lagadapati rajagopal
-
పచ్చ మందలో 'కొత్త పిట్ట' పలుకులు.. పైసాకి పనికిరాని పృథ్వీరాజ్
ఏపీలో రాజకీయ పార్టీలు అన్నీ ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నందున లెక్కకు మించిన సర్వేలు బయటకు వస్తుంటాయి. దేశంలో ప్రముఖంగా ఉన్న సర్వే సంస్థలు అన్నీ కూడా ఏపీలో వైసీపీని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని తేల్చేశాయ్.. 2024లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సర్వే సంస్థలు క్లియర్గా తేల్చే చెప్పేశాయ్. అందులో భాగంగానే ఓట్ల కోసం పవన్ కల్యాణ్ను టీడీపీ అధినేత చంద్రబాబు తన లైన్లో పెట్టుకున్నాడు. అయినా, జగన్ను ఢీ కొట్టేందుకు బలం సరిపోవడంలేదని తేలిపోయింది. దీంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను కలిశాడు. అవసరమైతే రేపు కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతు కోసం కూడా ప్రయత్నాలు చేస్తాడు. ఇలా చంద్రబాబును ఎన్నికల సర్వేలన్నీ భయపెడుతున్నాయి. ఫలితాలపై జోస్యం చెబుతున్న 'కొత్త పిట్ట' తాజాగా ఇలాంటి సమయంలో కమెడియన్ పృథ్వీరాజ్ ఏపీ రాజకీయాల ఫలితాలపై చిలుక జోస్యం చెప్పాడు. లగడపాటి రాజగోపాల్ వారసుడు మాదిరి 2024 ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి ఏపీలో విజయం సాధిస్తుందని చెప్పి కామెడీ చేశాడు. సీఎం జగన్ బలం ముందు కూటమి బలం సరిపోవడం లేదని చంద్రబాబు నానాపాట్లు పడి ప్రశాంత్ కిషోర్ సలహాల కోసం వెంపార్లుడుతుంటే మధ్యలో ఈ జోక్లు ఏంటి..? అని పృథ్వీరాజ్పై పంచ్లు పడుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో కూడా ఇలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అని లగడపాటి రాజగోపాల్ అన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆయన్ను ఆంధ్రా ఆక్టోపస్ అంటూ కీర్తించాయి.. తీరా ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సునామీ ముందు టీడీపీ నేతలు అందరూ కొట్టుకుపోయారు. ఆంధ్రా ఆక్టోపస్ సర్వేలను నమ్మి కోట్ల రూపాయల్లో బెట్టింగ్ పెట్టి నష్టపోయిన వారు ఎందరో... ఫలితాలు వెలువడ్డాక సీఎం జగన్ దెబ్బ ఎలా ఉంటుందో లగడపాటి రాజగోపాల్కు తెలిసొచ్చింది. ఇకపై సర్వేలు చేయనని మూటముళ్లే సర్దుకొని కనిపించకుండా పోయాడు. తాజాగా లగడపాటి లేని లోటును కమెడియన్ పృథ్వీరాజ్ 2024 ఎన్నికల్లో తీర్చేలా ఉన్నాడు. ప్రస్తుతం టీడీపీలో పవన్కే సరైనే స్థానం లేదు.. వాళ్లను నమ్ముకుని ఇలాంటి చిలుక జోస్యాలు చెబితే ఎవరికైనా కామెడీగానే ఉంటుంది మరి! నయా పైసా లాభం లేదు 2019 సార్వత్రిక ఎన్నికల ముందు పృథ్వీరాజ్ వైసీపీ కోసం పనిచేశాడు. పృథ్వీ వల్ల పార్టీకి నయా పైసా లాభం లేకపోయినా పదవి దక్కిందని అప్పట్లో సోషల్మీడియాలో కామెంట్లు వచ్చాయి. అయినా కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చి పార్టీ కోసం పనిచేశాడని గుర్తించి.. అందుకుగాను ఎస్వీ భక్తి ఛానల్ చైర్మన్ బాధ్యతల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అప్పగించారు. అయితే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక చానల్ కీలక పోస్టులో ఉంటూ.. ఓ మహిళతో సరస సంభాషణలు చేసి పదవిని ఊడగొట్టుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా వైసీపీకి దూరమవుతూ.. టీడీపీ, జనసేన మందలో చేరిపోయాడు. తాజాగా ఈ కొత్త పిట్ట కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పడం విశేషం! -
లగడపాటి ‘చిలకజోస్యానికి’ వ్యక్తి బలి
సాక్షి, నిడదవోలు: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ టీడీపీ గెలవబోతోందంటూ చెప్పిన చిలకజోస్యం (సర్వే) ఓ వ్యక్తి ప్రాణం తీసింది. లగడపాటి సర్వేను నమ్మి ఓ కౌలు రైతు అప్పు తెచ్చిమరీ బెట్టింగ్ కాయగా.. టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో దిక్కుతోచక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కౌలు రైతు కంఠమని వీర్రాజు (45) ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమంటూ సుమారు రూ. 12 లక్షలు పందెం కాశాడు. అయితే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో వీర్రాజు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీర్రాజు టీడీపీ వీరాభిమాని. ఓ పక్క కౌలు చేస్తూనే ధాన్యం వ్యాపారం చేస్తాడు. ఎన్నికల ఫలితాలకు మూడు రోజులకు ముందు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల నుంచి కొంత నగదు అప్పు తీసుకున్నాడు. ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని సుమారు రూ.12 లక్షల పందెం కాశాడు. టీడీపీ 110 నుండి 130 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని లగడపాటి రాజ్గోపాల్ సహా పలు సర్వేలు చెప్పడంతో ఈసారి కూడా టీడీపీ విజయం సాధిస్తుందని భావించిన వీర్రాజు రూ.12 లక్షలు బెట్టింగ్ కాసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం, వైఎస్సార్ సీపీ ఏకంగా 151 స్థానాలు గెలుపొందడంతో వీర్రాజు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఓ వైపు పార్టీ ఓటమిపాలవ్వడం, ఓ వైపు రూ.12 లక్షలు పందెంలో పోగొట్టుకోవడంతో మనస్తాపం చెందాడు. మిల్లర్ల నుంచి అధిక మొత్తంలో నగదు అప్పుగా తీసుకోవడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేలివెన్ను గ్రామంలో తన ఇంటి నుంచి శుక్రవారం ఉదయం 6 గంటలకు ఎప్పటి మాదిరిగానే పొలం వెళుతున్నట్లు బయలుదేరాడు. అక్కడి నుంచి నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామ శివారున ఉన్న ముక్కులమ్మ వారి గుడి వెనుక ఉన్న ఓ గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీర్రాజుకు భార్య కంఠమని సునీత, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామంలో ఎంతో సామ్యుడిగా పేరున్న వీర్రాజు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బోరున విలపిస్తున్నారు. నిడదవోలు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు వీర్రాజు భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఏస్సై ఎన్.హనుమంతరావు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఒట్టు..ఇక సర్వేలు చేయను: లగడపాటి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చిలుక జోస్యం చెప్పి బొక్కబోర్లాపడ్డ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... ఇక జీవితంలో సర్వేల జోలికి వెళ్లనని ప్రతినబూనారు. ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఏపీ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారు..సైకిల్ విజయం తథ్యం అంటూ బీరాలు పలికిన ఆయనకు ఫలితాల అనంతరం దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఫ్యాన్ ప్రభంజనంతో సైకిల్ కొట్టుకుపోవడంతో ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి అభాసుపాలయ్యారు. ఫలితాల అనంతరం మీడియా ముందుకు వస్తానని బీరాలు పలికిన లగడపాటి...ఫ్యాన్ ఫుల్ స్పీడ్కి మొహం చాటేసి...చివరకు ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలం అయినందుకు చింతిస్తున్నానంటూ అధికారికంగా ఓ లేఖ విడుదల చేశారు. కారణాలు ఏమైనప్పటికీ తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల నాడి పసిగట్టడంలో వరుసగా రెండుసార్లు విఫలం అయినందుకు ఇక భవిష్యత్లో సర్వేలకు దూరంగా ఉండదలచుకుంటున్నట్లు చెప్పారు. తన ఫలితాల వలన ఎవరైనా, ఏ పార్టీ అయినా నొచ్చుకుని ఉంటే మన్నించాలంటూ లగడపాటి చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడు నిర్మాణాత్మక ప్రతిపక్ష నేతగా రాష్ట్రాభివృద్ధికి, నూతన ప్రభుత్వానికి తోడ్పాలంటూ లగడపాటి ఆకాంక్షించారు. చదవండి: బాబు కోసం బోగస్ సర్వేలు సరికొత్త నాటకానికి తెరలేపిన లగడపాటి విదూషకుల విన్యాసాలు -
ఏయ్ లగడపాటి నువ్వెక్కడా?
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్థాన సర్వే చిలక, కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మళ్లీ బోగస్ అని తేలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు జతకట్టిన మహాకూటమికి మేలు జరిగేలా బోగస్ సర్వేతో మాయ చేసిన లగడపాటి.. ఏపీ ఎన్నికల విషయంలోను అదే పంథాను కొనసాగించి పరువు తీసుకున్నారు. ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో ఎగ్జిట్పోల్ ఫలితాలు వెల్లడించిన లగడపాటి.. ఏపీలో మళ్లీ అధికారం టీడీపీ చేబట్టబోతుందని జోస్యం చెప్పారు. అన్ని సర్వే సంస్థలు, జాతీయ చానెళ్లు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైస్సార్సీపీకి పట్టం కట్టగా.. లగడపాటి మాత్రం భిన్నంగా టీడీపీ గెలుస్తుందని చెప్పారు. తీరా ఫలితాలు చూస్తే లగడపాటి చెప్పినవన్నీ బోగస్ అని స్పష్టమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించుతూ వైఎస్సార్సీపీ ఏకంగా 152 సీట్ల ఆధిక్యంతో చరిత్ర సృష్టించే దిశగా కొనసాగుతుంది. ఈ ఫలితంతో లగడపాటి విశ్వసనీయత కోల్పోయారు. ఆయనపై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ క్యాడరే లగడపాటి కనిపిస్తే చితక్కొట్టాలనే కసితో ఉంది. ఆయన చెప్పిన సర్వే వివరాలతో సోషల మీడియా వేదికగా అనవసర సవాళ్లకు దిగిన తెలుగు తమ్ముళ్లు ఫలితాలతో ముఖం చాటేశారు. దీనికి కారణమైన లగడపాటిపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఫన్నీ మీమ్స్ను ట్రెండ్స్ చేస్తున్నారు. ‘ఎయ్ లగడపాటి నువ్వెక్కడా? మళ్లీ సర్వే అంటూ మీడియా ముందుకు వచ్చావో?’ అంటూ అసభ్య పదజాలంతో మండిపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లోనే లగడపాటి సర్వేతో బెట్టింగ్రాయిళ్లు కోట్ల రూపాయలు నష్టపోయారని, బెట్టింగ్ల కమిషన్ కోసమే మళ్లీ తప్పుడు సర్వే వివరాలను వెల్లడించారని ధ్వజమెత్తుతున్నారు. మొత్తానికి లగడపాటి మళ్లీ సర్వే అని నోరెత్తకుండా.. అతని అంచనాలకు భిన్నంగా రెండు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడం గమనార్హం. pic.twitter.com/VkLtF7kR7Z — Ram Gopal Varma (@RGVzoomin) 23 May 2019 -
‘సర్వే అనకుండా.. లగడపాటిని లోపలేయాలి’
సాక్షి, అమరావతి : కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో బయటపెట్టిన వివరాలకు ఆధారాలు చూపాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ట్విటర్ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లగడపాటిపై ధ్వజమెత్తారు. లగడపాటి ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు.. ఎన్ని శాంపిల్స్ తీసారు? శాస్త్రీయంగా విశ్లేషించడానికి చేపట్టిన పద్ధతేమిటో వెల్లడించాలన్నారు. లేక పోతే చీటింగ్ కేసు నమోదు చేసి లోపలేయాలన్నారు. ఇంకో సారి సర్వే అనకుండా గుణపాఠం నేర్పాలని ట్వీట్ చేశారు. వీవీప్యాట్లు లెక్కించాలని చంద్రబాబు చేస్తున్న హడావుడి ఆయననో జోకర్ స్థాయికి తీసుకెళ్లిందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. గత డిసెంబరులో కాంగ్రెస్ 3 హిందీ రాష్ట్రాల్లో గెలిచినపుడు ఈవీఎంలు, వీవీప్యాట్ల గురించి మాట్లాడని వ్యక్తి ఇప్పుడు క్షణం తీరిక లేకుండా కోర్టుల చుట్టూ, నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రజల నాడి తెలియకుండా ఏం సర్వేలు చేస్తారు..
-
లగడపాటి సర్వేపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేపై మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని తెలిపారు. లగడపాటి మాట నమ్మి సర్వనాశనమైపోయామని తనతో చాలా మంది చెప్పారన్నారు. ప్రజల నాడీ లగడపాటికి ఏం తెలుసు అని ప్రశ్నించారు. ‘ప్రజల నాడీ తెలిసినోడు ఎగ్జిట్ పోల్ చేయాల. ప్రతి ఒక్కరూ సర్వేలు చేసేస్తే ప్రమాదం ఉంది. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్తో ప్రజలు కొన్ని కోట్ల రూపాయాలు నష్టపోయారు. వెయ్యి కోట్ల రూపాయల వరకు పందేలు కాశారు. వాళ్లంతా సర్వనాశనమైపోయార’ని అయ్యన్నపాత్రుడు అన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేతో తెలుగుదేశం పార్టీ సంబరాలు చేస్తుంటే మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. టీడీపీ ఓటమిని ఆయన చెప్పకనే చెప్పారని ప్రత్యర్థులు అంటున్నారు. (చదవండి: ఆంధ్రాలో జగన్ అద్భుత విజయం) సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బాబు కోసం బోగస్ సర్వేలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ప్రధాన సర్వే సంస్థలు, జాతీయ మీడియా కోడై కూస్తున్న నేపథ్యంలో తమ క్యాడర్ జారిపోకుండా ఉండేందుకు, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ పలు బోగస్ సర్వే సంస్థలను రంగంలోకి దించింది. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వస్తుందని పేరెన్నికగన్న సంస్థలన్నీ చెబుతుండగా, బోగస్ సంస్థలు మాత్రం మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వస్తుందని హడావుడి చేయడం వెనుక ఆ పార్టీ ముఖ్య నేతల ప్రోద్బలం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలో టీడీపీ నేతల అభిప్రాయమే వినిపించింది. ఐఎన్ఎస్ఎస్, ఎలైట్ పేరుతో మరికొన్ని సర్వేలు అదే కోవలో బయటకు వచ్చాయి. ఇవన్నీ టీడీపీ పెద్దల కనుసన్నల్లో పని చేసేవేనని చెబుతున్నారు. టీడీపీ ఓటమి ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడవుతుందని ముందే తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాము గెలుస్తున్నట్లు కొన్ని సంస్థలు చెబుతున్నాయని చూపించుకునేందుకు బోగస్ సంస్థలను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఈ సంస్థలు అసలు సర్వేలు చేయకుండానే చేసినట్లు బిల్డప్ ఇచ్చి, నోటికొచ్చిన సీట్ల లెక్కలు ప్రకటించినట్లు స్పష్టమవుతోంది. లగడపాటి సర్వే తీరిది.. రెండురోజుల నుంచి హంగామా చేస్తున్న లగడపాటి సర్వే పూర్తిగా బోగస్ అని సెఫాలజిస్టులు తేల్చిచెబుతున్నారు. ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో తాను సర్వే చేసినట్లు లగడపాటి చెబుతున్నా, అందులో నిజం లేదని తెలుస్తోంది. ఈ సంస్థను నిర్వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ తాను ఎలాంటి సర్వే చేయలేదని ప్రకటించగా, ఆయనతోనే తాను సర్వే చేయించినట్లు లగడపాటి చెబుతుండడం గమనార్హం. ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో చేసిన సర్వే వివరాలతో లగడపాటి ఒక నోట్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను కేవలం 38 నియోజకవర్గాల్లోనే తాము సర్వే చేశామని, 50 వేల శాంపిల్స్ తీసుకున్నామని అందులో పేర్కొన్నారు. అది కూడా మూడు జిల్లాల్లోనే ఈ సర్వే చేపట్టినట్లు చెబుతున్నారు. కేవలం 38 నియోజకవర్గాల్లో సర్వే చేసి, ఫలితాలను అంచనా వేయడం ఎక్కడా జరగదని సెఫాలజిస్టులు పేర్కొంటున్నారు. అందులోనూ లగడపాటి టీడీపీకి 90కి 20 స్థానాలు అటూ ఇటుగా వస్తాయని చెప్పడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 20 సీట్ల మార్జిన్తో ఫలితాలు అంచనా వేయడాన్ని బట్టి వారి సర్వేపై వారికే నమ్మకం లేదని తేటతెల్లమవుతోందని చెబుతున్నారు. చంద్రబాబుతో తెరచాటు సంబంధాలు కొనసాగిస్తూ, ఎన్నికల్లో టీడీపీకి మేలు చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన లగడపాటి సర్వేకు ఏమాత్రం ప్రామాణికత లేదని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే సంస్థలన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పగా, లగడపాటి మాత్రం మహాకూటమి గెలుస్తుందని జోస్యం చెప్పి అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఆ రెండు సంస్థలూ అంతే.. ఢిల్లీకి చెందిన ఐఎన్ఎస్ఎస్ సంస్థ పేరుతో విడుదలైన సర్వే కూడా టీడీపీ నాయకుల మెదళ్ల నుంచి బయటకు వచ్చిందే. ఐఎన్ఎస్ఎస్ అనేది ప్రాభవం కోల్పోయిన ఒక తెలుగు దినపత్రికలో పనిచేసిన జర్నలిస్టు ఢిల్లీలో నిర్వహిస్తున్న న్యూస్ ఏజెన్సీ. ఢిల్లీలో అన్ని కార్యక్రమాలను కవర్ చేయడానికి దానికి రిపోర్టర్లే లేరు. అలాంటి సంస్థ ఏపీలో భారీ ఎత్తున సర్వే చేశామని, టీడీపీకి 118, వైఎస్సార్సీపీకి 52, జనసేనకు 5 సీట్లు వస్తాయని తేలినట్లు ప్రకటించింది. ప్రముఖ సర్వే సంస్థలన్నీ వైఎస్సార్సీపీ.. టీడీపీ కంటే 6 నుంచి 8 శాతం ఓట్ల తేడాతో గెలుస్తుందని కచ్చితమైన లెక్కలతో వివరిస్తుండగా, ఈ సంస్థ మాత్రం వైఎస్సార్సీపీ కంటే టీడీపీకి 9.5 శాతం ఓట్లు ఎక్కువగా రానున్నట్లు చెప్పడాన్ని బట్టి ఇది పూర్తిగా టీడీపీ సర్వే అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ‘ఎలైట్ ఎలక్టోరల్ క్యాలిక్యులస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో విడుదలైన సర్వేలో టీడీపీకి 106 సీట్లు, వైఎస్సార్సీపీకి 68 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. ఇది కూడా టీడీపీ నేతలు విడుదల చేయించిన సర్వే అని సమాచారం. ఈ రెండు సర్వే సంస్థలు రాష్ట్రంలో ఏయే నియోజకవర్గాల్లో ఎన్ని శాంపిల్స్ తీసుకున్నది చెప్పకుండా కొన్ని కాకిలెక్కలతో ఫలితాలను అంచనా వేయడం గమనార్హం. టుడేస్ చాణక్య పేరుతో విడుదలైన మరో సర్వే టీడీపీకి 17 నుంచి 20 ఎంపీ సీట్లు, వైఎస్సార్సీపీకి 8 నుంచి 11 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపింది. కొద్దిరోజుల క్రితం కార్పొరేట్ చాణక్య పేరుతో టీడీపీకి అనుకూలంగా ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఒక సర్వేను విడుదల చేసింది. మిషన్ చాణక్య సర్వే సంస్థ దాన్ని ఖండించింది. తమ పేరును పోలిన సంస్థ పేరుతో బోగస్ సర్వే విడుదల చేశారని పేర్కొంది. ఇప్పుడు మిషన్ చాణక్య సంస్థ వైఎస్సార్సీపీ గెలుస్తుందని చెప్పగా, టుడేస్ చాణక్య పేరుతో టీడీపీకి అనుకూలంగా మరో సర్వేను బయట పెట్టారు. ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా వస్తున్నాయని తెలిసి చంద్రబాబు, ఆయన కోటరీ ఉద్దేశపూర్వకంగా కొన్ని బోగస్ సంస్థలతో తాము గెలుస్తున్నట్లు సర్వేల వివరాలు విడుదల చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
విదూషకుల విన్యాసాలు
ఏపీలో అధికారం కోల్పోతున్న తరుణంలో ఒక నాయకుడు చేయరాని పనులకు, దుర్మార్గాలకు చంద్రబాబు నాయకత్వం వహించడం దురదృష్టకరం. ఏ కాంగ్రెస్ నుంచి వచ్చి ఎన్టీఆర్ పంచనచేరి రాజ్యచక్రాన్ని తిప్పాడో, ఆ పార్టీ విధానానికే విరుద్ధంగా అదే కాంగ్రెస్లో చేరడానికి అన్ని మార్గాలూ వెతుక్కుంటున్నారు. ఈ ప్రహసన యాత్రలో అంతర్భాగమే ‘జగడపాటి’ విదూషక పాత్ర! ఇతని విద్య తిమ్మిని బమ్మిని చేయడం. గురుశిష్యులిద్దరిదీ ఒకటే మనస్తత్వం. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే చంద్రగిరిలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగడానికి ముందురోజున ఓటర్లను ప్రభావితం చేసేలా ఊహాజనిత ఫలితాలను ప్రసారం చేసిన ఘనుడు లగడపాటి. ‘‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇంత ఘోరంగా జరుగుతాయా? ఇది ప్రజాస్వామ్య మేనా? చంద్రగిరిలో రికార్డయిన పోలింగ్ వీడి యోలు పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది’’. – కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది (17.05.2019) ప్రకటన ‘‘దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ ఉండాలంటే.. నాయకుడు ఎంత గొప్పవాడైనా అతడి పాదాల కింద నలిగిపోయేలా ప్రజలు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అప్పగించి కూర్చోరాదు. అలాగే తాము త్యాగాలతో నిర్మించుకున్న రాజ్యాంగ వ్యవస్థల్ని దారి తప్పించి కూల్చివేయగల అధికారాల్ని అతని చేతుల్లో పెట్టరాదు. రాజకీయాల్లో భక్తి భావన పతనానికి చివరికి వ్యక్తి నియంతృత్వానికి రాజమార్గం వేస్తుం దన్న సత్యాన్ని మరిచిపోరాదు’. – 1949 నవంబర్ 25న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్ణయ సభలో చేసిన ఆఖరు ప్రసంగంలో హెచ్చరిక! మేడిపండుగా భావించిన ‘పండు’ను కాస్తా పొట్టవిప్పి చూడగానే పురుగులమయంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ మారుతోందని ఎప్ప టికన్నా హెచ్చుస్థాయిలో గత 70 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రకు అపవాదుగా 2019 ఎన్నికల నిర్వహణ నిరూపించాయి. ఈ పతన దశకు ప్రస్తుత కేంద్ర, దేశంలోని వివిధ రాష్ట్రాల పాలకులు కారకులయ్యారు. ఆంధ్ర ప్రదేశ్లో పతనదశలో ప్రవేశించిన భ్రష్ట టీడీపీ నాయకుడు చంద్రబాబు అధికారం కోల్పోతున్న తరుణంలో ఒక నాయకుడు చేయరాని పను లకు, దుర్మార్గాలకు నాయకత్వం వహించడం దురదృష్టకరం. కాంగ్రెస్ కేంద్ర అధిష్టానవర్గం నిరంకుశ పాలనా వ్యవస్థకు అంకురార్పణ చేస్తున్న తరుణంలో ఆ పరిణామానికి అడ్డుకట్టడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీని అష్టావక్రమార్గాల్లో నడిపించి భ్రష్టతవైపు మళ్ళించినవాడు చంద్రగిరి ప్రాంత చంద్రబాబు. అల్లుడిగా ఇంట్లో ప్రవేశించిన వ్యక్తి ‘నల్లి’ పోట్లు ద్వారా ఎన్టీఆర్ని సాగనంపి ముఖ్యమంత్రి పదవికి ఎగబాకిన వాడు అనంతరం తన పార్టీకి ఏకు మేకవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ విభజనకు కారకుడు కావడం జగమె రిగిన సత్యం. తాజాగా ఏ కాంగ్రెస్ నుంచి వచ్చి ఎన్టీఆర్ పంచనచేరి రాజ్యచక్రాన్ని తిప్పాడో, ఆ పార్టీ విధానానికే విరుద్ధంగా అదే కాంగ్రెస్లో చేరడానికి ఈ కష్టకాలంలో అన్ని మార్గాలూ వెతుక్కుంటున్నారు. ఈ ప్రహసన యాత్రలో అంతర్భాగమే ‘జగడపాటి’ విదూషక పాత్ర! ఇతని విద్య తిమ్మిని బమ్మిని చేయడం. గురుశిష్యులిద్దరిదీ ఒకటే మనస్తత్వం. ఒకరు పార్లమెంటును స్తంభింపచేయడం కోసం మిరియాల కారం (పెప్పర్ స్ప్రే) సభ్యుల కళ్లలో కొట్టడంలో నేర్పరి. మరొకరు అవసాన పదవీదశలో ఉన్న ముఖ్యమంత్రి. నిజానికి చంద్రగిరిని వదిలేసి కుప్పం నియోజకవర్గానికి చంద్ర బాబు ఎందుకు వలసపోవలసి వచ్చింది? కాంగ్రెస్లో ఉండి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి శాసనసభకు ఎన్నికైన∙వ్యక్తి.. ఎన్టీఆర్ను అంటకాగిన తర్వాత ఆ నియోజక వర్గాన్ని విడిచి ‘కుప్పం’ ఒడిలోకి ఎందుకు చేరవలసి వచ్చింది? పైగా, శిక్షా ప్రాంతంగా పేరు మోసిన కుప్పంకు బదిలీ కావడానికి అధికారులు ఎందుకు ఇష్టపడరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎడంగా, కడుకొసలో ఉన్న కుప్పం ఏనాడూ చంద్రగిరిలో అంతర్భాగమే కాదని చారిత్రికుల భావన. అందుకే, 1995 దాకా ఆంధ్ర ప్రదేశ్–కర్ణాటక–తమిళనాడు హద్దుల ముక్కోణం కూడలిలో ఉంది. ఏ అధికారినైనా శిక్షించాలంటే కుప్పానికి తోసి శిక్షిస్తారట. పైగా అమాయక తమిళనాడు పేదసాదలకు నిలయం కూడానట. ఈ ‘శిక్షాత్మక, సమ స్యాత్మక ప్రాంతాన్ని బాబు ఎంచుకుని తన రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నారు. రామకుప్పం, గూడుపల్లి, శాంతిపురం మండలాలతో కూడిన కుప్పాన్ని నియోజకవర్గంగా ఏర్పరచి, దానికి వ్యవసాయ క్షేత్రం అని పేరు జోడించారు. గతంలో తొలి ముఖ్యమంత్రి హోదాలో, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధకులు, శాస్త్ర వేత్తలు వద్దు వద్దన్నా మన వాతావరణానికి సానుకూలపడని ఏటవాలు ‘పోడు’ వ్యవసాయ పద్ధతుల్లో ఇజ్రాయెలీ సాగు పద్ధతుల్ని ప్రవేశపెట్టి చంద్రబాబు అభాసుపాలయ్యారు. ఇజ్రాయెలీ సాగుకు మన రైతుల్ని అలవాటు చేయడం కోసం సంప్రదాయ క్షేత్ర సరిహద్దుల్ని చెరిపేసి, రైతుల్ని ఇబ్బందుల పాల్జేసి, తమ భూముల్ని తామే గుర్తించలేని దుస్థి తిలోకి రైతుల్ని నెట్టి తీవ్ర విమర్శలకు గురైన బాబు కనీసం మర్యాద కోసమైనా, గౌరవ భావంతో రైతులకు పొరపాటు అయిందని కూడా క్షమాపణ చెప్పకుండా తప్పుకున్నారు. అలాంటి చంద్రబాబు, బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మొన్నటిదాకా భాగస్వామ్య పక్షంగా ఉండి, ఇటీవలే విడాకులిచ్చి తిరిగి తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్ను అంటకాగుతూ ఎన్టీఆర్ ‘తెలు గుదేశం’ పార్టీని భూస్థాపితం చేసే వైపుగా ప్రయాణిస్తున్నారు. ప్రజా వ్యతిరేక చర్య అయిన నోట్ల రద్దును మోదీ ప్రకటించకముందే మన రాష్ట్రంలో మొదట ప్రస్తావించి, ‘రద్దు’ పద్దుకు ప్రతిపాదించింది తానే నని గొప్ప కోసం ప్రకటించి, బీజేపీ సంకీర్ణానికి విడాకులిచ్చిన మరు క్షణం ఆ నెపాన్ని మోదీ మీదికి సునాయాసంగా నెట్టేశారు బాబు. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాలలోనూ ఓట్ల రిగ్గింగ్కు భారీ స్థాయిలో పాల్పడిన ‘దేశం’ పార్టీ నాయకులు, కార్యకర్తల రక్షణ కోసం బాబు పడరానిపాట్లు పడుతున్నారు. పైగా, డబ్బుతో ఓట్ల కొనుగోళ్లకు తన చోటామోటా నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రోత్సహించిన బాబు ఢిల్లీలో ‘ఎన్నికల విధానం: జవాబు దారీతనం’ అన్న అంశంపై సదస్సులో (18.5.2019) మాట్లాడుతూ ‘పెద్ద నోట్లు రద్దుచేసి కొత్తగా రూ. 