division
-
వేదాంత విభజనకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: షేర్హోల్డర్లు, రుణదాతలు ఆమోదముద్ర వేయడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ విభజనకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో వ్యాపారాలను అల్యూమినియం, ఆయిల్ తదితర రంగాలవారీగా అయిదు కంపెనీలుగా విడదీస్తారు. డీమెర్జర్ స్కీము ప్రకారం వేదాంత షేర్హోల్డర్లకు ఒక్కో షేరుకు గాను కొత్తగా ఏర్పడే నాలుగు సంస్థలకు సంబంధించి అదనంగా ఒక్కొక్క షేరు చొప్పున లభిస్తుంది. కార్యకలాపాలను క్రమబదీ్ధకరించుకునేందుకు, వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ డీమెర్జర్ ఉపయోగపడుతుందని వేదాంత వెల్లడించింది. అలాగే, ఒక్కో స్వతంత్ర కంపెనీ వేర్వేరుగా ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సమకూర్చుకునేందుకు, వ్యూహాత్మక భాగస్వాములతో జట్టు కట్టేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొంది. అయిదు కంపెనీలుగా విడదీసే ప్రణాళికకు 99.99 శాతం మంది షేర్హోల్డర్లు, 99.59 శాతం మంది సెక్యూర్డ్ రుణదాతలు, 99.95 శాతం మంది అన్సెక్యూర్డ్ రుణదాతలు ఆమోదం తెలిపినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. గురువారం బీఎస్ఈలో వేదాంత షేర్లు దాదాపు 2.40 శాతం పెరిగి రూ. 433.55 వద్ద క్లోజయ్యాయి. ఇంట్రాడేలో సుమారు 3 శాతం పెరిగి రూ. 435.50 స్థాయిని తాకాయి. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ రూ. 3,969 కోట్లు పెరిగి రూ. 1,69,535 కోట్లకు చేరింది.ఇవీ కంపెనీలు.. విడదీత అనంతరం వేదాంత లిమిటెడ్ ప్రధానంగా వెండి, జింకు మొదలైన మెటల్స్ ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మిగతా కంపెనీల జాబితాలో వేదాంత అల్యూమినియం, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత పవర్, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ ఉంటాయి. టెక్నాలజీ విభాగాలతో పాటు కొత్త వ్యాపారాలకూ వేదాంత ఇన్క్యుబేటరుగా వ్యవహరిస్తుంది. -
రాష్ట్ర విభజనకు వ్యతిరేకం: బెంగాల్ అసెంబ్లీ తీర్మానం
కలకత్తా: రాష్ట్ర విభజన కోసం జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా వ్యతిరేకిస్తున్నట్లు వెస్ట్బెంగాల్ అసెంబ్లీ సోమవారం(ఆగస్టు5) ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ‘మేం కో ఆపరేటివ్ ఫెడరలిజాన్ని నమ్ముతున్నాం. బెంగాల్ విభజనకు జరిగే ఎలాంటి ప్రయత్నాన్నైనా వ్యతిరేకిస్తాం’అని సీఎం మమతాబెనర్జీ అన్నారు. ఈ తీర్మానానికి అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కూడా మద్దతిచ్చారు. తాము కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఉత్తర వెస్ట్బెంగాల్ను విభజించి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి ప్రతిపక్ష బీజేపీ మద్దతివ్వడంతో మూజువాణి ఓటుతో తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం లభించింది. -
రైలులో వదంతులు.. కిందకు దూకి ప్రాణాలు కోల్పోయిన నలుగురు
వదంతులు.. ఎంతటివారినైనా ఒకింత ఆలోచింపజేస్తాయి. అదే ప్రమాదానికి సంబంధించిన వదంతులైతే దాని పరిణాలమాలు ఊహించని విధంగా ఉంటాయి. జార్ఖండ్లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకోగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారుజార్ఖండ్లోని లాతేహార్లో రాంచీ-ససారం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నదంటూ వదంతులు వ్యాపించడంతో ఆ రైలులోని పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. ఈ సమయంలో ప్రయాణికులు అటుగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొన్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది అంబులెన్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ససారం-రాంచీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కుమాండిహ్ స్టేషన్ సమీపానికి వచ్చిన సమయంలో ఒక ప్రయాణీకుడు రైలుకు నిప్పుంటుకున్నదంటూ నానా హంగామా చేశాడు. దీంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే కొందరు ప్రయాణికులు రైలు నుంచి కిందుకు దూకేశారు. ఈ సమయంలో ఎదురుగా ఒక గూడ్స్ రైలు వస్తోంది. దానిని ఢీకొన్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం.విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం నేపధ్యంలో స్టేషన్లో ఉన్న ప్రయాణికుల్లోనూ ఆందోళన నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హిందుస్తాన్ జింక్ విభజనకు కేంద్రం నో...
న్యూఢిల్లీ: ప్రమోటర్ గ్రూప్.. వేదాంతా ప్రతిపాదిత హిందుస్తాన్ జింక్ కంపెనీ విభజనకు గనుల శాఖ నో చెప్పింది. హిందుస్తాన్ జింక్ను రెండు విభిన్న సంస్థలుగా విడదీసేందుకు వేదాంతా గ్రూప్ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు మైన్స్ సెక్రటరీ వీఎల్ కాంతారావు తాజాగా వెల్లడించారు. వాటాదారుగా కంపెనీ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యంగా లేదని తెలియజేశారు. వెరసి విభజన ప్రతిపాదనను అంగీకరించలేదని స్పష్టం చేశారు. కంపెనీలో ప్రభుత్వం 29.54 శాతం వాటాతో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను పెంచుకునే బాటలో జింక్, సిల్వర్సహా బిజినెస్లను రెండు ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసేందుకు హిందుస్తాన్ జింక్ ఇంతక్రితం ప్రతిపాదించింది. కాగా.. బిజినెస్ల విభజనకు సలహాదారు సంస్థను నియమించుకునే యోచనలో ఉన్నట్లు గతంలో హిందుస్తాన్ జింక్ ప్రకటించింది. కంపెనీ విలువను మెరుగుపరచేందుకు కార్పొరేట్ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. జింక్, లెడ్, సిల్వర్, రీసైక్లింగ్ బిజినెస్లను రెండు చట్టబద్ధ కంపెనీలుగా ఏర్పాటు చేయనున్నట్లు ఇంతక్రితం నియంత్రణ సంస్థలకు తెలియజేసింది. -
ఏపి భవన్ విభజన: ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనకు సంబంధించి ఎట్టకేలకు పీటముడి వీడింది. ఏపీ భవన్ విభజన అంశం పరిష్కారం అయ్యిందని తాజాగా హోం శాఖ అధికారంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్షన్- జీకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్కు మొత్తం 11.536 ఎకరాలు కేటాయించారు. ఏపీకి 5.781 ఎకరాలు ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్లో 2.396 ఎకరాలు కేటాయింపుకు సంబంధించిన కేంద్రం ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణకు 8.245ఎకరాలు కేటాయించారు. తెలంగాణకు శబరి బ్లాక్లో 3.00 ఎకరాలు, పటౌడి హౌస్లో 5.245 ఎకరాలను కేటాయించినట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపి భవన్ విభజన: ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ-ఇక్కడ క్లిక్ చేయండి -
మార్కుల డివిజన్ ప్రకటించం
సాక్షి, న్యూఢిల్లీ: 10, 12 తరగతుల మార్కుల ఫలితాల్లో ఇకపై డివిజన్, డిస్టింక్షన్ను ప్రకటించబోమని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పేర్కొంది. మెరిట్ లిస్టును ప్రకటించే విధానానికి గతంలోనే స్వస్తి చెప్పిన బోర్డు తాజాగా డివిజన్, డిస్టింక్షన్పై నిర్ణయాన్ని వెలువరించింది. ఈమేరకు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ భరద్వాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కుల శాతాన్ని లెక్కించడం, ప్రకటించడం వంటివి బోర్డు ఇకపై చేయదని స్పష్టం చేశారు. ఉన్నత చదువులకు మార్కుల శాతం అవసరమనిపిస్తే సదరు సంస్థ వాటిని గణించుకోవచ్చని వివరించింది. ఒకవేళ విద్యార్థి అయిదుకు మించి సబ్జెక్టులను ఎంచుకున్నట్లయితే..వాటిలో అయిదు ఉత్తమ సబ్జెక్టులను గుర్తించడంపై సంబంధిత ఉన్నత విద్యా సంస్థ లేదా యజమాని నిర్ణయం తీసుకోవచ్చని భరద్వాజ్ తెలిపారు. 10, 12వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు 2024 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలవుతాయని తెలిపారు. -
భవిష్యత్తు విభజనలపై మార్గదర్శకాలకే పరిమితం
సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్తులో రాష్ట్రాల విభజనకు సంబంధించి మార్గదర్శకాలు మాత్రమే ఇవ్వగలమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పరమైన అంశాల్లో తాము ఎందు కు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించింది. ఏపీ విభజనకు సంబంధించి దాఖలైన పిటిషన్లలో రాజ్యాంగ పరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని పేర్కొంది. ఒకట్రెండు అంశాలు రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణలో ఉన్నాయని గుర్తుచేసిన ధర్మాసనం.. ఆ అంశాలు ముందుగా తేలాల్సి ఉందని వ్యాఖ్యానించింది. విభజన జరిగి తొమ్మిదేళ్లు పూర్తయిందని, పిటిషన్లకు సంబంధించి ఇంకేం మనుగడలో ఉందని ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి దాఖలైన 26 పిటిషన్లను జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ అరవిందకుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. తెలంగాణకు చెందిన పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలపడం సరికాదని, విభజన హామీలు అమలు చేయాలని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుల తరఫు సీనియర్ న్యాయవాది నిరూప్రెడ్డి, న్యాయవాది శ్రావణ్కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 1953, 1956ల్లో జరిగిన విభజన శాస్త్రీయంగా జరిగిందని, కానీ 2014లో జరిగిన ఏపీ విభజన అశాస్త్రీయంగా జరిగిందని చెప్పారు. అనంతరం మరో పిటిషనర్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వాదనలు వినిపించారు. నిబంధనలు పాటించకుండానే విభజన: పార్లమెంటులో తగిన నిబంధనలు పాటించకుండానే విభజన ప్రక్రియ పూర్తి చేశారని ఉండవల్లి పేర్కొన్నారు. ఆర్టికల్ 100 ప్రకారం విభజన జరగలేదని, దీని ప్రకారం ప్రొసిడ్యూర్ ఫాలో కాలేదని, హెడ్ కౌంట్ చేయలేదని, వోటింగ్ పెట్టలేదని, కనీసం సభ్యులు ఎస్ లేదా నో చెప్పలేదని తెలిపారు. ఎంపీ అయినా తనను బయటకు పంపారని, విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగిందనడానికి తానే ప్రత్యక్ష సాక్షినని అరుణ్కుమార్ తెలిపారు. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పార్లమెంటు పరిగణించాలా లేదా అనేది తేలాల్సి ఉందన్నారు. ఈ మేరకు రాష్ట్రపతికి పంపిన విజ్ఞప్తిపై ఎలాంటి నిర్ణయం లేదన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకోని రాజకీయ పరమైన అంశంలో తాము ఎందుకు జోక్యం చేసుకోవాలంటూ ప్రశ్నించింది. కాగా తొలుత దాఖలు చేసిన పిటిషన్లో తమ అభ్యర్థన మార్చుకున్నామని అరుణ్కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. విభజన తర్వాత నష్టపోయిన ఏపీకి కేంద్రం సాయం అవసరముందన్నారు. దీంతో రాజ్యాంగ ధర్మాసనం వద్ద పెండింగ్లో ఉన్న ఆయా అంశాలు తేలిన తర్వాతే తాము నిర్ణయం తీసుకోగలమని పిటిషనర్లకు ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. -
చిన్న మార్పు.. ఆ రైల్వేకు అధిక ఆదాయం తెచ్చిపెడుతోంది..
సెంట్రల్ రైల్వే పరిధిలోని ఓ రైల్వే డివిజన్ చేసిన మార్పు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. వివిధ మార్గాల్లో ఆదాయ పెంపుపై దృష్టి పెట్టిన సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్ తమ పరిధిలోని ప్రకటన హోర్డింగ్లను డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చడం ప్రారంభించింది. మొత్తం ఏడు హోర్డింగ్లను ఎల్ఈడీ డిస్ప్లే, డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చింది. దీంతో వార్షిక లైసెన్సు ఫీజులు గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చిన ఈ హోర్డింగ్ల ద్వారా సంవత్సరానికి రూ.1.53 కోట్ల అదనపు ఆదాయం ముంబై రైల్వే డివిజన్కు వచ్చింది. కుర్లా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ తూర్పు వైపు, సియోన్ ఆర్ఓబీ (రెండు బోర్డులు), కంజుర్మార్గ్ రోడ్ ఆర్ఓబీ, తిలక్ నగర్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్, సుమన్ నగర్ ఆర్యూబీ గాంట్రీ సైట్ సీ, థానే-కోప్రి ఆర్ఓబీ వద్ద ఈ డిజిటల్ ప్రకటన బోర్డులు ఉన్నాయి. ప్రకటనదారులు సాధారణ లైసెన్స్ రుసుము కంటే 1.5 రెట్లు అధికంగా చెల్లించి ఇప్పటికే ఉన్న స్టాటిక్ హోర్డింగ్లను ఆకర్షణీయమైన డిజిటల్ డిస్ప్లే బోర్డులుగా మార్చుకోవచ్చు. కాగా మరో నాలుగు హోర్డింగ్లను డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చే ప్రక్రియలో ముంబై రైల్వే డివిజన్ ఉంది. -
ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ గురువారం కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంశాఖ కేంద్ర రాష్ట్రాల విభాగం జాయింట్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ జిందాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు ఆదిత్యనాథ్ దాస్, ప్రేమ చంద్రారెడ్డి, రావత్, హిమాన్షు కౌశిక్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు. ఏపీ భవన్ విభజనపై అధికారులు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా తొమ్మిదేళ్లుగా ఒకే బిల్డింగ్లో ఏపీ, తెలంగాణ భవన్లు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ఏపీ భవన్ను విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు పంచుకున్నాయి. తాత్కాలికంగా 58 : 42 నిష్పత్తి పద్ధతిలో గదుల విభజన, నిర్వహణ సాగుతోంది. చదవండి: గుండెపోటుతో మంత్రి మృతి.. సీఎం దిగ్భ్రాంతి.. అయితే ఢిల్లీ ఇండియా గేట్ పక్కన 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఏపీ భవన్.. ఏడు వేల కోట్ల రూపాయల ఉమ్మడి ఆస్తి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ 20 ఎకరాల్లో ఏపీ వాటాగా 58 శాతం అంటే 11 ఎకరాలకు పైగా దక్కుతుంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించట్లేదు. అయితే నేటీ సమావేశంలో ఏం తేలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చదవండి: Video: కర్ణాటక ఎన్నికలు.. హోటల్లో దోసెలు వేసిన ప్రియాంక -
ఢిల్లీ: నేడు ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ సమావేశం
సాక్షి, ఢిల్లీ: నేడు ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం జరుగనుంది. బుధవారం సాయంత్రం సమావేశం జరుగనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ భవన్ విభజనపై మూడు ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. అయితే, తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్లు కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా 58:42 నిష్పత్తి పద్దతిలో గదుల విభజన, నిర్వహణ జరుగుతోంది. కాగా, ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు ఆదిత్యానథ్ దాస్, రావత్, ప్రేమ చంద్రారెడ్డి హాజరుకానుండగా.. తెలంగాణ సర్కార్ తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరవనున్నారు. ఇక, ఏపీ భవన్ విభజనపై తొమ్మిదేళ్లుగా సమావేశాలు జరుగుతూనే ఉన్నా కొలిక్కి రాకపోవడం గమనార్హం. -
అమెజాన్ నుంచి 100 మంది అవుట్!
