sports
-
ఉప్పల్ లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ దందా
-
IPL : ఈసారి కప్ కొట్టే కెప్టెన్ ఇతనే..
-
Rohit Sharma: పెను తుపాను తలొంచి చూస్తే తొలి నిప్పు కణం అతడే
-
శ్రేయస్ అయ్యర్ లేకపోతే కోహ్లి లేడు..!
-
శ్రమతోనే సక్సెస్
పూసర్ల వెంకట సింధు... ఒలింపిక్స్లో పతకాలు సాధించింది.కామన్వెల్త్... వరల్డ్ చాంపియన్షిప్లలో స్వర్ణాలు సొంతం చేసుకుంది.ప్రపంచవేదికల మీద దేశ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది.భారత మాత మెడలో పతకాల హారం వేసి బంగారు సింధు అయింది.ఈ ఏడాది మహిళాదినోత్సవాన్ని శ్రీమతి సింధుగా వేడుక చేసుకుంటోంది.సాధికారత దిశగా పయనిస్తున్న మహిళలకు అభినందనలు చెప్పింది.ఈ తరంలో మహిళలు బిజినెస్, స్పోర్ట్స్తోపాటు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. కేవలం తమకు తాము నిలదొక్కుకోవడంతో సరిపెట్టడం లేదు, ఆ రంగంలో నంబర్ వన్గా నిలవడానికి శ్రమిస్తున్నారు. నంబర్ వన్ లక్ష్యాన్ని సాధిస్తున్నారు కూడా. ఈ స్ఫూర్తిని, ఇదే పంథాను కొనసాగించాలని అభిలషిస్తున్నాను. సక్సెస్కు దారి! ప్రతి ఒక్కరూ తమ కోసం తాము కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని చేరుకోవడానికి తగినంత శ్రమించాలి. సక్సెస్ అనే లక్ష్యాన్ని చేరడానికి ఉన్న ఏకైక దారి హార్డ్వర్క్. హార్డ్వర్క్తో మాత్రమే విజయానికి చేరువ కాగలుగుతాం. అది కూడా ఒక నెల శ్రమతోనో ఏడాది శ్రమతోనో శిఖరాన్ని చేరాలని ఆశించకూడదు. కొన్నేళ్ల కఠోరశ్రమ, అంకితభావంతో శ్రమించినప్పుడే సక్సెస్ మనదవుతుంది. అయితే కొందరికి సక్సెస్ కొంత త్వరగా రావచ్చు, మరికొందరికి ఆలస్యం కావచ్చు. మన మీద మనం నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆశను వదులుకోకూడదు, నిరాశపడకూడదు. మనం మనవంతుగా శ్రమిస్తూ ఉండాలి. సక్సెస్ వచ్చినప్పటి నుంచి మరింత బాధ్యతగా పని చేయాలి. సక్సెస్ అనే శిఖరాన్ని చేరాం అని రిలాక్స్ కాకూడదు. నంబర్ వన్కి చేరడానికి నేనలాగే కష్టపడ్డాను, కష్టపడుతూనే ఉంటాను కూడా. అమ్మానాన్న... భర్త! ఇప్పటి వరకు నన్ను, నా ఆర్థిక వ్యవహారాలను అమ్మానాన్న చూసుకునేవారు. టోర్నమెంట్కి తోడుగా నాన్న వచ్చేవారు. ఇప్పుడు మా వారు వస్తున్నారు. నా గురించి అన్నీ వాళ్లే చూసుకుంటారు. నా ఫోకస్ అంతా ఆట మీదనే కేంద్రీకరించడానికి తగిన వెసులుబాటునిస్తున్నారు. పేరెంట్స్ నడిపించాలి! దేశానికి కొత్తతరం క్రీడాకారులు తయారు కావాలి. క్రీడాకారులను తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉన్నప్పటికీ తల్లిదండ్రుల సహకారం లేకపోతే క్రీడాకారులు తయారుకారు. పిల్లలను క్రీడల దిశగా నడిపించడం పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. ఆటలు, చదువు రెండూ కీలకమే. రెండింటినీ ఎలా బాలెన్స్ చేసుకోవాలో నేర్పించగలిగింది కూడా పేరెంట్సేనని నా అభి్రపాయం. పేరెంట్స్కి కోరిక ఉన్నప్పటికీ పిల్లలకు ఆడాలనే ఆసక్తి లేకపోతే ఆ పిల్లలు దీర్ఘకాలం కొనసాగడం కష్టం. అలాగే ఆటల పట్ల ఆసక్తి ఉన్న పిల్లలకు పేరెంట్స్ సహకారం లేకపోతే తొలి అడుగు కూడా పడదు. అందుకే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం.సింధుగానే గుర్తించాలి! సమాజం నన్ను సింధుగానే గుర్తించాలి. ‘పీవీ సింధు’ అనగానే చేతిలో రాకెట్తో నా రూపం కళ్ల ముందు మెదులుతుంది. అలా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. దేశం కోసం ఆడగలిగే స్థాయికి చేరాను. దేశం కోసం ఆడాను. దేశానికి ఎన్నో పతకాలను సాధించాను. దేశానికి గౌరవాన్ని పెంచడంలో నా శ్రమ కూడా ఉందని సంతోషపడుతున్నాను. ఈ గుర్తింపు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
స్టార్ క్రికెటర్ల భార్యలకు బీసీసీఐ బిగ్ షాక్
-
దుబాయ్ లో జరిగే మ్యాచ్లో తలపడనున్న భారత్-ఆస్ట్రేలియా
-
హైదరాబాద్లో ఫనాటిక్స్ విస్తరణ..
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్పోర్ట్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫనాటిక్స్ భారత్లో తన కార్యకలాపాలను విస్తరించనుంది. ఐసీసీతోపాటు పలు దేశాల్లోని లీగ్పోటీలకు, క్రీడాకారులకు జెర్సీలు, జ్ఞాపికలు, ఇతర వాణిజ్య వస్తువుల డిజైనింగ్, తయారీ, మార్కెటింగ్ పనులు ఫనాటిక్స్ వ్యాపారం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 కేంద్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఆరేళ్ల క్రితం హైదరాబాద్లోనూ ఒక కేంద్రాన్ని ప్రారంభించింది.అయితే పెరుగుతున్న అవసరాలకు తగినట్లుగా ఈ కేంద్రాన్ని విస్తరించేందుకు నిర్ణయించామని, ఇందులో భాగంగా అభిషేక్ దశ్మనాను వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్గా నియమించామని ఫనాటిక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మథియాస్ స్పైచర్ తెలిపారు. అంతేకాకుండా.. రానున్న రెండేళ్లలో హైదరాబాద్ కేంద్రం ఉద్యోగుల సంఖ్యను 250 నుంచి 500కు పెంచుతామని, వచ్చే ఏడాది తొలినాళ్లలోనే హైటెక్ సిటీ సమీపంలో సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ఆఫీసుకు వెళ్లనున్నామని ఆయన వివరించారు.ఈ కేంద్రం నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పది కోట్ల మంది క్రీడాభిమానులకు ఉత్పత్తులు, సేవలు అందిస్తామని చెప్పారు. సంస్థ కార్యకలాపాలన్నింటికీ హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారనుందని అన్నారు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి అనేక అత్యాధునిక టెక్నాలజీలను హైదరాబాద్ కేంద్రంలో ఉపయోగించనున్నామని చెప్పారు. ప్రోడక్ట్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఏఐ అప్లికేషన్స్, ఫనాటిక్స్ గ్లోబల్ కార్యకలాపాలన్నింటికీ అవసరమైన బ్యాక్ఎండ్ టెక్నాలజీలను ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నారు.ఈ సందర్భంగా అభిషేక్ దశ్మనా మాట్లాడుతూ.. భారత్లో క్రీడలపై ఆసక్తి ఏటికేడాదీ పెరుగుతోందని.. క్రీడాభిమానుల మనసు గెలుచుకునేందుకు ఫనాటిక్స్ హైదరాబాద్ కేంద్రం కార్యకలాపాలు ఉపకరిస్తాయన్నారు. ఫనాటిక్స్ ద్వారా ప్రపంచంలోని ఏ మూలనున్న స్పోర్ట్స్ టీమ్ తాలూకూ జెర్సీ, ఇతర వాణిజ్యవస్తువులను భారత్లో కూర్చుని తెప్పించుకునేందకు అవకాశం ఏర్పడిందని అన్నారు.సుమారు 190 దేశాలకు ఫనాటిక్స్ ఉత్పత్తులు రవాణా అవుతూంటాయని, ఇందుకోసం 80కిపైగా తయారీ కేంద్రాలుండగా.. మొత్తం 900 మంది భాగస్వాములతో కలిసి వీటిని ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. ఐపీఎల్ లాంటి భారతీయ క్రీడల్లో భాగస్వామ్యం వహించే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మెర్చండైజ్ తయారీ వంటివి భవిష్యత్తులో తగిన సమయంలో చేపట్టే అవకాశం లేకపోలేదన్నారు. -
క్రీడలతో ఉత్సాహం... చదువులకు ప్రోత్సాహం
కూకట్పల్లి: విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ఒత్తిడిని అధిగమించగలరని ఏకాగ్రత పెరిగి చదువుల్లో మరింత రాణిస్తారని శ్రీచైతన్య విద్యాసంస్థల నిర్వహకులు తెలిపారు. సంస్థ ఛైర్మన్ బీఎస్ రావు.. జ్ఞాపకార్థం శ్రీచైతన్య విద్యాసంస్థలు కూకట్ పల్లి జోన్లోని వివిధ బ్రాంచ్ల విద్యార్థులకు జోనల్ లెవల్ స్పోర్ట్స్ మీట్ను హైదర్ నగర్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించింది.శ్రీ చైతన్య అంటే చదువు, ర్యాంకులు ఒక్కటే కాదని, తమ విద్యార్థులు క్రీడల్లోనూ రాణించగలరని కూకట్పల్లి ఏజీఎం శివరామకృష్ణ తెలిపారు. బీఎస్ రావు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడని, డాక్టర్గా వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూ.. విద్యాసంస్థలను ప్రారంభించి శ్రీచైతన్య అనే బ్రాండ్ను సృష్టించారని ఆయన చూపించిన మార్గంలో నేడు ఎంతో మంది చదువుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారని కొనియాడారు.సీనియర్లు, జూనియర్ల విభాగాలలో వేర్వేరుగా జరిగిన వివిధ క్రీడల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆయా బ్రాంచీల విద్యార్థులు చేసిన మార్చ్ ఫాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రీడా జ్యోతితో స్పూర్తిని పెంచి ఉత్తేజంతో విద్యార్థులు ఆటల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజీఎం రవికుమార్, పార్ట్నర్ అడ్వైజర్ ఫర్ ఉమెన్ & చైల్డ్ వెల్ఫేర్ వినోద్ కుమార్ బుర్రా హాజరయ్యారు. ఆర్ ఐ శ్రీనివాసరెడ్డి, ఆల్ ఇండియా స్పోర్ట్స్ రీసోర్స్ పర్సన్ రాజశేఖర్, ఆయా బ్రాంచ్ల ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కోహ్లికి శ్రేయస్ చురకలు?
-
క్రికెట్ ఫ్యాన్స్ కు పూనకాలు ...!
-
స్పోర్ట్స్ టెక్నాలజీ మార్కెట్ @ రూ. 49,500 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా స్పోర్ట్స్ టెక్నాలజీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో 85 శాతం వృద్ధి చెందనుంది. 2029 నాటికి రూ. 49,500 కోట్లకు చేరనుంది. ఫ్యాంటసీ గేమ్స్ సంస్థ ఎఫ్ఐఎఫ్ఎస్, డెలాయిట్ విడుదల చేసిన సంయుక్త నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ స్పోర్ట్స్–టెక్ మార్కెట్ రూ. 26,700 కోట్ల స్థాయిలో ఉంది. యాప్లు, డివైజ్లు, సెన్సార్లు మొదలైనవి స్పోర్ట్స్ టెక్ కేటగిరీలోకి వస్తాయి. డిజిటల్ టెక్నాలజీల రాకతో క్రీడాకారులు పనితీరును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన డేటాను అందించడంతో పాటు అభిమానులు కూడా క్రీడలను ఆస్వాదించేందుకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు వీలవుతోందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ప్రశాంత్ రావు తెలిపారు. దీంతో కొత్త వ్యాపార అవకాశాలు తెరపైకి వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిణామక్రమానికి ఫ్యాంటసీ స్పోర్ట్స్ సారథ్యం వహించగలదని ఆయన చెప్పారు. గణనీయంగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఆర్థికంగా సానుకూల ప్రభావాలు కూడా చూపిస్తోందని వివరించారు. 2029 ఆర్థిక సంవత్సరం వరకు పరిశ్రమ ఏటా 7 శాతం మేర వృద్ధి చెందుతుందని, 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 17,500 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పిస్తుందని ప్రశాంత్ రావు తెలిపారు. ఇటు క్రీడాకారులు, అటు అభిమానులకు మరో స్థాయిలో స్పోర్ట్స్ అనుభూతిని టెక్నాలజీ అందించగలదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) డైరెక్టర్ జనరల్ జాయ్ భట్టాచార్య తెలిపారు. ఫ్యాంటసీ స్పోర్ట్స్పై జీఎస్టీ ఎఫెక్ట్..ఫ్యాంటసీ స్పోర్ట్స్ విభాగంపై గ్యాంబ్లింగ్ ట్యాక్స్ రేట్ల స్థాయిలో 28 శాతం జీఎస్టీ విధించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం 10 శాతం మేర క్షీణించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. జీఎస్టీ దెబ్బతో ఫ్యాంటసీ స్పోర్ట్స్ కంపెనీల మార్జిన్లపై 50 శాతం మేర ప్రతికూల ప్రభావం పడుతోందని వివరించింది. జీఎస్టీ నిబంధనతో 2023లో ఈ విభాగంపై పెట్టుబడులు 90 శాతం పడిపోయాయని, 2024లో కొత్తగా పెట్టుబడులు రాలేదని నివేదిక పేర్కొంది. -
‘స్పోర్ట్స్ డేటా గేమ్థాన్’ను ప్రారంభించింన FIFS..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10, 2025: స్పోర్ట్స్ టెక్లో భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (FIFS) ఆధ్వర్యంలో డ్రీమ్11 సమర్పనలో స్పోర్ట్స్ AI ఛాలెంజ్ ‘స్పోర్ట్స్ డేటా గేమ్థాన్’ను ప్రారంభించింది. ఈ అధునాతన సాంకేతిక పోటీ డేటాను సమగ్రపరచడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను క్రీడలకు ఉపయోగించుకోవడానికి నూతన మార్గాలను అన్వేషించే దిశగా అడుగులేస్తుంది.ఈ గేమ్థాన్లో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ల నుండి విద్యార్థి జట్లు పాల్గొంటాయి. ఇందులో పాల్గొనే వారు ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా రోజువారీ ఫాంటసీ స్పోర్ట్స్ ఫార్మాట్లో పోటీపడతారు. ముఖ్యంగా డేటా అనలిటిక్స్ నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ, గేమ్థాన్ యొక్క బదిలీ పరిమితులు ఇతర నియమాలకు కట్టుబడి విజేతగా నిలవడానికి వ్యూహాన్ని రూపొందించడంలో ఏఐ, ఎమ్ఎల్ నమూనాలను నిర్మించాలి.ఈ ప్రతిష్టాత్మక పోటీకి 30 కి పైగా ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపాయి. వారి వ్యూహాత్మక ప్రణాళికలను సమీక్షించిన తర్వాత., IIT బాంబే, IIT ఢిల్లీ, IIT ఖరగ్పూర్, IIT కాన్పూర్, IIIT ధార్వాడ్ వంటి సంస్థల నుండి 52 జట్లు షార్ట్లిస్ట్ చేయబడ్డాయి. మొదటి మూడు జట్లు వరుసగా రూ.12.5 లక్షలు, 7.5 లక్షలు, 5 లక్షలు అందుకుంటూ మొత్తంగా 25 లక్షల బహుమతిని గెలుచుకుంటారు.గేమ్థాన్ అంతటా విద్యార్థులకు మద్దతుగా, FIFS ఇద్దరు నిపుణులను ఆన్-బోర్డ్ చేసింది - ప్రఖ్యాత క్రికెట్ విశ్లేషకుడు జాయ్ భట్టాచార్య మరియు USలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో AI వైస్ డీన్ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా, విద్యార్థి బృందాలకు వారి నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.ఈ సందర్భంగా FIFS డైరెక్టర్ జనరల్ జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ.., "స్పోర్ట్స్ డేటా గేమ్థాన్ యొక్క మొదటి ఎడిషన్ను ప్రారంభించడానికి మేము సంతోషిస్తున్నాము. మా ప్రయత్నానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ గేమ్థాన్లో ప్రధానంగా యువతరం పోటీ పడటం పట్ల మేము సంతోషిస్తున్నామ’’ని అన్నారు.‘స్పోర్ట్స్ డేటా గేమ్థాన్’ అనేది ఆవిష్కరణకు ప్రోత్సాహక వేదికగా మారడంతో పాటు భారతదేశాన్ని స్పోర్ట్స్ టెక్నాలజీలో ప్రపంచ నేతగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లన్నుంది. ఈ తరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ అనలిటిక్స్ రంగంలో యువ ప్రతిభను పెంపొందించడంతో గేమ్థాన్ అభిమానుల భాగస్వామ్యాన్ని పునర్నిర్వచించడానికి.. అత్యాధునిక సాంకేతికత, డిజిటల్ కంటెంట్ అనుసంధానం చేసే విశిష్టమైన వ్యవస్థను పెంపొందిస్తుంది. -
గెట్... సెట్... గో
స్పోర్ట్స్ మూవీస్కి ఆడియన్స్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ తరహా సినిమాలు ఏమాత్రం ఆడియన్స్కి కనెక్ట్ అయినా బాక్సాఫీస్ స్కోర్స్ (కలెక్షన్స్) కొత్త రికార్డులు సృష్టిస్తాయి. దీంతో వీలైనప్పుడల్లా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీస్ చేస్తుంటారు యాక్టర్స్. ఇలా ప్రస్తుతం సెట్స్లో ‘గెట్..సెట్..గో’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం స్పోర్ట్స్ ఆడుతున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.పెద్ది... ప్లే స్టార్ట్‘రచ్చ, ఆరెంజ్’... ఇలా కొన్ని సినిమాల్లో రామ్చరణ్ క్రికెట్ ఆడిన సన్నివేశాలు చాలా తక్కువ నిడివిలో కనిపిస్తాయి. కానీ ‘పెద్ది’ సినిమాలో మాత్రం ఫుల్ మ్యాచ్ ఆడనున్నారట రామ్చరణ్. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్చరణ్ క్రికెటర్గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్లో ముగిసింది. చివరి రోజు తన కుమార్తె క్లీంకారని సెట్స్కి తీసుకొచ్చారు రామ్చరణ్.అలాగే ఈ సినిమాలో క్రికెట్తోపాటు కబడ్డీ వంటి ఇతర స్పోర్ట్స్ల ప్రస్తావన కూడా ఉంటుందట. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో దివ్యేందు, జగపతిబాబు, శివరాజ్కుమార్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్స్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీని ఈ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.ఒక మ్యాచ్.... మూడు జీవితాలు!మాధవన్ , నయనతార, సిద్ధార్థ్ లీడ్ రోల్స్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్కి శశికాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో క్రికెటర్గా నటించారు సిద్ధార్థ్. చక్రవర్తి రామచంద్రన్, శశి కాంత్ నిర్మించిన ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇక 2006లో వచ్చిన హిందీ చిత్రం ‘రంగ్ దే బసంతి’ తర్వాత మళ్లీ 18 సంవత్సరాల అనంతరం మాధవన్ , సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ఇదే.జల్లికట్టు నేపథ్యంలో...తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు. ఈ క్రీడ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కాగా సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నాలుగు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సెట్స్పైకి వెళ్లలేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీని సెట్స్పైకి తీసుకుని వెళ్లాలని సూర్య, వెట్రిమారన్ ప్లాన్ చేశారు. జనవరిలో సూర్య, వెట్రిమారన్, ఈ చిత్రనిర్మాత కలైపులి .ఎస్ థానుల మధ్య ‘వాడి వాసల్’ గురించిన చర్చలు కూడా జరిగాయి. ఇక ఎప్పట్నుంచో ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ‘వాడి వాసల్’ రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది.మరోసారి బాక్సింగ్ధనుష్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ మూవీలో అరుణ్ విజయ్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ ఓ బాక్సర్ రోల్ చేస్తున్నారు. కాగా అరుణ్ విజయ్ బాక్సర్గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాక్సర్’ అనే మూవీలో అరుణ్ విజయ్ బాక్సర్గా నటించారు. అయితే ‘బాక్సర్’ కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాగా, ‘ఇడ్లీ కడై’ మాత్రం స్పోర్ట్స్తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న మూవీ. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కా నుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో షాలినీపాండే, సత్యరాజ్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు.కె–ర్యాంప్‘క’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘కె–ర్యాంప్’. ఈ చిత్రం టైటిల్ లోగోలో ఓ వ్యక్తి ఫుట్బాల్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని ఊహించవచ్చు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. యుక్తీ తరేజా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వీకే నరేశ్, ‘వెన్నెల’ కిశోర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.రేస్ రాజాహీరో శర్వానంద్ బైక్ రేసింగ్తో బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్బాల్ ప్లేయర్గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.బాక్సింగ్ రౌండ్ 2హీరో ఆర్య, దర్శకుడుపా. రంజిత్ కాంబినేషన్లో వచ్చిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్టై పరంబర’. ఈ మూవీ 2021లో డైరెక్ట్గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్గా 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర రౌండ్ 2’ అంటూ సీక్వెల్ను ప్రకటించారు. అయితే తొలి భాగం మాదిరి, రెండో భాగాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్స్లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు మేకర్స్. కబడ్డీ... కబడ్డీ..ధృవ్ విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీ ‘బైసన్: కాలమాడన్’. మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్గా నటిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అలాగే కబడ్డీ ప్లేయర్గా కెరీర్ను మొదలుపెట్టి, రాజకీయ నాయకుడిగా మారిన మనత్తి పి. గణేశన్ జీవితం ఆధారంగా ‘బైసన్’ మూవీ రూపొందుతోంని కోలీవుడ్ సమాచారం. అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలంప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.- ముసిమి శివాంజనేయులు -
ఖేలో ఇండియా సెంటర్లకు ఆహ్వానం...
కరీంనగర్ స్పోర్ట్స్: ప్రస్తుత కాలంలో క్రీడలపై ఆసక్తి ప్రతి ఒక్కరిలో పెరిగింది. ప్రపంచ పోటిలు, ఒలంపిక్స్ లాంటి మోగా పోటీల్లో భారత క్రీడాకారులు సాధించిన పతకాలతో క్రీడల్లో తమ పిల్లలను ప్రొత్సహించాలనే ఆసక్తి సైతం తల్లిదండ్రుల్లో మొదలైంది. దీనికి తోడు భారత్ ఇటీవలీ కాలంలో ప్రపంచ కప్ ఖోఖో పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం, పుట్బాల్ పోటీలు త్వరలో జరుగనుండడం, 2036లో ఒలంపిక్స్ నిర్వహించేందుకు బిడ్స్ వేయడం ఇలా చెప్పుకుంటే పోటే క్రీడలు క్రేజీగా మారాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా సెంటర్లను వెలుగులోకి తెచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పలు క్రీడల్లో ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సెంటర్లలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు సత్పలితాలు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్, రంగారెడ్డిలలోని ఖేలో ఇండియా సెంటర్లలోని పలు క్రీడల్లో నూతన క్రీడాకారులకు అవకాశం కల్పించింది. ఏయే క్రీడల్లో ఖేలో ఇండియా సెంటర్లు ఉన్నాయి.....ఏ ప్రాంతంలో పోటీలు జరుగనున్నాయి....ఎలా హాజరుకావాలని తదితర వివరాలతో సాక్షి కథనం..క్రీడలు...హాకీ, అథ్లెటిక్స్, అర్చరీ (బాలబాలికలు) కబడ్డీ (బాలురు), జిమ్నాస్టిక్స్ (బాలబాలికలు)కావాల్సిన పత్రాలు...ఆధార్ కార్డు, వయస్సు ధృవీకరణ పత్రం, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు, మెడికల్ సర్టిఫికేట్లు, విద్యార్హత పత్రాలు, పాస్ పోర్టు సైజ్ ఫోటోలు 2 అథ్లెటిక్స్, అర్చరీ (బాలబాలికలు), కబడ్డీ (బాలురు)....ఫిబ్రవరి 4, 5 తేదీల్లో హైదరాబాద్ గచ్చీబౌళీ స్టేడియంలో, హాకీ కాంప్లెక్స్లో ఎంపికలు జరుగును. 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలబాలికలు అర్హులు. ఎంపిక పోటీలకు హాజరయ్యే వారు గుర్తించబడిన క్రీడలో కనీసం రాష్ట్రస్థాయి పోటిల్లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. క్రీడాకారులు 4న ఉదయం 7 గంటలకు రిపోర్టు చేయాలి.హాకీ (బాలబాలికలు)..: ఫిబ్రవరి 4 నుంచి 6 తేదీల్లో హైదరాబాద్ గచ్చీబౌళీ స్టేడియంలో, హాకీ కాంప్లెక్స్లో ఎంపికలు జరుగును. 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలబాలికలు అర్హులు. ఎంపిక పోటీలకు హాజరయ్యే వారు గుర్తించబడిన క్రీడలో కనీసం రాష్ట్రస్థాయి పోటిల్లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. క్రీడాకారులు 4న ఉదయం 7 గంటలకు రిపోర్టు చేయాలి.జిమ్నాస్టిక్స్ (బాలబాలికలు)...ఫిబ్రవరి 4, 5 తేదీల్లో రంగారెడ్డి ఎల్బీనగర్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఎంపికలు జరుగును. 8 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలబాలికలు అర్హులు. ఎంపిక పోటీలకు హాజరయ్యే వారు కనీసం జిల్లా స్థాయి పోటిల్లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. క్రీడాకారులు 4న ఉదయం 7 గంటలకు రిపోర్టు చేయాలి. -
సెంచరీతో రికార్డ్ సాధించిన భద్రాచలం యువతి త్రిష
-
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా బుమ్రా
-
మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయి
హైదరాబాద్: క్రీడలు శారీరక దేహ దారుడ్యానికే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి కూడా ఎంతో దోహదం చేస్తాయని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 2025 జాతీయ సదస్సు హెచ్ఐసీసీలో నిర్వహించిన సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన బ్రిటిష్ ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీదేవి మహాలింగప్పతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన నిత్యం జీవితంలోని ఎన్నో టెన్షన్స్ను, పని ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా క్రీడలు ఆడాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో సౌత్ జోన్ సభ్యులు విజేతలుగా నిలిచారు. వారికి థమన్ ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో నటుడు అశ్విన్ బాబు, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి. కిషన్, సెక్రటరీ డాక్టర్ ఉమా శంకర్, కోశాధికారి డాక్టర్ జార్జ్ రెడ్డి, డాక్టర్ విశాల్ ఆకుల, న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ జట్టులో నితీశ్ రెడ్డి లేడు కారణం అదేనా
-
BCCI: ఈ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు..!
