Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Brands lined up for women cricketers1
అమ్మాయిల బ్రాండ్‌ వాల్యూ.. అమాంతం పెరిగింది!

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ : మహిళా క్రికెట్‌లో ప్రపంచ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు దేశవ్యాప్తంగా అభిమా నులు పెరిగారు. సోషల్‌ మీడియా ఫాలోవర్లు రెండు మూడు రెట్లు పెరిగారు. దీంతో, ఈ విజేతలను ప్రచారకర్తలుగా నియమించుకోవడానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. కొత్తవే కాదు.. పాత అగ్రిమెంట్లను కొనసాగించేందుకూ చర్చలు మొదలయ్యా యి. ఇప్పటికే పలు కంపెనీల బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్న క్రికెటర్ల ఎండార్స్‌మెంట్‌ ఫీజులు 100% వరకు పెరిగాయి. మైదానంలోనే కాదు తమ వ్యాపార విజయంలోనూ ఈ క్రికెటర్లు బెస్ట్‌ స్కోర్‌కు దోహదం చేస్తారని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ సెమీ–ఫైనల్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్‌ బ్రాండ్‌ విలువ 100% పెరిగిందని సమాచారం. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ పూర్తయిన వెంటనే ఆమెతో ఒప్పందం చేసుకోవడానికి బ్రాండ్స్‌ సిద్ధమయ్యా యి. ఆమె ప్రస్తుతం రెడ్‌ బుల్, బోట్, నైకీ, ఎస్‌జీ, సర్ఫ్‌ ఎక్సెల్‌ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా ఉంది. కంపెనీ, ఒప్పంద కాలాన్ని బట్టి ఆమె ఫీజు రూ.75 లక్షల నుండి రూ.1.5 కోట్ల వరకు ఉంది.కొత్త ఒప్పందాల కోసం..అత్యధిక పారితోషికం పొందుతున్న మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన.. రెక్సోనా డియోడరెంట్, నైకీ, హ్యుండై, హెర్బాలైఫ్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), గల్ఫ్‌ ఆయిల్, పీఎన్ బీ మెట్‌లైఫ్‌ ఇన్సూరెన్స్ వంటి 16 బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా ఉంది. ఒక్కో బ్రాండ్‌ నుంచి ఆమె సుమారు 2 కోట్లు అందుకుంటోంది. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ఒక యాడ్‌కు రూ.1.2 కోట్లు, షెఫాలీ వర్మ రూ.25–50 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మహిళా క్రికెటర్లను బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమించుకున్న గూగుల్‌ జెమినై, రెక్సోనా, నైక్, ఎస్‌బీఐ, రెడ్‌ బుల్, ప్యూమా వంటి బ్రాండ్స్‌.. ఒప్పందాలను కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇది అబ్బాయిల సత్తావిరాట్‌ కోహ్లీ ఒక్కో బ్రాండ్‌ నుంచి రూ.4.5–10 కోట్లుఇతర పురుష క్రికెటర్లు సగటున రూ.1.5–5 కోట్లుఇది అమ్మాయిల పవర్‌ప్రచారకర్తగా ఒక్కో బ్రాండ్‌ నుంచి మహిళా క్రికెటర్లు అందుకునే ఫీజు..ప్రపంచ కప్‌నకు ముందు: రూ.30 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకువరల్డ్‌ కప్‌ తర్వాత: రూ.60 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకుకోకాకోలాకు చెందిన థమ్స్‌ అప్‌ ఎక్స్‌ఫోర్స్, బాడీ ఆర్మర్‌; ప్యూమా, ఏషియన్ పెయింట్స్, అడీడాస్, స్విగ్గీ ఇన్ స్టామార్ట్‌ బ్రాండ్స్‌ ఇప్పటికే ఉన్న ఒప్పందాలను కొనసాగించే ఆలోచనలో ఉన్నాయని సమాచారం కాంట్రాక్ట్‌ ఫీజు పెరుగుతుందా?మ్యాచ్‌ ఫీజులను పురుష క్రికెటర్లకు సమానంగా 2022 నుంచి మహిళా క్రికెటర్లకూ బీసీసీఐ చెల్లిస్తోంది. అయితే వార్షిక కాంట్రాక్ట్‌ విషయంలో మాత్రం ఇరువురి మధ్య తీవ్ర అంతరం ఉంది. పురుష క్రికెటర్లు రూ.కోట్లలో అందుకుంటుంటే అమ్మాయిలు రూ.లక్షల్లో పొందుతున్నారు. ‘ఎ ప్లస్‌’ విభాగంలో బీసీసీఐ ఒక్కో (పురుష) క్రికెటర్‌కు వార్షిక కాంట్రాక్ట్‌ ఫీజు కింద రూ.7 కోట్లు చెల్లిస్తోంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా ఈ కేటగిరీలో ఉన్నారు. మహిళా క్రికెటర్లు ఒక్కరు కూడా ఈ జాబితాలో లేరు. ‘ఎ’ విభాగంలో మహిళా క్రికెటర్లలో ప్రస్తుతానికి హర్మన్ ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మకు చోటు దక్కింది.

Pakistan beat South Africa by two wickets in first ODI2
పాకిస్తాన్‌దే తొలి వన్డే

ఫైసలాబాద్‌: కొత్త వన్డే కెప్టెన్ షాహిన్‌ అఫ్రిది నేతృత్వంలో పాకిస్తాన్‌ శుభారంభం చేసింది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో పాక్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు క్వింటన్‌ డి కాక్‌ (71 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), డ్రి ప్రిటోరియస్‌ (60 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు చేయగా, కార్బిన్‌ బాష్‌ (41) రాణించాడు. పాక్‌ బౌలర్లలో నసీమ్‌ షా, అబ్రార్‌ అహ్మద్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం పాకిస్తాన్‌ 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 264 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సల్మాన్‌ ఆగా (71 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్‌), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (74 బంతుల్లో 55; 6 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలు నమోదు చేయగా...ఫఖర్‌ జమాన్‌ (45), సయీమ్‌ అయూబ్‌ (39) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లగా...రెండో వన్డే రేపు ఇదే మైదానంలో జరుగుతుంది.

