Published
Fri, Sep 16 2016 8:20 PM
| Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక
రాజాపేట : భువనగిరిలో జరిగిన డివిజన్స్థాయి క్రీడోత్సవాలకు రాజాపేట బాలురు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బూర్గు మహేందర్రెడ్డి, పీడీ సుంకి కుమారస్వామిలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–17కు ఎం శ్రీనివాస్, అండర్–14 నుంచి ఎం.తరుణ్, సంతోష్, మహీపాల్లు జిల్లాస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఈ నెల17, 18 తేదీలల్లో మిర్యాలగూడ మండలంలోని ముకుందాపురం ఉన్నత పాఠశాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.