-
ఈ పాపమంతా భార్యలదేనంట..!
-
టీమిండియాకు కొత్త తలనొప్పి..!
-
‘సై’ అంటే ‘సై’... మెగా ఈవెంట్స్తో కొత్త ఏడాదికి స్వాగతం
మైదానంలో బరిలోకి దిగే ఆటగాళ్లకి ప్రతి రోజూ కొత్త అవకాశమే... అప్పటి వరకు అద్భుతాలు చేసినా, వైఫల్యాలతో అట్టడుగున నిలిచినా మళ్లీ పైకి లేచేందుకు సిద్ధం కావడమే... ఇక కొత్త సంవత్సరం వస్తుందంటే కొత్త టోర్నీలు, సరికొత్త తరహా ఆటతో అత్యుత్తమ ప్రదర్శనకు ‘సై’ అనడమే... ముగిసిన సంవత్సరంలో త్రుటిలో విజయాలు చేజార్చుకున్న క్షణాలు, అనూహ్యంగా ఎదురైన అపజయాలను మరచిపోయేలా అక్కడే, అదే వేదికపై తప్పులు దిద్దుకొని సత్తా చాటేందుకు కొత్త ఏడాది ఇస్తున్న మరో చాన్స్ అనుకొని చెలరేగిపోవడమే... మరోవైపు అభిమానులకు ఏడాదంతా ఆటలతో పండగనే... క్రీడాంశం ఏదైనా, టోర్నీ పేరు ఏదైనా మైదానంలోనైనా, ఇంట్లోనైనా, ఎక్కడి నుంచైనా తాము ఆశించిన వినోదం కోసం వారు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే పోటీలైనా... ప్రతీ ఏటా పలకరించే వార్షిక టోర్నీలైనా... ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ ‘జై’ కొట్టేందుకు సిద్ధమైపోతారు... అందుకే క్యాలెండర్లో సంవత్సరం మారగానే కొత్త ఏడాదిలో వచ్చే ఈవెంట్లపై అందరికీ ఎప్పటిలాగే ఆసక్తి ఉంటుంది.2025 అలాంటి కొన్ని ఉత్సాహవంతమైన క్రీడా పోటీలతో సిద్ధమైంది. క్రికెట్ అభిమానుల కోసం వన్డే వరల్డ్కప్కు సమఉజ్జీలాంటి చాంపియన్స్ ట్రోఫీ ఏడాది ఆరంభంలోనే కనువిందు చేయనుంది. ఈ టోర్నీకి ముందు మలేసియా వేదికగా అండర్–19 మహిళల వరల్డ్కప్లో భారత జట్టు టైటిల్ నిలబెట్టుకునేందుకు పోరాడనుంది. ఆ తర్వాత మహిళల క్రికెట్లో వన్డే వరల్డ్కప్నకు మన దేశమే ఆతిథ్యం ఇవ్వనుంది. ఆటగాళ్లు అటు ఇటు మారడం మినహా ఎప్పటిలాగే ఐపీఎల్ వేసవిలో అలరించనుంది. టెన్నిస్ గ్రాండ్స్లామ్లు, బ్యాడ్మింటన్లో బీడబ్ల్యూఎఫ్ టూర్ టోర్నీలు ఏడాదంతా కొత్త చాంపియన్ల కోసం తివాచీ పరచడం ఖాయం కాగా... భారత్ వేదికగానే జూనియర్ హాకీ వరల్డ్ కప్ యువ ఆటగాళ్లను పరిచయం చేయనుంది. షూటింగ్, రెజ్లింగ్, వెయిట్లిఫ్టింగ్, బాక్సింగ్వంటి క్రీడాంశాల్లో విశ్వ వేదికలపై మన ఆటగాళ్లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఏడాదిలో అసాధారణ ప్రదర్శనలతో అలరించిన మన చదరంగం కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని ఎత్తులు పై ఎత్తులతో కొత్త ఎత్తులకు చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంలో జరిగే ప్రధాన ఈవెంట్లతో కూడిన క్రీడా క్యాలెండర్ మీ కోసం... –సాక్షి క్రీడా విభాగంక్రికెట్ జనవరి 3–7: ఆ్రస్టేలియాతో ఐదో టెస్టు (సిడ్నీ) భారత్లో ఇంగ్లండ్ పర్యటన జనవరి 22: తొలి టి20 (చెన్నై) జనవరి 25: రెండో టి20 (కోల్కతా) జనవరి 28: మూడో టి20 (రాజ్కోట్) జనవరి 31: నాలుగో టి20 (పుణే) ఫిబ్రవరి 2: ఐదో టి20 (ముంబై) ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్పూర్) ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్) ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్) చాంపియన్స్ ట్రోఫీ (దుబాయ్) ఫిబ్రవరి 20: భారత్ X బంగ్లాదేశ్ ఫిబ్రవరి 23: భారత్ Xపాకిస్తాన్ మార్చి 2: భారత్ X న్యూజిలాండ్ మార్చి 4: సెమీఫైనల్ (అర్హత సాధిస్తే) మార్చి 9: ఫైనల్ (అర్హత సాధిస్తే) ఇంగ్లండ్లో భారత్ పర్యటన జూన్ 20–24: తొలి టెస్టు (హెడింగ్లే) జూలై 2–6: రెండో టెస్టు (ఎడ్జ్బాస్టన్) జూలై 10–14: మూడో టెస్టు (లార్డ్స్) జూలై 23–27: నాలుగో టెస్టు (మాంచెస్టర్) జూలై 31–ఆగస్టు 4: (ఓవల్) బంగ్లాదేశ్లో భారత్ పర్యటన ఆగస్టు: 3 వన్డేలు, 3 టి20లు భారత్లో వెస్టిండీస్ పర్యటన అక్టోబర్: 2 టెస్టులు ఆ్రస్టేలియాలో భారత్ పర్యటన నవంబర్: 3 వన్డేలు, 5 టి20లు భారత్లో దక్షిణాఫ్రికా పర్యటన నవంబర్–డిసెంబర్: 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20లు ఇంగ్లండ్లో భారత మహిళల జట్టు పర్యటన జూన్–జూలైలో ఐదు టి20లు, మూడు వన్డేలుమహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు వేదిక: మలేసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు వేదిక: పాకిస్తాన్, దుబాయ్ ఐపీఎల్ టోర్నీ మార్చి 14 నుంచి మే 25 వరకు మహిళల వన్డే వరల్డ్ కప్ ఆగస్టు–సెప్టెంబర్ వేదిక: భారత్ బ్యాడ్మింటన్ జనవరి 7–12: మలేసియా ఓపెన్–1000 టోర్నీ (కౌలాలంపూర్) జనవరి 14–19: ఇండియా ఓపెన్–750 టోర్నీ (న్యూఢిల్లీ) ఫిబ్రవరి 11–16: ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ (కింగ్డావో, చైనా) మార్చి 11–16: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్షిప్ (బరి్మంగ్హమ్) ఏప్రిల్ 8–13: ఆసియా వ్యక్తిగత చాంపియన్షిప్ (నింగ్బో, చైనా) ఏప్రిల్ 27–మే 4: సుదిర్మన్ కప్ (జియామెన్, చైనా) మే 27–జూన్ 1: సింగపూర్ ఓపెన్–750 టోర్నీ (సింగపూర్ సిటీ) జూన్ 3–8: ఇండోనేసియా ఓపెన్–1000 టోర్నీ (జకార్తా) జూలై 15–20: జపాన్ ఓపెన్–750 టోర్నీ (టోక్యో) జూలై 22–27: చైనా ఓపెన్–1000 టోర్నీ (చాంగ్జౌ) ఆగస్టు 25–31: ప్రపంచ చాంపియన్షిప్ (పారిస్) సెప్టెంబర్ 16–21: చైనా మాస్టర్స్–750 టోర్నీ (షెన్జెన్) అక్టోబర్ 6–19: ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్, వ్యక్తిగత చాంపియన్షిప్ (గువాహటి, భారత్) అక్టోబర్ 14–19: డెన్మార్క్ ఓపెన్–750 టోర్నీ (ఒడెన్స్) అక్టోబర్ 21–26: ఫ్రెంచ్ ఓపెన్–750 టోర్నీ (పారిస్) డిసెంబర్ 10–14: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ (హాంగ్జౌ, చైనా)ఫార్ములావన్మార్చి 16: ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రి (మెల్బోర్న్) మార్చి 23: చైనా గ్రాండ్ప్రి (షాంఘై) ఏప్రిల్ 6: జపాన్ గ్రాండ్ప్రి (సుజుకా) ఏప్రిల్ 13: బహ్రెయిన్ గ్రాండ్ప్రి (సాఖిర్) ఏప్రిల్ 20: సౌదీ అరేబియా గ్రాండ్ప్రి (జిద్దా) మే 4: అమెరికా గ్రాండ్ప్రి (మయామి) మే 18: ఇటలీ గ్రాండ్ప్రి (ఇమోలా) మే 25: మొనాకో గ్రాండ్ప్రి (మోంటెకార్లో) జూన్ 1: స్పెయిన్ గ్రాండ్ప్రి (బార్సిలోనా) జూన్ 15: కెనడా గ్రాండ్ప్రి (మాంట్రియల్) జూన్ 29: ఆ్రస్టియా గ్రాండ్ప్రి (స్పీల్బర్గ్) జూలై 6: బ్రిటన్ గ్రాండ్ప్రి (సిల్వర్స్టోన్) జూలై 27: బెల్జియం గ్రాండ్ప్రి (స్పా ఫ్రాంకోర్చాంప్స్) ఆగస్టు 3: హంగేరి గ్రాండ్ప్రి (బుడాపెస్ట్) ఆగస్టు 31: డచ్ గ్రాండ్ప్రి (జాండ్వూర్ట్) సెప్టెంబర్ 7: ఇటలీ గ్రాండ్ప్రి (మోంజా) సెప్టెంబర్ 21: అజర్బైజాన్ గ్రాండ్ప్రి (బాకు) అక్టోబర్ 5: సింగపూర్ గ్రాండ్ప్రి (సింగపూర్ సిటీ) అక్టోబర్ 19: యూఎస్ఏ గ్రాండ్ప్రి (ఆస్టిన్) అక్టోబర్ 26: మెక్సికో గ్రాండ్ప్రి (మెక్సికో సిటీ) నవంబర్ 9: బ్రెజిల్ గ్రాండ్ప్రి (సావోపాలో) నవంబర్ 22: లాస్వేగస్ గ్రాండ్ప్రి (అమెరికా) నవంబర్ 30: ఖతర్ గ్రాండ్ప్రి (దోహా) డిసెంబర్ 7: అబుదాబి గ్రాండ్ప్రి (యూఏఈ)టెన్నిస్ జనవరి 12–26: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ (మెల్బోర్న్) మే 25–జూన్ 8: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ (పారిస్) జూన్ 30–జూలై 13: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ (లండన్) ఆగస్టు 25–సెప్టెంబర్ 7: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ (న్యూయార్క్). మార్చి 5–16: ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (కాలిఫోర్నియా) మార్చి 19–30: మయామి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (ఫ్లోరిడా) ఏప్రిల్ 5–13: మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (మొనాకో) ఏప్రిల్ 22–మే 4: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (స్పెయిన్) మే 6–18: రోమ్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (ఇటలీ) జూలై: టొరంటో ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (కెనడా) ఆగస్టు: సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (ఒహాయో) అక్టోబర్ 1–13: షాంఘై ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (చైనా) అక్టోబర్ 25–నవంబర్ 2: పారిస్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (ఫ్రాన్స్) నవంబర్ 9–16: ఏటీపీ ఫైనల్స్ టోర్నీ (ఇటలీ) నవంబర్ 18–23: డేవిస్కప్ ఫైనల్స్ టోర్నీ (ఇటలీ) ఆర్చరీఫిబ్రవరి 16–23: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీ (బ్యాంకాక్) ఏప్రిల్ 8–13: వరల్డ్ కప్ స్టేజ్–1 టోర్నీ (ఫ్లోరిడా, అమెరికా) మే 6–11: వరల్డ్ కప్ స్టేజ్–2 టోర్నీ (షాంఘై, చైనా) జూన్ 3–8: వరల్డ్ కప్ స్టేజ్–3 టోర్నీ (అంటాల్యా, టర్కీ) జూలై 8–13: వరల్డ్ కప్ స్టేజ్–4 టోర్నీ (మాడ్రిడ్, స్పెయిన్) ఆగస్టు 17–24: వరల్డ్ యూత్ చాంపియన్షిప్ (విన్నీపెగ్, కెనడా) సెప్టెంబర్ 5–12: వరల్డ్ చాంపియన్షిప్ (గ్వాంగ్జు, దక్షిణ కొరియా)రెజ్లింగ్ మార్చి 25–30: ఆసియా చాంపియన్షిప్ (అమ్మాన్, జోర్డాన్) జూన్ 14–23: ఆసియా అండర్–17, అండర్–23 చాంపియన్షిప్ (వియత్నాం) జూలై 5–13: ఆసియా అండర్–15, అండర్–20 చాంపియన్షిప్ (కిర్గిస్తాన్) జూలై 28–ఆగస్టు 3: వరల్డ్ అండర్–17 చాంపియన్షిప్ (ఏథెన్స్, గ్రీస్) ఆగస్టు 18–24: వరల్డ్ అండర్–20 చాంపియన్షిప్ (సోఫియా, బల్గేరియా) సెప్టెంబర్ 13–21: ప్రపంచ చాంపియన్షిప్ (జాగ్రెబ్, క్రొయేషియా) అక్టోబర్ 20–26: ప్రపంచ అండర్–23 చాంపియన్షిప్ (నోవిసాద్, సెర్బియా)టేబుల్ టెన్నిస్జనవరి 30–ఫిబ్రవరి 9: సింగపూర్ స్మాష్ టోర్నీ మార్చి 11–16: చాంపియన్స్ టోర్నీ (చైనా) ఏప్రిల్ 1–6: చాంపియన్స్ టోర్నీ (కొరియా) ఏప్రిల్ 14–20: పురుషుల, మహిళల వరల్డ్ కప్ (మకావు) జూన్ 26–జూలై 2: ఆసియా యూత్ చాంపియన్షిప్ (తాషె్కంట్) జూలై 3–13: యూఎస్ఏ స్మాష్ టోర్నీ ఆగస్టు 7–11: చాంపియన్స్ టోర్నీ (జపాన్) ఆగస్టు 14–24: గ్రాండ్స్మాష్ టోర్నీ సెప్టెంబర్ 9–14: చాంపియన్స్ టోర్నీ (మకావు) సెప్టెంబర్ 25–అక్టోబర్ 5: చైనా స్మాష్ టోర్నీ అక్టోబర్ 11–15: ఆసియా టీమ్ చాంపియన్షిప్ (భారత్) అక్టోబర్ 28–నవంబర్ 2: చాంపియన్స్ టోర్నీ (ఫ్రాన్స్) నవంబర్ 23–30: వరల్డ్ యూత్ చాంపియన్షిప్ (రొమేనియా) షూటింగ్ఫిబ్రవరి 9–22: ఆసియా రైఫిల్, పిస్టల్ కప్ (బ్యాంకాక్) ఏప్రిల్ 1–11: వరల్డ్ కప్–1 రైఫిల్, పిస్టల్, షాట్గన్ టోర్నీ (బ్యూనస్ ఎయిర్స్) ఏప్రిల్ 13–22: వరల్డ్ కప్–2 రైఫిల్, పిస్టల్, షాట్గన్ టోర్నీ (లిమా) మే 3–12: వరల్డ్కప్ షాట్గన్ టోర్నీ (సైప్రస్) జూన్ 1–12: ఆసియాకప్ షాట్గన్ టోర్నీ (చైనా) జూన్ 8–15: వరల్డ్కప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (జర్మనీ) జూలై 4–14: వరల్డ్కప్ షాట్గన్ టోర్నీ (ఇటలీ) ఆగస్టు 16–30: ఆసియా చాంపియన్షిప్ (కజకిస్తాన్) సెప్టెంబర్ 13–21: వరల్డ్కప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (చైనా) అక్టోబర్ 8–19: ప్రపంచ చాంపియన్షిప్ షాట్గన్ టోర్నీ (గ్రీస్) నవంబర్ 6–16: వరల్డ్ చాంపియన్షిప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (ఈజిప్్ట) హాకీ డిసెంబర్ 28–ఫిబ్రవరి 1: పురుషుల హాకీ ఇండియా లీగ్ (భారత్) జనవరి 12–26: మహిళల హాకీ ఇండియా లీగ్ (భారత్) ఫిబ్రవరి 15–జూన్ 29: ప్రొ హాకీ లీగ్ (మహిళలు) ఫిబ్రవరి 15–జూన్ 22: ప్రొ హాకీ లీగ్ (పురుషులు) డిసెంబర్: జూనియర్ పురుషుల వరల్డ్కప్ (భారత్)చెస్ ఫిబ్రవరి 17–28: మహిళల గ్రాండ్ప్రి మూడో సిరీస్ (మొనాకో) ఫిబ్రవరి 23–మార్చి 8: ప్రపంచ అండర్–20 చాంపియన్షిప్ (మోంటెనిగ్రో) మార్చి 14–25: మహిళల గ్రాండ్ప్రి నాలుగో సిరీస్ (సైప్రస్) ఏప్రిల్ 13–24: మహిళల గ్రాండ్ప్రి ఐదో సిరీస్ (భారత్) మే 6–17: మహిళల గ్రాండ్ప్రి ఆరో సిరీస్ (ఆ్రస్టియా) జూలై 5–29: మహిళల వరల్డ్కప్ టోర్నీ (జార్జియా) అథ్లెటిక్స్ సెప్టెంబర్ 13–21: ప్రపంచ చాంపియన్షిప్ (జపాన్)బాక్సింగ్ మార్చి 6–18: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్ (బెల్గ్రేడ్) మే–జూన్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్షిప్ -
ఫ్యాన్స్కు భారీ షాక్ నితీశ్రీ రెడ్డి ఔట్?
-
ఆంతా వాళ్లే చేశారంట..! క్రికెటర్ల తండ్రుల ఆవేదన
-
స్నేహితుడే కారణమా..? అశ్విన్ రిటైర్మెంట్ వెనుక సంచలన నిజాలు
-
ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్
-
రిటైర్మెంట్ హింట్ ఇచ్చిన రోహిత్...
-
IND vs AUS: 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్
-
‘మైండ్ స్పోర్ట్స్’: మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
‘ఆలోచనల గురించి పెద్దగా ఆలోచించవద్దు’ అనుకునేవాళ్లకు ముగ్ధ బవరే చెప్పే మాట...‘మన ఆలోచనలే మన పనితీరును ప్రభావితం చేస్తాయి’ ముగ్ధ ఒకప్పుడు ప్రతిభావంతురాలైన స్విమ్మర్. స్పోర్ట్స్ సైకాలజీపై పెద్దగాఅవగాహన లేని కాలంలో ఎంతోమంది అథ్లెట్ల మనసును అధ్యయనం చేసింది. క్రికెట్ టీమ్ నుంచి మొదలు ఒలింపిక్, పారాలింపిక్ అథ్లెట్ల వరకు ఎంతోమంది అథ్లెట్లతో కలిసి పనిచేసింది.మానసిక సమస్యలు, ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలతో ΄ పోరాడడానికి వారికి మార్గం చూపిన ముగ్ధ ప్రస్తుతం ‘మైండ్ స్పోర్ట్స్’ పేరుతో సొంతంగా ప్రాక్టీస్ నిర్వహిస్తోంది. ఎంతోమంది అథ్లెట్లకు దిశానిర్దేశం చేస్తోంది.‘మైండ్ స్పోర్ట్స్’పై పుస్తకం కూడా రాసింది. ఒక అథ్లెట్ మనసు మార్చడానికి ఏ అంశాలు ఉపయోగపడతాయో ఈ పుస్తకంలో వివరించింది.‘ఒక అథ్లెట్ మనసు ఇతర ప్రొఫెషనల్స్ కంటే ఏ రకంగా భిన్నంగా ఉంటుంది?’ అనే ప్రశ్నకు ముగ్ధ బవరే చెప్పే జవాబు...‘పూర్తిగా భిన్నం కాదు. మనం ఆలోచించే విధానం స్పోర్ట్స్ అయినా కార్పొరేట్ అయినా తేడా తీవ్రంగా ఉండకపోవచ్చు. అందుకే ఏ రంగంలోనైనా మానసిక శిక్షణ(మెంటల్ ట్రైనింగ్) చాలా కీలకం. మనం ఆలోచించే విధానమే మన పనితీరును ప్రభావితం చేస్తుంది. సక్సెస్ మాత్రమే సర్వస్వం అనుకునేచోట వైఫల్యం బాధ పెడుతుంది. చాలామందిని కోలుకోకుండా చేస్తుంది. అయితే గెలుపు, ఓటములు ప్రతిభకు, ప్రతిభ లేక పోవవడానికి నిర్వచనం కాదనే అవగాహన ప్రస్తుత కాలంలో పెరిగింది -
Rohit Sharma: టీమిండియా కొంప కొల్లేరు చేస్తున్న రోహిత్
-
Vinod Kambli: కాంబ్లీకి ఏమైంది..?
-
మూడేళ్లలో రూ.8.3 లక్షల కోట్లకు క్రీడారంగం!
ఆర్థికాభివృద్ధిలో క్రీడారంగాన్ని కూడా భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వం నిర్దిష్ట మోడల్ను రూపొందించాలని ఓ నివేదిక సూచించింది. క్రీడల మౌలిక సదుపాయాలు, ఈవెంట్లు, సంబంధిత ఉత్పత్తులు, సర్వీసుల్లో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించేలా విధానాలను తయారు చేయాలని పేర్కొంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, నాంగియా నెక్ట్స్ కలిసి ఈ నివేదికను రూపొందించాయి.ఈ నివేదిక ప్రకారం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ప్రతిభావంతులైన క్రీడాకారులకు తోడ్పాటు అందించేలా, భారీ స్థాయి క్రీడా కార్యక్రమాలకు నిధులు సమకూర్చే ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం తగు ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చని నివేదిక తెలిపింది. ఇంటర్నేషనల్ కోచ్లు, న్యూట్రిషనిస్టులు, మానసిక, శారీర శిక్షణ నిపుణులతో సహా అత్యుత్తమ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సీఎస్ఆర్ నిధులను వినియోగించేలా చూడొచ్చని పేర్కొంది. భారత క్రీడారంగం ప్రస్తుతం గణనీయమైన వృద్ధిని సాధించే దశలో ఉందని నివేదిక తెలిపింది. 2020లో దాదాపు 27 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ రంగం వృద్ధి 2027 నాటికి 100 బిలియన్ డాలర్ల(రూ.8.3 లక్షల కోట్లు)కు చేరుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.నివేదికలోని మరిన్ని విశేషాలు..స్పోర్ట్స్ కోచింగ్, మేనేజ్మెంట్ అంశాల్లో నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు నిర్వహించడం, విధానాలను రూపొందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల ద్వారా ఉపాధికి ఊతమిచ్చేలా క్రీడలకు సంబంధించిన అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటునివ్వాలి.క్రీడారంగం గణనీయంగా పురోగతి సాధించినప్పటికీ, అథ్లెట్లకు ఆర్థిక భద్రత, మౌలిక సదుపాయాల కొరత వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి.ఆర్థిక సహాయాన్నందించే కార్యక్రమాలను విస్తరించడం, కెరియర్పరంగా పరివర్తనకు దోహదపడే పటిష్టమైన విధానాలను రూపొందించడం, సమ్మిళిత సంస్కృతిని పెంపొందించడం వంటి చర్యలు ఈ సవాళ్లను పరిష్కరించడంలో ఉపయోగపడగలవు.అంతర్జాతీయ కాంపిటీషన్లు, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, వాటిని నిర్వహించేందుకు ప్రభుత్వం క్రియాశీలకమైన చర్యలు తీసుకోవాలి. దేశీయంగా వివిధ రాష్ట్రాలకు ప్రత్యేకమైన క్రీడలను మరింతగా వెలుగులోకి తెచ్చేందుకు స్పోర్ట్స్ టూరిజంను ప్రోత్సహించవచ్చు.ఇదీ చదవండి: విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా భారత్స్పోర్ట్స్ లీగ్లు, సాంకేతిక పురోగతి, వైవిధ్యమైన క్రీడలు మొదలైనవి ఈ రంగం వృద్ధికి తోడ్పడుతున్నాయి.స్పోర్ట్స్ గూడ్స్, దుస్తులు, మీడియా హక్కులు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి.స్పోర్ట్స్ మీడియా మార్కెట్ 2020లో 1 బిలియన్ డాలర్లుగా ఉండగా 2027 నాటికి 13.4 బిలియన్ డాలర్లకు చేరవచ్చనే అంచనాలు ఉన్నాయి.2023 ఏషియన్ గేమ్స్, 2024 పారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు సాధించిన విజయాలు, అంతర్జాతీయంగా పోటీపడే సత్తా పెరుగుతోందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. -
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే?