Karnataka start with a huge win in Ranji Trophy3
భారీ విజయంతో కర్ణాటక బోణీ

తిరువనంతపురం: స్పిన్నర్‌ మోసిన్‌ ఖాన్‌ (6/29) తిప్పేయడంతో రంజీ ట్రోఫీలో కర్ణాటక భారీ విజయం సాధించింది. కేరళ సొంతగడ్డపై జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో కర్నాటక ఇన్నింగ్స్‌ 164 పరుగుల తేడాతో కేరళపై ఘనవిజయం సాధించింది. ఈ సీజన్‌లో కర్ణాటక జట్టుకిది తొలి గెలుపు. సౌరాష్ట్ర, గోవాలతో జరిగిన గత రెండు మ్యాచ్‌లు కూడా ‘డ్రా’గానే ముగిశాయి. డబుల్‌ సెంచరీతో భారీస్కోరుకు బాట వేసిన కర్ణాటక బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. మంగళవారం 10/0 ఓవర్‌ నైట్‌ స్కోరుతో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కేరళ... సొంతగడ్డపై కనీసం 200 పరుగులైనా చేయలేకపోయింది. ఫాలోఆన్‌ ఆడిన కేరళ 79.3 ఓవర్లలో 184 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ కృష్ణప్రసాద్‌ (33; 5 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడాడు. మిగతా టాపార్డర్‌ బ్యాటర్లు ని«దీశ్‌ (9), అక్షయ్‌ చంద్రన్‌ (0)లను పేసర్‌ విద్వత్‌ కావేరప్ప వరుస బంతుల్లో అవుట్‌ చేయడంతోనే కేరళ పతనం మొదలైంది. కెప్టెన్‌ అజహరుద్దీన్‌ (15)ను శిఖర్‌ పెవిలియన్‌ చేర్చగా మిగతా బ్యాటర్లకు మోసిన్‌ స్పిన్‌ ఉచ్చు బిగించడంతో కేరళ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. నిజానికి 140 పరుగులకే 9 వికెట్లను కోల్పోయిన కేరళ 150 పరుగుల్లోపే ఆలౌట్‌ ఖాయమనిపించింది. అయితే ఆఖరి వరుస బ్యాటర్‌ ఇడెన్‌ ఆపిల్‌ టామ్‌ (68 బంతుల్లో 39 నాటౌట్‌; 7 ఫోర్లు) చేసిన పోరాటంతో కర్ణాటక విజయం కాస్త ఆలస్యమైంది.మిగతా మ్యాచ్‌ల్లో గ్రూప్‌ ‘ఎ’లో జార్ఖండ్‌ ఇన్నింగ్స్‌ 196 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై జయభేరి మోగించింది. వడోదరలో వర్షం వల్ల బరోడా, ఉత్తర ప్రదేశ్‌ మ్యాచ్‌లో అసలు టాస్‌ కూడా పడలేదు. మ్యాచ్‌ పూర్తిగా వర్షార్పణమైంది. ‘బి’లో సౌరాష్ట్ర–మహారాష్ట్ర, పంజాబ్‌–గోవా, మధ్యప్రదేశ్‌–చండీగఢ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. విహారి, మురాసింగ్‌ల పోరాటంతో... అగర్తలా: హనుమ విహారి (253 బంతుల్లో 141; 19 ఫోర్లు, 1 సిక్స్‌), కెపె్టన్‌ మణిశంకర్‌ మురాసింగ్‌ (130 బంతుల్లో 102 నాటౌట్‌; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు)ల పోరాటంతో త్రిపుర డ్రాతో గట్టెక్కడమే కాదు... తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కూడా సంపాదించింది. దీంతో గ్రూప్‌ ‘సి’లో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిపుర కీలకమైన 3 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 273/7తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన త్రిపుర 103.2 ఓవర్లలో 385 పరుగుల వద్ద ఆలౌటైంది. తద్వారా బెంగాల్‌ (336)పై తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగులు ఆధిక్యం లభించింది. మూడో రోజే విహారి శతక్కొట్టగా, ఆఖరి రోజు మురాసింగ్‌ వన్డేను తలపించే విధంగా ధాటిగా ఆడి సెంచరీ సాధించాడు. ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. విహారి అవుటయ్యాక టెయిలెండర్‌ రాణా దత్త (27; 4 ఫోర్లు) కూడా మురాసింగ్‌కు అండగా నిలిచాడు. బెంగాల్‌ బౌలర్లలో భారత వెటరన్‌ సీమర్‌ షమీకి ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. కైఫ్‌ 4, ఇషాన్‌ పొరెల్‌ 3 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆడిన బెంగాల్‌ 25 ఓవర్లలో 3 వికెట్లకు 90 పరుగులు చేసింది. షహబాజ్‌ అహ్మద్‌ (51 నాటౌట్‌) అర్ధసెంచరీ సాధించాడు. శ్రమించి గెలిచిన హరియాణా అహ్మదాబాద్‌: గ్రూప్‌ ‘సి’లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సులువైన 62 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా హరియాణా తెగ కష్టపడింది. చివరకు 6 వికెట్లు కోల్పోయి ఈ ఆరు పదుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. మొత్తానికి గ్రూప్‌ ‘సి’లోనే కాదు... ఈ సీజన్‌లోనే అన్ని గ్రూపుల్లో ఆడిన మూడు మ్యాచ్‌లు గెలిచిన ఏకైక జట్టుగా హరియాణా ‘హ్యాట్రిక్‌’ విజయాలు సాధించింది. మంగళవారం 113/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన గుజరాత్‌ 60.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది.ఇంకో 24 పరుగులు చేసి మిగిలిన 2 వికెట్లు కోల్పోయింది. రవి బిష్ణోయ్‌ (2)ని పార్థ్‌వత్స (2/38), క్షితిజ్‌ పటేల్‌ (37; 2 ఫోర్లు)ను నిఖిల్‌ కశ్యప్‌ (4/59) అవుట్‌ చేయడంతో ఇన్నింగ్స్‌ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగుల ఆధిక్యం పొందిన హరియాణా ముందు కేవలం 62 పరుగుల లక్ష్యమే ఉంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో హరియాణా టాప్‌–6 బ్యాటర్లు లక్ష్యయ్‌ (1), అంకిత్‌ (1), శాండిల్యా (3), నిశాంత్‌ (13), అమన్‌ (3), ధీరు సింగ్‌ (13)లను గుజరాత్‌ బౌలింగ్‌ త్రయం విశాల్‌ (3/23), సిద్ధార్థ్‌ దేశాయ్‌ (2/25), బిష్ణోయ్‌ (1/13) మూకుమ్మడిగా అవుట్‌ చేయడంతో 43 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. పార్థ్‌ వత్స (14 నాటౌట్‌), యశ్‌వర్ధన్‌ (13 నాటౌట్‌) అజేయంగా నిలువడంతో హరియాణా 4 వికెట్ల తేడాతో గెలిచి నిట్టూర్చింది. ఇదే గ్రూప్‌ ‘సి’లో జరిగిన మ్యాచ్‌లో బౌలర్ల అద్భుత ప్రతిభతో ఉత్తరాఖండ్‌ 17 పరుగుల తేడాతో సర్వీసెస్‌పై గెలుపొందింది. 123 పరుగుల స్వల్పలక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి రోజు 71/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సర్వీసెస్‌ 48.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. 34 పరుగులు మాత్రమే చేసి మిగతా సగం (5) వికెట్లను కోల్పోయింది. మయాంక్‌ మిశ్రా (5/45), సుచిత్‌ (2/12), అవనీశ్‌ (2/27) సర్వీసెస్‌ బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు.