అమెజాన్ లేఆఫ్స్లో భాగంగా తాజాగా 100 మందిని తొలగించింది. వీడియో, గేమ్ విభాగాలలో పని చేస్తున్న సుమారు 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, కంపెనీ శాన్ డియాగో స్టూడియోలో పనిచేస్తున్న సిబ్బంది ఇందులో ఉన్నారు. ఈ మేరకు కంపెనీ గేమ్స్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ హార్ట్మన్ ఏప్రిల్ 4న ఉద్యోగులకు మెమోలు పంపించారు. (ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..) ట్విచ్ స్ట్రీమింగ్ సర్వీస్లో భాగంగా ఉన్న క్రౌన్ చానెల్ ఎంటర్టెయిన్మెంట్ షో సహా గేమింగ్ విభాగంలో మానవ వనరుల నిర్వహణకు అమెజాన్ కంపెనీ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ట్విచ్ ఇటీవల 400 మంది ఉద్యోగులను తొలగించింది. 2012లో ఈ డివిజన్ ప్రారంభించినప్పటి నుంచి పలు సార్లు అమ్మకానికి ఉంచినా విక్రయించకుండా అలాగే కొనసాగిస్తూ వస్తోంది. అమెజాన్ ఇప్పటి వరకూ అభివృద్ధి చేసింది కేవలం ఒకే ఒక్క గేమ్. అది కూడా 2021 సెప్టెంబర్ లాంచ్ తర్వాత దాని ప్లేయర్ బేస్ బాగా క్షీణించింది. (విప్రో కన్జూమర్ అమ్మకాలు @ రూ. 10 వేల కోట్లు) తొలగింపులు ఉన్నప్పటికీ, శాన్ డియాగో స్టూడియోలో ప్రకటించని ప్రాజెక్ట్లో పనిచేస్తున్న ఉద్యోగులు గేమ్ ప్రీ ప్రొడక్షన్ దశలో రెట్టింపు అవుతారని హార్ట్మన్ చెప్పారు. అలాగే మాంట్రియల్లోని అమెజాన్ స్టూడియోలో కూడా ఓ ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణ కొరియా ఆన్లైన్ రోల్-ప్లేయింగ్ గేమ్ లాస్ట్ ఆర్క్ను ప్రచురించడం ద్వారా అమెజాన్ విజయాన్ని సాధించింది. థర్డ్ పార్టీ పబ్లిషింగ్ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయనున్నట్లు హార్ట్మన్ పేర్కొన్నారు. NCSoft Corpతో ఇటీవలి ఒప్పందం కూడా అందులో భాగమేనని చెప్పారు. -
రెండు రాష్ట్రాలు కలిసే పరిస్థితి వస్తే స్వాగతిస్తాం : మంత్రి బొత్స సత్యనారాయణ
-
నంద్యాల డివిజన్ అటవీ శాఖ స్థాయి పెంపు
కొత్త జిల్లాలవారీగా అటవీ శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. నంద్యాల జిల్లా పరిధిలోకి వచ్చే నల్లమల అటవీ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు జిల్లా అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నంద్యాల జిల్లా అటవీ శాఖ పరిధిలో 1.90 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్, మహబూబ్నగర్ జిల్లాల సరిహద్దులతో వెలసిన నల్లమలో పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, అడవి పందులు, దుప్పులు, కర్తెలు, అడవి కుక్కలు, ఇతర వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. వాటిని అనుక్షణం కాపాడేందుకు అటవీ ప్రాంతం చుట్టూ పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆళ్లగడ్డ: బ్రిటీష్ కాలం నుంచి కర్నూలు జిల్లా పరిధిలో కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్లుగా ఉండేవి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నంద్యాల జిల్లా అటవీ శాఖగా ప్రభుత్వం గుర్తించింది. ఇంతవరకు ఉన్న నంద్యాల డివిజన్ కార్యాలయాన్ని జిల్లా అటవీ కార్యాలయంగా మార్చారు. కర్నూలు డివిజన్ పరిధిలోని డోన్ అటవీ రేంజ్ను నంద్యాల జిల్లా పరిధిలో కలిపారు. కొత్తగా రెండు రేంజ్లు ఇప్పటి వరకు నంద్యాల పరిధిలో రుద్రవరం, చలిమ, నంద్యాల, బండిఆత్మకూరు, ఆత్మకూరు రేంజ్లు ఉండగా కర్నూలు డివిజన్ నుంచి డోన్ రేంజ్ను నంద్యాల జిల్లాలో చేర్చడంతో మొత్తం ఆరు రేంజ్లు అయ్యాయి. పరిపాలన సౌలభ్యం కోసం పాణ్యం, బనగానపల్లె సెక్షన్లను అటవీ రేంజ్లుగా స్థాయి పెంచారు. దీంతో ఇప్పుడు జిల్లా పరిధిలో రేంజ్ల సంఖ్య 8 పెరిగింది. ఒకే పరిపాలన కిందకు టెరిటోరియల్, లాగింగ్ గతంలో టెరిటోరియల్ ఫారెస్ట్, సోషల్ ఫారెస్ట్ డివిజన్లు విడివిడిగా ఉండేవి. కొత్త డివిజన్లు చిన్నవి కావడంతో ఈ రెండింటిని కలిపి ఒకటిగా చేశారు. దీంతో రుద్రవరం, గాజులపల్లె, పచ్చర్ల లాగింగ్ డివిజన్లు రద్దయ్యాయి. డివిజన్ల పరిధి, కలప తగ్గడంతో వీటిని మూసివేశారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి దానికి పరిహారంగా అడవిని పెంచడానికి ఏర్పాటైన టీజీపీ డివిజన్ను కూడా రద్దు చేశారు. వైల్డ్లైఫ్ విభాగాలు ప్రత్యేకం వన్యప్రాణి విభాగం (వైల్డ్ లైఫ్) డివిజన్లను గతంలో మాదిరిగా ప్రత్యేకంగా ఉంచారు. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్డ్ పరిధిలోని కర్నూలు, ఆత్మకూరు, గిద్దలూరు, డివిజన్లను అలాగే ఉంచారు. వీటికి టెరిటోరియల్, వైల్డ్ లైఫ్ పరిధి రెండూ ఉంటాయి. నల్లమలలో 73 పెద్ద పులులు దేశంలోనే అతిపెద్ద అభయారణ్యమైన నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్టులో 73 పెద్ద పులులు ఉన్నట్లు పులుల గణనలో తేలింది. 2018లో 47, 2020లో 63 ఉన్న పులుల సంఖ్య ప్రస్తుతానికి 73కు పెరగడానికి అటవీ శాఖ అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యలే కారణం. ఎక్కడికక్కడ చెక్పోస్టులు, బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో గడ్డి పొదలు ఏర్పడి దుప్పులు, జింకలు పెరిగాయి. దీంతో పులులకు సమృద్ధిగా ఆహారం లభిస్తుండటంతో పులుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం నల్లమల అటవీ 300 చిరుతలు, 400 ఎలుగుబంట్లు, వేల సంఖ్యలో జింకలు, దుప్పులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. పెరిగిన సిబ్బంది నంద్యాల జిల్లా అటవీ శాఖ పరిధిలో సిబ్బంది సంఖ్య పెరిగింది. జిల్లా పరిధిలో కొత్తగా 9 సెక్షన్లు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు సెక్షన్ల సంఖ్య 25 పెరిగింది. 45 బేస్ క్యాంపులు ఉన్నాయి. 25 మంది సెక్షన్ అధికారులతో పాటు ఒక్కో బేస్ క్యాంపులో ఐదుగురు చొప్పున మొత్తం 225 మంది సిబ్బంది ఉన్నారు. పులులు, వన్యప్రాణుల సంఖ్య పెరగడంతో మరో 100 మందిని నియమించనున్నారు. పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి ఒకవైపు వన్యప్రాణులను, మరో వైపు విలువైన అటవీ సంపదను వేటగాళ్ల బారినుంచి కాపాడేందుకు పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. పెద్ద పులులు, చిరుతల సంరక్షణకు సుశిక్షితులైన సిబ్బందిని తయారు చేసేదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందు కోసం సబ్ డీఎఫ్ఓ, రేంజర్, డీఆర్వో, బీట్ అఫీసర్ తదితర స్థాయిలో ఉన్న సుమారు 50 మంది అధికారులకు, సిబ్బందికి షార్ట్ వెపన్లు అయిన ఫిస్టల్, రివాల్వర్లు అందించనున్నారు. త్వరలో వీరికి తిరుపతి పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో గన్ షూటింగ్పై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన వీరిని పెద్దపులు, చిరుతలు సంచరించే బేస్క్యాంపుల్లో నియమించనున్నారు. పర్యవేక్షణ సులభం జిల్లా కేంద్రంలో నూతనంగా జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఏర్పాటు కావడంతో పర్యవేక్షణ సులభంగా ఉంటుంది. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ భూముల అన్యాక్రాంతం కాకుండా పర్యవేక్షణ పెరుగుతుంది. జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం. – వినీత్కుమార్, జిల్లా అటవీ అధికారి అడవులతోనే సమృద్ధిగా వర్షాలు అడవులు విస్తారంగా పెరిగితేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ప్రభుత్వం అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో మూడేళ్లుగా అడవులు విస్తారంగా పెరిగాయి. అందులో వన్యప్రాణుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. – విశ్వనాథరెడ్డి, ఓబులంపల్లె అటవీ సంరక్షణ అందరి బాధ్యత అడవుల సంరక్షణతో వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. అన్నిరకాల వృక్షాలు, వన్యప్రాణులు ఉంటేనే అడవులు అంతరించి పోకుండా ఉంటాయి. అడవులు అంతరించిపోకుండా ఉంటేనే పర్యావరణ సాధ్యమవుతుంది. అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. – బోరు రమణ, చాగలమర్రి -
బెంగాల్ విభజన ఆపేందుకు... రక్తం కూడా చిందిస్తా: మమత
ఆలీపుర్ద్వార్: పశ్చిమ బెంగాల్ను ముక్కలు చేసి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలన్న రాష్ట్ర బీజేపీ నేతల డిమాండ్పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుమ్మెత్తిపోశారు. ‘‘ఒకసారి ప్రత్యేక గూర్ఖాలాండ్ అంటారు. మరోసారి నార్త్ బెంగాల్ కావాలంటారు. రాష్ట్రాన్ని ముక్కలు కాన్విను. అవసరమైతే అందుకోసం నా రక్తం చిందిస్తా. నా గుండెపై తుపాకీ ఎక్కుపెట్టినా ఈ నిర్ణయం మారదు’’ అని ఆలీపుర్ద్వార్లో మంగళవారం ఓ సభలో మమత అన్నారు. చదవండి: (దక్షిణాఫ్రికాను అతలాకుతలం చేసిన... గుప్తా బ్రదర్స్ చిక్కారు) -
బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే సహించం
హస్తినాపురం: డివిజన్లోని కాలనీల ప్రధాన రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే సహించేది లేదని కార్పొరేటర్ బానోతు సుజాతానాయక్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని నందనవనం కాలనీలో పారిశుద్ధ్య సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కార్పొరేటర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డివిజన్లోని అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించేలా అధికారులు తరచూ పరిశీలించాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ గణేశ్, జవాన్ శంకర్, నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి , మల్లేశ్గౌడ్ , రాజుగౌడ్, మారం శ్రీధర్ పాల్గొన్నారు. -
మురుగునీటి పైప్లైన్ పనులు ప్రారంభం
ఆల్విన్కాలనీ: ఆల్విన్కాలనీ డివిజన్ సాయినగర్ ఈస్ట్, ఖాజా నగర్లలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఆధ్వర్యంలో చేపట్టిన నూతన మురుగునీటి పైప్లైన్ పనులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాందీ, ఆల్విన్కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు, శ్రీనివాస్ గౌడ్, జీఎం ప్రభాకర్రావు, డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్లు ప్రియాంక, ఝాన్సీ, వర్క్ ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి, నాయకులు సమ్మారెడ్డి, జిల్లా గణేశ్, రాజేష్ చంద్ర, కాశీనాథ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
నల్లకుంట: నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో అన్ని డివిజన్లలోని బస్తీలు, కాలనీలకు సమాన ప్రాధాన్యతది ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బడ్జెట్ ద్వారా మంజూరైన నిధులతో అన్ని డివిజన్ల పరిధిలోనూ నూతన సీవరేజీ, డ్రైనేజీ పైప్లతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. బుధవారం నల్లకుంట డివిజన్ యాక్సిస్ బ్యాంక్ లేన్లో రూ.6 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ అమృతతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయా ప్రాంతాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సువర్ణ, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్, వాటర్ వర్క్స్ ఏఈ రోహిత్, టీఆర్ఎస్ నాయకులు నరేందర్, భాస్కర్ గౌడ్, ప్రవీణ్, సాయికిరణ్, బీజేపీ నాయకులు శ్యామ్రాజ్, లక్ష్మణ్కుమార్, సుధాకర్ పాల్గొన్నారు. రోడ్ల సమగ్రాభివృద్ధికి కృషి.. అంబర్పేట: నియోజకవర్గంలో రోడ్ల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. బుధవారం బాగ్అంబర్పేట డివిజన్ శ్రీనివాసకాలనీలో రూ.22 లక్షల అంచనా వ్యయంతో నిరి్మంచనున్న సీసీ రోడ్లను స్థానిక కార్పొరేటర్ బీ.పద్మావెంకట్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లను సైతం ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ గద్వాల జిల్లా ఇన్చార్జ్ బీ.వెంకట్రెడ్డి, స్థానిక బీజేపీ, టీఆర్ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. -
ఆస్తుల విభజనకు తీసుకున్న చర్యలేమిటి?: విజయసాయిరెడ్డి
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూలు 9,10 కింద జాబితాలో పేర్కొన్న సంస్థలు, జాబితాలో లేని సంస్థల మొత్తం ఆస్తుల విలువ 1,42,601 కోట్ల రూపాయలు. చట్టబద్దంగా జరగాల్సిన ఈ ఆస్తుల విభజన ఇప్పటి వరకు జరగనందున దాని దుష్ప్రభావం ఆంధ్రప్రదేశ్పై పడింది. ఆస్తుల విభజన ప్రక్రియను వేగవంతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటని బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ను ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూలు కింద పేర్కొన్న సంస్థల విభజనకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 90 ఆస్తులను రెండు రాష్ట్రాల మధ్య విభజించాలని కమిటీ సిఫార్సు చేసిందని చెప్పారు. ఈ ఆస్తులలో 68 సంస్థల విభజనకు తెలంగాణ ఎలాంటి అభ్యతరం తెలపలేదు. ఆంధ్రప్రదేశ్ 68గాను కేవలం 33 సంస్థల విభజనకు మాత్రమే అంగీకరించింది. పెండింగ్లో ఉన్న అన్ని ఆస్తుల విభజనకు సమగ్రమైన పరిష్కారం కావాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుండగా కేసుల వారీగా మాత్రమే పరిష్కరించాలని తెలంగాణ కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. చదవండి: (మనకు తెలిసిన పెద్ద నోటు 2,000.. మరి ప్రపంచంలో పెద్ద నోటేంటో తెలుసా..?) విభజన చట్టంలోని పదో షెడ్యూలులో పేర్కొన్న 112 శిక్షణా సంస్థల విభజనకు సెక్షన్ 75 కింద ఎలాంటి విధివిధానాలను నిర్దేశించనందున సమస్య ఏర్పడినట్లు మంత్రి చెప్పారు. ఈ సంస్థలను జనాభా ప్రాతిపదికన విభజించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుండగా భౌగోళిక విభజన ప్రాతిపదికన చేపట్టాలని తెలంగాణ కోరుతున్నట్లు నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. ఉభయ రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలను సామరస్యంగా పరిష్కరించడానికి వీలుగా హోం మంత్రిత్వ శాఖ పలుదఫాలుగా సూచనలను జారీ చేస్తోంది. అయితే ఉభయ రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం, ఆమోదం కుదిరినప్పుడు మాత్రమే ఆస్తుల విభజనపై నిర్ణయం తీసుకోవడం సాధ్యపడుతుందని మంత్రి చెప్పారు. -
ఓల్డ్ సిటీకి పోటీగా గజ్వేల్, సిద్దిపేట.. ఏ విషయంలో అంటే?
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చౌర్యం, బిల్లుల మొండిబకాయిలు, వసూళ్లలో అసమర్థత వెరసి విద్యుత్ శాఖను తీవ్ర నష్టాల్లోకి నెడుతున్నాయి. పలు డివిజన్లలో ఇలాంటి కారణాలతో సంస్థకు కోట్ల రూపాయలు లోటు వస్తోంది. వీటిలో ఇప్పటిదాకా ఓల్డ్ సిటీ ముందుండగా.. దీనికి పోటీగా గజ్వేల్, సిద్ది పేట కూడా ఉండటం గమనార్హం. దక్షిణ తెలంగాణ లోని 5 ఉమ్మడి జిల్లాల పరి ధిలో అత్యధిక విద్యుత్ నష్టాలు చార్మినార్, గజ్వేల్, ఆస్మాన్గఢ్, సిద్దిపేట డివిజన్లలో నమోదయ్యాయి. చార్మినార్ డివిజన్లో 35.73%, గజ్వేల్లో 35.5%, ఆస్మాన్గఢ్లో 35. 01%, సిద్దిపేటలో 32.31% సాంకేతిక, వాణిజ్య (ఏటీఅండ్సీ లాసెస్) నష్టాలు జరిగినట్టు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) నిర్వ హించిన తొలి త్రైమాసిక ఎనర్జీ ఆడిట్లో బహిర్గత మైంది. కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సం స్కరణల అమల్లో భాగంగా సంస్థ ఎనర్జీ ఆడిట్కు శ్రీకారం చుట్టింది. 2021 జూలై 1–సెప్టెంబర్ 30 మధ్య కాలానికి సంబంధించిన ఎనర్జీ ఆడిట్ నిర్వహించి గురువారం నివేదికను ప్రకటించింది. ఈ 3 నెలల్లో సంస్థ ఏటీఅండ్సీ నష్టాలు 10.63% ఉండ డం గమనార్హం. సాంకేతిక లోపాలతో జరిగే విద్యు త్ నష్టాలు, విద్యుత్ చౌర్యం, బిల్లింగ్ లోపాలతో జరిగే నష్టాలు, విద్యుత్ బిల్లుల మొండిబకాయిలు, వసూళ్లలో అసమర్థతతో జరిగే నష్టాల మొత్తాన్ని సాంకేతిక పరిభాషలో ‘అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ (ఏటీఅండ్సీ) లాసెస్’అంటారు. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 20 సర్కిళ్లు, 50 డివిజన్లు, 1,01,32,163 మంది వినియోగదారులు ఉన్నారు. అధిక ఏటీఅండ్ సీ నష్టాలు ఇక్కడే... ► చార్మినార్ డివిజన్కు 198.78 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్ సరఫరా చేయగా, వినియోగదారుల మీటర్ల నుంచి తీసిన లెక్కల ప్రకా రం 122.7ఎంయూల అమ్మకాలే జరిగాయి. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాల రూపంలో 76.04(38%) ఎంయూల విద్యుత్ నష్టమైంది. అయితే, ఈ జోన్ పరిధిలో మీటర్డ్ సేల్స్కి జారీ చేసిన బిల్లులకు 104% వసూళ్లు జరిగాయి. గృహాల నుంచి 107.47% కలెక్షన్ ఉంది. ► గజ్వేల్ డివిజన్కు 399.44 ఎంయూల విద్యుత్ సరఫరా కాగా, 201.9 ఎంయూలు మీటర్డ్ సేల్స్, 171.72 ఎంయూలు అన్మీటర్డ్ సేల్స్(మీటర్ లేని వ్యవసాయ పంప్ సెట్లకు) జరిగా యి. సాంకేతికంగా 25.7 శాతం నష్టాలు నమోద య్యాయి. మొండిబకాయిలతో ఏటీఅండ్సీ నష్టాలు 35.5 శాతానికి పెరిగాయి. గృహాలు 102.19%, రైతులు 64.54%, ఎల్టీ కమర్షియల్/ ఇండస్ట్రీలు 105.68%, హెచ్టీ కమర్షియల్/ఇండస్ట్రీలు 90.27% బిల్లులు చెల్లించగా, ఇతరులు మాత్రం 38.01 శాతమే బిల్లులు చెల్లించారు. ► దక్షిణ హైదరాబాద్ సర్కిల్ పరిధిలోని ఆస్మాన్గఢ్ డివిజన్కు 176.5 ఎంయూల విద్యుత్ సరఫరా చేయగా, 107.26 ఎంయూలకే బిల్లింగ్ జరిగింది. అంటే 69.55 ఎంయూ (39%)ల విద్యుత్ నష్టపోయింది. ఏటీఅండ్సీ నష్టాలు 35.01% ఉన్నాయి. ► బేగంబజార్ డివిజన్కు 120.95 ఎంయూల విద్యుత్ సరఫరా చేయగా, 42.05 (35శాతం) ఎంయూల నష్టం వాటిల్లింది. 78.91 ఎంయూలకు మాత్రమే బిల్లింగ్ జరిగింది. ఈ డివిజన్ పరిధిలో ఏటీఅండ్సీ నష్టాలు 34.01శాతం. ► సిద్దిపేట డివిజన్కు 341.27 ఎంయూలను సరఫరా చేస్తే మీటర్డ్ రీడింగ్ ద్వారా 158.4, అన్మీటర్డ్గా 157.55 ఎంయూలు కలిపి మొత్తం 316 ఎంయూలకు బిల్లింగ్ జరిగింది. 25.12 (7శాతం) ఎంయూలు నష్టపోయాయి. మొండి బకాయిల వల్ల 32.31 శాతం ఏటీఅండ్సీ నష్టాలున్నాయి. -
బడుగులకు బాసట
రాష్ట్ర ప్రభుత్వం బడుగులకు బాసటగా నిలిచింది. వారి బతుకుల్లో వెలుగులు నింపడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంది. సంక్షేమ ఫలాలు అందరికీ చేరేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ను విభజించింది.ఎస్సీలో మెజారిటీ సామాజిక వర్గాలైన మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల ఏర్పాటు చేయనుంది. దీనిపై ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఎస్సీ కార్పొరేషన్ ఇకపై మూడు కార్పొరేషన్లు కానుంది. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో వై ఎస్ జగన్మోహన్రెడ్డి తమ ప్రభుత్వం అధి కారంలోకి వస్తే మాల, మాదిగలతో పాటు రెల్లి కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం ఎస్సీ కార్పొరేషన్ను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో లక్షలాది మందికి ప్రయోజనం.. జిల్లాలో షెడ్యూల్డ్ కులాల్లో 46 ఉపకులాలు న్నాయి. అందులో మాదిగ, మాల, రెల్లి, పైడి, ఆది ఆంధ్ర వారు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు) సుమారుగా 3,29,486 మంది వరకు ఉన్నారు. ఇందులో 1,62,873 పురుషులు, 1,66,613 మహిళలు న్నారు. వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది. నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు.. 25 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎమ్మార్పీస్ పోరాటం చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నిబంధనలకు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేశారటూ ఎస్సీ మాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం రాష్ట్రంలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేసి అమలు చేశారు. అయితే ఆ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో మళ్లీ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పథకాలు అన్ని వర్గాలకు అమలు చేస్తున్నారు. అయినా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని ఎమ్మార్పీఎస్లో ఓ వర్గం నేటికీ పోరాటం చేస్తూనే ఉంది. దీంతో ఎస్సీల్లో ఉన్న మాల, మాదిగల మధ్య అంతరం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో మాల, మాదిగల మధ్య సఖ్యత పెంపొందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ను మూడుగా విభజిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్ల ద్వారా ఎస్సీలకు సంక్షేమ ఫలాలను అందించేందుకు చర్యలు చేపడుతోంది. కార్పొరేషన్ విభజనపై హర్షం.. ఎస్సీల ఆర్థికాభివృద్ధికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1974లో ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్ను ఆయా ఉపకులాలను విభజించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు విస్మరించాయి. ప్రజా సంకల్పయాత్రలో జగన్మోహన్రెడ్డికి ఎస్సీ కార్పొరేషన్ విభజించాలని తామంతా విన్నవించాం. ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారు. రాష్ట్రంలో 59 ఉపకులాలకు నేరుగా ఆర్థిక ఫలాలు అందే విధంగా ఎస్సీ కార్పొరేషన్ను విభజించడం గొప్పవిషయం. మాట తప్పకుండా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ కార్పొరేషన్ మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న దళితులమంతా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. – బోని శివరామకృష్ణ. దళితనేత సీఎం జగనన్నకు రుణపడి ఉంటాం గతంలో ఎన్నో ప్రభుత్వాలు మాటివ్వడమే గాని హామీ నెరవేర్చిన పాపాన పోలేదు. కేవలం రాజకీయ లబ్ధికోసం మమ్మల్ని వాడుకున్నారే తప్పా ఎవరూ న్యాయం చేయలేదు. ప్రజాసంకల్పయాత్రలో విన్నవించుకున్నాం. జగనన్న ఇచ్చిన హామీ మేరకు మూడు కార్పొరేషన్లు గా విభజించి సాధ్యం కాదన్నది సుసాధ్యం చేశారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడే ఏపీ సీఎం జగనన్నకి తామంతా రుణపడి ఉంటాం. – వీజే అజయ్కుమార్, దళితనేత విభజనతో సంక్షేమఫలాలు కార్పొరేషన్ విభజనతో సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతా యి. జిల్లాలో దళితులం ఎక్కువగా ఉన్నా మాకు ఏ ప్రభుత్వం న్యా యం చేయలేదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే న్యాయం జరిగింది. మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే మా అభివృద్ధి జరుగుతుంది. కార్పొరేషన్ విభజనతో ఎక్కువ మందికి ప్రభుత్వ పథకాలు అందుతాయి. – పాకా సత్యనారాయణ -
హైకోర్టు విషయంలో పబ్లిగ్గా చంద్రబాబు అబద్దాలు
-
ఎందుకీ ఆక్రోశం!