500, రూ. 2,000 నోట్లను ప్రవేశ పెట్టడంవల్ల రాజకీయ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచటం సులువైపోయింది. ప్రజలు కూడా రెండువేలు, అంతకుపైనే ఎక్కువగా ఆశిస్తున్నార’నీ చెప్ప టం ప్రజల మధ్య నవ్వులాటగా మారిందని అతను గుర్తించటం లేదు. ‘జవాబుదారీతనం’ గురించి ఊకదంపుడు కొట్టే బాబు రాష్ట్ర ఉన్నతాధికారుల క్రియాశీల నిర్ణయాలను, ఎన్నికల (కేంద్ర–రాష్ట్ర) కమి షన్ ఉన్నతాధికారుల్ని లెక్క చేయకుండా పోవటం– అంబేడ్కర్ శఠిం చిన రాజకీయ అహంకార ప్రదర్శన తప్ప మరొకటి కాదు. ఎన్నికల నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కిన వ్యక్తి అతను. ఈ అహంకారం తోనే చంద్రగిరి నియోజకవర్గంలోని కీలకమైన పోలింగ్ కేంద్రాల పరిధిలోని దళిత, మైనారిటీలను ఓటు హక్కును వినియోగించుకో కుండా సుమారు 30 ఏళ్లుగా నిర్బంధ విధానాన్ని బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు వర్గం జాగ్ర త్తపడింది. ఈ పరిణామాలను బయటకు పొక్కనివ్వకుండా ‘వదరు బోతు’గా చంద్రబాబు– ‘చిలకజోస్యాల’ ‘రగడ’ (లగడ)పాటి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే పార్టీల ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు ఉండగానే తుది ఫలితాల ప్రకటన వెలువడక ముందే చంద్రగిరిలోని ఏడు పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరగడానికి ముందు రోజున ఓటర్లను ప్రభావితం చేసేలా ఊహాజనిత ఫలితాలను ప్రసారం చేశారు. అందుకు ఫలితాన్ని అనుభవించక తప్ప లేదు– అయిదు పోలింగ్ కేంద్రాలలో అధికార పార్టీకి అనుకూలంగా బాహాటంగా వ్యవహరించిన అధికారులపై ఎన్నిక సంఘం వేటు వేయవలసి వచ్చింది. ఇదిలా ఉండగా, ఫలితాల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలిసి కూడా చంద్రబాబు ‘కాలుకాలిన పిల్లిలా’ దేశ ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో విఫలమవుతున్నారని, పరువుకోసంగానూ ‘దేశం’ ఓటమిని ఆంధ్రప్రదేశ్లో హుందాగా ఒప్పుకోవడానికి మనస్సు బిక్క చచ్చిపోయినందున ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలు, బెంగాల్, ఒడిశా నాయకులను తనలాగే కాంగ్రెస్కు తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయ త్నాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ఇందుకు కారణం– సొంత రాష్ట్రంలోనే తన అధికార పునాదులు బీటలు వారుతూండటమేనని మరువరాదు. పళ్ల బిగువుతోనే ఢిల్లీ, పంజాబ్, కోల్కతాల పంచల్లో తల దాచుకోచూడటం. దళిత ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా, బెదిరింపుల ద్వారా దౌర్జన్య హింసల ద్వారా అడ్డుకుని వారి ఓట్లను వారి పేరిట తామే గుద్దుకున్న ‘దేశం’ నాయకత్వ చర్యలు వేనోళ్ల ఖండించి ఏవగించుకోవలసినవి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘రగడ పాటి’ జరిపిన సర్వే ఫలితాలు ఉభయ ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య ఎంతగా నవ్వుల పాలయ్యాయో తెలిసిందే. 24 గంటలు గడవకముందే చంద్రబాబు మాజీ నియోజకవర్గమైన చంద్రగిరిలో భారీ బందోబస్తు మధ్య జరపవలసి వచ్చిన రీ–పోలింగ్ సందర్భంగా కూడా పరమ ‘బోకు’ జోస్యంగా, కాదు కాదు, పరమ అపహాస్యంగా మిగిలిపోను న్నది. పైగా ఇప్పటికే అడుగూడిన ప్రతిపక్ష నాయకులతో రేపు ఏపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతున్న చంద్రబాబు మంతనాలు చేస్తున్నారు. యావద్భారతంలో ఆసేతు హిమాచల పర్యంతం ‘ప్రజాస్వామ్యం’ విలువలు 2019 ఎన్నికలలో మరింతగా దిగజారిపోవటం విచారకరం! ఎన్టీఆర్, వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలు తెలుగు వారి కీర్తి పతాకలను నిలబెట్టగా, వాటిని దించేయడానికి సాహసించినవారుగా, రేపటి పదవీభ్రష్టులుగా చంద్రబాబు అతని పార్టీ మిగిలిపోతారు. కానీ, రేపటి ఉషోదయానికి, పరిణామశీలమైన మార్పుకు ఆహ్వానం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
లగడపాటి - కిరసనాయిలు ఆడుతున్న డ్రామా..
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేపై వైఎస్సార్ సీపీ నేత విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘40 వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి లగడపాటి దివాలా తీశాడు. దీన్ని ఆసరా చేసుకుని ‘కిరసనాయిలు’ పగలు బాబుకు, రాత్రి బుకీలతో డీల్స్ కుదిరించాడు. తెలంగాణా ఎన్నికల్లో వీళ్లిద్దరూ ఇలాగే బోగస్ సర్వే ఇచ్చి వెయ్యి కోట్లు సంపాదించారు. మళ్లీ సేమ్ డ్రామా. బుకీలు యాక్టివ్ అయిపోతారు. అమాయకులను నమ్మించి సైకిల్పై పెట్ట్టిస్తారు. తన పేపర్లో ఎన్ని సీట్లలో గెలిచేది కిరసనాయిలు రాస్తాడు. సాయంత్రం 6 లోగా బుకీలు సేఫ్. చంద్రబాబు విదిల్చే కాంట్రాక్టులు, బుకీస్ ఇచ్చే కమిషన్లపై రోజులు వెళ్లదీస్తున్నాడు లగడపాటి. భీమవరం,విజయవాడ కేంద్రాలుగా బెట్టింగ్ ఆడేవారు 90 శాతం ఫ్యాన్ గెలుస్తుందని పెట్టారట. బుకీలు వేల కోట్లు నష్టపోయేట్టున్నారు. లగడపాటి - కిరసనాయిలు ఇద్దరూ కలిసి బాబు కోసం, బుకీల కోసం ఆడుతున్న డ్రామా. మొన్నటి ఎన్నికల్లో టిడిపి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి లగడపాటి ఊగాడు.ఆ పార్టీ పరిస్థితి అర్థమై ఓడిపోయేదానికి ఎందుకులే అని తప్పుకున్నాడు. ఇప్పుడే పార్టీతో సంబంధం లేదని కోస్తున్నాడు. కన్నాలేసే దొంగకు ఏఇంట్లో దూరితే ఏం దొరుకుతుందో అంచనా వేసే సిక్త్స్ సెన్స్ ఒకటి ఉండి చస్తుంది. చంద్రబాబు స్కెచ్ లో భాగమే లగడపాటి సర్వే. 23న కౌంటింగ్ ప్రారంభం కాగానే బాబు ఏమంటాడంటే ... గెలుస్తామని లగడపాటి చెప్పాడు. అయినా ఓడుతున్నామంటే అందుకు ఈవీఎం ట్యాంపరింగే కారణం అని చెప్పేందుకే ఈ గోల. ఆంధ్రా ఆక్టోపస్ కాదు...ఇది ఎల్లో జలగ! లగడపాటి గారూ... మీ పేరును నారా రాజగోపాల్గా మార్చుకోండి.’ అంటూ ఆయన ట్విట్ చేశారు. కాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బెట్టింగ్లు కాసి, సొమ్ము చేసుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గూటి చిలుక లగడపాటి రాజగోపాల్ పెద్ద స్కెచ్ వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించబోతున్నట్లు తమ సర్వేలో తేలిందని ఆయన ఢంకా బజాయించారు. దాంతో బెట్టింగ్ రాయుళ్లంతా మహా కూటమి గెలుస్తుందంటూ పందేలు కాశారు. కానీ, లగడపాటి మాత్రం తన అనుచరులతో అధికార టీఆర్ఎస్ గెలుపు తథ్యమంటూ బెట్టింగ్లు కాసేలా జాగ్రత్త పడినట్లు విమర్శలు వినిపించాయి. చివరకు టీఆర్ఎస్ నెగ్గడంతో బెట్టింగ్ల్లో లగడపాటి మనుషులు భారీగా ఆర్జించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని లగడపాటి అమలు చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలవడడానికి 24 గంటల ముందే నిన్న మీడియాతో మాట్లాడారు. ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తుందని తమ సర్వేలో తేలినట్లు సంకేతాలిచ్చారు. -
బెట్టింగ్ కోసం ఆక్టోపస్ మోసం!
-
టీడీపీ ఎమ్మెల్సీతో లగడపాటి భేటీ
-
సరికొత్త నాటకానికి తెరలేపిన లగడపాటి
సాక్షి, అమరావతి : రేపు చంద్రగిరిలో రీపోలింగ్ జరుగనున్న నేపథ్యంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరో సరికొత్త నాటకానికి తెరలేపారు. తెలుగుదేశం పార్టీకి లబ్ది చేకూర్చేందుకు నిబంధనలు సైతం తుంగలో తొక్కారు. ఎన్నికల్లో ఫలితాలు టీడీపీకే అనుకూలం అంటూ నిబంధనలకు విరుద్ధంగా సర్వే వివరాలు బయటపెట్టారు. కాగా సర్వే వివరాలు వెల్లడించడానికి ముందు రాజగోపాల్ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో భేటీ అయ్యారు. మీడియా సమావేశం కంటే ముందే బుద్ధా వెంకన్నతో అరగంట పాటు ఆయన భేటీ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ మీడియా సమావేశంలో ఏం మాట్లాడుతారనే విషయంపై విశ్లేషకులు ముందే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఊహించినట్టుగానే పచ్చ పార్టీ భజన చేయడానికి మాత్రమే ఆయన విలేకరుల ముందుకు వచ్చినట్టు ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : టీడీపీ ఎమ్మెల్సీతో లగడపాటి భేటీ ఇక అమెరికా నుంచి హుటాహుటిన వచ్చి లగడపాటి ఈ విధంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వెనుక దురుద్దేశం ఉందన్న విషయం స్పష్టమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. రీపోలింగ్లో టీడీపీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం వెనుక ఆ పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. కాగా గతేడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే అంచనాలు తప్పడంతో లగడపాటి రాజగోపాల్ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధికారం చేపట్టిన టీఆర్ఎస్ దారుణంగా ఓడిపోతుందని, టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వెల్లడించిన ఆయన సర్వే పూర్తి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చింది. దీంతో రాజగోపాల్ సర్వే విశ్వసనీయతపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. -
త్వరలో అన్ని విషయాలు చెబుతా: లడగపాటి
సాక్షి, తిరుమల: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. కాలినడకన కొండెక్కి స్వామి ఆశీస్సులు పొందారు. దర్శనం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాలినడకన తిరుమల చేరుకుని స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తెలుగు ప్రజలందరు ఎక్కడ ఉన్నా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్టు చెప్పారు. ఎన్నికల గురించి విలేకరులు ప్రశ్నించగా.. పవిత్రమైన తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదని, త్వరలో అన్ని విషయాలు చెబుతానని అన్నారు. కాగా, గతేడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే అంచనాలు తప్పడంతో ఆయన తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. -
రైలుకు..రెడ్ సిగ్నల్
సాక్షి, తిరువూరు : విజయవాడ నుంచి ఎన్నికవుతున్న పార్లమెంటు సభ్యులు కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గ నిర్మాణానికి హామీలు ఇస్తున్నా అడుగు ముందుకు కదలట్లేదు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన పదవీకాలంలో ఈ రైలుమార్గం నిర్మిస్తామని పలుమార్లు చేసిన ప్రకటనలు నీటిమూటలుగా మిగిలాయి. 2012–13 కేంద్ర ప్రభుత్వ రైల్వే బడ్జెట్లో ఈ రైలుమార్గం నిర్మాణానికి రూ.723 కోట్లు అవసరమని నిర్ధారించినప్పటికీ నిధులు మంజూరు చేయలేదు. తాజా మాజీ ఎంపీ కేశినేని నానీ అసలు ఈ రైలుమార్గం ఊసే పట్టించుకోలేదు. కనీసం ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంటు సభ్యుడైనా కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రయోజనం కృష్ణా, ఖమ్మం జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో ప్రయోజనకరమైన కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గం విషయంలో పాలకులు నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్నారు. పూర్వపు ఎంపీ చెన్నుపాటి విద్య తొలుత ఈ రైలుమార్గ నిర్మాణాన్ని పార్లమెంటులో ప్రస్తావించారు. అప్పటినుంచి ఏటా బడ్జెట్లో ప్రతిపాదనలు రూపొందించడం నిధుల కేటాయింపు వాయిదా వేయడం పరిపాటైంది. మూడేళ్ల క్రితం ఈ రైలుమార్గం నిర్మాణానికి అవసరమైన సర్వే కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో 2012లో సర్వే పూర్తి చేశారు. 125 కిలోమీటర్ల నిడివి రైలు మార్గం నిర్మించడానికి ఈ సర్వేలో ప్రణాళిక రూపొందించారు. మార్గం సుగమం కొండపల్లి–కొత్తగూడెం రైలు మార్గాన్ని చత్తీస్ఘడ్ వరకు విస్తరిస్తే పలురాష్ట్రాల నడుమ నేరుగా రైల్వే సదుపాయం ఏర్పడుతుంది. ఇప్పటికే భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైలు మార్గానికి కేంద్ర బడ్జెట్లో ఆమోదం తెలిపినందున ఖర్చు తగ్గే అవకాశం ఉంది. చెన్నై, బెంగళూరు తదితర నగరాల నుంచి మధ్యప్రదేశ్కు తక్కువ సమయంలో చేరుకునేందుకు ఈ రైలుమార్గం అనుకూలంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ రైలుమార్గం నిర్మాణంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం వాటా భరించాలని నిర్ణయించడంతో త్వరితగతిన పనులు పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులు రైలుసదుపాయం కోసం గతంలో తిరువూరు ప్రాంత ప్రజాప్రతినిధులు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు విన్నవిస్తున్నారు. దివంగత ఎమ్మెల్సీ కొల్లి పావన వీరరాఘవరావు కేంద్రప్రభుత్వంలో తనకున్న పరిచయాల నేపథ్యంలో కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గం నిర్మించాలని 20 సంవత్సరాల పాటు తీవ్రంగా కృషిచేశారు. ప్రస్తుతం రోడ్డుమార్గంలో రద్దీ విపరీతంగా పెరగడంతో ఇబ్రహీంపట్నం–జైపూర్ జాతీయ రహదారిపై నిత్యం అధికసంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రైలుమార్గం ఏర్పడితే తిరువూరు, మైలవరం నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగం. -
నిలకడ లేని ‘నారా’జకీయం