Erigeshi Arjun makes a good start in the World Cup chess tournament4
అర్జున్‌ శుభారంభం

పనాజీ: టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకరైన భారత నంబర్‌వన్, ప్రపంచ ఆరో ర్యాంకర్‌ ఇరిగేశి అర్జున్‌ ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీలో శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్‌ ఆడుతున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ తొలి గేమ్‌లో గెలుపొందాడు. బల్గేరియా గ్రాండ్‌మాస్టర్‌ పెట్రోవ్‌ మారి్టన్‌తో మంగళవారం జరిగిన తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడుతూ అర్జున్‌ 37 ఎత్తుల్లో విజయం సాధించాడు. పెట్రోవ్‌తో నేడు జరిగే రెండో గేమ్‌ను అర్జున్‌ ‘డ్రా’ చేసుకుంటే మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తాడు. భారత ఇతర గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ, దీప్తాయన్‌ ఘోష్, విదిత్‌ సంతోష్‌ గుజరాతి, కార్తీక్‌ వెంకటరామన్, అరవింద్‌ చిదంబరం, నిహాల్‌ సరీన్, ఇనియన్, కార్తికేయన్‌ మురళీ, ఎస్‌ఎల్‌ నారాయణన్, ప్రాణేశ్, రౌనక్‌ సాధ్వాని తమ ప్రత్యర్థులతో జరిగిన రెండో రౌండ్‌లోని తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నారు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ప్రణవ్‌ తన ప్రత్యర్థి టారీ ఆర్యన్‌ (నార్వే)పై 41 ఎత్తుల్లో గెలుపొందగా... సూర్యశేఖర గంగూలీ (భారత్‌) 37 ఎత్తుల్లో మాక్సిమి లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో, అరోణ్యక్‌ ఘోష్‌ (భారత్‌) 30 ఎత్తుల్లో లెవోన్‌ అరోనియన్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. గుకేశ్‌–నొగెర్‌బెక్‌ కాజీబెక్‌ (కజకిస్తాన్‌) గేమ్‌ 84 ఎత్తుల్లో... ప్రజ్ఞానంద–తెముర్‌ కుయ్‌బోకరోవ్‌ (ఆస్ట్రేలియా) గేమ్‌ 60 ఎత్తుల్లో... దీప్తాయన్‌ ఘోష్‌–నెపోమ్‌నిషి (రష్యా) గేమ్‌ 30 ఎత్తుల్లో... విదిత్‌–ఓరో ఫౌస్టినో (అర్జెంటీనా) గేమ్‌ 28 ఎత్తుల్లో... కార్తీక్‌ వెంకటరామన్‌–అరవింద్‌ గేమ్‌ 55 ఎత్తుల్లో... నిహాల్‌ సరీన్‌–స్టామాటిస్‌ (గ్రీస్‌) గేమ్‌ 90 ఎత్తుల్లో... పెంటేల హరికృష్ణ–అర్సెని నెస్తోరోవ్‌ (రష్యా) గేమ్‌ 30 ఎత్తుల్లో... ఇనియన్‌–నుగుయెన్‌ థాయ్‌ డాయ్‌ వాన్‌ (చెక్‌ రిపబ్లిక్‌) గేమ్‌ 45 ఎత్తుల్లో... కార్తికేయన్‌ మురళీ–ఇదానీ (ఇరాన్‌) గేమ్‌ 76 ఎత్తుల్లో... నారాయణన్‌–విటియుగోవ్‌ (ఇంగ్లండ్‌) గేమ్‌ 57 ఎత్తుల్లో... ప్రాణేశ్‌–దిమిత్రిజ్‌ కొలార్స్‌ (జర్మనీ) గేమ్‌ 34 ఎత్తుల్లో... రౌనక్‌–రాబర్ట్‌ హోవ్‌నాసియన్‌ (అర్మేనియా) గేమ్‌ 67 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.

Majumdar leaves a special mark as coach of the Indian womens cricket team5
అమోల్‌ శిక్షణ అమూల్యం

సాక్షి క్రీడా విభాగం : అమోల్‌ మజుందార్‌కు క్రికెట్‌ మైదానంలో ఆటగాడిగా ఘనమైన రికార్డులు ఉన్నాయి... దేశవాళీ క్రికెట్‌లో ముంబై, అస్సాం, ఆంధ్ర జట్లకు ఆడి టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు... కానీ అందరూ కలలుగనే అంతర్జాతీయ క్రికెటర్‌ స్థాయి మాత్రం అతనికి దక్కలేదు. వేర్వేరు కారణాలతో ఒక్కసారి కూడా భారత జట్టు తరఫున ఆడే అవకాశం రాలేదు. కెరీర్‌లో చెలరేగుతున్న అతని అత్యుత్తమ దశలో భారత జట్టు దిగ్గజాలతో నిండిపోవడంతో పాటు కాసింత కలిసి రావాల్సిన చోట అదృష్టం మొహం చాటేసింది. అయితే ఆటగాడిగా ప్రస్థానాన్ని ముగించి తన అనుభవాన్ని మరో రూపంలో ప్రదర్శించుకునేందుకు అతను సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో కోచ్‌గా మారిన మజుందార్‌ దశాబ్ద కాలం తర్వాత తన కెరీర్‌లో అత్యుత్తమ క్షణాలను అనుభవిస్తున్నాడు. భారత మహిళల క్రికెట్‌ జట్టును తొలిసారి విశ్వవిజేతగా నిలిపిన శిక్షకుడిగా అతను తన పేరును లిఖించుకున్నాడు. గత రెండేళ్ల ఈ ప్రయాణంలో అతను ఎన్నో ప్రతికూలతలను దాటి టీమ్‌ను శిఖరానికి చేర్చాడు. వచ్చే మంగళవారం తన 51వ పుట్టిన రోజును జరుపుకోనున్న అమోల్‌ ఇప్పుడు మహిళల క్రికెట్‌ జట్టు కొత్త ప్రస్థానానికి దిక్సూచిలా నిలిచాడు. మారిన ఆటశైలి... ‘మా లక్ష్యాలు ఏమిటో స్పష్టంగా నిర్దేశించుకున్నాం. మన ప్లేయర్లు ఆటలో దూకుడు పెంచాల్సి ఉంది. నిర్భీతిగా ఆడే ఆటను నేను ఎప్పుడైనా ప్రోత్సహిస్తాను. అదే మన శైలి కావాలి. ఫీల్డింగ్, ఫిట్‌నెస్‌కు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఈ విషయంలో ఎలాంటి సడలింపులు ఉండవు. నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) ప్రమాణాలను పాటిస్తూ ఏడాదిలో మూడుసార్లు ఫిట్‌నెస్‌ పరీక్షలు జరుగుతాయి. మ్యాచ్‌లు లేని సమయంలో నిరంతరాయంగా ప్రత్యేక క్యాంప్‌లతో సాధన కొనసాగుతుంది. కొత్తగా జట్టులోకి వచ్చేవారందరికీ మంచి అవకాశాలు కల్పిస్తాం’... భారత మహిళల జట్టు కోచ్‌గా ఎంపికైన తర్వాత అమోల్‌ మజుందార్‌ తన మొదటి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అంటూ పాత గణాంకాలను తాను పట్టించుకోనని, కొత్తగా మళ్లీ మొదలు పెడుతున్నట్లుగా భావిస్తానని కూడా మజుందార్‌ చెప్పాడు. వరల్డ్‌ కప్‌లో భారత ప్లేయర్ల ప్రదర్శనను చూస్తే తాను చెప్పిన ప్రతీ అంశంపై అతను పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడని అర్థమవుతుంది. మన ప్లేయర్ల ఫిట్‌నెస్‌ గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఉందనేది చూడగానే అర్థమవుతోంది. అన్నింటికి మించి బ్యాటింగ్‌లో దూకుడు పెరిగింది. భారీ స్కోర్లు నమోదు చేయడమే కాదు, ఛేదనలో కూడా మన టీమ్‌ ఎంత బాగా ఆడగలదో పలుమార్లు రుజువైంది. తమ శ్రమ వెనక కోచ్‌ ఉన్నాడని ప్లేయర్లు పదే పదే చెప్పడం విశేషం. ఓటమి తర్వాత ప్రణాళికలతో... అయితే కోచ్‌గా మజుందార్‌ బాధ్యతలు స్వీకరించగానే ఒక్కసారిగా ఫలితాలు రాలేదు. మజుందార్‌ కోచ్‌గా వచ్చి న తర్వాత మొదటి సవాల్‌ టి20 వరల్డ్‌ కప్‌ రూపంలో వచ్చి ంది. ఇందులో మన జట్టు కనీసం సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించలేదు. జట్టులో దూకుడు రాకపోగా కీలక క్షణాల్లో పాత తడబాటు పోలేదని కోచ్‌కు అర్థమైంది. అయితే అతను ఒక్కసారిగా టీమ్‌లో భారీ మార్పులు కోరుకొని గందరగోళంగా మార్చలేదు. ముందుగా 25 మందితో తన కోర్‌ టీమ్‌ను ఎంచుకున్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌కు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో పక్కాగా ప్రణాళికలు రూపొందించాడు. నాటి టీమ్‌ లో ఉన్నవారిలో 9 మంది ఇప్పుడు వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమ్‌లో కూడా ఉన్నారు. గాయాలతో మిగతా ఆటగాళ్లు దూరమయ్యారు తప్ప.. లేదంటే అమోల్‌ ప్రణాళికల్లో అందరికీ వరల్డ్‌ కప్‌ బాధ్యతలు ప్రత్యేకంగా ఉన్నాయి. సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడేలా బోర్డును ఒప్పించడంతో పాటు మిగతా సమయమంతా ప్లేయర్లు జాతీయ క్రికెట్‌ అకాడమీలోనే రాటుదేలారు. దాని ఫలితం ఇప్పుడు కనిపించింది. జాగ్రత్తగా నడిపిస్తూనే... ‘జెమీమాను తుది జట్టు నుంచి తప్పించడం మేం తీసుకున్న కఠిన నిర్ణయం. జట్టు సమతూకం కోసం అలా చేయక తప్పలేదు’... ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌ తో మ్యాచ్‌కు జెమీమాను దూరం పెట్టిన తర్వాత జట్టు కోచ్‌ మజుందార్‌ ఇచ్చి న వివరణ ఇది. ఆ సమయంలో అతను చాలా ఇబ్బంది పడినట్లు, అబద్ధం చెబుతున్నట్లు అతని మాటల్లోనే కనిపించింది. నిజానికి జెమీమా తొలి 4 మ్యాచ్‌లలో 2 డకౌట్లు సహా 65 పరుగులే చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆమెకు ఒక హెచ్చరికలా ఇది సహేతుక నిర్ణయమే. కానీ దానికీ అతను జాగ్రత్తగా వివరణ ఇవ్వాల్సి వచ్చి ంది. ఒక మహిళల టీమ్‌ను పురుష కోచ్‌ నడిపించడంలో ఉండే ప్రతికూలతల్లో ఇది కూడా ఒకటని విశ్లేషకుల అభిప్రాయం. వారినుంచి అత్యుత్తమ ఆటతీరును రాబట్టడంతో పాటు ప్రోత్సహిస్తూ, ఎక్కడా మానసికంగా కుంగిపోకుండా జట్టును నడిపించడం కూడా కోచ్‌ బాధ్యతే అవుతుంది. ఈ విషయం మజుందార్‌కు బాగా తెలుసు. తుది జట్టులో స్థానం విషయంలో తనకంటే ముందు భారత మహిళల జట్టుకు కోచ్‌గా ఉన్న తన మాజీ సహచరుడు, మరో ముంబైకర్‌ రమేశ్‌ పొవార్, సీనియర్‌ మిథాలీ రాజ్‌ మధ్య ఎంత పెద్ద వివాదం రేగిందో ప్రపంచం చూసింది. ఇలాంటి అంశాలను జాగ్రత్తగా చూసుకుంటూనే మజుందార్‌ తన బాధ్యతను నెరవేర్చాడు. సాధారణంగా ఆటగాడిగా సాధించని ఘనతలు కోచ్‌గా అందుకోవాలని చాలా మంది కోరుకుంటారు. తమ పట్టుదలతో వాటిని నిజం చేసుకొనే కొద్ది మంది జాబితాలో ఇప్పుడు అమోల్‌ చేరాడు.

India Cricketer Sri Charani and Arundhati Reddy Parents Emotional Interview6
అమ్మానాన్నలూ గెలిచారు

పిల్లల ప్రతిభను ప్రపంచం కంటే ముందు తల్లిదండ్రులే గుర్తించాలి. గోరుముద్దల్లో ఉత్సాహం.. వేలు పట్టి నడిపే నడకలో ప్రోత్సాహం అందించినప్పుడే పిల్లలు పులుల్లా మారతారు... చిరుతల్లా కదలాడతారు. తల్లిదండ్రులు అమ్మాయిలను చదివించి... ఉద్యోగాలు చేయించడం వరకు ఆలోచిస్తారు. కానీ, క్రీడల్లో కొనసాగమని చెప్పడం తక్కువ. మన మహిళా క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్‌ విజయం సాధించడం చూసి ఇకపై పెద్ద మార్పు రావచ్చు. ఈ జట్టులోని అమ్మాయిలను తల్లిదండ్రులు ప్రోత్సహించిన తీరు చూస్తే ‘క్రీడాకారిణి కావాలని ఉంది’ అని ఏ అమ్మాయి కోరినా తల్లిదండ్రులు తప్పక ‘మేమున్నాం’ అనే రోజులు వచ్చేశాయి.ఇంట్లో నాతోనే క్రికెట్‌ ఆడేది!చిన్నప్పటినుంచి అథ్లెటిక్స్‌ అంటే శ్రీచరణికిప్రాణం. జాతీయ స్థాయిలో ఖోఖో అడింది. కానీ, క్రికెట్‌ అంటేనే చాలా ఇష్టం. ఇంట్లో క్రికెట్‌ ఆడతానని అలిగేది. తన తండ్రి కూడా అథ్లెటిక్స్‌ ఆడమని చెప్పారు. కానీ, నేను మాత్రం శ్రీచరణీకి తోడుగా నిలిచి క్రికెట్‌ను ప్రోత్సహించాను. నాతోనే ఇంట్లో క్రికెట్‌ ఆడేది. ఇప్పుడు ఏకంగా వరల్డ్‌ కప్‌ గెలుపులో కీలకంగా నిలవడం మాకెంతో గర్వకారణం. ఇక మా సంతోషానికి హద్దులు లేవు. – నల్లపురెడ్డి రేణుక (శ్రీచరణి తల్లి)తండ్రిగా చెప్పుకోవడానికిగర్వంగా ఉంది..ఉమెన్స్ వరల్డ్‌ కప్‌లో అదరగొట్టిన భారత్‌ క్రికెటర్‌ నల్లపురెడ్డి శ్రీచరణి తండ్రిగా చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నా కూతురు వరల్డ్‌ కప్‌లో క్రికెట్‌ ఆడుతుంటే చాలా సంతోషంగా ఉంది. – నల్లపురెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీచరణి తండ్రిమహిళల ప్రపంచ కప్‌ పోటీల్లో సాటిలేని ప్రతిభ కనబర్చి వైఎస్సార్‌ కడప జిల్లా పేరును ప్రపంచ పటంలో నిలిపిన శ్రీచరణి వైఎస్సార్‌ జిల్లా వీరపునాయునిపల్లె మండలం యర్రంపల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి, రేణుక దంపతుల కుమార్తె. తండ్రి ఆర్టీపీపీలో ఎలక్ట్రికల్‌ ఫోర్‌మన్ . ఒకటి నుంచి 10వ తరగతి వరకూ ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్‌లో చదివింది. హైదరాబాద్‌ లేపాక్షి జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియెట్‌ పూర్తిచేసింది. ప్రస్తుతం వీఎన్ పల్లె వీఆర్‌ఎస్‌ డిగ్రీ కళాశాలలో బీఎస్పీ కంప్యూటర్స్‌ చదువుతూ క్రికెట్‌లో విశేష ప్రతిభ కనబరుస్తోంది.అండర్‌–19 నుంచి భారత జట్టు స్థాయికి..తొలుత శ్రీచరణి 2017–18లో జిల్లా అండర్‌–19 జట్టుకు ఎంపికైంది. అప్పటినుంచి ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. అదే ఏడాది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. జిల్లాకు చెందిన క్రికెట్‌ శిక్షకులు ఖాజా మొయినుద్దీన్, మధుసూదన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఎన్నో మెళకువలు నేర్చుకుంది. ఆ తర్వాత..⇒ 2021లో అండర్‌–19 చాలెంజర్స్‌ ట్రోఫీలో ఇండియా–సి జట్టుకుప్రాతినిధ్యం వహించి నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ⇒ శ్రీచరణి ఆట నైపుణ్యం గుర్తించిన డబ్ల్యూపీఎల్‌ ప్రతినిధులు ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ.55 లక్షలతో ఎంపిక చేసుకున్నారు. ⇒ ఏప్రిల్‌ 27 నుంచి మే 11 వరకు జరిగిన శ్రీలంక ముక్కోణపు వన్డే సీరీస్‌ క్రికెట్‌ టోర్నీకి నల్లపురెడ్డి శ్రీచరణి తొలిసారి భారత జట్టుకుప్రాతినిధ్యం వహించింది. ⇒లండన్ లో జరిగిన టీ–20 టూర్‌కు భారత జట్టు తరఫున ఎంపికైంది. ⇒ ప్రస్తుతం ఐసీసీ మహిళ విభాగంలో భారత జట్టు తరఫున ప్రపంచకప్‌లో నిలకడగా రాణించింది. ఈ టోర్నీలో 14 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రెండో బౌలర్‌గా ఘనత సాధించింది.కుటుంబ సభ్యుల ప్రోత్సాహం..చిన్నప్పటి నుంచి ఆటలపై మక్కువ చూపే శ్రీచరణి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. మొదట్లో అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న శ్రీచరణి ఆ తర్వాత క్రికెట్‌పై ఆసక్తి చూపుతుండడంపై అమ్మానాన్నలు సందేహించారు. కానీ, క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని గమనించిన మామ కిశోర్‌కుమార్‌రెడ్డి శ్రీచరణిని ప్రోత్సహించారు. సరదాగా మొదలుపెట్టిన క్రికెట్‌ ఇప్పుడు శ్రీచరణికి సర్వస్వం అయింది. ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఎందులోనైనా రాణించగలరని శ్రీచరణి రుజువు చేసింది. – మోపూరు బాలకృష్ణారెడ్డి. సాక్షి ప్రతినిధి, కడపదిసీజ్‌ ఫర్‌ యూ..!‘పిల్లల ఇష్టాలు కనిపెట్టి, వారు ఎంచుకున్న మార్గంలో వెళ్లేలా ప్రోత్సహించడం, తగిన స్వేచ్ఛను ఇస్తూ, సపోర్ట్‌గా ఉండటం పేరెంట్స్‌ నిర్వర్తించాల్సిన పనులు’ అంటారు ఇండియన్‌ విమెన్‌ క్రికెటర్‌ అరుంధతీరెడ్డి తల్లి భాగ్యరెడ్డి. మహిళా క్రికెట్‌లో వరల్డ్‌ కప్‌ కైవసం చేసుకున్న మన భారత జట్టులో భాగమైన ఫాస్ట్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డి హైదరాబాద్‌ వాసి. ఈ విజయోత్సవ ఆనందంలో కూతురి కల గురించి అమ్మగా భాగ్య రెడ్డి పంచుకున్న విషయాలు..‘‘ఫైనల్స్‌ చూడటానికి ముంబయ్‌ వెళ్లి, ఈ రోజే వచ్చాను. మ్యాచ్‌ గెలవగానే ‘అమ్మా.. దిస్‌ ఈజ్‌ ఫర్‌ యు’ అని చెప్పింది నా బిడ్డ. ఆ క్షణంలో పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ గెలుపును ఇప్పుడు మా కుటుంబం అంతా ఎంజాయ్‌ చేస్తున్నాం. చిన్నప్పుడు తన అన్న రోహిత్, ఇతర కజిన్స్‌తో కలిసి గల్లీలో క్రికెట్‌ ఆడేది. టీవీలో క్రికెట్‌ చూసేది. సోర్ట్స్‌లో చాలా చురుకుగా ఉండేది. నేను వాలీబాల్‌ స్టేట్‌ ప్లేయర్‌ని. స్పోర్ట్స్‌ అంటే ఇష్టం ఉన్నా కుటుంబ పరిస్థితుల కారణంగా నా కలలను నెరవేర్చుకోలేకపోయాను. నా కూతురుకి ఉన్న ఇష్టాన్ని కాదనకూడదు అనుకున్నాను. క్రికెట్‌ ఫస్ట్‌..మేముండేది సైనిక్‌పురిలో. ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ని. మధ్యతరగతి కుటుంబం. సోర్ట్స్‌లో అరుంధతికి ఉన్న ఇష్టాన్ని చూసి, పన్నెండేళ్ల వయసులో స్పోర్ట్స్‌ సెంటర్‌లో చేర్పించాను. ఉదయం నాలుగు గంటలకే స్పోర్ట్స్‌ సెంటర్‌కి వెళ్లిపోయేవాళ్లం. అక్కణ్ణుంచి స్కూల్‌. మళ్లీ సాయంత్రం ఇద్దరం గ్రౌండ్‌కి వెళ్లిపోయేవాళ్లం. క్రికెట్‌ప్రాక్టీస్‌ చేస్తూనే ఓపెన్‌ లో టెన్త్‌ ఎగ్జామ్స్‌ రాసింది. 15 ఏళ్లకే అండర్‌ –19 హైదరాబాద్‌ జట్టుకు ఎంపికయ్యింది. ఫాస్ట్‌ బౌలర్‌ గా పేరు తెచ్చుకుంది. పెద్ద కల ఉంటే త్యాగాలు ఎన్నో...2017లో రైల్వేలో చేరింది. అక్కడ ఉంటూనే చాలా విషయాల పట్ల అవగాహన ఏర్పరుచుకుంది. అండర్‌ 23 జోనల్‌ టోర్నమెంట్‌ లో రాణించింది. మళ్లీ ఒక దశలో క్రికెట్‌– జాబ్‌ .. దేనిని ఎంచుకోవాలనే నిర్ణయం వచ్చింది. ఓ రోజు తన నిర్ణయం క్రికెట్‌ మాత్రమే అని చెప్పింది. నేనూ ‘సరే’ అన్నాను. రెండేళ్ల కిందట జాబ్‌ మానేసి పూర్తి సమయాన్నిప్రాక్టీస్‌కే కేటాయించింది.ప్రాక్టీస్‌లో భాగంగా కుటుంబంలో ఎన్నో సంతోష సమయాలలో తను దూరంగా ఉండాల్సి వచ్చేది. ఈ రోజు దేశాన్ని గెలిపించిన జట్టులో నా బిడ్డ ఉందంటే... చాలా ఆనందంగా ఉంది. ధైర్యమే పెద్ద సపోర్ట్‌అరుంధతికి క్రికెట్‌తో పాటు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. సమయం దొరికితే మెలోడీస్‌ ను చాలా ఇష్టంగా పాడుతుంది. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా వారి జీవితాన్ని వారు ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇవ్వాలి. పెద్దలుగా మనం కనిపెడుతూ ఉండాలి. పిల్లల ఆసక్తితో ఎంచుకున్న మార్గంవైపు మనకు తెలిస్తే ఏవైనా సూచనలు ఇవ్వాలి. లేదంటే, ధైర్యంగా వెళ్లు అని చెప్పాలి. ఈ ఏడాది పిల్లలను సోర్ట్స్‌ అకాడమీలో చేర్చాం. వచ్చే ఏడాదికి పెద్ద ప్లేయర్‌ అయిపోవాలని వారిపై ఒత్తిడి తీసుకురావద్దు. అది సాధ్యం కాదు కూడా.ఎంచుకున్న దానిపైన అంకితభావం, క్రమశిక్షణ, సాధన ఉండాలి. మా అమ్మాయి ఆలోచన ఎప్పుడూ క్రికెట్‌ వైపు ఉండేది. మా కుటుంబం అంతా ఆమె వైపు ఉన్నాం. నా కలలను పిల్లల ద్వారా తీర్చుకోవాలి అనుకోలేదు. నా జీవితంలో ఎదురైన స్ట్రగుల్స్‌ని ఎప్పుడూ పిల్లల ముందు చెప్పలేదు. నా జర్నీలో మా అమ్మ నాకు పెద్ద మోరల్‌ సపోర్ట్‌. నా కూతురు ఎదుగుదలలో నేను కూడా అంతే. ఎంచుకున్న మార్గం వైపు ధైర్యంగా వెళ్లమనే చెబుతుంటాను. ఈ రోజు ఆ సక్సెస్‌ను చూస్తున్నాం’’ అంటూ ఆనందంగా వివరించారు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Suryakumar Yadav wants to make comeback to ODIs, keen to learn from AB de Villiers7
ప్లీజ్ డివిలియ‌ర్స్‌.. నాకు సాయం చేయండి: సూర్య కుమార్‌