-
అక్కడ ఆందోళనలు.. ఇక్కడ సంబరాలు
-
అపోలో హాస్పిటల్స్ నుంచి అపోలో ఫార్మసీ విభజన
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్... తన ఫార్మసీ (ఔషధ విక్రయ శాలలు) రిటైల్ వ్యాపారాన్ని అపోలో ఫార్మసీస్ లిమిటెడ్ (ఏపీఎల్) పేరుతో వేరు చేయాలని నిర్ణయించింది. అపోలో మెడికల్స్ ప్రైవేటు లిమిటెడ్కు ఏపీఎల్ పూర్తి అనుబంధ సంస్థగా కొనసాగుతుంది. అపోలో మెడికల్స్ ప్రైవేటు లిమిటెడ్లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్కు 25.5 శాతం వాటా ఉంటుంది. అలాగే, జీలమ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్–1కు 19.9 శాతం, హేమెంద్ర కొఠారికి 9.9 శాతం వాటా, ఇనామ్ సెక్యూరిటీస్ ప్రైవేటు లిమిటెడ్కు 44.7 శాతం చొప్పున వాటాలు ఉంటాయి. ఆరోగ్య సేవలు, ఫార్మసీ వ్యాపారాలకు సంబంధించి దీర్ఘకాలిక విధానాన్ని సమీక్షించిన అనంతరం బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. స్పష్టమైన విధానంతో పనిచేసేందుకు వీలుగా ఈ వ్యాపారాన్ని ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేయడానికి ఇది సరైన సమయమని భావించినట్టు తెలిపింది. రూ.10,000 కోట్ల ఆదాయ లక్ష్యం ఐదేళ్లలో 5,000 ఔషధ దుకాణాలు, రూ.10,000 కోట్ల ఆదాయం లక్ష్యంతో ఫార్మసీ విభాగం పనిచేయనున్నట్టు అపోలో హాస్పిటల్స్ తెలిపింది. ఈ నిర్ణయంతో డిజిటల్ కామర్స్లోకి ప్రవేశించేందుకు వీలు కలుగుతుందని, ఆన్లైన్, ఆఫ్లైన్లో ఏదన్నది నిర్ణయించుకునే సౌకర్యం వినియోగదారులకు లభిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 400 పట్టణాల్లో అపోలో ఫార్మసీకి 3,167 దుకాణాలు ఉన్నాయి. కంపెనీ వ్యాపారాల పునర్వ్యవస్థీకరణ అనంతరం.. ఏపీఎల్కు అపోలో హాస్పిటల్స్ ఔషధ సరఫరాదారుగా ఉంటుంది. తాజా నిర్ణయం అపోలో హాస్పిటల్స్ ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపించదని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని తెలిపారు. -
హైకోర్టు ఉద్యోగుల విభజన షురూ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనలో అత్యంత కీలకమైన ఉద్యోగుల విభజన ప్రక్రియ షురూ అయ్యింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను హైకోర్టు గురువారం విడుదల చేసింది. గతవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) అధ్యక్షతన జరిగిన హైకోర్టు న్యాయమూర్తుల ఫుల్కోర్ట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు మార్గదర్శకాల రూపకల్పన జరిగింది. మార్గదర్శకాలతోపాటు ఆప్షన్ ఫాంలను హైకోర్టు వర్గాలు ఉద్యోగులందరికీ పంపాయి. ఈ ఫాంలను ఈ నెల 15లోపు నింపి సీల్డ్ కవర్లో అందజేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల నుంచి అందుకున్న ఈ సీల్ట్ కవర్లను ఆయా సెక్షన్ల అధికారులు 15వ తేదీ సాయంత్రం 5లోపు సీజే కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ వెల్లడించారు. కేటాయింపులు ఇలా..: కేటాయింపుల్లో సీనియారిటీకి ప్రాధాన్యతనిస్తారు. తెలంగాణ హైకోర్టు లేదా ఏపీ హైకోర్టు రెండింటిలో దేనిని ఎంచుకోని ఉద్యోగులను.. వారి సర్వీసు రికార్డుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం కేటాయిస్తారు. ఈ విషయంలో సీజే తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తారు. ఆఫీస్ సబార్డినేట్స్, దఫేదార్స్, జమేదార్స్, రికార్డ్ అసిస్టెంట్స్, బైండర్స్, బుక్ బేరర్స్, లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లు, కాపీయర్ మెషీన్ ఆపరేటర్లు, అసిస్టెంట్ ఓవర్ సీర్ తదితరులను వారి ఆప్షన్ల మేర కేటాయించడం జరుగుతుంది. ఉద్యోగులు ఎంపిక చేసుకున్న హైకోర్టులో ఖాళీల కంటే ఉద్యోగులు ఎక్కువగా ఉంటే, ఆ ఖాళీల్లో భర్తీ చేయగా మిగిలిన ఉద్యోగులను ఇతర హైకోర్టులో లేదా కింది కోర్టుల్లో డిప్యుటేషన్పై నియమిస్తారు. భవిష్యత్లో హైకోర్టులో ఖాళీ అయ్యే పోస్టుల్లో వారిని నియమిస్తారు. భార్యాభర్తలిద్దరూ హైకోర్టు ఉద్యోగులైతే వారిద్దరినీ వారు ఎంచుకున్న హైకోర్టుకు కేటాయిస్తారు. హైకోర్టులో పనిచేస్తున్న ఉద్యోగి భార్య లేదా భర్త ప్రభుత్వ ఉద్యోగి అయి ఉంటే, అతను లేదా ఆమె ఏ రాష్ట్ర పరిధిలో పనిచేస్తుంటే ఆ ఉద్యోగిని ఆ హైకోర్టుకు కేటాయించడం జరుగుతుంది. వితంతువులైన మహిళా ఉద్యోగులను వారు ఎంపిక చేసుకున్న హైకోర్టుకు కేటాయిస్తారు. 60 శాతానికి మించి వైకల్యంతో బాధపడే ఉద్యోగులను వారి ఆప్షన్ మేర కేటాయిస్తారు. ఉద్యోగి లేదా భార్య లేదా పిల్లలు తీవ్ర అనారోగ్యంతో ఉంటే ఆ ఉద్యోగులను వారి ఆప్షన్ మేర కేటా యిస్తారు. ఈ మార్గదర్శకాలు జారీ అయ్యే నాటికి పదవీ విరమణకు రెండేళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులు వారు ఎంపిక చేసుకున్న హైకోర్టుకు కేటాయింపు చేస్తారు. ఒక హైకోర్టులో ఖాళీలు ఉండి, మరో హైకోర్టులో మిగులు ఉద్యోగులుంటే వారిని ఏదోక హైకోర్టుకు సీజే విచక్షణాధికారంతో కేటాయిస్తారు. ఈ మార్గదర్శకాలతో సంబంధం లేకుండా సీజే కేటాయింపులపై నిర్ణయం తీసుకోవచ్చు. -
మార్చి నాటికి గెయిల్ విభజన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన గ్యాస్ మార్కెటింగ్, పంపిణీ దిగ్గజం గెయిల్ను వచ్చే ఏడాది మార్చి నాటికల్లా రెండు కంపెనీలుగా విభజించాలని కేంద్రం యోచిస్తోంది. గ్యాస్ మార్కెటింగ్ విభాగాన్ని ఒక కంపెనీగాను, పైప్లైన్ల నిర్వహణ విభాగాన్ని మరో సంస్థగాను ఏర్పాటు చేయనుంది. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ బోర్డు (పీఎన్జీఆర్బీ) చైర్మన్ డీకే సరాఫ్ ఈ విషయం తెలిపారు. విభజన ప్రక్రియ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు సరాఫ్ పేర్కొన్నారు. గెయిల్ ఇప్పటికే గ్యాస్ పైప్లైన్, మార్కెటింగ్ వ్యాపార విభాగాలకు సంబంధించిన ఖాతాలు వేర్వేరుగానే నిర్వహిస్తున్న నేపథ్యంలో విభజన ప్రక్రియ సులభతరంగానే ఉండగలదని ఆయన తెలిపారు. 1984లో ఓఎన్జీసీ నుంచి గ్యాస్ వ్యాపార కార్యకలాపాలను విడగొట్టి గెయిల్ ఏర్పాటు చేశారు. గ్యాస్ వినియోగాన్ని పెంచేందుకే: మరిన్ని ద్రవీకృత సహజ వాయువు టెర్మినల్స్ నిర్మించేందుకు, పైప్లైన్ నెట్వర్క్ను విస్తరించేందుకు అవసరమయ్యే భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి.. అలాగే గ్యాస్ వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచడానికి గెయిల్ కార్యకలాపాల విభజన తోడ్పడగలదని భావిస్తోంది. ప్రస్తుతం చాలా మటుకు విద్యుత్ ప్లాంట్లు, సెరామిక్.. గ్లాస్ తదితర చిన్న పరిశ్రమలు ఖరీదైన, కాలుష్యకారకమైన నాఫ్తా, డీజిల్, బొగ్గు వంటి ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే, భవిష్యత్లో వీటిని గ్యాస్ వైపు మళ్లించేందుకు, గెయిల్తో సంబంధం లేకుండా నేరుగా గ్యాస్ను కొనుగోలు చేసుకునేందుకు తాజా విభజన తోడ్పడగలదని కేంద్రం భావిస్తోంది. -
నేటి నుంచి డివిజన్ కేంద్రాల్లో ‘మీ కోసం’
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా వినతులు స్వీకరించే మీ కోసం(ప్రజాదర్బార్) కార్యక్రమం నేటి నుంచి డివిజన్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ నెలలో మొదటి సోమవారం నంద్యాలలో నిర్వహిస్తున్నారు. వచ్చే సోమవారం ఆదోని, ఆ తర్వాతి సోమవారం కర్నూలు ఆర్డీఓ కార్యాలయాల్లో వినతులు స్వీకరిస్తారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో పాటు అన్ని శాఖల అధికారులు సోమవారం నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించే మీ కోసం కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు అన్ని రకాల సమస్యలపై వినతులు స్వీకరిస్తారు. 1 గంట నుంచి 2 వరకు ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ నిర్వహిస్తారు. 3 నుంచి 6 గంటల వరకు అక్కడే మీ కోసం కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై డివిజన్ స్థాయి సదస్సు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి వినతి పత్రాలు ఇచ్చేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారం నిమిత్తం జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ డివిజన్ కేంద్రాల మీ కోసం కార్యక్రమ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. -
ఇరిగేషన్ కార్యాలయాల తరలింపును సహించేది లేదు
రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమే ఇరిగేషన్ కార్యాలయాల స్థలాల కబ్జాకే తరలింపు డ్రామా వైఎస్సార్ సీపీ కేంద్ర సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్షి ్మ ధవళేశ్వరం: ఇరిగేషన్ కార్యాలయాలను ధవళేశ్వరం నుంచి తరలించాలని చూస్తే సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్షి ్మ స్పష్టం చేశారు. ఆమె గురువారం వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజుతో కలిసి ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ బి.రాంబాబును కలిశారు. ఇరిగేషన్ డివిజన్ కార్యాలయాలు ఇక్కడ ఉండటం వల్ల కలిగే లాభాలను, వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలపాలని జక్కంపూడి విజయలక్షి ్మ ఎస్ఈ రాంబాబును కోరారు. ఒక ప్రక్క ఉద్యోగులకు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయాన్ని జీవోపై పూర్తి సమీక్ష వరకు తరలించబోమని హామి ఇచ్చినప్పటికీ తరలింపులో అధికారుల అత్యుత్సాహం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయాల స్థలాలను కబ్జా చేసేందుకే 29 ఏళ్ళ క్రితం వచ్చిన జీఓను తెరమీదకు తీసుకువచ్చారని ఆమె ఆరోపించారు. ఒక పక్క ఈస్ట్రన్ డివిజన్కు ధవళేశ్వరంలో కార్యాలయం కడుతుండగా తరలింపు ప్రక్రియ ఏమిటని ప్రశ్నించారు.సెంట్రల్ డివిజన్ కార్యాలయ మరమ్మతులకు కూడా నిధులు విడుదల కాగా అమలాపురంలో అద్దె భవనంలోకి మార్చాలని ప్రయత్నించడం ఏమిటని ఎస్ఈని ప్రశ్నించారు. సెంట్రల్ డివిజన్లో ఉన్న మైనర్ ఇరిగేషన్ కార్యాలయాలను పెద్దాపురం డివిజన్లో కలిపేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. రైతులు,ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసే విధంగా కార్యాలయాలను తరలించాలని చూస్తే వేలాది మంది రైతులతో ఇరిగేషన్ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. రైతుల కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకు అయినా తాను సిద్ధమేనని జక్కంపూడి విజయలక్ష్మీ స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ కనీసం ఉద్యోగులకు కూడా తెలియకుండా కార్యాలయాల తరలింపునకు ప్రయత్నించారంటే అధికారుల అత్యుత్సాహం తెలుస్తోందన్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ళకు తలొగ్గకుండా రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు సాధనాల చంద్రశేఖర్ (శివ), వైఎస్సార్ సీపీ నాయకులు పెన్నాడ జయప్రసాద్, గరగ శ్రీనివాసరావు, ముద్దాల అను, ఆకుల రాజా, షట్టర్ బాషా, మిరప రమేష్, గపూర్, ముత్యాల జాన్ తదితరులు పాల్గొన్నారు. -
సెంట్రల్ డివిజన్ కార్యాలయ తరలింపునకు బ్రేక్
–రైతులు ,ఉద్యోగుల పక్షాన పోరాడిన వైఎస్సార్ సీపీ –జీవోపై సమీక్ష అనంతరం నిర్ణయం ధవళేశ్వరం: సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని ధవళేశ్వరం నుంచి అమలాపురానికి తరలించే ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ శాఖా మంత్రి నుంచి మౌఖిక అదేశాలు అందినట్లు సమాచారం. కాటన్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ వందేళ్ళ పైబడి చరిత్ర కలిగిన సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి తరలిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. సోమ, మంగళవారాలు ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయాలను బంద్ చేయించి కార్యాలయ తరలింపుతో వచ్చే నష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది. సెంట్రల్ డివిజన్ కార్యాలయం అమలాపురం తరలిస్తే మైనర్ ఇరిగేషన్ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడతారని, ఉద్యోగులు పీఏవో, సీఈఎస్ఈ కార్యాలయాలకు తరచూ ధవళేశ్వరం రావాల్సి ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. వందేళ్ళ పైబడి ఏర్పాటు చేసిన డివిజన్ కార్యాలయాలను ప్రజాప్రతినిధుల మెప్పు కోసం ఏకపక్షంగా మారిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులు, ఉద్యోగుల పక్షాన నిలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు, బంద్ నిర్వహించారు. తరలింపు ప్రక్రియ నిలిపివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. –ఇరిగేషన్ మంత్రిని కలిసిన ఎన్జీవో నాయకులు సెంట్రల్ డివిజన్ కార్యాలయ తరలింపు ప్రతిపాదనను విరమించాలని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు ఆధ్వర్యంలో ఎన్జీవో నాయకులు ఇరిగేషన్ శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కలిశారు. కార్యాలయ తరలింపు వల్ల కలిగే నష్టాలను మంత్రికి వివరించారు. 1988 జీవోపై పూర్తిగా సమీక్షించిన అనంతరం కార్యాలయాన్ని మార్పుపై నిర్ణయం తీసుకుందామని అప్పటివరకు సెంట్రల్ డివిజన్ కార్యాలయం తరలింపు ప్రతిపాదనను నిలిపివేయాలని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులకు అదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో త్వరలో అప్పటి జీవోలో పేర్కొన్న వాటిపై సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని అదేశించినట్లు తెలుస్తోంది. -
ధవళేశ్వరం టు అమలాపురం..
ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయం మార్పు ఉద్యోగులకు మాట మాత్రంగానైనా చెప్పని వైనం జిల్లాకు చెందిన ఓ మంత్రే కారణం? ఆందోళనకు సిద్ధమవుతున్న ఇరిగేషన్ ఉద్యోగులు అడిగే వాడికి చెప్పే అవసరం లేదన్నట్టుగా మొండిగా వ్యవహరించే ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటుందనడానికి ఇదో ఉదాహరణ. ఉమ్మడి రాజధానిపై పదేళ్లు ఉండే అవకాశం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు హడావుడిగా అమరావతిలో తాత్కాలికంగా నిర్మించిన కొత్త రాజధానికి ఉద్యోగులను బలవంతంగా తీసుకువచ్చారు. హడావుడి తరలింపుపై ఎంతమంది వారించినా ప్రభుత్వం ససేమిరా అంది. ఇది అసరాగా తీసుకుని...ఇప్పుడు ధవళేశ్వరంలోని ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయానికి అమలాపురానికి ఉన్నఫళంగా మార్పుకు శ్రీకారం చుట్టింది. ఆ కార్యాలయ ఉద్యోగులకు ఈ మార్పు విషయాన్ని మాట మాత్రంగా చెప్పకపోవడం.. ప్రభుత్వ మొండి వైఖరి నిదర్శనం. ఇప్పుడు ఉద్యోగులు ఉద్యమ బాట పడతానంటున్నారు. ఇదీ ఆ కథా కమామిషు.. ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్) : జిల్లాకు చెందిన ఓ మంత్రి మెప్పు కోసం వందేళ్ల పైబడి చరిత్ర కలిగిన ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి మార్చేశారు. కార్యాలయ సిబ్బందికి కూడా చెప్పకుండానే గురువారం కార్యాలయ ప్రారంభ తంతును ముగించారు. మంత్రి మెప్పు కోసమే ఇరిగేషన్ ఉన్నతాధికారి కాటన్ దొర ఆశయానికి తూట్లు పొడుస్తున్నారని ఇరిగేషన్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం మార్పుపై మైనర్ ఇరిగేషన్ రైతాంగంలోనూ ఆందోళన నెలకొంది. సెంట్రల్ డెల్టాతో పాటు మైనర్ ఇరిగేషన్ విభాగం కూడా సెంట్రల్ డివిజన్ కార్యాలయం పరిధిలోనే ఉన్నాయి. మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బందే ధవళేశ్వరంలోని సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి మారిస్తే మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బందులు తప్పవు. రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా ధవళేశ్వరం వచ్చేవారు. ఈ కార్యాలయాన్ని అమలాపురం మారిస్తే వంద కిలోమీటర్లు వెళ్లాల్సిందే. సెంట్రల్ డివిజన్ పరిధిలో చాగల్నాడు ఎత్తిపోతల పథకం ,తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్, వెంకటనగరం పంపింగ్ స్కీమ్, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్,పిఆర్ ట్యాంక్స్ ఉన్నాయి. కాటన్ దొర ఆశయానికి తూట్లు ఉభయగోదావరి జిల్లాలను ధాన్యాగారంగా మార్చిన అపర భగీరథుడు కాటన్ దొర ఆశయానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారు. వందేళ్ళ క్రితం ధవళేశ్వరంలో సెంట్రల్ డివిజన్, ఈస్ట్రన్ డివిజన్, హెడ్వర్క్స్ డివిజన్లను అప్పట్లో ఏర్పాటు చేశారు. ధవళేశ్వరం సెంట్రల్ డివిజన్ కార్యాలయానికి సంబంధించి అమలాపురం, పి.గన్నవరం, రాజమహేంద్రవరంలోని సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. సెంట్రల్ డివిజన్ కార్యాలయంతో పాటు మరికొన్ని కార్యాలయాల మార్పుకు 1988లో అప్పటి ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అయితో న్యాయపోరాటంతో అప్పట్లో అందుకు బ్రేక్ పడింది. మంత్రి మెప్పు కోసమే! జిల్లాకు చెందిన మంత్రి మెప్పు కోసమే హడావుడిగా ధవళేశ్వరంలోని సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి మారుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ఇరిగేషన్ ఉన్నతాధికారి భారీ స్కెచ్తో అమలాపురానికి కార్యాలయాన్ని మారుస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులకు కార్యాలయ మార్పుపై ఎటువంటి సమాచారం తెలీయకుండా జాగ్రత్త పడ్డారు. డివిజన్ కార్యాలయానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో పర్యటించేది ఒక్క ఈఈ మాత్రమేనని, అమలాపురం, పి.గన్నవరంలో సబ్డివిజన్ కార్యాలయ అధికారులే క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారని, ఇప్పుడు ఏకంగా డివిజన్ కార్యాలయాన్నే అక్కడికు మార్చడంలో మర్మం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -ఆందోళనకు సిద్ధమవుతున్న ఉద్యోగులు కనీసం ముందుగా తెలియజేయకుండా హడావుడిగా సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురం తరలించడానికి గురువారం ప్రారంభోత్సవం చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇరిగేషన్ ఉన్నతాధికారి వైఖరిపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విషయాన్ని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర స్థాయి నాయకుల సూచనల మేరకు అన్ని సంఘాలను కలుపుకొని ప్రత్యక్ష పోరాటానికి దిగేందుకు ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. సొంతం వద్దు.. అద్దె ముద్దు.. ధవళేశ్వరంలో సొంత భవనంలో ఉన్న సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురంలో అద్దె భవనంలోకి మార్చేందుకు అధికారులు మక్కువ చూపడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కనీసం అక్కడ పూర్తి స్థాయి సొంత భవనం కూడా లేకపోయినప్పటికీ హడావుడిగా వారం రోజుల్లో కార్యాలయం అమలాపురానికి వెళ్లిపోవాలని సూచిస్తున్న ఇరిగేషన్ ఉన్నతాధికారి అత్యుత్సాహంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆందోళన చేపడతాం.. మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బంది చేకూర్చే విధంగా డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి తరలిస్తే సహించేది లేదని వైఎస్సార్ సీసీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ అన్నారు. అమలాపురంలో సబ్ డివిజన్ కార్యాలయం ఉన్నప్పటికీ ఏకపక్షంగా ఈ కార్యాలయాన్ని తరలించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే కార్యాలయ తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అటు సెంట్రల్ డెల్టా రైతాంగానికి ఇటు మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి అందుబాటులో ఉండే ధవళేశ్వరంలోనే కార్యాలయాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులనే అమలు చేశా.. సెంట్రల్ డివిజన్ కార్యాలయం తరలింపు వ్యవహరంలో ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేశామని ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఇ రాంబాబు స్పష్టంచేశారు. ఈ ప్రతిపాదన గతంలో ఉన్నదేనని ఇందులో ఎవరి ఒత్తిడి లేదన్నారు. -
రేషన్ కార్డుల విభజన పూర్తి
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో రేషన్ కార్డుల విభజన ప్రక్రియను పౌర సరఫరాల శాఖ పూర్తి చేసింది. ఇందుకు అనుగుణంగా డిసెంబర్ నెలకు సంబంధించిన రేషన్ సరుకులను కేటారుుస్తూ నిర్ణయం చేసింది. 28 జిల్లాల కు రేషన్ కేటారుుంపుల ఉత్తర్వులను శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ విడుదల చేశారు. 28 జిల్లాలకు గానూ 69.73 లక్షల కార్డులకు 1,40,538 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 69 లక్షల 54వేల చక్కెర ప్యాకెట్లను, 69,72,029 ఉప్పు ప్యాకెట్లను డిసెంబర్ నెలకు కేటారుుంచారు. జిల్లాల పునర్విభజనకు ముందు 10 జిల్లాలో 85 లక్షల రేషన్ కార్డులున్నాయని, ఈ కార్డులను 31 జిల్లాలకు అనుగుణంగా విభజించామన్నారు. అత్యధికంగా హైదరాబాద్లో 5,77,391 కార్డులుండగా, అతి తక్కువగా ఆసిఫాబాద్లో 1,37,585 రేషన్ కార్డులున్నారుు. నిత్యావసర సరుకుల పంపిణీలో జాప్యం జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా అధికారులకు సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు. -