-
కడపలో ఘనంగా పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ ప్రారంభం (ఫొటోలు)
-
IPL 2025 Teams: ముగిసిన ఐపీఎల్ మెగా వేలం
-
ముద్దులు విసురుతూ విరాట్ సెలబ్రేషన్స్.. అనుష్క ఎదురుగా ఉంటే..!
-
INDvsAUS - 295 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం
-
Virat Kohli: చరిత్ర సృష్టించిన చి విరాట్ కోహ్లి..
-
కావ్య మారన్ సెలక్షన్ అదిరిందంటున్న ఫ్యాన్స్
-
IND vs AUS:పెర్త్ టెస్టులో భారత్ ఘన విజయం
-
వేలంలో భారత క్రికెటర్లకు కాసుల పంట.. తొలి రోజు ఎవరు ఎంత ధర పలికారంటే..?
-
Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కు ఇదే లాస్ట్ సిరీస్ అవుతుందా?
-
గౌతమ్ గంభీర్కు ఇదే లాస్ట్ మ్యాచ్ అవుతుందా?
-
దుబాయ్ స్పోర్ట్స్ అంబాసిడర్గా సానియా మీర్జా.. ఫొటోలు చూశారా?
-
వీల్ఛైర్తో విల్ పవర్కి అసలైన అర్థం ఇచ్చాడు!
‘శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది’ అనే మాటకు ఈ యువకుడే నిదర్శనం. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ధర్మతండాకు చెందిన రమావత్ కోటేశ్వర్ నాయక్ చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. ఒక కాలు సహకరించకపోయినా తాను కల కన్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. చదువుకునే రోజుల్లోనే ఆటలపై ఆసక్తి పెంచుకున్న కోటేశ్వర్ వీల్ ఛైర్ హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నేటి యువతలో క్రీడా స్పూర్తిని నింపుతున్నాడు...నేరేడుగొమ్ములోని గిరిజన హాస్టల్లో ఉండి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు, దేవరకొండలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆ తరువాత హైదరాబాద్లో డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సీటీలో పీజీ చేస్తున్న సమయంలో వీల్ఛైర్ స్పోర్ట్స్లో కోటేశ్వర్ నాయక్ ప్రతిభను కోచ్ గ్యావిన్స్ సోహెల్ ఖాన్ గుర్తించాడు. వీల్ఛైర్ హ్యాండ్బాల్, బాస్కెట్బాల్లో శిక్షణ ఇచ్చాడు. గురువు ఇచ్చిన శిక్షణతో తనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకున్న కోటేశ్వర్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.మెరుగైన ప్రదర్శనతో 2019లో తొలిసారి భారత జట్టుకు ఎంపికైన కోటేశ్వర్ పట్టాయ (థాయ్లాండ్)లో జరిగిన ఆసియా ఓషియానియా చాంపియన్ షిప్లో మన దేశం తరుపున బరిలో దిగాడు. 2022లో నోయిడాలో వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్ సాధించాడు. 2022లో పోర్చుగల్ జరిగిన వీల్ ఛైర్ హాండ్బాల్ యూరోపియన్ అండ్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. అందులో ఒక మ్యాచ్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిల్ సొంతం చేసుకున్నాడు. 2023లో ఏసియా కప్ పోటీలు నేపాల్లోని ఖాట్మాండులో జరిగాయి. అందులో బెస్ట్ ప్లేయర్గా నిలిచాడు.చదవండి: సెలబ్రిటీలు మెచ్చిన స్టార్గ్వాలియర్లో ఈనెల 9 నుంచి 15 వరకు జరిగిన వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ నాలుగో నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో కెప్టెన్ గా కోటేశ్వర్ నేతృత్వంలోని టీమ్ సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. ఇటీవల చెన్నైలో జరిగిన సౌత్జోన్ వీల్ఛైర్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో కోటేశ్వర్ కెప్టెన్సీలో జట్టు సిల్వర్ మెడల్ సాధించింది.ఒలింపిక్స్ నా లక్ష్యంఒలింపిక్స్లో మన దేశం తరపున ఆడి పతకం సాధించాలన్నదే నా లక్ష్యం. ఇందుకు నిరంతర సాధన, కఠోర శ్రమ అవసరం. దీనికి తోడు పోటీలో రాణించాలంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన వీల్ఛైర్ అవసరం తప్పనిసరి. దీనికి ఏడు నుంచి ఎనిమిది లక్షలు అవుతుంది. ఇందుకు ప్రభుత్వం సహకరించాలి. – కోటేశ్వర్ నాయక్ – చింతకింది గణేష్, సాక్షి, నల్లగొండ -
IPL రిటెన్షన్ లిస్ట్ విడుదల..అత్యధిక ధర ఎవరికంటే?
-
IND vs NZ: రెండో టెస్టులో భారత్ ఓటమి..
-
పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్
-
సికిందర్ రజా ఊచకోత.. టీ20 క్రికెట్లో పెను సంచలనం
-
46 రన్స్ కే కుప్పకూలిన టీమిండియా
-
క్రీడల్లోనూ రతన్ ముద్ర
న్యూఢిల్లీ/ముంబై: భారత పారిశ్రామిక రంగంలోనే కాదు... క్రీడారంగంలోనూ ‘టాటా’ చెరగని ముద్ర వేసింది. స్వాతం్రత్యానికి పూర్వంలో భారత్ 1920లో అంట్వర్ప్ ఒలింపిక్స్కు టాటా గ్రూపే స్పాన్సర్గా వ్యవహరించింది. అప్పటి నుంచి క్రీడలపై కూడా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తూనే వచ్చింది. రతన్ టాటా వచ్చాక ఇది మరింతగా పెరిగింది. జీవనశైలిలో క్రీడలు భాగమేనని రతన్ అనే వారు. ‘టాటా’ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), టాటా స్టీల్ చెస్ ఇలా ఒకటేమిటి ఆర్చరీ, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్ ఫుట్బాల్), అథ్లెటిక్స్లలో రతన్ ఉదారత, దార్శనీయత, నిబద్ధత నిరుపమానమని పలువురు క్రీడా విశ్లేషకులు అభివర్ణించారు. » 1991లో జేఆర్డీ టాటా స్పోర్ట్స్ అకాడమీ నెలకొల్పిన నాటి నుంచి ఫుట్బాల్, హాకీ, ఆర్చరీ, ఈక్వె్రస్టియన్, బాక్సింగ్, కరాటే, రాకెట్ స్పోర్ట్స్ ఇలా 19 క్రీడాంశాలకు ప్రసిద్ధ శిక్షణ సంస్థగా టాటా స్పోర్ట్స్ అకాడమీ ఎదిగిందని ఇందులో రతన్ పాత్ర చాలా కీలకమని అకాడమీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు అన్నారు. » 1924లో ఏర్పాటైన భారత ఒలింపిక్ సంఘానికి తొలి అధ్యక్షుడు సర్ దోరబ్జి టాటా కావడం విశేషం. నెదర్లాండ్స్లో జరిగే టాటా స్టీల్ చెస్ను కొందరు చెస్ దిగ్గజాలు ‘వింబుల్డన్ ఆఫ్ చెస్’గా అభివర్ణిస్తారు. 2007 నుంచి టాటా స్టీల్ సంస్థ స్పాన్సర్షిప్లోనే ఈ టోర్నీ జరుగుతోంది. స్వాతం్రత్యానంతరం పది మంది గొప్ప వాళ్ల జాబితాను తయారు చేస్తే అందులో రతన్ అగ్రస్థానంలో ఉంటారు. తన కోసం కాకుండా దేశం కోసం ఒక వ్యక్తి ఓ వ్యవస్థను ఎలా మార్చగలడో, ఓ పరిశ్రమను ఎలా సృష్టించగలడో నిరూపించిన దిగ్గజం రతన్ టాటా. గొప్ప మానవతావాది. మూగజీవాల పట్ల కారుణ్యం, సమాజం పట్ల బాధ్యత ఉన్న మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. నేను ఆయన్ని చాలాసార్లు కలిశాను. ఆయన చాతుర్యం అపారం. ఆయనెప్పుడు మన మనస్సుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. దేశం కోసం ఆయనేం చేశాడో, భారత పారిశ్రామిక రంగాన్ని దశదిశలా వ్యాప్తిచేసిన ఆయన గురించి ఎంత చెప్పినా... వర్ణించినా తక్కువే –కపిల్దేవ్, భారత క్రికెట్ దిగ్గజం పారిశ్రామిక దిగ్గజం, దాతృత్వానికి నిలువెత్తు రూపం రతన్ టాటా ఇక లేరనే వార్త అత్యంత విచారకరం. చెస్ టోర్నీ ఆయన ఎంతో చేశారు. టాటా స్టీల్ చెస్లో ఆడటమే గొప్ప గౌరవంగా భావించేలా ఆ టోర్నీని మార్చేశారు. –చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ శ్రీ రతన్ టాటా మరణవార్త నన్ను దుఃఖంలో ముంచేసింది. ఆయన దూరదృష్టి అద్భుతం. ఆయనతో నేను గడిపిన క్షణాలు, సంభాషణ జీవితంలో మరచిపోలేను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారి్థస్తున్నా. –ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా రతన్ టాటా చూపిన మార్గం, చేసిన దిశానిర్దేశం దేశం ఎప్పటికి మరచిపోదు. మేమంతా మిమ్మల్ని అనుసరిస్తాం. –బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రతన్ ఒక్క పారిశ్రామిక రంగానికే కాదు... భారత సమాజానికి ఎనలేని సేవలందించారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. –దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే -
గచ్చిబౌలి స్టేడియంలో క్రీడా వర్సిటీ
సాక్షి, హైదరాబాద్: కొత్త క్రీడా పాలసీని 2036 ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి అధి కారులను ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చే విధంగా క్రీడా విధానం ఉండాలని సూచించారు. అద్భుతమైన క్రీడాకారులను తయారు చేయా లన్నారు. గచ్చిబౌలిలోని క్రీడా ప్రాంగణంలో స్పోర్ట్స్ యూని వర్సిటీని ప్రారంభించాలని చెప్పారు.దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణంలో ఇప్పటికే వివిధ క్రీడలకు రెడీమేడ్ సదుపాయాలున్నాయని.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వాటిని అధునాతనంగా తీర్చిదిద్దాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో కొత్త క్రీడా విధానంపై సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, జితేందర్రెడ్డి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, సీఎంవో అధికారులు శేషాద్రి, షాన వాజ్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరి స్తున్న విధానాలపై సమావేశంలో చర్చించారు.క్రీడల్లో రాణించడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు అందుబాటు లోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు.చైర్మన్ను నియమించాలి...యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో ఏర్పాటు చేసినట్లుగానే స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా అదే తరహాలో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సి టీగా తీర్చిదిద్దాలని సూచించారు.క్రీడా విశ్వవిద్యాలయానికి చైర్మన్ను నియమించాలని.. వర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండేలా చూడాలని ఆదేశించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రాథమికంగా 14 కోర్సులను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. క్రికెట్, హాకీ, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ క్రీడలను స్పోర్ట్స్ హబ్లో పొందుపరిచారు.ప్రముఖ క్రీడా మైదానాలన్నీ ఒకే గొడుకు కిందకు..ప్రముఖ క్రీడా మైదానాలన్నింటినీ స్పోర్ట్స్ హబ్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్డేడియం, సరూర్నగర్ ఇండోర్ స్టేడి యం, యూనివర్సిటీ సైక్లింగ్ వెలోడ్రమ్ లాంటి వాటన్నింటినీ గుర్తించి ఒకే గొడుగు కిందకు తేవాలని చెప్పారు.చదువుకు ఆటంకం లేకుండా..రాష్ట్రవ్యాప్తంగా వివిధ క్రీడల్లో ప్రతిభావంతులను గుర్తించి వారి చదువులకు ఆటంకం లేకుండా జాతీయ, అంతర్జా తీయ స్థాయి పోటీలకు అవసరమైన శిక్షణ అందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా కొత్త పాలసీ ఉండాలని అధికా రులకు దిశానిర్దేశం చేశారు. భౌగోళిక అనుకూల పరిస్థితుల తోపాటు తెలంగాణ ప్రాంత యువతకు ఆసక్తి ఉన్న క్రీడలకే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దేశ, విదేశాల కోచ్లను రప్పించాలని, అక్కడున్న వర్సిటీల సహకారం తీసుకొనేలా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నారు.ప్రోత్సాహకాలకు స్పష్టమైన విధానం..జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే క్రీడా కారులకు ఇచ్చే ప్రోత్సాహకాల విషయంలో స్పష్టమైన విధా నాన్ని అనుసరించాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఏ స్థాయి పోటీల్లో విజయం సాధించిన వారికి ఎంత ప్రోత్సాహకం అందించాలి? ఎవరికి ఉద్యోగం ఇవ్వాలనే విషయంలో మార్గదర్శకాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ముసాయిదాకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను పరిశీలించి పలు మార్పుచేర్పులను సూచించారు. -
John Floor: ఆ జంప్ విలువ అమూల్యం..!
పదహారేళ్ల వయసు.. కొత్తగా రెక్కలు విప్పుకుంటూ రివ్వున ఎగిరిపోవాలని, ప్రపంచాన్ని చుట్టిరావాలని కోరుకుంటుంది! కానీ ఆ ప్రాయంలోనే జరిగిన ఒక అనూహ్య ఘటన ఆ అమ్మాయి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ గడిపిన ఆ బాలికకు ఆపై నడవడమే అసాధ్యమైంది. పుట్టుకతో వచ్చిన లోపానికైతే జీవితంలో సన్నద్ధత వేరుగా ఉంటుంది. కానీ ఎదుగుతున్న వయసులో ఎదురైన ఆ పరిస్థితికి ఆమె చలించిపోయింది. పట్టరాని దుఃఖాన్ని అనుభవించింది. అయితే ఆ బాధతోనే కుంగిపోకుండా.. నిలిచి పోరాడాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఆమె క్రీడలను ఎంచుకుంది. ఆ దారిలో తీవ్రంగా శ్రమించి శిఖరానికి చేరింది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఆ అథ్లెట్ పేరు ఫ్లోర్ జాన్. నెదర్లండ్స్కు చెందిన పారాలింపియన్. వరుసగా రెండు పారాలింపిక్స్లలో స్వర్ణ పతకాలు సాధించి సత్తా చాటింది.ఫ్లోర్ జాన్ స్వస్థలం నెదర్లండ్స్లోని పర్మెరెండ్పట్టణం. చిన్నప్పటి నుంచి చదువులో, ఆటల్లో మహా చురుకు. టీనేజ్కి వచ్చాక ఆ ఉత్సాహం మరింత ఎక్కువైంది. ఎక్కడ ఎలాంటి పోటీ జరిగినా అక్కడ వాలిపోయేది. ముఖ్యంగా అథ్లెటిక్స్లో బహుమతి లేకుండా తిరిగొచ్చేది కాదు. ఆ ఉత్సాహంతోనే దూసుకుపోతూ, తన 17వ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతోన్న వేళ.. బ్యాక్టీరియల్ బ్లడ్ ఇన్ఫెక్షన్కు గురైంది. ఆ కారణంగా ఆమె కుడి కాలు, చేతి వేళ్ల ముందు భాగానికి రక్తప్రసరణ ఆగిపోయింది. దాంతో హడావిడిగా ఫ్లోర్ను ఆస్పత్రిలో చేర్పించారు. అసలు అలాంటి రక్త సమస్యతో ఆమె బతకడమే అసాధ్యం అనిపించింది.కాళ్లను తీసివేసి..వేర్వేరు శస్త్రచికిత్సల తర్వాత ఎట్టకేలకు డాక్టర్లు ప్రాణాపాయం నుంచి కాపాడగలిగారు. అయితే మరో షాకింగ్ విషయంతో వారు ముందుకొచ్చారు.. కుడి కాలును తొలగిస్తేనే ఇన్ఫెక్షన్ దరి చేరకుండా ఉంటుందని! ఒప్పుకోక తప్పలేదు. మోకాలి కింది భాగం నుంచి కుడి కాలును తీసేశారు. అదే తరహాలో రెండు చేతుల ఎనిమిది వేళ్లను కూడా గోళ్ల భాగం వరకు తొలగించారు. ఆ వయసులో ఇలాంటి పరిస్థితి ఎంత వేదనాభరితమో ఊహించుకోవచ్చు.ఫ్లోర్ పోరాడేందుకు సిద్ధమైంది. రీహాబిలిటేషన్ కేంద్రంలో కోలుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కార్బన్ ఫైబర్తో కృత్రిమ కాలును అమర్చారు. కానీ కొంతకాలానికి అదే ఆమెకు భారంగా మారింది. దానివల్ల తన సహజమైన కాలును కూడా కదపడం కష్టమైపోయింది. ఆ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది. దాంతో ఈసారి తానే డాక్టర్లను సంప్రదించింది. తన రెండో కాలునూ తొలగించమని కోరింది. వైద్యులు నిర్ఘాంతపోయినా చివరకు ఒప్పుకోక తప్పలేదు. ఆపరేషన్తో ఆ రెండో కాలును కూడా తీసేశాక రెండు బ్లేడ్లే ఆమెను నిలబెట్టాయి.అథ్లెటిక్స్లోకి అడుగు పెట్టి..ఆ ఘటన తర్వాత ఫ్లోర్ సమయాన్ని వృథా చేయలేదు. ఏడాదిలోపే డచ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ పారా అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రతిభాన్వేషణ కార్యక్రమానికి హాజరైంది. అక్కడే ఆమె అథ్లెటిక్స్ను ఎంచుకుంది. ఫ్లోర్ ప్రతిభ, పట్టుదలను చూసిన కోచ్ గైడో బాన్సన్ ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుకు మెరుగులు దిద్దుకుంది. జాతీయ స్థాయిలో, యూరోపియన్ సర్క్యూట్లో ఫ్లోర్ వరుస విజయాలు సాధించి ఆపై ప్రతిష్ఠాత్మక వరల్డ్ చాంపియన్షిప్పై దృష్టిసారించింది.పారా క్రీడల్లోకి అడుగు పెట్టిన మూడేళ్ల లోపే ఆమె ఖాతాలో వరల్డ్ చాంపియన్షిప్ మెడల్ చేరడం విశేషం. 2015లో దోహాలో జరిగిన ఈవెంట్లో 200 మీటర్ల పరుగులో కాంస్యం గెలుచుకుంది. 100 మీటర్ల పరుగులో ఆమె 12.78 సెకన్ల టైమింగ్తో కొత్త రికార్డు నమోదు చేయడంతో పాటు ర్యాంకింగ్స్లో కూడా మూడో స్థానానికి చేరింది. పారా అథ్లెట్లకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు రావడంతో ఫ్లోర్ ఆ తర్వాత లాంగ్జంప్కు మారింది. రెండు కాళ్లూ లేని అథ్లెట్ల కేటగిరీ టి62 లాంగ్జంప్లో రెండు వరల్డ్ రికార్డులు సృష్టించిన ఈ డచ్ ప్లేయర్ తొలిసారి ఈ విభాగంలో 6 మీటర్ల దూరాన్ని జంప్ చేసిన తొలి అథ్లెట్గా కూడా నిలిచింది. ఇదే జోరులో లాంగ్జంప్లోనూ రెండు వరల్డ్ చాంపియన్షిప్ స్వర్ణాలు ఫ్లోర్ను వెతుక్కుంటూ వచ్చాయి.ఒలింపిక్స్ పతకాలతో..లాంగ్జంప్కు మారక ముందు 2016 రియో ఒలింపిక్స్లో 100 మీ., 200 మీ. పరుగులో పాల్గొన్న ఫ్లోర్ పతకాలు సాధించడంలో విఫలమైంది. ఆ తర్వాత లాంగ్జంప్లో వరుసగా మూడు టోర్నీల్లో నాలుగో స్థానానికే పరిమితమైంది. అయితే మెడల్ గెలవడమే లక్ష్యంగా 2020 టోక్యో పారాలింపిక్స్కు సిద్ధమైంది. ఏడాది పాటు కఠోర సాధన చేసి స్వర్ణంతో తన కలను నిజం చేసుకుంది. గత మూడేళ్లుగా తన ఆటలో అదే పదును కొనసాగించిన ఈ అథ్లెట్ 2024 పారిస్ పారాలింపిక్స్లోనూ తన పతకాన్ని నిలబెట్టుకుంది. వరుసగా రెండో స్వర్ణాన్ని గెలుచుకొని సత్తా చాటింది. కమ్యూనికేషన్ సైన్సెస్ చదివిన ఫ్లోర్ ఇప్పుడు క్రీడాకారిణిగానే కాదు మోటివేషనల్ స్పీకర్గానూ తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తి పంచుతోంది. – మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం -
క్రికెట్ కోచింగ్ కు.. క్యూ కడుతున్న విద్యార్థులు
-
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా..
-
అత్యంత చెత్త రికార్డు.. 91 ఏళ్ల చరిత్రలో తొలిసారి..?
-
కీళ్లనొప్పులు.. ఆటకు గుడ్బై చెబుతా: సైనా నెహ్వాల్ (ఫొటోలు)
-
నేటి 'వి' చిత్రాలు
-
‘ఆటలు’ కావాలి : అమ్మాయిల ‘గోల్’ ఇది! ఆసక్తికరమైన వీడియో
పారిశ్రామికవేత్త ఆనంద్మహీంద్ర మరో ఆసక్తికరమైన వీడియోతో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే (ఆగస్టు29) సందర్భంగా క్రీడలు ప్రాముఖ్యతను వివరిస్తున్న ఒక వీడియోను పంచుకున్నారు. క్రీడలు మనల్ని మనుషులుగా చేస్తాయి అంటూ క్రీడల గొప్పతనాన్ని వివరించారు. ముఖ్యంగా బాలికావిద్య, సాధికారత ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, రూపొందించిన వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. చదువుతోపాటు ఈరోజు కొత్తగా నేర్చుకుందాం అటూ ఈ వీడియో ప్రారంభమవుతుంది. ‘‘నీళ్ల కుండను మోయడానికి కాదు బాలిక శిరస్సు ఉన్నది, భయపడి పరిగెత్తడానికి కాదు కాళ్లున్నది, కేవలం సేద్యం కోసం చిందించడానికి మాత్రమే కాదు ఈ స్వేదం ఉన్నది. గోల్ అంటే రోటీలు చేయడానికి మాత్రమే కాదు’’ అంటూ ఫుట్బాల్ గోల్ సాధిస్తారు బాలికల బృందం. ఫుట్ బాల్ క్రీడ ద్వారా బాలికల విద్య, అభివృద్ధిని గురించి వివరించడం అద్భుతంగా నిలిచింది.బాలికలు విద్య ద్వారా సాధికారత పొందే ప్రపంచాన్ని సృష్టించే దృక్పథంతో 1996లో ఆనంద్ మహీంద్రా కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ప్రాజెక్ట్ నన్హీ కాలీ ప్రాజెక్టును తీసుకొచ్చారు. పలు విధాలుగా బాలికా వికాసం కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. దాదాపు 7లక్షల మంది బాలికలకు సాయం అందించినట్టు నన్హీ కాలీ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది.There is a very, very simple reason why Sports is important:Because it makes us better human beings.#NationalSportsDay pic.twitter.com/3IhiQmpB66— anand mahindra (@anandmahindra) August 30, 2024 -
స్పోర్ట్స్ ప్రజెంటర్ నుంచి టాలీవుడ్ హీరోయిన్గా.. ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
క్రీడలకు కేరాఫ్గా తెలంగాణ
చందానగర్ (హైదరాబాద్): దేశంలో క్రీడలను ప్రోత్సహించే రాష్ట్రం తెలంగాణనే అనే గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. 2036లో ఒలింపిక్స్ను ఇండియాలో నిర్వహించాలనే ప్రధాని నరేంద్రమోదీ సంకల్పం నేపథ్యంలో హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జాతీయ క్రీడలను హైదరాబాద్లో నిర్వహించేలా సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఇటీవల కేంద్ర క్రీడల శాఖ మంత్రిని ఢిల్లీలో కలసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న స్టేడియాలను ఆధునీకరించి క్రీడాకారులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. 2028లో జరిగే ఒలింపిక్స్లో హైదరాబాద్ క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధించేందుకు ఇప్పటినుంచే చర్యలు చేపడతామన్నారు. ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ విజేతలకు పతకాలను ప్రదానం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. త్వరలో స్పోర్ట్స్ పాలసీ ‘వచ్చే విద్యాసంవత్సరం నుంచే హైదరాబాద్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తాం. దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా అక్కడి స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించడంతో పాటు మూడు బంగారు పతకాలను సాధించిన క్రీడాకారిణితో మాట్లాడాం. ఇక్కడ ఏర్పాటు చేసే స్పోర్ట్స్ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ సహకారం తీసుకుంటాం. అంతర్జాతీయ స్థాయి కోచ్లను రప్పించి క్రీడాకారులను తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తాం. ప్రాంతీయ క్రీడలకు ఎల్బీ స్టేడియం, జాతీయ క్రీడలకు ఉప్పల్ స్టేడి యం, అంతర్జాతీయ క్రీడలకు గచ్చిబౌలి స్టేడియం వేదికలుగా నిలుస్తాయి. త్వరలో స్పోర్ట్స్ కోసం ఓ పాలసీని తీసుకొస్తాం..’అని రేవంత్రెడ్డి చెప్పారు. అక్టోబర్ 2న సీఎం కప్ క్రీడలు ‘అక్టోబర్ 2న సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తాం. అక్టోబర్ 3వ వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో సీఎం కప్ క్రీడలు ప్రారంభం అవుతాయి. సీఎం కప్ క్రీడల విజేతలతో, వివిధ విభాగాల క్రీడాకారులతో డేటా బేస్ ఏర్పాటు చేస్తాం. దీనిపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన ఉంటుంది. త్వరలోనే గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతుంది. 25 ఏళ్ల కిందట హైదరాబాద్లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్, మిలిటరీ క్రీడలు నిర్వహించిన ఘనత మనకు ఉంది. అదే తరహాలో ఇప్పుడు కూడా స్టేడియాలకు పూర్వవైభవం తీసుకొచ్చేలా చేస్తాం. తెలంగాణలోని యువతను క్రీడలవైపు మళ్ళించేలా తగిన చర్యలు తీసుకుంటాం..’అని సీఎం తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్బాబు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, వి.హన్మంతరావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్, ఎన్ఎండీసీ ఈడీ జైపాల్రెడ్డి, ఐడీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ టీవీ నారాయణ, ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ రేస్ డైరెక్టర్ రాజేష్ వెచ్చా తదితరులు పాల్గొన్నారు. -
అలాంటి ఇన్నింగ్స్ నా కెరీర్లో చూడలేదు
-
అంతర్జాతీయ క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై
-
అంతర్జాతీయ క్రికెట్ లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ
-
రిటైర్మెంట్ వెనక్కి తీసుకోనున్న వినేష్ ఫోగట్
-
2025 ఐపీఎల్ లో ధోని ఆడుతాడా..?
-
CSK స్టార్స్ ఒలింపిక్స్లో ఈ ఈవెంట్లలో పోటీపడితే?.. (ఫొటోలు)
-
శభాష్ వినేష్.. ఓడినా నువ్వే బంగారం
-
పారిస్ ఒలింపిక్స్ 2024 : ఈసారి పతకాలు తగ్గాయి..! (ఫొటోలు)
-
టీమిండియా క్రికెటర్ నిశ్చితార్థం (ఫోటోలు)
-
Paris Olympics 2024: ఆ ఆరు వచ్చి ఉంటే ‘పది’ దాటేవాళ్లం (ఫోటోలు)
-
ఫ్రాన్స్ మళ్లీ 40 ఏళ్ల తర్వాత..
ఒలింపిక్స్ ఫుట్బాల్ ఫైనల్లో ఫ్రాన్స్ రెండోసారి ఒలింపిక్ చాంపియన్గా నిలిచేందుకు ఫ్రాన్స్ పురుషుల ఫుట్బాల్ జట్టు విజయం దూరంలో నిలిచింది. స్వదేశంలో జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో ఫ్రాన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీఫైనల్లో ఫ్రాన్స్ 3–1 గోల్స్తో ఈజిప్ట్ జట్టుపై విజయం సాధించి 1984 తర్వాత మళ్లీ ఒలింపిక్స్ క్రీడల్లో టైటిల్ పోరుకు అర్హత పొందింది.ఫ్రాన్స్ తరఫున మెటెటా జీన్ ఫిలిప్ (83వ, 99వ నిమిషాల్లో) రెండు గోల్స్తో మెరవగా... మైఖేల్ ఒలీస్ (108వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. ఈజిప్ట్ తరఫున మహమూద్ సాబెర్ (62వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. ఒలింపిక్స్ చరిత్రలో ఫ్రాన్స్ ఫుట్బాల్ జట్టు ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 1900 పారిస్ క్రీడల్లో రన్నరప్గా నిలిచిన ఫ్రాన్స్ ఆ తర్వాత 1984 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. శుక్రవారం జరగనున్న ఫైనల్లో స్పెయిన్తో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. -
బంగారు బైల్స్.. ప్యారిస్ ఒలిపింక్స్లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ (ఫోటోలు)
-
‘నన్ను పెళ్లాడతావా’.. స్వర్ణంతో పాటు ఎంగేజ్మెంట్ రింగ్ కూడా (ఫొటోలు)
-
Paris Olympics: పతకం ఖాయం అనుకుంటే.. నిరాశే మిగిలింది! (ఫొటోలు)
-
భారత్ ఖాతాలో రెండో పతకం మనూ భాకర్ పై మోదీ ప్రశంసలు..
-
సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవ్వాలనుకుని.. ఒలింపిక్ మెడల్ గెలిచి! (ఫొటోలు)
-
ఆటగాళ్లను ప్రోత్సహించాలి: ప్రధాని మోదీ
‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) తన మసులోని మాటను దేశ ప్రజల ముందు ఉంచారు. ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలంపిక్స్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు, దేశానికి ఘనత సాధించిపెట్టేందుకు ఒలింపిక్స్ మన ఆటగాళ్లకు మంచి అవకాశం కల్పిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.దేశ ప్రజలంతా ఒలింపిక్ ఆటగాళ్లను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ విద్యార్థులతో ముచ్చటించారు. కొద్ది రోజుల క్రితం ప్రపంచ మ్యాథ్స్ ఒలింపిక్స్ నిర్వహించామని, వీటిలో భారత విద్యార్థులు అద్భుత ప్రదర్శన చూపారన్నారు. ఇందులో మన జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని సాధించిందని పేర్కొన్నారు.అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో 100కు పైగా దేశాలకు చెందిన యువతీయువకులు పాల్గొన్నారని, ఓవరాల్గా మొదటి ఐదు స్థానాల్లో మన బృందం చోటు దక్కించుకుందని ప్రధాని పేర్కొన్నారు. దేశానికి కీర్తిని తీసుకువచ్చిన విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు. పూణేకు చెందిన ఆదిత్య వెంకట్ గణేష్, సిద్ధార్థ్ చోప్రా, ఢిల్లీకి చెందిన అర్జున్ గుప్తా, గ్రేటర్ నోయిడాకు చెందిన కనవ్ తల్వార్, ముంబైకి చెందిన రుషిల్ మాథుర్, గౌహతికి చెందిన ఆనందో భాదురితో ప్రధాని మాట్లాడారు.మన తల్లి కోసం, మాతృభూమి కోసం మనం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని ప్రధాని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటే ప్రచారంలో మనమంతా భాగస్వాములు కావాలన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద ఒకే రోజు రెండు లక్షల మొక్కలను నాటి, సరికొత్త సృష్టించామని మోదీ చెప్పారు. దేశ ప్రజలు ఖాదీ దుస్తులను కొనుగోలు చేయాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఎవరైనా ఖాదీ దుస్తులు కొనకుంటే ఇప్పుడే కొనుగోలు చేయాలని కోరారు. ఆగస్ట్ నెల వచ్చేస్తోందని, ఇది స్వాతంత్ర్య మాసమని, ఇది విప్లవానికి గుర్తు అని, ఖాదీని కొనడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నటాషాను మరిచిపోలేకపోతున్నాడా..?
-
బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్.. హార్దిక్ తో డేటింగ్..!
-
బడ్జెట్లో క్రీడలకు రూ. 3,442.32 కోట్లు... ‘ఖేలో ఇండియా’కే రూ. 900 కోట్లు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం క్రీడలకు ఇచ్చే వార్షిక బడ్జెట్ను స్వల్పంగా పెంచింది. మంగళవారం ప్రకటించిన 2024–25 ఆరి్థక సంవత్సర బడ్జెట్లో క్రీడలకు రూ. 3,442.32 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఇచి్చన రూ.3,396.96 కోట్లతో పోలిస్తే ఇది రూ.45.36 కోట్లు ఎక్కువ. ఎప్పటిలాగే ఇందులో ఎక్కువ మొత్తం దిగువ స్థాయిలో క్రీడాకారులను గుర్తించి తీర్చిదిద్దే ‘ఖేలో ఇండియా’ పథకానికే కేటాయించింది. గత ఏడాదికంటే రూ.20 కోట్లు ఎక్కువగా ‘ఖేలో ఇండియా’కు ఈసారి రూ.900 అందిస్తున్నట్లు ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్ల నిర్వహణతో పాటు అత్యుత్తమ స్థాయి శిక్షణ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల ఏర్పాటు, అక్కడ సౌకర్యాల కల్పన కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. మరోవైపు దేశవ్యాప్తంగా స్టేడియాల నిర్వహణ, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కోసం ఖర్చు చేసేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు ప్రభుత్వం రూ.822.60 కోట్లు కేటాయించింది. దేశంలోని వివిధ క్రీడా సమాఖ్యలకు ఈ సారి రూ.340 కోట్లు అందజేస్తున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా), జాతీయ డోపింగ్ టెస్టింగ్ లేబొరేటరీ (ఎన్డీటీఎల్)ల కోసం వరుసగా 21.73 కోట్లు, రూ. 22 కోట్ల చొప్పున కేటాయించారు. -
అనుకున్నదే అయ్యింది.. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన హార్దిక్-నటాషా..
-
బుమ్రా లవ్ జర్నీ ఎలా మొదలైందంటే..
-
భారత్ నుంచి వెళ్లిపోయిన 'హార్దిక్ పాండ్యా' సతీమణి.. వీడియో వైరల్
హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా స్టాంకోవిచ్ తన సొంత దేశమైన సెర్బియాకు వెళ్లినట్లు సమాచారం. 2013 బాలీవుడ్ సినిమా సత్యాగ్రహంతో భారత్లో ఎంట్రీ ఇచ్చిన నటాషా.. బిగ్ బాస్ 8 ద్వారా మరింత పాపులర్ అయింది. దీంతో ఆమెకు భారీగా సినిమా ఛాన్స్లు దక్కాయి. అలా సుమారు 15 పైగా చిత్రాల్లో నటించింది. 2020లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాను ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ సమయం నుంచి సినిమాలకు గుడ్బై చెప్పేసింది. అయితే, గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేడు తెల్లవారుజామున భారత్ వదిలి తన కుమారుడితో సహా నటాషా వెళ్లిపోయింది.హార్దిక్ పాండ్యాతో విడాకుల పుకార్లు వస్తున్న సమయంలో నటాసా స్టాంకోవిచ్ తన లగేజ్ను సర్దుకుని కుమారుడు అగస్త్యతో కలిసి ముంబై నుంచి వెళ్లిపోయింది. వారిద్దరూ సెర్బియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున వీరిద్దరూ ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన పలు చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటాసా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కూడా ఫోటోలను పంచుకుంది.మొదటి ఫోటోలో.. నటాషా తన దుస్తులతో ప్యాక్ చేయబడి ఉన్న తన సూట్కేస్ను చూపింది. ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చింది అంటూ పలు ఎమోజీలను పంచుకుంది. కన్నీళ్లతో ఉన్న ఎమోజీతో పాటు విమానం, ఇల్లు, లవ్ సింబల్ను ఆమె షేర్ చేసింది. మరో ఫోటోలో, ఆమె తన పెంపుడు కుక్క ఇమేజ్ను పంచుకుంది.నటాషా, హార్దిక్ల మధ్య విడాకుల పుకార్లు కొన్ని వారాల క్రితం నుంచి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ రూమర్స్పై వీరిద్దరూ ఇంకా స్పందించలేదు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కొంతమంది వ్యక్తులు టి 20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా విడిపోయారని చెప్పారు. హార్దిక్ లేదా భారత క్రికెట్ జట్టు విజయం సాధించిన తర్వాత వారికి అభినందనలు తెలుపుతూ నటాషా ఎలాంటి పోస్ట్లను పంచుకోలేదు.హార్దిక్ గెలుపు, ఓటమిల వెంట ఎప్పుడూ ఉండే నటాషా.. టి 20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆమె కనిపించలేదు. రీసెంట్గా అంబానీ ఇంటి పెళ్లి వేడుకలకు కూడా హార్తిక్ ఒక్కడే హాజరయ్యాడు. తాజాగా తన లగేజ్తో ఆమె ఇండియా వదిలి వెళ్లిపోవడంతో వారిద్దరూ ఇక విడిపోయినట్లే అని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. 2020 ఉదయపూర్లో క్రైస్తవ, హిందూ ఆచారాలతో హార్తిక్, నటాషా వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మిస్టరీ గర్ల్ హార్దిక్ పాండ్యా..
-
గంభీర్ వచ్చేశాడు.. ఇక టీమిండియాలో భారీ మార్పులు...
-
ప్రపంచ క్రికెట్ నే శాసిస్తున్న BCCI నెట్ వర్త్ ఎన్ని కోట్లో తెలుసా!
-
రియాన్ పరాగ్ బెస్ట్ ఎమోషనల్ మూమెంట్
-
దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు..! వాళ్లతో పాటే నేనూ..!
-
భారత జట్టును ఒక్క మాట అన్నా ఊరుకోం..
-
రేవంత్ రెడ్డికి మహ్మద్ సిరాజ్ గిఫ్ట్
-
రాజ కుమారుడిలా రాహుల్.. అందంగా అతియా (ఫోటోలు)
-
భారత బ్యాడ్మింటన్ రారాణికి జన్మదిన శుభాకాంక్షలు (ఫొటోలు)
-
44వ పడిలోకి అడుగుపెట్టిన భజ్జీ (ఫొటోలు)
-
ఈ చిన్నారి ఇప్పుడు టాప్ సెలబ్రిటీ.. కొడుకే తన ప్రపంచం (ఫొటోలు)
-
Gitika Talukdar: ప్యారిస్ ఒలింపిక్స్కు మన ఫొటోగ్రాఫర్
వచ్చే నెలలో ప్యారిస్ ఒలింపిక్స్. అన్ని దేశాల ఆటగాళ్లే కాదు మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా కెమెరాలతో బయలుదేరుతారు. కాని ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ’ (ఐ.ఓ.సి) గుర్తింపు పొందిన వారికే అన్ని మైదానాల్లో ప్రవేశం. అలాంటి అరుదైన గుర్తింపును పొందిన మొదటి భారతీయ మహిళా ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్. అస్సాంకు చెందిన స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్ పరిచయం.‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్గా కెరీర్ని ఎంచుకోవడానికి స్త్రీలు పెద్దగా ముందుకు రారు. ఎందుకంటే అది మగవాళ్ల రంగం చాలా రోజులుగా. అక్కడ చాలా సవాళ్లు ఉంటాయి. నేను వాటన్నింటినీ అధిగమించి ఇవాళ గొప్ప గుర్తింపు పొందగలిగాను’ అని సంతోషం వ్యక్తం చేసింది గీతికా తాలూక్దార్. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకూప్యారిస్లో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో ఫొటోలు తీయడానికి ఆమెకు అక్రిడిటేషన్ లభించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటి (ఐ.ఓ.సి) చాలా తక్కువ మంది ఫొటోగ్రాఫర్లకు మాత్రమే ఒలింపిక్స్ను కవర్ చేసే అధికారిక గుర్తింపు ఇస్తుంది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా అతి కొద్దిమంది మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లు ఈ గుర్తింపు పొందితే మన దేశం నుంచి మొదటి, ఏకైక మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్గా గీతికా తాలూక్దార్ చరిత్ర సృష్టించింది. ఫ్రీ లాన్సర్గా...‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ అంటే విస్తృతంగా పర్యటించాలి. సంస్థలో ఉద్యోగిగా ఉన్నప్పుడు సంస్థలు ఒక్కోసారి అనుమతిస్తాయి, మరోసారి అనుమతించవు. అందుకని నేను ఫ్రీలాన్సర్గా మారాను. స్వేచ్ఛ పొందాను. నా సేవలు కావాల్సిన సంస్థలు నన్ను సంప్రదిస్తాయి’ అంది గీతిక. ఫ్రీ లాన్సర్గా ఉంటూనే ఆమె ఇంకా చదువు కొనసాగించింది. కొలంబోలో డిప్లమా కోర్సు చేసింది. అలాగే సౌత్ కొరియా స్పోర్ట్స్ మినిస్ట్రీ వారి స్కాలర్షిప్ పొంది సియోల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ‘కొలంబోలో చదువుకునే సమయంలో సర్ రిచర్డ్ హ్యాడ్లీని ఇంటర్వ్యూ చేయడం గొప్ప అనుభవం. అక్కడ ఆయన పేద పిల్లలకు క్రికెట్ నేర్పేందుకు అకాడెమీ నిర్వహిస్తున్నారు. నేను వెళ్లిన రోజు బాల్ ఎలా విసరాలో నేర్పుతున్నారు. నేను ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చారు’ అని చెప్పింది గీతిక.కోవిడ్ రిస్క్ ఉన్నా...ప్రపంచంలో ఎక్కడ భారీ క్రీడా వేడుకలు జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది గీతిక. ఆస్ట్రేలియా ఫీఫా విమెన్స్ వరల్డ్ కప్, ఖతార్లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్ పోటీలను ఆమె కవర్ చేసింది. 2020 సియోల్ ఒలింపిక్స్కు కోవిడ్ కారణంగా చాలా మంది అక్రిడిటెడ్ ఫొటో జర్నలిస్టులు వెళ్లడానికి భయపడ్డారు. కాని అక్రిడిటేషన్ లేకున్నా గీతిక అక్కడకు వెళ్లి ప్రాణాలకు తెగించి ఫొటోలు తీసి గుర్తింపు పొందింది. తన వృత్తి పట్ల ఆమెకు ఉన్న ఈ అంకిత భావాన్నే ఒలింపిక్స్ కమిటీ గుర్తించింది. అందుకే ఈసారి అధికారికంగా ఆహ్వానం పలికింది. జూలై 23న ప్యారిస్ బయలుదేరి వెళ్లనుంది గీతిక. ‘గేమ్స్ వైడ్ ఓపెన్’ అనేది ఈసారి ఒలింపిక్స్ థీమ్. మరిన్ని వర్గాలను కలుపుకుని ఈ క్రీడలు జరగాలనేది ఆశయం. తక్కువ గుర్తింపుకు నోచుకునే మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లను ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా ఈ ఆశయంలో భాగమే. ‘నాకొచ్చిన అవకాశం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరింత కష్టపడి పని చేస్తాను. స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్గా కెరీర్ను ఎంచుకోవాలనుకునేవారికి క్రమశిక్షణ అవసరం. అంతర్జాతీయ క్రీడాపోటీలు టైముకు మొదలయ్యి టైమ్కు ముగుస్తాయి. వాటిని అందుకోవాలంటే క్రీడల్లోని ఉత్తమ క్షణాలను కెమెరాలో బంధించాలంటే ఏకాగ్రత, క్రమశిక్షణ చాలా అవసరం. అవి ఉన్నవారు ఈ రంగంలో నిస్సందేహంగా రాణిస్తారు’ అంటోంది గీతిక.‘టీ సిటీ’ అమ్మాయిఅస్సాంలోని డూమ్డుమా పట్టణాన్ని అందరూ ‘టీ సిటీ’ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ తేయాకు తోటలు విస్తారం. హిందూస్తాన్ లీవర్ టీ ఎస్టేట్ అక్కడే ఉంది. ఆ ఊళ్లో చిన్న ఉద్యోగి కుమార్తె అయిన గీతిక చిన్నప్పటి నుంచి కెమెరాతో ప్రేమలో పడింది. అందుకు కారణం ఆమె మేనమామ చంద్ర తాలూక్దార్ ఫిల్మ్మేకర్గా గుర్తింపు పొందడం. అతను కెమెరాలో నుంచి చూస్తూ రకరకాల దృశ్యాలను అందంగా బంధించడాన్ని బాల్యంలో గమనించిన గీతిక తాను కూడా అలాగే చేయాలనుకుంది. పొలిటికల్ సైన్స్లో డిగ్రీ చేశాక మాస్ కమ్యూనికేషన్లో డి΄÷్లమా చేసింది. క్రీడలంటే ఆసక్తి ఉండటంతో స్పోర్ట్స్ జర్నలిస్ట్గా, ఫొటోగ్రాఫర్గా మారి 2005 నుంచి డీఎన్ఏ, బీబీసీ, ఇండియా టుడే, పీటీఐ వంటి సంస్థలతో పనిచేసింది. -
కోహీకి షాక్..ఓపెనర్ గా యశస్వి..?
-
ఈ అందమైన జంట ఎవరో గుర్తుపట్టారా? డ్రీమీ వెడ్డింగ్ పిక్స్.. ఫ్యాన్స్ ఫిదా
-
పంఘాల్ పంచ్..
