Published
Mon, Oct 17 2016 11:13 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
రమణీయం..పవిత్రోత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో పవిత్రోత్సవాలు రమణీయంగా కొనసాగుతున్నాయి. మూడోరోజైన సోమవారం ప్రహ్లాదవరద స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గ్రామోత్సవం జరిపి.. రెండు సార్లు శాంతి హోమాలు నిర్వహించారు. పూజల్లో అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీవన్ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ పాల్గొన్నారు.