హామీలు మరిచిన సీఎంకు బుద్ధి చెబుదాం
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు - సింహా గర్జన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కర్నూలు సీక్యాంప్: ఎస్సీ వర్గీకరణకు హామీ విస్మరించిన సీఎం చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు మాదిగలు సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారపేటలోని సమితి కార్యాలయంలో ఆదివారం సింహగర్జన మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా వర్గీకరణ అంశం ఊసెత్తడం లేదన్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సమయంలో మాదిగలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఉషామెహ్రా కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ నెల 29న కర్నూలులో నిర్వహించే సింహా గర్జనకు సంబంధించిన మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాత్రిసుబ్బయ్యమాదిగ, రాష్ట్ర కార్యదర్శి దాదాపోగునవీన్, ఎమ్ఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ భానుప్రకాష్, జిల్లా అధ్యక్షుడు అరిగిలి రవి, కర్నూలు సిటీ అధ్యక్షుడు రాచపోగుల రవి తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి డివిజన్ల వారీగా ఉల్లి కొనుగోళ్లు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి విక్రయించే రైతులకు గరిష్టంగా క్వింటాకు రూ.300 మద్దతు ఇస్తుండటంతో మార్కెట్కు ఉల్లి పోటెత్తకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి రెవెన్యూ డివిజన్ల వారీగా రైతులు మార్కెట్కు ఉల్లిని తీసుకొచ్చేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. సోమ, బుధ, శుక్రవారాల్లో కర్నూలు రెవెన్యూ డివిజన్ రైతులు మాత్రమే మార్కెట్కు ఉల్లి తీసుకురాల్సి ఉంది. ఆదోని డివిజన్ రైతులు మంగళ, గురువారాల్లో.. నంద్యాల డివిజన్ రైతులు శనివారం మాత్రమే మార్కెట్కు దిగుబడులు తీసుకరావాలని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. -
మానవీయ కోణంలో
నిజామాబాద్ నాగారం: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల విభజన సందర్భంగా వారి మనోభావాలు దెబ్బ తీయకుండా విభజన చేపట్టాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3,434 పోస్టులు ఉండగా, 1134 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వాలని, భర్త ఎక్కడ ఉంటే భార్యకు అదే జిల్లాలో విధులు నిర్వహించేలా చూడాలని కోరారు. పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఉద్యోగులను ఇదే జిల్లాలో కొనసాగించేలా చూడాలని కోరారు. కొత్త జిల్లాలో ఉద్యోగులందరికీ 20శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలన్నారు. జిల్లాలో టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించున్నట్లు చెప్పారు. కామారెడ్డి జిల్లాకు వెళ్లబోయే ఉద్యోగులకు త్వరలోనే ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. స.హ. చట్టం పేరుతో కొందరు ఉద్యోగులను అనవసరంగా బెదిరిస్తున్నారని, ఇలాంటివి సహించేది లేదన్నారు. ఉద్యోగులు అందరు బంగారు తెలంగాణ కోసం పనిచేస్తున్నారని అన్నారు. టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి సతీష్రెడ్డి, నేతలు దయానంద్, అమృత్కుమార్, నరేందర్, సుధాకర్, నరహరి తదితరులు పాల్గొన్నారు. -
అశాస్త్రీయంగా పునర్విభజన
హుజూర్నగర్ : తెలంగాణ ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనను అశాస్త్రీయంగా చేపడుతూ ప్రతిపక్షాలను పట్టించుకోవడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో 5 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించిన ఆయన కొద్దిసేపు దీక్ష శిబిరంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు హుజూర్నగర్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల కోరికలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రతిపక్ష నాయకుని హోదాలో హుజూర్నగర్ను రెవెన్యూ డివిజన్గా సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనంతరం సీఎం కేసీఆర్కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీనాయకులు అజీజ్పాషా, గల్లావెంకటేశ్వర్లు, చింతి ర్యాలనాగయ్య, కస్తాల శ్రావణ్, రెడపంగ పెదవెంకటే శ్వర్లు, నందిగామ ముక్కంటి, ఇట్టిమళ్ల బెంజిమన్, దాసరి నరేందర్, దాసరి పున్నయ్య, మట్టయ్య, మందా వెంకటేశ్వర్లు, కస్తాల ముత్తయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
అశాస్త్రీయంగా పునర్విభజన
హుజూర్నగర్ : తెలంగాణ ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనను అశాస్త్రీయంగా చేపడుతూ ప్రతిపక్షాలను పట్టించుకోవడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో 5 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించిన ఆయన కొద్దిసేపు దీక్ష శిబిరంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు హుజూర్నగర్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల కోరికలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రతిపక్ష నాయకుని హోదాలో హుజూర్నగర్ను రెవెన్యూ డివిజన్గా సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనంతరం సీఎం కేసీఆర్కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీనాయకులు అజీజ్పాషా, గల్లావెంకటేశ్వర్లు, చింతి ర్యాలనాగయ్య, కస్తాల శ్రావణ్, రెడపంగ పెదవెంకటే శ్వర్లు, నందిగామ ముక్కంటి, ఇట్టిమళ్ల బెంజిమన్, దాసరి నరేందర్, దాసరి పున్నయ్య, మట్టయ్య, మందా వెంకటేశ్వర్లు, కస్తాల ముత్తయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక
రాజాపేట : భువనగిరిలో జరిగిన డివిజన్స్థాయి క్రీడోత్సవాలకు రాజాపేట బాలురు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బూర్గు మహేందర్రెడ్డి, పీడీ సుంకి కుమారస్వామిలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–17కు ఎం శ్రీనివాస్, అండర్–14 నుంచి ఎం.తరుణ్, సంతోష్, మహీపాల్లు జిల్లాస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఈ నెల17, 18 తేదీలల్లో మిర్యాలగూడ మండలంలోని ముకుందాపురం ఉన్నత పాఠశాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక
రాజాపేట : భువనగిరిలో జరిగిన డివిజన్స్థాయి క్రీడోత్సవాలకు రాజాపేట బాలురు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బూర్గు మహేందర్రెడ్డి, పీడీ సుంకి కుమారస్వామిలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–17కు ఎం శ్రీనివాస్, అండర్–14 నుంచి ఎం.తరుణ్, సంతోష్, మహీపాల్లు జిల్లాస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఈ నెల17, 18 తేదీలల్లో మిర్యాలగూడ మండలంలోని ముకుందాపురం ఉన్నత పాఠశాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
త్వరలో కోదాడ పోలీస్ డివిజన్
ఎన్ఎస్పీ క్యాంపులోనే ఏర్పాటుకు నిర్ణయం భవనాలు పరిశీలించిన ఎస్పీ ప్రకాశ్రెడ్డి కోదాడ: కోదాడ పట్టణంలో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేసేందుకు శాఖ పరంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎస్పీ ప్రకాశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన కోదాడలోని ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్న భవనాలను డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు కోసం పరిశీలించారు. క్యాంపులో ఉన్న పాత ఎమ్మార్వో కార్యాలయంలో ప్రస్తుతం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ నడుస్తోంది. ఈ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఇందులో ఆర్డీఓ కార్యాలయాల ఏర్పాటుకు రెవిన్యూ అధికారులు ప్రతిపాధనలు సిద్ధం చేశారని తెలియడంతో ఇదే క్యాంపు ఆవరణలో రూరల్ పోలీస్ స్టేషన్కు పక్కన ఉన్న మరో భవనాన్ని పరిశీలించారు. ఈ భవనం విశాలంగా ఉండడమే కాకుండా, పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఉండడంతో పాటు సమీపంలో రూరల్ పోలీస్ స్టేషన్ ఉండడంతో అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. భవనాల పరిశీలన పూర్తయిందని, దీనిపై కలెక్టర్కు నివేదిక ఇస్తామని అనుమతులు రాగానే కార్యాలయం ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా సూర్యాపేట జిల్లాలో కొత్తగా మునగాల, తుంగతుర్తిలలో కొత్త సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎస్పీ వెంట ఓఎస్డీ వెంకటేశ్వర్లు, సూర్యాపేట డీఎస్పీ సునీతామోహన్, కోదాడ రూరల్ సీఐ మధుసూదన్రెడ్డి, పట్టణ ఎస్ఐ సురేష్కుమార్ పాల్గొన్నారు. -
ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దు
నిజామాబాద్ నాగారం: జిల్లాల విభజన నేపథ్యంలో ఉద్యోగులంతా పగలూరాత్రి తేడా లేకుండా విధులు నిర్వహిస్తుంటే, కొంత మంది అధికారులు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై మంగళవారం టీఎన్జీవోఎస్ భవన్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆ యన మాట్లాడారు. వ్యవసాయంతో పాటు పలు శాఖల్లోని కొంత మంది అధికారులు ఉద్యోగులను కావాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, సస్పెండ్ చేస్తామని బెదరిస్తున్నట్లు తెలిసిందన్నారు. కలెక్టర్ ఆదేశాల మే రకు సెలవులతో పాటు రాత్రి కూడా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఉద్యోగులకు తాము అండగా ఉన్నామని చెప్పారు. తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోవాలి జిల్లాల విభజన నేపథ్యంలో ఉద్యోగులు వేరే జిల్లాకు వేళ్లేందుకు తాత్కలికంగా ఆర్డర్లు తీసుకోవాలని కిషన్ సూచించారు. అక్కడ సరిపడా సిబ్బందిని నియమించిన తర్వాత మళ్లీ ఉద్యోగుల అభీష్టం మేరకు ఆయా జిల్లాల్లో విధులు నిర్వహించేలా చూస్తామన్నారు. నూతన జిల్లాలో ఏర్పడే కార్యాలయాల్లో ఉద్యోగులకు కావాల్సిన అన్ని మౌలిýS సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. టీఎన్జీవోస్ కేంద్ర ఉపాధ్యక్షుడిగా నరేందర్ టీఎన్జీవోస్ కేంద్ర ఉపాధ్యక్షుడిగా ఎమ్బీ నరేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం నియామకపత్రం అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నగరంలోని టీఎన్జీవోస్ భవన్లో ఆయనను ఘనంగా సత్కరించారు. ఆయన పుట్టిన రోజు కూడా కావడంతో కేక్ కేట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, రాష్ట్ర కార్యదర్శి నరేందర్, ఉపాధ్యక్షులు అమృత్కుమార్, నరహరి, సుధాకర్, నగర అధ్యక్ష, కార్యదర్శులు సుమన్, సత్యనారాయణ, జగదీష్ పాల్గొన్నారు. -
ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దు
నిజామాబాద్ నాగారం: జిల్లాల విభజన నేపథ్యంలో ఉద్యోగులంతా పగలూరాత్రి తేడా లేకుండా విధులు నిర్వహిస్తుంటే, కొంత మంది అధికారులు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై మంగళవారం టీఎన్జీవోఎస్ భవన్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆ యన మాట్లాడారు. వ్యవసాయంతో పాటు పలు శాఖల్లోని కొంత మంది అధికారులు ఉద్యోగులను కావాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, సస్పెండ్ చేస్తామని బెదరిస్తున్నట్లు తెలిసిందన్నారు. కలెక్టర్ ఆదేశాల మే రకు సెలవులతో పాటు రాత్రి కూడా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఉద్యోగులకు తాము అండగా ఉన్నామని చెప్పారు. తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోవాలి జిల్లాల విభజన నేపథ్యంలో ఉద్యోగులు వేరే జిల్లాకు వేళ్లేందుకు తాత్కలికంగా ఆర్డర్లు తీసుకోవాలని కిషన్ సూచించారు. అక్కడ సరిపడా సిబ్బందిని నియమించిన తర్వాత మళ్లీ ఉద్యోగుల అభీష్టం మేరకు ఆయా జిల్లాల్లో విధులు నిర్వహించేలా చూస్తామన్నారు. నూతన జిల్లాలో ఏర్పడే కార్యాలయాల్లో ఉద్యోగులకు కావాల్సిన అన్ని మౌలిýS సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. టీఎన్జీవోస్ కేంద్ర ఉపాధ్యక్షుడిగా నరేందర్ టీఎన్జీవోస్ కేంద్ర ఉపాధ్యక్షుడిగా ఎమ్బీ నరేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం నియామకపత్రం అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నగరంలోని టీఎన్జీవోస్ భవన్లో ఆయనను ఘనంగా సత్కరించారు. ఆయన పుట్టిన రోజు కూడా కావడంతో కేక్ కేట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, రాష్ట్ర కార్యదర్శి నరేందర్, ఉపాధ్యక్షులు అమృత్కుమార్, నరహరి, సుధాకర్, నగర అధ్యక్ష, కార్యదర్శులు సుమన్, సత్యనారాయణ, జగదీష్ పాల్గొన్నారు. -
కాటారం డివిజన్ సాధన ఉద్యమం ఉధృతం
ప్రధాన రహదారిపై వంటావార్పుతో నిరసన కాటారం: కాటారం రెవెన్యూ డివిజన్ సాధనకోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ఉద్యోగులు, కులసంఘాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఎనిమిది రోజులుగా మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద నిర్వహిస్తున్న రిలేదీక్షలో భాగంగా సోమవారం మండల మున్నూరు కాపు సంఘం నాయకులు కూర్చున్నారు. ప్రధాన కూడలి వద్ద ప్రధాన రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. అఖిలపక్షం నాయకులు రోడ్డుపై వంటలుచేసి భోజనం చేశారు. అఖిలపక్షం సాధన కమిటీ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ కాటారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా టీఆర్ఎస్ నాయకులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ నాలుగు మండలాలపై ప్రభుత్వ ప్రజాప్రతినిధులు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు ఏర్పాటుచేస్తున్న ప్రభుత్వం కాటారం డివిజన్ ఏర్పాటుచేయాలని డిమాండ్చేశారు. దీనికోసం ఎమ్మెల్యే ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. డివిజన్ ఏర్పాటుకోసం ఎమ్మెల్యే తమతో కలిసిరావాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ అధికార ప్రతినిధి పుల్లూరి రాజేశ్వరరావు, వేమునూరి ప్రభాకర్రెడ్డి, ఎంపీటీసీ పంతకాని సమ్మయ్య, ముకాస నాయకులు దబ్బెట రాజేశ్, కొట్టె ప్రభాకర్, కొట్టె శంకరయ్య, పసుల శంకర్, చీమల రాజు, చీమల సందీప్, కొట్టె శ్రీశైలం, బెల్లంకొండ రామన్న, కొట్టె శ్రీహరి, కొట్టె బాపు, జాగర్ల అశోక్, సర్పంచ్ కాల్వ రాజయ్య పాల్గొన్నారు. -
అన్ని ఫైళ్ల జిరాక్స్ అవసరం లేదు...
హన్మకొండ అర్బన్ : జిల్లాల విభజన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లోని అన్ని రకాల ఫైళ్లు జిరాక్స్ తీయాల్సిన అవసరం లేదని.. ముఖ్యమైన ఒకటి, రెండు రకాల ఫైళ్లు మాత్రం చేస్తే సరిపోతుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జిల్లా అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో దశాబ్దాల కాలం నాటి ఫైళ్లతో కుస్తీ పడుతు న్న ఉద్యోగులకు ఊరట లభించినట్లయింది. జిల్లా విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రతి శాఖలోని మొత్త ఫైళ్లు నాలుగు సెట్లు జిరాక్స్ తీసి కొత్తగా ఏర్పాడ బోయే జిల్లాలకు పంపించాలని గతంలో ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం అన్ని రకాల ఫైళ్లు వద్దు, ము ఖ్యమైన ఫైళ్లు మాత్రమే అనడంతో దాదాపు 80శాతం పనిభారం తగ్గినట్లు అధికారులు చెపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం కోర్టు కేసులకు సంబంధించినవి, స్టాక్ వివరాలకు సంబంధించి మొ త్తం రెండు కేగిరీల ఫైళ్లు మాత్రమే జిరాక్స్ తీయడంతో పాటు స్కాన్ చేయాలి. వీటితో పాటు జిల్లా స్థాయిలో ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ‘ముఖ్యమైనవి’ అనుకున్న ఫైళ్లు కూడా ఈ జాబితాలో చేర్చా రు. అలాగే, జిరాక్స్ తీసిన, తీయని మొత్తం ఫైళ్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇక జిరాక్స్ తీసిన ఫైళ్లు సంబంధిత కొత్తగా ఏర్పడబోయే జిల్లాలకు పంపించి. మిగతా వాటిని ప్రస్తుత జిల్లా కేం ద్రంలోనే భద్రపరచాలి. భవిష్యత్లో అవసరముంటే కొత్త జిల్లాల వారు ఇక్కడకు వచ్చి ఆ ఫైళ్లు తీసుకువెళ్తారు. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా కార్యాలయాల్లో ఫైళ్లే దర్శనమివ్వకుండా, పనిభారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయిం తీసుకున్నట్లు సమాచారం. -
ఆచారి దీక్షకు స్పందన
కల్వకుర్తి / కల్వకుర్తి రూరల్ : రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను నెరవేర్చాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలకు స్పందన వచ్చింది. శనివారం కల్వకుర్తి పట్టణం ర్యాలీలు, నినాదాలతో దద్దరిల్లింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరింది. ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుర వీధుల గుండా ర్యాలీలు నిర్వహిస్తూ దీక్ష శిబిరం వద్దకు చేరుకుని మద్దతు ప్రకటించారు. ముస్లిం మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో బైక్లు, ఆటోలు, ఇతర వాహనాలతో ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. డ్రై వర్స్ అసోసియేషన్, పద్మశాలీసంఘంతోపాటు భవన నిర్మాణ కార్మికులు సైతం ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి పాల్గొన్నారు. దుందుభీ కళాకారుల బందం దీక్ష శిబిరాన్ని ఆటపాటలతో ఉర్రూత లూగించింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్దాస్ తదితరులు పాల్గొన్నారు. -
హుజూర్నగర్ను రెవెన్యూ డివిజన్గా మార్చాలి
హుజూర్నగర్ : నియోజకవర్గ కేంద్రమైన హుజూర్నగర్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఏదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో చేర్చిన కోదాడ రెవెన్యూ డివిజన్ను వెంటనే రద్దు చేయాలన్నారు. అన్ని అర్హతలున్న హుజూర్నగర్ను రెవెన్యూ డివిజన్గా ఎందుకు ఏర్పాటు చేయడం లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. హుజూర్నగర్ పాత తాలుకాగా ఉండటంతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన డివిజనల్ కార్యాలయాలు, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మోడల్ కోర్టు, మోడల్ సబ్ జైలు, సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయన్నారు. రెవిన్యూ డివిజన్ సాధనే లక్ష్యంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులు గల్లా వెంకటేశ్వర్లు, ఎండి.అజీజ్పాషా, చింతిర్యాల నాగయ్య, రెడపంగు పెదవెంకటేశ్వర్లు, గొల్లగోపు వెంకటేశ్వర్లు, కస్తాల ముత్తయ్య, కస్తాల శ్రావణ్కుమార్, నందిగామ ముక్కంటి, బరిగెల చంద్రశేఖర్, ఎస్కె.అన్వర్పాషా, కుంభం శివ, జి. మట్టయ్య పాల్గొన్నారు. -
భువనగిరి డివిజన్లోనే కొనసాగించాలి
రాజాపేట : రాజాపేట మండలాన్ని భువనగిరి డివిజన్లోనే కొనసాగించాలని కోరుతూ మండల కేంద్రంలో బుధవారం మండల సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో వినాయకుడికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగాం డివిజన్లో ఆలేరు, రాజాపేట మండలాలను కలపొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చామకూరు గోపాల్గౌడ్, మెండు శ్రీనివాస్రెడ్డి, గుంటి కష్ణ, గుర్రాల బాలమల్లు, మర్ల సిద్దిఎల్లయ్య, కోరుకొప్పుల శీరీష, ఉప్పరి లావణ్య, నాయకులు దాచపల్లి శ్రీనివాస్, ఉప్పరి నరేష్, కోరుకొప్పుల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలి
రామన్నపేట రామన్నపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలని మాజీ ఎంపీపీ నీల దయాకర్, యూత్కాంగ్రెస్ రాష్ట్రప్రధానకార్యదర్శి వనం చంద్రశేఖర్ కోరారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం సంతకాలను సేకరించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ ఎ. ప్రమోదినికి వినతిపత్రం సమర్పించారు. రామన్నపేట కేంద్రంగా వలిగొండ, చౌట్పుప్పల్, మోత్కూర్,ఆత్మకూరు మండలాలతో రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మినుముల వెంకటరామయ్య, కన్నెబోయిన అయిలయ్య, దొమ్మాటి లింగారెడ్డి, వనం సాయిబాబా, బొడ్డు అల్లయ్య, లవనం ఉపేందర్, సురేష్, ఎండీ జాని, మినుముల సందీప్, కుమారస్వామి, రాజశేఖర్, మోహన్, అశోక్ పాల్గొన్నారు. -
ఆలేరును డివిజన్గా మార్చాలని రాస్తారోకో
ఆలేరు : పట్టణంలో మూసివేసిన రైల్వేగేట్ను తెరిపించాలని, ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ మేరకు శనివారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హన్మకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఆందోళనకారులు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైల్వేగేట్ను తెరిపించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే విషయం తెలుసుకున్న సీఐ రఘువీర్రెడ్డి, పలువురు ఎస్సైలు తమ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జనగాం ఉపేందర్రెడ్డి, నీలం పద్మ, కొలుపుల హరినాథ్, కె సాగర్రెడ్డి, మంగ నర్సింహులు, జూకంటి ఉప్పలయ్య, ఎక్బాల్, ఎజాజ్, గోద శ్రీరాములు, కావటి సిద్ధిలింగం, తునికి దశరథ, జంపాల శ్రీనివాస్, పసుపునూరి విరేశం, ఐడియా శ్రీనివాస్, రాచకొండ జనార్దన్, చామకూర అమరేందర్రెడ్డి, గాదపాక దానయ్య, భీజని మధు, అప్సర్ పాల్గొన్నారు. సీఐతో వాగ్వాదం... రాస్తారోకో సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దిష్టిబొమ్మను దహనం చేసేందుకు అఖిలపక్ష నాయకులు ప్రయత్నించగా వారిని యాదగిరిగుట్ట సీఐ అడ్డుకున్నారు. దీంతో కొందరు నాయకులు రహదారిపైకి దిష్టిబొమ్మను తీసుకువచ్చి దహనం చేస్తుండగా అడ్డుకోబోయారు. ఈ క్రమంలో ఎం.డి సలీం, చెక్క వెంకటేశ్, తునికి దశరథ అనే కార్యకర్తలు కిందపడిపోవడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో ఆందోళనకారులు సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, గాయపడిన నాయకులను ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పరామర్శించారు. -
జిల్లాల విభజన శాస్త్రీయంగా ఉండాలి
చిలుకూరు: జిల్లాల విభజన శాస్త్రీయంగా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బేతవోలు లో జరిగిన సీపీఐ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. విధివిధానాలు ఏమీ ప్రకటించకుండా అఖిలపక్ష నాయకులను పిలవడం సమంజసం కాదన్నారు. మండలంలోని అన్ని గ్రామాలను ఒకే నియోజకవర్గంలో ఉంచాలన్నారు. ఇష్టానుసారంగా విభజన చేశారని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవంను ప్రభుత్వం అధికారంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట చర్రితను ప్రజలకు తెలియజేసేందుకు సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బస్సు యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాలో ఈ నెల 11వ తేదీన యాద్రాది నుంచి ప్రారంభమై ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, చిలుకూరు మీదుగా వెళ్లి హుజూర్నగర్లో రాత్రి ముగుస్తుందన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్, నాయకులు మండవ వెంకటేశ్వర్లు, నంద్యాల రామిరెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు, తాళ్లూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
డివిజన్ స్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక
భువనగిరి అర్బన్ : మండల స్థాయి క్రీడ పోటీల్లో గెలుపొందిన అనంతారం పాఠశాలలోని విద్యార్థులు డివిజన్ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల పీఈటీ మల్లేశం తెలిపారు. శుక్రవారం మండలంలోని అనంతారం గ్రామంలోని పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అండర్–14 వాలీబాల్లో బాలికలు ప్ర«థమ, బాలురు ద్వితీయ స్థానాలను కైవసం చేసుకుని డివిజన్ స్థాయి క్రీడాలకు ఎంపికైనట్లు చెప్పారు. అలాగే అండర్–17 బాలుర వాలీబాల్లో ఎ.ప్రేమ్కుమార్, వి.సుభాష్చంద్రబోస్, బాలకల విభాగంలో ఎం.శ్రావణి, కె.పూజిత, వి.ఇందు, జి.లహరి, టి.గౌతమి, అండర్–14 బాలుర విభాగంలో ఎ.తిలక్, బి.మధు, పి.సాయికుమార్, బాలకల విభాగంలో జి.శ్రీలత, శ్రావణి, ఇ.సుస్మిత, పి.రేణుక, కె.మనీషా విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. వీరిని గ్రామ సర్పంచ్ విఠల రాఘురామయ్య, ఎంపీటీసీ శంకరయ్య, ఉప సర్పంచ్ ఒగ్గు శివకుమార్, పాఠశాల హెచ్ఎం జి.విజయ, ఉపాధ్యాయ బృందం అభినందించారు. -
డివిజన్ సాధనకు ఉద్యమం ఉధృతం
– కల్వకుర్తిలో ఐదో రోజుకు చేరిన రిలేదీక్షలు కల్వకుర్తి రూరల్ : కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధనకు అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు ఆదివారం ఐదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో నాయకులు నర్సింహ, రాంరెడ్డి, రవిగౌడ్, హన్మం™Œ గౌడ్, నవీన్రెడ్డి, శ్రీకాంత్ తదితరులు కూర్చున్నారు. వీరికి టీఎన్జీఓ తాలూకా అధ్యక్షుడు బావండ్ల వెంకటేష్, నగర పంచాయతీ వైస్ చైర్మన్ షాహేద్, అఖిలపక్షం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ సాధనకు ఐక్యమత్యంతో చేస్తున్న పోరుకు సమాజంలోని అన్ని వర్గాల కుల సంఘాలు, ఇతరులు మద్దతుగా నిలవడం హర్షణీయమన్నారు. ఈసందర్భంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్న, కష్ణ, టీడీపీ నాయకులు పాండుయాదవ్, బీజేపీ నాయకులు రాఘవేందర్, దుర్గాప్రసాద్, గంగాధర్, జగదీష్, కోఆప్షన్ ఖలీల్, బీఎస్పీ జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
రామన్నపేటను డివిజన్ కేంద్రంగా మార్చాలి
రామన్నపేట పాత అసెంబ్లీ నియోజకవర ్గకేంద్రమైన రామన్నపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలని మండల సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. రామన్నపేట మండలం నూతనంగా ఏర్పడే యాదాద్రి జిల్లాలో కలుస్తుందని, జిల్లాకు చివర నుండే రామన్నపేట భవిష్యత్తులో ఇంకా వెనుకబడే అవకాశం ఉందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచనాదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తీర్మానించారు. మునిపంపుల వైద్యాధికారి, సిబ్బంది çసక్రమంగా విధులకు హాజరుకావడం లేదని జెడ్పీటీసీ జినుకల వసంత ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతం కావడంవల్ల కొంత ఇబ్బంది కలుగుతుందని వైద్యాధికారి బదులివ్వడంతో ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి జోక్యంచేసుకొని మండలకేంద్రానికి 7కిలోమీటర్ల దూరంలో ఉన్న మునిపంపుల మారుమూల ప్రాంతం ఎలా అవుతుందని, అలాంటప్పుడు ఉద్యోగాలు మానుకోవాలని తీవ్రంగా స్పందించారు. రెవెన్యూ శాఖ పనితీరును వివరించేందుకు డీటీ జె.ఎల్లేశం వేదికవద్దకు రాగా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూశాఖ పనితీరుపట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. కాలువల ఆధునికీకరణకు రూ.350కోట్లు : ఎమ్మెల్యే భువనగిరి డివిజన్లోని నాలుగు సాగునీటి కాలువల ఆధునికీకరణకు రూ.350కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులకు భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరమ్మత్తులు చేయడం జరుగుతుందని చెప్పారు. మూడవవిడత మిషన్కాకతీయపనుల ఎంపికలో స్థానిక ప్రజాప్రతినిధులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఏరియా ఆసుపత్రిలో విధులపట్ల నిర్లక్ష్యం వహించే డాక్టర్లు, సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో ఎంపీడీఓ కె.జానకిరెడ్డి, వైస్ఎంపీపీ బద్దుల ఉమారమేష్, సభ్యులు ఆకవరపు మధుబాబు, పున్న వెంకటేశం, కూరెళ్ల నర్సింహాచారి, చల్లా వెంకట్రెడ్డి బండమీది సరిత, ఊట్కూరి శోభ, సాల్వేరు రోజ, బండ పద్మ, మేకల భద్రమ్మ, మంటి సరోజ, వెలిజాల లక్ష్మమ్మలతోపాటు, వివిధగ్రామాల సర్పంచ్లు, వివిధశాఖల అధికారులు హాజరయ్యారు. -
చిన్నది కానున్న ‘మిర్యాలగూడ’
– డివిజన్లో నాడు 11 మండలాలు – విభజనలో తొమ్మిది మండలాలతో సరి – మూడు నియోజకవర్గాల పరిధిలోకి మాడ్గులపల్లి మిర్యాలగూడ పట్టణం మిర్యాలగూడ : మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ మరింత చిన్నది కానున్నది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల విభజనల అనంతరం మిర్యాలగూడ డివిజన్ చిన్నది కానున్నది. గతంలో 11 మండలాలతో ఉన్న మిర్యాలగూడ డివిజన్ నుంచి నాలుగు మండలాలను ఇతర డివిజన్లో కలుపుతున్నారు. కాగా మరో రెండు కొత్త మండలాలను చేర్చుతున్నారు. గతంలో మిర్యాలగూడ డివిజన్లో మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి, త్రిపురారం, నిడమనూరు, హాలియా, పెద్దవూర, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్, మఠంపల్లి మండలాలు ఉండేవి. కాగా వీటిలో హుజూర్నగర్, మఠంపల్లి మండలాలను నూతనంగా ఏర్పాటయ్యే కోదాడ డివిజన్లో కలుపుతుండగా నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాన్ని మాత్రం సూర్యాపేట డివిజన్లో కలుపుతున్నారు. ఇదిలా ఉండగా నూతనంగా ఏర్పడనున్న తిరుమలగిరి (సాగర్), మాడ్గులపల్లి మండలాలను మిర్యాలగూడ డివిజన్లో కలపనున్నారు. నాలుగు మండలాలను తొలగించి రెండు మండలాలను కలపడం వల్ల తొమ్మిది మండలాలకు మిర్యాలగూడ డివిజన్ పరిమితం కానున్నది. మూడు నియోజకవర్గాల పరిధిలోకి మాడ్గులపల్లి నూతనంగా ఏర్పడే మాడ్గులపల్లి మండలం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి రానున్నది. ప్రస్తుతం మాడ్గులపల్లి గ్రామం తిప్పర్తి మండలంలో ఉండగా పునర్విభజనలో భాగంగా మాడ్గులపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. కానీ నూతనంగా ఏర్పడే మండలంలో తిప్పర్తి, నిడమనూరు, త్రిపురారం, వేములపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలను కలపనున్నారు. దాంతో మూడు నియోజకవర్గాలైన మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నల్లగొండకు సంబంధించిన గ్రామాలు ఈ మండలంలో చేరనున్నాయి. నూతనంగా ఏర్పడే మాడ్గులపల్లి మండలంలో వేములపల్లి మండలం నుంచి కోయిలపాడు, ఆగామోత్కూర్, చిరుమర్తి, కుక్కడం, గండ్రవారిగూడెం, తోపుచర్ల, కల్వలపాలెం, నిడమనూరు మండలం నుంచి కన్నెకల్, త్రిపురారం మండలం నుంచి పూసలపాడు, గజలాపురం, పెద్దదేవులపల్లి, నర్లెకంటిగూడెం, అబంగాపురం, త్రిప్పర్తి మండలం నుంచి చెర్వుపల్లి, దాచారం, ఇందుగుల గ్రామాలను కలపనున్నారు. వేములపల్లి మండలం నుంచి మాడ్గులపల్లిలోకి కలిసే గ్రామాలు మిర్యాలగూడ నియోజకవర్గం, త్రిపురారం, నిడమనూరు మండలాల్లోని గ్రామాలు నాగార్జునసాగర్, తిప్పర్తి మండలంలోని గ్రామాలు నల్లగొండ నియోజకవర్గం నుంచి వచ్చి కలవనున్నాయి. -
రాయికల్ను జగిత్యాల రెవెన్యూ డివిజన్లో ఉంచాలి
రాయికల్ : రాయికల్ మండలాన్ని జగిత్యాల రెవెన్యూ డివిజన్లోనే కొనసాగించాలని కోరుతూ మండల బీజేపీ ఆధ్వర్యంలో శనివారం తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు తురగ శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ, దశాబ్ద కాలంగా రాయికల్ జగిత్యాల రెవెన్యూ డివిజన్లో ఉందని మండలంలోని ప్రజలకు వర్తక, వ్యాపారపరంగా జగిత్యాలతో సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా రాయికల్ మండలాన్ని కోరుట్ల రెవెన్యూలో కలపడం సరికాదన్నారు. తహసీల్దార్ చంద్రప్రకాశ్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాజంగి అశోక్, వెంకటేశ్వర్రెడ్డి, వేణు, రాంచంద్రం, ధర్మపురి, రమేశ్, నరేశ్ పాల్గొన్నారు. -
డివిజన్.. డీల్
ఆగస్టు 10న కౌన్సిల్కు నిర్ణయం ప్రతీ డివిజన్కు రూ.30లక్షల నుంచి రూ.50లక్షలకు పెంపు మూడు నెలలకోసారి రూ.లక్ష అత్యవసర నిధులు పాత పనులకు నో చెప్పిన కార్పొరేటర్లు అధికారులు, కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సమీక్ష ఖమ్మం : విమర్శలు.. ప్రతి విమర్శలు.. అలక సీన్లు, బుజ్జగింపులు.. నిధులు కేటాయింపుపై పెదవి విరుపు.. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అంతరం.. అంతలోనే అధికారుల తీరుపై రహస్య సమావేశాలు.. స్పందించిన నాయకులు.. కమిషనర్ బదిలీ.. వంటి సంఘటనలతో ముడిపడి ఉన్న ఖమ్మం కార్పొరేషన్ పాలక మండలి సమావేశం ఓ కొలిక్కి వచ్చింది. కార్పొరేటర్లకు అనుకూలంగా తీర్మానాలు ఉండేలా ఆగస్టు 10వ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సమాలోచనకు వచ్చినట్లు తెలిసింది. కౌన్సిల్ సమావేశం, ఖమ్మం నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ తన క్యాంప్ కార్యాలయంలో మేయర్ పాపాలాల్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, విద్యుత్, రెవెన్యూ శాఖలతోపాటు కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్షించారు. సమావేశపు తేదీ, నిధుల కేటాయింపు తీర్మానాలు మొదలైన విషయాలపై చర్చించారు. ఆగస్టు 10న కౌన్సిల్ సమావేశం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారు పలు వివాదాలకు దారి తీసింది. తీర్మానాలపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం.. కమిషనర్పై నాయకులకు ఫిర్యాదు చేయడం.. వారు స్పందించి కమిషనర్ వేణుగోపాల్రెడ్డిని పట్టుబట్టి బదిలీ చేయించారనే వార్తలొచ్చాయి. ఇటువంటి పరిస్థితిలో తిరిగి సమావేశం ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడ్డారు. ఏకపక్ష నిర్ణయం ఎందుకనే ఆలోచనతోపాటు స్థానిక ఎమ్మెల్యేతో సమావేశం విషయం ప్రస్తావించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే బుధవారం సమావేశం ఏర్పాటు చేసి.. అందరు కార్పొరేటర్లతో చర్చించి ఆగస్టు 10న కౌన్సిల్ సమావేశం ఏర్పాటు, తీర్మానాలపై సలహాలు సూచనలు తీసుకున్నట్లు తెలిసింది. కార్పొరేటర్లకు బొనాంజా కార్పొరేటర్లందరినీ మెప్పించే విధంగా ఎమ్మెల్యే సూచనలు చేయడంతో అధికారులు, కార్పొరేటర్ల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిసింది. గతంలో డివిజన్ అభివృద్ధికి రూ.30లక్షలు, మొత్తం రూ.15కోట్లతో చేపట్టే పనులకు తీర్మానాలు తయారు చేశారు. అయితే రూ.30లక్షలు సరిపోవని కార్పొరేటర్లు కోరగా.. వీటిని రూ. 50లక్షలకు పెంచి మొత్తం రూ.25కోట్ల పనులకు తీర్మానాలు చేసేలా అంగీకరించారు. ఆయా డివిజన్లలో అత్యవసర పనులు చేపట్టేందుకు కార్పొరేటర్వద్ద డబ్బులు ఉండాలని, ప్రతీ మూడు నెలలకోమారు రూ.లక్ష కేటాయించి వాటిని పారిశుద్ధ్య, తాగునీటి సరఫరా, ఇతర కార్యక్రమాలకు ఉపయోగించేలా అవకాశం కల్పించనున్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యత కార్పొరేటర్లకు అప్పగించడంతోపాటు డివిజన్కు 100 చొప్పున టీగార్డులు కొనుగోలు చేసి ఇవ్వాలనే అంశాన్ని పొందుపరిచారు. కార్పొరేటర్లు వ్యతిరేకించిన రూ.4.5కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద చేపట్టిన పనులకు జనరల్ ఫండ్ నుంచి నిధులు కేటాయించాలనే నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లు తెలిసింది. రూ.100కోట్లపై చర్చ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా ప్రతీ కార్పొరేషన్కు రూ.100కోట్ల కేటాయింపు జరిగితే వాటిని ఎలా ఖర్చు చేయాలనే అంశంపై చర్చ జరిగింది. ఈ నిధులతో గోళ్లపాడు చానల్ పనులు, నగరంలోని ఇల్లెందు క్రాస్రోడ్డు, కొత్తబస్టాండ్ సెంటర్తోపాటు కూరగాయల మార్కెట్, గాంధీచౌక్ సెంటర్ సుందరీకరణ, వాటర్ ఫౌంటేన్ ఏర్పాటుతోపాటు గాంధీచౌక్ నుంచి ట్రంక్రోడ్డు మీదుగా కాల్వొడ్డు వరకు ఫోర్లేన్ రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న షాదీఖానా మరమ్మతులు, కొత్త షాదీఖానా, కబేళా నిర్మాణాలు, దంసలాపురం, బల్లేపల్లి ప్రాంతాల్లో కొత్తగా రెండు శ్మశాన వాటికల కోసం స్థలం కేటాయింపునకు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కార్పొరేషన్ పరిధిలో ఉండి..lఆర్అండ్బీ రోడ్లకు అనుసంధానంగా ఉన్న రోడ్లను ఆర్అండ్బీకి కేటాయించాలని, వీటికి ఆధునికీకరణ పనులు చేపట్టేలా మంత్రి తుమ్మలను కోరేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చేసిన సూచనలకు కార్పొరేటర్లు, అధికారులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
హైకోర్టు విభజనే పరిష్కారం:కేసీఆర్
-వాస్తవాలను కేంద్రానికి వివరించండి -గవర్నర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: తక్షణమే హైకోర్టు విభజనను చేపట్టేలా వాస్తవాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో హైకోర్టు విభజన వివాదం...న్యాయాధికారుల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గవర్నర్తో భేటీ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం రాజ్భవన్కు వెళ్లిన సీఎం అరగంట సేపు గవర్నర్తో సమావేశమయ్యారు. వరుసగా జరుగుతున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు విభజనకు ముందే న్యాయాధికారుల కేటాయింపులు చేయటంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని వివరించారు. తెలంగాణకు 95 మందిని, ఏపీకి 110 మంది న్యాయాధికారులను కేటాయించగా... తెలంగాణకు ఇచ్చిన 95 మంది న్యాయాధికారుల్లో 58 మంది ఏపీకి చెందిన వారే ఉన్నారని వివరించారు. న్యాయాధికారులు, జూనియర్ జడ్జీలు, సీనియర్ జడ్జీలు.. అన్ని కేడర్లలో ఏపీకి చెందిన 143 మందిని తెలంగాణకు కేటాయించినట్లు చెప్పారు. దీంతో భవిష్యత్తులో తెలంగాణకు చెందిన న్యాయాధికారులు తీవ్రంగా నష్టపోతారని.. అందుకే ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని గవర్నర్కు నివేదించారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్కు తాను రాసిన లేఖ ప్రతిని, గతంలో హైకోర్టు విభజనను చేపట్టాలని పలుమార్లు కేంద్రానికి రాసిన లేఖలను, ప్రస్తుత వివాదం పూర్వాపరాలపై సిద్ధం చేసిన నివేదికను ఈ సందర్భంగా సీఎం గవర్నర్కు సమర్పించారు. హైకోర్టు విభజన చేపడితేనే ఈ సమస్య పరిష్కారమవుతుందని.. అప్పటివరకు కేటాయింపులను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు మంగళవారం ఢిల్లీలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడను కలిసిన సందర్భంలో ఆయన గవర్నర్తో మాట్లాడుతానని హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రం ఈ విషయంలో సంప్రదింపులు జరిపితే.. న్యాయ శాఖ మంత్రి మాట్లాడినా వాస్తవాలను వివరించి.. హైకోర్టు విభజనకు సహకరించాలని గవర్నర్కు సీఎం విజ్ఞప్తి చేశారు. హైకోర్టు వివాదంతో పాటు జంట నగరాల్లో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నడం, అనుమానితులను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటనపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలిసింది. -
విభజన, విలీనంపై వినతుల వెల్లువ
♦ గ్రీవెన్స్లో మెజార్టీ అర్జీలు ♦ వీటిపైనే వినతులు స్వీకరించిన ♦ జేసీ, అదనపు జేసీ సంగారెడ్డి జోన్ : మండలాల విలీనం, విభజనలపైనే జిల్లా నలుమూలల నుంచి వినతులు వెల్లువెత్తాయి. గ్రీవెన్స్-డేను పురస్కరించుకుని ప్రజలు సోమవారం పెద్ద ఎత్తున కలెక్టరేట్కు తరలివచ్చారు. తమ అభిప్రాయాలను వినతిపత్రాల రూపంలో అధికారులకు అందజేశారు. గ్రీవెన్స్లో వచ్చిన అర్జీలను జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అదనపు జేసీ వి.వెంకటేశ్వర్లు, డీఆర్ఓ దయానంద్, ఇతర శాఖల అధికారులు స్వీకరించారు. నూతనంగా ప్రకటించనున్న మండల కేంద్రాలకు దగ్గరలోని రెవెన్యూ గ్రామాలను సమీపంలోని ప్రాతిపాదిత మండలాల్లో విలీనం చేయాలని ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఇతర సమస్యలపైనా వినతులు అందాయి. ⇒ రేగోడ్ మండలాన్ని పూర్తి స్థాయిలో సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ⇒ మెద క్ మండలం బూర్గుపల్లిని మండల కేంద్రం చేయడంతోపాటు కళాశాలను మంజూరు చేయాలని బూర్గుపల్లి, వాడి, రాజిపేట, కొత్తపల్లి తండాల వాసులు జేసీకి వినతి పత్రం సమర్పించారు. ⇒ శివ్వంపేట మండలం నవాబుపేట గ్రామం గుమ్మడిదలకు కేవలం 6 కి.మీ. దూరంలోనే ఉందని, దీన్ని ప్రతిపాదిత గుమ్మడిదలలో విలీనం చేయాలని సర్పంచ్ భిక్షపతి ఆధ్వర్యంలో ఆదివారం గ్రామసభ నిర్వహించి తీర్మానం చేసిన కాపీని అధికారులకు అందజేశారు. ⇒ హత్నూర మండలం నాగారం పంచాయతీలో గల రొయ్యపల్లి, అవంచగూడ గ్రామాలను 3 కి.మీ. దూరంలో గల జిన్నారం మండలంలో విలీనం చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. ⇒ మునిపల్లి మండలంలో కంకోల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు రమేశ్ యాదవ్ జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ⇒ అంగవైకల్యంతో బాధ పడుతున్న దళిత వర్గానికి చెందిన తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోహీర్ మండలం బిలాల్పూర్కు చెందిన డప్పు మల్లమ్మ కోరారు. ⇒ సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ఖాన్పేట పరిధిలో నిర్మిస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పక్కన గల తమ పట్టా భూముల్లో అధికారిక సమాచారం ఇవ్వకుండా విద్యుత్ స్తంభాలు, రోడ్డు నిర్మించారని, లోతైన గుంతలతో సాగుకు పనికి రాకుండా చేశారని గ్రామస్తులు అంజిరెడ్డి, యాదమ్మ, మల్లారెడ్డి, కిష్టారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. ⇒ అమ్మానాన్నలు మృతి చెందడంతో అనాథలమయ్యాం. తన తమ్ముడు నవీన్కు జోగిపేట, సంగారెడ్డిలోని ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రవేశం కల్పించాలని పుల్కల్ మండలం ముదిమాణిక్యంకు చెందిన శ్రావణ్ కోరారు. ⇒ సంగారెడ్డిలోని బొబ్బిలికుంట నుంచి కల్వకుంట పంట పొలాలకు వెళ్లే కాలువ విస్తీర్ణం 33 ఫీట్లు కాగా, ప్రస్తుతం శాంతినగర్, శ్రీ విద్యానికేతన్ పాఠశాల వద్ద పంట కాల్వలను ఆక్రమించుకుని ఇళ్లు, ప్రహరీలు నిర్మించుకున్నారని, వాటిని తొలగించాలని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ⇒ 20 గుంటల భూమిని పక్క పొలానికి చెందిన వారుఆక్రమించుకున్నారని, సాగులోకి వెళ్లనీయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని దౌల్తాబాద్ మండలం చిన్నమసాన్పల్లికి చెందిన నర్సారెడ్డి ఫిర్యాదు చేశారు. ⇒ బోరుబావి, పైప్లైన్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, నష్ట పరిహారం ఇప్పించాలని బాధితుడు దుబ్బాక మండలానికి చెందిన అనంపల్లి రాజు అధికారులను కోరారు. ⇒ ఎకరా 34 గుంటల భూమిని దాయాదులు కబ్జా చేయడమే కాకుండా రికార్డుల్లోనూ మార్పులు జరిగాయని, తనకు న్యాయం చేయాలని మెదక్ మండలం పాతూర్కు చెందిన దొరబోయిన సిద్దప్ప కోరారు. -
ఏ కమిషరేట్ కావాలి?
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ విభజన వేగం పుంజుకుంది. ఇప్పటికే ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ప్రతిపాదనలు పంపిన ఉన్నతాధికారులు ఇప్పుడు ఉద్యోగుల పంపకాలపై దృష్టి సారించారు. ఈ మేరకు ఎవరెవరు ఏ కమిషనరేట్లకు వెళతారని రెండు రోజుల నుంచి ఉన్నతాధికారులు సిబ్బంది నుంచి ఆప్షన్లు తీసుకుంటున్నట్లు సమాచారం. స్పెషల్ బ్రాంచ్, మినిస్టీరియల్ స్టాఫ్, సెక్యూరిటీ వింగ్, బాంబు నిర్వీర్య బృందాలు, సెక్యూరిటీ, ఆర్డ్మ్ పోలీసు విభాగాల సిబ్బందిని ఈస్ట్ లేదా వెస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. శాంతిభద్రతల విభాగంలో పని చేస్తున్న వారితో పాటు మిగతా ఫోర్స్ మాత్రం యధావిధిగా ఎక్కడ ఉన్నా వారు అక్కడే విధులు నిర్వర్తించనున్నారు. ఈస్ట్ జోన్లోకి పహాడీషరీఫ్ ఠాణా... ఈస్ట్ కమిషనరేట్లోకి ఎల్బీనగర్ జోన్ మొత్తం రానుండగా, మల్కాజిగిరి జోన్లోని అల్వాల్ పోలీసు స్టేషన్ మినహా మిగిలిన ఠాణాలన్నీ చేర్చాలని నిర్ణయించారు. అయితే శంషాబాద్ జోన్లోని పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ను ఎల్బీనగర్ జోన్లోకి చేరుస్తూ ఈస్ట్లో కలపాలని భావిస్తున్నారు. నల్గొండ జిల్లా నుంచి చౌటుప్పల్, భువనగిరి రూరల్ అండ్ టౌన్, బీబీనగర్, వలిగొండ, పోచంపల్లి, బొమ్మాలరామారం పోలీసు స్టేషన్లు, భువనగిరి ట్రాఫిక్.... చౌటుప్పల్ ట్రాఫిక్ ఠాణాలు కూడా ఈస్ట్లో కలుపుతూ చేసిన ప్రతిపాదనను ఇప్పటికే డీజీపీ కార్యాలయంలోని రీ-ఆర్గనైజేషన్ వింగ్ ప్రభుత్వానికి సమర్పించింది. వెస్ట్లోకి అల్వాల్ పోలీసు స్టేషన్... వెస్ట్ కమిషనరేట్లోకి శంషాబాద్ జోన్, మాదాపూర్ జోన్, బాలానగర్ జోన్లు రానున్నాయి. అయితే ప్రస్తుతం మల్కాజిగిరి జోన్లో ఉన్న అల్వాల్ ఠాణాను బాలానగర్ జోన్లోకి తీసుకువస్తూ వెస్ట్లోనే కలపాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మెదక్ నుంచి ఆర్సీ పురం, రంగారెడ్డి నుంచి శంకరపల్లి, షాబాద్ ఠాణాలు, మహబూబ్నగర్ నుంచి షాద్నగర్, కొత్తూరు, కొందుర్గు, కేశంపేట్ పోలీసు స్టేషన్లు, షాద్నగర్ ట్రాఫిక్ ఠాణాను వెస్ట్ కమిషనరేట్లో కలుపుతూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ విభజనపై ఓ నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం... లీగల్, ఫైనాన్స్పైనా దృష్టి సారించిందని తెలుస్తోంది. -
తెలంగాణ లాయర్ల ‘ఉద్యమ’ బాట!
చిచ్చు రేపిన న్యాయాధికారుల కేటాయింపులు సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల విభజనపై మరో ఉద్యమానికి తెలంగాణ న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ న్యాయాధికారులు ఇందుకు పరోక్షంగా మద్దతిస్తున్నారు. భావి కార్యాచరణ కోసం తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అత్యవసర కార్యవర్గ సమావేశం గురువారం జరగనుంది. జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులతో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కూడా శనివారం భేటీ జరపనుంది. తెలంగాణ న్యాయాధికారులు కూడా ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. న్యాయాధికారుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించిన హైకోర్టు, కేటాయింపులను మాత్రం వాటికి విరుద్ధంగా చేసిందంటూ లాయర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన వారిలో 141 మంది ఏపీ చెందిన న్యాయాధికారులున్నారని తెలిసి కూడా హైకోర్టు ప్రాథమిక జాబితాను విడుదల చేసిందని, ఇది సరికాదన్నారు. కేటాయింపుల్లో అన్యాయంపై అంతా కలిసి తమ వాదనలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ‘‘ఈ కేటాయింపులను ఆమోదిస్తే వచ్చే రెండేళ్లల్లో ఏపీలో భారీగా ఖాళీలు ఏర్పడతాయి గానీ తెలంగాణలో మాత్రం అందుకు ఆస్కారముండదు. తెలంగాణ న్యాయాధికారులకు పదోన్నతుల్లోనూ తీరని అన్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేదాకా దీనిపై పోరాటం చేస్తాం’’ అని వారంటున్నారు. -
గెలిపిస్తే డివిజన్ల అభివృద్ధి
♦ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ♦ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 35,49, 50 డివిజన్లలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఖమ్మం : కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపిస్తే.. డివిజన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని 35,49,50 డివిజన్లలో పోటీ చేస్తున్న గుండపూడి జయమ్మ, గుండ్ల రవికుమార్, పీట్ల పార్వతమ్మను గెలిపించాలని కోరుతూ శుక్రవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 35వ డివిజన్లోని రాపర్తినగర్ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. రాజీవ్నగర్, బుర్హాన్పురం చెరువు కట్ట, వాటర్ ట్యాంక్ ఏరియా, రామాలయం వీధుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. దినసరి కూలీలు, చాట్ బండార్ వ్యాపారులు, కార్మికులు, గృహిణులను ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. 49వ డివి జన్ పరిధిలోని దానవాయిగూడెం, కాలనీల్లో గుండ్ల రవికుమార్ తరఫున, 50డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ, రామన్నపేట కాలనీ, రామన్నపేట ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వ హించారు. ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డివిజన్ ఇన్చార్జ్లు, పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ బొర్రా రాజశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్రెడ్డి, నాయకులు గుండపనేని నాగేశ్వరరావు, ఉపేంద్ర, అజ్మీరా లింగరాజు, సూర్యం, సాయి, పాండు, కన్నేటి వెంకన్న, టీ.ఈశ్వరాచారి, ఎం.కృష్ణారెడ్డి, జీ.అరవింద్,కన్నేటి వెంకన్న, నాయకులు ఎస్కే సోందు, మద్దినేని శ్రీనివాసరావు, బల్లెం వీర స్వామి, పల్లపు వెంకన్న, మంగల సుమన్ పాల్గొన్నారు. -
కిందిస్థాయి న్యాయ వ్యవస్థ విభజనతో మాకు సంబంధం లేదు
♦ హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం ♦ పోస్టుల భర్తీలోనూ మా పాత్ర ఉండదు ♦ విభజన కోసం హైకోర్టే స్వీయ నిబంధనలు రూపొందించుకోవాలి ♦ తెలంగాణ సర్కారు వాదనలు వింటామన్న ధర్మాసనం ♦ ఆ తరువాతే ఈ కేసులో తీర్పును వాయిదా వేస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని కింది స్థాయి న్యాయవ్యవస్థ విభజనతో తమకు ఎటువంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. కింది స్థాయి న్యాయవ్యవస్థ విభజన కోసం హైకోర్టే స్వీయ నిబంధనలను రూపొందించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ స్వీయ నిబంధనలను తమ ఆమోదం కోసం పంపాల్సి ఉంటుందని వివరించింది. అంతేగాకుండా కింది స్థాయి న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ ప్రక్రియలో కూడా తమ జోక్యం ఉండదని తెలిపింది. దీంతో ఈ విషయాన్ని రాతపూర్వకంగా అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక కింది స్థాయి న్యాయవ్యవస్థ విభజన, జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ వాదనలు వినాలని భావిస్తున్నామని పేర్కొంటూ విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది.. రాష్ట్ర విభజన నేపథ్యంలో కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన పూర్తయ్యేంత వరకు జూనియర్ సివిల్ జడ్జిల పోస్టులను భర్తీ చేయరాదంటూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, మరికొందరు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ వాదనలు వినిపిస్తూ... కింది స్థాయి న్యాయవ్యవస్థ విభజన విషయంలో హైకోర్టు స్వీయ నిబంధనలను రూపొందించుకోవాలని, వాటిని తమ ఆమోదం కోసం పంపినప్పుడు మాత్రమే పునర్విభజన చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం తాము జోక్యం చేసుకుంటామని వివరించారు. దీంతో మరి పోస్టుల భర్తీ సంగతి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. అందులోనూ తమకు ఎటువంటి పాత్ర ఉండదని నటరాజ్ చెప్పారు. అనంతరం పిటిషనర్ సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ... పునర్విభజన చట్టాన్ని చూపి చేతులు దులుపుకొనేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన విషయంలో ఉభయ రాష్ట్రాలు తగవులాగుడుతుంటే... కేంద్రం ఏమీ పట్టనట్లు చూస్తోందని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు ముందు దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టు రిజిస్ట్రీ తన వైఖరిని స్పష్టంగా చెప్పలేదని, దీనివల్లే సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. మరో సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ... తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రానికి సొంత జ్యుడిషియల్ సర్వీసు నిబంధనలు వచ్చాయని, అవి అమల్లో ఉండగా ఏపీ సర్వీసు నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. ఇంప్లీడ్ పిటిషనర్ తరఫున ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ... ప్రస్తుత పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తే, తరువాత వారి కేటాయింపుల సమయంలో తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశముందన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం... తెలంగాణ ప్రభుత్వ వాదనలు వింటామని, ఆ తర్వాతే ఈ వ్యవహారంలో తీర్పును వాయిదా వేస్తామని పేర్కొంటూ విచారణను మార్చి 3కి వాయిదా వేసింది. -
ప్రభుత్వం ఎవరిపైనా విపక్ష చూపడంలేదు
-
ఆర్కేపురం డివిజన్ సమస్యలపై గ్రౌండ్ రిపోర్ట్
-
బరిలో 60 మంది మజ్లిస్ అభ్యర్థులు
సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లకు గాను 60 చోట్ల ఆల్ ఇండియా మజ్లిస్- ఎ -ఇత్తేహదుల్- ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) పార్టీ తమ అభ్యర్థులను బరిలో దింపింది. 2009 ఎన్నికల్లో 70 డివిజన్లలో పోటీ చేసిన మజ్లిస్ పార్టీ ఈసారి 60 డివిజన్లకే పరిమితమైంది. ప్రస్తుతం ఎన్నికల బరిలో తలపడుతున్న అభ్యర్ధులు వివరాలివీ... ఓల్డ్మలక్పేట్ -జూవేరియా ఫాతిమా, అక్బర్ బాగ్-సయ్యద్ మీనాజుద్దీన్, ఆజాంపురా-అయేషా జహాన్ నసిమ్, చావ్నీ-మహ్మద్ ముర్తుజా అలీ, డబీర్పురా- మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఇఫెందీ, రెయిన్ బజార్-మీర్ వాజీద్ అలీఖాన్, పత్తార్ఘట్టి-సయ్యద్ సోహెల్ ఖాద్రీ, మొఘల్పురా-అమతుల్ అలీమ్, తలాబ్చంచలం-నస్రీన్ సుల్తానా, లలిత్భాగ్-మహ్మద్ అలీ షరీఫ్, కుర్మగూడ-సలీమా బేగం, సంతోష్ నగర్-మహ్మద్ ముజఫర్ హుస్సేన్, రియాసత్ నగర్-మీర్జా ముస్తాఫా బేగ్, కాంచన్ భాగ్-రే ష్మా ఫాతిమా, బార్కాస్-షబనా బేగం, చాంద్రాయణగుట్ట-అబ్దుల్ వాహెబ్, ఉప్పుగూడ-ఫహద్ బిన్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దద్, జంగంమెట్-మహ్మద్ అబ్దుల్ రహమాన్, ఫలక్నుమా-కె.తారాబాయి, నవాబ్ సాబ్కుంట-షిరీన్ ఖాతూన్, శాలిబండ-మహ్మద్ ముస్తాఫా అలీ, ఘన్సీబజార్- సబీనా బేగం, పురానాపూల్-సున్నం రాజమోహన్, దూద్బౌలి-ఎంఏ గఫార్, జహనూమా-ఖాజా ముబ్షరుద్దీన్, రామ్నాస్పురా-మహ్మద్ ముబీన్, కిషన్బాగ్-మహ్మద్ సలీం, సులేమాన్ నగర్-అబిదా సుల్తానా, శాస్త్రిపురం-ఎండీ మిస్బాద్దీన్, మైలార్దేవ్పల్లి-సయ్యద్ హైదర్ అలీ, అత్తాపూర్-బి.రజని, దత్తాత్రేయ నగర్-ఎమ్డీ యూసుఫ్, కార్వాన్-ఎం.రాజేందర్ యాదవ్, లంగర్హౌస్-అమీనాబేగం, గోల్కొండ-హఫ్సియా హన్సీఫ్, టోలిచౌకి- డాక్టర్ అయేషా హుమేరా, నానల్నగర్-మహ్మద్ నసీరుద్దీన్, మెహిదీపట్నం-మహ్మద్ మాజీద్ హుస్సేన్, ఆసిఫ్నగర్-ఫహీమినా అంజుమ్, విజయనగర్ కాలనీ-సల్మాన్ అమీన్, అహ్మద్ నగర్-అయేషా రుబీనా, రెడ్హిల్స్-అమేషా ఫాతిమా, మల్లేపల్లి-తరాన్నుమ్ నాజ్, జాంబాగ్-డి. మోహన్, గోల్నాక-సకీనా బేగం, అంబర్పేట-మహ్మద్, బోలక్పూర్-మహ్మద్ అఖిల్ హైమద్, షేక్పేట-మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్,సోమాజిగూడ-జి.దేవి, వెంగళరావు నగర్-ఎం.శ్యామ్ రావు, ఎర్రగడ్డ-షాహిన్ బేగం, రహమత్ నగర్- నవీన్ యాదవ్, బోరబండ-నర్సింగ్రావు, శేరిలింగంపల్లి-షేక్ ఖాజా హుస్సేన్, అల్లాపూర్-ఖుర్షీద్ బేగం, ఓల్డ్ బోయిన్పల్లి-మహ్మద్ ఓమెరా, గాజులరామారం-ఎండీ సమీర్ అహ్మద్, రంగారెడ్డినగర్-కె.చెన్నయ్య, మౌలాలి-రహమతున్సీసా బేగం, బౌద్ధనగర్-షబానాబేగం -
‘గ్రేటర్’పై హైడ్రామా
-
నాట్కో షేర్లు విభజన
షేరు విభజన తర్వాత తొలిసారిగా గురువారం జరిగిన ట్రేడింగ్లో నాట్కో ఫార్మా షేరు పరుగులు తీసింది. పది రూపాయల ముఖ విలువ కలిగిన షేరును రెండు రూపాయలుగా విభజించిన సంగతి తెలిసిందే. విభజన తర్వాత రెండు రూపాయల ముఖ విలువ కలిగిన షేర్లు గురువారం ట్రేడయ్యాయి. క్రితం ముగింపు రూ. 2,575గా ఉన్న షేరు విభజన తర్వాత రూ. 519 వద్ద నమోదయ్యింది. ఆ తర్వాత ఒకానొక దశలో 16% పెరిగి రూ. 596 వరకు పెరిగింది. చివరకు 6 శాతం లాభంతో రూ. 544 వద్ద ముగిసింది. -
'డివిజన్' ఎందుకు వద్దు?
పార్లమెంట్లో ఏం జరిగింది-7 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన ఫిబ్రవరి 18, 2014న లోక్ సభలో జరిగిన చర్చ వివరాలు మరి కొన్ని... 15.37: శరద్ యాదవ్, మరికొం దరు సభ్యులూ సభ నుంచి నిష్ర్కమించారు. ప్రొ॥సౌగత్రాయ్: తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద రాష్ట్రాన్ని విడగొడ్తున్నారు? భాషా ప్రయుక్త రాష్ట్రాల పునాదులనే నాశనం చేస్తున్నారా? అందుకే మేము చర్చ కావాలన్నాం. మీరు చర్చ పూర్తి చేసేశారు. ఇప్పుడు సవరణల మీద తలలు లెక్కపెడ్తున్నారు. సరైన చర్చ జరిపించండి. రూల్స్ ప్రకారం సవరణల మీద నిర్ణయం ప్రకటించండి. మీకు ఎవరో ఏదో చెప్తుంటే, ఆ ప్రకారం నడుచుకోవటం సరికాదు. స్పీకర్: ది క్వశ్చన్ ఈజ్: 41వ సవరణ, సౌగత్రాయ్ ప్రతి పాదించినది, ఆమోదించబడిందా. సవరణ వీగిపోయింది. ప్రొ॥సౌగత్రాయ్: నాకు 'డివిజన్' కావాలి. స్పీకర్: శ్రీసౌగత్రాయ్, రూల్ 367 సబ్ రూల్ (3) ప్రకారం ఇది సరిగ్గా చేస్తున్నాం. ఏ రూలూ అతిక్రమించటం లేదు. రూల్ ప్రకారమే చేస్తున్నాం. ... అంతరాయం... స్పీకర్: నాకు తెలుసు. ఇది రూల్ ప్రకారమే జరుగుతోంది. సౌగత్రాయ్: ఇది పద్ధతి కాదు. మీకు తప్పుడు సలహాలిస్తు న్నారు. మేము గొర్రెలం కాదు తలలు లెక్క పెట్టడానికి. స్పీకర్: 45వ సవరణ, 7వ క్లాజ్కి అసదుద్దీన్ ఒవైసీ ప్రవేశ పెడ్తున్నారా? అసదుద్దీన్ ఒవైసీ: పేజీ 3లో 5 నుండి 7వ లైన్లు 'ఎప్పాయింటెడ్ డే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గవర్నర్, తెలంగాణ రాష్ట్రానికి మరో గవర్నర్ ఉండాలి'. స్పీకర్: 66 సంవత్సరాలలో, మన రాజ్యాంగం ప్రకారం ఏనాడూ రెండు రాష్ట్రాలకి ఒక గవర్నర్ అంటూ లేరు. ఒక రాష్ట్ర గవర్నర్ మరో రాష్ట్రానికి ఇన్చార్జిగా ఉన్నారు. ఇది చట్టవిరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం. ఒక సూపర్ గవర్నర్ తయారు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు వాళ్ల సొంత గవర్నర్ ఎందుకుండకూడదు? మీరెందుకు తెలంగాణ ప్రజల్ని నమ్మటంలేదు? తెలంగాణను పరి పాలించే వారిని మీరెందుకు నమ్మరు? ఒక గవర్నర్ రెండు రాష్ట్రా లకెలా ఉంటారు? అందుకే నేనో సవరణ ప్రతిపాదిస్తున్నాను. 15.41: (ఈ దశలో శ్రీ సంసుమ కునగ్గర్ బిశ్వమూర్తి తన స్థానంకి వెళ్లారు) స్పీకర్: శ్రీ అసదుద్దీన్ ఒవైసీ సవరణ ఓటు కోసం సభ ముందుంచుతున్నాను. అసదుద్దీన్ ఒవైసీ: మేడమ్ నాకు డివిజన్ కావాలి. తలలు లెక్క పెట్టండి. 15.42: (సంసుమ కునగ్గర్ బిశ్వమూర్తి మళ్లీ స్పీకర్ టేబుల్ దగ్గరకొచ్చారు) స్పీకర్: తలలు లెక్క తీసుకుందాం. ... అంతరాయం... ది క్వశ్చన్ ఈజ్: ఎప్పాయింటెడ్ డే నుండి ప్రస్తుత గవర్నర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గానూ, తెలంగాణ రాష్ట్రానికి వేరే గవర్నరూ ఉంటారు. ఇప్పుడు అనుకూలురు తమ స్థానాల్లో నిలబడండి. ఇప్పుడు వ్యతిరేకులు తమ స్థానాల్లో నిలబడండి. వ్యతిరేకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయ్= 24 నో 169 సవరణ వీగిపోయింది. ది క్వశ్చన్ ఈజ్ క్లాజ్ 7 బిల్లులో భాగమవుతుంది ఆమోదించబడింది. క్లాజ్ 7 బిల్లులో భాగమయింది. ... అంతరాయం... స్పీకర్: సౌగత్రాయ్, 42వ సవరణ, క్లాజు 8కి ప్రతిపాదిస్తు న్నారా? ప్రొ॥సౌగత్రాయ్: ప్రతిపాదన అభ్యర్థిస్తున్నాను. "8వ లైన్ గవర్నర్ బాధ్యత, 'లా' చూసుకోవాలి" మేడమ్, ఈ సవరణ ప్రతిపాదిస్తూనే, రూల్ 367(3) మరొక సారి ప్రస్తావిస్తాను. "క్వశ్చన్ విషయంలో స్పీకర్ నిర్ణయం సవాల్ చేయబడితే 'లాబీ'లు క్లియర్ చేయమని ఆదేశించాలి" అప్పుడు మళ్లీ ఆ క్వశ్చన్ అడగాలి. మేము మీ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తున్నాం. అందుకే ఓటింగ్ కావాలంటున్నాం. మా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తున్నాం. ఈ విభజన, దేశవ్యాప్తంగా వేర్పాటువాదాన్ని పెంచుతుంది. ఈ రోజు ఈ చర్య ఇండియా ప్రయోజనాలకే ఆటంకం. ఒక పెద్ద రాష్ట్రాన్ని విభజించటం ద్వారా ఈ ప్రభుత్వం, ఇండియా అనే ఆలోచననే సవాలు చేసే చర్యలు చేపడుతోంది. 'యూ షట్ అప్' ... అంతరాయం... ఇండియా అఖండతే సవాల్ చేయబడ్తోంది. అందుకే సవరణ ప్రతిపాదిస్తున్నాను. 15.44: సంసుమ కునగ్గర్ బిశ్వమూర్తి, మళ్లీ తన స్థానంకి వెళ్లారు. స్పీకర్: ది క్వశ్చన్ ఈజ్ గవర్నర్ బాధ్యత చట్టబద్ధ పాలనను చూసుకోవాలి. ... అంతరాయం... ప్రొ॥సౌగత్రాయ్: డివిజన్ కోరుతున్నాం. ఒవైసీ: నో-మేడమ్ - మాకు డివిజన్ కావాలి. స్పీకర్: ఆల్ రైట్, లెక్క పెడదాం. గౌరవ సభ్యులారా, నా ఉద్దేశంలో అనవసరంగా డివిజన్ అడగబడుతోంది. అందువల్ల రూల్ 367 సబ్ రూల్ 3 అనుబం ధాన్ని అనుసరించి, 'ఆయ్' అనేవారు, 'నో' అనేవారు తమ స్థానాల్లో నిలబడితే లెక్క తీసుకుని సభ నిర్ణయాన్ని ప్రకటిస్తాను. తమ స్థానాల్లో లేని సభ్యులు లెక్కలోకి రారు. 15.46: సంసుమ కునగ్గర్ బిశ్వమూర్తి స్పీకర్ టేబుల్ దగ్గర నిల్చున్నారు. స్పీకర్: ఇప్పుడు 'అనుకూలురు' నిలబడండి. వ్యతిరేకులు నిలబడండి. వ్యతిరేకులు ఎక్కువ ఉన్నారు. సవరణ వీగిపోయింది. -ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు -
ఆర్టీసీకి చైర్మన్..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీకి చైర్మన్ను నియమించే దిశగా అడుగులు పడుతున్నాయి. తీవ్ర నష్టాలు, ఆదాయం పెరగక పోవటం, కొత్తగా అప్పులు పుట్టే అవకాశం లేనంతగా గుడ్విల్ దెబ్బతినటం... తదితరాలతో ఆర్టీసీ కునారిల్లిపోయింది. ఈ తరుణంలో చురుకైన నేతను ఆర్టీసీకి చైర్మన్గా నియమిస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించి వేగంగా కసరత్తు చేస్తున్న ఆయన.. పనిలోపనిగా ఆర్టీసీ చైర్మన్ విషయంలోనూ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. వాస్తవానికి ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావే సాంకేతికంగా టీఎస్ఆర్టీసీకి కూడా చైర్మన్గా కొనసాగుతున్నారు. సాంకేతికంగా ఇప్పటికీ ఆర్టీసీ విడిపోనందున ఆయనే చైర్మన్ హోదాలో ఉన్నారు. పాలనాపరంగా ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ విడివిడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ నిజానికి ఇప్పటికీ ఏపీఎస్ ఆర్టీసీగానే ఉంది. ఈ విభజన తంతు కేంద్ర ఉపరితల రవాణాశాఖ పరిధిలో ఉంది. ఆస్తులు అప్పుల వాటా తేలిస్తేగాని తుది విభజన పూర్తి కాదు. ఇప్పటికీ అది పీటముడిగానే ఉంది. దీనిపై నిర్ణయం వెల్లడించాల్సిన షీలాభిడే కమిటీ గడువు ముగిసినా దాన్ని తేటతెల్లం చేయలేదు. ఫలితంగా అది గందరగోళంగా మారింది. ఈ కారణంగానే తెలంగాణ ఆర్టీసీకి ప్రత్యేకంగా పాలకమండలి కూడా ఏర్పాటు కాలేదు. ఉమ్మడి పాలకమండలిలో తెలంగాణ ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంతో... అది సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోరాదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. ఈ కారణంతోనే పాలకమండలి సమావేశాలూ జరగటం లేదు. తెలంగాణ అభ్యంతరం మేరకు... తెలంగాణ ప్రాతినిధ్యం పాలకమండలిలో పెంచుకునేలా కేంద్రం కూడా ఆమోదం తెలుపుతూ లేఖ కూడా రాసింది. ఇది ఇలా ఉండగా... తెలంగాణకు సొంతంగా ఓ పాలకమండలిని ఏర్పాటు చేసి చైర్మన్ పదవిని భర్తీ చేయాలని తాజాగా ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. కేవలం తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి సాధారణ నిర్ణయాలు తీసుకునేలా ఈ పాలకమండలి చూస్తుంది. ముఖ్యంగా నష్టాలను అధిగమించటంపై మాత్రమే దృష్టి సారిస్తుందని చెబుతున్నాయి. తీవ్ర నష్టాలతో జీతాలు చెల్లించటం కూడా కష్టంగా మారిన దుస్థితిలో ఉన్న ఆర్టీసీ ఇలాగే కొనసాగితే... బాగుచేయలేనంత దారుణంగా దెబ్బతింటుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనికి చైర్మన్ను నియమించటం కొంతవర కు మేలు చేస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కీలక పదవుల కోసం ముఖ్యమంత్రిపై పార్టీ నేతల నుంచి ఒత్తిడి కూడా ఉంది. ఆర్టీసీ చైర్మన్గిరీ ప్రముఖమైందిగా భావిస్తున్న నే తలు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నేతలను సంతృప్తి పరిచే క్రమంలో కూడా ఈ నిర్ణయం ఉపకరిస్తుందని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికీ రెండు ఆర్టీసీల మధ్య బస్సు పర్మిట్ల విభజన జరగలేదు. ఫలితంగా తెలంగాణకు రావాల్సిన 550 సర్వీసులు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోనే ఉండటంతో తెలంగాణ ఆర్టీసీ రోజుకు రూ.2 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నష్టాలను అధిగమించాలంటే చైర్మన్ ఉండటం అవసరమనే ఒత్తిడి కూడా ప్రభుత్వంపై ఉండటం విశేషం. -
విద్యుత్ ఉద్యోగుల విభజనపై కదలిక
31న ఢిల్లీకి రావాలని ఇరు రాష్ట్రాల సీఎస్లకు కేంద్రం ఆదేశం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఈ నెల 31న ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇంధన శాఖ కార్యదర్శులు, జెన్కో సీఎండీలకు పిలుపు వచ్చింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి నుంచి అధికారులకు లేఖలు అందాయి. ఏపీ స్థానికత కలిగి ఉండి తెలంగాణలో పనిచేస్తున్న 1,252 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు గత నెల 10న రిలీవ్ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మళ్లీ ఉద్యోగాల్లో చేరేందుకు ఉద్యోగులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ వివాదంలో జోక్యం చేసుకోడానికి మొదట హోంశాఖ అయిష్టత వ్యక్తం చేసినా, ఎట్టకేలకు స్పందించడం విశేషం. -
'విభజన అనివార్యం అయింది'
-
ఎకరా రూ. 19.21 కోట్లు
హైదరాబాద్లో భూమికి రికార్డు ధర టీఎస్ఐఐసీ నుంచి 12 ఎకరాల కొనుగోలుకు ‘ఐకియా’ అంగీకారం నాలెడ్జ్ సిటీలోని నాలుగు ప్లాట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట రాజధానిలో ‘రియల్’ బూమ్ మళ్లీ మొదలైంది! ఎకరా భూమి ఏకంగా రూ. 19.21 కోట్లు పలికిం ది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో స్తబ్దుగా మారిన రియల్ ఎస్టేట్ వ్యాపారం.. రాష్ర్ట విభజన తర్వాత కూడా ఆశించినస్థాయిలో మెరుగవలేదన్న అభిప్రాయం నెల కొన్న నేపథ్యంలో హైదరాబాద్లో రికార్డు స్థాయి ధర పలకడం విశేషం. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం నుంచి భూమిని కొనుగోలు చేసేందుకు స్వీడిష్ ఫర్నిచర్ తయారీ సంస్థ ‘ఐకియా’ ముందుకురావడం చర్చనీయాంశమైంది. వ్యాపార విస్తరణలో భాగంగా ‘ఐకియా ఇండియా’ పేరుతో భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని రాయదుర్గం సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలో వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(టీఎస్ఐఐసీ)తో ఐకియా ఇండియా ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఎకరాకురూ. 19.21 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. ఈ లెక్కన నాలెడ్జ్ సిటీలో దాదాపు 12.35 ఎకరాల భూమిని కొనుగోలు చేయాలని ఐకియా సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు ఐకియా ఎండీ జ్యూవెన్షియో మాజ్టూ, సీఎఫ్వో ప్రీట్ దూపర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. రూ. 500 కోట్ల పెట్టుబడి: వ్యాపార విస్తరణలో భాగంగా రూ. 12,500 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా వచ్చే పదేళ్లలో 25 స్టోర్స్ ఏర్పాటు చేయాలని ఐకియా నిర్ణయించింది. తొలిదశలో హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఒక్కో స్టోర్ ఏర్పాటుకు రూ. 500 కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది. ఈ కేంద్రంతో హైదరాబాద్లో 500 మందికి ప్రత్యక్షంగా, వందలాది మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. రాష్ర్ట విభజనతో హైదరాబాద్ చుట్టుపక్కల భూముల క్రయవిక్రయాలు మందగించిన నేపథ్యంలో ఐకియా తాజా ఒప్పందం రియల్ బూమ్కు నాంది పలికింది. గతంలో ఏపీఐఐసీ గానీ, హుడా గానీ హైదరాబాద్ పరిసరాల్లో విక్రయించిన భూములకు ఎకరా ధర రూ. 14 కోట్లు దాటలేదు. ఇప్పుడు అంతకన్నా చాలా ఎక్కువ ధర పలకడంతో దీన్ని మార్పునకు సంకేతంగా వ్యాపారులు పేర్కొంటున్నారు. -
హైకోర్టు విభజనపై ముగిసిన వాదనలు
తీర్పు వాయిదా సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకోసం దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు శుక్రవారం ముగిశాయి. ఈ వ్యాజ్యాలపై రాతపూర్వక వాదనలను స్వీకరించేందుకు వీలుగా ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన టి.ధన్గోపాల్రావు హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోనే హైకోర్టు ఏర్పాటుకు ఆదేశాలివ్వాలంటూ ఏపీ హైకోర్టు సాధన సమితి కన్వీనర్ ప్రసాద్బాబు, ప్రస్తుతమున్న చోటనే 2 రాష్ట్రాల హైకోర్టులను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలంటూ న్యాయవాది టి.అమర్నాథ్గౌడ్లు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటినీ ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వాటిని శుక్రవారం మరోసారి విచారించింది. 1956 పునర్విభజన చట్టానికి, 2014 పునర్విభజన చట్టానికి మధ్య ఉన్న వైరుధ్యాలను ప్రసాద్బాబు తరఫు న్యాయవాది ఎం.వి.రాజారాం వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై వాదనలు ముగిశాయని, వాదనలు వినిపించిన వారంతా లిఖితపూర్వక వాదనల్ని కోర్టుకు సమర్పించాలని కోరింది. ఇందుకోసం కేసు విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. -
రంగంలోకి ‘హైకోర్టు’ కమిటీ
గచ్చిబౌలి భవనాన్ని పరిశీలించిన జడ్జీలు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతి సేన్గుప్తా ఇటీవల ఏర్పాటు చేసిన న్యాయమూర్తుల కమిటీ తన పని ప్రారంభించింది. కమిటీ చైర్మన్ జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బోస్లే నేతృత్వంలో సభ్యులు జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి, జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి సోమవారం గచ్చిబౌలి వెళ్లి ప్రతిపాదిత హైకోర్టు భవనాన్ని పరిశీలించారు. గంటపాటు అక్కడ గడిపారు. భవనానికి సంబంధించిన డ్రాయింగ్లు, మ్యాపులను తెప్పించుకుని, వాటి ఆధారంగా అధికారులను అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రతి ఫ్లోర్కూ వెళ్లి అక్కడి సదుపాయాలను పరిశీలించి, వాటిపై అధికారులను ఆరా తీశారు. హైకోర్టు విభజనకు సంబంధించిన ఈ వ్యవహారాలన్నింటినీ గోప్యంగా ఉంచాలని కమిటీ నిర్ణయించింది. అవసరమైతే మరోసారి భవనాన్ని సందర్శించాలని కమిటీ భావిస్తోంది. తర్వాత దీనిపై కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సీజే తన అభిప్రాయాన్ని కేంద్రానికి వివరించవచ్చని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే వెళ్లొచ్చిన సీజే... గచ్చిబౌలి భవనాన్ని జస్టిస్ సేన్గుప్తా కూడా గత వారం స్వయంగా వెళ్లి చూసొచ్చారు. తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డిని కూడా వెంటబెట్టుకు వెళ్లినట్లు తెలిసింది. ఆ తర్వాతే... హైకోర్టు విభజన వ్యవహారంతో పాటు, గచ్చిబౌలి భవనం తెలంగాణ హైకోర్టు ఏర్పాటునకు సరిపోతుందో లేదో తేల్చేందుకు జస్టిస్ బోస్లే నేతృత్వంలో కమిటీ వేశారు. హైకోర్టును విభజించి తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేయాలని, అందుకు గచ్చిబౌలిలో భవనం కూడా సిద్ధంగా ఉందని పేర్కొంటూ కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు లేఖ రాయడం... ఈ దిశగా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు సీజేకు గౌడ లేఖ రాయడం తెలిసిందే. -
ముందు జవాబు చెప్పి మాట్లాడండి
కాంగ్రెస్ నేతలకు వెంకయ్యనాయుడు సూచన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టే కాంగ్రెస్ నేతలు.. ముందు విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇస్తామన్న అంశాన్ని ఎందుకు పెట్టలేదో చెప్పాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. దీనికి జవాబు చెప్పిన తరువాత మాట్లాడాలని సూచించారు. సహచర కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నేతలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, రామచంద్రరావు, ఇంద్రసేనారెడ్డి, సుధీష్ రాంబొట్లతో కలిసి ఆయన ఆదివారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశంలో జైరాం రమేష్, ఇతర కాంగ్రెస్ నేతలు వెంకయ్యపె ఆరోపణలు చేస్తున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆయన అసహనం వ్యక్తం చేశారు. పోలవరం ముంపు మండలాలను కలిపే అంశానికి సంబంధించి ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయలేదో, ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో ఎందుకు పెట్టలేదో చెప్పి తరువాత ఈ విషయాలపై తమ గురించి మాట్లాడాలని చెప్పారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో తాను పట్టుబట్టిన మాట వాస్తవమేనని, అది నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. భూసేకరణ చట్టం ఆర్డినెన్స్, దేశంలో పలు ప్రాంతాల్లో చర్చిలపై దాడులు, మత మార్పిడులపై కాంగ్రెస్తో సహా పలు ప్రత్యర్థి పార్టీలు కేంద్రంలోని తమ ప్రభుత్వంపై దుష్ర్పచారం చేస్తున్నాయని వెంకయ్య ఆరోపించారు. దేశంలో అభివృద్ధి జరగకూడదని వారు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ దుష్పప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టి, వాస్తవాలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు చెప్పారు. ప్రత్యర్థులు ఎంత స్థాయిలో అసత్య ప్రచారానికి పూనుకున్నా ప్రజల్లో ప్రధాని నరేంద్రమోదీకి ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని తెలిపారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి: కి షన్రెడ్డి సూర్యాపేట ఎన్కౌంటర్పై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని విలేకరుల సమావేశంలో కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు అందజేయకపోవడమే ఈ ఘటనకు కారణమన్నారు. వెంకయ్యకు బీసీ నేతల వినతి దేశంలో 56 శాతం వరకూ ఉన్న బీసీలకు చట్ట సభల్లో 15 శాతం కూడా ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్ను కల్పించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు బీసీ నేతలు విన్నవించారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్లో వెంకయ్యను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ నేతలు కలిశారు. -
తెలంగాణకు ‘టెస్కాబ్’
ఆప్కాబ్ విభజన.. నేటి నుంచి రెండు రాష్ట్రాలకు.. తెలంగాణ ఎండీగా నేతి మురళీధర్.. ఏపీకి నాగమల్లేశ్వర్రావు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) విభజన పూర్తయింది. ఏపీకి ఆప్కాబ్గానే కొనసాగనుండగా.. తెలంగాణకు తెలంగాణ స్టేట్ కో- ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టెస్కాబ్) కొత్తగా ఏర్పాటైంది. ఈ రెండు బ్యాంకులు గురువారం (ఏప్రిల్ 2వ తేదీ) నుంచి వేర్వేరుగా కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. టెస్కాబ్కు ఎండీగా నేతి మురళీధర్, ఆప్కాబ్కు నాగమల్లేశ్వర్రావు నియమితులయ్యారు. వారు గురువారం బాధ్యతలు స్వీకరిస్తారు. వారిద్దరూ ఇప్పటివరకు చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎం)గా వ్యవహరించారు. ఇక ఆప్కాబ్ పాలక మండలి మాత్రం తాత్కాలికంగా కొనసాగనుంది. విభజన నేపథ్యంలో ఆప్కాబ్ చైర్మన్ వీరారెడ్డి పదవీకాలం బుధవారంతో ముగిసినట్లే. దీంతో ఈ నెల 25వ తేదీలోగా టెస్కాబ్ పాలకమండలి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంది. ఏపీలో ఆప్కాబ్కు ఈ నెలాఖరులోగా వారిని ఎన్నుకోవాలి. మరోవైపు ఆప్కాబ్ విభజన అసెంబ్లీలో జరగాలని.. జనరల్బాడీ, పాలకమండలిలే చేపట్టడం నిబంధనలకు విరుద్ధమంటూ ఏపీ ఉద్యోగ సంఘాలు కోర్టుకు వెళ్లగా జోక్యానికి హైకోర్టు నిరాకరించిందని చైర్మన్ వీరారెడ్డి చెప్పారు. ఆస్తులు, ఉద్యోగుల విభజన.. 1963లో ఆప్కాబ్ ఏర్పడింది. దీనికి ఉమ్మడి రాష్ట్రంలో 37 శాఖలు ఉండగా.. విభజనతో టెస్కాబ్కు 35, ఆప్కాబ్కు రెండు శాఖలు దక్కాయి. ఆ ప్రకారమే లావాదేవీలు ఉంటా యి. టెస్కాబ్కు హైదరాబాద్లోని అబిడ్స్ సమీపంలో ఉన్న ప్రస్తుత ప్రధాన కార్యాలయాన్నే కేటాయించగా.. ఆప్కాబ్కు తాత్కాలికంగా నారాయణగూడలో ఉన్న కార్యాల యాన్ని ఇచ్చారు. ఆప్కాబ్కు 231 మంది ఉద్యోగులను, టెస్కాబ్కు 318 ఉద్యోగులను కేటాయించారు. అడ్వాన్సులు, డిపాజిట్లు ఏ రాష్ట్రానివి ఆ రాష్ట్రానికే చెందుతాయి. రూ. 60 కోట్ల మేరకు ఉన్న ఉమ్మడిడిపాజిట్లను జనాభా నిష్పత్తి ప్రకారం రెండు బ్యాంకులకు పంచుతారు. తెలంగాణలో ఆప్కాబ్ బ్రాంచీలు 35 ఉండగా డీసీసీబీలు 9ఉన్నాయి. డీసీసీబీలకు 249 బ్రాంచీలు ఉన్నాయి. జిల్లాల్లో ప్రాథమిక సహకార సం ఘాలు (ప్యాక్స్) 789 ఉన్నాయి. 12.50 లక్షల మంది రైతులకు రూ. 4,500 కోట్ల మేరు రుణాలు ఇచ్చారు. కాగా టెస్కాబ్కు ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టీఎస్సీఏబీ.ఓఆర్జీ’ వెబ్సైట్ను గురువారం ఆవిష్కరించనున్నారు. పాలకమండలికి ఎన్నికలు.. టెస్కాబ్ పాలకమండ లిలో 8 మంది సభ్యులున్నారు. అందులో ఆరుగురు కాంగ్రెస్, ఇద్దరు టీఆర్ఎస్ సభ్యులున్నారు. పాలకమండలికి ఈ నెల 25వ తేదీలోగా ఎన్నికలు జరపాలి. దీంతో ఎక్కువ సభ్యులున్న కాంగ్రెస్ పార్టీనే టెస్కాబ్ను కైవసం చేసుకునే అవకాశముంది. -
విభజన ప్రక్రియను ప్రారంభించాం
హైకోర్టుకు నివేదించిన కేంద్ర న్యాయ శాఖ హైకోర్టు విభజనపై స్పందించాల్సింది ఏపీ సర్కార్, హైకోర్టులే ఇప్పటివరకూ ఏపీ నుంచి ఎటువంటి సమాచారం లేదు హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది సర్కార్ నిర్ణయమే మౌలిక సదుపాయాలు కల్పించిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తాం ఆ తర్వాతే జడ్జీల చాయిస్ కోరుతామని సీజే చెప్పారు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తాము ఎటువంటి సమాచారం అందుకోలేదని హైకోర్టుకు కేంద్ర న్యాయ శాఖ నివేదించింది. ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియను తాము ఇప్పటికే ప్రారంభించామని, ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో స్పందించాల్సింది ఆ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టులేనని తెలిపింది. హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత ఏపీదేనని స్పష్టం చేసింది. హైకోర్టు విభజన విషయంలో ఏపీ ప్రభుత్వం, హైకోర్టులు నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుని, మౌలిక సదుపాయాలను కల్పించిన వెంటనే తాము సంబంధిత చట్టం ప్రకారం విభజన కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామని వివరించింది. హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్రంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన టి.ధన్గోపాల్రావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖ లు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం దానిని మరోసారి విచారించింది. గతవారం ధర్మాస నం ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం తన వాదనలను వినిపిస్తూ కౌంటర్ దాఖలు చేసింది. కేంద్రం తరఫున న్యాయ శాఖ కార్యదర్శి ఎన్కేసీ థంగ్ ఈ కౌంటర్ను దాఖలు చేశారు. అలసత్వాన్ని ఆపాదించడం సరికాదు.. ‘విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు న్యాయమూర్తుల సం ఖ్యను ఖరారు చేయడం.. ఉమ్మడి హైకోర్టును విభజించి, ఇప్పుడున్న చోటనే రెండు హైకోర్టులు వేర్వేరుగా పని చేసేలా చేయడం సాధ్యమేనా.. అన్న అంశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాశారు. హైకోర్టుకు కేటాయించిన 49 మంది న్యాయమూర్తులను ఇరు రాష్ట్రాల మధ్యా 60:40 నిష్పత్తిలో విభజించాలని కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్యా న్యాయమూర్తుల సంఖ్యను 60:40 నిష్పత్తిలో విభజించేందుకు అంగీకరించాం. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులను గుర్తించి, వారి రాష్ట్ర కోటా ఆధారంగా కేటాయింపులు చేయాలని గత అక్టోబర్ 9న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం. ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసే విషయంలో ఇద్దరూ మాట్లాడుకుని తగిన చర్యలు ప్రారంభించాలని ఏపీ సీఎం, హైకోర్టు సీజేని కోరాం. హైకోర్టు ఏర్పాటుపై తాను ఏపీ సీఎంకి లేఖ రాశానని, అయితే ఆయన నుంచి ఎటువంటి సమాధానం రాలేదని సీజే చెప్పా రు. న్యాయమూర్తుల కేటాయింపుపై తాను అందరి అభిప్రాయాలను తెలుసుకున్నానని, ఏపీ హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే న్యాయమూర్తులను ఏ రాష్ట్రంలో పనిచేయాలని భావి స్తున్నారో తెలుసుంటానని సీజే మాకు వివరించారు. హైకోర్టుకు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. హైకోర్టు విభజనలో అలసత్వం ప్రదర్శిస్తున్నామన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదు. హైకోర్టును ఏర్పాటు విషయంలో ఏపీ సర్కార్గానీ, ప్రధాన న్యాయమూర్తిగానీ తమ అభిప్రాయాలను ఇప్పటివరకు చెప్పలేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయండి’ అని థంగ్ ధర్మాసనాన్ని కోరారు. హైదరాబాద్లో ఏపీ హైకోర్టు ఏర్పాటు చట్టవిరుద్ధం: అమికస్ క్యూరీ ఈ వ్యాజ్యంలో కోర్టు సహాయకారి(అమికస్క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది ఈ.మనోహర్ వాదనలు వినిపిస్తూ, ఏపీ హైకోర్టును హైదరాబాద్లో ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమన్నారు. పునర్విభజన చట్టంలో అటువంటి అవకాశం లేదన్నారు. రాజ్యాంగంలోని 214 అధికరణ ప్రకారం ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండి తీరాల్సిందేనన్నారు. కేంద్ర న్యాయ మంత్రి ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపారు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ఇలా లేఖ రాసినట్లు కనిపిస్తోందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. శానససభ, సచివాలయం లాగా హైకోర్టును విభజించి, ఇక్కడే రెండు హైకోర్టులు పనిచేయడం సాధ్యం కాదా? అని ప్రశ్నించింది. దీనికి మనోహర్ స్పందిస్తూ.. వాటి విభజన కూడా చట్టవిరుద్ధమన్నారు. హైదరాబాద్లో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
విభజన సమస్యలకు చర్చలతో పరిష్కారం
గవర్నర్ నరసింహన్ వ్యాఖ్య హైకోర్టు విభజనలో ఎలాంటి గొడవా లేదు.. విభజన చట్టంలో ఉన్నమేరకు నడచుకుంటాం రెండు రాష్ట్రాలూ అభివృద్ధిపథంలో సాగుతున్నాయి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో భేటీ.. రాష్ట్రపతితోనూ సమావేశం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని వివాదాస్పద అంశాలు, సమస్యలకు చర్చల ద్వారా పరిష్కారం లభించేలా చూస్తామని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ వచ్చిన గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల పనితీరు, రాజకీయ పరిస్థితులపై నివేదిక అందచేసినట్టు సమాచారం. సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ ఆయన సమావేశమయ్యారు. రాజ్నాథ్తో భేటీ అనంతరం తనను కలసిన విలేకరులతో గవర్నర్ మాట్లాడుతూ ఈ భేటీ సాధారణమేనని, విశేషమేమీ లేదని చెప్పారు. నివేదిక సమర్పించిన విషయమై అడగ్గా.. ‘‘నివేదిక ఇస్తున్నట్టు మీరే రాశారు. మీ దగ్గరే నివేదిక ఉంటుంది. మీరే అన్నీ రాస్తారు. మీకే తెలిసి ఉండాలి’ అంటూ ఆయన చమత్కరించారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో శాంతిభద్రతల అంశాన్ని ఏపీ సీఎస్ లేవనెత్తిన విషయమై ప్రశ్నించగా.. ‘‘ఆ సమావేశానికి నేను వెళ్లలేదు. అలాంటిదేమైనా ఉంటే హోంమంత్రితో చర్చిస్తాం’’ అని నరసింహన్ చెప్పారు. విభజన చట్టంలోని 5వ షెడ్యూల్సహా ఇతర అంశాలపై చాలా వివాదాలున్నాయని అడగ్గా.. ‘‘అన్నీ మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. దానిలో పెద్ద సమస్యలేదు. హైకోర్టు విభజన విషయంలోనూ ఎలాంటి గొడవా లేదు. విభజన చట్టంలో ఉన్నమేరకు నడచుకుంటాం’’ అని గవర్నర్ బదులిచ్చారు. ఏపీ, తెలంగాణకు సంబంధించి కేంద్ర హోంమంత్రి తనకు ఎలాంటి దిశానిర్దేశం చేయలేదని నరసింహన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం చోటుచేసుకోవడంపై కేంద్రానికి నివేదిక ఇస్తున్నారా? అని అడగ్గా.. ‘‘హౌస్లో స్పీకర్ సుప్రీం కదా.. నిర్ణయాలు తీసుకునేది ఆయనే. దానికి మేం ఏం చేయలేం’’ అని నరసింహన్ బదులిచ్చారు. రెండు రాష్ట్రాల్లోనూ శాంతి భద్రతల సమస్యల్లేవని గవర్నర్ చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ప్రగతి బాగుందని, అభివృద్ధిపథంలో ముందుకు సాగుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఏడాది ముగిసేనాటికి.. క్షేత్రస్థాయి నుంచి రెండు రాష్ట్రాలూ మంచి ఫలితాలు సాధిస్తాయని నమ్మకముందని చెప్పారు. నేడు మోదీ, సదానంద గౌడతో గవర్నర్ భేటీ ఇదిలా ఉండగా గవర్నర్ నరసింహన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడలతో మంగళవారం వేర్వేరుగా భేటీ అవనున్నారు. సదానంద గౌడతో గవర్నర్ మంగళవారం ఉదయం సమావేశమై హైకోర్టు విభజనపై చర్చించనున్నట్టు సమాచారం. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. అనంతరం గవర్నర్ హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. -
ప్రస్తుత హైకోర్టు.. తెలంగాణ ఆస్తి
కొత్తగా రావాల్సింది ఏపీకేనన్న హైకోర్టు ధర్మాసనం అప్పటివరకు రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి హైకోర్టు తెలంగాణకు కోర్టు కావాలనడం విభజన చట్టానికి విరుద్ధం కేంద్ర న్యాయ మంత్రి రాసిన లేఖ సెక్షన్ 31కి వ్యతిరేకం మంత్రి లేఖనైనా సవరించాలి లేక పునర్విభజన చట్టాన్నైనా మార్చాలి ఇప్పటివరకు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ అందించాలని రిజిస్ట్రీకి ఆదేశం చట్టంలో నిర్దిష్ట కాలపరిమితి లేనప్పుడు జాప్యమన్న ప్రసక్తే లేదని వ్యాఖ్య హైకోర్టు విభజనపై కౌంటర్లు వేయాలని కేంద్రం, ఇరు రాష్ట్రాలకు ఆదేశం సమాధానాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటామన్న ధర్మాసనం తీర్పు ఏదైనా న్యాయవాదులు ఆందోళనలు చేపట్టరాదని హితవు జరగరానిది జరిగితే కోర్టు ధిక్కార చర్యలు తప్పవని హెచ్చరిక విచారణలో అమికస్ క్యూరీలుగా మనోహర్, విద్యాసాగర్ నియామకం సాక్షి, హైదరాబాద్: ‘విభజన చట్టం ప్రకారం ప్రస్తుత హైకోర్టును తెలంగాణ ఆస్తిగానే భావించాలి.. కొత్తగా ఏర్పాటు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టే’ అని రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు విభజన విషయంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ రాసిన లేఖను తప్పుబట్టింది. ఈ అంశానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను తమ ముందుంచాలని కోర్టు రిజిస్ట్రీని సోమవారం ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దీనిపై లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఇందుకోసం సీనియర్ న్యాయవాదులు ఇ.మనోహర్, జి.విద్యాసాగర్ను కోర్టు సహాయకులు(అమికస్ క్యూరీ)గా నియమించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రంతోపాటు ఇరు రాష్ర్ట ప్రభుత్వాలను ఆదేశించింది. హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్రంతోపాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన మానవ హక్కుల కార్యకర్త టి.ధన్గోపాల్రావు హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీని విచారణ సందర్భంగా హైకోర్టుకు ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ రాసిన లేఖపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘తెలంగాణ హైకోర్టు ఏర్పాటు విషయాన్ని పరిశీలించాలనడం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు హైకోర్టు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత హైకోర్టే ఇరు రాష్ట్రాలకూ ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న ప్రస్తుత హైకోర్టును చట్ట ప్రకారం తెలంగాణ ఆస్తిగా భావించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టే. దీని ప్రకారం న్యాయ శాఖ మంత్రి లేఖనైనా సవరించాలి. లేకపోతే పునర్విభజన చట్టాన్నైనా సవరించాలి’ అని వ్యాఖ్యానించింది. కౌంటర్లు పరిశీలించాకే నిర్ణయం తొలుత పిటిషనర్ ధన్గోపాల్రావు వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజనలో ఆలస్యం జరుగుతోందని, ఈ విషయంలో తక్షణమే చర్యలు చేపట్టేందుకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఇందుకు పునర్విభజన చట్టంలో నిర్దిష్ట కాల పరిమితేమీ లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పునర్విభజన చట్టంలో నిర్దిష్ట కాల పరిమితి లేనప్పుడు, ఇక ఆలస్యమన్న మాటే ఉత్పన్నం కాదని వ్యాఖ్యానించింది. వెంటనే తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ.. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడ గత వారం రాసిన లేఖ విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు విషయాన్ని చూడాలని అందులో కోరినట్లు పేర్కొంటూ... ఆ లేఖను ధర్మాసనం ముందుంచారు. దాన్ని పరిశీలించిన ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఆ లేఖ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 31కి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందంటూ పలు వ్యాఖ్యలు చేసింది. ఏదేమైనా ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కౌంటర్లను పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫు న్యాయవాదులను ఆదేశిస్తుండగా, ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. హైకోర్టు విభజనపై ఏపీ సర్కారు ఇప్పటికే తన అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు విన్నవించినట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే ఏం చెప్పినా కౌంటర్లోనే చెప్పాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఈ కేసులో తీర్పు ఏదైనప్పటికీ న్యాయవాదులు ఏ రకంగానూ ఆందోళనలు చేయడానికి వీల్లేదని, ఏదైనా జరగరానిది జరిగితే న్యాయవాదులపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. విభజనకు సంబంధించి హైకోర్టులో జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను తమ మందుంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. -
ఉమ్మడి సంస్థలన్నీ మావే!
కేంద్ర హోంశాఖ సమీక్షలో తెలంగాణ ప్రభుత్వం వాదన విభజన చట్టంలోని నిబంధనను ఎత్తిచూపిన సీఎస్ రాజీవ్ శర్మ పదో షెడ్యూల్లోని సంస్థలను ఉమ్మడిగా ఉంచాలన్న ఏపీ సీఎస్ హైదరాబాద్లో శాంతిభద్రతలను గవర్నర్కు అప్పగించాలని విజ్ఞప్తి అన్నింటిపై న్యాయ సలహా తీసుకుంటామన్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పీటముడి పడిన విభజన అంశాలపై కేంద్రం సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్కు వచ్చిన కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి ఏకే సింగ్ శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ వివాదాలతోపాటు విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ఎవరికీ కేటాయించని సంస్థలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పదో షెడ్యూల్లోని సంస్థలు ఉమ్మడి నిర్వహణ కింద ఉండాలని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రతిపాదించగా.. రాష్ర్ట ప్రభుత్వం అందుకు విబేధించింది. భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలను ఆ ప్రాంతానికే కేటాయించాలని సీఎస్ రాజీవ్ శర్మ తన వాదన వినిపించారు. ఆయా సంస్థల పేర్లలో ‘ఏపీ’ పదం ఉన్నంత మాత్రాన.. వాటి నియంత్రణ, నిర్వహణ ఆంధ్రప్రదేశ్ చేతిలోనే ఉంటుందని భావించరాదని స్పష్టం చేశారు. భౌగోళికంగా అవి ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికే కేటాయించాలని విభజన చట్టమే చెబుతోందని ప్రస్తావించారు. చట్టంలో ఎలాంటి నిబంధన లేనందున ఉమ్మడి నిర్వహణ అన్నదే ఉత్పన్నం కాదని తోసిపుచ్చారు. చట్టంలో లేని ఏ విషయంలోనూ టీ సర్కారు హక్కులు కోరడం లేదని గుర్తు చేశారు. షెడ్యూలు తొమ్మిదిలోని సంస్థలకు సంబంధించి ప్రధాన కార్యాలయం ఎక్కడుంటే అక్కడున్న ఆస్తులన్నీ హెడ్ క్వార్టర్ ఆస్తులుగా పరిగణించడం సరికాదన్నారు. మరోవైపు పదో షెడ్యూలులోని సంస్థలను ఉమ్మడి నిర్వహణలోనే ఉంచాలని.. ఉమ్మడి రాష్ట్రంలో ఆ సంస్థలకు సమకూరిన నిధులను న్యాయబద్ధంగా 2 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఉద్యోగుల విభజనను రెండు ప్రభుత్వాల పరస్పర సంప్రదింపులతో చేయాలని, సమస్యల పరిష్కారానికి వీలుగా తటస్థ అథారిటీ ఏర్పాటుకు సెక్షన్ 8 కింద నిబంధనలు రూపొందించాలని కోరింది. హైదరాబాద్లో శాంతిభద్రతలను గవర్నర్కు అప్పగించాలని కూడా ఏపీ సీఎస్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ సమావేశంలో షెడ్యూల్ 7లోని సంస్థలకు సంబంధించిన నిధులపై కూడా చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాల వాదనలను విన్న కేంద్ర హోంశాఖ బృందం.. ఈ వివరాలన్నీ కేంద్ర న్యాయ శాఖకు తెలియజేసి న్యాయసలహా తీసుకుంటామని చెప్పింది. సీఎస్ల మధ్య వాగ్యుద్ధం విభజన వివాదాల పరిష్కారంపై జరి గిన భేటీలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికృష్ణారావు, తెలంగాణ సీఎస్ల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి ఏకే సింగ్ సమక్షంలో ఇరువురు సీఎస్లూ వాడివేడిగా వాదించుకున్నారు. ఎవరు ఏమన్నారంటే.. ఏపీ సీఎస్ కృష్ణారావు 1. హైదరాబాద్ శాంతి భద్రతలను గవర్నర్కు అప్పగించండి. ఆంధ్ర ఉద్యోగుల్ని తెలంగాణ ఉద్యోగ సంఘాలు వివక్ష గురిచేస్తున్నారు. వేధింపులకు పాల్పడుతున్నారు. దీనిని నివారించేందుకుగాను శాంతి భద్రతలను గవర్నర్కే అప్పగించాలి. 2. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థను టీ సర్కార్ ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంది. అధికారులను నియమించుకుంది. 3. కాలుష్య నియంత్రణ మండలి, న్యాక్లను తెలంగాణ ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంది. 4. పదో షెడ్యూల్లో సంస్థల నిర్వహణ, పరిశీలన ఉభయ రాష్ట్రాల యాజమాన్యంతో ఉండాలి. తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ 1. ఏపీ ఉద్యోగులకు ఎలాంటి వేధింపులూ లేవు. గవర్నర్కు శాంతిభద్రతలు అప్పగించడంపై అభ్యంతరం. 2. అలా చేయలేదు. అభ్యంతరం చెబుతున్నాం. 3. దీనిపైనా అభ్యంతరం చెబుతున్నాం. 4. దీనిపైనా అభ్యంతరం చెబుతున్నాం. -
ఏపీకి ఇవ్వాల్సినవి ఇస్తున్నాం
విభజన చట్టంలో హామీల అమలుకు కాస్త టైం పట్టొచ్చు చంద్రబాబు విమర్శలను సమర్ధించను, తప్పుపట్టను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అన్ని నిధులనూ ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నామని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్ర అవసరాలతో పోల్చితే కేంద్రం ఇస్తున్న నిధులు తక్కువగా కనిపించి ఉండొచ్చన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, పలువురు నేతలతో కలసి శనివారం ఆమె హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో హామీల అమలుకు కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. కార్యరూపం దాల్చేందుకు సమయం పట్టొచ్చన్నారు. దీనిపై ఏపీకి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రుల మధ్య చర్చలు కొనసాగుతాయని తెలిపారు. తన వంతుగా ఆయా చర్చల విషయాలను సీఎం చంద్రబాబుకు తెలియజేస్తున్నట్టు చెప్పారు. హామీల అమలుకు సంబంధించి కేంద్ర ప్రయత్నాలపై బాబుకు అవగాహన ఉందన్నారు. నిధుల కేటాయింపుపై చంద్రబాబు చేసిన విమర్శలను తాను సమర్ధించడం లేదని అలాగే తప్పుపట్టడమూ లేదని సీతారామన్ అన్నారు. కేంద్రానికి వివక్ష లేదు తెలంగాణ విషయంలోనూ కేంద్రం ఎలాం టి వివక్షా చూపబోదన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడే అంశాల్లో తప్ప రాష్ట్రాలకిచ్చే వాటాల్లో ఎలాంటి తేడా ఉండదన్నారు. 13వ ఆర్థిక సంఘం సమయంలో రాష్ట్రాలకిచ్చే 32 శాతం నిధులు, 14వ ఆర్థిక సంఘంలో 42 శాతానికి పెంచడం వల్ల కేంద్ర ఆదాయ వనరులు తగ్గిపోయాయన్నారు. తెలంగాణలో అమలు చేయాల్సిన పథకాలపై తాను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూనే ఉన్నానన్నారు. తెలంగాణలో లాజిస్టిక్ హబ్ ఏర్పాటుపై టీ ప్రజా ప్రతినిధులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారని, దీనికి సంబంధించి కేంద్ర అధికారులు రాష్ట్రంలో పర్యటించి స్థల పరిశీలన కూడా చేశారని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. ధాన్యం లెవీ విధానంలో వచ్చే ఏడాది నుంచి ఎలాంటి మార్పులూ ఉండబోవని తెలిపారు. రాష్ట్రాలు తమకు తామే ధాన్యం సేకరించుకోడానికి ముందుకొస్తే ఆ రాష్ట్రంలో ఎఫ్సీఐ కొనుగోలు చేయదని.. మిగిలిన రాష్ట్రాల్లో ఎఫ్సీఐ కొనుగోళ్లు యథావిధిగానే కొనసాగుతాయని చెప్పారు. నల్లధనాన్ని రప్పించడంపై మోదీ ప్రభుత్వం పురోగతి సాధిస్తూనే ఉందన్నారు.