అయితే మేనియా, లేదంటే ఫోబియా. మధ్యేమార్గం లేదు. మేనియా అంటే పిచ్చి ప్రేమ. నిర్హేతుకమైన అభిమానం. ఫోబియా అంటే గుడ్డి వ్యతిరేకత. మితిమీరిన ద్వేషం. రెండూ తీవ్రమైన మానసిక ధోరణులే. సాధారణంగా కొందరు వ్యక్తులకు కొందరంటే మేనియా ఉంటుంది. కొందరిపట్ల ఫోబియా ఉంటుంది. ఒకే వ్యక్తికి రెండు లక్షణాలూ ఉండవలసిన పని లేదు. ఒక వేళ ఉన్నప్పటికీ అవి దాదాపు శాశ్వతంగా ఉంటాయి. అభ్యాసం వల్ల వాటి తీవ్రత తగ్గుతుంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిలో ఈ రెండు లక్షణాలూ ఏకకాలం ప్రకోపించే నైజం ఉంది. ఒకరిని విపరీతంగా అభిమానిస్తారు. అదే సమయంలో మరొకరిని హద్దులు మీరి ద్వేషిస్తారు. ఒక వ్యక్తి లేదా వ్యవస్థ పట్ల కొంతకాలం మేనియా ప్రదర్శించి కొంతకాలం తర్వాత అదే వ్యక్తి లేదా వ్యవస్థ పట్ల అంతే స్థాయిలో ఫోబియా చూపించడం ఆయన ప్రత్యేకత. ఉదాహరణకు 2014 జూన్ నుంచి 2018 మార్చి వరకూ నరేంద్రమోదీ దేశానికి ప్రధానమంత్రులుగా పని చేసిన వారందరిలోకీ ఉత్తముడు. ఘటనాఘటన సమర్థుడు. ప్రపంచంలో భారత దేశా నికి సమున్నత స్థానం సంపాదించిన రాజకీయవేత్త. తన సలహా మేరకు పెద్ద నోట్లను రద్దు చేసి నల్లధనం అంతుచూసేందుకు సాహసోపేతమైన చర్య తీసు కున్న దురంధరుడు. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ)ని అత్యంత లాఘవంగా అమలులోకి తెచ్చిన నేర్పరి. స్నేహం చెడి, బంధం వీడి, ప్రత్యర్థులుగా మారిన తర్వాత అదే మోదీ పనికిరాని ప్రధాని. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిని నిరోధించలేకపోయిన అసమర్థుడు. ఉగ్రవాద దాడిపై అనుచిత వ్యాఖ్య ఎన్నికలు రెండు మాసాల దూరంలో ఉన్నాయనగా ప్రజలలో దేశభక్త్యావేశం నింపడానికి ఉగ్రవాదుల దాడిని పనికట్టుకుని జరిపించారా అని అనుమానం కలుగుతోందనే విధంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతాబెనర్జీ కూడా అదే ఫక్కీలో కేంద్రం నిజాయతీని శంకించారు. వీరిద్దరి కంటే పంజాబ్ మంత్రి నవజోత్ సిద్ధూ నయం. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సిద్ధూ అనడం సమయోచితం కాకపోయినా అర్థం లేని బాధ్యతారహితమైన వ్యాఖ్య కాదు. నిర్మాణాత్మకమైనదీ, ఆవేశాలు చల్లారిన అనంతరం ఆచరణయోగ్య మైనదీ. గోధ్రా అమానుషం, అనంతర మారణహోమం జరిగింది 2002లో. 2014లో నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి నారావారికి మోదీ నేపథ్యంలో ఎటువంటి అభ్యంతరకరమైన అంశం కనిపించలేదు. గుజరాత్ నరమేధం గుర్తురాలేదు. ఎట్లాగైనా గెలవడం ప్రధానం. అందుకే సినీనటుడు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్ళి మరీ మద్దతు కోరారు. మొత్తంమీద స్వల్ప ఆధిక్యంతో ఎన్నికలలో గెలిచారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీతో భాగస్వామ్యం నెరిపారు. నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఏ)నుంచి వైదొలిగిన తర్వాత గుజరాత్ మారణకాండ, నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రవచించిన రాజధర్మం నారావారికి జ్ఞాపకం వచ్చాయి. దీనినే మనోవైజ్ఞానిక శాస్త్రంలో సెలక్టివ్ ఆమ్నీసియా (ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మరచిపోవడం) అంటారు. ఇది కూడా ఒకానొక మానసిక లక్షణమే. మేనియా ఉన్నంతకాలం ఆకాశానికి ఎత్తడం, మేనియా దిగిపోగానే నేలకేసి కొట్టడం. మోదీ పట్ల ఆరాధనాభావం ఉన్న కాలంలోనే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ పట్ల ద్వేషభావం ఉండేది. నరేంద్రమోదీని అవధులు లేకుండా అభిమానిస్తున్న రోజుల్లో కాంగ్రెస్ చెత్తపార్టీ. సోనియాగాంధీ ఇటలీ రాక్షసి. మాఫియోజీ. ఆమె కుమారుడు రాహుల్గాంధీ అసమర్థుడు. పప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. రాహుల్గాంధీ గుంటూరు పర్యటనకు వస్తే, ‘ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? ఇక్కడ ప్రజలు బతికున్నారో, చచ్చారో చూడటానికి వచ్చారా?’ అంటూ ఉతికి ఆరేశారు. అదంతా కాంగ్రెస్ ఫోబియా ఉన్న రోజుల్లో వైఖరి. ఫోబియా మోదీపైకి మళ్ళి మేనియా సోనియా, రాహుల్ వైపు బదిలీ కావడంతో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల తీరు కూడా అక స్మాత్తుగా మారింది. తన ప్రయోజనాలు నెరవేర్చనందుకు మోదీని ఓడించాలని చంద్రబాబు తీర్మానించుకున్నారు. ప్రతిష్ట క్రమంగా కోల్పోతున్న నరేంద్ర మోదీని మోయడం కంటే మోదీకి ఎదురు తిరిగి అతడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించిన ప్రతినాయకుడు (విలన్)గా అభివర్ణించాలి. మీడియా సహకారంతో ప్రజలను నమ్మించాలి. హస్తినపై పోరాటమా, ఆరాటమా? కేంద్రంపైన యుద్ధం ప్రకటించడం ద్వారా ప్రజల తరఫున అన్నిటికీ తెగించి పోరాడుతున్న యోధుడిలాగా కనిపించాలి. ఓటర్లను మెప్పించి మరోసారి అసెంబ్లీలో మెజారిటీ స్థానాలు గెలుచుకుని ముఖ్యమంత్రి పదవిలో కొన సాగాలి. వీలైతే తనయుడు లోకేష్ను గద్దెపైన కూర్చోబెట్టాలి. అదృష్టం కలిసి వచ్చి కేంద్రంలో రాహుల్గాంధీ నాయకత్వంలో యూపీఏ–3 ప్రభుత్వం ఏర్ప డితే హస్తినలో చక్రం తిప్పాలి. ఇదీ చంద్రబాబు వ్యూహం. మోదీని ఓడించడం కోసం రాహుల్ని భుజానికి ఎత్తుకుని మోయడానికి అభ్యంతరం లేదు. సొంత బలంతో ఏదీ సాధించే అవకాశం లేదు కనుక ఏదో ఒక జాతీయ పార్టీ సహకారం అనివార్యం. కేంద్రంలో గణనీయమైన పాత్ర పోషించాలంటే తక్కిన ప్రాంతీయపార్టీలను తానే ప్రభావితం చేసి నడిపిస్తున్నారనే అభిప్రాయం కలిగించాలి. అందుకే ప్రత్యేక విమానంలో బెంగళూరుకూ, భువనేశ్వర్కూ, కోల్కతాకూ చక్కర్లు కొట్టడం. మాయావతినీ, అఖిలేష్నీ యూపీఏ పరిష్వంగంలోకి తీసుకుని వస్తానంటూ రాహుల్కి వాగ్దానం చేశారు. అన్నీ కలసి వస్తే శరద్పవార్ మూడు దశాబ్దాల స్వప్నం సాకారమై ఆయనే ప్రధాని కావచ్చునంటూ మరాఠా యోధుడి చెవులో చెబుతారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో రెండు విడతల ప్రభంజనం సృష్టించిన మమతాబెనర్జీ ప్రధాని పదవికి నూటికి నూరుపాళ్ళు అర్హురాలంటూ ఆమెలో ఆశలు రేకెత్తిస్తారు. మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రతిపక్షాల కూటమి ఖాయ మంటూ ఆమెతో అంటారు. ఏ రోటి కాడ ఆ పాట. మమతను ప్రసన్నం చేసుకోవడానికి రెక్కలు కట్టుకుని కోల్కతాలో వాలడానికి సిద్ధం. మాయావతి ఆశీస్సుల కోసం ఢిల్లీ కానీ లక్నో కానీ వెళ్ళడానికి తయారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా వ్యవహరించినప్పుడు కూడా ఇదే తీరు. అందుకే మొన్న ఢిల్లీ ఆంధ్రాభవన్లో పన్నెండు గంటల దీక్ష సమయంలో సమాజ్వాదీపార్టీ వ్యవ స్థాపకుడు ములాయంసింగ్ మాట్లాడుతూ, ‘ప్రధానమంత్రిగా మీరు ఉండాలంటూ నాయుడూజీ నాతో అన్నారు’ అంటూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత అదే ములాయం లోక్సభ చివరి రోజు సమావేశంలో మాట్లాడుతూ నరేంద్రమోదీ మళ్ళీ విజయం సాధించి ప్రధానిగా కొనసాగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అది వేరే విషయం. బీజేపీ అగ్రనాయకద్వయం మోదీ– అమిత్షా తక్కువేమీ తినలేదు. గుజరాత్ గాయం తర్వాత తనను పదవి నుంచి తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి మోదీ విస్మరించజాలరు. తాను హైదరాబాద్లో అడుగుపెడితే అరెస్టు చేస్తానంటూ నాటి సిటీ పోలీసు కమిషనర్తో చంద్రబాబు చెప్పించిన విషయం మరచిపోలేదు. కానీ ఎట్లాగైనా విజయం సాధించి అధికారం కైవసం చేసుకోవాలన్న ఏకోన్ముఖదీక్షతో చంద్ర బాబుతో దోస్తీకి మోదీ అంగీకరించారు. ఎన్డీఏ నుంచి నిష్క్రమించిన తర్వాత తనపైన వాగ్బాణాలు ఎక్కుపెడుతున్న చంద్రబాబు గతం మోదీకీ, అమిత్షాకీ అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వారికి ఇప్పుడు కనిపిస్తున్నారు. అవినీతికి ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దర్శనమిస్తున్నారు. అవకాశవాదం మూర్తీభవించిన నేత కళ్ళకు కడుతున్నారు. ఢిల్లీలో రాహుల్గాంధీ ఇంటికి వెళ్ళి శాలువా కప్పి స్నేహం ప్రకటించిన చంద్రబాబు టీడీపీతో మూడున్నర దశాబ్దాలు నిరంతర పోరాటం చేసిన కాంగ్రెస్ యోధులకు దేవుడిలాగా కనిపిస్తున్నారు. ‘గతం గతః’ అంటూ రాహుల్ గాంధీ కాంగ్రెస్, టీడీపీ మధ్య వైరాన్ని చాలా తేలికగా కొట్టిపారవేశారు. తలాతోకాలేని మాటలు ఈ మధ్య చంద్రబాబు తమాషా వ్యాఖ్యలు చేస్తున్నారు. తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారు. పద్నాలుగు మాసాలకు పైగా పాదయాత్ర చేసిన మిత్రుడు జగన్మోహన్రెడ్డిని పలకరించడానికి సినీహీరో అక్కినేని నాగార్జున లోటస్ పాండ్కు వెడితే, ‘నాగార్జునకు ఏమైనా అవసరాలు ఉంటే నా దగ్గరికి రావచ్చు. ముఖ్యమంత్రి హోదాలో సహాయం చేస్తా. నేరస్థులను కలిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెడతాయి’ అంటూ చిత్రంగా వ్యాఖ్యానించారు. సోనియా పనుపున తాను, చిదంబరం కలసి సీబీఐ చేత పెట్టించిన బూటకపు కేసులు ఏవీ కోర్టులో నిలవజాలవని చాలామంది న్యాయశాస్త్ర ప్రవీణులు అన్నారు. నిర్దోషిగా జగన్ మోహన్రెడ్డి కేసుల నుంచి విముక్తి పొందుతారని చంద్రబాబుకీ తెలుసు. నిందితుడికీ, దోషికీ తేడా పాటించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఒక ముఖ్య మంత్రికి తగదని ఆయనకు వేరొకరు చెప్పనక్కరలేదు. కానీ ఆయన మానసిక స్థితి ఆయనను నిలువనీయదు. జగన్మోహన్రెడ్డి ఫోబియా చంద్రబాబుచేత ఏది పడితే అది మాట్లాడిస్తుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకుంటున్న కుమార్తెను చూసివచ్చేందుకు జగన్మోహన్రెడ్డి దంపతులు లండన్ వెడితే హవాలా డబ్బులు తెచ్చుకునేందుకు వెళ్ళారంటూ నోరుపారేసుకోవడం ఆయనలో నానాటికీ పెరుగుతున్న అభద్రతాభావం కారణంగానే. సింగపూరులో ఆర్థిక ప్రయోజనాలు చంద్రబాబుకి ఉన్నాయనీ, అందుకే ప్రతిపక్షంలో ఉన్న కాలంలో సైతం ఆ దేశం సందర్శించేవారనీ అందరూ అంటారు. చంద్రబాబు లాగా ప్రత్యేక విమానంలో ప్రయాణం చేసేవారికి సింగపూర్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ హవాలా డబ్బు తీసుకురావడం తేలిక. ఒక వైపు మోదీ, మరోవైపు పవన్ కల్యాణ్ సహాయం చేస్తేనే 2014లో బొటాబొటి ఓట్లతో గెలుపొందిన టీడీపీకి ఈ సారి బీజేపీతో పొత్తు లేదు. పవన్కల్యాణ్ నాయకత్వం లోని జనసేనతో పొత్తు ఉంటుందో లేదో ఇంకా స్పష్టం కాలేదు. పొత్తు ఉంటుందని అనుకున్నప్పటికీ అది పరాజయం నుంచి కాపాడలేదు. అయిదేళ్ళు అధికారంలో ఉండి సంపాదించుకున్న ప్రజావ్యతిరేకత టీడీపీ విజయావకాశాలను మరింత క్షీణింపజేసింది. అధికారంలో ఉండగా సాధించామని చెప్పుకోవ డానికి ఒక్కటీ లేదు. జాతీయ మీడియా సంస్థలూ, సర్వే సంస్థలూ ఇంతవరకూ జరిపిన అన్ని సర్వేలలోనూ వైఎస్ఆర్సీపీ ఘనవిజయం సాధించబోతోందని చాటుతున్నాయి. తాజాగా ‘ఇండియా టుడే’ సర్వేలో వైఎస్ఆర్సీపీకి టీడీపీ కంటే ప్రజాదరణలో తొమ్మిది శాతం ఆధిక్యం ఉన్నట్టు తేలింది. ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ, డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించుకుంటున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ను బలవంతం చేసి తెలంగాణ ఎన్నికల ముందు ఫలితాలు చెప్పించిన సర్వే వంటి సర్వేలు కావు ఇవి. సాధారణంగా వార్తలూ, వ్యాఖ్యల విషయంలో చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించే జాతీయ టీవీ చానళ్ళే ఈ సారి ఆయన పరాజయం ఖాయమని అంటున్నాయి. మీడియాను కానీ మరో వ్యవస్థను కానీ సుముఖం చేసుకొని ‘మేనేజ్’ చేసే విద్య చంద్రబాబుకి ఉన్నదనే విషయం లోకానికి తెలుసు. అటువంటి విద్య జగన్మోహన్రెడ్డికి బొత్తిగా లేదు. తాను చేసే అక్రమాలనూ, మోసాలనూ ప్రత్యర్థులకు ఆపాదించి నిందించడం జగన్ మోహన్రెడ్డికి అలవాటంటూ చంద్రబాబు మరో విమర్శ చేశారు. తెలంగాణలో టీడీపీ టికెట్పై గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్ఎస్లో చేరినప్పుడు సంతలో పశువులాగా అమ్ముడుపోయారంటూ నిందించిన చంద్రబాబు 23 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలను ఎడాపెడా కొనేశారు. బెంగళూరులో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు కొనుగోలు చేస్తున్నారంటూ, పశువుల కంటే హీనంగా ఎంఎల్ఏలు అమ్ముడుపోతున్నారనీ, ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్నారనీ చంద్రబాబు తీవ్రమైన ఆవేదన వెలి బుచ్చారు. ఆయనలోని అపరిచితుడు ఎప్పుడు బయటికి వచ్చి ఏమి అంటాడో ఆయనకే తెలియదు. తాను వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలచేత పార్టీ ఫిరాయింప జేసిందీ, వారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టిందీ చంద్రబాబు మరచిపోయి ఉంటారా? అది సెలక్టివ్ ఆమ్నీసియా ఫలితమా? మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలే చెప్పాలి. -కె. రామచంద్రమూర్తి -
