Published
Sat, Sep 17 2016 7:27 PM
| Last Updated on Sat, Aug 25 2018 5:17 PM
ఉపాధి హామీ పథకంలో భాగస్వాములు కావాలి
యాదగిరిగుట్ట: గ్రామీణా ప్రాంతాల్లో నెలకొన్న పేదరికాన్ని నిర్మూలించడానికి, ఉపాధి హామీ పథకంలో ప్రతి వ్యక్తి భాగస్వాములు కావాలని యాత్ర స్వచ్చంధ సంస్థ రాష్ట్ర కన్వీనర్ సురుపంగ శివలింగం కోరారు. పేదరిక నిర్మూలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం అనే అంశాలపై జిల్లా స్థాయి చర్చ వేదిక మండలంలోని మహబూబ్పేటలో శనివారం జరిగింది. ఈ చర్చ వేధికకు సూర్యాపేట డివిజన్ ఉపాధి కూలీల నాయకులు, మహిళ సంఘాల నాయకురాలు పాల్గొని మండలంలో జరుగుతున్న ఉపా«ధి హామీ సమాఖ్యల సమావేశాలు, విద్యాహక్కు చట్టం పాఠశాల యాజమాన్య కమిటీల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సదస్సులో ప్రముఖులు రేగు బాలనర్సయ్య, మార్తమ్మ, రేగు అశోక్, బాలలక్ష్మీ, గాజుల లక్ష్మీ, స్వామిలతో పాటు ఏపీఎస్ఎస్ఎస్ సంఘంకు చెందిన 60 మంది, ఏపీ ఎస్ఎస్ఎస్ సూర్యాపేట కో ఆర్డినేటర్లు, సభ్యులు హాజరయ్యారు.