ప్రధాన వార్తలు
భువనేశ్వర్ అరుదైన రికార్డు.. తొలి పేసర్గా!
ఐపీఎల్ 2026 సీజన్లో సూపర్ ఫామ్ కనబరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ లక్నోతో మ్యాచ్లో అరుదైన రికార్డు సాధించాడు. లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్ భువనేశ్వర్కు 200వ మ్యాచ్ కావడం విశేషం. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి పేసర్గా భువనేశ్వర్ అరుదైన రికార్డు సాధించాడు. ఓవరాల్గా ఐపీఎల్లో 200 మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్ 12వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ 12 మంది భారత ఆటగాళ్లే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇక భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు 199 మ్యాచ్ల్లో 215 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ తరఫున 10 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో లీడింగ్లో ఉన్నాడు. 2011లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన భువనేశ్వర్ తొలుత పుణే వారియర్స్ (2011-2013 వరకు) 26 మ్యాచ్లు, ఎస్ఆర్హెచ్ (2014-2024 వరకు) 129 మ్యాచ్లు, ఆర్సీబీ (2025 నుంచి) 44 మ్యాచ్లు ఆడాడు.అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితా..మహేంద్ర సింగ్ ధోని: 278 మ్యాచ్లు (2008-2025)రోహిత్ శర్మ: 277 మ్యాచ్లు (2008-2026)విరాట్ కోహ్లీ: 276 మ్యాచ్లు (2008-2026)రవీంద్ర జడేజా: 264 మ్యాచ్లు (2008-2026)దినేష్ కార్తీక్: 257 మ్యాచ్లు (2008-2024)శిఖర్ ధావన్: 222 మ్యాచ్లు (2008-2024)రవిచంద్రన్ అశ్విన్: 221 మ్యాచ్లు (2009-2025)అజింక్య రహానే: 207 మ్యాచ్లు (2008-2026)సురేష్ రైనా: 205 మ్యాచ్లు (2008-2021)రాబిన్ ఊతప్ప: 205 మ్యాచ్లు (2008-2022)అంబటి రాయుడు: 204 మ్యాచ్లు (2010-2023)భువనేశ్వర్ కుమార్: 200 మ్యాచ్లు (2011-2026)చదవండి: దొరికిపోయిన చాహల్.. పంజాబ్ జట్టుకు శిక్ష తప్పదా?
IPL 2026: లక్నో వర్సెస్ ఆర్సీబీ అప్డేట్స్
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గురువారం ఏక్నా స్టేడియం వేదికగా 50వ మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తలపడుతున్నాయి. వరుణుడి అడ్డంకి ఆటకు వరుణుడు అడ్డంకి కలిగించాడు. 9 ఓవర్ల నాటికి లక్నో స్కోరు వికెట్ నష్టపోకుండా 95గా ఉంది. మిచెల్ మార్ష్ అర్థ సెంచరీ బాదాడు. మిచెల్ మార్ష్ 76, అర్షిన్ కులకర్ణి 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. దంచుతున్న మిచెల్ మార్ష్లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ దంచికొడుతున్నాడు. 5 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (46), అర్షిన్ కులకర్ణి (8) పరుగులతో క్రీజులో ఉన్నారు.4 ఓవర్లలో లక్నో 39/04 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (30), అర్షిన్ కులకర్ణి (8) పరుగులతో ఆడుతున్నారు.మ్యాచ్కు వర్షం అంతరాయంలక్నో, ఆర్సీబీ మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం పడే సమయానికి లక్నో 1.3 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా 12 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (7), అర్షిన్ కులకర్ణి (4) పరుగులతో ఆడుతున్నారు.టాస్ నెగ్గిన ఆర్సీబీటాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ జట్టు ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది. మరోవైపు లక్నో జట్టు మాత్రం మూడు మార్పులతో ఆడుతోంది. జోస్ ఇంగ్లిస్ స్థానంలో అర్షిల్ కులకర్ణి, మనిరమన్ స్థానంలో షాబాజ్ అహ్మద్, మోసిన్ ఖాన్ స్థానంలో దిగ్వేష్ రాఠీ జట్టులోకి వచ్చారు.ముఖాముఖి పోరులో ఇరజట్లు ఏడుసార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ ఐదు సార్లు, లక్నో రెండుసార్లు గెలుపొందాయి. ఏక్నా స్టేడియంలో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించడం విశేషం. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో లక్నో సూపర్ జె యింట్స్పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.తుది జట్లు:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్, జోష్ హేజిల్వుడ్.లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్.🚨 Toss 🚨@RCBTweets have won the toss and elected to bowl first against @LucknowIPL in Lucknow.Updates ▶️ https://t.co/W0eDq9aWb7#TATAIPL | #KhelBindaas | #LSGvRCB pic.twitter.com/Z5DSxyelwt— IndianPremierLeague (@IPL) May 7, 2026
దొరికిపోయిన చాహల్.. పంజాబ్ జట్టుకు శిక్ష తప్పదా?
టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ తన చర్యతో పంజాబ్ కింగ్స్ జట్టు మొత్తాన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ ప్రయాణం చేస్తున్న విమానంలో చాహల్..వేప్( ఈ-సిగరేట్) తాగిన వీడియో ఫుటేజీ బయటికి వచ్చింది. వీడియోలో చాహల్ వేప్ను పీల్చుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కు ముందు అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు విమాన ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ సహచర క్రికెటర్ అర్షదీప్ సింగ్ ఇన్స్టాగ్రామ్లో ఒక వ్లాగ్ గా దర్శనమిచ్చింది. అయితే అసలు వ్లాగ్లోని వీడియోలో చాలా ఫుటేజీని ఎడిట్ చేసి కుదించినట్లు ఇన్స్టా ఖాతాదారులు పేర్కొన్నారు. అసలు వీడియోలో చాహల్ ఒక్కడే కాకుండా అతడి పక్కన ఉన్న శశాంక్ సింగ్, ఇతర పంజాబ్ ప్లేయర్లు కూడా ఈ-సిగరేట్ తాగే అవకాశం లేకపోలేదని కామెంట్లు చేశారు. అయితే విమాన ప్రయాణంలో సిగరేట్ (ఈ-సిగరెట్ అయినా) తాగడం నిషేధం. సిగరేట్ పొగ వల్ల ప్రమాదం జరిగేందుకు ఆస్కారముంది. చాహల్ ప్రవర్తన విమాన భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తుంది. ఇప్పటికే ఈ సీజన్లోనే పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్రూమ్లో వేప్ను ఉపయోగిస్తూ పట్టుబడ్డాడు. దీనిపై పెద్ద వివాదం నెలకొంది. అయితే బీసీసీఐ మాత్రం పరాగ్ను మందలిస్తూ అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో సరిపెట్టింది. కానీ ఈసారి చాహల్ వేప్ ఉపయోగించినట్లు తేలితే మాత్రం అతడితో పాటు పంజాబ్ జట్టు మొత్తానికి శిక్ష పడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చాహల్తో పాటు పంజాబ్ జట్టు మొత్తం అదే విమానంలో ఉండడం గమనార్హం.చాహల్ చర్య నిజమని తేలితే ఐపీఎల్ నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే దీనిపై చాహల్ నుంచి కానీ, అటు పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యం కానీ ఇంకా స్పందించలేదు. అయితే ఈ వీడియో నకిలీదా లేక నిజమైనదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో అదరగొడుతోంది. తొలి అంచె పోటీల్లో ఒక్క మ్యాచ్లోనూ ఓడిన పంజాబ్ రెండో అంచె పోటీల్లో హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. బుధవారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 236 పరుగుల భారీ టార్గెట్ను ఛేదించే క్రమంలో పంజాబ్ చతికిలపడింది. ప్రస్తుతం పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. Look at Yuzvendra Chahal, man. He was risking everyone’s safety by vaping an e-cigarette inside the flight while Shashank Singh and other Punjab Kings players were around him. 👀This is totally unacceptable and highly risky for everyone. Such behavior violates flight safety… pic.twitter.com/YnXlPmPhjr— Sonu (@Cricket_live247) May 7, 2026చదవండి: కమిన్స్కు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ ఆఫర్!
కమిన్స్కు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ ఆఫర్!
ఆస్ట్రేలియా క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆస్ట్రేలియా వన్డే, టెస్టు కెప్టెన్గా ఉన్న కమిన్స్ను ప్రైవేటు లీగ్లు ఆడకుండా జట్టుతోనే ఎక్కువగా అట్టిపెట్టుకోవాలని భావిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా అతడికి మూడేళ్ల కాలానికి గాను 12 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 113 కోట్లు) అందించనుంది. ఈ మేరకు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తమ కథనంలో పేర్కొంది. ఈ ఆఫర్కు కమిన్స్ ఓకే చెబితే మాత్రం ఏడాదికి 4 మిలియన్ డాలర్ల చొప్పున అందుకోనున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఆడడం మానేసి గ్లోబల్ టీ20 లీగ్ల్లో తమకు ప్రాతినిధ్యం వహించేందుకు ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ కమిన్స్కు 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.62.22కోట్లు) ఆఫర్ ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం కమిన్స్ ఆడే మ్యాచ్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తం అందుతుంది. ప్రస్తుతం ప్రపం చవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్న ప్రైవేట్ టీ20 లీగ్ల (ముఖ్యంగా బిగ్బాష్, ఐపీఎల్, ఎంఎల్సీ) హవా పెరిగిపోవడంతో, టాప్ క్లాస్ ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరమయ్యే ప్రమాదం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా ఆందోళన చెందుతోంది.ముఖ్యంగా ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిపిన కమిన్స్ను ఇతర లీగ్ల వైపు వెళ్లకుండా, కేవలం జాతీయ జట్టు అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేలా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మెగా డీల్ను రూపొందించినట్లు తెలుస్తోంది.ఇదే విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ క్రికెట్ జేమ్స్ ఆల్సోప్ స్పందించారు. ‘కమిన్స్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను కాపాడుకోవడం మాకు అవసరం. మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20లు) ఆడే పాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్ వంటి స్టార్లకు ఇప్పుడు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే వారిని ఇతర క్రికెట్ లీగ్లవైపు ఆకర్షణకు గురవ్వకుండా ఆస్ట్రేలియా క్రికెట్కు కట్టుబడి ఉండేలా చూడటం మా ప్రధాన లక్ష్యం’ అని వివరించారు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లో పాట్ కమిన్స్ సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సీజన్కు లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కమిన్స్ తన విలువను చూపిస్తున్నాడు. సీజన్లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కమిన్స్ రెండు కీలక వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. పంజాబ్పై విజయంతో ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ టేబుల్ టాపర్గా నిలిచింది. చదవండి: ‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్ను శ్రేయస్ సాధిస్తాడు’
సన్రైజర్స్ను ఆపడం కష్టమే..!
ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసులో అన్ని జట్లకంటే ముందుకొచ్చింది. తాజాగా పంజాబ్ కింగ్స్ను ఓడించడంతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి దూసుకొచ్చింది. ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచినా, ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించిన సన్రైజర్స్.. సెకెండ్ బెస్ట్ రన్రేట్తో (0.737) 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. తదుపరి 3 మ్యాచ్ల్లో సన్రైజర్స్ ప్రత్యర్దులు గుజరాత్, సీఎస్కే, ఆర్సీబీ. ఈ మూడు మ్యాచ్లు మే 12, 18, 22 తేదీల్లో అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్ వేదికలుగా జరుగనున్నాయి.ఇదిలా ఉంటే, ఈ సీజన్లో సన్రైజర్స్ ప్రయాణం తొలుత అంత సాఫీగా సాగలేదు. మొదటి 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో ఓటమిపాలై, ఢీలాగా ఉండింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం ఈ జట్టుపై భారీ ప్రభావం చూపించింది. అయితే ఐదో మ్యాచ్ నుంచి తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ జట్టును గాడిలోకి తెచ్చాడు. వ్యక్తిగతంగా సత్తా చాటడంతో పాటు జట్టును విజయపథంలో నడిపించసాగాడు. ఇషాన్ సారథ్యంలో మొదటి 4 మ్యాచ్ల్లో మూడింట ఓడిన సన్రైజర్స్.. ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి గాడిలో పడింది.అయితే సన్రైజర్స్కు అసలు బ్రేక్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ తిరిగొచ్చిన తర్వాతే వచ్చింది. అప్పటిదాకా బౌలింగ్లో బలహీనంగా ఉండిన సన్రైజర్స్ కమిన్స్ రాకతో ఒక్కసారిగా బలపడినట్లైంది. కమిన్స్ వ్యక్తిగతంగా సత్తా చాటుతూ యువ బౌలర్లకు మార్గదర్శంగా నిలిచాడు. అప్పటికే సత్తా చాటుతున్న ఎషాన్ మలింగ కమిన్స్ సలహాలతో మరింత రెచ్చిపోసాగాడు. దేశీయ యువ పేసర్లు సాకిబ్ హుసేన్, ఫ్రఫుల్ హింగే కమిన్స్ మార్గదర్శకత్వంలో రాటుదేలారు. ఆల్రౌండర్ నితీశ్కుమార్ సైతం కమిన్స్ రాకతో సత్తా చాటడం ప్రారంభించాడు. ఈ ఐదురుగు నిలకడగా రాణిస్తుండటంతో సన్రైజర్స్ ప్రస్తుత ఎడిషన్లో అత్యంత ప్రమాదకర పేస్ బౌలింగ్ యూనిట్గా మారిపోయింది. వీరికి స్పిన్నర్ శివాంగ్ కుమార్ కూడా జతకలవడంతో సన్రైజర్స్ అత్యంత పటిష్టమైన బౌలింగ్ విభాగంగా తయారైంది.సీజన్ ప్రారంభంలో బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా ఉన్నా, బౌలింగ్ విభాగం సరిగ్గా లేకపోవడం వల్లనే సన్రైజర్స్ అపజయాలు ఎదుర్కొంది. ఇప్పుడు బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా మారడంతో సన్రైజర్స్ తిరుగులేని జట్టుగా మారిపోయింది. కమిన్స్ వచ్చాక సన్రైజర్స్ నాలుగింట మూడు విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్ రేసులో అందరికంటే ముందుకొచ్చింది.ఆరెంజ్ ఆర్మీ ఇదే జోరును కొనసాగిస్తే మరో టైటిల్ ఖాయం. మొత్తంగా కమిన్స్ రాక సన్రైజర్స్లో కాకను మరింత పెంచింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలబెట్టింది. జట్టులో అందరూ గెలుపు కోసం తమవంతు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్లో టాపార్డర్ అంతా నిలకడగా రాణిస్తున్నారు. ప్రస్తుతం టాప్-4 లీడింగ్ రన్ స్కోరర్లలో ముగ్గురు (క్లాసెన్, అభిషేక్, ఇషాన్) సన్రైజర్సే ఉన్నారు. ఈ ముగ్గురు ప్రత్యర్ది బౌలర్ల పాలిట సింహస్వప్నాల్లా మారారు. బౌలింగ్లో ఎషాన్ మలింగ చెలరేగిపోతున్నారు. ఇతనికి కమిన్స్ జతకలిశాడు. కమిన్స్ కెప్టెన్గానే కాకుండా వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. నిన్నటి పంజాబ్ మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా రెండు కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. సన్రైజర్స్ శిబిరంలో మరో అన్ సంగ్ హీరో కూడా ఉన్నాడు. అతడే నితీశ్ కుమార్ రెడ్డి. నితీశ్ ఈ సీజన్లో చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.సీజన్ ప్రారంభంలో దారుణంగా విఫలమైన ట్రవిస్ హెడ్ కీలక దశలో ఫామ్లోకి రావడం సన్రైజర్స్కు అదనంగా కలిసొస్తున్న అంశం. హెడ్ గత మూడు మ్యాచ్ల్లో తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఇలా ఒకరు కాకపోతే ఒకరు బాధ్యతలను భుజాన వేసుకుంటుండంతో సన్రైజర్స్ తిరుగులేని జట్టుగా మారిపోయింది. ఇది కొనసాగితే ఆ జట్టుకు మరో టైటిల్ ఖాయం.
దేవజిత్ సైకియా ఆకస్మిక రాజీనామా
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.అసోం ముఖ్యమంత్రి హేమంత బిస్వ శర్మ ప్రభుత్వంలో దాదాపు ఐదేళ్ల పాటు అడ్వకేట్ జనరల్గా సేవలందించిన దేవజిత్ సైకియా.. రాజ్యాంగ సంప్రదాయాలను గౌరవిస్తూ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.క్రికెట్తో పాటు న్యాయరంగంలోనూ సైకియా ప్రత్యేక గుర్తింపు పొందారు. అసోంకు చెందిన ఆయన గతంలో రాష్ట్ర రంజీ జట్టుకు వికెట్కీపర్, మిడిలార్డర్ బ్యాటర్గా సేవలందించారు. అనంతరం న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టి గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2021లో అసోం రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు.ఇక క్రికెట్ పరిపాలనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అసోం క్రికెట్ అసోసియేషన్లో వివిధ హోదాల్లో పని చేసి.. 2022లో బీసీసీఐ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అనంతరం జై షా ఐసీసీ చైర్మన్గా వెళ్లిన తర్వాత బీసీసీఐ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు.
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
సన్రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో నిన్న (మే 6) జరిగిన మ్యాచ్లో 13 బంతుల్లో 4 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 35 పరుగులు చేసి బీభత్సం సృష్టించిన అతను.. విండీస్ విధ్వంసకర యోధుడు క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.ఓపెనర్గా ఐపీఎల్లో 200కు పైగా స్ట్రైక్రేట్తో అత్యధిక సార్లు 30+ స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు అతడు 14 సార్లు ఈ ఫీట్ను సాధించి గేల్ (13) రికార్డును అధిగమించాడు. నిన్నటి మ్యాచ్లో అభిషేక్ స్ట్రైక్రేట్ ఏకంగా 269.23గా ఉండింది. గత సీజన్ నుంచి అభిషేక్ ప్రత్యర్ది బౌలర్లను షేక్ చేస్తున్నాడు. భయంలేని బ్యాటింగ్తో మెరుపు ఆరంభాలు అందిస్తూ.. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు భారీ సిక్సర్లతో విరుచుకుపడుతూ బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు. పవర్ప్లేలోనే మ్యాచ్ గమనాన్ని మార్చేస్తూ.. ప్రత్యర్దులను పోరాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు.ఈ సీజన్లో అభిషేక్ విధ్వంసం పతాకస్థాయిలో ఉంది. 11 మ్యాచ్ల్లో అతడు 210.18 స్ట్రైక్రేట్తో 475 పరుగులు చేశాడు. ఇందులో 36 సిక్సర్లు, 43 బౌండరీలు, ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు ఉన్నాయి. అభిషేక్ దూకుడు కారణంగా హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలిచింది. నిన్న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ మెరుపు ఆరంభం ఇవ్వడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. అనంతరం బౌలర్లు సత్తా చాటడంతో లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ గెలుపుతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2027 సిరీస్ షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత్లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. వచ్చే ఏడాది జనవరి 21న తొలి టెస్ట్ ఆడనుంది. ఈ మ్యాచ్ నాగ్పూర్ వేదికగా జరుగనుంది.అనంతరం జనవరి 29 నుండి చెన్నై వేదికగా రెండో టెస్ట్.. ఫిబ్రవరి 11 నుండి గౌహతి వేదికగా మూడో టెస్ట్.. ఫిబ్రవరి 19 నుండి రాంచీ వేదికగా నాలుగో టెస్ట్.. ఫిబ్రవరి 27 నుండి అహ్మదాబాద్ వేదికగా ఐదో టెస్ట్ ఆడనుంది.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2027 తేదీల ప్రకటనతో పాటు భారత పర్యటనలోని మరిన్ని సిరీస్ల వివరాలను కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. బీజీటీ 2027కు ముందు ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత ఏ జట్టుతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది.అలాగే ఆస్ట్రేలియా మహిళల ఏ జట్టు, పురుషుల అండర్-19 జట్టు కూడా సంబంధిత జట్లతో మల్టీ ఫార్మాట్ సిరీస్లు ఆడనుంది. ఈ సిరీస్లకు సంబంధించిన షెడ్యూల్ ఇలా ఉంది.ఆస్ట్రేలియా-ఏతో సిరీస్సెప్టెంబర్ 22- తొలి మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)సెప్టెంబర్ 29- రెండో మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)అక్టోబర్ 6- తొలి వన్డే (పుదుచ్చేరి)అక్టోబర్ 9- రెండో వన్డే (పుదుచ్చేరి)అక్టోబర్ 11- మూడో వన్డే (పుదుచ్చేరి)అండర్-19 జట్టుతో సిరీస్భారత అండర్-19 జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్లు ఆడనుంది.సెప్టెంబర్ 18- తొలి వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 23- మూడో వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 27- తొలి మల్టీ డే మ్యాచ్ (రాజ్కోట్)అక్టోబర్ 5- రెండో మల్టీ డే మ్యాచ్ (అహ్మదాబాద్)మహిళల ఏ జట్టుతో సిరీస్ఆస్ట్రేలియా జట్టుతో భారత మహిళల ఏ జట్టు సెప్టెంబర్లో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఇందులో 3 టీ20లు (సెప్టెంబర్ 12, 15, 17-మొహాలి), 3 వన్డేలు (20, 23, 25- ధర్మశాల), ఓ మల్టీ డే మ్యాచ్ (29- ధర్మశాల) జరుగనున్నాయి.
మళ్లీ యాక్షన్లోకి కేన్ మామ
ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్లతో త్వరలో జరుగబోయే టెస్ట్ సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టును నిన్న (మే 6) ప్రకటించారు. ఈ జట్లకు కెప్టెన్గా టామ్ లాథమ్ నియమితుడు కాగా.. గాయాల నుంచి కోలుకున్న ఫాస్ట్ బౌలర్లు కైల్ జేమీసన్, విలియమ్ ఓ రూర్కీ, వెటరన్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ జట్టులోకి తిరిగి వచ్చారు.రెండేళ్ల తర్వాత అవకాశం2024 ఫిబ్రవరిలో వెన్నెముక గాయం కారణంగా టెస్టులకు దూరమైన కైల్ జేమీసన్ ఇప్పుడు మళ్లీ జట్టులోకి వచ్చాడు. 19 టెస్టుల్లో 80 వికెట్లు తీసి అద్భుత రికార్డు కలిగిన జేమీసన్పై న్యూజిలాండ్ జట్టుకు భారీ అంచనాలు ఉన్నాయి.24 ఏళ్ల రూర్కీ సైతం గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చాడు. అతడు ఇప్పటికే 11 టెస్టుల్లో 39 వికెట్లు సాధించి మంచి జోరుమీదున్నాడు. స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఇటీవలికాలంలో తరుచూ గాయాల బారిన పడుతూ జట్టులోకి వచ్చీ పోతున్నాడు. రాబోయే సిరీస్ల్లో కేన్ కూడా న్యూజిలాండ్కు కీలకం కానున్నాడు.బలమైన పేస్ దళంఐర్లాండ్, ఇంగ్లండ్తో సిరీస్ల కోసం న్యూజిలాండ్ భారీ పేస్ దళాన్ని ఎంపిక చేసింది. జట్టులో మ్యాట్ హెన్రీ, జకరీ ఫౌల్క్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్ లాంటి భయంకరమైన పేసర్లు ఉన్నారు.తొలి పిలుపుసెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఆల్రౌండర్ డీన్ ఫాక్స్క్రాఫ్ట్కు తొలిసారి టెస్టు జట్టులో అవకాశం లభించింది. డీన్.. దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.కీలక గైర్హాజరీలు- జేకబ్ డఫీ తన తొలి బిడ్డ జననం కారణంగా ఎంపికకు అందుబాటులో లేడు.- మైఖేల్ బ్రేస్వెల్ టెస్టు క్రికెట్కు తాత్కాలికంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.- మిచెల్ సాంట్నర్ భుజ గాయం నుంచి కోలుకుంటున్నాడు.కాగా, న్యూజిలాండ్ జట్టు ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఐర్లాండ్.. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐర్లాండ్తో మ్యాచ్ బెల్ఫాస్ట్ వేదికగా మే 27న మొదలు కానుండగా.. ఇంగ్లండ్తో మూడు టెస్ట్లు లార్డ్స్, కెన్నింగ్టన్ ఓవల్, ట్రెంట్బ్రిడ్జ్ వేదికలుగా జూన్ 4, 17, 25 తేదీలోల ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్, ఈ రెండు సిరీస్లను కీలకంగా భావిస్తోంది. ముందున్న భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్ సిరీస్లను దృష్టిలో పెట్టుకుని బలమైన జట్టును సిద్ధం చేసుకుంటుంది.ఐర్లాండ్ టెస్ట్ కోసం న్యూజిలాండ్ జట్టు:టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), క్రిస్టియన్ క్లార్క్, డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ రే, రాచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు:టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్*, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, కేన్ విలియమ్సన్ఇంగ్లాండ్ పర్యటనకు ట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్
టీమిండియా చారిత్రక సిరీస్ షెడ్యూల్ విడుదల
వివిధ విభాగాల్లో భారత క్రికెట్ జట్ల ద్వైపాక్షిక సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ నిన్న (మే 6) విడుదల చేసింది. పురుషులు, మహిళలు, ఏ-జట్లు, అండర్-19 జట్ల మ్యాచ్లకు వేదికలు, తేదీలను ఖరారు చేసింది. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ బిజీ షెడ్యూల్లోకి వెళ్లనుంది. ముఖ్యంగా భారత్-ఏ, మహిళల సీనియర్ టీమ్, అండర్-19 జట్లు వరుస సిరీస్లలో పాల్గొననున్నాయి.ఆస్ట్రేలియా-ఏతో సిరీస్ఆస్ట్రేలియా-ఏ జట్టు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్-ఏ జట్టుతో రెండు మల్టీ డే మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడనుంది.సెప్టెంబర్ 22- తొలి మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)సెప్టెంబర్ 29- రెండో మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)అక్టోబర్ 6- తొలి వన్డే (పుదుచ్చేరి)అక్టోబర్ 9- రెండో వన్డే (పుదుచ్చేరి)అక్టోబర్ 11- మూడో వన్డే (పుదుచ్చేరి)అండర్-19 జట్టుకు ఆస్ట్రేలియా సవాల్భారత అండర్-19 జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్లు ఆడనుంది.సెప్టెంబర్ 18- తొలి వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 23- మూడో వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 27- తొలి మల్టీ డే మ్యాచ్ (రాజ్కోట్)అక్టోబర్ 5- రెండో మల్టీ డే మ్యాచ్ (అహ్మదాబాద్)చారిత్రక సిరీస్భారత్.. జింబాబ్వే మహిళల జట్టుకు తొలిసారి ఓ ద్వైపాక్షిక సిరీస్ కోసం ఆతిథ్యమివ్వనుంది. టీ20, వన్డే ఫార్మాట్లలో జరిగే ఈ సిరీస్ అక్టోబర్లో జరుగనుంది. ఈ సిరీస్లో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డేలు జరుగనున్నాయి. టీ20లకు రాయ్పూర్, వన్డేలకు బరోడా ఆతిథ్యమివ్వనుంది.అక్టోబర్ 16- తొలి టీ20అక్టోబర్ 18- రెండో టీ20అక్టోబర్ 20- మూడో టీ20అక్టోబర్ 23- తొలి వన్డేఅక్టోబర్ 25- రెండో వన్డేఅక్టోబర్ 28- మూడో వన్డేమహిళల ఏ జట్టు vs ఆస్ట్రేలియాఆస్ట్రేలియా జట్టుతో భారత మహిళల ఏ జట్టు సెప్టెంబర్లో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఇందులో 3 టీ20లు (సెప్టెంబర్ 12, 15, 17-మొహాలి), 3 వన్డేలు (20, 23, 25- ధర్మశాల), ఓ మల్టీ డే మ్యాచ్ (29- ధర్మశాల) జరుగనున్నాయి.మహిళల ఏ జట్టు vs ఇంగ్లండ్ఇంగ్లండ్ జట్టుతో భారత మహిళల ఏ జట్టు నవంబర్-డిసెంబర్లో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఇందులో 3 టీ20లు (నవంబర్ 30, డిసెంబర్ 3, 5- పూణే), 3 వన్డేలు (డిసెంబర్ 8, 11, 14- నవీ ముంబై), ఓ మల్టీ డే మ్యాచ్ (డిసెంబర్ 19- నవీ ముంబై) జరుగనున్నాయి.మహిళల అండర్-19 జట్టు vs శ్రీలంకశ్రీలంక అండర్-19 జట్టు జూన్లో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో 3 టీ20లు (జూన్ 22, 24, 27- చెన్నై), 3 వన్డేలు (జూన్ 30, జులై 3, 6- పుదుచ్చేరి) జరుగనున్నాయి.మహిళల అండర్-19 జట్టు vs ఇంగ్లండ్ఇంగ్లండ్ అండర్-19 జట్టు నవంబర్-డిసెంబర్లో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో 5 టీ20లు (నవంబర్ 26, 28 (బరోడా), డిసెంబర్ 1, 3, 6 (సూరత్)) జరుగనున్నాయి.
చైనాదే థామస్ కప్ టైటిల్
హోర్సెన్స్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్ క...
చరిత్ర సృష్టించాడు!
మాడ్రిడ్: పురుషుల టెన్నిస్లో ప్రపంచ నంబర్వన్ య...
చైనాకు కొరియా షాక్
హోర్సెన్స్ (డెన్మార్క్): నాలుగేళ్ల విరామం తర్వా...
కాంస్యంతో సరి.. సెమీస్లో భారత్ పరాజయం!
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ థామస్ కప్ బ్యాడ్మింట...
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
సన్రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర...
మళ్లీ యాక్షన్లోకి కేన్ మామ
ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్లతో త్వరలో జరుగబోయే టెస్ట్...
టీమిండియా చారిత్రక సిరీస్ షెడ్యూల్ విడుదల
వివిధ విభాగాల్లో భారత క్రికెట్ జట్ల ద్వైపాక్షిక స...
క్రీడలు
SRH vs PBKS : ఉప్పల్లో ఫుల్ జోష్.. తారల సందడి (ఫొటోలు)
మళ్లీ విజయం వేటలో..ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్..సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్డే విషెస్ (ఫోటోలు)
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
వీడియోలు
ఉప్పల్లో దుమ్మురేపిన SRH
19 ఏళ్లలో ఒకే ఒక్కడు చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్..
వాడికి 50 కోట్లు ఇస్తే వంటిచెతొ గెలిపిస్తాడు, పంత్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫాన్స్
సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్
భయం పుట్టిస్తున్న వైభవ్ బ్యాటింగ్..
IPLలో నేడు డబుల్ ధమాకా
వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
IPL గేమ్ ఛేజింగ్ రూల్, IPL 2026లో 200+ పరుగుల వరద
వైభవ్ బ్యాటింగ్ పై గర్ల్ ఫ్రెండ్ ప్రశంసలు.. మొహం మాడ్చుకున్న అర్షదీప్
అంపైర్ తో కోహ్లి ఫైట్.. రెండు మ్యాచ్ లు నిషేధం!