అమిత్ పంఘాల్ ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు మాత్రమే. బాక్సింగ్ ఆటపరంగా చూస్తే ఇది ఒక రకంగా ‘పొట్టి’ కిందనే లెక్క. అతని కెరీర్లో పెద్ద సంఖ్యలో తనకంటే ఎంతో ఎత్తయిన బాక్సర్లనే ఎదుర్కోవాల్సి వచ్చింది. సాధారణంగా రింగ్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యంతో పంచ్లు విసిరేందుకు ఎత్తు కూడా కీలకంగా పని చేస్తుంది. ఇక్కడే అమిత్లో లోపం కనిపించింది. ‘చిన్నప్పటి నుంచి నాకు ఇదే సమస్య. కొన్నిసార్లు నేను పూర్తిగా ఆకాశంలోకి చూస్తూ ప్రత్యర్థితో తలపడుతున్నానేమో అనిపించేది’ అని అమిత్ చెప్పుకున్నాడు కానీ తన పట్టుదలతో అతను దానిని అధిగమించాడు.అసాధారణంగా, మెరుపు వేగంతో పంచ్లు విసరడాన్ని సాధన చేసిన అతను అందులో ఆరితేరాడు. ప్రాక్టీస్లో కూడా కావాలనే తనకంటే ఎత్తు ఎక్కువ ఉన్న బాక్సర్లతోనే అతను పోటీ పడేవాడు. కెరీర్ ఎదుగుతున్న దశలో అదే అతడి బలంగా మారి అమిత్ను పెద్ద బాక్సర్ను చేసింది.అన్న అండగా నిలవడంతో...హరియాణాలోని రోహ్టక్ పట్టణానికి సమీపంలో ఉన్న ఊరు ‘మేనా’ అమిత్ స్వస్థలం. రైతు కుటుంబం నుంచి వచ్చాడు. అతని పెద్దన్న అజయ్ పంఘాల్ ముందుగా బాక్సింగ్లోకి వచ్చాడు. అతని ద్వారానే అమిత్కూ ఆటపై ఆసక్తి పెరిగింది. ముందుగా ఫిట్నెస్ మెరుగుపరచుకోవడం కోసమనే బాక్సింగ్లో చేరినా, ఆ తర్వాత పూర్తి స్థాయిలో బాక్సింగ్పై దృష్టి పెట్టాడు. అనిల్ ధన్కర్ అనే రాష్ట్ర స్థాయి కోచ్ రోహ్టక్లో శిక్షణ ఇచ్చేవాడు. ఇద్దరూ అక్కడే కోచింగ్ తీసుకున్నారు.అయితే అజయ్ ఆశించిన రీతిలో పెద్ద స్థాయికి చేరలేకపోయాడు. కానీ జాతీయ స్థాయిలో కొన్ని చక్కటి ప్రదర్శనలతో ఆర్మీలో హవల్దార్గా ఉద్యోగం మాత్రం పొందగలిగాడు. మరో వైపు అమిత్ పంచ్లు, అతని శైలి మాత్రం కోచ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టేలా చేశాయి. దాంతో అజయ్కు మున్ముందు తాను ఏం చేయాలో అర్థమైంది. తను పూర్తిగా ఆట నుంచి తప్పుకొని తమ్ముడిని తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాడు.2018 ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతకంతో, తల్లిదండ్రులతో..తన ఉద్యోగం కారణంగా ఆర్థికపరంగా కూడా చేయూత ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ తప్ప మరో ప్రపంచం లేకుండా కష్టపడాలని హితబోధ చేశాడు. దీనిని చిన్న వయసులోనే అర్థం చేసుకున్న అమిత్ 24 గంటలూ బాక్సింగ్నే తన భాగస్వామిగా మార్చుకున్నాడు. ఇప్పటికీ, ఏ స్థాయికి చేరినా తన సోదరుడు తన కోసం చేసిన త్యాగాలను అతను గుర్తు చేసుకుంటాడు. ప్రతి మ్యాచ్కు ముందు అన్న సూచనలను తీసుకునే అమిత్.. అతడిని బెస్ట్ కోచ్ అంటూ పిలుస్తాడు.జాతీయ స్థాయిలో మెరిసి...అమిత్కు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని బరువు 24 కిలోలే! బక్కగా, బలహీనంగా కనిపించేవాడు. కానీ పట్టుదల, పోరాటానికి ఏమాత్రం లోటు లేదు. అందుకే నన్ను చూసి కాదు నా ఆటను చూసి తలపడండి అంటూ బరిలోకి దిగేవాడు. చాలా సందర్భాల్లో తనకంటే ఎక్కువ వయసు ఉన్న ఎంతో బలమైన ఆటగాళ్లను అతను పడగొట్టాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల వయసులోనే జాతీయ సబ్ జూనియర్ చాంపియన్గా అమిత్ నిలిచాడు. అన్న అండ, ప్రోత్సాహంతో మరింత దూసుకుపోయిన అమిత్ గుర్గావ్లోని కాంబాట్ బాక్సింగ్ క్లబ్లో చేరాడు. అక్కడి అతని బాక్సింగ్ మరింత పదునెక్కింది.కాంబాట్ క్లబ్లో శిక్షణ తర్వాత జూనియర్ స్థాయిలో వరుసగా విజయాలు వచ్చాయి. ఈ క్రమంలో 2017లో అతడిని కోచ్లు సీనియర్ స్థాయికి ప్రమోట్ చేశారు. అతను ఆ స్థాయికి తగినవాడా అనే సందేహాలు వచ్చిన నేపథ్యంలో అమిత్ పట్టుదలగా ఆడి తానేంటో నిరూపించుకున్నాడు. వారు తీసుకున్న నిర్ణయానికి న్యాయం చేస్తూ సీనియర్ జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.2019 ఆసియన్ చాంపియన్ షిప్ స్వర్ణ పతకంతో, 2024 పారిస్ ఒలింపిక్స్కు ఎంపికైన అమిత్..ప్రపంచ వేదికలపై...జాతీయ విజేతగా మారిన తర్వాత అవకాశాలు వరుసగా రావడంతో పాటు మరింత స్థాయికి ఎదిగేందుకు దోహదం చేశాయి. 2017లో ఆసియా చాంపియన్షిప్ కాంస్యం గెలుచుకోవడంతో అతని సత్తా ఏమిటో అందరికీ తెలిసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే 22 ఏళ్ల వయసులో అమిత్ తొలిసారి వరల్డ్ చాంపియన్షిప్లో కూడా పాల్గొన్నాడు. అక్కడ పతకం గెలవకపోయినా ఆ అనుభవం పెద్ద స్థాయిలో రాటుదేలేందుకు ఎంతో పనికొచ్చింది.క్వార్టర్ ఫైనల్లో తలవంచినా, ఆ మ్యాచ్లో రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ఉజ్బెకిస్తాన్కు చెందిన హసన్బయ్ దుస్మతోవ్ను అతను నిలువరించిన తీరు అందరీ ఆకట్టుకుంది. ఇదే జోరులో 2018 కామన్వెల్త్ చాంపియన్షిప్లో బరిలోకి దిగే అవకాశం లభించింది. లైట్ ఫ్లయ్వెయిట్ కేటగిరీలో వరుస విజయాలతో సత్తా చాటిన అతను ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అయితే బ్రిటిష్ బాక్సర్ గలాల్ యాఫైతో జరిగిన ఫైనల్లో హోరాహోరీగా పోరాడి చివరకు తలవంచాడు. దాంతో ఈ క్రీడల్లో రజతపతకం దక్కింది.అయితే సరిగ్గా నాలుగేళ్ల తర్వాత జరిగిన 2022 కామన్వెల్త్ క్రీడల్లో తన స్థాయిని అమిత్ పెంచుకున్నాడు. ఆ పోటీల్లో అదే విభాగంలో అతను స్వర్ణం సాధించడం విశేషం. అంతకు ముందు 2018లోనే జరిగిన ఆసియా క్రీడల్లో కూడా అమిత్ స్వర్ణపతకంతో మెరిశాడు. దీంతో పాటు ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో వరుసగా మూడుసార్లు అతను పతకంతో తిరిగి రావడం పంఘాల్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 2017లో కాంస్యం, 2019లో స్వర్ణం గెలిచిన అతను.. 2021లో రజత పతకాన్ని అందుకున్నాడు.వరల్డ్ నంబర్వన్గా...2019లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ అమిత్ను అగ్రశ్రేణి బాక్సర్ల జాబితాలో చేర్చింది. ఈ టోర్నీకి కొద్ది రోజుల ముందే ఆసియా చాంపియన్షిప్లో పసిడి గెలిచిన ఊపులో అమిత్ ఉన్నాడు. అప్పటి వరకు ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ నుంచి ఐదుగురు పతకాలు సాధించగా, వీరంతా కాంస్యానికే పరిమితమయ్యారు. కానీ వీరందరినీ అధిగమించి అమిత్ రజతపతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. ఆ సమయంలో అద్భుత ఫామ్లో ఉన్న అమిత్ ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్లో 52 కేజీల విభాగంలో నంబర్వన్గా నిలవడంతో అతని కెరీర్ శిఖరానికి చేరింది. ప్రస్తుతం భారత ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా అతను పని చేస్తున్నాడు.2019 ప్రపంచ చాంపియన్ షిప్ రజత పతకంతో.., కామన్ వెల్త్ స్వర్ణ పతకంతో అమిత్ (2022)ప్రతికూల పరిస్థితి దాటి...అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాల తర్వాత బాక్సింగ్ సమాఖ్య అమిత్ పంఘాల్ పేరును ప్రతిష్ఠాత్మక ఖేల్రత్న పురస్కారం కోసం సిఫారసు చేసింది. అంతకు ముందు వరుసగా మూడేళ్లు అర్జున అవార్డు కోసం సిఫారసు చేసినా, అతడి పేరును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఒకప్పుడు డోపింగ్లో పట్టుబడ్డాడనేది దానికి కారణంగా చెప్పింది. అయితే నిజానికి అమిత్ 2012లో 17 ఏళ్ల వయసులో యూత్ స్థాయిలో ఆడుతున్నప్పుడు ఇది జరిగింది.తాను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ తీసుకోలేదని, చికెన్ పాక్స్ కోసం చికిత్స చేయిస్తుండగా వాడిన మందుల్లో నిషేధక ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది. దీనిపై అతను చాలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. యూత్ స్థాయిలో చేసిన తప్పులను ఎవరైనా మన్నిస్తారని, అయినా కూడా దానికి తాను తగిన శిక్ష కూడా అనుభవించానని అతను చెప్పాడు. భారత్ తరఫున తన ఘనతలను పరిగణించాలని పంఘాల్ కోరాడు. చివరకు 2022లో కేంద్రం అమిత్ను ‘అర్జున’ అవార్డుతో గౌరవించింది.‘ఒలింపిక్ పతకం సాధించిన రోజే బాక్సింగ్లో నా ప్రయాణం మొదలైనట్లుగా భావిస్తాను’... అమిత్ చేసిన ఈ వ్యాఖ్య ఒలింపిక్ మెడల్ విలువేంటో చెబుతుంది. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్నా, అనూహ్య రీతిలో అతను విఫలమైన నిష్క్రమించాడు. కానీ ఇప్పుడు మరో ఒలింపిక్స్కు అమిత్ సిద్ధమయ్యాడు. 2024 పారిస్ ఒలింపిక్స్లో పతకం సాధించాలనే పట్టుదలతో శ్రమిస్తున్న ఈ బాక్సర్ కల నెరవేరాలని ఆశిద్దాం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
చెక్ రిపబ్లిక్ అందాలు ఆస్వాదిస్తున్న సైనా.. మరో బ్యూటీ ఎవరంటే? (ఫొటోలు)
-
తిరుగులేని రోహిత్ సేన.. సూపర్ 8 లోకి టీమిండియా..
-
ట్విట్టర్లో కోహ్లి అరుదైన ఫీట్..
-
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..
-
T20 WORLD CUP 2024 సెమీస్ కు చేరే జట్లు ఇవే..!
-
నీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ సా(షా)మి
-
క్రికెట్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్.. T20 సంగ్రామంకి సర్వం సిద్ధం..
-
భారత్ అందుల టీం కెప్టెన్ దుర్గారావు... ఇన్స్పిరేషన్ స్టోరీ...
-
షారూఖ్ కంటే కావ్య మారన్ ఆస్తులే నాలుగు రెట్లు ఎక్కువ..!
-
సన్రైజర్స్ యజమానిని, కంటతడిపెట్టించిన కేకేఆర్..
-
తెలుగు కుర్రాడు అరుదైన ఘనత.. నితీష్ రెడ్డి టీమిండియాలోకి ఎంట్రీ ..!
-
ఐపీఎల్ 2024 ప్రైజ్ మనీ ఎవరికి ఎన్ని కోట్లు ?
-
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి..
-
ఎలిమినేటర్ మ్యాచ్
-
అదరగొట్టిన అయ్యర్ బ్రదర్స్.. ఫైనల్లో KKR
-
ఎలిమినేట్ అయ్యేదెవరో?
-
వరల్డ్ కప్ నే కాళ్ళ కింద పెట్టుకున్న కెప్టెనే ఇలా అంటే..
-
RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?
-
జ్యోతిక శ్రీ బృందానికి స్వర్ణం..!
బ్యాంకాక్: ఆసియా రిలే అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో అజ్మల్, దండి జ్యోతిక శ్రీ, అమోజ్ జేకబ్, శుభాలతో కూడిన భారత బృందం మిక్స్డ్ రిలే 4్ఠ400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం 3 నిమిషాల 14.12 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది.ఈ క్రమంలో గత ఏడాది ఆసియా క్రీడల్లో 3 నిమిషాల 14.34 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డు తెరమరుగైంది. భారత్కు బంగారు పతకం దక్కడంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతిక శ్రీ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రదర్శనతో భారత బృందం ప్రపంచ ర్యాంకింగ్స్లో 21వ స్థానానికి చేరుకుంది. జూన్ 30వ తేదీలోపు భారత బృందం టాప్–16లోకి చేరితే పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తుంది.ఇవి చదవండి: World Para Championships: శభాష్ దీప్తి.. -
జ్యోతి యర్రాజీకి స్వర్ణం, రజతం!
కొత్త సీజన్లో భారత మహిళా అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ మరోసారి మెరిసింది. జర్మనీలో జరిగిన కుర్ప్ఫాల్జ్ గాలా మీట్లో జ్యోతి ఒక స్వర్ణం, ఒక రజత పతకం నెగ్గింది.100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో జ్యోతి 13.06 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకాన్ని గెలిచింది. 200 మీటర్ల ఫైనల్లో జ్యోతి 23.83 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. రెండు వారాల క్రితం నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షులి్టంగ్ గేమ్స్లో జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణంతో కొత్త సీజన్ను ఘనంగా ఆరంభించింది.ఇవి చదవండి: IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు! -
"సాధించాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క..
-
చరిత్ర సృష్టించిన హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ..
-
అర్జున్కు మిశ్రమ ఫలితాలు..!
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్మాస్టర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్ గేమ్లో అర్జున్ 45 ఎత్తుల్లో ఎల్తాజ్ సఫారిల్ (అజర్బైజాన్)పై గెలిచాడు.రెండో రౌండ్ గేమ్లో అర్జున్ 28 ఎత్తుల్లో నికోలస్ (గ్రీస్) చేతిలో ఓడిపోయాడు. తెలంగాణకే చెందిన మరో గ్రాండ్మాస్టర్ రాజా రిత్విక్ తొలి గేమ్లో 28 ఎత్తుల్లో అభినవ్ మిశ్రా (అమెరికా) చేతిలో ఓడిపోయి... లియోన్ మెండోకా (భారత్)తో జరిగిన రెండో గేమ్ను 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.ఇవి చదవండి: Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట! -
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం!
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–13తో నూర్ మొహమ్మద్–తాన్ వీ కియోంగ్ (మలేసియా) జంటపై విజయం సాధించింది.పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. భారత రైజింగ్ స్టార్, ప్రపంచ 84వ ర్యాంకర్ మైస్నం మిరాబా లువాంగ్ వరుస గేముల్లో ప్రణయ్ను ఓడించి తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు.55 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో మిరాబా 21–19, 21–18తో ప్రణయ్ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. భారత్కే చెందిన కిరణ్ జార్జి, సతీశ్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. కిరణ్ 15–21, 21–13, 17–21తో మాడ్స్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో... సతీశ్ 13–21, 17–21తో జేసన్ గుణవన్ (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యారు.అష్మిత మినహా...మహిళల సింగిల్స్లో భారత్ నుంచి ఐదుగురు బరిలోకి దిగగా... అష్మిత మినహా మిగతా నలుగురు ఉన్నతి హుడా, సామియా, మాళవిక, ఆకర్షి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. అష్మిత 19–21, 21–15, 21–14తో ఎస్తర్ నురిమి (ఇండోనేసియా) పై గెలిచింది. ఉన్నతి 21–14, 14–21, 19–21తో లియాన్ టాన్ (బెల్జియం) చేతిలో, సామియా 13–21, 13–21తో గావో ఫాంగ్ జి (చైనా) చేతిలో ... మాళవిక 11–21, 10–21తో హాన్ యువె (చైనా) చేతిలో, ఆకర్షి 13–21, 8–21తో బుసానన్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
సూపర్ మామ్స్! రికార్డులు సృష్టించిన తల్లులు
తల్లిగా మారిన ప్రతి స్త్రీ పిల్లల పనిని ఇష్టంగానూ అదే సమయంలో కష్టంగానూ భావిస్తుంటుంది. తన బాగు గురించి తాను చూసుకోవడం మరచిపోతుంటుంది. తల్లిగా మారిన తర్వాత కూడా తమ జీవితాన్ని అర్థవంతంగా ఎలా మార్చుకోవాలో క్రీడాస్ఫూర్తితో నిరూపిస్తున్నారు కొందరు తల్లులు. ఇటీవల అమెరికా వాసి కైట్లిన్ డోనర్ స్ట్రోలర్తో రన్నర్ మామ్ రికార్డ్ను బద్దలు కొట్టింది. ముంబై వాసి అయిన వినీత్ సింగ్ గర్భవతిగా ఉన్నప్పటి నుంచే రన్నింగ్తో తన ప్రపంచాన్ని ఎంత ఆరోగ్యంగా మార్చుకుందో రుజువు చేస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న ఇద్దరు పిల్లల తల్లి అయిన 34 ఏళ్ల కైట్లిన్ డోనర్ ఇటీవల చేసిన ప్రయత్నం అందరినీ ఆకర్షించింది. తన 20 నెలల కొడుకును స్ట్రోలర్ (లాగుడు బండి)లో కూర్చోబెట్టుకొని, ఆ స్ట్రోలర్ను నెడుతూ మైలు దూరాన్ని కేవలం ఐదు నిమిషాల 11 సెకన్లలో పూర్తి చేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అధికారిక గుర్తింపు పొదింది. తల్లుల్లో ఉన్న శక్తిని ఎలా పెంచుకోవచ్చో తన సాధన ద్వారా నిరూపిస్తోంది.సాధనమున సమకూరు.. రెండవ గర్భధారణ సమయంలో ప్రసవానంతరం తన లక్ష్యాన్ని ప్రపంచానికి చాటాలనుకుంది. రన్నింగ్ గోల్ని ఏర్పరుచుకునే క్రమంలో ఆమెకు రన్నర్ స్నేహితులు ఉత్సాహం కలిగించారు. ఇది ఆమెను మరింత ముందుకు వెళ్లేలా చేసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ్రపాసెస్లో భాగంగా సెప్టెంబర్ 2022లో తన బిడ్డకు కేవలం నెల వయసు ఉన్నప్పుడే క్లైటిన్ దరఖాస్తు చేసింది. కానీ, అది తిరస్కరణకు గురైంది. కిందటేడాది మళ్లీ దరఖాస్తు చేసింది. ఒలింపిక్ మారథాన్ ట్రయల్స్లోనూ వెనకబాటుకు లోనైంది. అయినా నిరుత్సాహపడకుండా మరింతగా కఠినమైన శిక్షణా విధానాన్ని పాటించింది. లెగ్ టర్నోవర్ని పెంచడానికి కొన్ని స్పీడ్ వర్కవుట్లను నిర్వహించింది. సాధనలో 1600 మీటర్ల వర్కౌట్ను స్ట్రోలర్తో సాధన చేసింది. ఈ ఎక్స్పీరియెన్స్ ఆమెలో మరింత ఉత్సాహాన్ని నింపింది. కిందటి నెలలో బాబ్ గేర్ రివల్యూషన్ 3.0 స్ట్రోలర్తో ట్రాక్లోకి ప్రవేశించింది. దీనికి ఆమె కుటుంబం, సన్నిహితులు అందించిన మద్దతు తనకీ విజయం సాధించడానికి తోడ్పడింది అని తెలియజేస్తుంది. కఠినమైన లక్ష్యాలనే ఎంచుకోవాలి.. ట్రాక్పై పరిగెత్తుతున్నప్పుడు ప్రతి అడుగుతోనూ ఆమె ఈ లక్ష్యాన్ని అధిగమించడంతో చుట్టూ ఉన్న వారి చప్పట్ల హోరు కన్నా తన లక్ష్యానికి ఆమె ఇచ్చి ప్రాముఖ్యానికి అందరూ కొనియాడారు. మైలు దూరాన్ని 5 నిమిషాల 11.13 సెకన్ల సమయంలో ముగించి, మునుపటి 5 నిమిషాల 13 సెకన్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి విజేతగా నిలిచింది. ఆమె ట్రాక్పై పరిగెత్తుతున్నప్పుడు అందరి దృష్టి ఆమెపై అలాగే బాబ్గేర్ రివల్యూషన్ 3.0 స్ట్రోలర్లోని బిడ్డపై కూడా ఉంది. ‘సులువైన వాటిని కాదు భయానకమైన లక్ష్యాలనే ఎంచుకోండి. ఎందుకు సాధించలేం? అనే ప్రశ్న ఎవరికి వారు వేసుకోండి. ఆశించిన ఫలితం వస్తుందో రాదో చెప్పలేం. కానీ, ప్రయత్నించినందుకు ఏ మాత్రం చింతించరు’ అని బోసినవ్వుల కొడుకును ఎత్తుకుంటూ చెబుతుంది డోనర్. మన వినీత్ సింగ్ ముంబై వాసి వినీత్ సింగ్కి తల్లిగానే కాదు విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్గా... ఫిట్నెస్ ఔత్సాహికురాలుగా కూడా ఎంతో పేరుంది. ఆరు నెలల గర్భవతిగా ఉండీ వైద్యుల అనుమతితో ఈ ఏడాది జనవరిలో జరిగిన 30 కి లోమీటర్ల మారథాన్లో పాల్గొంది. ‘నా ప్రపంచం ఎంత ఆరోగ్యంగా ఉందో ఈ మార థాన్ నాకు పరిచయం చేసింది’ అని ఈ సందర్భంగా తెలియజేసింది. వినీత్ సింగ్ కుటుంబం క్రీడలు, ఫిట్ నెస్ అంటే చాలా ఇష్టపడుతుంది.అప్పటికే వినీత్కి అల్ట్రా మారథాన్, హాఫ్ మారథాన్ వంటి వాటిల్లో పాల్గొన్న అనుభవం ఉంది. 3.8 కిలోమీటర్ల ఈత, 180 కిలోమీటర్ల సైకిల్ రైడ్, 42 కిలోమీటర్ల మారథాన్లలోనూ పాల్గొంది. మోస్ట్ పవర్ఫుల్ ఉమన్గా అవార్డులూ గెలుచుకుంది. గర్భవతులుగా ఉన్నప్పుడు, ప్రసవానంతరమూ తల్లులు తమ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ చూపాలో, తమ ప్రపంచాన్ని ఎంత ఉత్సాహకరంగా మార్చుకోవాలో ఈ తల్లులు తమ జీవనశైలితో నిరూపిస్తున్నారు.(చదవండి: నాసా ఏరో స్పేస్ ఇంజనీర్గా తొలి భారతీయ యువతి!) -
ఎవరీ శశాంక్..? ఇన్నింగ్స్ చివర్లో వచ్చి.. సుడిగాలి వేగంతో..!
29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 61 పరుగులు.. నాటౌట్.. 25 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 46 నాటౌట్..25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 41 పరుగులు..28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్లతో 68 నాటౌట్..ఇలా ఐపీఎల్–2024లో ఈ బ్యాటర్ తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. ఇన్నింగ్స్ చివర్లో వచ్చి సుడిగాలి వేగంతో చెలరేగిపోతున్న అతని ఆటతీరు అభిమానులను అలరిస్తోంది. సింగిల్స్తో కాకుండా సిక్సర్లతోనే స్కోరుబోర్డును పరుగెత్తిస్తున్న ఆ శైలి ఈ సీజన్లో అతనికి కొత్త ఫ్యాన్స్ను తెచ్చి పెట్టింది. ముఖ్యంగా కోల్కతాతో మ్యాచ్లో 262 పరుగుల రికార్డు లక్ష్యాన్ని అందుకునే క్రమంలో మైదానంలో అన్ని వైపులకు అతను బాదిన ఎనిమిది సిక్సర్లు ఔరా అనిపించాయి.ఐపీఎల్ ప్రతి ఏటా కొంత మంది కొత్త హీరోలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. లీగ్లో తమ జట్టు ఓవరాల్ ప్రదర్శనతో సంబంధం లేకుండా అప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడకపోయినా కొందరి అద్భుత ప్రదర్శన ఫ్రాంచైజీ క్రికెట్కు కొత్త ఊపును, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాంటి ఒక ఆటగాడే శశాంక్ సింగ్. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ అతను ప్రదర్శిస్తున్న సంచలన ఆటతీరుతో అందరి దృష్టిలో పడ్డాడు. ఐపీఎల్ వేలం సమయంలో తన ప్రమేయం లేకుండానే వివాదంలో నిలిచి అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఈ ఛత్తీస్గఢ్ ఆటగాడు ఇప్పుడు తన ఆటతోనే అందరికీ సమాధానమిచ్చాడు.గత ఏడాది డిసెంబర్ 20న ఐపీఎల్–2024 సీజన్లో మిగిలిన స్థానాల కోసం వేలం జరిగింది. వేలం నిర్వహిస్తున్న మల్లికా సాగర్ ‘శశాంక్ సింగ్’ అనే పేరు ప్రకటించింది. అయితే ఏ ఫ్రాంచైజీ నుంచి కూడా స్పందన రాలేదు. ఆ తర్వాత మరో ఇద్దరు ఆటగాళ్లు వేలంలో అమ్ముడుపోయారు. ఆపై మళ్లీ ‘శశాంక్ సింగ్’ అనే పేరు వినిపించింది. అప్పటి వరకు వరుసగా యువ ఆటగాళ్లను తీసుకుంటూ పోతున్న పంజాబ్ కింగ్స్ యజమానులు కూడా ప్యాడిల్ ఎత్తి తమ ఆసక్తిని ప్రదర్శించారు.రూ. 20 లక్షల కనీస విలువకు ఇతర జట్లేవీ ముందుకు రాకపోవడంతో శశాంక్ను పంజాబ్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే కొద్ది క్షణాల తర్వాత అనూహ్యంగా పంజాబ్ యజమాని ప్రీతి జింటా తమకు ఈ ఆటగాడు అవసరం లేదంటూ వేలం నిర్వాహకులకు చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ మీరు ఆలస్యం చేశారంటూ మల్లికా సాగర్ స్పష్టం చేసేసింది. దాంతో బలవంతంగా, కాస్త నిరాశగా శశాంక్ను పంజాబ్ తీసుకుంది.దీనిపై పెద్ద దుమారం రేగింది. ఒక యువ ఆటగాడిని ఇలా అవమానపరుస్తారా అంటూ విమర్శలు వచ్చాయి. చివరకు కింగ్స్ యాజమాన్యం పలు రకాలుగా వివరణ ఇస్తూ తమ జట్టులోకి ఆహ్వానించింది. అయితే తాము వద్దనుకున్న ఆటగాడు ఎంత విలువైనవాడో సీజన్ సాగిన కొద్దీ యాజమాన్యానికి తెలిసొచ్చింది. శశాంక్ సింగ్ మాత్రం అన్నింటికీ ఒకే ఒక చిరునవ్వుతో సమాధానం ఇస్తూ మైదానంలో దూసుకుపోయాడు.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకుంటూ..బలమైన నేపథ్యం ఉన్నా..‘నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని ఎవరైనా అంటే అవి ఆర్థికపరమైన కష్టాలే కానవసరం లేదు. గెలుపు దారిలో ఎన్నో ప్రతికూలతలు ఎదురవుతాయి. మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు పట్టుదలగా నిలబడితేనే ముందుకు వెళ్లగలం’ అని శశాంక్ సింగ్ తన గురించి తాను చెప్పుకున్నాడు. ఎందుకంటే శశాంక్ తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి (ప్రస్తుతం మధ్యప్రదేశ్లో స్పెషల్ డీజీగా పని చేస్తున్నారు).ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. 1996 వరల్డ్ కప్ సమయంలో ఐదేళ్ల వయసున్న శశాంక్కు తొలిసారి క్రికెట్లో ఓనమాలు నేర్పించారు. అప్పటికి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడలేదు. శశాంక్ పుట్టిన భిలాయ్ మధ్యప్రదేశ్లోనే ఉంది. చిన్న వయసులోనే ఆటలో చురుకుదనం చూపించిన శశాంక్ మధ్యప్రదేశ్ అండర్–15, అండర్–17 జట్ల తరఫున ఆడాడు. ఇక సీనియర్ స్థాయికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తండ్రి తీసుకున్న ఒక నిర్ణయం శశాంక్ కెరీర్ గతి తప్పేలా చేసింది.తనకు ముంబైకి బదిలీ కావడంతో కొడుకును కూడా అక్కడకు తీసుకెళ్లారు. నిజానికి ముంబైలో ఉంటే మంచి శిక్షణ లభిస్తుందని, ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఆయన సానుకూల రీతిలోనే ఆలోచించారు. కానీ అక్కడికి వెళ్లాక అంచనా తప్పి అంతా తలకిందులైంది.దేశవాళీలో అవకాశాలు దక్కినా..ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా.. లీగ్లతో మొదలు పెట్టి శశాంక్ అన్ని రకాల గుర్తింపు పొందిన టోర్నీలలో ఆడాడు. అప్పటినుంచే అతనికి దూకుడైన, విధ్వంసక ఆటగాడిగా, భారీ సిక్సర్లు కొట్టేవాడిగా గుర్తింపు వచ్చింది. సంప్రదాయానికి భిన్నంగా ఉండే అతని టెక్నిక్తో శశాంక్ పరుగుల వరద పారించాడు. ఒక లీగ్ మ్యాచ్లో అతను ఒక్కరోజే ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. దాంతో 2014–15 సీజన్లోనే ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున అరంగేట్రం చేసే అవకాశం లభించింది.ఆ తర్వాత ఇదే జోరులో వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం కూడా ముంబై జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఆ సమయంలో జట్టులో ఉన్న రహానే, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, అభిషేక్ నాయర్, శార్దూల్ ఠాకూర్, సిద్దేశ్ లాడ్ వంటి స్థానిక ఆటగాళ్లను దాటి తుది జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. దాంతో పాటు శశాంక్ను అంతా ముంబైకి చెందని ‘పరాయివాడు’గా చూడటం మొదలైంది.దాంతో ప్రదర్శన ఎంత బాగున్నా ఒక్క మ్యాచ్లో ఆడే అవకాశం ఇస్తే నాలుగు మ్యాచ్లలో ఆడించకుండా కూర్చోబెట్టసాగారు. దాంతో నాలుగేళ్ల పాటు జట్టుతో ఉన్నా రంజీ ట్రోఫీలో ఆడే అవకాశమే రాలేదు. ఇది శశాంక్ను తీవ్ర అసహనానికి గురిచేసింది.పంజాబ్ జట్టు యజమాని ప్రీతీ జింతాతో.. పట్టుదలతో పైకి లేచి..‘అది నాకు కష్టకాలం. అయితే నేను ఎవరినీ నిందించలేదు. విమర్శలు చేయలేదు. నా ఆటపై నాకు నమ్మకముంది. ఇది నా కెరీర్ కోసం సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. నా సమస్యను నేనే పరిష్కరించుకుంటానని, మీ సహకారం అవసరం లేదని కూడా నాన్నకు స్పష్టంగా చెప్పా. అందుకే జట్టు మారాలని నిర్ణయించుకున్నా’నని చెబుతూ శశాంక్ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ముంబై నుంచి మారాలని నిర్ణయించుకున్న తర్వాత దేశవాళీలో పుదుచ్చేరిని ఎంపిక చేసుకొని ఒక సీజన్ పాటు ఆడాడు. కానీ అది మరీ బలహీన జట్టు కావడంతో తాను ఆశించిన ఫలితం దక్కలేదు.చివరకు తనకు సరైంది తన రాష్ట్రమే అని అతను అర్థం చేసుకున్నాడు. ఛత్తీస్గఢ్ కోచ్ దేవేంద్ర బుందేలా సలహా మేరకు టీమ్లోకి వచ్చిన శశాంక్ 2019–20 సీజన్లో రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టాడు. దాంతో తన కెరీర్లో ఏదో సాధించిన సంతృప్తి. గత ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో మణిపూర్తో మ్యాచ్లో 150 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీసిన శశాంక్ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.అయితే అతనికి మరింత సంతృప్తినిచ్చిన విజయం నాలుగేళ్ల క్రితం విజయ్ హజారే ట్రోఫీలోనే వచ్చింది. ముంబై జట్టులో తనతో కలసి ఆడిన పలువురు క్రికెటర్లు అన్నివైపుల నుంచి స్లెడ్జింగ్ చేస్తుండగా కీలక ఇన్నింగ్స్ ఆడి తొలిసారి ముంబైపై 5 వికెట్ల తేడాతో ఛత్తీస్గఢ్ విజయం సాధించడం అతనికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.ఐపీఎల్లో ఆలస్యంగా..ఈ ఏడాది ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్తో చెలరేగిపోతున్న శశాంక్ ప్రయాణం ఇక్కడా గొప్పగా సాగలేదు. 2017 నుంచి 2021 మధ్య ఢిల్లీ, రాజస్థాన్ జట్లతో ఉన్నా ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఎట్టకేలకు 2022లో సన్రైజర్స్ తరఫున బరిలోకి దిగి తొలి మ్యాచ్లో 6 బంతుల్లోనే 25 పరుగులు సాధించి వెలుగులోకి వచ్చాడు. అయితే ఇలాంటి ప్రదర్శన తర్వాత కూడా అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు.గత సీజన్లో అయితే ఆడే చాన్సే రాలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా దక్కిన ఆపర్చునిటీని అతను రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగిపోతూ ధనాధన్ బ్యాటింగ్తో లీగ్పై తనదైన ముద్ర వేశాడు. ‘నా కొడుకు జీవితంలో కొత్త వెలుగు వచ్చేందుకు బాగా ఆలస్యమైంది. ఇది నన్ను నిరాశపరచే అంశం’ అంటూ తండ్రి బాధపడినా.. తనకు అలాంటి చింత ఏమీ లేదని, ప్రతికూలతలను దాటి తాను వచ్చిన స్థాయి పట్ల సంతృప్తిగా ఉన్నానని శశాంక్ చెప్పుకున్నాడు.కొన్నేళ్ల క్రితం క్రికెట్లో పరిస్థితులు చూసి సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టినా.. ఆటపై ప్రేమ కుదురుగా ఉండనీయక మళ్లీ అతను బ్యాట్ పట్టేలా చేసింది. 32 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానాన్ని ఆశించే విషయంలో ఏమీ చెప్పలేకపోయినా.. అతని ఆట చూస్తే ఏదోరోజు అద్భుతం జరగవచ్చని మాత్రం అనిపిస్తోంది. – మొహమ్మద్ అబ్దుల్ హాదిఇవి చదవండి: Mothers day 2024 అమ్మలూ మీరూ, మీ ఆరోగ్యం జాగ్రత్త! -
Saina Nehwal: రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
-
Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
-
చైనా ‘డబుల్’ ధమాకా... థామస్ కప్, ఉబెర్ కప్ టైటిల్స్ సొంతం..
ప్రపంచ బ్యాడ్మింటన్లో తమకు తిరుగులేదని చైనా జట్లు మరోసారి చాటుకున్నాయి. థామస్ కప్, ఉబెర్ కప్ టీమ్ టోర్నమెంట్లో విజేతగా అవతరించాయి. సొంతగడ్డపై ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో చైనా మహిళల జట్టు ఉబెర్ కప్ను 16వ సారి... చైనా పురుషుల జట్టు థామస్ కప్ను 11వ సారి సొంతం చేసుకున్నాయి.ఇండోనేసియాతో జరిగిన ఉబెర్ కప్ టైటిల్ పోరులో చైనా 3–0తో గెలిచింది. తొలి మ్యాచ్లో చెన్ యు ఫె 21–7, 21–16తో మరిస్కాపై... రెండో మ్యాచ్లో చెన్ కింగ్ చెన్–జియా యి ఫాన్ 21–11, 21–8తో సితి ఫాదియా–రిబ్కా సుగియార్తోలపై... మూడో మ్యాచ్లో హి బింగ్ జియావో 10–21, 21–15, 21–17తో ఎస్తెర్పై గెలిచారు. థామస్ కప్ ఫైనల్లో చైనా 3–1తో ఇండోనేసియాను ఓడించింది.తొలి మ్యాచ్లో షి యు కి 21–17, 21–6 తో జిన్టింగ్పై, రెండో మ్యాచ్లో లియాంగ్ –వాంగ్ చాంగ్ 21–18, 17–21, 21–17తో ఫజర్–అర్దియాంతోలపై నెగ్గడంతో చైనా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్లో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) 21–16, 15–21, 21–17తో లీ షి ఫెంగ్ను ఓడించాడు. నాలుగో మ్యాచ్లో హి జి టింగ్–జియాంగ్ 21–11, 21–15తో ఫిక్రి–మౌలానాలపై నెగ్గి చైనాకు 3–1తో టైటిల్ను ఖరారు చేశారు.ఇవి చదవండి: స్టార్ రెజ్లర్ బజరంగ్ పై.. తాత్కాలిక నిషేధం! -
స్టార్ రెజ్లర్ బజరంగ్పై.. తాత్కాలిక నిషేధం!
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలిక నిషేధం విధించింది. మార్చి 10వ తేదీన సోనెపట్లో నిర్వహించిన జాతీయ రెజ్లింగ్ ట్రయల్స్ సందర్భంగా బజరంగ్ సెమీఫైనల్లో ఓడిపోయాక డోపింగ్ పరీక్షకు హాజరుకాకుండానే బయటకు వెళ్లిపోయాడు.దాంతో ‘నాడా’ ఏప్రిల్ 23న బజరంగ్పై తాత్కాలిక నిషేధం విధించింది. డోపింగ్ పరీక్షకు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని కోరుతూ మే 7వ తేదీ వరకు బజరంగ్కు గడువు ఇచి్చంది. మరోవైపు తాను డోపింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు నిరాకరించలేదని... ‘నాడా’ అధికారులు ఆరోజు గడువు తీరిన కిట్స్తో తన నుంచి శాంపిల్స్ సేకరించేందుకు వచ్చారని బజరంగ్ ఆరోపించాడు. ‘నాడా’ అధికారులకు తన న్యాయవాది సమాధానం ఇస్తాడని బజరంగ్ తెలిపాడు.ఇవి చదవండి: రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో.. -
Gukesh Dommaraju: అతను.. ఒత్తిడిని అధిగమించే 'ఎత్తులమారి'!
30 నవంబర్, 2017.. అండర్–11 జాతీయ చాంపియన్గా నిలిచిన అబ్బాయిని ‘నీ లక్ష్యం ఏమిటి?’ అని ప్రశ్నిస్తే.. ‘చెస్లో ప్రపంచ చాంపియన్ కావడమే’ అని సమాధానమిచ్చాడు. సాధారణంగా ఆ స్థాయిలో గెలిచే ఏ పిల్లాడైనా అలాంటి జవాబే చెబుతాడు. అతను కూడా తన వయసుకు తగినట్లుగా అదే మాట అన్నాడు. కానీ ఆరున్నరేళ్ల తర్వాత చూస్తే అతను వరల్డ్ చాంపియన్ కావడానికి మరో అడుగు దూరంలో నిలిచాడు. ఆ కుర్రాడిలోని ప్రత్యేక ప్రతిభే ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చింది.పిన్న వయసులో భారత గ్రాండ్మాస్టర్గా గుర్తింపు పొందడం మొదలు వరుస విజయాలతో వరల్డ్ చాంపియన్కు సవాల్ విసిరే చాలెంజర్గా నిలిచే వరకు అతను తన స్థాయిని పెంచుకున్నాడు. ఆ కుర్రాడి పేరే దొమ్మరాజు గుకేశ్. చెన్నైకి చెందిన ఈ కుర్రాడు ఇటీవలే ప్రతిష్ఠాత్మక వరల్డ్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో చాంపియన్గా నిలిచి తానేంటో నిరూపించుకున్నాడు. తనకంటే ఎంతో బలమైన, అనుభవజ్ఞులైన గ్రాండ్మాస్టర్లతో తలపడి అతను ఈ అసాధారణ ఘనతను సాధించాడు.క్యాండిడేట్స్తో విజేతగా నిలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా రికార్డు నమోదు చేశాడు. ఈ ఏడాది చివర్లో.. చైనా ఆటగాడు డింగ్ లారెన్తో జరిగే పోరులోనూ గెలిస్తే అతను కొత్త జగజ్జేత అవుతాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 37 ఏళ్లుగా భారత నంబర్వన్గా ఉన్న దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ను దాటి మన దేశం తరఫున అగ్రస్థానాన్ని అందుకున్నప్పుడే గుకేశ్ ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు అదే జోరులో సాధించిన తాజా విజయంతో ఈ టీనేజర్ చెస్ చరిత్రలో తనకంటూ కొత్త అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.‘త్యాగం’.. తనకు నచ్చని పదం అంటారు గుకేశ్ తండ్రి రజినీకాంత్. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే అనుబంధానికి త్యాగం అనే మాటను జోడించడం సరైంది కాదనేది ఆయన అభిప్రాయం. గుకేశ్ క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత అతని కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని, వారు త్యాగాలు చేశారని చెబుతుంటే ఆయనలా స్పందించారు. చెన్నైలో స్థిరపడిన తెలుగువారు ఆయన. రజినీకాంత్ ఈఎన్టీ వైద్యుడు కాగా, గుకేశ్ తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్గా ఒక ఆస్పత్రిలో పని చేస్తున్నారు. గుకేశ్తో పాటు టోర్నీల కోసం ప్రయాణించేందుకు ఆయన చాలాసార్లు తన వృత్తిని పక్కన పెట్టి మరీ కొడుకు కోసం సమయం కేటాయించాల్సి వచ్చిందనేది వాస్తవం.‘పిల్లలను పోషించడం తల్లిదండ్రుల బాధ్యత. వారి పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలా పేరెంట్స్ కాక ఇంకెవరు శ్రమపడతారు! నేను గుకేశ్లో ప్రతిభను గుర్తించాను. అందుకు కొంత సమయం పట్టింది. ఒక్కసారి అది తెలిసిన తర్వాత అన్ని రకాలుగా అండగా నిలిచాం. నాకు టెన్నిస్ అంటే పిచ్చి. దాంతో మా అబ్బాయిని అందులోనే చేర్పిద్దాం అనుకున్నాను. కానీ బాబు చెస్లో ఆసక్తి చూపిస్తున్నాడని నా భార్య చెప్పింది.ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో..అంతే.. ప్రోత్సహించేందుకు మేం సిద్ధమైపోయాం. చెన్నై చుట్టుపక్కల ఎన్ని టోర్నీలు జరుగుతాయి, ఎలాంటి శిక్షణావకాశాలు ఉన్నాయి, వేరే నగరాలకు వెళ్లి ఎలా ఆడాలి.. ఇలా అన్నీ తెలుసుకున్నాం.. ప్రోత్సహించాం.. అబ్బాయి చదరంగ ప్రస్థానం మొదలైంది’ అని రజినీకాంత్ అన్నారు. గుకేశ్ క్యాండిడేట్స్ గెలిచిన సమయంలో అతని పక్కనే ఉన్న ఆ తండ్రి ఆనందం గురించి వర్ణించేందుకు మాటలు సరిపోవు. విజయానంతరం చెన్నై ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు గుకేశ్ను హత్తుకొని తల్లి కళ్లు చెమర్చాయి.అంచనాలకు అందకుండా రాణించి..కొన్నాళ్ల క్రితం వరకు కూడా క్యాండిడేట్స్ టోర్నీకి గుకేశ్ అర్హత సాధించడం సందేహంగానే కనిపించింది. వరుసగా కొన్ని అనూహ్య పరాజయాలతో అతను వెనకబడ్డాడు. చివరకు చెన్నై గ్రాండ్మాస్టర్స్ టోర్నీ గెలవడంతో అతనికి అవకాశం దక్కింది. అయితే టోర్నీకి ముందు.. గుకేశ్ గెలవడం కష్టమంటూ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ చేసిన వ్యాఖ్య తనపై కాస్త సందేహాన్ని రేకెత్తించింది. అంచనాలు అన్నీ నిజం కావు కానీ కార్ల్సన్ చెప్పడంతో మనసులో ఎక్కడో ఒక మూల కాస్త సంశయం.సాధారణంగా గుకేశ్ టోర్నీలు ఆడే సమయంలో ప్రతి రోజూ రెండుసార్లు తన తల్లికి ఫోన్ చేసేవాడు. గేమ్ ఓడినప్పుడైతే ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని కోరేవాడు. అప్పుడా అమ్మ.. తన కొడుకుకి.. క్రీడల్లో పరాజయాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో మళ్లీ సత్తా చాటి పైకెగసిన పలువురు దిగ్గజ క్రీడాకారుల గురించి చెబుతూ స్ఫూర్తినింపేది. ఆ ప్రయత్నం ఇటీవల రెండు సార్లు ఫలితాన్నిచ్చింది. క్యాండిడేట్స్కు అర్హత సాధించడానికి ముందు ఓటములు ఎదురైనప్పుడు మళ్లీ అతను ఆత్మవిశ్వాసం సాధించి పట్టుదలగా బరిలోకి దిగేందుకు ఇది ఉపకరించింది.రెండోసారి ఈ మెగా టోర్నీలో ఏడో రౌండ్లో అలీ రెజా చేతిలో ఓటమి తర్వాత అమ్మ మాటలు మళ్లీ ప్రభావవంతంగా పనిచేశాయి. గుకేశ్ స్వయంగా చెప్పినట్లు ఆ ఓటమే తన విజయానికి టర్నింగ్ పాయింట్గా మారింది. క్యాండిడేట్స్ టోర్నీ 14 రౌండ్లలో ఈ ఒక్క గేమ్లోనే ఓడిన అతను ఆ తర్వాత తిరుగులేకుండా దూసుకుపోయాడు. గుకేశ్ వాళ్లమ్మ మాటల్లో చెప్పాలంటే.. గతంలో టోర్నీలో ఒక మ్యాచ్ ఓడితే ఆ తర్వాతి రౌండ్లలో అతని ఆట మరింత దిగజారేది. పూర్తిగా కుప్పకూలిపోయేవాడు. కానీ ఇప్పుడు గుకేశ్ ఎంతో మారిపోయాడు. నిజానికి 17 ఏళ్ల వయసులో ఇంత పరిపక్వత అంత సులువుగా రాదు. ఒక ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని మళ్లీ సమరోత్సాహంతో బరిలోకి దిగడాన్ని అతను నేర్చుకున్నాడు.ఆత్మవిశ్వాసంతో..గుకేశ్ గతంలో ఏ ప్రశ్ననైనా అవును, కాదు అంటూ రెండేరెండు జవాబులతో ముగించేవాడు. కానీ ఇప్పుడు విజయాలు తెచ్చిన ఆత్మవిశ్వాసం అతని వ్యక్తిత్వంలోనూ ఎంతో మార్పు తెచ్చింది. క్యాండిడేట్స్కు అర్హత సాధించడానికి ముందు అతనికి 24 గంటలూ చెస్ ధ్యాసే. మరో జీవితమే లేకుండా పోయింది. కానీ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా అతను చెస్తో పాటు ఇతర అంశాల్లో కూడా సమయం వెచ్చించాడు. యోగా, టెన్నిస్ ఆడటం, సినిమాలు, మిత్రులను కలవడం, తగినంత విశ్రాంతి.. ఇలా అన్ని రకాలుగా అతను తనను తాను మలచుకున్నాడు. ఈ కీలక మార్పు కూడా అతని విజయానికి ఒక కారణమైంది.తల్లిదండ్రులతో..ఒత్తిడిని అధిగమించి..గుకేశ్కు ఇది తొలి క్యాండిడేట్స్ టోర్నీ. ఈ టోర్నీలో అతను అందరికంటే చిన్నవాడు కూడా. ప్రత్యర్థుల్లో కొందరు నాలుగు లేదా ఐదుసార్లు ఈ టోర్నమెంట్లో ఆడారు. రెండుసార్లు విజేతైన ఇవాన్ నెపొమినియాచి కూడా ఉన్నాడు. కానీ వీరందరితో పోలిస్తే గుకేశ్ ఒత్తిడిని సమర్థంగా అధిగమించాడు. పైగా ఇందులో రెండో స్థానం వంటి మాటకు చాన్స్ లేదు. అక్కడ ఉండేది ఒకే ఒక్క విజేత మాత్రమే.‘టొరంటోకు నేను ఒకే ఒక లక్ష్యంతో వెళ్లాను. టైటిల్ గెలవడం ఒక్కటే నాకు కావాల్సింది. ఇది అంత సులువు కాదని నాకు తెలుసు. నా వైపు నుంచి చాలా బాగా ఆడాలని పట్టుదలగా ఉన్నాను. ప్రత్యర్థులతో పోలిస్తే నా ఆటలో కూడా ఎలాంటి లోపాలు లేవనిపించింది. అందుకే నన్ను నేను నమ్మాను’ అని గుకేశ్ చెప్పాడు. అయితే గుకేశ్ తల్లిదండ్రులు మాత్రం అతని విజయంపై అతిగా అంచనాలు పెట్టుకోలేదు. ఇక్కడి అనుభవం.. వచ్చే క్యాండిడేట్స్ టోర్నీకి పనికొస్తే చాలు అని మాత్రమే తండ్రి అనుకున్నారు. కానీ వారి టీనేజ్ అబ్బాయి తల్లిదండ్రుల అంచనాలను తారుమారు చేశాడు.అండర్ 12 వరల్డ్ చాంపియన్గా.. , క్యాండిడేట్స్ టోర్నీ గోల్డ్ మెడల్తో.. సవాల్కు సిద్ధం..గుకేశ్ ఐదేళ్ల క్రితం 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్మాస్టర్ హోదా సాధించి ఆ ఘనతను అందుకున్న రెండో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. దానికే పరిమితం కాకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ జూనియర్ నుంచి సీనియర్ స్థాయి వరకు సరైన రీతిలో పురోగతి సాధిస్తూ వరుస విజయాలు అందుకున్నాడు.ప్రపంచ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా 8వ స్థానానికి చేరిన అతను 2700 ఎలో రేటింగ్ (ప్రస్తుతం 2743) దాటిన అరుదైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. వేర్వేరు వ్యక్తిగత టోర్నీలు గెలవడంతో పాటు ఆసియా క్రీడల్లో భారత జట్టు రజతం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2022లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో తొలి 8 గేమ్లలో ఎనిమిదీ గెలిచి ఎవరూ సాధించని అరుదైన రికార్డును సాధించాడు. వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్ కోసం ప్రస్తుత విజేత, చైనాకు చెందిన డింగ్ లారెన్తో గుకేశ్ తలపడతాడు.31 ఏళ్ల డింగ్కు మంచి అనుభవం ఉంది. 2800 రేటింగ్ దాటిన ఘనత పొందిన అతను చైనా చెస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు. ఒక దశలో వరుసగా 100 గేమ్లలో ఓటమి ఎరుగని రికార్డు అతనిది. అయితే ఇప్పుడు గుకేశ్ చూపిస్తున్న ఆట, ఆత్మవిశ్వాసం, సాధన కలగలిస్తే డింగ్ని ఓడించడం అసాధ్యమేమీ కాదు. — మొహమ్మద్ అబ్దుల్ హాది -
క్వార్టర్ ఫైనల్లో భారత్..
చెంగ్డూ (చైనా): డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల జట్టు థామస్ కప్ బ్యాడ్మింటన్ టీమ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘సి’లో సోమవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 5–0తో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించింది. తొలి మ్యాచ్లో ప్రణయ్ 21–15, 21–15తో హ్యారీ హంగ్పై గెలిచి భారత్కు 1–0తో శుభారంభం ఇచ్చాడు.రెండో మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21–17, 19–21, 21–15తో బెన్ లేన్–సీన్ వెండీ జంటపై గెలిచి ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్లో ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 21–16, 21–11తో నదీమ్ డాలి్వపై నెగ్గడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది.నాలుగో మ్యాచ్లో అర్జున్–ధ్రువ్ కపిల జంట 21–17, 21–19తో రోరీ ఈస్టన్–అలెక్స్ గ్రీన్ ద్వయంపై గెలిచింది. చివరిదైన ఐదో మ్యాచ్లో కిరణ్ జార్జ్ 21–18, 21–12తో చోలన్ కేయాన్ను ఓడించడంతో భారత్ 5–0తో క్లీన్స్వీప్ చేసింది. గ్రూప్ తొలి మ్యాచ్లో భారత్ 4–1తో థాయ్లాండ్పై గెలుపొందింది. రేపు జరిగే చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్లో నెగ్గిన జట్టు గ్రూప్ టాపర్గా నిలుస్తుంది.ఇవి చదవండి: కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్లో.. జ్యోతి సురేఖ -
కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్లో.. జ్యోతి సురేఖ
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో మూడు స్వర్ణ పతకాలతో మెరిసిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకుంది.సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో సురేఖ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో 299 పాయింట్లతో రెండో ర్యాంక్ లో నిలిచింది. గత ర్యాంకింగ్స్లో సురేఖ మూడో ర్యాంక్లో ఉంది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి 103 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్కు చేరుకుంది. పురుషుల రికర్వ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ 18వ ర్యాంక్లో ఉన్నాడు.ఇవి చదవండి: Archery: 'టాప్స్'లోకి దీపికా కుమారి -
Archery: ‘టాప్స్’లోకి దీపిక కుమారి
రెండేళ్ల తర్వాత భారత మహిళా స్టార్ ఆర్చర్, ‘ట్రిపుల్’ ఒలింపియన్ దీపిక కుమారికి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో చోటు కల్పించారు. ఫామ్లో లేకపోవడంతో 2022 జనవరిలో కేంద్ర క్రీడా శాఖ దీపికను ‘టాప్స్’ నుంచి తొలగించింది.2022 డిసెంబర్లో పాపకు జన్మనిచ్చిన దీపిక ఏడాదిపాటు ఆటకు దూరంగా ఉంది. ఈ ఏడాది జనవరిలో ఆసియా కప్ టోర్నీలో స్వర్ణంతో దీపిక పునరాగమనం చేసింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ టోర్నీలో దీపిక రజత పతకం నెగ్గి సత్తా చాటుకుంది.ఇవి చదవండి: బ్యాచ్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ విజేత వెలవన్ -
Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
30, డిసెంబర్ 2002.. ఘోర రోడ్డు ప్రమాదం.. చావుకు సమీపంగా వెళ్లి అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకున్న రోజు.. 23 మార్చి, 2024.. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున కెప్టెన్గా బరిలోకి దిగిన రోజు.. ఈ రెండు ఘటనల మధ్య దాదాపు 15 నెలల సమయం ఉంది. ఈ మధ్య కాలంలో బాధ, వేదన ఉంది. జీవితంతో పోరాడిన సంఘర్షణ ఉంది. బతికితే చాలు.. ఆట గురించి అసలు ఆలోచనేరాని క్షణం నుంచి వేలాది మంది సమక్షంలో మళ్లీ క్రికెట్ ఆడగలిగే అవకాశం రావడం వరకు ఒక అసాధ్యాన్ని సాధ్యం చేసిన అద్భుతం ఉంది. అన్నింటికి మించి ఆ మనిషి నరనరాల్లో పట్టుదల ఉంది.అదే పట్టుదల, అదే పంతం అతడిని మళ్లీ నిలబెట్టింది. అసలు ఆడగలడా అనుకున్న సగటు భారత క్రికెట్ అభిమానులంతా అతడిని గ్రౌండ్లో చూస్తూ సంతోషంగా ఆహ్వానించిన క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ యువకుడే 26 ఏళ్ల రిషభ్ పంత్. భారత వికెట్ కీపర్ బ్యాట్స్మన్. అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న దశలో జరిగిన కారు ప్రమాదం పంత్ కెరీర్కు చిన్న కామా పెట్టింది. కానీ అతను ఈ సవాల్ను స్వీకరించి మళ్లీ అగ్రశ్రేణి మ్యాచ్లు ఆడే వరకు రావడం అసాధారణం. అతని పునరాగమనం స్ఫూర్తిదాయకం. భారత క్రికెట్లో రిషభ్ పంత్ ఒక సంచలనం. దూకుడైన ఎడమ చేతి వాటం బ్యాటర్ కమ్ వికెట్ కీపర్గా 2016 అండర్–19 ప్రపంచకప్లో సత్తా చాటడంతో అతనేంటో అందరికీ తెలిసింది. వేగవంతమైన అర్ధ సెంచరీ, సెంచరీలతో అతను చెలరేగాడు. భారత్ టైటిల్ గెలుచుకోకపోయినా మనకు దక్కిన సానుకూల ఫలితాల్లో పంత్ వెలుగులోకి రావడం ఒకటి. అతని ప్రదర్శన ఊరికే పోలేదు. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ అతడిని తమ జట్టులోకి తీసుకుంది. మరో వైపు ఢిల్లీ రంజీ టీమ్లో కూడా రెగ్యులర్ సభ్యుడిగా మారిన అతను కెప్టెన్సీ బాధ్యతలనూ తీసుకున్నాడు.ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో 32 బంతుల్లో పంత్ కొట్టిన రికార్డు సెంచరీ అతని స్థాయిని పెంచింది. ఆ జోరు చూసిన ఢిల్లీ ఐపీఎల్ టీమ్ మరే ఆలోచన లేకుండా అతణ్ణి జట్టులో కొనసాగించింది. ఇన్ని సీజన్లు ముగిసినా అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను అదే జట్టుతో ఉండటం విశేషం. 2017లో ఐపీఎల్ జరుగుతున్న సమయంలో తండ్రి ఆకస్మిక మరణం 20 ఏళ్ల ఆ కుర్రాడిని కుంగదీసింది. అయితే అంత్యక్రియలు ముగిసిన 48 గంటల్లోనే తిరిగి వచ్చి మళ్లీ ఐపీఎల్లో తన మెరుపులను ప్రదర్శిస్తూ 57 పరుగులు చేశాడు. తర్వాతి సీజన్లో సన్రైజర్స్పై చెలరేగి పంత్ కొట్టిన సెంచరీ లీగ్లో బెస్ట్ ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచిపోయింది.ఒకే ఒక లక్ష్యంతో..పంత్ సాధారణ నేపథ్యం నుంచి వచ్చాడు. తండ్రి రాజేందర్ ఒక ప్రైవేట్ స్కూల్ను నడిపేవాడు. ఉత్తరాఖండ్లోని రూర్కీ స్వస్థలం కాగా క్రికెట్ అవకాశాల కోసం ఢిల్లీ వైపు చూడాల్సి వచ్చింది. రూర్కీ నుంచి ఢిల్లీ ఆరున్నర గంటల ప్రయాణం. చిన్నప్పటి నుంచి అన్ని చోట్లకు అతని తల్లి సరోజ్ తోడుగా వచ్చేది. ఢిల్లీలోని ప్రముఖ కోచ్ తారక్ సిన్హాకు చెందిన సానెట్ అకాడమీలో అతను శిక్షణ తీసుకున్నాడు. 12 ఏళ్ల వయసులో జరిగిన ఒక ఘటన పంత్లో ఆటకు సంబంధించి పట్టుదలను పెంచింది.సెలక్షన్స్, కోచింగ్ కోసం 45 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే వసతి కోసం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో స్థానికంగా మోతీబాగ్లోని ఒక గురుద్వారాలోనే తల్లి, కొడుకులు ఉన్నారు. ఆ సమయంలోనే తాను భారత్కు ఆడాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు అతను చెప్పుకున్నాడు. ఐపీఎల్లో అవకాశం దక్కినా.. టీమిండియా ప్లేయర్గా వచ్చే గుర్తింపు కోసం అతను శ్రమించాడు. కొన్నాళ్లకే అతని కల నెరవేరింది. భారత జట్టులో అవకాశం దక్కించుకున్న అతను కొన్ని చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.మన గిల్లీ..అంతర్జాతీయ క్రికెట్లో ఆడమ్ గిల్క్రిస్ట్ను పంత్ గుర్తుకు తెచ్చాడు. తన మూడో టెస్టులోనే ఇంగ్లండ్ గడ్డపై అద్భుత సెంచరీతో అతను ఆకట్టుకున్నాడు. తర్వాతి ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై సిడ్నీలో 159 పరుగులతో తన బ్యాటింగ్ పదును చూపించాడు. భారత జట్టు ఆస్ట్రేలియాలో తొలి సిరీస్ గెలిచేందుకు ఇది ఉపకరించింది. తర్వాతి ఏడాది సిడ్నీలోనే 97 పరుగులతో రాణించిన అతను ఈ మ్యాచ్ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అసలు ఘనత తర్వాతి టెస్టులోనే బ్రిస్బేన్లో వచ్చింది. భారత్కు ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో అజేయంగా 89 పరుగులతో అతను జట్టును గెలిపించిన తీరు ఈ సిరీస్ విజయాన్ని చిరస్మరణీయంగా మార్చింది. అంతకు ముందే రంజీ ట్రోఫీలో పంత్ చేసిన ట్రిపుల్ సెంచరీ అతను పైస్థాయికి చేరగలడనే నమ్మకాన్ని కలిగించింది.మూడు దశల ప్రణాళికతో..రిషభ్ పంత్కు ఎదురైన ప్రమాద తీవ్రత చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉండింది. చావు నుంచి తప్పించుకోవడం మాత్రమే ఊరట కలిగించే అంశం. మిగతా అన్నీ ప్రతికూల అంశాలే. ఆట సంగతేమో కానీ ముందు సాధారణ జీవితమైతే గడపగలగాలి కదా! చాలారోజుల వరకు ఆస్పత్రిలోనే ఉన్నాడు. శస్త్ర చికిత్సలు, స్కానింగ్, పరీక్షలు, రిపోర్టులతోనే సాగిపోయింది.2022 డిసెంబర్లో పంత్కి జరిగిన రోడ్డు ప్రమాదంఅలాంటి స్థితిలో పంత్ తన కోసం తాను ఒక కొత్త ప్రణాళికను రూపొందించుకోవాల్సి వచ్చింది. ప్రమాదం నుంచి మైదానం వరకు అతను తన పురోగతిని మూడు రకాలుగా విభజించుకొని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ముందుగా ఆరోగ్యపరంగా సాధారణ స్థితికి రావడం. ఆటగాడి కోణంలో కాకుండా ఒక సామాన్యుడు ప్రమాదం బారిన పడితే వైద్యుల పర్యవేక్షణలో ఏం చేస్తాడో పంత్ కూడా అదే చేశాడు. ముందుగా కోలుకోవడం, ఇతరుల సహాయం లేకుండా నడక, తన పనులు తాను సొంతంగా చేసుకోవడంపై దృష్టి పెట్టాడు. రెండో క్రమంలో జనరల్ ఫిట్నెస్పై శ్రద్ధ తీసుకున్నాడు.తేలికపాటి ఎక్సర్సైజ్లు, యోగావంటి వాటితో తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. ఆపై మూడో దశకు వచ్చే సరికి క్రికెటర్ మ్యాచ్ ఫిట్నెస్ కోసం శ్రమించాడు. ఈ విషయంలో బీసీసీఐకి చెందిన జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ఎంతో సహాయం అందించింది. డైట్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్, ఫిజియో ఏర్పాటు.. ఇలా అన్ని రకాలుగా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ పంత్ సిద్ధమయ్యాడు.గాయాల నుంచి కోలుకుంటూలీగ్లో సత్తా చాటి..‘నేను మళ్లీ క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. నాకు ఎదురైన దురదృష్టకర ఘటనలను దాటి మళ్లీ క్రికెట్ ఆడటం అంటే కొత్త జన్మ ఎత్తినట్లు’ అని తొలి మ్యాచ్కు ముందు పంత్ స్వయంగా చెప్పుకున్నాడు. ఐపీఎల్లో 2024లో పంత్ మ్యాచ్లు చూసినవారికి పంత్ పురోగతి ఆశ్చర్యం కలిగించింది. అసలు ఎప్పుడూ ఏ ప్రమాదం జరగనట్లుగా, కొంత విరామం తర్వాత మాత్రమే అతను ఆటలోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నాడు.బ్యాటింగ్లో పదును, వికెట్ కీపింగ్లో చురుకుదనం, మైదానంలో అతని కదలికలు, కెప్టెన్సీ నైపుణ్యం కొత్త పంత్ను చూపిస్తున్నాయి. మరో సందేహం లేకుండా పూర్తి ఫిట్నెస్ స్థాయిని అతను ప్రదర్శించాడు. ముఖ్యంగా బ్యాటింగ్లో గతంలోలాగే ర్యాంప్ షాట్లు, స్విచ్ హిట్లు, ఒంటి చేత్తో సిక్సర్లు, ఏ బౌలర్నూ వదలకుండా అతను ఆధిపత్యం చూపించడం సగటు క్రికెట్ అభిమానిని సంతృప్తిపరచాయి. ఎందుకంటే లీగ్లో ఎవరికి ఆడినా అతను భారత క్రికెట్ భవిష్యత్తు అనే విషయం అందరికీ తెలుసు.ఇంత తక్కువ సమయంలో కోలుకోవడంలో అతని వయసు కూడా కీలక పాత్ర పోషించడం వాస్తవమే అయినా.. అన్ని రకాల ప్రతికూలతలను దాటి అతను సగర్వంగా నిలిచాడు. అతని పోరాటానికి హ్యాట్సాఫ్ చెబుతూ మున్ముందు భారత్కు పంత్ మరిన్ని విజయాలు అందించాలని ఆశిద్దాం! — మొహమ్మద్ అబ్దుల్ హాది -
ప్రచండ పంత్.. గుజరాత్కు ఢిల్లీ చెక్!
-
చెపాక్లోనూ లక్నో చేతిలో చెన్నైకి భంగపాటు!
-
ఈ రెజ్లర్ ఎవరో గుర్తుపట్టగలరా? ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గానూ..
-
Sports: ఈ కుర్రాడు.. చదరంగంలో 'అర్జును'డు!
పుష్కర కాలం క్రితం ఒక ఎనిమిదేళ్ల కుర్రాడు చెస్ క్రీడపై ఆసక్తి చూపించాడు.. స్కూల్లో టీచర్ అతనిలోని ప్రతిభను మొదటిసారి గుర్తించగా.. తల్లిదండ్రులు సరైన దిశలో ప్రోత్సహిస్తూ మార్గనిర్దేశనం చేశారు. తొలి ఎత్తు వేసిన దగ్గరినుంచి అతను ఆ 64 గళ్లే ప్రపంచంలా బతికాడు. మరో ఆలోచన లేకుండా 24 గంటలూ ఆటపైనే దృష్టి పెట్టి∙సాధన చేశాడు. సహజంగానే అతని కష్టానికి తగిన ప్రతిఫలాలు వచ్చాయి. స్కూల్ దశ నుంచి అంతర్జాతీయ పోటీల వరకు వేర్వేరు దశల్లో అనేక సంచలనాలు, పెద్ద సంఖ్యలో విజయాలు సాధించి అతను తన స్థాయిని పెంచుకున్నాడు. భారత చెస్కు దిక్సూచి, మన దేశంలో చదరంగానికి దారి చూపించిన మార్గదర్శి విశ్వనాథన్ ఆనంద్ను అధిగమించి ఇటీవలే అతను ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్ తరఫున అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. దాదాపు 38 ఏళ్ల కాలంలో ఇలా ఆనంద్ను వెనక్కి తోసి దూసుకుపోగలగడం ఇద్దరికి మాత్రమే సాధ్యమైంది. వారిలో ఒకరు ఈ కుర్రాడు. ఒక అరుదైన ఘనత మాత్రమే కాకుండా.. ఒక యువ ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే మైలురాయి ఇది. భవిష్యత్తులో మరిన్ని పెద్ద విజయాలు అందుకునేందుకు కావాల్సిన ప్రేరణను ఇచ్చే క్షణం ఇది. ఈ రికార్డును సాధించిన కుర్రాడే తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేశి. ప్రొఫెషనల్ చెస్లో అడుగుడిన నాటినుంచి ఎన్నో విజయాలతో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నాడు. రెండేళ్ల క్రితం నేదర్లండ్స్లో విక్ ఆన్ జీ టోర్నమెంట్లో అర్జున్ విజేతగా నిలిచాడు. దాంతో 2659.5 ఎలో రేటింగ్తో ఏకంగా 49 స్థానాలు ఎగబాకి టాప్–100 ర్యాంకింగ్స్లోకి చేరుకున్నాడు. ఆ గెలుపు తర్వాత చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ను కలిసే అవకాశం వచ్చింది. అతనితో అర్జున్ ఫొటో దిగేందుకు ఆసక్తి చూపించాడు. అందుకు సంతోషంగా అంగీకరించిన కార్ల్సన్.. అర్జున్ విజయాలను ప్రస్తావించి అభినందనలు తెలిపాడు. కుటుంబంతో సాంకేతికంగా మంచి పట్టున్న ఆటగాడని, వేగంగా శైలి మార్చుకోగలడని ప్రశంసిస్తూ త్వరలోనే 2700 రేటింగ్ దాటగల సత్తా ఉన్న కుర్రాడు అంటూ భవిష్యవాణి చెప్పాడు. ఆ ఆశీర్వాదం నిజమైంది. అదే ఏడాది అర్జున్ 2700 రేటింగ్ అందుకున్నాడు. అంతేకాదు కార్ల్సన్పైనా సంచలన విజయాన్ని సాధించాడు. ఎయిమ్చెస్ ర్యాపిడ్ ఆన్లైన్ టోర్నీలో మాగ్నస్ను ఓడించడంతో అందరి దృష్టీ అర్జున్పై పడింది. కొన్నాళ్ల క్రితం జనరేషన్ కప్ ఫైనల్లో కార్ల్సన్ చేతిలో ఓడినా.. ఆ టోర్నీలో అరోనియన్, నీమన్, ఇవాన్ చుక్లాంటి స్టార్లను ఓడించి ముందంజ వేయడం అర్జున్ స్థాయిని పెంచింది. వేగంగా దూసుకెళ్లి.. 2003లో పుట్టిన అర్జున్ చెస్ ప్రస్థానం చాలా వేగంగా సాగింది. వైద్యుడైన తండ్రి అండదండల కారణంగా ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. అతని సహజ ప్రతిభకు తోడు సరైన శిక్షణతో ఆటపై పట్టు పెరిగింది. వరంగల్లో చెస్ ఓనమాలు నేర్చుకున్న తర్వాత ఆటపై మరింతగా దృష్టి పెట్టేందుకు అర్జున్ హైదరాబాద్కు మారాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరో లోకం లేకుండా అతను చదరంగం పావులతోనే గడిపాడు. మొదటినుంచి మితభాషి అయిన అర్జున్ సన్నిహితులు, కుటుంబసభ్యులను కలిసినా చెస్ గురించి, తన ఎత్తుల గురించి తప్ప మరో మాట మాట్లాడేవాడు కాదు. ‘ఇంటికి కూడా రాకుండా పగలు, రాత్రి చెస్ కోచింగ్ సెంటర్లోనే ఉండిపోయేందుకు అర్జున్ సిద్ధమయ్యవాడు. ఒక దశలో ఇది మాలో కాస్త ఆందోళననూ పెంచింది. అందుకే అక్కడినుంచి తప్పించి బలవంతంగా విరామం ఇవ్వాల్సి వచ్చింది’ అని చెప్పాడు అర్జున్ తండ్రి శ్రీనివాసరావు. రాష్ట్రస్థాయి మొదలు జాతీయ స్థాయిలో వివిధ వయో విభాగాల్లో అర్జున్ మంచి విజయాలు సాధించాడు. ఈ సానుకూల ఫలితాల కారణంగా మరో ఆలోచన లేకుండా మరింత పెద్ద లక్ష్యాలపై గురి పెట్టాడు. అండర్–14 జాతీయ స్థాయి చాంపియన్గా నిలవడంతో 13 ఏళ్ల అర్జున్కు వెంటనే ఒక మంచి అవకాశం దక్కింది. వరల్డ్ యూత్ చాంపియన్షిప్, ఆసియా చాంపియన్షిప్కు అతను అర్హత సాధించడంలో సఫలమయ్యాడు. అయితే ఆ అర్హతతో ఆగిపోకుండా ఆసియా యూత్ చాంపియన్షిప్లో రజతపతకం కూడా సాధించాడు. గ్రాండ్మాస్టర్ వేటలో.. ప్రతిష్ఠాత్మక గ్రాండ్మాస్టర్ హోదాను అందుకోవడంలో కూడా అర్జున్ ఎదుగుదల వేగంగా సాగింది. 2018 ఏడాది ఆరంభమయ్యే సమయానికి అతను ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) కూడా కాదు. జనవరిలో కోల్కతాలో తొలి ఐఎం నార్మ్ సాధించడంతో పాటు మొదటిసారి 2500 రేటింగ్ను అతను దాటాడు. తర్వాతి రెండు నెలల్లో మరో రెండు ఐఎం నార్మ్లు అతని ఖాతాలో చేరాయి. ఐఎం సాధించిన తర్వాత అర్జున్ వరుసగా విదేశీ టోర్నీల్లో ఆడాడు. నేషనల్ టైటిల్తో, విశ్వనాథన్ ఆనంద్తో అదే ఏడాది అక్టోబర్కు వచ్చే సరికి గ్రాండ్మాస్టర్గా మారడం విశేషం. ఆర్మేనియా, సెర్బియా, హంగరీ, స్విట్జర్లండ్లలో ఆడి తన రేటింగ్ను మెరుగుపరచుకున్నాడు. అబుదాబిలో అతనికి మూడో జీఎం నార్మ్ దక్కింది. ఆ సమయంలో పదో తరగతి చదువుతున్న అర్జున్ 14 ఏళ్ల 11 నెలల 13 రోజుల్లో గ్రాండ్మాస్టర్గా నిలిచిన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున 32వ గ్రాండ్మాస్టర్గా గుర్తింపు పొందిన అర్జున్.. తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి గ్రాండ్మాస్టర్గా నిలవడం విశేషం. ఈ మైలురాయి తర్వాత కొద్ది రోజులకే టర్కీలో జరిగిన అండర్–16 చెస్ ఒలింపియాడ్లో అతను భారత జట్టుకు ఎంపికయ్యాడు. వరుస విజయాలతో.. ఏ క్రీడలోనైనా జూనియర్ స్థాయిలో వరుస విజయాలు సాధించి, ప్రత్యేక గుర్తింపుతో సీనియర్ స్థాయికి వచ్చేసరికి అంచనాలు పెరిగిపోతాయి. వాటితో పాటు తీవ్రమైన పోటీ, బలమైన ప్రత్యర్థులతో తలపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆటగాళ్లకు పెద్ద స్థాయిలో భిన్నమైన ఫలితాలు కూడా వస్తాయి. కానీ అలాంటి ప్రతికూలతలను దాటి ముందుకు వెళ్లినప్పుడే ఆటగాడి సత్తా ఏమిటో తెలుస్తుంది. చెస్లో అర్జున్ కూడా అలాంటి అంచనాలను పెంచడమే కాదు వాటిని అందుకోవడంలోనూ సఫలమయ్యాడు. బాలమేధావి అనే పేరుతోనే సరిపెట్టుకోకుండా దిగ్గజ ఆటగాళ్లతో తలపడి పెద్ద టోర్నీల్లో విజయాలు అందుకుంటూ ఈతరం భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2021లో చాంపియన్స్ చెస్ టూర్లో, లిండార్స్ బ్లిజ్ టోర్నమెంట్లో చెప్పుకోదగ్గ విజయాలు అందుకున్నాడు. ప్రతిష్ఠాత్మక టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ విభాగంలో విజేతగా నిలవడం అర్జున్ కెరీర్లో కీలక మలుపు. తర్వాతి ఏడాది కూడా అతను టాటా స్టీల్ చాలెంజర్స్ టోర్నమెంట్ను గెలుచుకు న్నాడు. 2022లో జాతీయ చెస్ చాంపియన్గా నిలిచిన అర్జున్ మరో పెద్ద టోర్నీలో ఢిల్లీ ఓపెన్లో కూడా టైటిల్ గెలుచుకున్నాడు. అబూధాబీ ఇంటర్నేషనల్ చెస్ గెలిచిన తర్వాత మరోసారి టాటా స్టీల్ బ్లిట్జ్లో అతను చాంపియన్గా నిలిచాడు. అటు క్లాసిక్తో పాటు ఇటు ర్యాపిడ్, బ్లిట్జ్ ఈవెంట్లలో కూడా అదే స్థాయిలో అర్జున్ మంచి ప్రదర్శన కనబరు స్తుండటం చెప్పుకోదగ్గ అంశం. గత ఆసియా క్రీడల్లో రజతం సాధించిన భారత జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. అర్జున్ ప్రస్తుతం 2756 ఎలో రేటింగ్తో ఆనంద్ (2751)ను అధిగమించి వరల్డ్ ర్యాంకింగ్స్లో 9వ స్థానంలో నిలిచాడు. మున్ముందు 2800 రేటింగ్ను దాటడంతో పాటు ప్రపంచ చాంపియన్గా నిలవడాన్ని అతను దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకున్నాడు. అర్జున్ ప్రతిభ, ఇటీవలి ప్రదర్శనను చూస్తే ఎంతటి పెద్ద విజయమైనా అసాధ్యం కాదనిపిస్తుంది. — మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: హై హై హెట్మైర్... -
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు యాంకర్.. స్పోర్ట్స్ ప్రజెంటర్ వింధ్య విశాఖ (ఫొటోలు)
-
ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్.. అభిమానులకు మరోసారి నిరాశే
-
IPL 2024: ముంబై గెలుపు బోణీ.. పాండ్యా ముఖంలో నవ్వు
-
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం.. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
-
'స్వామి వివేకానంద' సినిమా స్టిల్
-
IPL 2024: ఫ్రాంఛైజీ ఓనర్ల పేర్లు తెలుసా? వీరు స్పెషల్ అట్రాక్షన్!
-
WPL 2024: అలుపెరుగక దూసుకుపోయిన.. సూపర్ 'స్మృతి' మందాన
సాంగ్లీ.. మహారాష్ట్రలో ఒక చిన్న పట్టణం.. శ్రవణ్ అనే కుర్రాడు క్రికెట్ నెట్స్లో తీవ్రంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. రాష్ట్ర జట్టులోకి ఎంపికయ్యేందుకు ఆ అబ్బాయి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. అతని చెల్లెలు తన తండ్రితో కలిసి అక్కడే అన్న ఆటను చూస్తోంది. అప్పటి వరకు క్రికెట్ అంటే ఏమిటో కూడా ఆ అమ్మాయికి తెలీదు. అయితే అప్పటికే కొన్నిసార్లు అన్న పేరు, అతను సాధించిన స్కోర్లతో న్యూస్పేపర్లలో వచ్చింది. ఇంటికి వెళ్లిన తర్వాత కూతురి ఆసక్తి చూసిన నాన్న ‘నువ్వు కూడా ఆడతావా’ అని అడిగాడు. ఆ వెంటనే అమ్మాయి నా పేరు కూడా పేపర్లో వస్తుందా అని నాన్నను అడిగేసింది. వెంటనే కల్పించుకున్న తల్లి.. ‘పదో తరగతి పరీక్షల్లో 96 శాతం వస్తే నీ పేరు కచ్చితంగా వస్తుంది’ అని సర్దిచెప్పింది. కానీ ఆ అమ్మాయి మనసులో మాత్రం ఒక మాట ఉండిపోయింది. పదో తరగతి పరీక్షా ఫలితాల కంటే క్రికెట్ ద్వారా పేరు తెచ్చుకోవడమే బాగుంటుందనిపించింది. అంతే.. తన మనసులో మాట చెప్పగానే తండ్రి అభ్యంతరం చెప్పలేదు. నాన్న అండగా ఉంటే తిరుగేముంది.. ఆ అమ్మాయి తర్వాతి రోజుల్లో అన్నీ పక్కన పెట్టి పూర్తిగా క్రికెట్ పైనే దృష్టి పెట్టింది. 16 ఏళ్ల వయసు తిరిగే సరికే భారత సీనియర్ జట్టులో చోటు సంపాదించి తానేంటో రుజువు చేసుకుంది. అండర్–19 స్థాయి తర్వాత అన్న ఆటకు గుడ్బై చెప్పిన ఉద్యోగ వేటలో పడిపోగా.. చెల్లెలు మాత్రం కుటుంబం ప్రోత్సాహంతో దూసుకుపోయింది. ఆ ప్లేయరే భారత ఓపెనర్ స్మృతి మంధానా. ప్రస్తుతం మన మహిళల టీమ్లో టాప్ బ్యాటర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్లో కెప్టెన్ హోదాలో బెంగళూరు టీమ్ను విజేతగా నిలిపి తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించింది. స్మృతి విజయప్రస్థానంలో కీలకమైన అంశం ఆమెకు కుటుంబసభ్యుల నుంచి లభించిన ప్రోత్సాహం. వస్త్రవ్యాపారి అయిన తండ్రి మొదటి రోజు నుంచే క్రికెట్లో ప్రోత్సహించగా, ఒక టీనేజ్ అమ్మాయి అవసరాలను దగ్గరి నుంచి చూసుకుంటూ తల్లి అన్ని రకాలుగా వెంట నిలిచింది. ఇక క్రికెట్ మానేసి బ్యాంక్ ఉద్యోగంలో చేరిన అన్న శ్రవణ్ ఆమెకు మార్గదర్శిగా వ్యవహరించడమే కాకుండా స్మృతి ప్రాక్టీస్లో అన్ని సమయాల్లో తానే వెంట ఉంటూ ఆమెకు నెట్స్లో బౌలింగ్ చేస్తూ తన వంతు సహకారం అందించాడు. సరిగ్గా చెప్పాలంటే ఒక్కసారి కెరీర్ను ఎంచుకున్న తర్వాత ఏ దశలోనూ ఆమె ప్రయాణానికి అడ్డంకులు రాలేదు. మధ్యలో ఒక్కసారి మాత్రం అన్నలాగే ఆటను మానేసి తనకిష్టమైన సైన్స్ చదువుకుందామనే ఆలోచన వచ్చినా, అప్పటికే ఆమె ఎదుగుతున్న తీరు ఆ ఆలోచనకు ఫుల్స్టాప్ పెట్టేశాయి. ఎందుకంటే 11 ఏళ్ల వయసుకే మహారాష్ట్ర అండర్–19 టీమ్లో చోటు దక్కించుకున్న స్మృతికి మున్ముందు దూసుకుపోవడమే మిగిలింది. నాలుగేళ్ల తర్వాత మహారాష్ట్ర సీనియర్ టీమ్లో అవకాశం లభించింది. తొలి మ్యాచ్లోనే సౌరాష్ట్రపై 155 పరుగులు బాది ఆమె వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర జట్టుకు వరుస విజయాలు అందించిన తర్వాత మహిళల టీమ్ల కోసం ప్రత్యేకంగా బీసీసీఐ నిర్వహించిన చాలెంజర్ టోర్నీలో టాప్స్కోరర్గా సత్తా చాటడంతో స్మృతి ఆట పదును ఏమిటో అందరికీ తెలిసింది. అంచెలంచెలుగా దూసుకుపోయి.. భారత టి–20 జట్టు తరఫున తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన స్మృతి మరో ఐదు రోజులకే వన్డేల్లోనూ అరంగేట్రం చేసింది. అంతర్జాతీయ వేదికపై ఆడటానికి కొద్ది రోజుల ముందే భారత దేశవాళీ వన్డేలో డబుల్ సెంచరీ (224) బాదిన స్మృతి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా నిలిచింది. ఒక్కసారి టీమిండియాలోకి వచ్చిన తర్వాత ఆమె ఏ దశలోనూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఓపెనర్గా జట్టు వరుస విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించింది. వరుసగా నాలుగేళ్ల పాటు వన్డేలు, టి–20ల్లో రెగ్యులర్ మెంబర్గా తనకు పోటీ లేకుండా జట్టులో స్మృతి కొనసాగింది. 2014లో ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ నుంచి ఏకంగా ఎనిమిది మంది అరంగేట్రం చేయగా, వారిలో స్మృతి కూడా ఉంది. రెండో ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీతో జట్టు విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఇదే జోరులో విదేశీ లీగ్ టీమ్లను కూడా ఆకర్షించడంతో ఆస్ట్రేలియా విమెన్ బిగ్బాష్ లీగ్లో తొలిసారి ఆడే అవకాశం దక్కింది. అయితే అనూహ్యంగా అది స్మృతికి కొంత సమస్యగా కూడా మారింది. కాలికి తీవ్ర గాయం కారణంగా టోర్నీనుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో పాటు భారత జట్టుకు కూడా ఐదేళ్లు దూరం కావాల్సి వచ్చింది. కొత్తగా బరిలోకి దిగి.. ఇంగ్లండ్ వేదికగా 2017 జూన్లో వన్డే వరల్డ్ కప్.. భారత్, ఆతిథ్య ఇంగ్లండ్ మధ్య లీగ్ మ్యాచ్. ఓపెనర్గా బరిలోకి దిగిన స్మృతి 72 బంతుల్లోనే 90 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా భారత్ను గెలిపించింది. అయితే ఆట కంటే ఆమె మరో రకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. నాలుగేళ్ల కెరీర్ తర్వాత తొలిసారి స్మృతి కంటి అద్దాలు లేకుండా మైదానంలోకి దిగింది. అప్పటి వరకు ఆమెను గ్రౌండ్లో కంటి అద్దాలతోనే అందరూ చూశారు. గాయం కారణంగా వచ్చిన విరామంలో ఆమె తన శస్త్ర చికిత్సతో తన లుక్ను కూడా మార్చుకుంది. ఈ సమయం తన కెరీర్లో కొత్త మార్పుకు సూచికగా భావించానని, ఇకపై కొత్త స్మృతిని చూస్తారని ఆమె స్వయంగా చెప్పుకుంది. నిజంగానే కెరీర్ పరంగా కూడా స్మృతికి సంబంధించి అదో మరో మలుపు. తర్వాతి మ్యాచ్లోనే వెస్టిండీస్పై సెంచరీ కూడా సాధించి వరల్డ్ కప్లో ఆమె తన జోరు కొనసాగించింది. వరల్డ్ కప్ తర్వాత వెంటనే జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలోనూ శతకంతో చెలరేగింది. ఏడాది తిరిగే లోపే న్యూజిలాండ్ వేదికగా మరో సెంచరీ కొట్టేసింది. ఈ రెండేళ్ల కాలం ఆమె కెరీర్లో అత్యద్భుతంగా సాగింది. రికార్డులే రికార్డులు.. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘకాలం పాటు భారత మహిళల క్రికెట్ను మిథాలీ రాజ్ శాసించింది. మన జట్టుకు సంబంధించి అన్ని ఘనతలనూ ఆమెనే సాధించింది. అయితే తర్వాతి తరంలో స్మృతి అలాంటి ఫామ్ను చూపించింది. పైగా వన్డేలతో పాటు ఈతరం ప్రతినిధిగా టి–20 క్రికెట్లో కూడా స్మృతి తన స్థాయిని చూపించింది. క్రికెట్కు సంబంధించి నాలుగు విదేశీ పర్యటనలను కఠినమైనవిగా భావిస్తారు. ‘సేన’ అంటూ పిలుచుకునే (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఇందులో ఉన్నాయి. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ నాలుగు దేశాల్లోనూ వన్డేల్లో సెంచరీ చేసిన అత్యంత అరుదైన రికార్డు స్మృతి పేరిట ఉంది. అంతర్జాతీయ టి–20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (24 బంతుల్లో) ఆమెనే సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో రజతం, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో ఆమె సభ్యురాలు. అద్భుతమైన ఆటతో విదేశీ లీగ్లను కూడా ఆకట్టుకున్న స్మృతి బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్, సదరన్ బ్రేవ్, వెస్టర్న్ స్టార్మ్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించింది. అయితే బీసీసీఐ నిర్వహించే విమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో బెంగళూరు టీమ్ను విజేతగా నిలపడం ఆమె స్థాయిని మరింత పెంచింది. పురుషుల విభాగంలో ఐపీఎల్లో 16 సీజన్లు ఆడినా బెంగళూరుకు ఇప్పటి వరకు ట్రోఫీ దక్కలేదు. కానీ రెండో ప్రయత్నంలోనే మహిళల టీమ్ దానిని సాధించడంలో అటు ప్లేయర్గా, ఇటు కెప్టెన్గా స్మృతికే ఘనత దక్కుతుంది. గత ఏడాది తొలి సీజన్లో 2 మ్యాచ్లే గెలిచి నాలుగో స్థానానికి పరిమితమైన టీమ్ను ఈ సారి విజేతగా మలచడం అసాధారణం. మున్ముందు భారత మహిళల క్రికెట్కు చుక్కానిలా ముందుండి నడిపించగల సామర్థ్యం స్మృతికి ఉందనేది వాస్తవం. 2018లో అంతర్జాతీయ క్రికెట్ మండలి వార్షిక అవార్డుల్లో అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డును స్మృతి సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ఆమె ఆటకు అర్జున పురస్కారంతో గౌరవించింది. దీనికి తోడు బ్రాండింగ్ ప్రపంచంలో కూడా ఆమె ఇప్పుడు పెద్ద సెన్సేషన్. సహజంగానే ఆటకు అందం తోడవడంతో పలు కంపెనీలు స్మృతితో ఒప్పందాలు చేసుకున్నాయి. గల్ఫ్ ఆయిల్, హావెల్స్, పవర్ షూస్, హెర్బలైఫ్, రెడ్బుల్, ఈక్విటాస్, హీరో, బూస్ట్, హ్యుందాయ్ మోటార్స్, మాస్టర్కార్డ్, గార్నియర్, పీఎన్బీ మెట్లైఫ్ తదితర సంస్థల కోసం స్మృతి పని చేసింది. — మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, నేర్పించింది ఆమె! -
Cricketers Cute AI Photos: ముద్దు ముద్దుగా.. క్రికెటర్ల ఏఐ పిక్స్
-
ఆడింది 4 టీ20 లే.. ముంబై జట్టులో చోటు ఎలా..?
-
విరాట్ విజృభించేనా..ఆ జట్టుకే విజయావకాశాలు
-
Sports: తాను '700ల మైలు రాయిని' దాటిన వండర్సన్..!
41 సంవత్సరాల 7 నెలల 8 రోజులు.. ఈ వయసులో అంతర్జాతీయ క్రీడల్లో చాలా మంది రిటైర్మెంట్ తీసుకొని ఎక్కడో ఒక చోట కోచ్గానో లేక వ్యాఖ్యాతగానో పని చేస్తూ ఉంటారు. లేదంటే ఆటకు దూరంగా దానితో సంబంధం లేకుండా కుటుంబంతో సమయం గడుపుతూ ఉంటారు. కానీ జేమ్స్ అండర్సన్ ఇంకా క్రికెట్ మైదానంలో పరుగెడుతూ ఉన్నాడు. పట్టుదలగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థిని నిలువరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ పోరాటతత్త్వమే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఏకంగా 700 వికెట్ల మైలురాయిని అందుకునేలా చేసింది. 21 ఏళ్లుగా సాగుతున్న అంతర్జాతీయ కెరీర్ అతని స్థాయి ఏమిటో చూపిస్తే, అలసట లేకుండా సాగుతున్న ప్రయాణం ఎన్నో అద్భుత ప్రదర్శనలను ప్రపంచ క్రికెట్ అభిమానులకు అందించింది. సాధారణంగా బ్యాటర్లు ఎక్కువ సంవత్సరాలు ఆటలో కొనసాగడంలో విశేషం లేదు. గతంలోనూ చాలామంది ఇంతకంటే ఎక్కువ ఏళ్లు క్రికెట్ ఆడారు. కానీ ఎంతో కఠోర శ్రమతో కూడిన పేస్ బౌలింగ్లో అన్ని ప్రతికూలతలను, గాయాలను దాటి ఒక బౌలర్ ఇలా సత్తా చాటడం ఎంతో అరుదైన విషయం. 2002లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జిమ్మీ అండర్సన్ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ క్రికెట్ ఆల్టైమ్ గ్రేట్లలో ఒకడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. 187 టెస్టు మ్యాచ్లు.. జిమ్మీ అండర్సన్ కెరీర్ ఇది. ప్రపంచ క్రికెట్లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (200) మాత్రమే ఇంతకంటే ఎక్కువ టెస్టులు ఆడాడు. 16 ఏళ్లకే అరంగేట్రం చేసిన బ్యాటర్గా సచిన్తో పోలిస్తే 20 ఏళ్ల వయసులో తొలి టెస్టు ఆడిన అండర్సన్ కెరీర్ ప్రస్థానం పూర్తిగా భిన్నం. టి–20ల కాలంలో నాలుగు ఓవర్లు వేయగానే అలసిపోతున్న ఈతరం బౌలర్లతో పోటీ పడుతూ రోజుకు 15–20 వరకు అంతర్జాతీయ టెస్టుల్లో బౌలింగ్ చేయడం అసాధారణం. వీటికి 194 వన్డేలు అదనం. టెస్టులు, వన్డేలు కలిపి అతను దాదాపు 50 వేల బంతులు బౌలింగ్ చేశాడు. వన్డేలకు దాదాపు 9 ఏళ్ల క్రితమే వీడ్కోలు పలికినా టెస్టుల్లో ఇంకా అదే జోరును అండర్సన్ కొనసాగించి చూపిస్తున్నాడు. ఒకే ఒక లక్ష్యంతో.. జేమ్స్ అండర్సన్ క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడంలో ఎప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదు. అతను చిన్నప్పటినుంచే క్రికెట్ అంటే బాగా ఇష్టపడ్డాడు. చూడటంతో పాటు క్రికెట్ కోసమే పుట్టినట్లుగా ఆడేవాడు. అందుకే ఇంట్లోనూ ప్రోత్సాహం లభించింది. స్కూల్ క్రికెట్నుంచే అతను బౌలింగ్పై దృష్టి పెట్టాడు. సాధనతో ఆపై పూర్తి స్థాయి పేస్ బౌలర్గా సత్తా చాటాడు. దాంతో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. స్థానిక లాంక్షైర్ కౌంటీ మైనర్ లీగ్లలో అండర్సన్ సత్తా చాటాడు. దాంతో లాంక్షైర్ ప్రధాన కౌంటీ టీమ్ తరఫున ఆడేందుకు ఎంపికయ్యాడు. అండర్సన్ ఎంత మెరుగ్గా కౌంటీల్లో ప్రభావం చూపించాడంటే లాంక్షైర్ తరఫున కేవలం 3 వన్డేలు ఆడగానే అతనికి ఇంగ్లండ్ జాతీయ జట్టులో చోటు లభించడం విశేషం. తన జెర్సీపై కనీసం తన పేరు, నంబర్ కూడా లేకుండానే హడావిడిగా టీమ్తో కలిసిన అండర్సన్ అడిలైడ్లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన బౌలింగ్ను ప్రదర్శించాడు. దాంతో 2003 వరల్డ్ కప్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇలా మొదలైన ఆరంభం రెండు దశాబ్దాలుగా గొప్పగా సాగుతూనే ఉంది. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలతో.. అండర్సన్ కెరీర్ ఆరంభంలో రెండు పార్శా్వలతో సాగింది. చక్కటి బౌలింగ్తో లయతో సాగుతున్నప్పుడు అతనిలాంటి మంచి బౌలర్ ఎవరూ లేరన్నట్లుగా వికెట్ల వర్షం కురిసింది. కానీ ఒక్కసారి లయ కోల్పోతే అంత చెత్త బౌలర్ లేరన్నట్లుగా బ్యాటర్లు చితకబాదారు. లార్డ్స్ మైదానంలో తన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లోనే ఐదు వికెట్లతో తన రాకను ఘనంగా చాటడం, ఆ తర్వాత కొద్ది రోజులకే పాకిస్తాన్పై వన్డేల్లో హ్యట్రిక్ అతడికి తగిన గుర్తింపును తెచ్చి పెట్టాయి. కానీ అప్పటికే ఇంగ్లండ్ జట్టులో పలువురు సీనియర్లు పాతుకుపోయి ఉండటంతో తగినన్ని అవకాశాలు దక్కలేదు. దాంతో విరామాలతో వచ్చిన అవకాశాల్లో అండర్సన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే 2005 తర్వాత ఇంగ్లండ్ ప్రధాన పేసర్లంతా ఆటకు గుడ్బై చెప్పడంతో వచ్చిన అండర్సన్ ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వెలింగ్టన్లో న్యూజిలాండ్పై చెలరేగి ఐదు వికెట్ల ప్రదర్శనతో జట్టును గెలిపించడంతో టీమ్లో స్థానం సుస్థిరమైంది. సంప్రదాయ స్వింగ్, సీమ్ బౌలింగ్తో పాటు రివర్స్ స్వింగ్ విద్యలో కూడా ఆరితేరిన తర్వాత అండర్సన్ మరింత ప్రమాదకరంగా మారాడు. కెరీర్ ఆరంభంలో తన యాక్షన్ను మార్చుకొని కొంత ఇబ్బందిపడిన అతను కొద్ది రోజులకే మళ్లీ తన పాత్ సైడ్ ఆర్మ్ యాక్షన్కు వచ్చి అద్భుతాలు చేశాడు. ముఖ్యంగా 2010 తర్వాత అండర్సన్ తనను తాను అత్యుత్తమ పేసర్గా తీర్చి దిద్దుకున్నాడు. ఇంగ్లండ్లో హీరో లేదా జీరో అయ్యేందుకు ఎప్పుడూ అవకాశం ఉండే సిరీస్ యాషెస్. సొంత గడ్డపై పలుమార్లు ఆసీస్ బ్యాటర్ల పని పట్టిన అండర్సన్ కెరీర్లో 2010–11 ఆస్ట్రేలియా పర్యటన హైలైట్గా నిలిచింది. ఆసీస్ను వారి సొంతగడ్డపై 3–1తో చిత్తుగా ఓడించడంలో 24 వికెట్లతో అండర్సన్ ప్రధాన పాత్ర పోషించాడు. టెస్టు క్రికెట్పైనే పూర్తిగా దృష్టి పెట్టేందుకు 2015 వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు గుడ్బై చెప్పిన అండర్సన్ తాను అనుకున్నట్లుగా ఈ ఫార్మాట్లో మరిన్ని గొప్ప ప్రదర్శనలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా చెలరేగి.. అండర్సన్ సొంత మైదానాల్లో మాత్రమే రాణిస్తాడని, వాతావరణంలో కాస్త మంచు, తేమ ఉంటేనే స్వింగ్తో చెలరేగుతాడనేది అతనిపై పలు సందర్భాల్లో వచ్చిన విమర్శ. అయితే ఒక్కో ఏడాది ఆటలో రాటుదేలుతూ పోయిన తర్వాత ఇలాంటి విమర్శలకు అతను చెక్ పెట్టాడు. ఇంగ్లండ్లోని అన్ని వేదికలపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లో సహజంగానే అతని పేరు కనిపిస్తుంది. కానీ వీటికి తోడు శ్రీలంకలోని గాలేలో 6 వికెట్లు, కేప్టౌన్లో 5 వికెట్లు, అడిలైడ్లో 5 వికెట్లు, 2012లో నాగ్పూర్లో భారత్పై 4 కీలక వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్రదర్శన.. ఇలా విదేశీ గడ్డపై అండర్సన్ తీసిన వికెట్లు అతని ప్రభావాన్ని చూపించాయి. ఇక అరంగేట్ర టెస్టు నుంచి ఇప్పటి వరకు అతని ఆటలో సాగిన పురోగతి, వేర్వేరు ప్రత్యర్థులపై నమోదు చేసిన గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. మాస్టర్ ఆఫ్ స్వింగ్ నుంచి అతను మాస్టర్ ఆఫ్ ఆల్ కండిషన్స్గా మారాడు. 700 వికెట్లు ముగ్గురే సాధించగా వారిలో మురళీధరన్, వార్న్ స్పిన్నర్లు కాగా అండర్సన్ తొలి పేస్ బౌలర్. ఇతర జట్లతో పోలిస్తే ఇంగ్లండ్ ఎక్కువ టెస్టులు ఆడటం సహజంగానే అండర్సన్కు కలిసి వచ్చినా, అతను ఆటడం మాత్రమే కాకుండా అత్యున్నత ప్రమాణాలు కొనసాగించాడు. వయసు పెరుగుతున్న కొద్దీ విలువ పెరిగే వైన్లాగా అతను మారాడు. అతని వికెట్లను మూడు దశలుగా విడగొడితే; తొలి 44 టెస్టుల్లో సగటు 35 కాగా, తర్వాతి 47 టెస్టుల్లో అది 28కి తగ్గింది. ఇక 2014నుంచి ఆడిన 96 టెస్టుల్లో సగటు ఏకంగా 22.66కి తగ్గడం అంటే బౌలర్గా అతను ఎంత మెరుగయ్యాడో అర్థమవుతుంది. ముఖ్యంగా 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత అండర్సన్ ఏకంగా 220 వికెట్లు తీయడం విశేషం. స్వింగ్కు పెద్దగా అనుకూలించని ఉపఖండపు పిచ్లపై కూడా గత పదేళ్లలో అండర్సన్ 23.56 సగటును నమోదు చేయడం అతను ఎంత ప్రభావం చూపించాడో చెబుతుంది. మురళీధరన్ (800 వికెట్లు)ను చేరుకోవడం చాలా కష్టం కాబట్టి మరో 9 వికెట్లు తీసి షేన్వార్న్ (708)ను దాటడం అండర్సన్ తదుపరి లక్ష్యం. ఇంగ్లండ్ బోర్డు అతనిపై నమ్మకముంచితే, అతని ఘనతలను పరిగణనలోకి తీసుకొని వేటు వేయకుండా మరికొంత కాలం ఆడే అవకాశం కల్పిస్తే సచిన్ అత్యధిక టెస్టుల (200) రికార్డును అండర్సన్ అధిగమించగలడు. ఒకవేళ ఆ లోపే అతని ఆట ముగిసిపోయినా, వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడిగా అతను సాధించిన ఘనతల విలువ ఏమాత్రం తగ్గదు. — మొహమ్మద్ అబ్దుల్ హాది.