సూర్యకుమార్ యాదవ్‌.. 30 ఏళ్ల వయస్సులో భారత క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టు సారథిగా కొనసాగుతున్న సూర్య.. వన్డేల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. 2021లో భారత తరపున వన్డేల్లో అరంగేట్రం చేసిన సూర్యకు సెలక్టర్లు చాలా అవకాశాలు ఇచ్చారు.కానీ తనకు లభించిన అవకాశాలను మిస్టర్ 360 అందిపుచ్చుకోలేకపోయాడు. ఇప్పటివరకు 37 వన్డేలు ఆడిన సూర్య 25.77 సగటుతో కేవలం 773 పరుగులు మాత్రమే చేశాడు. భారత్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌-2023లోనూ ఈ ముంబై ఆటగాడికి ఛాన్స్‌ లభించింది. కానీ అక్కడ కూడా అతడు ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతడిని సెలక్టర్లు జట్టు నుంచి తప్పించారు. సూర్యను ప్రస్తుతం కేవలం టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గానే పరిగణిస్తారు. అయితే తనకు మాత్రం వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఉందని తాజా ఇంటర్వ్యూలో సూర్య వెల్లడించాడు. వన్డే, టీ20 ఫార్మాట్లలో ఎలా మెనెజ్‌ చేయాలో సౌతాఫ్రికా క్రికెట్‌ లెజెండ్‌ ఏబీ డివిలియర్స్‌ నుంచి నేర్చుకుంటానని సూర్య తెలిపాడు. కాగా సూర్య టెస్టుల్లో కూడా భారత తరపున డెబ్యూ చేశాడు."ఒకవేళ ఏబీ డివిలియర్స్‌ను నేను కలిస్తే టీ20లు, వన్డేల్లో తన ఆటను ఎలా బ్యాలెన్స్ చేశాడో తెలుసుకోవాలనకుంటున్నాను. నేను మాత్రం రెండింటిని మెనెజ్ చేయలేకపోయాను. వన్డేలు కూడా టీ20ల మాదిరిగా ఆడాలని నేను అనుకున్నాను. కానీ నేను అనుకున్నది జరగలేదు.ఏబీ ఈ ఇంట‌ర్వ్యూ మీరు చూసిన‌ట్ల‌యితే దయచేసి త్వరగా న‌న్ను కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నాకు మూడు-నాలుగేళ్ల కెరీర్ ఇంకా ఉంది. వన్డేల్లో నేను రీ ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటున్నాను. దయచేసి నాకు సాయం చేయండి. నేను టీ20లు, వ‌న్డేలు రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోయాను" అని విమ‌ల్ కుమార్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సూర్య పేర్కొన్నాడు. అయితే సూర్య ప్ర‌స్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో సూర్య ఇప్పటివరకు ఒక్కసారి హాఫ్ సెంచరీ మార్క్ దాటలేకపోయాడు. కెప్టెన్‌గా జట్టును విజయ పథంలో నడిపిస్తున్నప్పటికి వ్యక్తిగత ప్రదర్శన పరంగా మాత్రం సూర్య నిరాశపరుస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో సూర్య బీజీబీజీగా ఉన్నాడు.చదవండి: వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం.. వణికి పోయిన బౌలర్లు

Haris Rauf banned for 2 matches after Asia Cup misconduct8
ఆసియాక‌ప్‌లో ఓవ‌రాక్ష‌న్‌.. పాక్ ఆట‌గాడిపై 2 మ్యాచ్‌ల బ్యాన్‌

ఆసియాకప్‌-2025లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లలో ఓవరాక్షన్ చేసిన పాకిస్తాన్ స్పీడ్ స్టార్ హారిస్ రవూఫ్‌కు ఐసీసీ భారీ షాకిచ్చింది. రవూఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విధించింది. ఈ మెగా టోర్నీలో రవూఫ్ రెండు సార్లు తమ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.అస‌లేమి జ‌రిగింగ‌దంటే?ఆసియాకప్‌లో భాగంగా లీగ్ స్టేజిలో సెప్టెంబర్ 14న భారత్‌-పాక్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్‌, అభిషేక్ శర్మలను రవూఫ్ దుర్భాషలాడాడు. అంతేకాకుండా వారితో పాక్ పేసర్ వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా ఐసీసీ విధించింది.అదేవిధంగా రెండు డిమెరిట్ పాయింట్లు కూడా అతడి ఖాతాలో చేరాయి. అయినా కూడా రవూఫ్ ప్రవర్తన ఏ మాత్రం మారలేదు. సూపర్‌-4 మ్యాచ్‌లో రవూఫ్ తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఫీల్డింగ్ చేస్తుండగా భారత అభిమానులు కోహ్లి కోహ్లి అని అరవగా.. అందుకు బదులుగా రవూఫ్ భారత్‌కు చెందిన 6 రఫెల్ జెట్ ఫ్లైట్స్‌‌ను కూల్చామని, యుద్దంలో తమదే విజయమని పేర్కొంటూ 6-0 సంజ్ఞలు చేశాడు.#Indian are crying because #HarisRauf trolled 1000s of them alone . pic.twitter.com/hx8qACIBm2— Zeitung (@Himat75) September 22, 2025దీంతో మళ్లీ అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం కోతను ఐసీసీ విధించింది. మళ్లీ రెండు డిమెరిట్ పాయింట్లు ఇవ్వబడ్డాయి. మొత్తంగా అతడి ఖాతాలో నాలుగు డిమెరిట్ పాయింట్లు వచ్చి చేరాయి. అయితే 24 నెలల వ్యవధిలో 4 లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు పొందితే.. ఐసీసీ సదరు ఆటగాడిపై ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల నిషేధం విధిస్తుంది. ఈ కారణాంగానే ఫైసలాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేకు రవూఫ్ దూరమయ్యాడు.సూర్యకు షాక్‌..అదేవిధంగా లీగ్ స్టేజిలో పాకిస్తాన్‌పై సాధించిన విజయాన్ని ఫహల్గాం ఉగ్రదాడి బాధితులు, సైనికులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించిన భారత కెప్టెన్ సూర్యకుమార్‌పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు కూడా విధించబడ్డాయి. సూర్య ఖాతాలో మరో రెండు డీమెరిట్ పాయింట్లు చేరితే 2 మ్యాచ్‌ల నిషేదం ఎదుర్కొక తప్పదు. అదేవిధంగా హ్యారిస్ రవూఫ్‌కు జెట్ విమానం కూలినట్లగా సైగ చేసిన జస్ప్రీత్ బుమ్రాను కూడా ఐసీసీ మందలించింది.

