ముఖ్యనేత నివేదిక వల్లే విభజన: లగడపాటి రాజగోపాల్ | A key leaders'sreport led to Bifurcation, says MP Lagadapati Rajagopal | Sakshi
Sakshi News home page

ముఖ్యనేత నివేదిక వల్లే విభజన: లగడపాటి రాజగోపాల్

Published Sat, Oct 5 2013 5:51 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ముఖ్యనేత నివేదిక వల్లే విభజన: లగడపాటి రాజగోపాల్ - Sakshi

ముఖ్యనేత నివేదిక వల్లే విభజన: లగడపాటి రాజగోపాల్

రాష్ట్రానికి చెందిన ఓ ముఖ్యనేత ఇచ్చిన నివేదిక వల్లే కాంగ్రెస్ హైకమాండ్ విభజనపై తొందరపడిందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఓ ముఖ్యనేత ఇచ్చిన నివేదిక వల్లే కాంగ్రెస్ హైకమాండ్ విభజనపై తొందరపడిందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. ఆ ముఖ్య నేత ఇటీవల సోనియాగాంధీని కర్ణాటకలోని మాండ్యలో ప్రత్యేకంగా కలిసి రాష్ట్రంలో జరిగిన ఓ సభ, ఉద్యమం తాలుకు పరిస్థితులను వివరించారని చెప్పారు. ఆ నేత ఎవరో త్వరలో వెల్లడిస్తానన్నారు. ఆ నాయకుడి అభిప్రాయం ఆధారంగానే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్నారు.
 
 లగడపాటి శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ నేత ఇచ్చిన సమాచారం తర్వాతే ఢిల్లీలో పరిణామాలు వేగంగా జరిగాయని చెప్పారు. అంతకుముందు ‘నోట్’ ఆలోచన లేని కాంగ్రెస్ హైకమాండ్.. ఆ నేత సమాచారంతో టేబుల్  నోట్‌గా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించి ఆమోదించారని వివరించారు. ‘నష్టాలు చెప్పినప్పటికీ విభజన నిర్ణయం తీసుకోవడం నీచం, బాధాకరం’ అంటూ హైకమాండ్‌పై నిప్పులుచెరిగారు. విభజనపై త్వరలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement