![ఉపకరణాలు అందించేందుకు వైద్యపరీక్షలు](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/4/41476899513_625x300.jpg.webp?itok=2-T5xo5A)
ఉపకరణాలు అందించేందుకు వైద్యపరీక్షలు
Published Wed, Oct 19 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM
![ఉపకరణాలు అందించేందుకు వైద్యపరీక్షలు](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/4/41476899513_625x300.jpg.webp?itok=2-T5xo5A)
జిల్లావ్యాప్తంగా 25 వరకు శిబిరాల నిర్వహణ
ధవళేశ్వరం : ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపకరణాలు అందించేందుకు ఈ నెల 25 తేదీ వరకు జిల్లావ్యాప్తంగా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్టు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ టీవీఎస్ గంగాధర్ కుమార్, సర్వశిక్షా అభియాన్ ఐఈ కో ఆర్డినేటర్ వై.లక్ష్మణ్æకుమార్ తెలిపారు. ధవళేశ్వరం భవిత కేంద్రంలో బుధవారం ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు ఉపకరణాలను అందించేందుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని భవితా కేంద్రాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి, ఉపకరణాలు అవసరమైన వారిని గుర్తిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 8,500 మంది ప్రత్యేక అవసరాలుగల చిన్నారులు ఉన్నారన్నారు. ఒకసారి ఉపకరణాలు తీసుకున్న వారు మూడేళ్ల తర్వాత మళ్లీ తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎంఈవో కె.నరసింహారెడ్డి, ఐఈఆర్టీలు గంటా సత్యనారాయణ, కె.కమలాకర్ పాల్గొన్నారు. కాగా.. వైద్యశిబిరాల సమాచారం కోసం ఆయా మండలాల ఎంఈవోలను సంప్రదించవచ్చు.
వైద్యశిబిరాలు జరిగే తేదీలు
20–10–2016 : రాజోలు, ఏలేశ్వరం, బిక్కవోలు, కోరుకొండ
21–10–2016 : అడ్డతీగల, తుని, రావులపాలెం, మండపేట
22–10–2016 : అమలాపురం , పిఠాపురం, సామర్లకోట, చింతూరు,
24–10–2016 : పి.గన్నవరం, జగ్గంపేట, కరప, రంపచోడవరం,
25–10–2016 : కాకినాడ అర్బన్
Advertisement
Related news by tags
-
ఓటర్లపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనుచిత వ్యాఖ్యలు.. బాబు వెకిలి నవ్వులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్రాజు.. పొంతన లేని వ్యాఖ్యలతో ఇటు సొంత పార్టీలోనూ, అటు ఇతర పార్టీల్లోనూ తరచూ నానుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని పొగడుతారో? ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో? ఆయనకే తెలియదన్న పేరు గడించారు. వివాదాస్పద ప్రకటనలతో పార్టీలోనూ గందరగోళం సృష్టిస్తుంటారు. తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రసంగిస్తూ ఏపీ ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఓటర్లను అవమానించారు. వైఎస్సార్సీపీకి ఓటేసిన వాళ్లు అన్నం తినేవాళ్లేనా? అంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రజలను కించపరిచేలా ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు మాట్లాడుతున్నా..సభా నాయకుడిగా చంద్రబాబు స్పందించకపోగా వెకిలి నవ్వు నవ్వడంపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బడ్జెట్ ఎఫెక్ట్: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు (మంగళవారం) ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 73.04 పాయింట్ల నష్టంతో 80,429.04 వద్ద, నిఫ్టీ 30.20 పాయింట్ల నష్టంతో 24,479.05 వద్ద ముగిశాయి.టైటాన్ కంపెనీ, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, అదానీ పోర్ట్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్ & టుబ్రో, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. ప్రయోజనాలెన్నో!
రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్ల ధరను పెంచిన తర్వాత.. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు కొత్త ప్లాన్లను పరిచయం చేసింది. ఈ కొత్త ప్లాన్లు ఫ్రీ కాలింగ్, డేటా, ఓటీటీ స్ట్రీమింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. ఇది తప్పకుండా తన పోర్ట్ఫోలియోను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్ల ధర రూ. 329, రూ. 949, రూ. 1049. ఇందులో ప్రతి ఒక్కటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్, జీ5, సోనిలైవ్ వంటి ప్రధాన ఓటీటీ ప్లాట్ఫారమ్లకు సబ్స్క్రిప్షన్లను అందిస్తోంది.జియో రూ.329 ప్లాన్రూ.329 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుందిరోజుకు 1.5GB డేటాను అందిస్తుంది అపరిమిత ఫ్రీ కాలింగ్ ఉందిప్రతిరోజూ 100 ఉచిత SMSలతో వస్తుందిజియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ వంటి వాటికి సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.జియో రూ.949 ప్లాన్రూ.949 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది.అపరిమిత ఫ్రీ కాలింగ్ లభిస్తుంది. వినియోగదారులు రోజుకు 2జీబీ డేటాను పొందుతారు.ఈ ప్లాన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ (మొబైల్) కోసం 90 రోజుల సబ్స్క్రిప్షన్ అందిస్తుంది.5జీ వెల్కమ్ ఆఫర్తో వస్తుంది, హై-స్పీడ్ ఇంటర్నెట్ను పొందాలనుకునేవారికి మంచి ఆప్షన్.జియో రూ.1,049 ప్లాన్ఈ ప్లాన్ 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది రోజుకు 2GB డేటా ఉపయోగించుకోవచ్చు.ప్రతిరోజూ 100 ఉచిత SMSలను అందిస్తుందివినియోగదారులు సోనీలైవ్, జీ5 వంటి వాటికి సబ్స్క్రిప్షన్ పొందుతారుజియోటీవీ మొబైల్ యాప్తో వస్తుంది.5జీ వెల్కమ్ ఆఫర్ లభిస్తుంది. -
ప్రసంగమంతా చంద్రబాబు భజనే: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు గురించి భజన చేయకుండా..రాష్ట్రంలో జరగుతున్న అరాచకపాలన గురించి మాట్లాడితే బాగుండేదని ఎర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ అన్నారు. తాడేపల్లిలో వైఎస్సాఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గవర్నర్ ప్రసంగంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. ఈ సందర్భంగా తాడిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగమంతా చంద్రబాబు భజనే కనపడింది. ప్రతిపక్ష పార్టీపై దుమ్మెత్తిపోయటానికే సరిపోయిందని మండిపడ్డారు. పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పలేదు. అమరావతి, ప్రత్యేక హోదా గురించి కనీస ప్రస్థావనే లేదని అన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ చెప్తారనుకున్నాం. కానీ దాని గురించి మాట్లాడలేదు. మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ అమలు గురించి కూడా మాట్లాడలేదు. అంటే హామీలన్నింటినీ తుంగలో తొక్కేసినట్టేనని అర్థం అవుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి గవర్నర్ మాట్లాడకపోవడం దారుణమన్నారు. 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి వంద కోట్లు కూడా లేవు. కానీ 2024నాటికి ప్రభుత్వ ఖజానాలో రూ.7 వేల కోట్ల పైనే ఉందన్న తోట చంద్రశేఖర్..ఎన్నికల హామీలను చంద్రబాబు ఇప్పటి వరకు అములు చేయకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదవటమే తప్ప గవర్నర్ వాస్తవాలను మరిచిపోయారు. 2014-19 మధ్యలో 54 సంస్థలను ప్రయివేటుపరం చేశారు.వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? అని ధ్వజమెత్తారు.చంద్రబాబుకు లబ్ధి చేకూరేలా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహరించడం సర్వసాధారణమైందని వ్యాఖ్యానించారు.షర్మిళ ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణలు చేయటం సిగ్గుచేటని తెలిపారు.షర్మిల వైఖరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 50 రోజుల్లోనే రాష్ట్రం అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా షర్మిల నోరెందుకు మెదపటం లేదు? చంద్రబాబు కోసమే తప్ప ప్రజల కోసం షర్మిల ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.ఓట్ ఆన్ బడ్జెట్ ఏడు నెలలపాటు నిర్వహించాలనుకోవటం సిగ్గుచేటు.మేనిఫెస్టో పథకాలకు ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే ఓట్ ఆన్ బడ్జెట్ పెడుతున్నారు. ప్రజాస్వామ్య యుతంగా మేము నిరసనలు తెలిపితే పోలీసులు మాపై దాడి చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తే కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అసెంబ్లీలో ప్లకార్డులను చూపిస్తే చంద్రబాబు వణుకిపోతున్నారు. అరాచకాలపై అసెంబ్లీలో నిలదీశాం.ప్రభుత్వం స్పందించలేదనే బాయ్ కాట్ చేశామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 102.57 పాయింట్ల నష్టంతో 80,502.08 వద్ద, నిఫ్టీ 21.65 పాయింట్ల నష్టంతో 24,509.25 వద్ద ముగిశాయి.గ్రాసిమ్ ఇండస్ట్రీస్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. విప్రో, కోటక్ మహీంద్రా, రిలయన్స్, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Related News by category
-
అగ్ని పర్వతంలా రగిలిపోతున్నా.. కన్న తండ్రిగా బాధ ఉండదా?: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ బీఆర్ఎస్ఎల్పీ భేటీలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. శాసనమండలిలో భారాస పక్ష నేతగా మధుసూదనాచారిని కేసీఆర్ ప్రకటించారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తాను అగ్ని పర్వతంలా రగిలిపోతున్నానని అన్నారు. ఎన్నో విషయాలను దాచుకొని మౌనంగా ఉన్నానని తెలిపారు. రాజకీయ కక్షతోనే తన కూతురుని (ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత) జైల్లో పెట్టారని మండిపడ్డారు. సొంత బిడ్డ జైలులో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేల వలసలపై ఆందోళన చెందవద్దని నేతలకు కేసీఆర్ సూచించారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితిలో తెలంగాణను సాధించామని గుర్తు చేశారు. గతంలో ఆగురురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలో రాలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయింది. కాంగ్రెస్ నేతలు పాలనపై దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎందుకు అదుపుతప్పాయి?. ఎక్కడో ఉన్న వాళ్ళు ఎన్నికల్లో గెలిపిస్తే పదవులు వచ్చాక పార్టీ వీడుతున్నారు. పార్టీ వదిలి వెళ్ళిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.’ అని తెలిపారు. -
బడ్జెట్లో ‘తెలంగాణ’ అనే పదాన్ని నిషేధించారు: సీఎం రేవంత్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణపై కేంద్ర కక్షపూరితంగా వ్యవహరించినట్లు ప్రజలు భావిస్తున్నారని అన్నారు. 18 సార్లు ఢిల్లీ వెళ్లి నిధులు ఇవ్వాలని కేంద్రాన్నికోరినట్లు తెలిపారు. తానే స్వయంగా మూడుసార్లు ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు, వివక్ష లేకుండా నిధులు కేటాయించాలని మోదీని కోరినట్లు పేర్కొన్నారు. బడ్జెట్లో తెలంగాణ అనే పదం నిషేదించారని, తెలంగాణ అని పలకడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు బడ్జెట్ చూస్తే తెలంగాణపై ఎంత కక్ష ఉందో అర్థం అవుతుందన్నారు. వివక్ష అనుకున్నాం కానీ కక్ష పూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే మోదీ తప్పుబట్టారని విమర్శించారు.ఇది బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్.. ‘ఏపీకి ఎందుకు ఇచ్చారు అని అడగం. కానీ తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు. మూసీ రివర్ ప్రాజెక్టు కోసం నిధులు అడిగాం.. ఒక్క రూపాయి ఇవ్వలేదు. మెట్రోకి నిధులు లేవు. ఐటీఐఈఆర్ కారిడార్ ప్రస్తవన లేదు. ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్. ఏపీ, బిహార్లకు తాయిలాలు ఇచ్చి కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇది మోదీకి గౌరవంవం తెచ్చిపెట్టదు. బీజేపీకి తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచ్చారు 35 శాతం ఓట్లు ఇచ్చారుకిషన్ రెడ్డిదే బాధ్యత.. రాజీనామా చేయాలి..తెలంగాణ కృతజ్ఞత చూపాల్సిన బీజేపీ వివక్ష ప్రదర్శించింది. తెలంగాణ ప్రజల నిర్ణయం వల్లే మోదీ పీఎం పదవిలో కూర్చున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్రెడ్డిదే బాధ్యత. కిషన్ రెడ్డి తక్షణమే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలి. బయ్యారం, కాజీపేట రైల్వేఫ్యాక్టరీ, ఐఐఎం ఊసేలేదు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వట్లేమని నేరుగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాకు లేఖ రాశారు. ఐఐఎం ఇవ్వనప్పుడు కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగడం ఎందుకు?క్విడ్ ప్రో కో అన్నట్లు ఉంది బడ్జెట్..మేము కేంద్రంతో సఖ్యతగా ఉండాలని అనుకున్నాం.. కానీ దాన్ని చేతగాని తనంగా తీసుకుంటున్నారు. మోదీని పెదద్దన్నగా మేం బావించాం.. కానీ మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సవరించే బడ్జెట్లో మా విభజన హామీలు అమలు చేయాలి. పార్లమెంటు సమావేశంలో మా నిరసన తెలియజేస్తాం. కేవలం క్విడ్ ప్రో కో అన్నట్లు ఈ బడ్జెట్ ఉంది.కేంద్ర కక్షపూరిత వ్యవహారంపై రేపు అసెంబ్లీలో చర్చిస్తాం. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానికి పంపుతాం. బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయండి. బండి కిషన్ రెడ్డి తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయండి. ఐఐఎం ఇవ్వమని చెప్పారు.. ఎందుకు ఇవ్వరో చెప్పాలి కదా? ఎవరి దయాదక్షిణ్యాల మీద తెలంగాణ ఆధారపడి లేదు. విభజన చట్టం హామీలు ఏపీకేనా.. తెలంగాణకు వర్తించదా?. దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ విక్ష చూపిస్తోంది. ఈ వివక్ష ఇలాగే కొనసాగితే అది మరో ఉద్యమానికి దారి తీస్తుంది’ అని పేర్కొన్నారు. -
‘సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట’
సాక్షి, తాడేపల్లి: బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధుల కేటాయింపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అమరావతికి రూ.15, 000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఏపీ కూటమి ప్రభుత్వ నేతలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట అంటూ సెటైర్లు వేశారు.అమరావతి కి 15000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు!సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట!@ncbn @JaiTDP— Ambati Rambabu (@AmbatiRambabu) July 23, 2024 కాగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి మరోసారి మొండిచేయి ఎదురైంది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. అలాగే భారీగా నిధులు రాబట్టలేకపోయారు. సరికదా.. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం స్పష్టమైన హామీ ప్రకటనలు కూడా చేయించులేకపోయారు. సుమారు పదేళ్ల తర్వాత తెరపైకి ఏపీ విభజన అంశం వచ్చింది. అయితే ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించకుండానే ప్రత్యేక సాయం ప్రకటన చేసింది కేంద్రం. ఈ క్రమంలో విభజన చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని.. అది వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. -
ఓటర్లపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనుచిత వ్యాఖ్యలు.. బాబు వెకిలి నవ్వులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్రాజు.. పొంతన లేని వ్యాఖ్యలతో ఇటు సొంత పార్టీలోనూ, అటు ఇతర పార్టీల్లోనూ తరచూ నానుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని పొగడుతారో? ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో? ఆయనకే తెలియదన్న పేరు గడించారు. వివాదాస్పద ప్రకటనలతో పార్టీలోనూ గందరగోళం సృష్టిస్తుంటారు. తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రసంగిస్తూ ఏపీ ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఓటర్లను అవమానించారు. వైఎస్సార్సీపీకి ఓటేసిన వాళ్లు అన్నం తినేవాళ్లేనా? అంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రజలను కించపరిచేలా ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు మాట్లాడుతున్నా..సభా నాయకుడిగా చంద్రబాబు స్పందించకపోగా వెకిలి నవ్వు నవ్వడంపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, ప్రజల కోసం పెట్టింది కాదని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. బీజేపీ మిత్రక్షాులైన టీడీపీ, జేడీయూని ప్రసన్నం చేసుకునేందుకు రూపొందించినట్లు ఉందన్నారు. బిహార్కు రూ.41వేల కోట్లు ఆర్థిక సాయం.. ఏపీకి రూ.15వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు కేటాయించి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను, ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.‘2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది 11వ బడ్జెట్, కానీ కొత్త రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేసింది. 2014 తర్వాత మొదటిసారిగా, బడ్జెట్లో 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం' పేరుతో ప్రత్యేక అధ్యాయాన్ని పొందుపరిచారు, కానీ ఆర్థిక 58 పేజీలు, 14,692 పదాలున్న తన మొత్తం ప్రసంగంలో మంత్రి తెలంగాణ అనే పదాన్ని ప్రస్తావించలేదని అన్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రస్తావనను పూర్తిగా దాటవేయడాన్ని ఖండింస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించనప్పటికీ, తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నాం, ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రుల బృందం గత ఏడు నెలలుగా అన్ని మంత్రిత్వ శాఖలకు నిధులు ఇవ్వాలని కోరుతూ పలు దరఖాస్తులు సమర్పించాంపోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలమూరు రంగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇచ్చిన హామీ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆశిస్తున్నాం'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్న ఆశతో తెలంగాణ ప్రజలు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు, హైస్పీడ్ రైలు కనెక్టివిటీ చట్టంలో చేసిన ఇతర వాగ్దానాలు అమలు చేయాలి.రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంపిక చేసి గ్రాంట్లు మంజూరు చేశారు. అయితే తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల ప్రస్తావనను దాటవేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సహా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన వాటాను పొందడంలో విఫలమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి వనరులు, సంక్షేమ పథకాల్లో వాటా దక్కకుండా చేసిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ కలిగించింది’ అని అన్నారు.
Advertisement