Alex Ross to lead Australia name squad for Hong Kong Sixes 20259
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఎవ‌రూ ఊహించ‌ని ప్లేయ‌ర్‌..

హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 టోర్నమెంట్ నవంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టు కెప్టెన్‌గా బిగ్ బాష్ లెజెండ్ అలెక్స్ రాస్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో బెన్ మెక్‌డెర్మాట్, ఆండ్రూ టై, క్రిస్ గ్రీన్ వంటి అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు.క్రిస్ గ్రీన్‌కు కెప్టెన్‌గా అపారమైన అనుభవం ఉనప్పటికి రాస్‌కే జట్టు పగ్గాలను సెలక్టర్లు కట్టబెట్టారు. గ‌తేడాది ఆస్ట్రేలియా సెమీఫైన‌ల్లో పాక్ చేతిలో ఓట‌మి పాలైంది. దీంతో ఈసారి ఎలాగైనా క‌ప్ కొట్టాల‌ని కంగారులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. కాగా ఈవెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్‌, పాకిస్తాన్‌, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, హాంకాంగ్, నేపాల్, ఒమన్, యూఏఈ జట్లు భాగం కానున్నాయి. నవంబర్ 7 నుంచి 9 వ‌ర‌కు టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ సిక్సెస్ టోర్నీ కోసం భార‌త జ‌ట్టును ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. టీమిండియా కెప్టెన్ దినేష్ కార్తీక్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.హాంకాంగ్ క్రికెట్ సిక్సర్స్ కోసం ఆస్ట్రేలియా జట్టు:అలెక్స్ రాస్ (కెప్టెన్), బెన్ మెక్‌డెర్మాట్, జాక్ వుడ్, నిక్ హాబ్సన్, క్రిస్ గ్రీన్, విలియం బోసిస్టో , ఆండ్రూ టై.అసలేంటి హాంకాంగ్ సిక్సెస్‌?1992లో హాంకాంగ్ క్రికెట్ ఆధ్వ‌ర్యంలో మొద‌లైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. చివ‌ర‌గా 2017 వ‌ర‌కు జ‌రిగింది. ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాల‌తో ఈ టోర్నీని నిర్వ‌హించ‌లేదు. అయితే ఈ ఈవెంట్‌కు మ‌ళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువ‌చ్చేందుకు హాంకాంగ్ క్రికెట్ ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఏడేళ్ల త‌ర్వాత ఈ టోర్నీని మ‌ళ్లీ నిర్వ‌హించారు. గ‌త సీజ‌న్ విజేత‌గా శ్రీలంక నిలిచింది.ద‌క్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జ‌ట్లు అత్య‌ధికంగా 5 సార్లు ఈ టోర్నమెంట్ విజేత‌ల‌గా నిల‌వ‌గా.. పాకిస్తాన్ 4 సార్లు, శ్రీలంక రెండు సార్లు ఈ హాంకాంగ్ సిక్సెస్ ట్రోఫీని ముద్దాడింది. భార‌త్‌, ఆస్ట్రేలియా, విండీస్ జ‌ట్లు చెరో ఒక్క‌సారి ఛాంపియ‌న్స్‌గా నిలిచాయి. గతంలో ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అనిల్ కుంబ్లే వంటి దిగ్గ‌జ క్రికెట‌ర్లు సైతం ఆడారు.రూల్స్ ఇవే..ఒక మ్యాచ్‌లో ప్ర‌తీ జ‌ట్టు 5 ఓవ‌ర్లు మాత్ర‌మే ఆడుతోంది. మ్యాచ్ ఆడే రెండు జ‌ట్ల‌లో ఆరుగురు ఆట‌గాళ్లు ఉండాలి. గ్రూప్ దశలో ఒక్కో ఓవర్‌కు ఆరు బంతులు ఉంటాయి. అదే ఫైనల్‍లో ఒక్కో ఓవర్లో ఎనిమిది బంతులు ఉంటాయి. . వికెట్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరు ఒక్కో ఓవర్ వేయాల్సి ఉంటుంది. చదవండి: వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం.. వణికి పోయిన బౌలర్లు

PAK vs SA 2025: Dewald Brevis ruled out of ODI series10
ద‌క్షిణాఫ్రికాకు భారీ షాక్‌..

పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ద‌క్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. స్టార్ బ్యాట‌ర్ డెవాల్డ్ బ్రెవిస్ భుజం కండరాల నొప్పి కారణంగా పాక్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ధ్రువీక‌రించింది. బ్రెవిస్ ప్ర‌స్తుతం తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే బ్రెవిస్‌కు ప్రత్నమ్నాయంగా మరోక ఆటగాడిని జట్టులోకి సెలక్టర్లు తీసుకోలేదు. అతడి స్దానాన్ని మరొకరితో సెలక్టర్లు భర్తీ చేయలేదు. జూనియర్ ఏబీడీ తన స్వదేశానికి వెళ్లకుండా ప్రస్తుతం జట్టుతో పాటు పాక్‌లో ఉన్నాడు.భారత పర్యటనకు ముందు బ్రెవిస్ తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని ఆశిస్తుంది. సౌతాఫ్రికా క్రికెట్ జట్టు మరో వారం రోజుల్లో భారత్ టూర్‌కు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రోటీస్ ఆతిథ్య జట్టుతో రెండు టెస్టు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది.ఈ మూడు ఫార్మాట్ల సిరీస్‌కు ఎంపిక చేసిన సౌతాఫ్రికా జట్టులో బ్రెవిస్ భాగంగా ఉన్నాడు. నవంబర్ 14 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ స‌మ‌యానికి బ్రెవిస్ కోలుకోపోతే అది స‌ఫారీల‌కు గ‌ట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. బ్రెవిస్ విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఫార్మాట్ ఏదైనా త‌న ఆట తీరు ఏ మాత్రం మార‌దు. అయితే పాక్ ప‌ర్య‌ట‌న‌లో మాత్రం బ్రెవిస్ విఫ‌ల‌మ‌య్యాడు. తొలుత టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి కేవ‌లం 54 ప‌రుగులు మాత్ర‌మే చేసిన బ్రెవిస్‌.. ఆ త‌ర్వాత టీ20 సిరీస్‌లో కూడా పెద్ద‌గా ప్ర‌భావం చూపలేక‌పోయాడు. అయితే బ్రెవిస్ లాంటి ఆట‌గాడు త‌న‌దైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించ‌గ‌ల‌డు.చదవండి: వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం.. వణికి పోయిన బౌలర్లు

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement