Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Bolt at a special event held at the Jamunabai Narsee Campus in Mumbai1
క్రికెటర్ల నుంచి స్ఫూర్తి పొందా: బోల్ట్‌

ముంబై: క్రికెటర్లు మైదానంలో చూపే అంకితభావం... ఆట కోసం వారు కష్టపడే తీరు చూసి ఎంతగానో స్ఫూర్తి పొందినట్లు స్ప్రింట్‌ దిగ్గజం ఉసేన్‌ బోల్ట్‌ పేర్కొన్నాడు. క్రికెటర్లు గ్రౌండ్‌లో తమ సర్వస్వాన్ని అంకితం చేయడం... అథ్లెటిక్స్‌లో తాను రాణించేందుకు ప్రేరణనిచ్చిందని ఈ ‘జమైకా చిరుత’ వెల్లడించాడు. సుదీర్ఘకాలం పాటు పరుగుకు పర్యాయపదంగా నిలిచిన బోల్ట్‌ 8 ఒలింపిక్‌ స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 11 పతకాలు సాధించాడు. శుక్రవారం ముంబైలోని జమునాబాయి నర్సీ క్యాంపస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బోల్ట్‌ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో క్రీడా రంగ ప్రముఖులతో పాటు బాలీవుడ్‌ తారలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోల్ట్‌ మాట్లాడుతూ... ‘నేను చిన్నప్పుడు క్రికెట్‌కు వీరాభిమానిని. క్రికెట్‌ ఎదుగుదలను చూశాను. క్రికెటర్ల ప్రతిభను, వారు పనిచేసే తీరును, వారు తమను తాము మలుచుకునే విధానం అథ్లెటిక్స్‌లో నాకు ఎంతగానో ప్రేరణనిచ్చాయి’ అని అన్నాడు. మైకెల్‌ హోల్డింగ్, కోట్నీ వాల్ష్, క్రిస్‌ గేల్‌ వంటి పలువురు ప్రఖ్యాత క్రికెటర్లు కూడా జమైకన్‌లే కాగా... వారి ప్రభావం తనపై అధికంగా ఉన్నట్లు బోల్ట్‌ పేర్కొన్నాడు. విజయానికి దగ్గరి దారులు ఉండవన్న బోల్ట్‌ కష్టపడితే తప్పక ఫలితం వస్తుందని అన్నాడు. ‘ప్రతి పనికి కష్టపడాల్సిందే. క్రీడల్లో అంకితభావం కూడా అవసరం. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే దానిపై ఎక్కువ కష్టపడ్డా. ఏ రంగంలోనైనా అగ్రస్థానానికి చేరడం అంత సులభం కాదు. పరిస్థితులు పరీక్షిస్తున్నప్పుడు కఠిన సమయాలను దాటుకుంటూ ప్రపంచంలో అత్యుత్తమ అథ్లెట్‌గా నన్ను నేను మలుచుకునేందుకు పట్టుదల, అంకితభావంతో కృషి చేశా. అందుకు తగ్గ ప్రతిఫలం సాధించా’ అని 39 ఏళ్ల బోల్ట్‌ అన్నాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు (9.58 సెకన్లు) నెలకొల్పిన బోల్ట్‌... గతంలోనూ పలు సందర్భాల్లో తనకు క్రికెట్‌ మీద ఉన్న ఇష్టాన్ని వెల్లడించాడు.

ICC action against Suryakumar Yadav2
సూర్యకుమార్‌పై ఐసీసీ చర్య

దుబాయ్‌: ఆసియా కప్‌ టి20 క్రికెట్‌ టోర్నీలో పాకిస్తాన్‌పై విజయాన్ని భారత సైనికులకు అంకితం ఇస్తున్నట్లుగా భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ చేసిన ప్రకటనపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) స్పందించింది. ఈ వ్యాఖ్య రాజకీయపరమైనదని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ అతనిపై చర్య తీసుకుంది. సూర్యకుమార్‌ మ్యాచ్‌ ఫీజులో 30 శాతం జరిమానాగా విధించింది. సెప్టెంబర్‌ 14న లీగ్‌ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ‘పహల్గామ్‌ ఉగ్రవాద దాడి బాధితులకు మేం అండగా ఉంటాం. మా విజయం భారత సైనికులకు అంకితం’ అని సూర్య వ్యాఖ్యానించాడు. క్రీడల్లో ఆర్మీ ప్రస్తావన తీసుకురావడాన్ని ప్రశ్నిస్తూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఐసీసీకి ఫిర్యాదు చేసింది. గతంలోనూ రాజకీయపరమైన, గాజాపై ఇజ్రాయిల్‌ దాడివంటి అంశాలపై క్రికెటర్లు స్పందించకుండా ఐసీసీ ఆంక్షలు పెట్టిన విషయాన్ని పీసీబీ తమ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై మ్యాచ్‌ రిఫరీ రిచీ రిచర్డ్సన్‌ విచారణ జరిపారు. రిఫరీ ముందు హాజరైన సూర్యకుమార్‌ తాను ఎలాంటి తప్పూ చేయలేదని సమాధానమిచ్చాడు. సూర్య వివరణపై విభేదించిన రిఫరీ ఇక ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరిస్తూ 30 శాతం జరిమానా విధించారు. ఈ శిక్షపై బీసీసీఐ అప్పీల్‌ చేసినట్లు సమాచారం. అయితే మళ్లీ ఎప్పుడు విచారణ జరుగుతుందనే విషయంలో స్పష్టత లేదు. ఇక్కడా కూడా సూర్యదే తప్పని నిర్ధారణ అయితే శిక్ష మరింత పెరుగుతుంది. ఫర్హాన్‌కు హెచ్చరికతో సరి! సూపర్‌–4 దశలో భారత్‌తో మ్యాచ్‌లో పాక్‌ ఆటగాళ్లు హారిస్‌ రవూఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్‌ ప్రవర్తన గురించి బీసీసీఐ చేసిన ఫిర్యాదుపై కూడా రిచర్డ్సన్‌ విచారణ జరిపారు. ప్రేక్షకుల వైపు చూస్తూ యుద్ధంలో భారత విమానాలు కూలినట్లుగా, వాటి సంఖ్య ఆరు అన్నట్లుగా రవూఫ్‌ పదే పదే సైగలు చేశాడు. తాను కూడా తప్పేమీ చేయలేదని, ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకే అలా చేశానని రవూఫ్‌ ఇచ్చిన వివరణతో కూడా సంతృప్తి చెందని రిఫరీ అతనికి కూడా 30 శాతం జరిమానా విధించారు. అయితే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఏకే–47 తరహాలో బ్యాట్‌ను ఎక్కు పెట్టి సంబరాలు చేసుకున్న ఫర్హాన్‌పై మాత్రం ఎలాంటి చర్య తీసుకోలేదు. తాను అలా చేయడంలో ఎలాంటి దురుద్దేశం లేదని, తాను ఉండే ప్రాంతంలో ఏదైనా సంబరాల సమయంలో ఇలా గన్‌ను సరదాగా ఎక్కు పెడతారని అతను చెప్పాడు. గతంలో ధోని, కోహ్లి కూడా మైదానంలో ఇలాంటిదే చేసిన విషయాన్ని కూడా అతను గుర్తు చేశాడు. దాంతో ఫర్హాన్‌ను రిఫరీ కేవలం హెచ్చరికతో వదిలి పెట్టారు.

Sri Lanka lost in the Super Over against india 3
భారత్‌ ‘సూపర్‌’ విజయం

దుబాయ్‌: ఆసియా కప్‌ టి20 టోర్నీలో లీగ్‌తో పాటు ‘సూపర్‌–4’ దశను భారత్‌ అజేయంగా ముగించింది. శుక్రవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ ‘సూపర్‌ ఓవర్‌’లో శ్రీలంకపై విజయం సాధించింది. సూపర్‌ ఓవర్లో 5 బంతులు ఆడిన లంక 2 పరుగులకే పరిమితం కాగా... భారత్‌ తొలి బంతికే 3 పరుగులు సాధించి గెలిచింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్‌ టైటిల్‌ కోసం తలపడనుంది. అంతకుముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. టోర్నీలో వరుసగా మూడో అర్ధ సెంచరీ నమోదు చేసిన అభిషేక్‌ ఈసారి గత మ్యాచ్‌లకంటే వేగంగా 22 బంతుల్లోనే ఆ మార్క్‌ను అందుకోవడం విశేషం. మిడిలార్డర్‌లో తిలక్‌ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), సంజు సామ్సన్‌ (23 బంతుల్లో 39; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా కీలక పరుగులు సాధించడంతో జట్టు భారీ స్కోరు నమోదు చేయగలిగింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 42 బంతుల్లో 66 పరుగులు జోడించారు. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు సాధించింది. పతుమ్‌ నిసాంక (58 బంతుల్లో 107; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో సత్తా చాటగా, కుషాల్‌ పెరీరా (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 70 బంతుల్లోనే 127 పరుగులు జోడించి విజయంపై ఆశలు రేపారు. అయితే చివర్లో భారత బౌలర్లు కట్టడి చేయడంతో లంక విజయలక్ష్యం చేరలేకపోయింది. ఛేదనలో తొలి ఓవర్లోనే కుశాల్‌ మెండిస్‌ (0) అవుటైనా...నిసాంక, పెరీరా కలిసి శ్రీలంక ఇన్నింగ్స్‌ను నడిపించారు. భారత బౌలర్లందరినీ సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరు దూకుడుగా బ్యాటింగ్‌ చేశారు. ఫలితంగా 10 ఓవర్లలో జట్టు స్కోరు 114 పరుగులకు చేరింది. అయితే గెలుపు దిశగా సాగుతున్న సమయంలో తక్కువ వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. నిసాంక పోరాడినా...జట్టును గెలుపుతీరం చేర్చడంలో విఫలమయ్యాడు. హర్షిత్‌ వేసిన ఆఖరి ఓవర్లో లంక విజయానికి 12 పరుగులు అవసరం కాగా...11 పరుగులే వచ్చాయి. ఈ మ్యాచ్‌లో బుమ్రా, శివమ్‌ దూబేలకు విశ్రాంతినిచ్చిన భారత్‌ తుది జట్టులో అర్ష్ దీప్ సింగ్, హర్షిత్‌ రాణాలకు చోటు కల్పించింది. స్కోరు వివరాలు : భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) కమిందు (బి) అసలంక 61; గిల్‌ (సి అండ్‌ బి) తీక్షణ 4; సూర్యకుమార్‌ (ఎల్బీ) (బి) హసరంగ 12; తిలక్‌ వర్మ (నాటౌట్‌) 49; సామ్సన్‌ (సి) అసలంక (బి) షనక 39; పాండ్యా (సి) అండ్‌ (బి) చమీరా 2; అక్షర్‌ (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 202. వికెట్ల పతనం: 1–15, 2–74, 3–92, 4–158, 5–162. బౌలింగ్‌: తుషార 4–0–43–0, తీక్షణ 4–0–36–1, చమీరా 4–0–40–1, హసరంగ 4–0–37–1, షనక 2–0–23–1, అసలంక 2–0–18–1. శ్రీలంక ఇన్నింగ్స్‌: నిసాంక (సి) వరుణ్‌ (బి) హర్షిత్‌ 107; కుశాల్‌ మెండిస్‌ (సి) గిల్‌ (బి) పాండ్యా 0; కుషాల్‌ పెరీరా (స్టంప్డ్‌) సామ్సన్‌ (బి) వరుణ్‌ 58; అసలంక (సి) గిల్‌ (బి) కుల్దీప్‌ 5; కమిందు (సి) అక్షర్‌ (బి) అర్ష్ దీప్ 3; షనక (నాటౌట్‌) 22; లియనాగె (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–7, 2–134, 3–157, 4–163, 5–191. బౌలింగ్‌: పాండ్యా 1–0–7–1, అర్ష్ దీప్ 4–0–46–1, హర్షిత్‌ 4–0–54–1, అక్షర్‌ 3–0–32–0, కుల్దీప్‌ 4–0–31–1, వరుణ్‌ 4–0–31–1.

Asia cup 2025: India beat Sri lanka in super over 4
Asia cup 2025: ఉత్కంఠ పోరు.. సూపర్‌ ఓవర్‌లో శ్రీలంకపై టీమిండియా గెలుపు

ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్‌ 26న జరిగిన చివరి సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు (202/5) సమమయ్యాయి. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది.ఇందులో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక పేలవంగా 5 బంతుల్లో 2 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం​ భారత్‌ తొలి బంతికే 3 పరుగులు తీసి విజయం సాధించింది. ఈ గెలుపుతో సంబంధం లేకుండా భారత్‌ ఇదివరకే ఫైనల్‌కు చేరింది. సెప్టెంబర్‌ 28న జరిగే ఫైనల్లో భారత్‌, పాకిస్తాన్‌ తలపడనున్నాయి.మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. అభిషేక్‌ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 ఫోర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలక్‌ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌), సంజూ శాంసన్‌ (23 బంతుల్లో 39; ఫోర్‌, 3 సిక్సర్లు) రాణించారు.ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ (15 బంతుల్లో 21 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (4), సూర్యకుమార్‌ యాదవ్‌ (12), హార్దిక్‌ పాండ్యా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, చమీరా, హసరంగ, షనక, అసలంక తలో వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా భారత్‌ చేసినంత స్కోరే చేసింది. ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక వీరోచిత శతకంతో (58 బంతుల్లో 107; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కుసాల్‌ మెండిస్‌ (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో చివరి వరకు లంక గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు.అయితే నిస్సంక సెంచరీ అనంతరం 19వ ఓవర్‌ తొలి బంతికి ఔట్‌ కావడంతో సీన్‌ మారిపోయింది. శ్రీలంక లక్ష్యానికి పరుగు దూరంలో నిలిచిపోయింది. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. ఇందులో భారత్‌ శ్రీలంకపై విజయం సాధించింది.

Abhishek Sharma becomes the first batter in T20I Asia Cup history to complete 300 runs in a single Edition5
IND vs SL: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. స్టార్‌ ఆటగాడి రికార్డు బద్దలు

ఆసియా కప్‌ 2025లో (Asia cup 2025) టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) విధ్వంసకాండ​ కొనసాగుతోంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ నుంచే చెలరేగిపోతున్న అతను.. ఇవాళ (సెప్టెంబర్‌ 26) శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ (India vs Sri Lanka) మెరుపులు కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు.ఈ టోర్నీలో అభిషేక్‌కు ఇది వరుసగా మూడో హాఫ్‌ సెంచరీ. అంతకుముందు బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌పై కూడా హాఫ్‌ సెంచరీలు చేశాడు. తొలి మ్యాచ్‌ నుంచి వరుసగా 30 (16), 31 (13), 38 (15), 74 (39), 75 (37), 61 (31) స్కోర్లు చేసిన అభిషేక్‌.. 6 మ్యాచ్‌ల్లో మొత్తంగా 309 పరుగులు (204.63 స్ట్రయిక్‌రేట్‌తో, 51.50 సగటున, 3 హాఫ్‌ సెంచరీలు, 31 ఫోర్లు, 19 సిక్సర్లు) చేశాడు. ఈ టోర్నీలో అభిషేక్‌ మరో మ్యాచ్‌ (ఫైనల్‌) కూడా ఆడాల్సి ఉంది.ఈ క్రమంలో అభిషేక్‌ ఓ ఆల్‌టైమ్‌ రికార్డును సెట్‌ చేశాడు. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌ చరిత్రలో ఓ సింగిల్‌ ఎడిషన్‌లో 300 పరుగుల మార్కును తాకిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఎవ్వరూ ఈ మార్కును తాకలేదు. అభిషేక్‌కు ముందు టీ20 ఆసియా కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు (సింగిల్‌ ఎడిషన్‌) చేసిన రికార్డు పాకిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు మొహమ్మద్‌ రిజ్వాన్‌ (281) పేరిట ఉండేది. రోహిత్‌ శర్మ సరసనప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా 7 ఇన్నింగ్స్‌ల్లో 30 ప్లస్‌ స్కోర్లు చేసిన అభిషేక్‌ మరో రికార్డును కూడా సమం చేశాడు. టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక సార్లు వరుసగా 30 ప్లస్‌ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ (Rohit Sharma) సరసన చేరాడు. రోహిత్‌ కూడా అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 7 ఇన్నింగ్స్‌ల్లో 30 ప్లస్‌ స్కోర్లు చేశాడు. మ్యాచ్‌ విషయానికొస్తే.. శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా 13 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అభిషేక్‌ (61), శుభ్‌మన్‌ గిల్‌ (4), సూర్యకుమార్‌ యాదవ్‌ (12) ఔట్‌ కాగా.. తిలక్‌ వర్మ (27), సంజూ శాంసన్‌ (22) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ టోర్నీలో భారత్‌, పాకిస్తాన్‌ ఇదివరకే ఫైనల్‌కు చేరాయి. ఇవాళ జరుగుతున్నది నామమాత్రపు మ్యాచ్‌. సెప్టెంబర్‌ 28న ఫైనల్‌ జరుగుతుంది.చదవండి: వైభవ్‌ విఫలమైనా..! ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఊడ్చేసిన టీమిండియా

Shardul Thakur Replaces Ajinkya Rahane As Mumbai Captain, MCA Announces 24 Man Probable Squad For Ranji Trophy 2025 266
కెప్టెన్‌గా శార్దూల్‌ ఠాకూర్‌.. జైస్వాల్‌, శ్రేయస్‌కు నో ప్లేస్‌

2025-26 రంజీ సీజన్‌ (Ranji Trophy) కోసం 24 మంది ఆటగాళ్లతో కూడిన ముంబై ప్రాబబుల్స్‌ (Mumbai Ranji Team) జాబితాను ఇవాళ (సెప్టెంబర్‌ 26) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా శార్దూల్‌ ఠాకూర్‌ (Shardul Thakur) ఎంపికయ్యాడు. అజింక్య రహానే (Ajinkya Rahane) స్థానాన్ని శార్దూల్‌ ఠాకూర్‌ భర్తీ చేయనున్నాడు. రహానే ఈ ఏడాది ఆరంభంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. రహానే ప్రస్తుతం ప్రకటించిన జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగనున్నాడు.ఈ జట్టులో టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer), యశస్వి జైస్వాల్‌కు (Yashasvi Jaiswal) చోటు దక్కలేదు. శ్రేయస్‌ కొంతకాలంగా రెడ్‌ బాల్‌ క్రికెట్‌కు దూరంగా ఉండాలని ఇటీవలే బీసీసీఐకి తెలిపాడు. అందుకే అతన్ని ఎంపిక చేయలేదు. జైస్వాల్‌ విషయానికొస్తే.. అతను ఇటీవల ముంబై నుంచి గోవాకు మారాలని అనుకున్నాడు. ఆతర్వాత యూటర్న్‌ తీసుకున్నా ముంబై సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు.ఈ జట్టులో అన్నదమ్ములు ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan0 చోటు దక్కించుకున్నారు. యువ ఆటగాడు ఆయుశ్‌ మాత్రే కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2024–25 సీజన్ సెమీఫైనల్లో విదర్భ చేతిలో ఓడిన ముంబై.. ఈసారి బలమైన స్క్వాడ్‌తో బరిలోకి దిగనుంది.ముంబై ప్రాబబుల్స్‌ జాబితా: శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), ఆయుశ్‌ మాత్రే, ముషీర్ ఖాన్, అంగ్క్రిష్ రఘువంశీ, అఖిల్ హెర్వడ్కర్, అజింక్య రహానే, సర్ఫరాజ్ ఖాన్, సిద్ధేశ్ లాడ్, సువేద్ పార్కర్, సూర్యాంశ్ షెడ్జ్, ఆకాష్ పార్కర్, తుషార్ దేశ్‌పాండే, సిల్వెస్టర్ డిసౌజా, ఇర్ఫాన్ ఉమైర్, రాయ్‌స్టన్ డయాస్, ప్రతిక్ మిశ్రా, ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), హార్దిక్ తమోరే (వికెట్ కీపర్), ప్రసాద్ పవార్ (వికెట్ కీపర్), షామ్స్ ములాని, తనుష్ కోటియన్, హిమాంశు సింగ్, అథర్వ అంకోలేకర్, ఇషాన్ ముల్చందాని.చదవండి: Asia cup 2025: పాకిస్తాన్‌ ఆటగాళ్ల ఓవరాక్షన్‌పై ఐసీసీ చర్యలు

India vs Sri lanka Asia cup 2025 Group 4 Match Updates7
Asia cup 2025: శ్రీలంకపై టీమిండియా గెలుపు

శ్రీలంకపై టీమిండియా గెలుపుశ్రీలంకతో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. ఇందులో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక పేలవంగా 5 బంతుల్లో 2 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం​ భారత్‌ తొలి బంతికే 3 పరుగులు తీసి విజయం సాధించింది.స్కోర్లు సమం.. సూపర్‌ ఓవర్‌లో తేలనున్న ఫలితంభారత్‌, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగా.. శ్రీల​ంక కూడా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అన్నే పరుగులు చేసింది.లక్ష్యం​ దిశగా దూసుకుపోతున్న శ్రీలంకశ్రీలంక టీమిండియాకు షాకిచ్చే దిశగా సాగుతోంది. 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు 15 ఓవర్ల తర్వాత 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 157 పరుగులు చేసింది. ఆ జట్టు 30 బంతుల్లో మరో 46 పరుగులు చేస్తే టీమిండియాపై సంచలన విజయం సాధిస్తుంది. నిస్సంక (93), అసలంక (5) క్రీజ్‌లో ఉన్నారు.రెండో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక12.2వ ఓవర్‌-వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో కుసాల్‌ పెరీరా (58) స్టంపౌటయ్యాడు. దుమ్మురేపుతున్న నిస్సంక, పెరీరా.. లక్ష్యం దిశగా సాగుతున్న శ్రీలంక203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు పథుమ్‌ నిస్సంక, కుసాల్‌ పెరీరా దుమ్మురేపుతున్నారు. ఇద్దరూ హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకొని శ్రీలంకను లక్ష్యంగా తీసుకెళ్తున్నారు. పెరీరా 27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 52.. నిస్సంక 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 10 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్‌ 114/1గా ఉంది. ఈ మ్యాచ్‌లో లంక గెలవాలంటే 60 బంతుల్లో 89 పరుగులు చేయాలి.భారీ లక్ష్య ఛేదన.. ధాటిగా ఆడుతున్న శ్రీలంక203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక ధాటిగా ఆడుతుంది. తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయినా (కుసాల్‌ మెండిస్‌ డకౌట్‌).. పథుమ్‌ నిస్సంక (17 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుసాల్‌ పెరీరా (9 బంతుల్లో 14; 2 ఫోర్లు) వేగంగా పరుగులు రాబడుతున్నారు. ఫలితంగా శ్రీలంక 4.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. అభిషేక్‌ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్‌టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. అభిషేక్‌ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 ఫోర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలక్‌ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌), సంజూ శాంసన్‌ (23 బంతుల్లో 39; ఫోర్‌, 3 సిక్సర్లు) రాణించాడు. ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ (15 బంతుల్లో 21 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) కూడా ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (4), సూర్యకుమార్‌ యాదవ్‌ (12), హార్దిక్‌ పాండ్యా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, చమీరా, హసరంగ, షనక, అసలంక తలో వికెట్‌ తీశారు.భారీ స్కోర్‌ దిశగా టీమిండియాటీమిండియా భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. 18 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 179/5గా ఉంది. తిలక్‌ వర్మ (42), అక్షర్‌ పటేల్‌ (9) క్రీజ్‌లో ఉన్నారు. నిరాశపరిచిన హార్దిక్‌16.1వ ఓవర్‌- హార్దిక్‌ పాండ్యా కేవలం​ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. చమీరా బౌలింగ్‌లో కాట్‌ అండ్‌ బౌల్డ్‌ అయ్యాడు.నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా15.3వ ఓవర్‌- 39 పరుగులు చేసి సంజూ శాంసన్‌ ఔటయ్యాడు. షనక బౌలింగ్‌లో అసలంకకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.అభిషేక్‌ ఔట్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా8.4వ ఓవర్‌- 92 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. అసలంక బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్‌ శర్మ (61) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 94/3గా ఉంది. తిలక్‌ వర్మ (10), సంజూ శాంసన్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు.రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా6.5వ ఓవర్‌- హసరంగ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 7 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 75/2గా ఉంది. అభిషేక్‌తో పాటు తిలక్‌ వర్మ‌ (1) క్రీజ్‌లో ఉన్నాడు.వరుసగా మూడో హాఫ్‌ సెంచరీ చేసిన అభిషేక్‌ప్రస్తుత ఆసియా కప్‌లో అభిషేక్‌ వరుసగా మూడో హాఫ్‌ సెంచరీ చేశాడు. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో 22 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ మైలురాయిని తాకాడు. 6 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 71/1గా ఉంది. అభిషేక్‌తో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌ (11) క్రీజ్‌లో ఉన్నాడు.దుమ్మురేపుతున్న అభిషేక్‌ శర్మఆసియా కప్‌లో అభిషేక్‌ శర్మ విధ్వంసకాండ కొనసాగుతోంది. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లోనూ అతను దుమ్మురేపుతున్నాడు. 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 5 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 59/1గా ఉంది. అభిషేక్‌తో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌ (11) క్రీజ్‌లో ఉన్నాడు.టీమిండియాకు ఆదిలోనే షాక్‌1.3వ ఓవర్‌- టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియాకు రెండో ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. తీక్షణ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి శుభ్‌మన్‌ గిల్‌ (4) ఔటయ్యాడు. ఆసియా కప్‌ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్‌ 26) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో భారత్‌, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. బుమ్రా, శివమ్‌ దూబే స్థానాల్లో అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా తుది జట్టులోకి వచ్చారు. శ్రీలంక ఓ మార్పు చేసింది. చమిక కరుణరత్నే స్థానంలో లియనాగే జట్టులోకి వచ్చాడు. ఈ టోర్నీలో ఇదివరకే ఫైనల్‌ బెర్త్‌లు ఖరారైన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా జరుగుతుంది. ఆదివారం జరుగబోయే ఫైనల్లో భారత్‌, పాకిస్తాన్‌ తలపడతాయి.తుది జట్లు..భారత్‌: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, సంజు శాంసన్ (wk), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తిశ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (wk), కుసల్ పెరెరా, చరిత్ అసలంక (c), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, జనిత్‌ లియనాగే, దుష్మంత చమీర, మహీశ తీక్షణ, నువాన్ తుషార

West Indies Pacer Shamar Joseph out of India Tests8
భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు విండీస్‌కు భారీ ఎదురుదెబ్బ

అక్టోబర్‌ 2 నుంచి భారత్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు (India vs West Indies) ముందు వెస్టిండీస్‌ జట్టుకు (West Indies) భారీ ఎదురుదెబ్బ తగిలింది. యంగ్‌ స్పీడ్‌ గన్‌ షమార్‌ జోసఫ్‌ (Shamar Joseph) గాయం​ కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో 22 ఏళ్ల బార్బడోస్‌ ఆల్‌రౌండర్‌ జోహాన్‌ లేన్‌ను (Johann Layne) ఎంపిక చేశారు విండీస్‌ సెలెక్టర్లు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. జోసఫ్‌ గాయం వివరాలు వెల్లడించనప్పటికీ.. అక్టోబర్ 18 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకాబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు అతని పేరు మరోసారి పరిశీలిస్తామని తెలిపారు. ఆ సిరీస్‌లో 3 వన్డేలు, 3 టీ20లు జరుగుతాయి.26 ఏళ్ల షమార్‌ జోసఫ్‌ ఇటీవలికాలంలో విండీస్‌ కీలక బౌలర్‌గా ఎదిగాడు. 2024లో టెస్ట్ అరంగేట్రం చేసి, ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. షమార్‌ యార్కర్లు, బౌన్సర్లు, అనూహ్య లైన్ అండ్‌ లెంగ్త్ అతన్ని ఒక్కసారిగా స్టార్‌గా మార్చాయి. అతని అరంగేట్రం బౌలింగ్ స్పెల్‌ను "ఫైర్ అండ్ ఫోకస్" అని విశ్లేషకులు అభివర్ణించారు.షమార్‌ ఇప్పటివరకు విండీస్‌ తరఫున 11 టెస్ట్‌లు, 6 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 70 వికెట్లు తీశాడు. టెస్ట్‌ల్లో షమార్‌ పేరిట 4 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి.షమార్‌ స్థానంలో భారత పర్యటనకు ఎంపికైన జోహాన్ లేన్‌ విషయానికొస్తే.. లేన్ బార్బడోస్‌కు చెందిన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్. ఇప్పటివరకు 19 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతను.. 32 ఇన్నింగ్స్‌లో​ 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 495 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 66 వికెట్లు తీశాడు. ప్రస్తుతం లేన్‌ బౌలింగ్ ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని వెస్టిండీస్ సెలెక్టర్లు అతన్ని భారత పర్యటనకు ఎంపిక చేశారు. చదవండి: Asia cup 2025: పాకిస్తాన్‌ ఆటగాళ్ల ఓవరాక్షన్‌పై ఐసీసీ చర్యలు

Asia cup 2025: ICC takes action against Rauf and Farhan for on field conduct9
Asia cup 2025: పాకిస్తాన్‌ ఆటగాళ్ల ఓవరాక్షన్‌పై ఐసీసీ చర్యలు

ఆసియా కప్‌ 2025లో (Asia cup 2025) భాగంగా సెప్టెంబర్ 21న టీమిండియాతో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో (India vs Pakistan) పాకిస్తాన్‌ ఆటగాళ్లు హారిస్ రౌఫ్ (‍Haris Rauf), సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) ఓవరాక్షన్‌ చేసిన విషయం తెలిసిందే.ఆ మ్యాచ్‌లో రౌఫ్‌ ఫీల్డింగ్‌ చేసే సమయంలో విమానం క్రాష్‌ అయినట్లు సంజ్ఞలు చేశాడు. అలాగే ఆరు సంఖ్యను సూచిస్తూ చేతి వేళ్లను ప్రదర్శించాడు. ఫర్హాన్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం బ్యాట్‌ను గన్‌లా భావిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. పాక్‌ ఆటగాళ్లు చేసిన ఈ ఓవరాక్షన్‌పై బీసీసీఐ అభ్యంతం వ్యక్తం చేసింది. ఐసీసీకి ఫిర్యాదు చేసింది.దీనిపై రౌఫ్‌, ఫర్హాన్‌ ఇవాళ (సెప్టెంబర్‌ 26) విచారణ ఎదుర్కొన్నారు. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌ (Richie Richardson) ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో వారిద్దరూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను (Level 1 offence) ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. ఈ చర్యలు గేమ్ స్పిరిట్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.ఇలాంటి ప్రవర్తన మరోసారి రిపీట్‌ చేస్తే సహించేది లేదంటూ రౌఫ్‌కు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. జరిమానాగా మ్యాచ్‌ ఫీజ్‌లో 30 శాతం కోత విధించారు. ఫర్హాన్‌కు సైతం వార్నింగ్‌ ఇస్తూ.. మందలింపుతో వదిలిపెట్టారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.సూర్యకుమార్‌కు జరిమానాఇదే టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌ అనంతరం భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కూడా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించగా.. ఆ విజయాన్ని సూర్యకుమార్‌ "ఆపరేషన్ సిందూర్" అనే ప్రభుత్వ చర్యను ప్రస్తావిస్తూ, భారత మిలిటరీ సర్వీసెస్‌కు అంకితం చేశాడు.ఈ వ్యాఖ్యలపై పీసీబీ అభ్యంతరం తెలుపుతూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సూర్యకుమార్‌ను సైతం విచారణ చేసి, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. అలాగే మ్యాచ్‌ ఫీజ్‌లో 30 శాతం విధించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో ఇదివరకే రెండు సార్లు (గ్రూప్‌ దశ, సూపర్‌-4) తలపడిన భారత్‌-పాకిస్తాన్‌.. ఆదివారం జరుగబోయే ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి. పై రెండు సందర్భాల్లో భారత్‌ పాక్‌ను చిత్తుగా ఓడించింది. చదవండి: సెలెక్ట్‌ చేస్తారని అనుకున్నా.. కరుణ్‌ నాయర్‌ ఆవేదన

Karun Nair speaks his heart out after India squad snub from WI Tests10
సెలెక్ట్‌ చేస్తారని అనుకున్నా.. కరుణ్‌ నాయర్‌ ఆవేదన

త్వరలో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ (India vs West Indies) కోసం భారత జట్టును (Team India) నిన్న (సెప్టెంబర్‌ 25) ప్రకటించారు. ఈ జట్టులో అందరూ ఊహించిన విధంగానే ఇంగ్లండ్‌ పర్యటనలో నిరాశపరిచిన కరుణ్‌ నాయర్‌కు (karun Nair) చోటు దక్కలేదు. కరుణ్‌పై వేటు అంశం నిన్నటి నుంచి భారత క్రికెట్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా ఉంది.చాలామంది కరుణ్‌ను తప్పించడం సమంజసమే అని అంటుంటే.. కొందరు మాత్రం అతనికి మరికొన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కరుణ్‌ స్వయంగా స్పందించాడు. ఓ ప్రముఖ వార్త సంస్థతో మాట్లాడుతూ.. "సెలెక్ట్‌ చేస్తారని అనుకున్నా. కానీ చేయలేదు. దీని గురించి ఎక్కువగా మాట్లాడాలని అనుకోవట్లేదు. చివరి టెస్ట్‌లో ఫిఫ్టీ చేశాను. ఆ ఇన్నింగ్స్‌లో మరెవ్వరూ ఈ మార్కును తాకలేకపోయారు. ఆ మ్యాచ్‌లో (ఓవల్‌ టెస్ట్‌) టీమిండియా గెలిచింది. అయినా ఇవన్నీ సెలెక్టర్లకు పట్టవంటూ" అవేదనకు లోనయ్యాడు.ఇదే అంశంపై చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగర్కార్‌ కూడా స్పందించాడు. అతని వాదన వేరేలా ఉంది. కరుణ్‌ నుంచి చాలా ఆశించినట్లు చెప్పుకొచ్చాడు. కరుణ్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకున్న దేవ్‌దత్‌ పడిక్కల్ (Devdutt Padikkal) చాలా ఆప్షన్స్ ఇస్తాడని అన్నాడు.కరుణ్‌ మంచి ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతం టీమ్ ట్రాన్సిషన్‌లో ఉంది. ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకుని పడిక్కల్‌ను ఎంపిక చేశాం. ప్రతి ఆటగాడికి 15-20 అవకాశాలు ఇవ్వాలనుకుంటాం. కానీ, అది ఎప్పుడూ సాధ్యపడదని పేర్కొన్నాడు.కాగా, ఇంగ్లండ్‌పై ట్రిపుల్‌ సెంచరీతో రాత్రికిరాత్రి హీరో అయిపోయి, అతి కొద్ది కాలంలోనే ఫామ్‌ కోల్పోయి కనుమరుగైన కరుణ్‌ నాయర్‌.. ఆతర్వాత ఏళ్ల తరబడి దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటి ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు కూడా అతను భారత జట్టులో ఎంతో కాలం నిలువలేకపోయాడు. కేవలం​ 8 ఇన్నింగ్స్‌ల్లోనే అతని ఖేల్‌ ఖతమైంది.ఇంగ్లండ్‌ పర్యటనలో కరుణ్‌ 8 ఇన్నింగ్స్‌ల్లో 25.62 సగటున కేవలం ఒకే ఒక హాఫ్‌ సెంచరీ సాయంతో 205 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో కరుణ్‌కు మంచి ఆరంభాలు లభించినా, వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాడు. దీంతో సెలెక్టర్లు అతన్ని విండీస్‌ సిరీస్‌కు ఎంపిక చేయలేదు.చదవండి: వైభవ్‌ విఫలమైనా..! ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఊడ్చేసిన టీమిండియా

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement