరు ఆంజనేయులు,అబ్రార్, శివచ్చారి, చెలికం కుసుమ, శ్యామల, గీతాయాదవ్, శాంతారెడ్డి, శారద, సారుుకుమారి, పుణీత, రమాదేవి, దుర్గ పాల్గొన్నారు. -
సదా చిల్లర...
చిల్లర కొరతతో ‘వెరుు్య’పాట్లు రూ. వంద కోసం గంటల పాటు పెట్రోలు బంకులో ఎదురుచూపులు 40 శాత ం తగ్గిన హోటళ్ల వ్యాపారం టోల్గేట్ల వద్ద కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు కలబుర్గిలో రూ.500 తీసుకుని రూ.400 ఇచ్చిన వైనం సొమ్మును బంగారంలోకి మార్చుకోవడానికి పరుగులు బెంగళూరు: పెద్దనోట్ల రద్దుతో చిల్లర కొరత ఏర్పడి మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోజువారి పనులను వదులుకుని చిల్లర నోట్ల కోసం పెట్రోలు బంకులు, కమిషన్ ఏజెంట్లు, హోటల్స్ వద్ద క్యూలు కట్టారు. మరికొంతమంది అవసరం లేకపోరుునా బంగారు నాణేలు, ఆభరణాలను కొనడానికి ఎగబడ్డారు. మరోవైపు కిందిస్థారుు ప్రభుత్వ సిబ్బందికి సరైన సమాచారం లేకపోవడంతో బీఎంటీసీ ప్రయాణికులతో గొడవలకు దిగిన సంఘటనలు కూడా బెంగళూరు, మంగళూరుతో సహా పాటు కర్ణాటక వ్యాప్తంగా చోటు చేసుకున్నారుు. నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయాన్ని చాలా మంది స్వాగతించినా తాత్కాలిక ఇబ్బందులను ఎలా ఎదుర్కొవాలో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి తమ వద్ద ఉన్న నోట్లను డిపాజిట్ మిషన్ల ద్వారా డిపాజిట్ చేయడానికి కొంతమంది ప్రయత్నించగా మరికొంతమంది రోజువారి ఖర్చుల కోసం డబ్బు తీసుకోవడానికి ఏటీఎంల వద్ద బారులు తీరారు. మంగళూరు వద్ద చాలా మంది వినియోగదారులు తమ వద్ద ఉన్న సొమ్ముతో బంగారు నాణేలు, ఆభరణాలు కొనుగోలు చేయడం కోసం జ్యువెలరీ షాపుల వద్దకు పరిగెత్తారు. కొంతమంది సొమ్మును అడ్మాన్సగా ఇచ్చి బంగారాన్ని బుధ, గురు లేదా మరోవారం తర్వాతనైనా అందించాల్సిందిగా దుకాణం యజమానులకు చెప్పడం కనిపించింది. ఇక బుధవారం ఉదయం నుంచే బెంగళూరుతో పాటు రాష్ట్రంలో పలు నగరాలకు, పట్టణాలకు కాయగూరలు, పూలు, పండ్లను రవాణా చేసే కే.ఆర్.మార్కెట్, రస్సెల్మార్కెట్, మల్లేశ్వరం, మడివాళ మార్కెట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డారుు. అటు వినియోగదారులు తమ వద్ద ఉన్న సొమ్మును మార్పిడి చేసుకోవడానికి ప్రయత్నించగా వ్యాపారస్తులు తీసుకోలేదు. అంతేకాకుండా వేర్వేరు రాష్ట్రాల నుంచి సరుకును తీసుకుని ఆయా మార్కెట్లకు చేరుకున్న రైతులు, దళారులు కూడా మార్కెట్లోని వ్యాపారస్తుల నుంచి సొమ్ములు తీసుకోవడానికి వెనుకడుగు వేయడం కనిపించింది. వందకోసం రెండు గంటలు... చాలా మంది తమ వద్ద ఉన్న ఐదు వందలు, వెరుు్య నోట్లను మార్చుకోవడం కోసం పెట్రోలు బంకుల వద్ద క్యూ కట్టడంతో చిల్లర సమస్య ఏర్పడింది. నగరంలోని ఓ బంకు సిబ్బంది బెత్లహాం అనే వ్యక్తి వద్ద రూ.ఐదు వందలు తీసుకుని రూ.వందకు పెట్రోలు పోసి మిగిలిన రూ. నాలుగు వందల కోసం క్యూలో నిలబెట్టారు. వినియోగదారుల నుంచి నాలుగు వంద నోట్లు వచ్చిన తర్వాత సదరు నోట్లను తనకు ఇస్తామని చెప్పినట్లు బెత్లహాం సాక్షితో పేర్కొన్నారు. దాదాపు రెండు గంటలు ఇలా నిలబడ్డానని సదరు నోట్లు మరో రెండు రోజులు కుటుంబ ఖర్చులకు ఉపయోగపడుతాయని అందవల్ల విధిలేక ఇలా నిలబడాల్సి వచ్చిందని వాపోయారు. ఇలాంటి ఇబ్బందులు చాలా చోట్ల కనిపించారుు. ⇒ కొన్ని హోటల్స్లలో రూ.500, రూ.1000లకు చిల్లరు లేదు అని బోర్డు పెట్టడంతో వినియోగదాలు వెనక్కు వెళ్లారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హోటల్ వ్యాపారం 30 నుంచి 40 శాతం తగ్గిపోరుుందని రాష్ట్ర హోటల్ యామజామాన్య సంఘం సభ్యుడు ఒకరు పేర్కొన్నారు. ⇒ కలబుర్గిలో కొంతమంది బృందంగా ఏర్పడి ఐదు వందలు తీసుకుని నాలుగు వందల రుపాయాలు ఇచ్చారు. వంద తక్కువైనా పర్వాలేదు రెండు రోజులు ఖర్చులకు సరిపోతాయన్న ఉద్దేశంతో చాలా మంది సదురు నోట్లను తీసుకోవడం కోసం ఎగబడ్డారు. ⇒ రైల్వే, బస్స్టేషన్లలో నోట్ల వినిమయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అరుుతే బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఈ నోట్ల వినిమయం ఎలా అన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో కండక్టర్ రూ.500 నోట్లను తీసుకోకపోవడంతో చాలా చోట్ల ప్రయాణికులకు, బస్సు సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి విధిలేక చాలా మంది ప్రయాణికులు బస్సుల నుంచి మధ్యలోనే దిగిపోయారు. ⇒ మంగళూరుకు చెందిన సత్యనారాయణ హీరేమఠ్ అనే వ్యక్తి వారం రోజుల్లో తన కుమార్తె పెళ్లి కోసం రూ. రెండు లక్షలు అప్పుగా తీసుకున్నారు. అన్నీ రూ.500, రూ.1000 నోట్లే. ఈ నోట్లు బుధవారం నుంచి చలామణిలో లేవు. పోనీ ఈ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసి నూతన నోట్లను తీసుకుందామంటే.. రోజుకు రూ.10వేలు, వారానికి రూ.20వేలు మాత్రమే విత్డ్రాయల్ చేయడానికి అవకాశం ఉంది. అరుుతే పెళ్లికి అవసరమైన వస్తువులు కొనడానికి డబ్బు ఎలా సర్ధుబాటు చేయాలో తెలియడంల లేదని సత్యనారాయణ హీరేమఠ్ వాపోతున్నారు. ⇒ అత్తిబెలే, నైస్రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, తుమకూరు రోడ్డు వద్ద టోల్గేట్ వద్ద వాహనదారులు ఇచ్చిన రూ.500, రూ.1,000 నోట్లను సిబ్బంది తీసుకోకపోవడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయారుు. ⇒ కొంతమంది తమ వద్ద ఉన్న ఐదు వందలకు చిల్లర కోసం యాచకుల వెంట పడ్డారు. ఈ ఘటనలు ఎక్కువగా బెంగళూరులోని ఎంజీరోడ్, కోరమంగళ వద్ద కనిపించారుు. సిగ్నల్స్ వద్ద యాచించే హిజ్రాల వద్ద కూడా రూ. ఐదు వందలు ఇచ్చి రూ. నాలుగు వందలు తీసుకోవడం కనిపించింది. ⇒ మరోవైపు బీదర్లో కొంతమంది ఐదు వందల నోటును గాడిదకు తినిపిస్తూ ప్రభుత్వ నిర్ణయం పట్ల తమ నిరసనను వ్యక్తం చేశారు. మొదట బ్యాంకులో డిపాజిట్ చేయండి ప్రభుత్వ నిర్ణయం వల్ల నల్లధనానికి అడ్డుకట్టుపడుతుందనడంలో సందేహం లేదు. అరుుతే దీని వల్ల గరిష్టంగా రెండు నెలల పాటు అన్ని రంగాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమికంగా అవగాహన చేసుకుని గరిష్టంగా రూ.రెండు కోట్ల నగదు (లిక్విడ్ అమౌంట్) ఉన్నవారికి ఒక సూచన. వంశపార్యంపర్యం కాని స్థిరాస్తుల అమ్మడం వల్ల వచ్చిన నగదు ఇంట్లో ఉంటే బ్యాంకులో డిపాజింట్ చేయడం మంచి నిర్ణయం. ఇందుకు డిసెంబర్ 30 వరకూ అవకాశం ఉంది. అటు పై సర్టిఫైడ్ చార్టెడ్ అకౌంట్ సలహాలు తీసుకుని అవసరమైన పన్నులు చెల్లిస్తే డిపాజిట్ చేసిన సొమ్ములో కొంత వరకూ అరుునా దక్కించుకోవడానికి సాధ్యమవుతుంది. - రాజేష్భట్, ఛార్టెడ్అకౌంట్ -
పుష్కర ఏర్పాట్లు ఇలానా! సిగ్గు.. సిగ్గు
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమంలో కొలువైన సంగమేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లో మహిళా భక్తుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఆదివారం సుమారు 15 వేలకు పైగా భక్తులు ఇక్కడ పుష్కర స్నానాలు చేశారని అంచనా. అయితే, తగిన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయింది. ప్రధానంగా పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం వస్త్రాలు మార్చుకునేందుకు మహిళలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. భర్తలు, బంధువులు.. చీరలు, పంచెలు అడ్డుగా పట్టుకుంటే తప్ప దుస్తులు మార్చుకునే పరిస్థితి లేకపోయింది. అధికారులు రోజుకు లక్ష మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించినా.. వేలల్లో వచ్చిన భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి నెలకొంది. - ఆత్మకూరు -
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
వాడపల్లి(దామరచర్ల): పుష్కర భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పూర్తి స్థాయి భ్రదతా చర్యలు చేపడతామని ఎస్పీ ప్రకాశ్రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి దామరచర్ల మండలం వాడపల్లిలోని పలు ఘాట్లను పరిశీలించారు. నీటివిడుదల తీరు తెన్నులను అంచనావేశారు. ఈసందర్భంగా పోలీసులతో మాట్లాడుతూ పుష్కరాలు జరిగే 12 రోజులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట ఓయస్డీ వెంకటేశ్వర్లు,డీఎస్పీ రామ్గోపాల్రావు ఉన్నారు. -
అలంకారప్రాయంగా ఆ రెండు స్టేషన్లు
సాక్షి, సిటీబ్యూరో: ఆరాంఘర్ చౌరస్తా. ప్రతి రోజు వేలాది మంది రాకపోకలు సాగించే అతిపెద్ద కూడలి. హైదరాబాద్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాలన్నా, మహబూబ్నగర్, కర్నూలు, కడప వైపు వెళ్లాలన్నా ఈ కూడలి మీదుగా వెళ్లాల్సిందే. నగరం నుంచి మహబూబ్నగర్ వైపు రాయలసీమ వైపు వెళ్లే రైళ్లన్నీ ఆ రైల్వేమార్గంలోనే వెళ్తాయి. కానీ ఆరాంఘర్ చౌరస్తా నుంచి రైలుమార్గంలో వెళ్లాలనుకొనేవాళ్లకు మాత్రం ఆ అవకాశం లేదు. అక్కడికి ఒకటిన్నర, రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివరాంపల్లి, బుద్వేల్ రైల్వేస్టేషన్లకు వెళ్లాలి. ఊళ్లకు దూరంగా, ప్రజల రాకపోకలకు ఏ మాత్రం సంబంధం లేకుండా విసిరేసినట్లు ఉన్న ఆ రెండు రైల్వే స్టేషన్లు అక్కడ ఉన్నా లేనట్లే. ప్రతి రోజూ వేలాది మంది నడిచే కూడలిలో రైల్వేస్టేషన్ లేకపోవడంవల్ల నిత్యం ఆ మార్గంలో ఎంఎంటీఎస్, ప్యాసింజర్ రైళ్లు నడిచినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఆరాంఘర్చౌరస్తాలో రైల్వే సదుపాయాలను ఏర్పాటు చేయడం వల్ల వేలాది మందికి ప్రయోజనం కలగడమే కాకుండా ఆ మార్గంలో సబర్బన్ రైల్వే వ్యవస్థ ఎంతో బలోపేతమవుతుంది. రైల్వేకు ఆదాయం కూడా పెరుగుతుంది. దక్షిణమధ్య రైల్వే చొరవ, రాష్ట్రప్రభుత్వ సహకారం ఏకమైతే ఆరాంఘర్ చౌరస్తా అతి పెద్ద ప్రయాణికుల హబ్గా మారేందుకు అవకాశం ఉంది. రెండెకరాల భూమి చాలు... ఎంఎంటీఎస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు ఆరాంఘర్ చౌరస్తా మీదుగా రాకపోకలు సాగించేందుకు స్టేషన్ నిర్మాణానికి కేవలం 2 ఎకరాల స్థలం చాలు. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ భూమి కూడా అందుబాటులో ఉంది. ఆ భూమిలో కొంత స్టేషన్ కోసం కేటాయించవచ్చు. అందుకు ప్రతిగా నిరుపయోగంగా ఉన్న బుద్వేల్, శివరాంపల్లి స్టేషన్ స్థలాలను ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఆరాంఘర్ చౌరస్తాలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రధాన స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, క్యాబ్లు, తదితర వాహనాల కంటే తక్కువ చార్జీల్లో రాకపోకలు సాగిస్తారు. సికింద్రాబాద్ కేంద్రంగా ఇటు బొల్లారం, మేడ్చల్, మనోహరాబాద్ వైపు, అటు ఉందానగర్ వైపు దక్షిణమధ్య రైల్వే సబర్బన్ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ రెండు మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లు, డెమో రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్ నుంచి ఫలక్నుమా వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తుండగా అక్కడి నుంచి ఉందానగర్ డెమో రైళ్లు నడుస్తున్నాయి. ఆరాంఘర్ నుంచి ట్రైన్లో మహబూబ్నగర్ వెళ్లాలనుకొనే ప్రజలు శివరాంపల్లి రైల్వేస్టేçÙన్కు వెళ్లాలి. నగరానికి రావాలంటే బుద్వేల్ స్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ రెండు స్టేషన్లు ఆరాంఘర్కు 1 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉండడం, రోడ్డు సదుపాయం కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఈ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించేందుకు వెనుకడుగువేస్తారు. శంషాబాద్ నుంచి ఆరాంఘర్కు వచ్చేవాళ్లు ఈ స్టేషన్లలో దిగి నడుచుకుంటూ రావలసిందే. ఏ రకంగా చూసినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో శివరాంపల్లి, బుద్వేల్ స్టేషన్లు ప్రయాణికుల ఆదరణకు నోచక అలంకాప్రాయంగానే ఉండిపోయాయి. దీంతో ఆ మార్గంలో నడిచే ఎంఎంటీఎస్,డెమో రైళ్లన్నీ ఖాళీ డబ్బాలతోనే రాకపోకలు సాగిస్తాయి. -
వర్షం పంటలకు జీవం
ఖరీఫ్ సాగుకు తప్పిన కష్టకాలం రైతుల మోముల్లో ఆనందం కళకళలాడుతున్న పంటలు నారాయణఖేడ్: వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు మూడేళ్లపాటు పంటల సాగుకు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుత సీజన్లో కురుస్తున్న వర్షాలు అన్నదాతల్లో ఆనందం నిలుపుతోంది. వర్షాకాలం ప్రారంభమయ్యాక జూన్ మాసంలో సరైన వానలు పడలేదు. మొదట పంట సాగుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలస్యంగా విత్తనాలు వేశారు. పంట ఎదుగుదల సమయంలో వర్షాలు పడడంతో మొలకలకు జీవం పోసినట్లయ్యింది. జూన్ మాసంలో సాధారణ వర్షపాతం 112 మి.మీటర్లు కాగా 110 మి.మీటర్లు పడింది. అయినా రైతులు విత్తనాలు వేశారు. జూలై మాసంలో 212 మి.మీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా 355 మి.మీటర్లు పడింది. దీంతో పంటలకు మేలు చేకూరింది. ప్రతి ఏటా జొన్న పంట 5,202 హెక్టార్లలో సాగు చేస్తారు. ఇప్పటి వరకు 4,100 హెక్టార్లు సాగయ్యింది. పెసర 11,849 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 13,200 హెక్టార్లు సాగు చేశారు. మినుము 6,898హెక్టార్లకు గాను 8,100 హెక్టార్లు, కంది 6.653 హెక్టార్లకు గాను 8,700 హెక్టార్లు, మొక్కజొన్న 4,237 హెక్టార్లకు గాను ఇప్పటి వరకు 3,500 హెక్టార్ల మేర సాగుచేశారు. పత్తి పంట మాత్రం 10,626 హెక్టార్లు ఇప్పటి వరకు 4,800 హెక్టర్ల మేర మాత్రమే వేశారు. పప్పుదినుసుల సాగు బాగానే ఉంది. వర్షాలతో చీడపీడలు ఎడతెరపి లేని వర్షాల వల్ల పంటలకు చీడపీడలు ఆశిస్తున్నాయి. ఇప్పటికే పలు పంటలకు ఈ సమస్య ఉంది. సోయాబీన్, పెసర, మినుము పంటలకు శనగ పచ్చ పురుగు, పొగాకుకు లద్దెపురుగు, మినుము పంటకు బూడిద తెగులు, పత్తి పంటకు రసం పీల్చు పురుగు, కందికి ఆకు గూడు పురుగు వ్యాప్తి చెందాయి. పంట మంచి ఎదుగుతున్నా చీడపీడలతో రైతులు కాస్త దిగాలు పడుతున్నారు. పెసర, మినుము, సోయా పంటలకు ఆశించిన శనగ పచ్చ పురుగు, పొగాకుకు లద్దెపురుగు నివారణకు మోనోక్రోటోపాస్, ఫినాల్పాస్ పిచికారీ చేయాలని వ్యవసాయ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మినుకు ఆశిస్తున్న బూడిద తెగులుకు కాపరాస్ క్లోరైడ్, మోనోక్రొటోపాస్ కలిపి పిచికారీ చేయాలని, పత్తిలో రసం పీల్చు పురుగు నివారణకు మిడ్రాక్లూరిఫైడ్, ఎసిపెట్ స్ప్రే చేయాలని చెప్పారు. కంది పంటకు ఆశిస్తున్న ఆకుగూడు పురుగు నివారణకు ఫినాల్ పాస్, మోనోక్రోటోపాస్లలో ఏదైనా పిచికారీ చేయవచ్చని తెలిపారు. కంది, పెసర, మినుములో మిశ్రమంగా సాగు చేస్తున్నందున ఆ పంటలకు మందు పిచికారీ చేస్తున్నందున కందికి ప్రత్యేకంగా అవసరం లేదని ఆ పంటలకు చేసే పిచికారీ వల్లే కందికి సైతం లబ్ధి చేకూరుతుందని శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
దినదిన గండం..
సాక్షి,సిటీబ్యూరో: వీరంతా కాబోయే ఇంజినీర్లు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు చదివిస్తున్నారు. ఇంటి నుంచి బయలుదేరిన విద్యార్థులు కాలేజీకి చేరుకునేందుకు ఎన్నో కష్టాలు పడుతున్నారు. దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షు.. అన్నట్టు ప్రయాణిస్తున్నారు. నగర శివారు ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు చాలీచాలని ఆర్టీసీ బస్సులతో నిత్యం నరకం చూస్తున్నారు. భుజాలకు బ్యాగులు వేసుకుని బస్సుల్లో నిలబడి, ఫుట్ బోర్డు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇందులో ఎక్కువ శాతం మంది మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలకు చెందినవారే. కళాశాల చైర్మన్ మల్లారెడ్డి ఎంపీ కూడా. అయినప్పటికీ ఈ ప్రాంతంలో సరిపడినన్ని ఆర్టీసీ బస్సులను వేయించలేక పోయారు. కుత్బుల్లాపూర్ సుచిత్ర నుంచి దూలపల్లి, మేడ్చల్, దుండిగల్, మైసమ్మగూడ, కండ్లకోయలోని కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను శనివారం ‘సాక్షి’ కెమెరా బంధించింది. -
జనరల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం
నిజామాబాద్అర్బన్ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎట్టకేలకు ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభమయ్యింది. కొన్ని రోజులుగా ఆక్సిజన్ అందుబాటులో లేక రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర వైద్యసేవలకు ఇబ్బంది ఏర్పడింది. బుధవారం ఆసుపత్రి సూపరిండెంట్ నరేంద్రకుమార్ ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించారు. వెంటిలేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. -
నీటికోసం హాస్టల్ విద్యార్థుల పాట్లు
కుల్కచర్ల: మండల కేంద్రంలోని గిరిజన వసతిగృహంలో నీళ్లు లేక విద్యార్ధులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం లేవగానే కాలకృత్యాలకు, స్నానాలకు, బట్టలు ఉతుక్కోవడానికి నీళ్లు అవసరం. హాస్టల్లోని బోరు ఎండిపోయినా వార్డెన్ పట్టంచుకోవడం లేదు. దీంతో ఉదయం లేవగానే విద్యార్థులు బకెట్ పట్టుకుని ఎక్కడ బోర్వెల్లో నీరు కనిపిస్తే అక్కడికి పరుగులు తీస్తున్నారు. అక్కడ క్యూలైన్లో నిలబడి బకెట్తో నీళ్లు తెచ్చుకుంటున్నారు. కుల్కచర్ల గిరిజన వసతిగృహంలో 4 నుంచి 10 వ తరగతి వరకు 300 మంది విద్యార్ధులు ఉండి చదువుకుంటున్నారు. వసతిగృహంలో నీళ్లు లేకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతం. ప్రతిరోజు చేతిపంపు దగ్గర నీటికోసం ఆ హాస్టల్ విద్యార్థులే కనిపిస్తున్నారు. చాలామంది విద్యార్ధులు వారానికోసారి ఇంటికి వెళ్లి ఒకేసారి దస్తులు శుభ్రం చేసుకొని వస్తున్నారు. తాము పడుతున్న ఇబ్బందులు అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతిగృహంలో నీటి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
కుయ్యో..మొర్రో..
కడప రూరల్ : జీవీకే–ఈఎంఆర్ఐ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 108 అంబులెన్స్ వాహనాలు నడుస్తున్నాయి. ఇందులో కొన్ని వాహనాలు గడువు దాటినా పరిగెడుతూనే ఉన్నాయి. ఈ వాహనాలతోపాటు సిబ్బంది కొరత కూడా ఏర్పడింది. ఫలితంగా ఆపదలో ఉన్న వారు ఇబ్బందులు పడే పరిస్థితి దాపురించింది. సిబ్బంది మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే సంకల్పంతో పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వ సహకారం పెద్దగా లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కనిపించని కొత్త వాహనాల రాక జిల్లా వ్యాప్తంగా 108 వాహనాలు 28 ఉన్నాయి. కడప నగర పరిధిలో రెండు ఉండగా, మండలానికి రెండు చొప్పున మొత్తం మీద 28 వాహనాలు నడుస్తున్నాయి. కాగా, ఒక వాహనం నాలుగు లక్షల కిలోమీటర్ల వరకు మాత్రమే నడవాల్సి ఉండగా, ఆరు లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన వాహనాలు కూడా నేటికీ అలాగే నడుస్తూనే ఉండడం గమనార్హం. 28 వాహనాల్లో నాలుగు లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన వాహనాలు 12 వరకు ఉన్నాయి. అలాగే ఏడాదికి ఐదు చొప్పున జిల్లాకు కొత్త వాహనాలు మంజూరు కావాలి. మూడేళ్లు కావస్తున్నా జిల్లాకు ఒక్క కొత్త వాహనం కూడా మంజూరుకు నోచుకోకపోవడం దారుణం. ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో 14 వాహనాలు ఉండగా, అందులో ఐదు వాహనాలు నాలుగు లక్షల కిలోమీటర్లు దాటి నేటికీ నడుస్తున్నాయి. దీంతో ఆ వాహనాలు రోడ్డు మీదనే మొరాయిస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉదాహరణకు ఐదు రోజుల క్రితం రైల్వేకోడూరులోని వాహనం ద్వారా తిరుపతి రుయా ఆస్పత్రికి రోగిని అత్యవసరంగా తరలిస్తుండగా మామండూరు దగ్గర 108 వాహనం నడిరోడ్డుపై కదలనని మొండికేసింది. దీంతో అందులో ఆపదలో ఉన్న వ్యక్తి బంధువులు ఆందోళన చెందారు. చివరకు అరగంట తర్వాత తిరుపతి నుంచి 108 వాహనం రాగా, అందులో ఆ వ్యక్తిని తరలించారు. కాగా జిల్లా వ్యాప్తంగా నెలకు 3500 నుంచి 4000కు పైగా వివిధ రకాల కేసులు నమోదవుతున్నాయి. అందులో 40 శాతం రోడ్డు ప్రమాదాలు, 35 శాతం మెడికల్, 20 శాతం గర్భిణీ స్త్రీలు, 5 శాతం ఆత్మహత్యలకు సంబంధించి ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గడువు దాటిన వాహనాలు నడపడం ఎంతవరకు సబబనే ప్రశ్న తలెత్తుతోంది. సిబ్బంది ఆవేదన విధులు చేపట్టే సిబ్బందికి దాదాపు ఎవరికైనా సరే ఎనిమిది గంటల పని ఉంటుంది. అయితే 108లో పనిచేసే వారు 12 గంటలపాటు పనిచేయాలి. ఆ మేరకు ఒక వాహనానికి ఒక టెక్నిషియన్, ఒక పైలెట్ (డ్రైవర్)తోపాటు అదనంగా మరో ఇద్దరిని కేటాయిస్తారు. ఇలా జిల్లా వ్యాప్తంగా టెక్నిషియన్లు 63 మంది, డ్రైవర్లు 68 మంది పనిచేస్తున్నారు. వారంతా తమకు చాలీచాలని వేతనం వస్తోందని వాపోతున్నారు. సీనియారిటీ ప్రకారం టెక్నిషియన్లకు రూ. 7500 నుంచి రూ. 11000, డ్రైవర్లకు రూ. 7700 నుంచి రూ. 10,000 మాత్రమే వస్తుందని, ఇది తమకు ఏమాత్రం సరిపోతుందని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ భద్రత లేకపోగా, కనీసం వేతనాల్లో కూడా పెంపుదల లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆపదలో ఉన్న వారిని ఆదుకునే 108కు, అందులో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం అన్ని విధాల సహకరించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 108 సర్వీసుల వివరాలు –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– జిల్లాలో 108 అంబులెన్స్ వాహనాల సంఖ్య 28 4 లక్షల కిలోమీటర్లు దాటి ప్రయాణిస్తున్న వాహనాలు 12 నెలకు నమోదయ్యే కేసులు 4 వేలకు పైగా మూడేళ్లుగా మంజూరైన కొత్త వాహనాలు –– నిల్ పనిచేస్తున్న టెక్నిషియన్ల సంఖ్య 63 పైలెట్లు త్వరలో ఐదు కొత్త వాహనాలు వస్తాయి! జిల్లాకు త్వరలో అత్యాధునికమైన ఐదు కొత్త వాహనాలు రానున్నాయి. వీటిని కడపతోపాటు ప్రధాన పట్టణాలకు ఒకటి చొప్పున కేటాయిస్తాం. మందులకు, నిర్వహణకు నిధులకు ఎలాంటి కొరత లేదు. ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకోవడమే మా ధ్యేయం. – ఐవీ శంకర్, జిల్లా (ఈఎంఈ) ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్ -
బెజవాడలో కష్టాలుపడుతున్న భక్తులు
-
పేదలకు అందని ప్రభుత్వ వైద్యం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్రెడ్డి ఎంజీఎం ఆస్పత్రిలో టీడీపీ ఒక ్క రోజు దీక్ష ఎంజీఎం : నాలుగు జిల్లాల ప్రజలకు పెద్ద దిక్కు అరుున ఎంజీఎం ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఎంజీఎం ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయూలని టీడీపీ ఒక్క రోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మానవ వనరులను వినియోగించుకోవడం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దీనికి ఎంజీఎం ఆస్పత్రిలో సగానికిపైగా ఖాళీగా ఉన్న వైద్య పోస్టులే నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ రెండేళ్ల పాలనలో ఒక్క డాక్టర్ పోస్టును కూడా భర్తీ చేయలేదన్నారు. ఆస్పత్రిలో కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో ఫిజిషియన్, గ్యాస్ట్రో వంటి వైద్యుల లేకపోవడంతో రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 152 డాక్టర్లు కావల్సి ఉండగా 73 స్థానాలు ఖాళీగానే ఉన్నాయన్నారు. ఆరోగ్య శ్రీ ఆస్పత్రులకు రూ. 800 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలను నిలిపివేయడం వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రుల పరిస్థితి ఈ విధంగా ఉంటే పీహెచ్సీల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారిందన్నారు. టీడీపీ మిషన్ కాకతీయ వ్యతిరేకం కాదని.. మిషన్ కాకతీయలో జరిగే అవినీతికి వ్యతిరేకమన్నారు. అంతేకాకుండా ఎంజీఎం ఆస్పత్రిలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, కాంట్రాక్టర్ సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని కలెక్టర్ కరుణ పేర్కొన్నారని తెలిపారు. రెండు నెలల్లో వైద్య పోస్టుల నియూమకాలతో పాటు రోగులకు మెరుగైనా సేవలందించకపోతే టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలకు శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి, సీతక్క, నాయకులు ఈగ మల్లే శం, అశోక్కుమార్, గన్నోజు శ్రీనివాస్, జాటో తు ఇంద్ర, హుస్సేన్, శ్రీరాముల సురేష్, హు స్సెన్, నరేందర్, వీరస్వామి పాల్గొన్నారు. -
సాదాసీదా కాదు!
♦ ‘సాదా బైనామా’లో అనేక ఇబ్బందులు ♦ రిజిస్ట్రేషన్లకు అడ్డుతగులుతున్న ‘సమ్మతి’ ♦ భూముల ధరలు పెరగడంతో కిరికిరి ♦ నిబంధనల్లో సడలింపులు కోరుతున్న రైతులు నక్కర్తమేడిపల్లికి చెందిన ఓ భూస్వామి అప్పట్లో తన వ్యవసాయ బావి వద్ద వెట్టిచాకిరీ చేస్తున్నందుకు ఓ పేద రైతుకు రెండెకరాలు తెల్లకాగితంపై రాసిచ్చాడు. ఇప్పటివరకు ఆ రైతు దాన్ని మ్యుటేషన్ చేయించుకోలేదు. ‘సాదాబైనామా’ ప్రకటన తెలుసుకుని భూస్వామిని ‘సమ్మతి’ కోసం కలిశాడు. అప్పట్లో రేట్లు లేక ఎంతపడితే అంతకు ఇచ్చినం. ఇప్పుడు ఆ భూమి నీకు పట్టా కావాలంటే.. ఇప్పటి ధరలో సగమన్నా ఇవ్వమని మెలిక పెట్టాడు. యాచారం: సాదా బైనామాల (తెల్లకాగితంపై జరిగిన క్రమవిక్రయాలు) క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో చాలా మంది రైతులు సంతోషించారు. కానీ మార్గదర్శకాలు చూసి దీని వల్ల ప్రయోజనం కొంతేనని నిట్టూర్చుతున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో యాచారం, మంచాల మండలాల్లోనే సాదా బైనామాలకు అవకాశం ఉంది. మంచాల, యాచారం మండలాల్లో పది గ్రామాల వరకు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో సాదా బైనామాలకు వీల్లేదు. మిగతా గ్రామాల్లో 2014 జూన్ 2లోపు భూముల క్రయ, విక్రయాల కోసం రాసుకున్న తెల్ల కాగితాలకు సెక్షన్ 22 (2) ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టాదారు పాస్బుక్స్ చట్టం మేరకు సాదా బైనామాపై ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. సాదా బైనామాల పేరు తో ప్రభుత్వం తెల్లకాగితాలపై రాసుకున్న భూ క్రయ, విక్రయాలకు రిజి్ర స్టేషన్, మ్యూటేషన్, పట్టాదారు, పా సుపుస్తకాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించడం సంతోషకరమైన విషయమైనప్పటికీ.. ఇది ఎంత వరకు ఫలితాలనిస్తుందనేది తేలాల్సి ఉంది. భూముల ధరల పెరుగుదలతో చిక్కులు.. పదేళ్ల కింద ఇబ్రహీంపట్నం డివిజన్లో కేవలం ఇబ్రహీంపట్నం పట్టణం మినహా యాచారం, మంచాల మండలాల పరిధి గ్రామాల్లోని భూములకు పెద్దగా ధరల్లేవు. అప్పట్లో కొందరు భూస్వాములు తమవద్ద వెట్టిచాకిరీ చేసినందుకు కొందరికి తెల్లకాగితంపై రాసిచ్చారు. ఏళ్ల క్రితం అంతోఇంతో ఇచ్చి తెల్లకాగితంపై సంతకాలు తీసుకుని సొంతం చేసుకున్నవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో కొన్ని పట్టాలు అవగా మరికొన్ని తెల్లకాగితంపైనే ఒప్పదంగా అయి ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం సాదా బైనామాల పేరుతో ఉచిత రిజిస్ట్రేషన్కు సడలింపు ఇవ్వడం, భూముల ధరలు రూ.లక్షల్లో పెరగడం వల్ల సాదా బైనామాలకు విక్రయదారులు ససేమిరా అంటున్నారు. కొన్ని గ్రామా ల్లో కొనుగోలు దారులు, విక్రయదారుల కుటుంబ సభ్యులను కలిసి అంతోఇంతో ఇచ్చుకుంటామంటూ భేరసారాలు చేసుకుంటున్నారు. యాచారం మండలంలోని నందివనపర్తి, నక్కర్తమేడిపల్లి, మాల్, మంతన్గౌరెల్లి, చింతపట్ల, మొండిగౌరెల్లి, కొత్తపల్లి, నల్లవెల్లి, మంచాల మండలంలోని లోయపల్లి, ఆరుట్ల, మంచాల, ఎల్లమ్మతండా తదితర గ్రామాల్లో అప్పట్లో తెల్లకాగితాలపై జరిగిన క్రయవిక్రయాలు అనేకం ఉన్నాయి. -
ఉదయం 11 వరకే తరగతులు
నిబంధనలు అతిక్ర మించే పాఠశాలలపై చర్యలు డీఈవో నాగేశ్వరరావు హెచ్చరిక చిత్తూరు(గిరింపేట): జిల్లాలో ప్రస్తుతమున్న ఎండ తీవ్రత దృష్ట్యా అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఉదయం 11 వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని డీఈవో నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరగనుందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఆదేశాలను జారీ చేశామని తెలిపారు. నిబంధనలను అతిక్రమించి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మంగళవారం ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను త నిఖీ చేయడానికి ప్రత్యేకంగా అధికారులను నియమించామని తెలిపారు. వారు 11 గంటలపై అన్ని పాఠశాలలను తనిఖీ చేస్తార న్నారు. రెండో పేపర్ పరీక్ష ఉన్న తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రం 11 గంటలకుపైన పరీక్షలను రాయించాలన్నారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే సంబంధిత ప్రదేశాల్లో వున్న ఎంఈవోలకు, డీవైఈఓలకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
మండే ఎండ
ఆరేళ్ల తరవాత రికార్డు స్థాయి ఉష్ణోగ్రత 41.4 డిగ్రీలుగా నమోదు సిటీబ్యూరో: గ్రేటర్లో రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. ఆరేళ్ల తరువాత సోమవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. గ్రేటర్లో 2010 ఏప్రిల్ 16న42.7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. ఈ ఏడాది ఏప్రిల్ తొలివారంలోనే (సోమవారం) 41.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. ఈ సీజన్లో ఇప్పటి వరకు నమోదైనఅత్యధిక ఉష్ణోగ్రత ఇదే. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 26.7 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమ 24 శాతానికి పడిపోయింది. మధ్యాహ్న వేళల్లో ఇళ్ల నుంచి బయటకు వెళ్లిన వారు ఎండ తీవ్రతకు అవస్థలు పడ్డారు. చిన్నారులు, వృద్ధులు, రోగుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత కనిపించింది. ఈ నేపథ్యంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
స్మరణీయం.. రమణీయం
రమణానందం భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి నిన్ను నీవు తెలుసుకునే ఎరుకకు సరళమైన ఆధ్యాత్మికమార్గం మౌనమే అని తనజీవితం ద్వారా మనకు చూపించిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి. మార్గశిర బహుళ విదియ పునర్వసు నక్షత్రంలో అంటే 1879 డిసెంబరు 29 అర్ధరాత్రి తమిళనాడు రాష్ర్టంలోని మధురై సమీపాన గల తిరుచ్చుళిలో అలఘమ్మ, సుందరయ్యర్ పుణ్యదంపతులకు పుట్టిన వెంకట రామన్ మౌనస్వామిగా, శ్రీ రమణ మహర్షిగా ప్రసిద్ధులయ్యారు. లోకంలో దుఃఖం, కష్టం ఎందుకని ఒక భక్తుడు అడిగిన దానికి సమాధానంగా కష్టాలు రాకపోతే సుఖం కావాలనే కోరిక పుట్టదు. సుఖం కావాలన్న కోరిక లేకపోతే ఆత్మాన్వేషణ విజయవంతం కాదు అని చెప్పారు. అయితే కష్టాలు, దుఃఖం ఉండటం మంచిదంటారా అని మరొకరు అడిగారు. అప్పుడాయన అసలు దుఃఖమనేది నేను దేహాన్ని అనే మిధ్యాభావన వల్లే కలుగుతోంది. దానిని వదిలించుకోవడమే జ్ఞానం అని సమాధానమిచ్చారు. నాపై అనుగ్రహం చూపండని ఒక భక్తుడు వేడుకున్నాడు. ఆత్మయే అనుగ్రహ స్వరూపం. ఆత్మ ఎల్లప్పుడూ తన అనుగ్రహం చూపుతూనే ఉంటుంది. దానిని మనం గ్రహించుకోవాలి. ఆత్మప్రేరణ వల్లే నీవడిగావు, నేను చెప్పావు’ అని చెప్పారు. అరుణాచలంలో అడుగిడినప్పటినుండి 1950 ఏప్రిల్ 14న సిద్ధిని పొందేవరకు మౌనం అనే విలువైన సాధన ద్వారా అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపదను మనకందించిన భగవాన్ రమణ మహర్షి నిత్యస్మరణీయులు, ఆయన బోధలు చిరస్మరణీయాలు. రమణీయాలు. - బ్రహ్మానంద రెడ్డి -
సిటీ గజగజ
పడిపోయిన ఉష్ణోగ్రత రాగల 48 గంటల్లో మరింత తీవ్రం నగరంపై చలి పులి పంజా విసురుతోంది. ఒక్క రోజులోనే వాతావరణం మారిపోయింది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న శీతల గాలులతో సిటీజనులు గజగజలాడుతున్నారు. శుక్రవారం గరిష్టంగా 33, కనిష్టంగా 17.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల 48 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు పడిపోయే అవకాశాలున్నట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ ప్రకటించింది. శీతల గాలులతో పాటు చలి మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి చలిగాలులు పెరగడంతో ఆస్తమా రోగులు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వెట్టర్లు, జర్కిన్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్లకు గిరాకీ పెరిగింది. వీటిని విక్రయించే దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జామున, రాత్రి వేళల్లో బయటికి వెళుతున్న వారు వణుకుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో -
బ్యారేజీని పరిశీలించిన ‘వంశధార’ బృందం
విజయవాడ : పదమూడు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్న ప్రకాశం బ్యారేజీని శుక్రవారం ఉదయం వంశధార ట్రిబ్యునల్ బృందం పరిశీలించింది. నగరాలకు సమీపంలో ఉన్న ప్రాజెక్టుల వల్ల అక్కడి ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించేందుకు ఈ బృందం పర్యటిస్తోంది. ఈ బృందంలో జస్టిస్ డాక్టర్ ముంకు ందం శర్మ, జస్టిస్ బి.ఎస్.చతుర్వేది, జస్టిస్ గులామ్ మహ్మద్తో పాటు 15 మంది న్యాయవాదులు ఉన్నారు. రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కృష్ణాడెల్టా చీఫ్ ఇంజినీర్ సుధాకర్, ఎస్ఈ రామకృష్ణ బ్యారేజీ గురించి బృంద సభ్యులకు వివరించారు. బ్యారేజీ ప్లాన్ను చూపించారు. సముద్రానికి 80 కిలోమీటర్ల ఎగువలో ప్రకాశం బ్యారేజీ ఉందని, దీనివల్ల కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందుతోందని మంత్రి ఉమా బృందానికి వివరించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అక్రమ నిర్మాణాలవ ల్ల ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉన్న రిజర్వాయర్లలోనే నీరులేని పరిస్థితి ఉందని బ్యారేజీ దిగువన నీరులేని ప్రాంతాన్ని చూపించారు. అనంతరం వంశధార ట్రిబ్యునల్ బృందం టూరిజం శాఖ లాంచీలో కృష్ణానదిలో పర్యటించింది. -
సీఎం పర్యటనతో భక్తుల పాట్లు
- పోలవరం రహదారిపై 4 గంటల పాటు ట్రాఫిక్ నిలిపివేత - తీవ్ర ఇబ్బందులు పడిన యూత్రికులు పోలవరం/పోలవరం రూరల్/పుష్కరఘాట్ (కొవ్వూరు) : పోలవరం మండలంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా పుష్కర యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపివేయడంతో పుష్కర స్నానాలు చేసేందుకు వెళుతున్న భక్తులు అవస్థలు పడ్డారు. పట్టిసీమ రేవుకు పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు దాదాపు 4 గంటల పాటు ట్రాఫిక్లో వేచి ఉండాల్సి వచ్చింది. ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి రావాల్సి ఉండగా రెండున్నర గంటల ఆలస్యంగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో హెలికాఫ్టర్లో వెంకటాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం హెడ్వర్క్స్ వద్దకు వెళ్లి తిరిగి 1.45 గంటలకు వెంకటాపురం వచ్చి హెలికాఫ్టర్లో సీఎం వెళ్లారు. ముఖ్యమంత్రి పర్యటనతో పోలీసులు ఉదయం 9.30 నుంచి పోలవరం-కొవ్వూరు రహదారిపై ట్రాఫిక్ను నిలిపివేశారు.పోలవరం నుంచి పట్టిసీమ వైపు వెళ్లే వాహనాలను పోలవరంలోను, తాళ్లపూడి నుంచి పోలవరం వైపు వచ్చే వాహనాలను కన్నాపురం అడ్డ రోడ్డు వద్ద, పట్టిసీమకు కొయ్యలగూడెం వైపు నుంచి వచ్చే భక్తులను వెంకటాపురం వద్ద నిలిపి వేశారు. దీంతో భక్తులు కొవ్వాడ కాలువ గట్లపై నుంచి, ఆర్ అండ్బీ రోడ్డుపై కాలినడకన గమ్యస్థానాలకు చేరుకున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా పుష్కరస్నానం చేసిన తరువాతే టిఫిన్ చేస్తామనే ఉద్దేశంతో ప్రయాణం కొనసాగించగా సీఎం బందోబస్తు వల్ల నాలుగు గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో ఆకలితో అలమటించారు. కొందరు భక్తులు విసుగుచెంది వెనుదిరిగారు. జిల్లా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేని పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై అత్యంత ప్రేమ కురిపిస్తూ తరచూ ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వస్తుండడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోయూరు. సీఎం వచ్చిన ప్రతిసారి ట్రాఫిక్ను నిలిపేయడమే కాక దుకాణాలను సైతం మూరుుంచేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. -
తలుపుల్లేని మరుగుదొడ్లు.. నీళ్లు రాని బాత్రూమ్లు
ఎస్ఎస్తాడ్వాయి : గిరిజన ఆశ్రమ పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టులాడుతున్నాయి. విద్యార్థులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థినులు పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. తాడ్వాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 558 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో 26 స్నానాల గదులు, 40 మరుగుదొడ్ల గదులు ఉన్నాయి. ఇందులో 16 మరుగుదొడ్లు వినియోగంలో ఉండగా, 24 మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. విద్యార్థినుల సంఖ్యకు తగిన స్నానాల గదులు, మరుగుదొడ్లు లేకపోవడంతో వారు తెల్లవారుజామునే లేచి మరుగుదొడ్లు, బాత్రూమ్ల ఎదుట గంటల తరబడి క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పాఠశాలలో భవనాల మీద భవనాలు నిర్మిస్తున్న గిరిజన సంక్షేమశాఖ అధికారులు విద్యార్థినులకు కావాల్సిన కనీస సౌకర్యాలపై దృష్టి సారించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మేడారం ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో.. మేడారం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోనూ మరుగుదొడ్లు, స్నానాల గదుల కొరత ఉంది. 480 మంది విద్యార్థినులు ఉన్న ఈపాఠశాలలో 17 స్నానాల గదులు, 13 మరుగుదొడ్లు ఉన్నాయి. మేడారం జాతర సందర్భంగా నిర్మించిన 10 మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరి వినియోగించడానికి వీలులేకుండా ఉన్నాయి. వీటిని వినియోగంలోకి తీసుకొస్తే కొంతమేరకైనా సమస్య తీరుతుందని విద్యార్థినులు పేర్కొంటున్నారు. ఐటీడీఏ అధికారులు దృష్టి సారించి మరుగుదొడ్లు, స్నానాల గదులు నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాడ్వాయి హాస్టల్లోనూ అంతే.. మండల కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహాంలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఈ పాఠశాలలో 250 మంది విద్యార్థినులు ఉన్నారు. పాఠశాలలోని 20 మరుగుదొడ్లు మరమ్మతుకు నోచుకోవడం లేదు. సెప్టిక్ ట్యాంక్ కనెక్షన్ పైపు పగిలిపోవడంతో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. ఇటీవల కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లకు వాటర్ కనెక్షన్ పైపులు పాడైపోవడంతో విద్యార్థినులు బకెట్లల్లో నీళ్లు తీసుకెళ్లాల్సి వస్తోంది. స్నానాలకు గదులు కూడా లేకపోవడంతో విద్యార్థినులు హౌస్ వద్దనే స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. హాస్టల్ భవనం కుడా శిథిలావస్థకు చేరింది. భవనం స్లాబ్ పెచ్చులూడి చువ్వలు తేలుతున్నాయి. భవనం ఎప్పుడు కూలుతోందనని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సంబంధిత అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని హెచ్డబ్ల్యూఓ వాపోయారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాల పునఃప్రారంభం నాటికల్లా అదనపు మరుగుదొడ్లు, స్నానాల గదుల నిర్మాణంతోపాటు నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు, స్నానాల గదులను వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఐటీడీఏ అధికారులపై ఉంది. పీఓ స్పందించి ఆశ్రమ పాఠశాలల్లోని సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. -
క'న్నీరు'
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో అప్పుడే ‘పానీ’పట్టు యుద్ధాలు మొదలయ్యూరుు. తాగునీటి కోసం జనాలు అల్లాడాల్సి వస్తోంది. గుక్కెడు నీటి కోసం రోడ్లెక్కి ఆందోళనలు చేపట్టక తప్పటం లేదు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం..రిజర్వాయర్లు అడుగంటడం..కిన్నెరసాని, పాలేరు తదితర జలాశయూలు నిండుకోవడంతో పల్లెలు దాహంతో కొట్టుమిట్టాడుతున్నారుు. టేకులపల్లి మండలం సులానగర్ , బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామస్తులు దాహార్తి తీర్చుకోవడం కోసం ఆందోళనబాట పట్టారు. జిల్లాలో పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. మొన్నటి జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానించినా.. కలెక్టర్ ఇలంబరితి ఆదేశాలు జారీ చేసినా ప్రజల క‘న్నీటి’ని తూడ్చడంలో మాత్రం నిర్లక్ష్యం వెంటాడుతూనే ఉంది. ఖరీఫ్, ఈ రబీలో వర్షాభావం.. రిజర్వాయర్లలో నీటి మట్టం పడిపోతుండటం.. జిల్లాలో ఈ వేసవిలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంటోంది. ప్రధాన రిజర్వాయర్లు అడుగంటుతుండటంతో మంచినీటికి ఇబ్బందులు తప్పట్లేదు. వేసవిని దృష్టిలో పెట్టుకొని పాలేరు, వైరా రిజర్వాయర్లను సాగర్ జలాలతో నింపాల్సి ఉంది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు మంచినీరు అందించే కిన్నెరసానికి అవుట్ ప్లో ఎక్కువగా లేకపోవడం.. ఈ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చనుంది. వెయ్యికి పైగా నివాస ప్రాంతాల్లో దాహం.. దాహం.. జిల్లాలో 41 మండలాల్లో 2,671 నివాస ప్రాంతాలకు 1,637 ఆవాసాలకు మాత్రమే మంచినీరు అందుతుంది. 1,030 ఆవాసాల్లో మంచినీటి ఇబ్బందులు ఉన్నాయి. జిల్లాలో చేతి పంపులు 19,663 ఉండగా నేరుగా మంచినీటి సరఫరా చేసే పథకాలు 718 ఉన్నాయి. చిన్న తరహా మంచి నీటి పథకాలు 364, రక్షిత మంచినీటి పథకాలు 1,335, సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాలు 24 ఉన్నాయి. ఇన్ని ఉన్నా వర్షాభావ పరిస్థితులతో చేతి పంపులు ఎండిపోవడం, వాగుల్లో నీరు లేకపోవడంతో మంచినీటి పథకాలు వట్టిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంచినీటి బోర్లు ఇప్పటికే నీళ్లు లేక ఎండిపోయాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా 449 బోర్లు నిరుపయోగంగా ఉన్నట్లు గ్రామీణ మంచినీటి సరఫరా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా నీటి వనరులు ఉన్న చోట పైపులైన్ల లికేజీలకు కొన్నేళ్లుగా మరమ్మతులు లేవు. ఈ నేపథ్యంలో ఈనెల 17 నుంచి ఆయా శాఖ అధికారులు జిల్లాలో క్రాష్ ప్రోగ్రామ్ ( తక్కువ కాలంలో వేగంగా మరమ్మతులు)ను తీసుకున్నారు. మరమ్మతులు వెంటనే చేస్తేనే ఉన్న నీటి వనరుల ద్వారా ఏజెన్సీలోని గిరిజనులకు గుక్కెడు నీళ్లు అందనున్నాయి. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం ముందే తీసుకోవాల్సిన ఉన్నా అధికారులు ఈనెలలోనే ప్రారంభించడంపై విమర్శలు వస్తున్నాయి. పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మం నగరానికి, వైరా రిజర్వాయర్ నుంచి బోడేపూడి సుజల స్రవంతి పథకం ద్వారా 70 గ్రామాలకు, కిన్నెరసాని ద్వారా కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు మంచినీటి అందిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడం ఈ రిజర్వాయర్లలో ఆశించిన స్థాయిలో నీటి మట్టం లేదు. దీంతో మంచినీటి ఎద్దడిని తలుచుకొని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ‘గూడెం’..పాల్వంచలోకటకట.. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్ నీటిమట్ట క్రమేణా తగ్గుతోంది. నాలుగున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం నుంచి కూడా నేటికి పూడికతీతపై ప్రభుత్వం కానీ, అధికారులు కానీ దృష్టి సారించక పోవడంతో పాటు వర్షాభావంతో నీటి నిల్వల స్థాయి పడిపోతోంది. రిజర్వాయర్ నీటిమట్టం స్థాయి పైకి కనిపిస్తున్నప్పటికీ అడుగున భారీ స్థాయిలో మట్టి, ఇసుక పేరుకు పోయి ప్రాజెక్టు నిల్వలపై ప్రభావం చూపుతున్నాయి. ఇది ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గి ప్రాజెక్టుపై ఆధారపడే కర్మాగారాలైన కేటీపీఎస్, నవభారత్, ఎన్ఎండీసీ కర్మాగారాలకు నీటి సరఫరా సరిపోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీల పరిధిలోని ప్రజలకు ఈ నీరే జీవనాధారం. పాల్వంచ మున్సిపాలిటీ, మండల పరిధిలోని గ్రామాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి ఉంది. కరకవాగు, గాజులగూడెంకు ఇటీవల మంచినీటి పైపులైన్లు వేసినా కూడా మంచినీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా శేఖరంబంజర, మంచికంటి నగర్, పాలకోయతండా, పేటచెరువు, పిల్లవాగు, కుంటినాగులగూడెం, గుడిపాడు, జయమ్మ కాలనీ, వికలాంగుల కాలనీ, వనమా కాలనీ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రిజర్వాయర్ సామర్ధ్యం 407 అడుగులు. ప్రస్తుత సామర్థ్యం 387 అడుగులు. కొత్తగూడెంలో కూడా శివారు ప్రాంతాలకు మంచినీటి సరఫరా కావడం లేదు. పైపులైన్లకు మరమ్మతులు లేకపోవడంతో వచ్చే నీరు కూడా వృథాగా పోతుందని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొత్తగూడెం పట్టణం అంతా నాలుగు రోజులకోసారి కిన్నెరసాని నీటిని విడుదల చేస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వైరాలో రెండు రోజులకోసారి.. వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 18.4 అడుగులు ప్రస్తుతం రిజర్వాయర్లో 7 అడుగుల మేర నీరు ఉన్నది. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో 23 వేల ఎకరాల సాగులో పలు పంటలను రైతులు సాగు చేశారు. రిజర్వాయర్ నుంచి 6 మండలాలకు బోడేపూడి సుజల స్రవంతి మంచినీటి పథకం ద్వారా వైరా, కొణిజర్ల, తల్లాడ, ఎర్రుపాలెం, మధిర, బోనకల్ మండలాల పరిధిలో 70 గ్రామాలకు ప్రతి రోజు కోటి లీటర్ల నీటిని విడుదల చేస్తున్నారు. వేసవి ప్రారంభానికి ముందే తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేసుకున్నా ముందుగా పైపులైన్లకు మరమ్మతులు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైరాలో మాత్రం రెండు రోజులకు ఓసారి తాగునీటిని విడుదల చేస్తున్నారు. గ్రామాలకు వెళ్ళే పైపులైన్లు లీకేజిలు ఉండటంతో పూర్తి స్థాయిలో తాగునీరు అందే అవకాశం లేదు. ఖమ్మం నగరానికి పొంచి ఉన్న ప్రమాదం.. పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 16.80 అడుగులు. రిజర్వాయర్కు నాగార్జున సాగర్ నుండి తక్కువ నీరు రావటం, రిజర్వాయర్ నుండి రెండోజోన్ పరిధి, పాలేరు కాలువ పరిధిలో పంటలకు సాగునీటి కోసం 5400 క్యూసెక్కుల నీటిని విడుదల చేయటంతో రిజర్వాయర్ నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుంది. వేసవి రావడంతో ఖమ్మం నగర ప్రజలకు పూర్తి స్థాయిలో మంచినీటిని అందించాల్సి ఉంది. పాలేరు నీటిని ఆ నియోజకవర్గంలోని 150 గ్రామాలకు తాగునీటికోసం సరఫరా చేస్తున్నారు. సాగర్ నుంచి నీటి సరఫరా పెంచకపోతే 15 రోజుల్లో రిజర్వాయర్ నీటిమట్టం పూర్తిగా తగ్గే ప్రమాదం ఉంది. రిజర్వాయర్ను పూర్తిగా నింపకపోతే వచ్చే వేసవిలో ప్రధానంగా ఖమ్మం నగరానికి మంచినీరు అందదు. -
అమెరికాలో మంచు కష్టాలు
-
మళ్లీ నగదు బదిలీ
అనంతపురం అర్బన్: నగదు బదిలీ పథకాన్ని శనివారం నుంచి అమలు చేయడానికి అధికారులు మార్గదర్శకాలను రూపొందించారు. ఆధార్ నంబర్తో పాటు బ్యాంకు ఖాతా పాసు పుస్తకం జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా జత పరిచి సంబంధిత అధికారులకు అందజేయాలి. ఫారం-1, 3ల్లో కనపరిచిన వాటిని పూర్తి చేసి సంబంధిత గ్యాస్ సరఫరా కార్యాలయాల్లో తప్పనిసరిగా అందజేయాలి. నగదు బదిలీ పథకం అమలులోకి రావడంతో వినియోగదారులకు మళ్లీ దడ పుట్టింది. గతంలో ఈ పథకంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న గ్యాస్ వినియోగదారులకు కొన్ని నెలలు ఉపశమనం కలిగిస్తోనే ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అమల్లోకి తీసుకురావడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం రూ.445 చెల్లిస్తున్న గృహ వినియోగదారులు ఇకనుంచి రూ.1100 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సబ్సిడీ మొత్తం 15 రోజుల తరువాత సంబంధిత వినియోగదారుల ఖాతాలో జమ అవుతోంది. ఇది గుదిబండగా మారుతుందని వినియోగదారులు భావిస్తున్నారు. అయితే ఆధార్, బ్యాంకు పాసుపుస్తకం జిరాక్స్ అందచేయని వినియోగదారులకు మూడు మాసాల వరకు సబ్సిడీ ధరతోనే గ్యాస్ సరఫరా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో 6,26,444 గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఇందులో 5,99,360 మంది వినియోగదారులు ఆధార్, బ్యాంకు ఖాతా పాసుపుస్తకం జిరాక్స్ను ఇదేవరకే అనుసంధానం చేశారు. వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకూడదు : ఇదిలా ఉండగా నగదు బదిలీ పథకం వల్ల గ్యాస్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తనీయకూడదని జేసీ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో గ్యాస్ డీలర్లతో సమావేశమయ్యారు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఆధార్, బ్యాంక్ ఖాతా అనుసంధానం ప్రక్రియ మూడు నెలల్లో పూర్తిచేయాలన్నారు. పథకంపై వినియోగదారులకు సందేహాలు ఉంటే 18002333555 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ ఉమామహేశ్వరరావు, ఏడీఎం జయశంకర్, ఏఎస్ఓలు సౌభాగ్యలక్ష్మి, శోభారాణి, తదితరులు పాల్గొన్నారు. -
వీఐపీ రిపోర్టర్ ఎఫెక్ట్.. నంబర్లేశారు..
ఆదిలాబాద్ రూరల్ : ప్రజా సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ నిర్వహించిన ‘వీఐపీ రిపోర్టర్’ కార్యక్రమానికి అధికార యంత్రాంగం స్పందించింది. నిరుపేదల ఆవాసాలకు గుర్తింపు లభించింది. ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించిందన్న ఆనందం పేదల్లో వ్యక్తమైంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ‘వీఐపీ రిపోర్టర్’గా ఆదిలాబాద్ సమీపంలోని భగత్సింగ్నగర్ కాలనీలో శనివారం పర్యటించి కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్న విషయం విదితమే. తాము ఎదుర్కొంటున్న సమస్యలను కార్మిక కుటుంబాలు మంత్రికి ఏకరువు పెట్టాయి. పింఛన్లు అందడం లేదని, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, విద్యుత్ సౌకర్యం లేక చీకటల్లో కాలం వెళ్లదీస్తున్నామని వివరించారు. నివాసాలకు గతంలో పట్టాలు ఇచ్చినా ఇంటి నంబర్లు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి స్పందించి వెంటనే ఇళ్ల నంబర్లు వేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం గ్రామ సర్పంచు రాథోడ్రామారావు, కార్యదర్శి కలీమ్, పంచాయతీ సిబ్బంది కాలనీ లో పర్యటించి పట్టాలున్న ఇళ్లకు నంబర్లు వేశారు. గతంలో పట్టాలు మంజూరైన 440 ఇళ్లకు నంబర్లు వేస్తామని సర్పంచు రామారావు తెలిపారు. -
అష్టకష్టాలు
రిమ్స్లో అందజేసే సడేరాం సర్టిఫికెట్ల కోసం వికలాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. వికలాంగులకు రిమ్స్లో పరీక్షలు నిర్వహించి వారికి ధృవీకరణ పత్రాలను అందజేసి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు ఉపయోగపడేలా ప్రతి సంవత్సరం సడేరాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డీఆర్డీఏ, రిమ్స్ ఆధ్వర్యంలో వైఎస్ హయాంలో 2007లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి కొన్ని వేల మంది వికలాంగులు అర్హత పత్రాలు పొంది పింఛన్కు అర్హులయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనెల 4వ తేదీ నుంచి రిమ్స్లో సడేరాం కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు. సర్టిఫికెట్ల అందజేయిస్తామని వందలాది వికలాంగులను డీఆర్డీఏ అధికారులు బస్సులలో రప్పిస్తున్నారు. సర్టిఫికెట్ల కోసం కుటుంబసభ్యులు, బంధువుల సహాయంతో వికలాంగులు రిమ్స్కు చేరుకుంటున్నారు. రిమ్స్కు చేరుకున్నప్పటి నుంచి వారి కష్టాలు మొదలవుతాయి. ఓపీ టిక్కెట్ రాయించుకోగానే డీఆర్డీఏ వారు ఆన్లైన్లో వాటిని నమోదు చేస్తారు. ఉదయం 9 గంటలకు నమోదు కార్యక్రమం మొదలవుతుంది. ఆయా విభాగాలకు చెందిన డాక్టర్లు ఉదయం 10 గంటల నుంచి వికలాంగులను పరిశీలిస్తారు. ఒక్కో వైద్యుడు 20మందిని చూడగానే పరీక్షలు చేయడాన్ని నిలిపేస్తారు. ఇదేమిటని వికలాంగులు ప్రశ్నిస్తే తాము 20 మందినే చూస్తామని, అంతకంటే ఎక్కువగా చూడటం తమ వల్ల కాదని, ఈ విషయాన్ని డీఆర్డీఏ వారికి చెప్పామని తెలుపుతున్నారు. తమ ప్రైవేట్ క్లినిక్ వద్ద రద్దీగా ఉందని ఫొన్ రావడమే ఆలస్యం హడావిడిగా వెళ్లిపోతారు. వికలాంగులకు పరీక్షలు చేస్తే తమకేమీ ఒరుగుతుందనే ఆలోచనలో కొంతమంది వైద్యులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు రిమ్స్లోనే పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను దళారులుగా పెట్టుకుని సర్టిఫికెట్కు రూ. 6 వేల నుంచి రూ. 8 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వచ్చిన రోజే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పే అధికారులు వారానికో పదిరోజులకో వచ్చి తీసుకోవాలని చెబుతుండటంతో వికలాంగులు ఉసూరుమంటున్నారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధి నుంచి రెండు బస్సులలో దాదాపు 100 మందికి పైగా వికలాంగులు శుక్రవారం రిమ్స్కు వచ్చారు. చెప్పాపెట్టకుండా మానసిక వైద్య నిపుణులు సెలవు పెట్టడంతో మూడు రోజుల తర్వాత రమ్మని మానసిక వికలాంగులకు చెబుతున్నారు. రేషన్కార్డు లేకపోతే అనర్హులే! రేషన్కార్డులో పేరు ఉంటేనే వికలాంగుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని డీఆర్డీఏ అధికారులు పేర్కొంటున్నారు. ఆధార్ కార్డు ఉంటే ఫలితం లేదని తెలుపుతున్నారు. పదేళ్ల క్రితం రేషన్ కార్డు ఇచ్చారని, పుట్టిన పిల్లల నుంచి పదేళ్ల వయస్సున్న పిల్లలకు ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్టులు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్కార్డు తీసుకొచ్చినా సంబంధిత మున్సిపాలిటీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో నమోదు చేసుకుని రావాలని చెప్పడంతో అర్హులైన వికలాంగులు కూడా చేసేదేమీ లేక వెనుదిరుగుతున్నారు. -
జయలలితతో కర్ణాటకకు కష్టాలు!
బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డిఎంకె అధినేత్రి, పురచ్చితలైవి(విప్లవ వనిత) జయలలిత వల్ల కర్ణాటక ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో శాంతిభద్రతల సమస్య తలెత్తనుంది. దాంతో ఆమెను తమిళనాడు రాష్ట్రంలోని జైలుకు తరలించాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆమెను పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. ఆ తరువాత ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జయలలితను కర్ణాటక జైలులోనే కొనసాగిస్తే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ కర్ణాటక ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నుంచి నివేదిక అందింది. ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఆదివారం సమావేశమయ్యారు. జయలలితను చూసేందుకు నిత్యం పరప్పన అగ్రహార జైలు వద్దకు వేలాదిగా తమిళులు చేరుకుని ఏదో ఒకరూపంలో గొడవలు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో జయలలిత బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. అక్కడ కూడా ఆమెకు బెయిల్ మంజూరు కాకపోతే కర్ణాటకలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. దీంతో ఆమెను తమిళనాడులోని జైలుకు తరలించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. ** -
ప్లాన్ లేని ఫ్లై ఓవర్..ట్రాఫిక్ టై
అక్కరకు రాని ఐదు ఫ్లై ఓవర్లు ప్రణాళిక లేకుండా నిర్మాణం మౌలిక వసతుల కల్పనకు దూరం తప్పని ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలు కోల్కతా మార్గం అనుసరణీయం సాక్షి, హైదరాబాద్: ఎక్కడైనా ఫ్లైఓవర్ నిర్మించారంటే అర్థమేంటి? ఆ దారిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావాలని. ఘనత వహిం చిన అప్పటి మన ప్రభుత్వ పెద్దలు, అధికారులు ముందు చూపులేకుండా ముందుకెళ్లిపోయారు. ఆలోచన లేకుండా ఫ్లైఓవర్ల నిర్మాణానికి పూనుకున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్య పరి ష్కారం కాకపోగా... ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతూ మరిన్ని సమస్యలు తెచ్చి పెడుతోంది. సిటీలో ఉన్న 16 ఫ్లైఓవర్లలో కీలక ప్రాంతాల్లో ఉన్న ఐదు పూర్తి స్థాయిలో అక్కరకు రాకుండా పోయాయి. వీటి నిర్మాణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వీటికి అనుబంధంగా ఉండే జంక్షన్లు, రహదారుల అభివృద్ధిని మర్చిపోయారు. నయాపూల్లోని సమాంతర వంతెన (ప్యార్లల్ బ్రిడ్జ్) సైతం ఈ కోవకు చెందినదే. పీఎన్టీ ఫ్లైఓవర్ పీఎన్టీగా పిలిచే ప్రకాష్ నగర్ ‘టి’ జంక్షన్ ఫ్లైఓవర్ బేగంపేట విమానాశ్రయం వద్ద దాదాపు 700 మీటర్ల పొడవున నిర్మితమైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముందు ఇదే అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో అక్కడికి వచ్చే ప్రముఖులు, ఇతరులకు పీఎన్టీ వద్ద ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ను బేగంపేట వైపు మరో 500 మీటర్ల పొడిగిస్తే అత్యంత రద్దీ చౌరస్తాల్లో ఒకటైన రసూల్పుర మీదుగా ప్రయాణించే వారికి కొంత ఊరట లభించేది. అలా చేయకపోవడం ప్రధాన లోపం. విమానాశ్రయానికి రాకపోకలు సాగించే వారిని దృష్టిలో పెట్టుకుని నిర్మించిన పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే మాదిరిగా అప్పట్లోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినా బాగుండేదనేది రవాణా రంగ నిపుణుల మాట. సీటీఓ ఫ్లైఓవర్: బేగంపేట-సంగీత్ థియేటర్ చౌరస్తాల మధ్య పీఎన్టీ ఫ్లైఓవర్కు కొనసాగింపుగా నిర్మించిందే చీఫ్ టెలికామ్ ఆఫీసర్ (సీటీఓ) ఫ్లైఓవర్. దీని పొడవు దాదాపు 700 మీటర్లు. వాస్తవానికి దీని నిర్మాణ సమయంలోనే ట్రాఫిక్ అధికారులు, నిపుణుల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అప్పటికే ఇటు బేగంపేట వైపు పీఎన్ఈ ఫ్లైఓవర్ ఉండటం, అటు సంగీత్ వైపు మరొకటి నిర్మించనున్న నేపథ్యంలో దీని డిజైన్లో మార్పు చేయాలంటూ గగ్గోలు పెట్టారు. పీఎన్టీకి కొనసాగింపుగా నిర్మించే బదులు దీన్ని అడ్డంగా తిప్పి ప్యారడైజ్ హోటల్ రోడ్-బాలమ్ రాయ్/తాడ్బండ్ చౌరస్తా మధ్య ట్రాఫిక్ కోసం కేటాయించాలని కోరారు. దీని వల్ల జాతీయ రహదారి వైపు వెళ్లే వాహనాలకు ఉపయుక్తంగా ఉండటంతో పాటు బేగంపేట-సంగీత్ మధ్య ట్రాఫిక్ను నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. దీన్ని పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ‘సీటీఓ’ పూర్తి స్థాయిలో ఉపయోగపడకుండా పోయింది. మాసబ్ట్యాంక్ ఫ్లైఓవర్ లక్డీకాపూల్-మెహదీపట్నం మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు మహావీర్ ఆస్పత్రి నుంచి ఎన్ఎమ్డీసీ వరకు దాదాపు 900 మీటర్ల పొడవున దీన్ని నిర్మించారు. ఆ మార్గంలో ట్రాఫిక్కు అవసరమైన వెడల్పుతో ఇది లేకపోవడం ప్రధాన లోపం. నిపుణుల సూచనల ప్రకారం ఈ ఫ్లైఓవర్ను విజయ్నగర్ కాలనీ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని ఖాజా మాన్షన్ వరకు నిర్మించాల్సి ఉంది. అప్పుడు లక్డీకాపూల్-మెహదీపట్నం మార్గాన్ని మాసబ్ట్యాంక్ చౌరస్తాలోని సిగ్నల్తో పని లేకుండా నేరుగా నడిపే అవకాశం ఉండేది. ఈ ఫ్లైఓవర్కు పక్కగా పీటీఐ భవనం వైపు ఉన్న రోడ్డు ఇరుకుగా ఉన్నా దీని విస్తరణ విషయం పట్టించుకోలేదు. ఈ రహదారికి ప్రత్యామ్నాయంగా చింతల్బస్తీ-ఖైరతాబాద్ రోడ్డును అభివృద్ధి చేయాల్సి ఉండగా, ఆ విషయాన్నీ ప్రభుత్వం విస్మరించింది. నారాయణగూడ ఫ్లైఓవర్ మాసబ్ట్యాంక్, సీటీఓ ఫ్లైఓవర్ల మాదిరిగానే నారాయణగూడలో నిర్మించిన దానిలోనూ ప్రాథమికంగానే లోపాలు ఉన్నాయి. లిబర్టీ-ఉస్మానియా వర్సిటీ మార్గాల మధ్య ట్రాఫిక్కు ఇది కేవలం నారాయణగూడ చౌరస్తాను మాత్రమే తప్పిస్తుంది. మిగిలిన చోట్ల ఇబ్బందులు యథాతథం. ఈ ఫ్లైఓవర్ సైతం తగినంత వెడల్పు లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ కావడమే కాకుండా ప్రమాదాలకూ నెలవుగా మారింది. వాస్తవానికి దీని కింది నుంచి వెళ్లే ఆర్టీసీ క్రాస్రోడ్స్-వైఎంసీఏ మధ్యనే ఎక్కువ రద్దీ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ట్రాఫిక్, ఇతర విభాగాల అధికారులు ఆ మార్గానికి సమాంతరంగా నిర్మించాలంటూ విన్నవించినా నిర్మాణ సమయంలో ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఉన్న దానికీ రెండు వైపుల రహదారులను విస్తరించకపోవడంతో ఈ ఫ్లైఓవర్ వల్ల ఉపయోగం లేకుండాపోయింది. అప్పట్లోనే దీన్ని నిర్మించడం వృధా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ రాజధానిలోని ఫ్లైఓవర్లలో అత్యధిక కాలం నిర్మితమైందిగా తెలుగుతల్లి ఫ్లైఓవర్కు రికార్డు ఉంది. అనేక బాలారిష్టాలను అధిగమిస్తూ 1.1 కిమీ పొడవుతో ఇది అందుబాటులోకి రావడానికి ఆరేళ్లకు పైగా పట్టింది. ఇక్బాల్ మీనార్-కట్టమైసమ్మ దేవాలయం మధ్య నిర్మించిన ఈ ఫ్లైఓవర్ డిజైన్నూ మార్చాలని అప్పట్లోనే అనేక మంది ఇంజినీరింగ్, రవాణా రంగ నిపుణులు సూచించారు. ప్రస్తుతం ఉన్న మార్గంలో కంటే ఇటు ఇక్బాల్ మీనార్... అటు లిబర్టీ జంక్షన్లను దాటేలా డిజైన్లో మార్పులు చేస్తే ఫలితాలుంటాయని గగ్గోలు పెట్టారు. ఆది నుంచీ అనేక అవాంతరాలను ఎదుర్కొన్న ఈ నిర్మాణాన్ని అనుకున్న ప్రకారం పూర్తి చేయించడంలోనూ సర్కారు విఫలమైంది. ప్రభుత్వ స్థాయిలో పక్కాగా వ్యవహరించలేకపోవడంతో ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఏడు కిలోమీటర్లలో మూడు ఫ్లైఓవర్లు బేగంపేటలో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్-సికింద్రాబాద్లో ఉన్న సంగీత్ థియేటర్ చౌరస్తాల మధ్య గరిష్ఠంగా ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గంలో బాబు హయాంలో అనాలోచితంగా మూడు ఫ్లైఓవర్లను నిర్మించారు. రహదారిలో దాదాపు సగం (2.4 కిమీ) ఫ్లైఓవర్ల పైనే ప్రయాణం ఉంటుంది. దీని ప్రభావం బేగంపేట, మెట్టుగూడలపై తీవ్రంగా పడింది. ఈ ఫ్లైఓవర్ల కారణంగా ఎలాంటి నియంత్రణ లేకుండా నేరుగా దూసుకువచ్చే వాహనాలతో ఈ రెండు ప్రాంతాల్లోనూ తీవ్రస్థాయిలో ట్రాపిక్ స్తంభించడం ప్రారంభమైంది. వీటి నిర్మాణంతో పాటు అటు బేగంపేట వైపున్న షామ్లాల్ నాలాను విస్తరించే అంశాన్నీ విస్మరించారు. తార్నాక మార్గంలో ఉన్న రోడ్ అండ్ బ్రిడ్జ్ (ఆర్యూబీ)లు రైల్ నిలయం వంతెన, ఆలుగడ్డ బావి వంతెన అంశాన్ని పట్టించుకోలేదు. నయాపూల్ సమాంతర వంతెన ప్రస్తుతం నిర ర్ధకంగా, గందరగోళంగా తయారైన నయాపూల్ పాత వంతెనకు సమాంతరంగా మరో వంతెన వచ్చింది.అఫ్జల్గంజ్-మదీనా-హైకోర్టు మీదుగా సిటీ కాలేజీ మార్గాల్లో ట్రాఫిక్కు ఉపశమనం కలిగించాలన్నది ఈ వంతెన నిర్మాణ ప్రతిపాదనల్లో కీలకాశం. అప్పట్లో పాత వంతెనకు ఇరుపక్కలా సైకిల్ ట్రాక్ ఉండేది. దీన్ని క్రమబద్ధీకరించడంతో పాటు ఇరుపక్కలా వంతెనల నిర్మాణం చేపట్టి, పాతదానితో కలిపేయాలంటూ ట్రాఫిక్ అధికారులు నెత్తీనోరు బాదుకున్నారు. ఒకే బ్రిడ్జ్గా నిర్మిస్తేనే ఫలితాలుంటాయని స్పష్టం చేశారు. అలా చేయకపోవడంతో అఫ్జల్గంజ్తో పాటు మదీనా చౌరస్తాకూ ఇబ్బందులు వచ్చాయి. ఈ వంతెన ఫలితాల కోసం అఫ్జల్గంజ్ వైపు ఉస్మానియా ఆస్పత్రికి ఆనుకుని ఉన్న దుకాణాలను బర్తన్ బజార్కు తరలించే ప్రతిపాదనలూ సిద్ధం చేశారు. దీనికి అవకాశం ఉన్నా అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోకపోడంతో ప్యార్లల్ బ్రిడ్జ్ ఫలితాలు అరకొరగానే ఉండిపోయాయి. కోల్కతా మార్గం అనుసరణీయం... హైదరాబాద్ మాదిరిగానే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా సైతం పురాతన నగరమే. అప్పట్లో పక్కా ప్రణాళిక లేకుండా నిర్మితమైన ఆ నగరంలో తర్వాతి కాలంలో ఫ్లైఓవర్ల నిర్మాణంలో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సిటీ కంటే కనిష్టంగా రోడ్లు విస్తీర్ణం కలిగిన కోల్కతా నగరం అనతి కాలంలోనే ఆ సమస్యను అధిగమించింది. అక్కడ ట్రామ్, మెట్రో ఉన్నప్పటికీ మౌలిక వసతుల పైనా దృష్టి పెట్టారు. సాంకేతికంగా అధ్యయనం చేయడం ద్వారా అవసరమైన ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించి రోడ్ల విస్తీర్ణాన్ని ఆరు శాతం మేర పెంచుకున్నారు. ఫ్లైఓవర్లు శాశ్వతమైన నిర్మాణాలు. వీటిని నిర్మించేప్పుడు ప్రస్తుత అవసరాలనే కాకుండా... భవిష్యత్తును సైతం దృష్టిలో ఉంచుకుని చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వంతెన నిర్మాణం ప్రణాళికా బద్ధంగా ఉండటంతో పాటు దానికి చుట్టుపక్కల సైతం అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తేనే సరైన ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. నగరంలో భవిష్యత్తులో నిర్మించనున్న వాటిలో విషయంలోనైనా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
సమగ్ర స్వాప్నికుడు
స్పృహ అమెరికాలో చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కాదనుకొని స్వదేశానికి వచ్చారు స్వప్నిల్ చతుర్వేది. ఆయన స్వదేశానికి రావడానికి గల కారణం చాలామందికి నవ్వు తెప్పించింది. ‘‘మన దేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాను’’ అని చెప్పినప్పుడు ఆయన్ను ఎవరూ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అమెరికాలో దశాబ్దకాలం పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేశారు చతుర్వేది. ఒకరోజు స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు ‘ఇండియాలో పారిశుధ్యం’ టాపిక్ వచ్చింది. మన పారిశుధ్యంపై ఎన్నో జోక్లు! కానీ ఆ జోకులకు చతుర్వేదికి నవ్వాలనిపించలేదు. మనసులో బాధగా అనిపించింది. ‘‘ఇండియాకు వెళ్లాలి. నావంతుగా ఏదైనా చేయాలి’’ అనుకున్నాడు. ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా వినిపించుకోకుండా ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. మన దేశంలో ఎంతమందికి మరుగుదొడ్డి సౌకర్యం ఉంది? ఎంతమందికి లేదు?కారణాలు ఏమిటి...వంటి విషయాలను గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. పల్లెల నుంచి పట్నాలకు వలస వచ్చిన వాళ్లు మరుగుదొడ్డి సౌకర్యం లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకున్నారు. ‘సమగ్ర’ పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. తన పొదుపు మొత్తాలనుంచి 20 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. పుణేలోని పేదవారికి నాణ్యమైన పారిశుధ్యసేవలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది సమగ్ర. మొదట ‘సులభ్ ఇంటర్నేషనల్’ను ఆదర్శంగా తీసుకోవాలనుకున్నారు. సులభ్కు దేశవ్యాప్తంగా 8000 టాయ్లెట్ బ్లాక్లు ఉన్నాయి. టాయ్లెట్ను ఉపయోగించుకోవడానికి వ్యక్తికి రెండు రూపాయలు తీసుకుంటారు. ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటే కనీసం నెలకు మూడు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం పేదలకు పెద్ద మొత్తమే! ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భారం కాని రీతిలో రుసుం నిర్ణయించారు చతుర్వేది. నెలకు యాభై చెల్లిస్తే కుటుంబసభ్యులు ఎంతమంది అయినా సమగ్ర టాయ్లెట్లను ఉపయోగించుకునే సౌకర్యం కలిపించారు. వినియోగదారులకు ‘పరిశుభ్రత’ ప్రాతిపదికగా బహుమతులు కూడా ఇస్తారు. మరుగుదొడ్డి నుంచి రాగానే సబ్బుతో చేతులను శుభ్రం చేసుకున్న వారికి 50 మార్కులు పడతాయి. ఆలస్యం లేకుండా నెల రుసుము కట్టిన వారికి 500 పాయింట్లు... ఇలా రకరకాల విభాగాల పాయింట్స్ ఆధారంగా బహుమతి ఇస్తుంటారు. ‘సమగ్ర’ ప్రారంభం కాగానే ఊహించినంత స్పందన రాలేదు. దీంతో ప్రచారానికి పని కల్పించాల్సి వచ్చింది. కేవలం ‘సమగ్ర’కు సంబంధించిన ప్రచారానికే పరిమితం కాకుండా టాయ్లెట్ పరిశుభ్రత, టాయ్లెట్కు వెళ్లిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మొదలైన వాటిపై మురికి వాడలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు చతుర్వేది. శానిటరీ నాప్కిన్లు, చేతులు శుభ్ర పరుచుకోవడానికి అవసరమైన సబ్బులు, టాయ్లెట్లు శుభ్రపరుచుకునే వస్తువులు...మొదలైన వాటిని సమగ్ర తక్కువ ధరలకు అందిస్తుంది. ‘‘తప్పనిసరి పరిస్థితిలో పబ్లిక్ టాయ్లెట్ను ఉపయోగించేవాళ్లం. చీకటి, మురికి, దుర్వాసనతో కూడిన ఆ టాయ్లెట్కు వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ పరిస్థితుల్లో‘సమగ్ర’వారి టాయ్లెట్లు ఊరట నిచ్చాయి’’ అంటున్నాడు రాజస్థాన్ నుంచి పుణేలోని రామ్నగర్ మురికివాడకు వలస వచ్చిన హీరాలాల్. ‘‘మనం ఫేస్బుక్ లేకుంటే ఇబ్బందుల్లో పడం. స్మార్ట్ఫోన్ లేకుంటే ఇబ్బందుల్లో పడం. పరిశుభ్రమైన మరుగుదొడ్లు లేకపోతే మాత్రం చాలా ఇబ్బందుల్లో పడతాం’’ అనేది చతుర్వేది నినాదం. కొందరికి సొంతంగా టాయ్లెట్లు ఉన్నా అవి అపరిశుభ్రంగా, రోగాలకు నిలయంగా ఉండేవి. ‘సమగ్ర’ ప్రభావం ఇప్పుడిప్పుడే పుణే మురికివాడల్లో కనిపిస్తోంది. ఎవరికి వారు మరుగుదొడ్డి శుభ్రతకు సమగ్ర ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘‘వాళ్లు డబ్బు గురించి కాదు, మా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. ‘సమగ్ర’ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం’’ అంటున్నాడు పుణేలోని ఓ మురికివాడకు చెందిన రసూల్ అనే కార్మికుడు. మొత్తం మీద ‘‘ఇట్స్ ఏ డర్జీ జాబ్’’ అని వెక్కిరించిన వాళ్లే ఇప్పుడు చతుర్వేదిని వేనోళ్ల పొగుడుతున్నారు. ‘‘మీరేం చేస్తుంటారు?’’ అని ఎవరైనా పరిచయ సందర్భంలో స్వప్నిల్ చతుర్వేదిని అడిగితే ఆయన ఒకింత గర్వంగా- ‘‘సీటీసీ’’ అంటారు. ‘‘ిసీటీసీ అంటే?’’ అని అడిగితే- ‘‘చీఫ్ టాయ్లెట్ క్లీనర్’’ అని చెబుతారు. చతుర్వేది ఛలోక్తిగా ఆ మాట అన్నారేమో అని చాలామంది అపోహ పడతారు. కానీ ఆయన చెప్పిన సమాధానంలో పిసరంత హాస్యం కూడా లేదు. ఆయన నిజంగానే చిత్తశుద్ధి ఉన్న సీటీసీ! -
హా...స్టలా...! వద్దులే!
వసతుల్లేక ఆసక్తి చూపని విద్యార్థులు సీట్ల భర్తీకి వార్డెన్లు, మేట్రిన్ల పాట్లు యలమంచిలి/యలమంచిలి రూరల్ : కనీస వసతులు లేని ప్రభుత్వ వసతి గృహాలపై విద్యార్థులకు ఆసక్తి తగ్గుతోంది. ఫలితంగా విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ వసతి గృహాల్లో ఖాళీలు భర్తీ కావడం లేదు. వసతి గృహాల్లో పూర్తిస్థాయిలో విద్యార్థులను చేర్చుకోవడానికి వార్డెన్లు, మేట్రిన్లు పాఠశాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏదోవిధంగా వసతి గృహాల్లో విద్యార్థులను చేర్చాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలతో వార్డెన్లు, మేట్రిన్లు గ్రామాల బాట పట్టారు. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో విద్యార్థులను వసతి గృహాల్లో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జిల్లాలో 78 ఎస్సీ వసతి గృహాల్లో 8,200 ఖాళీలు ఉండగా ఇప్పటివరకు 5,500 ఖాళీలు మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల మంది ఎస్సీ విద్యార్థులు చదువుతున్నారు. శిథిల భవనాలకు ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు అంతంతమాత్రంగా ఉండడంతో పూర్తిస్థాయిలో మరమ్మతులు జరగడం లేదు. శిథిల భవనాల్లో.... యలమంచిలి ఎస్సీ నం.1,2 వసతి గృహాల్లో 100 మంది విద్యార్థులు రెండు గదుల్లో ఉంటున్నారు. భోజనాలు, చదువులు, పడక అన్నీ ఆ గదిలోనే. ఇరుకు గదుల్లో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. రెండు వసతి గృహాల్లో 200 మంది విద్యార్థులను చేర్చుకోవలసి ఉంది. విద్యార్థుల కొరత కారణంగా నం.1 ఎస్సీ వసతి గృహాన్ని కార్యాలయంగా వినియోగిస్తున్నారు. రెండు వసతి గృహాల విద్యార్థులను ఒకే వసతిగృహంలో ఉంచారు. స్నానాలు, మరుగుదొడ్ల ఇబ్బందులు వసతి గృహాల్లో విద్యార్థులు స్నానాలు, మరుగుదొడ్లకు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు తక్కువగా ఉండడంతో పలువురు విద్యార్థులు వసతి గృహాల పరిసరాలను మరుగుదొడ్లుగా వినియోగిస్తున్నారు. ఇక స్నానాలకు గదులు చాలక ఆరుబయటే స్నానాలు చేయవలసి వస్తోంది. విద్యా ప్రమాణాల్లేవు...వసతి గృహాల్లో విద్యార్థులకు విద్యాప్రమాణాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. పాఠశాల నుంచి వసతి గృహాలకు చేరుకుంటున్న విద్యార్థులకు ఉదయం సాయంత్రం పాఠ్యాంశాలపై సరైన శిక్షణ లేకపోవడంతో విద్యలో మిగిలిన విద్యార్థులకంటే వెనుకబడుతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థులకు సాయంత్రం పాఠ్యాంశాలపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులను నియమించేవారు. అయితే వీరికి నెలకు రు.1000 మాత్రమే ఇస్తుండడంతో ఉపాధ్యాయులు ఆసక్తి కనబరచడంలేదు. దీంతో విద్యార్థులు పాఠశాలలో బోధించిన పాఠ్యాంశాలతో సరిపెట్టుకోవలసి వస్తోంది. రుచిలేని ఆహారం వసతి గృహాల్లో ఉదయం అల్పాహారంతో పాటు రాత్రి భోజనం పెడుతున్నారు. పలు వసతి గృహాల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వార్డెన్లు, మేట్రిన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అల్పాహారం, భోజనాల్లో నాణ్యత లేకపోయినా విద్యార్థులు పెదవి విప్పడం లేదు. తల్లిదండ్రులకు, అధికారులకు ఫిర్యాదు చేయవద్దని వార్డెన్లు, మేట్రిన్లు విద్యార్థులకు హుకుం జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నా పాఠశాల డైరీ... ప్రభుత్వ వసతి గృహాల్లో ఖాళీలను పూర్తిచేయడానికి సాంఘిక సంక్షేమ శాఖ ఈ ఏడాది నా పాఠశాల డైరీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. కార్యక్రమంలో వసతి గృహాల్లో విద్యార్థుల విద్యా ప్రగతిని తెలిపే డైరీని విద్యార్థులకు అందజేశారు. విద్యార్థి వ్యక్తిగత సమాచారంతో పాటు వసతిగృహాల్లో ప్రవేశ మార్గదర్శక సూచనలు, విద్యార్థులకు కల్పించబడే సదుపాయాల గురించి వివరించారు.