ఈవీఎంలు, వీవీప్యాట్లలో ఓట్ల తేడాలెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఎన్నికల అనంతరం ఓట్ల శాతాన్ని లెక్కిం చేందుకు ఎన్నికల సంఘానికి రెండు రోజుల సమయం ఎందుకు పట్టింది? ఈవీఎంలలో, వీవీ ప్యాట్లలో ఓట్ల తేడాలెందుకొచ్చాయన్న అనుమా నాలు నివృత్తి చేయాలన్నారు. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో జరిగిన పంచా యతీ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాల్సిన ప్రతిపక్షాలు పుంజుకున్నాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలను నివృత్తి చేస్తే తన సర్వే ఫలితాలు తప్పని క్షమాపణలు కోరు తా నన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను వెల్లడించిన ఫలితాలకు భిన్నంగా ఫలితాలు రావడం ఆశ్చర్యం కలిగించిందని, దీనికి గల కారణాలు బేరీజు వేసు కొని పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఫలితాలతో పాటు వెల్లడిస్తానని చెప్పారు. ఇక నుంచి తాను ఎన్ని కలకు ముందే సర్వే ఫలితాలను వెల్లడించబోనని చెప్పారు. కొన్నేళ్లుగా సర్వే ఫలితాలు చెబుతున్నానని, ఎన్నడూ తప్పు చెప్పలేదన్నారు. బెట్టింగులు చేసేవా డినైతే తనకు కావాల్సిన వారికి అనుకూలంగా చెప్పు కొనే వాడినన్నారు. ఇటీవల ఏపీ సీఎం చంద్ర బాబును కలిసి చర్చించిన విషయాలు బయటకు చెప్పుకొనేవైతే లోపల కూర్చొని ఎందుకు మాట్లాడు కుంటామని ప్రశ్నించారు. బయటకు చెప్పుకొనే విషయాలు కాదు కాబట్టే లోపల కూర్చొని మాట్లా డుకున్నామని, లేదంటే మీడియా ముందుకొచ్చే మాట్లాడుకొనేవారమని చెప్పారు. తాను ఏ పార్టీకీ చెందిన వ్యక్తి కాదని, ఎంతో మందిని కలుస్తుం టానని, అలాగే బాబును కలిశానని చెప్పారు. బాబు అండ్ కో మళ్లీ దొంగ ఎత్తులు ఈవీఎంలు, వీవీప్యాట్లపై లగడపాటి అను మానాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉందని తెలంగాణ బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీలు ఈవీఎంలను, వీవీ ప్యాట్లను ట్యాపరింగ్ చేసే అవకాశం ఉంటే ఇటీ వల మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయానికి చేరువగా ఉన్న చంద్రబాబు, ఆయన కోటరీ, ఎల్లో మీడియా దొంగ సర్వేలు, ఇతర ఎత్తుగడలతో ప్రజలను మభ్యపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఓటమి గండం నుంచి గట్టె క్కేందుకు బాబు పడరాని పాట్లు పడుతున్నారు. హడావుడిగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. దొంగ సర్వేలతో ప్రజలను ఏమార్చేం దుకు యత్నిçస్తున్నారు. లగడపాటి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణలతో అర్ధరాత్రి వరకు తన నివాసంలో మంతనాలు సాగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా లగడపాటిని బాబు తెరపైకి తీసుకొచ్చారు. ముందుగా తెలం గాణలో ఇండిపెండెంట్లు ఎక్కువ మంది గెలుస్తా రని చెప్పిన లగడపాటి పోలింగ్కు ముందు రోజు కూటమిదే విజయమన్నారు. కానీ, కూటమికి పరాభవం తప్పలేదు. ఇప్పుడు కూడా అవే ఎత్తుగడలతో బాబు ఏపీ ప్రజలను మభ్యపెట్టేలా వ్యూహాలు పన్నుతున్నారు. -
హఠాత్తుగా మీడియా ముందుకు లగడపాటి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వీవీప్యాట్లను లెక్కిస్తే అనుమానాలు తీరతాయని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోలింగ్ శాతం ప్రకటించడానికి ఎన్నిక సంఘం ఒకటిన్నర రోజు ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించిన తర్వాత వెంటనే జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షం గణనీయంగా పుంజుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు బలపడుతున్నాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే అంచనాలు ఎందుకు తప్పాయనే దానిపై సమీక్ష చేసుకుంటున్నానని వెల్లడించారు. తాను ఎవరి ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదని, రాజకీయ సన్యాసానికి కట్టుబడ్డానని చెప్పుకొచ్చారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను ముందుగా ప్రకటించనని తెలిపారు. తెలంగాణలో పోటీ చేస్తా అవకాశం వస్తే తెలంగాణలో పోటీ చేస్తానని గతంలో తాను చెప్పిన మాటకు కట్టుబడానని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. టీడీపీలో ఎప్పుడు చేరుతున్నారని విలేకరుల ప్రశ్నించగా... చాటుమాటు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని, రాజకీయాల్లో మళ్లీ చేరాలనుకుంటే చెప్పే చేస్తానని సమాధానమిచ్చారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏపీ సీఎం చంద్రబాబును రహస్యంగా కలిసి ఏం మాట్లాడారని అడగ్గా... చంద్రబాబుకు, తనకు మధ్య జరిగిన విషయాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే చంద్రబాబును కలిసిన తర్వాత లగడపాటి హఠాత్తుగా ఢిల్లీలో మీడియాకు ముందుకు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. (లగడపాటితో చంద్రబాబు అర్ధరాత్రి సమావేశం) -
తెలంగాణ ఎన్నికలపై అనుమానాలున్నాయి
-
లగడపాటితో చంద్రబాబు అర్ధరాత్రి సమావేశం
సాక్షి, అమరావతి: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో కలిసి సోమవారం రాత్రి రాజగోపాల్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. రాత్రి 10.30 నుంచి 12 వరకూ చంద్రబాబు వారిద్దరితో సమావేశమై మంతనాలు జరిపారు. ఆ సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాష్రెడ్డి కుటుంబసభ్యులతోపాటు చంద్రబాబును కలిసేందుకు వేచి చూస్తున్నారు. చంద్రబాబు వారిని అలాగే కూర్చోబెట్టి రాజగోపాల్, రాధాకృష్ణతో సుదీర్ఘంగా మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి తాను చేసిన సర్వేలో చంద్రబాబుకు అనుకూలంగా మహాకూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబు సూచనల ప్రకారం మహాకూటమికి అనుకూలంగా అక్కడి ప్రజల అభిప్రాయాన్ని మార్చేందుకు లగడపాటి శతవిధాలుగా ప్రయత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ, ఫలితాలు లగడపాటి సర్వేకు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఇప్పుడు ఏపీలోనూ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో లగడపాటిని చంద్రబాబు రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే అర్ధరాత్రి ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. తనకు అనుకూలంగా సర్వేలు చేయించుకుని.. వాటితో ప్రజల అభిప్రాయాన్ని మార్చడం, లేకపోతే గందరగోళపరచడం కోసం లగడపాటిని ఉపయోగించుకునేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల తరచూ లగడపాటిని చంద్రబాబు కలుస్తున్నారు. -
చంద్రబాబును కలిసిన లగడపాటి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం భేటీ అయ్యారు. తన కుటుంబంలో ఈ నెల 27న జరగనున్న శుభకార్యానికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించేందుకు వచ్చానని లగడపాటి తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పాటు చేయనున్న ఫెడరల్ ఫ్రంట్పై ఇప్పుడేమీ వ్యాఖ్యలు చేయలేనన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదని తెలిపారు. -
తప్పుడు సర్వేలను పాతరేశారు: ఈటల
హుజూరాబాద్: తప్పుడు సర్వేలతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేసిన లగడపాటి రాజగోపాల్ కుట్రలను ప్రజలు పాతరేసి ఓటుతో తగిన బుద్ధి చెప్పారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్యేగా ఆరోసారి గెలిచిన ఆయన.. మొదటిసారిగా హుజూరాబాద్కు వచ్చారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈటల మాట్లాడారు. మహాకూటమి పేరుతో చంద్రబాబునాయుడు తెలంగాణకు వచ్చి రాజకీయం చేద్దామని చూశారని, కానీ ఇక్కడ బాబు కుట్రలు చెల్లలేదన్నారు. చంద్రబాబు తెలంగాణలో కాదు కదా ఆంధ్రాలో కూడా గెలువలేడని చెప్పారు. రేవంత్రెడ్డి వంటి కొందరు పిట్టల దొరలు తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూసినా, ప్రజలు మాత్రం ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. సోషల్ మీడియా, ఆంధ్ర పత్రికల్లోనే కూటమి ఉందని, టీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందన్నారు. ఆనాటి ఉద్యమ నేతగా, సీఎం కేసీఆర్ 100 సీట్లు వస్తాయని చెప్పారని, 90 సీట్లు గెలిచి టీఆర్ఎస్ పార్టీ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని అన్నారు. పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చర్యలు తప్పవని ఈటల స్పష్టం చేశారు. -
జాడలేని చిలక జోస్యం
సాక్షి, అమరావతి: తెలంగాణలో కూటమి కుయుక్తల్లో లగడపాటి సర్వే ఓ భాగమా? తెలుగుదేశం పార్టీ సాగించిన మైండ్గేమ్కు అనుగుణంగానే సర్వే పేరుతో డ్రామా నడిపారా? రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోతుందంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజ్గోపాల్ చెప్పిన చిలకజోస్యం తలకిందులైంది. కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని జాతీయ ఛానళ్లన్నీ ఒకవైపు చెబుతున్నా... లగడపాటి మాత్రం భిన్నమైన సర్వే రిపోర్టును తీసుకొచ్చి గందరగోళానికి తెర లేపారు. అయితే, మంగళవారం వెలువడిన ఫలితాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. లగడపాటి చెప్పిన మాటలకు, వెలువడిన ఫలితాలకు ఏమాత్రం పొంతన లేకపోవడం విశేషం. (వికటించిన రాజకీయ కుట్ర!) ఎవరి కోసమో రూపొందించినట్టు, ఒక పార్టీ ప్రయోజనం కోసమే అన్నట్టుగా ఏమాత్రం శాస్త్రీయత లేని సర్వే ఫలితాలను లగడపాటి వెల్లడించినట్టు స్పష్టమవుతోంది. తెలంగాణలో ఫలితాలు అంచనాలకే అందడం లేదని తొలుత చెప్పిన లగడపాటి, ఆ తర్వాత ప్రజానాడి కూటమి వైపే ఉందన్నారు. ఆయన చెప్పిన సర్వే వివరాలన్నీ రాజకీయంగా ప్రజా కూటమిని గట్టెక్కిండానికి, టీఆర్ఎస్ను దెబ్బతీయడానికే అన్నట్టు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పది మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తున్నారనే భ్రమలు కల్పించడం, బీజేపీ బలం పెరుగుతోందని చెప్పడం... ఇలా ప్రతీ అంశంలోనూ లగడపాటి ఎవరి ప్రయోజనం కోసమే సర్వే చేసినట్టుగా సుస్పష్టమైంది. ఎక్కడైనా పోలికుందా? ఎన్నికల్లో ప్రజాకూటమి 65 నుంచి 75 స్థానాల్లో విజయం సాధించి, అధికారం దిశగా పరుగులు పెడుతుందనేది లగడపాటి సర్వే సారాంశం. టీఆర్ఎస్ 35 నుంచి 45 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పారు. కానీ, ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మీడియా ముందుకు మొదటిసారి వచ్చిన లగడపాటి స్వతంత్ర అభ్యర్థులు 8 నుంచి 10 మంది గెలుస్తారని అన్నారు. వీరిలో ఇద్దరి పేర్లను కూడా వెల్లడించాడు. అయితే, ఈ ఇద్దరూ గెలవకపోవడం గమనార్హం. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పడమే లగడపాటి మాటల ఉద్దేశమని తెలుస్తోంది. బెల్లంపల్లి, బోథ్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, వికారాబాద్, నారాయణపేట, మక్తల్, వైరా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లు గెలుస్తారనే భ్రమ కల్పించి, అంతిమంగా టీఆర్ఎస్ను దెబ్బకొట్టేలా సర్వే పేరిట పక్కా స్కెచ్ వేసినట్టు తేటతెల్లమవుతోంది. మొత్తం మీద 8 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అవకాశాలను దెబ్బతీయడానికి కుట్ర జరిగినట్లు అర్థమవుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పరోక్షంగా కూటమికి మేలు చేయడానికే లగడపాటి సర్వే నాటకాలు ఆడినట్లు స్పష్టమతోంది. బీజేపీ బలపడిందట! ఈ ఎన్నికల్లో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధానమైన పోటీ ఉంది. ఈ పరిస్థితిని మార్చడానికి బీజేపీ బలపడిందని, కొన్నిచోట్ల టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి ఉందని లగడపాటి చెప్పుకొచ్చారు. బీజేపీ పోటీలో ఉన్న ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, అంబర్పేటను ఆయన లక్ష్యంగా ఎంచుకున్నారు. ముస్లింల ఓట్లను వ్యూహాత్మకంగా టీఆర్ఎస్కు దూరం చేసే ఎత్తుగడ సర్వేలో కన్పించింది. ముస్లింల ఓట్లు తెరాస కంటే కాంగ్రెస్కు ఎక్కువగా పడతాయని చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఎప్పుడైనా మాట మీద నిలబడ్డారా? కీలకమైన సమయాల్లో ప్రజలను గందరగోళంలోకి నెట్టడం లగడపాటి రాజగోపాల్కు వెన్నతో పెట్టిన విద్యని రాజకీయ వర్గాల్లో ఓ విమర్శ ఉంది. దీనికి పలు కారణాలు చూపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ లగడపాటి ఇదే తరహాలో వ్యవహరించారు. అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్లోనే ఉన్న ఆయన తెలంగాణ ఏర్పాటు అసాధ్యమని చెప్పారు. అది నిజమని నమ్మించడానికి తెలంగాణ ఏర్పడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రావతరణ తర్వాత లగడపాటి ముఖం చాటేశారు. ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆయన సర్వే ఫలితాలు నిక్కచ్చిగా ఉంటాయని నమ్మించే ప్రయత్నం చేశారు. తీరా ఫలితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కాసేపు ప్రీపోల్... ఇంకాసేపు ఎగ్జిట్ పోల్ లగడపాటి సర్వే ఫలితాలను ప్రజా కూటమి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించింది. అయితే, ఎన్నికల ముందు, తర్వాత ఆయన వెల్లడించిన ఫలితాల సందర్భంగా ఆయనే కొంత గందరగోళానికి గురయ్యారు. అవన్నీ ప్రీపోల్ సర్వే అని కొన్నిసార్లు, ఎగ్జిట్పోల్ అని మరికొన్ని సార్లు చెప్పారు. ప్రీపోల్ నిజమైతే పెరిగిన ఓటింగ్ను అంచనా వేసే అవకాశం లేదు. ఎగ్జిట్పోల్ నిజమైతే పెరిగిన ఓటింగ్ ఎటువైపు అని చెప్పడంలో లగడపాటి జోస్యంలో స్పష్టత కన్పించలేదు. మొత్తం మీద చంద్రబాబు గుప్పిట్లో చిక్కిన చిలుకలా లగడపాటి ఆయనకు అనుకూలంగా సర్వే జోస్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తన విశ్వసనీయతను పోగొట్టుకున్నారు. లగడపాటి అమ్ముడుపోయారనే ముద్ర వేసుకున్నారని ఓ రాజకీయ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. భ్రమ కల్పించే ఎత్తుగడ తెలంగాణ ఓటర్ స్పీడుగా మారుతున్నాడని భ్రమ కల్పించేందుకు లగడపాటి చాకచక్యంగా వ్యవహరించారు. నిన్న ఆలోచన ఈ రోజు లేదు, ఈ రోజుది రేపు ఉండదంటూ చెప్పారు. ఓటరును మార్చే మైండ్గేమ్ అందులో కన్పిస్తోంది. ఎక్కువ ఓటింగ్ జరిగితే అది కూటమికి అనుకూలమని చెప్పడం వెనుక కుట్ర తెలుస్తోంది. మొత్తం మీద ఓటర్లను ప్రభావితం చేసేలా చంద్రబాబుకు అనుకూలంగా లగడపాటి వ్యవహరించినట్టు వెల్లడవుతోంది. లగడపాటి సర్వేతో బెట్టింగ్ రాయుళ్ల కుదేలు ఆంధ్ర ఆక్టోపస్గా చెప్పుకునే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మీద ఉన్న నమ్మకం వందలాది మంది నిండా మునిగారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన చెప్పిన జోస్యం కారణంగా మహాకూటమిపై వందల కోట్ల రూపాయల బెట్టింగ్ కట్టిన వేలాది మంది చేతులు కాల్చుకుని లబోదిబోమంటున్నారు. మహాకూటమికే విజయావకాశాలు ఉన్నాయంటూ ఎన్నికల ముందు ఆయనతో సర్వే వివరాలు పలికిస్తే తటస్థ ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపుతారన్న తెలుగు తమ్ముళ్ల వ్యూహం బెడిసికొట్టడంతో ఆయన సామాజికవర్గమంతా గగ్గోలు పెడుతోంది. నమ్ముకుంటే నట్టేట ముంచాడంటూ వారంతా లోలోన రగిలిపోతున్నారు. ఇలా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో సుమారు రూ.1,200 కోట్లకు పైగా వారు నష్టపోయినట్లు అంచనా. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్ఎస్కు అనుకూల వాతావరణం ఏర్పడుతుండడంతో టీడీపీ నేతలు వెనకుండి లగడపాటితో సర్వే పేరుతో పాచికలు వేశారని వారంతా అనుమానిస్తున్నారు. మహాకూటమి గెలుస్తుందని పందాలు కట్టిన వారంతా చివరి నిమిషంలో టీఆర్ఎస్వైపు మారేందుకు ప్రయత్నాలు చేసినా, అప్పటికే సమయం మించిపోవడంతో వారికి పందాలు దొరకని పరిస్థితి నెలకొంది. సర్వే తుస్మందని ఓ వైపు అందరు అంటుంటే ఆయన మాత్రం మరోవిధంగా లబ్ధిపొందారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. -
‘పోతారు సార్’... లగడపాటి ఎక్కడికి పోయారు?
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్తో ఆట అంటే ఆషామాషి కాదు. అలాంటి కేసీఆరే ఓటమి పాలవ్వబోతున్నారని ఆంధ్ర అక్టోపస్గా చెప్పుకునే లగడపాటి రాజగోపాల్ హింట్ ఇచ్చారు. సర్వేల పేరిట పోలింగ్కు ముందు రోజు ప్రజలను గందరగోళ పరిచేందుకు ప్రయత్నించిన రాజగోపాల్.. తన సర్వేలో భాగంగా గజ్వేల్ను సందర్శించానని.. అక్కడ టీ కోసం ఆగితే కొందరు కానిస్టేబుళ్లు వచ్చి.. తనను పలకరించారని, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని అడిగితే.. ‘పోతారు సార్’ అని ఆ కానిస్టేబుళ్లు బదులిచ్చారని కొంచెం నిగూఢంగా, కొంచెం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘పోతారు సర్’ అన్న ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశమేమిటో అందరికీ తెలిసిందే. గజ్వేల్లో కేసీఆర్ కూడా ఓడిపోబోతున్నారని పరోక్షంగా రాజగోపాల్ చెప్పినట్టు అప్పుడు భావించారు. అంతేకాదు.. పోలింగ్కు రెండురోజుల ముందు ప్రెస్మీట్ పెట్టిన ఆయన.. ప్రజానాడి మహాకూటమికి అందిందని, పోలింగ్శాతం పెరిగితే.. కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేల పేరిట తనదైన చిలుక జోస్యాలు చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత యథాలాపంగా మీడియా ముందుకు వచ్చిన లగడపాటి.. కూటమి 55 నుంచి 75 స్థానాలు, టీఆర్ఎస్ 25 నుంచి 45 స్థానాలు గెలుపొందుతారని జోస్యం చెప్పారు. స్వతంత్ర అభ్యర్థులు ఏడుగురు గెలుస్తారని చెప్పుకొచ్చారు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్ని టీఆర్ఎస్కు అనుకూలంగా.. కొంచెం హోరాహోరీగా ఉంటాయని అంచనాలు వేస్తే.. లగడపాటి మాత్రం కూటమికే మొగ్గు చూపారు. ఆయన వెలువరించిన సర్వే అంచనాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు డైరెక్షన్లోనే తెలంగాణ ఓటర్లను గందరగోళ పరచడానికి లగడపాటి ఈ విధంగా సర్వేల పేరిట గోల్మాల్ చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. తెలంగాణ ఉద్యమకాలంలో దీక్షల పేరిట లగడపాటి డ్రామాలు ఆడిన విషయాన్ని వారు గుర్తుచేశారు. దీక్ష పేరిట లగడపాటి మారువేషంలో హైదరాబాద్కు రావడం.. పరిగెత్తుకుంటూ వచ్చి నిమ్స్ ఆస్పత్రిలోని చేరడం వంటి నాటకాలను వారు ఉదహరించారు. అప్పుడు లగడపాటి ఆడిన ఆసుపత్రి డ్రామాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఏదిఏమైనా.. లగడపాటి సర్వే అట్టర్ ప్లాప్ అని మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఫలితాలు చాటుతున్నాయి. కూటమికి అనుకూలంగా ఆయన చెప్పిన జోస్యంలో ఇసుమంతైనా నిజం కాకపోవడాన్ని ఇప్పుడు నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ రాదని, తెలంగాణ వస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న లగడపాటి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకావడంతో గత ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈసారి ఆయన మనస్సులో ఏముందో కానీ.. తెలంగాణ ఎన్నికల సర్వే పేరిట తెరపైకి వచ్చి హంగామా చేశారు. ఇప్పటివరకు లగడపాటి సర్వే చేస్తే.. అది చాలావరకు నిజమవుతుందనే అంచనా ప్రజలకు ఉండేది. తాజాగా వెలువరించిన సర్వేతో ఆయన తనకున్న విశ్వసనీయతను కోల్పోయారు. తెలంగాణ రావడంతో రాజకీయ సన్యాసం చేసిన లగడపాటి.. తాజాగా వెలువరించిన తప్పుడు సర్వేతో.. సర్వే సన్యాసం కూడా తీసుకుంటారా? అని నెటిజన్లు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నారు. -
‘ఎంపీ టికెట్ కోసమే లగడపాటి సర్వే’
సాక్షి, తిరుపతి : వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ కోసమే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలను ఇస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు జీ.వివేక్ ఆరోపించారు. సర్వేలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారని, ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజానికం మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని వివేక్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత లాభం కోసమే కూటమికి అనుకూలంగా లగడపాటి సర్వేలు చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు. కాగా మహాకూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఇదివరకే ఆయన సర్వే ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. -
లగడపాటి సర్వేపై కడియం రియాక్షన్
సాక్షి, వరంగల్ : తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడందరూ ఎగ్జిట్పోల్స్ ఫలితాలవైపు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండగా.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం తెలంగాణలో కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడించారు. ఎగ్జిట్పోల్స్ ఫలితాలపై టీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి స్పందించారు. తెలంగాణలో కూటమి అధికారంలోకి రానుందనే లగడపాటి అంచనాల్ని కొట్టిపడేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు టీఆర్ఎస్కు పూర్తి మద్దతు ప్రకటించారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కేసీఆర్ పాలనపట్ల పూర్తి విశ్వాసం వ్యక్తమయిందని తెలిపారు. 75 నుంచి 80 సీట్లు సాధించి టీఆర్ఎస్ మరోమారు అధికారాన్ని చేపట్టనుందని కడియం అభిప్రాయపడ్డారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా టీఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల నాడీని ఏ సర్వేలు పసిగట్టలేవని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 11న ప్రజా మద్దతు ఎవరికుందో స్పష్టమవుతుందని అన్నారు. తెలంగాణకు బద్ధవ్యతిరేకి అయిన లగడపాటి తెలంగాణ ప్రజల్ని గందరగోళానికి గురిచేయడానికి ఇలాంటి తప్పుడు సర్వేలు చెప్తున్నారని మండిపడ్డారు. ముందస్తుకు అందుకే వచ్చాం.. ‘లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర అంత ప్రభావవంతంగా ఉండదు. రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో ఒకేసారి ఎన్నికలు అంత సులువు కాదు. కేంద్రంలో తగిన పాత్ర ఉండాలనే ముందుస్తుకు వచ్చాం’ అని కడియం పేర్కొన్నారు. అయితే, ముందస్తుకు పోయేటప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితులు ఒకేలా లేవని వ్యాఖ్యానించారు. జాతీయ నాయకులు తెలంగాణపై దృష్టి పెట్టడం కొంత దెబ్బతీసిందని అన్నారు. ఏదేమైనా రెండొంతుల స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాలు కూడా ముందస్తు ఎన్నికలు జరుపుకొని జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారా అనే ప్రశ్నకు అవేవీ ఇప్పుడు చెప్పలేమన్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్కై పనిచేస్తూ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతారని కడియం వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే టీఆర్ఎస్ కర్తవ్యమని అన్నారు. ‘మా బలం, నినాదం కేసీఆరే. ఎట్టి పరిస్థితుల్లో ఆయనే ముఖ్యమంత్రి. గజ్వెల్లో కేసీఆర్ మంచి మెజారిటీతో గెలబోతున్నారని జోస్యం చెప్పారు. -
‘దానం’ అన్నను గెలిపించండి: లగడపాటి పద్మ
సాక్షి, హైదరాబాద్(ఖైరతాబాద్) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత వాతావరణం, ప్రజానాడి హస్తానికే మొగ్గు ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ చెబుతుంటే మరోవైపు ఆయన సతీమణి పద్మ టీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ సతీమణి అనితతో కలిసి ఆమె మంగళవారం రాత్రి ఖైరతాబాద్ డివిజన్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. దానం నాగేందర్ అన్నను గెలిపించాలని కోరారు. ఏ ప్రభుత్వమూ ఐదేళ్లలో పనులన్నీ పూర్తి చేయలేదన్నారు. పదేళ్లలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి దానం నాగేందర్ను గెలిపించాలని కోరారు. -
నాపై ఎవరి ఒత్తిడీ లేదు: లగడపాటి
సాక్షి, హైదరాబాద్: ఇతరుల ఒత్తిడికి తలొగ్గి ఎన్నికల సర్వే ఫలితాలను మార్చారని మంత్రి కె.తారక రామారావు చేసి న ఆరోపణలను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తోసిపుచ్చారు. తాను ఎవరి ప్రలోభాలకు గురికాలేదని, తన టీం చేసిన సర్వేనే తాను విడుదల చేశానని స్పష్టం చేశారు. కేటీఆర్ ఆరోపణలపై బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి బదులిచ్చారు. తాను ఎప్పుడూ కేటీఆర్ను వ్యక్తిగతంగా కలవలేదని, తన టీం చేస్తున్న సర్వే గురించి తెలుసుకుని కలుద్దామని గత నవంబర్ 11న స్వయంగా కేటీఆర్ తనకు మెసేజ్ పంపారని తెలిపారు. ఆ తర్వాత తన సమీప బంధువు ఇంట్లో ఇద్దరం కలుసుకున్నామని చెప్పారు. రేవంత్రెడ్డి, జగ్గారెడ్డి వంటివారిని అరెస్ట్ చేయించడం వల్ల టీఆర్ఎస్కు నష్టం జరుగుతుందని కూడా కేటీఆర్కు చెప్పానన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్తో జరిగిన వాట్సాప్ సం భాషణలను మీడియాకు విడుదల చేశారు. -
‘ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియాలో చిల్లర ప్రచారం చేస్తున్నాడని, ఎన్నికల కమిషన్ ఆయనపై చర్యలు తీసుకోవాలని.. వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లగడపాటి డ్రామా సర్వేలను ఎవరూ నమ్మరని అన్నారు. తెలుగుదేశం నాటకంలో సూత్రధారి, పాత్రధారి లగడపాటేనన్నారు. ఆయన గెలిస్తే సమైకాంధ్ర ఉద్యమం తీసుకొస్తామని టీడీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల సొమ్ముని దోచి ఇక్కడ గాంధీ భవన్ సాక్షిగా ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. మహాకూటమి నేతలకు సంబంధించిన కోట్ల రూపాయలు పట్టు పడుతున్నాయని తెలిపారు. రెండు రాష్ట్రాలను కూటమి నేతలు ఒకటి ఎలా చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి పేరుతో దొంగలు అందరూ కలిశారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించబోతోందని, తెలంగాణలో బీజేపీ కీలక భూమిక పోషించబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘లగడపాటి రాజగోపాల్ ఓ రాజకీయ బఫూన్’
సాక్షి, వరంగల్ : మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓ రాజకీయ బఫూన్ అని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. మీడియా లగడపాటికి అనవసర ప్రచారం కల్పిస్తోందని మండిపడ్డారు. బుధవారం హన్మకొండ టీఆర్ఎస్ అర్భన్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మహాకూటమి తెలంగాణ వ్యతిరేకుల కూటమని అన్నారు. కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులు ఓడిపోతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. కేసీఆర్ను ఎదుర్కునే నాయకుడు కూటమిలో లేరని చెప్పారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో జతకట్టడం కాంగ్రెస్ చారిత్రక తప్పిదంగా పేర్కొన్నారు. కోదండరాం ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నాడన్నారు. ఎన్నికల అనంతరం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ గాలి వీస్తోందని, అది డిసెంబర్ 7న తుఫానుగా మారుతుందన్నారు. వరంగల్ జిల్లాలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒక లక్ష ఎకరాలకు నీరు అందించటమే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పనకు దోహదపడతామని, చరిత్ర కలిగిన వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయటానికి కృషి చేస్తామని తెలిపారు. -
బాబు ఒత్తిడితోనే ‘సర్వే’ మార్చారు
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితోనే లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాన్ని మార్చారని కేటీఆర్ ఆరోపించారు. లగడపాటి సర్వేను ఆయన తప్పుపట్టారు. టీఆర్ఎస్ పార్టీకి 65–70 సీట్లు వస్తాయంటూ గత నెల 20న లగడపాటి తనకు పంపిన మెసేజ్ను ఆయన మంగళవారం ట్విట్టర్లో బయటపెట్టారు. సర్వే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రను బయటపెట్టేందుకే తాను ఆ మెసేజ్ను షేర్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే నవంబర్ 20 నాటికి ఉన్న పరిస్థితిని బట్టి ఆ ఫలితాలు చెప్పానని, కేసీఆర్ వ్యూహాలపై తనకు పూర్తి అవగాహన ఉన్నదని చెప్పిన లగడపాటి.. తన అంచనాలను మించి టీఆర్ఎస్ సీట్లు సాధించినా ఆశ్చర్యం లేదని అన్నారని కేటీఆర్ వెల్లడించారు. ఈ విషయం జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ నిరూపితమైందని లగడపాటి కేటీఆర్కు పంపిన మెసేజ్లో తెలిపారు. (కూటమికి అనుకూలంగా లగడపాటి జోస్యం) లగడపాటిది సర్వే కాదని, చిలక జోస్యమని ఆయన ఎద్దేవా చేశారు. సర్వేల పేరుతో గందరగోళం సృష్టించే లాస్ట్ మినట్ ప్రయత్నమన్నారు. లగడపాటి, చంద్రబాబు పొలిటికల్ టూరిస్టులని చెప్పారు. డిసెంబర్ 11న తట్టాబుట్టా సర్దేస్తారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. The reason I dismiss Rajgopal’s survey as concocted; 👇his message to me on 20th Nov that TRS is winning 65-70 seats It’s the same survey he shared today under pressure from CBN with cooked up numbers P.s: I had no choice but to share this conversation to break the conspiracy pic.twitter.com/vUJ77KpmFc — KTR (@KTRTRS) December 4, 2018 -
తెలంగాణపై బాబు, లగడపాటి కుట్రలు
సాక్షి, జనగామ/మహబూబాబాద్/కామారెడ్డి/ యాదాద్రి: నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ రాకుండా అడ్డుపడిన చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్ మరోసారి కుట్రలు చేస్తున్నారని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. శనివారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, కామారెడ్డి జిల్లా గాంధారి,యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం, ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారంలో ఆయన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ కుట్రలు ప్రారంభమయ్యాయని, ఇందుకుగాను ఆంధ్రా శక్తులన్నీ ఒక్కటయ్యాయని పేర్కొన్నారు. ఆంధ్రా నుంచి చంద్రబాబు నోట్ల కట్టలు పంపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లగడపాటి రహస్య ఎజెండాతో వస్తున్నారని తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. మోసపోతే గోసపడుతామని, వారి కుట్రలను తిప్పికొ ట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ గెలిస్తే నీటిపారుదల, హోం, పరిశ్రమలు శాఖలు తమకే అని టీడీపీ వారు అంటున్నారని, తెలంగాణ నీళ్లు ఆంధ్రా కు తరలించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. కూటమికి ఓటేస్తే కాళేశ్వరం ఆగినట్లే.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే పోలవరానికి నీళ్లు తగ్గు తాయంటూ ఇప్పటికే చంద్రబాబు అడ్డు తగులుతున్నాడని హరీశ్ ఆరోపించారు. కూటమికి ఓటేస్తే బాబు కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటాడని, దీంతో మనకు నీళ్లు రావన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే కాళేశ్వరం వస్తుందని కూటమికి ఓటేస్తే శనేశ్వరం వస్తుందని అన్నారు. మరో ఏడాదిన్నర రెండేళ్ల లో కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ చీకటి తెలంగాణ అవుతుందన్నారు. చంద్రబాబువి దుర్మార్గపు ఆలోచనలు చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలు చేసే వ్యక్తి అని, అలాంటి కూటమికి ఓటు వేయొద్దని హరీశ్ కోరారు. విద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగితే ప్రజల్ని పిట్టల్లా కాల్చి చంపిన నరహంతకుడని ధ్వజమెత్తారు. కాం గ్రెస్, బాబు తోడుదొంగలు, మాట తప్పిన వాళ్లన్నా రు. బాబు ఇచ్చిన పైసలతో రోజూ పేపర్లు, టీవీలలో ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మం చోడని తెలంగాణకు మేలు చేస్తాడని కోదండ రాం అనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అన్నారు. తెలంగాణ మేధావి లోకం కోదండరాంను చూసి జాలిపడుతుందన్నారు. డిసెంబర్ 11 తర్వాత వచ్చే ఫలితాలతో కేసీఆర్ ఇరగదీసే పర్సన్ అని రుజువు అవుతుందన్నారు. కూటమి నేతల కల్లబొల్లి మాటలు వినకుండా టీఆర్ఎస్కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తమ్కే నమ్మకం లేదు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. దేనికోసం కూటమికి ఓటు వేయాలో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. కూటమిలోని నలుగురికి తోకలే సక్రమంగా లేవని విమర్శించారు. కోదండరాంను కోదండం ఎక్కించారని, ఆయన ఏమి మాట్లాడుతున్నాడో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. కుడితిలో పడిన ఎలుక లెక్క కోదండరాం పరిస్థితి అయిందని విమర్శించారు. పౌరసంఘం హక్కుల నేత అని చెప్పుకునే కోదండరాం, నరహంతకుడు, ఎన్కౌంటర్లు చేయించిన బాబు కడుపులో తలపెట్టి గౌరవం తగ్గించుకున్నారని మండిపడ్డారు. కోదండరాంను చూసి మేధావిలోకం సిగ్గు పడుతుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చెవ్వులో పూలు పెట్టుకున్నారు కావచ్చు.. ప్రజల కళ్లకు గంతలు కట్టలేరని పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్కు మళ్లీ పట్టం కట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. -
ఎవరి కోసం ఈ ‘చిలుక’ జోస్యం?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పది మంది స్వతంత్ర అభ్యర్థులు గెలవబోతున్నారంటూ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన ప్రకటనపై రాజకీయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఏదో రాజకీయ ప్రయోజనం ఆశించే.. రెండు నియోజకవర్గాల్లో ఫలానా ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారంటూ ఆయన ప్రకటిం చారని ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సర్వే చేస్తే అంచనాలు తెలుస్తాయని, కానీ ఆ అంచనాలే నిజం కావాలని లేదని వ్యాఖ్యానిస్తున్నాయి. పైగా రోజుకు రెండు నియోజకవర్గాల ఫలితాలను వెల్లడిస్తానంటూ లగడపాటి చెప్పడం బాధ్యత లేకుండా వ్యవహరించడమేనని మండిపడుతున్నాయి. సర్వే అంచనాలు ప్రకటించడం తప్పు కాదని, వాటిని ప్రకటించడానికి అవసరమైన అన్ని పద్ధతులు, ఆధారాలను ప్రజల ముందుంచాల్సిన అవసరాన్ని లగడపాటి విస్మరించారని సర్వే పండితులు అంటున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కీలకదశకు చేరుకున్న తరుణంలో అకస్మాత్తుగా లగడపాటి తిరుపతిలో ప్రత్యక్షం కావడం.. శాసనసభ ఎన్నికల్లో ఎక్కువమంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని చెప్పడం వెనుక ఏం జరిగిందనే అంశంపై ‘సాక్షి’ కొంత సమాచారం సేకరించినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతి వెళ్లడానికి ముందే తెలంగాణలో ప్రచారానికి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుతో లగడపాటి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇద్దరు కాంగ్రెస్ నేతలతో పాటు ఎల్లో మీడియా తోక పత్రిక అధినేత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమికి, టీఆర్ఎస్కు మధ్య పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి, ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్లాన్ వేసినట్టు స్పష్టమవుతోంది. అధికార టీఆర్ఎస్ దీనిపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, బీజేపీ నేత కిషన్రెడ్డి ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. సర్వే అంచనా వేస్తుందే కానీ ఫలితాలు ప్రకటించదు... ఎన్నికల సమయంలో ప్రచార సాధనాలు సర్వే చేయడం సాధారణమైన విషయం. అది తప్పు కూడా కాదు. కానీ, సర్వే అంచనాలను ప్రజల ముందుంచాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలి. ఏయే తేదీల్లో సర్వే చేశారు, ఎంత మంది సర్వేలో పాల్గొన్నారు. శాంపిల్ సైజు ఎంత, ఎన్ని నియోజకవర్గాల్లో సర్వే చేశారు, అన్నింటికీ మించి ఏ సంస్థ సర్వే చేసిందన్న వివరాలు తప్పనిసరిగా ప్రజలకు వివరించాలి. అలా కాకుండా ఏ రాజకీయ పార్టీ కోసమో కొన్ని వివరాలు మాత్రమే వెల్లడించడం కచ్చితంగా తప్పే అవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సర్వేలు అంచనా మాత్రమే వేస్తాయని, వాటిని తుది ఫలితాలుగా ప్రకటించడమంటేనే ఏదో ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడమేనని ఓ రాజకీయ విశ్లేషకుడు స్పష్టంచేశారు. ‘సర్వే చేస్తే అంచనాలు తెలుస్తాయి. పోలింగ్ ముగిసే వరకు ఆ ఓటర్ల అభిప్రాయాలు అలాగే ఉంటాయనుకోవడానికి లేదు. ఓటేసేవారు ఇండిపెండెంట్కు వేస్తామంటే ఇక వారిలో మార్పు ఉండదని లగడపాటి చెప్పడం కూడా పొరపాటు. పైగా అంచనాలు ఇలా ఉన్నాయని చెప్పడం వేరు.. ఫలానా అభ్యర్థులు గెలుస్తారని ప్రకటించడం వేరు. కచ్చితంగా దీని వెనుక రాజకీయ ప్రయోజనం దాగుంది’ అని బీజేపీ నేత కిషన్రెడ్డి ఆరోపించారు. లగడపాటి సర్వే చేసి ఉంటే వాటి పూర్తి అంచనాలను వెల్లడించకుండా రోజుకు రెండు నియోజకవర్గాలు ప్రకటిస్తాననడం అనుమానించదగ్గ విషయమేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సీహెచ్వీఎం కృష్ణారావు వ్యాఖ్యానించారు. ‘సర్వే చేసినప్పుడు ఏ పార్టీ గెలుస్తుందన్న అంచనాలు వెలువరించవచ్చు. దానికి సంబంధించిన అన్ని పూర్వాపరాలు కూడా ప్రజలకు తెలియజేయాలి. అప్పుడే దానికి విశ్వసనీయత ఉంటుంది. లగడపాటికి ఈ విషయాలు తెలియదని నేను అనుకోవడం లేదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో ఆలా చెప్పారో తెలియదు’ అని కృష్ణారావు పేర్కొన్నారు. కాలజ్ఞానం చెప్పే బ్రహ్మంగారిలా ఇవేమీ ప్రకటనలు? సర్వే చేసే ఏ సంస్థ లేదా వ్యక్తి అయినా సరే దాని పూర్తి వివరాలు తెలియజేయాలి. కానీ, లగడపాటి మాత్రంబ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టుగా రోజుకు రెండు స్థానాల్లో ఎవరు గెలుస్తారో చెబుతానంటూ సంచలన ప్రకటనే చేశారు. సర్వే వివరాలు వెల్లడించకుండా ఎవరు గెలుస్తారో చెప్పడం చిలుక జోస్యమే అవుతుందని సర్వే నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. లగడపాటి సర్వే చేసి ఉంటే మొత్తం అంచనాలు ప్రకటించాలని.. ఆ సర్వే ఎప్పుడు చేశారో, శాంపిల్ సైజు ఎంత వంటి వివరాలు ఉన్నప్పుడే దానికి పారదర్శకత ఉంటుందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ రీసెర్స్ అసోసియేట్ ఎస్.బాల నరసింహారెడ్డి అన్నారు. ‘నాకు తెలిసి ఈ దశలో ఓపీనియన్ పోల్ ఫలితాలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా.. అన్ని వివరాలు ప్రజల ముందుంచాలి. అలా చేయకుంటే సర్వే చేశారో లేదో ఎలా తెలుస్తుంది’ అని ఆయన ప్రశ్నించారు. అంచనాలు, ఫలితాలకు తేడా లేకుండా మాట్లాడటం కూడా తప్పేనని, అది తప్పుడు సంకేతాలకు కారణమవుతుందని మరో సర్వే సంస్థ నిపుణుడు పేర్కొన్నారు. ‘గతంతో లగడపాటి సర్వే చేయించిన టీమ్లో నేను పని చేశాను. కానీ, మాదంతా ఎగ్జిట్ పోల్ లేదా ఎన్నికల తర్వాత తీసుకునే పోస్ట్ పోల్ సర్వేపై ఆధారపడి అంచనాలు ఉండేవి. ఇప్పుడు సర్వే చేశారో లేదో నాకైతే తెలియదు’ అని ఆ నిపుణుడు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే ఫలితాల ప్రకటన? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కంటే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 శాతం ఎక్కువగా ప్రజల మద్దతు పొందుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన వైఫల్యాలు బీజేపీపై నెట్టి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని తెలిసి కాంగ్రెస్తో పొత్తు కోసం వెంపర్లాడారు. ఇప్పటికే పలుమార్లు అమరావతిలో చంద్రబాబుతో సమావేశమైన లగడపాటి కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే కొంచెమైనా కలిసి వస్తుందని చెప్పడంతో పాటు రెండు పార్టీల మధ్య రాయబారం నెరిపారు. ఈ సంగతి ఏపీ కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ తరపున తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంతో ఉన్నానని లగడపాటి స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ కూటమి విజయవంతమైతే అదే పార్టీలో చేరి టీడీపీ మద్దతుతో మల్కాజ్గిరి లేదా ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లగడపాటి వెల్లడిస్తున్న ఎన్నికల ఫలితాల ప్రకటన వెనుక కచ్చితంగా రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయన్నది రాజకీయవర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. 1994, 2004 ఎన్నికల్లో స్వతంత్రుల గెలుపుపై కథనం... శాసనసభ ఎన్నికల్లో అత్యధికులు ఇండిపెండెంట్లు గెలిస్తే అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతుందని, దానికి గతంలో రెండు ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలే నిదర్శనమంటూ ఓ ఎల్లో పత్రిక లడగపాటి ప్రకటనకు తోడుగా పెద్ద కథనాన్నే ప్రచురించింది. అంటే లగడపాటి ఈ ప్రకటన చేయడానికి ముందే దీనిపై కసరత్తు జరిగినట్లు అర్థమవుతోంది. దానికి అనుగుణంగానే ఈ ఎన్నికల్లో 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు గెలువబోతున్నారంటూ లగడపాటి తిరుపతిలో ప్రకటన చేశారు. పైగా గెలుస్తారని ప్రకటించిన ఇద్దరు ఇండిపెండెంట్లు కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు కావడం గమనార్హం. గతంలో మాదిరి ఈ సారి కూడా ప్రభుత్వం మారబోతోందంటూ చెప్పడం ద్వారా తటస్థ ఓటర్లను ప్రభావితం చేయడమే చిలుక జోస్యం పరమార్థమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. ‘ఎన్నికల్లో అపవిత్ర పొత్తులకు, అనైతిక ఎత్తులకు చంద్రబాబు పెట్టింది పేరు. ఇక్కడ ఆధిపత్యం చెలాయించాలని తహతహలాడుతున్న చంద్రబాబు, ఆయన వందిమాగదులు ఎన్ని మాయపాచికలు వేసినా ఫలితం ఉండదు’ అని రాజేశ్వరరెడ్డి స్పష్టంచేశారు. -
తెలంగాణ ఎన్నికలపై లగడపాటి జోస్యం
తిరుమల: తెలంగాణలో మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనున్న వేళ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు సత్తా చాటనున్నారని ఆయన జోస్యం చెప్పారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల సర్వే ఫలితాలను డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం వెల్లడిస్తానని తెలిపిన ఆయన కొన్ని విషయాలను మాత్రం మీడియాతో పంచుకున్నారు. తెలంగాణలో జరుగుతున్న పోరును ఇరు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని అన్నారు. ‘తెలంగాణ ప్రజలు రాజకీయ పార్టీల ప్రలోభాలకు లొంగడం లేదు. ఇది చాలా అభినందించాల్సిన విషయం. పలు చోట్ల ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారు. తెలంగాణ ఓటర్లు ఇండిపెండెట్ల వైపు చూస్తున్నట్టు మా సర్వేలో తేలింది. మహబూబ్నగర్ జిల్లానారాయణపేట్లో స్వతంత్ర అభ్యర్థి శివకుమార్, ఆదిలాబాద్ జిల్లా బోథ్లో స్వతంత్ర అభ్యర్థి అనిల్ జాదవ్ గెలవబోతున్నారు. సర్వే పూర్తి వివరాలు తెలియజేస్తే.. ప్రధాన రాజకీయ పార్టీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గెలిచే స్వతంత్ర అభ్యర్థులను ప్రకటించడం ఏ పార్టీపై ప్రభావం చూపదు. ఈ ఎన్నికల్లో గెలువబోయే ఇండిపెండెంట్ అభ్యర్థులందరి పేర్లను.. రోజుకు రెండు చొప్పున 7వ తేదీలోపు ప్రకటిస్తాను. మొత్తంగా 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలవబోతున్నార’ని లగడపాటి తెలిపారు. -
లగడపాటి హైడ్రామా
-
లగడపాటి హైడ్రామా
హైదరాబాద్: ఫోర్జరీ పత్రాలతో ఖరీదైన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకుని హైడ్రామా సృష్టించారు. వారంట్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారంటూ వాగ్వాదానికి దిగడంతో పాటు రాత్రంతా నిందితుడి ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటన జూబ్లీహిల్స్లో కలకలం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని కమాన్ లోపల షేక్పేట మండలం పరిధిలోని సర్వే నం. 120/30లో ఉన్న స్థలానికి సంబంధించి చాలా ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ స్థలం ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీకి కేటాయించగా, ప్లాట్లుగా చేసి పలువురికి విక్రయించారు. కాగా జూబ్లీíహిల్స్ రోడ్ నం.65లో ఉండే గోడి పిచ్చిరెడ్డి అలియాస్ జీపీ రెడ్డి ఈ స్థలానికి ఫోర్జరీ పత్రాలను సృష్టించి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ ఎం.కృష్ణారెడ్డి 2016లో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీకి చెందిన కల్పన నుంచి ఈయన ఈ స్థలానికి జీపీఏ పొందారు. ఈ కేసులో నిందితులైన ఆరుగురిని గత యేడాది డిసెంబర్లో అరెస్ట్ చేయగా, కీలక సూత్రధారి పిచ్చిరెడ్డి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టును ఆశ్రయించి అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పొందారు. ఏసీబీ దర్యాప్తు చేపట్టాలన్న హైకోర్టు... ఫిర్యాదుదారులు హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ రద్దు చేయడంతోపాటు ఏసీబీ దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిచ్చిరెడ్డి అజ్ఙాతంలోకి వెళ్లారు. గురువారం రాత్రి జూబ్లీహిల్స్లోని ఇంటికి నిందితుడు వచ్చినట్లు తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకుని స్టేషన్కు రావాలని కోరారు. బట్టలు మార్చుకుని వస్తానంటూ లోనికి వెళ్లిన పిచ్చిరెడ్డి తన స్నేహితుడైన లగడపాటికి ఫోన్ చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో లగడపాటి అక్కడకు చేరుకున్నారు. స్థల (సివిల్) వివాదంలో పోలీసులు ఎందుకు కలుగజేసుకుంటున్నారంటూ హుంకరించారు. 5 నెలల క్రితం నుంచి పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేయడానికి వారెంట్ అవసరం లేదని ఎస్ఐలు శ్రీనివాస్, పీడీ నాయుడు లగడపాటికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. మీడియాను పిలిపిస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఉదయాన్నే తాను పిచ్చిరెడ్డిని తీసుకువచ్చి అప్పగిస్తానంటూ చెప్పారు. ఇదే విషయాన్ని కాగితంపై రాసిస్తే తాము వెళ్లిపోతామని పోలీసులు అన్నారు. అయితే పేపర్పై రాసివ్వను.. అరెస్ట్ చేయనివ్వను.. అని రాజగోపాల్ భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధుల ముందు లగడపాటి మరోసారి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం వేశారు. తనను దాటి వచ్చి అరెస్ట్ చేయాలంటూ సవాల్ విసిరి బెడ్రూమ్లోకి వెళ్లి పిచ్చిరెడ్డి నిద్రిస్తుండగా పక్కనే కూర్చున్నారు. తాము వెళ్లిపోతే పిచ్చిరెడ్డి పారిపోతారని పోలీసులు కూడా అతని ఇంటి వద్దే కూర్చున్నారు. తెల్లవారుజాము 6గంటల దాకా ఇదే హైడ్రామా సాగింది. ఐజీ నాగిరెడ్డి ఒత్తిడితోనే... ఉదయం 7గంటల తర్వాత లగడపాటి మళ్లీ పోలీసులపై ఆరోపణలు కొనసాగించారు. ఈ కేసు సివిల్ వ్యవహారం అని ఐజీ నాగిరెడ్డి ఒత్తిడితోనే అర్ధరాత్రి పోలీసులు ఇంటిపైకి వచ్చారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు వచ్చిన కారణంగా ఎవరూ బదిలీ చేయరన్న ధీమాతో ఏమైనా చేయవచ్చని అనుకుంటున్నారా అని నిలదీశారు. పోలీసులకు ఎవరిపైనైనా కేసులు పెట్టే అధికారం ఉందని కానీ విస్తృత అధికారాలు ఉపయోగించి ఎవరినైనా అరెస్ట్ చేయాలని అనుకుంటే కుదరదని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.12లో ఐపీఎస్ అధికారికి చెందిన భూమికి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని పోలీసు కేసు ఉందని, ఈ విషయమై జీపీ రెడ్డి 20 సార్లు స్టేషన్లో హాజరయ్యారన్నారు. ఈ వ్యవహారాన్ని నాగిరెడ్డితో సెటిల్ చేసుకోవాలని పోలీసులు తన స్నేహితుడిని వేధిస్తున్నారన్నారు. ఈ సోదాల వెనుక నాగిరెడ్డితో పాటు ఓ డీసీపీ ఉన్నారని దీనిపై గవర్నర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందంటూ ఉన్నతాధికారులు చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. జీపీ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసు.. సుమారు రూ.300 కోట్ల విలువైన స్థలానికి సంబంధించి ఫోర్జరీ పత్రాలను తయారు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్టర్ జీపీ రెడ్డిపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బెంగళూరు కేంద్రంగా పలు వివాదాల్లో పిచ్చిరెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఆయనపై విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. లగడపాటి వ్యాఖ్యల్లో వాస్తవం లేదు తాము కూడా బాధితులమేనన్న ఐజీ నాగిరెడ్డి సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లోని ఉమెన్ కో–ఆపరేటివ్ సొసైటీ వివాదం నేపథ్యంలో తనను ఉద్దేశించిన లగడపాటి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐజీ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆ సొసైటీలో సభ్యురాలిగా ఉన్న తన సమీప బంధువు పల్లంరెడ్డి హంసమ్మ స్థలం ఖరీదు చేసి మోసపోయారని, ఈ నేపథ్యంతో తమ కుటుంబమూ బాధితులుగా మారిందని ఆయన వివరించారు. ఈ కేసు దర్యాప్తు తదనంతర చర్యల్లో రెండేళ్లు జాప్యం జరిగి, నిందితుడు మరికొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినప్పటికీ ఏ దశలోనూ తాను జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. జీపీ రెడ్డిని కానీ, ఆయన అల్లుడిని కానీ కలవడం, మాట్లాడటం జరగలేదని పేర్కొన్నారు. వారిని బెదిరించానంటూ లగడపాటి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. చట్ట ప్రకారం స్థానిక పోలీసులు తీసుకున్న చర్యల్ని తనకు ఆపాదించడం సబబుకాదన్నారు. పోలీసులు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో సొసైటీ సభ్యులు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారని నాగిరెడ్డి అన్నారు. -
పోలీసుల తీరుపై గవర్నర్,ఈసీకి ఫిర్యాదు చేస్తాం
-
ల్యాంకో ఆస్తుల అమ్మకం!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు చెందిన మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ల్యాంకో ఇన్ఫ్రా... మూసివేతకు రంగం సిద్ధమైంది. నిండా అప్పుల్లో కూరుకుపోయి... పలు బ్యాంకులకు కనీసం వడ్డీ కూడా చెల్లించే పరిస్థితి లేకపోవటంతో ల్యాంకో ఇన్ఫ్రా ఆస్తులన్నిటినీ ఆమ్మి అప్పులు తీర్చే ప్రక్రియకు (లిక్విడేషన్) హైదరాబాద్లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతినిచ్చింది. ఈ మేరకు ట్రిబ్యునల్ సభ్యుడు రాతకొండ మురళి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక ఈ వ్యవహారానికి పరిష్కార నిపుణుడిగా (ఆర్పీ) ఉన్న సావన్ గొడియావాలాను ల్యాంకో ఇన్ఫ్రా లిక్విడేటర్గా కూడా నియమిస్తున్నట్లు మురళీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రుణ పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ ఆమోదం తెలపకపోవటంతో ల్యాంకో లిక్విడేషన్కు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ‘‘ఈ ఉత్తర్వులతో ప్రస్తుతం కొన్నసాగుతున్న ల్యాంకో ఇన్ఫ్రా బోర్డు, ఇతర మేనేజ్మెంట్, భాగస్వాముల అధికారాలన్నీ రద్దవుతాయి. అవన్నీ లిక్విడేటర్కు బదిలీ అవుతాయి. లిక్విడేటర్ ఈ ఆస్తుల విక్రయానికి సంబంధించి బహిరంగ ప్రకటన చేస్తారు. లిక్విడేషన్ మొదలైన నాటి నుంచి 75 రోజుల్లోగా ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి సమర్పించాల్సి ఉంటుంది’’ అని మురళి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐడీబీఐ పిటిషన్తో దివాలా ప్రక్రియ మొదలు తమ నుంచి రుణంగా తీసుకున్న రూ.3608 కోట్లను ల్యాంకో ఇన్ఫ్రా తిరిగి చెల్లించడం లేదని, అందుకని ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఐబీడీఐ హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసింది. తమకు మొత్తం రూ.49,959 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు చెప్పగా... అప్పులు రూ.47,721 కోట్లని ల్యాంకో ఇన్ఫ్రా చెబుతోంది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ట్రిబ్యునల్... దివాలా పరిష్కార నిపుణుడిగా సావల్ గొడియావాలాను నియమించింది. అనంతరం దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా బహిరంగ ప్రకటన జారీ చేయగా, ఏడు కంపెనీలు తమ ఆసక్తిని తెలియచేస్తూ రుణ పరిష్కార ప్రణాళికలు సమర్పించాయి. ఇందులో త్రివేణి ఎర్త్మూవర్స్, ఇంజన్ క్యాపిల్ గ్రూపులు సమర్పించిన ప్రణాళికలు మినహా మిగిలిన కంపెనీల ప్రణాళికలు చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. త్రివేణి ఎర్త్మూవర్స్ రుణ ప్రణాళికలో ఎలాంటి లోపాలూ లేకపోవటంతో దాన్ని రుణదాతల కమిటీ ముందు ఉంచారు. ఓటింగ్లో త్రివేణి ప్రణాళికకు 15.53 శాతం రుణదాతలే ఆమోద ముద్ర వేశారు. దీంతో ల్యాంకో లిక్విడేషన్కు అనుమతించాలంటూ సావల్ గొడియావాలా ఎన్సీఎల్టీ ముందు ఓ దరఖాస్తు దాఖలు చేశారు. దీనిపై ట్రిబ్యునల్ సభ్యులు రాతకొండ మురళీ విచారణ జరిపి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘చట్ట నిబంధనల ప్రకారం రుణ పరిష్కార ప్రణాళికకు 66 శాతం మంది రుణదాతల ఆమోదం కావాలి. కానీ త్రివేణి ప్రతిపాదనకు 15.53 శాతం మాత్రమే ఆమోదం లభించింది. అందుకని ల్యాంకో లిక్విడేషన్కు అనుమతినిస్తున్నాం’’ అని ఉత్తర్వుల్లో వివరించారు. మరోవంక ల్యాంకో కోసం పవర్ మెక్ కంపెనీ దాఖలు చేసిన దరఖాస్తును ట్రిబ్యునల్ తిరస్కరించింది. పలు అభ్యర్థనలతో ల్యాంకో ఇన్ఫ్రా దాఖలు చేసిన అనుబంధ దరఖాస్తులపై విచారణ సెప్టెంబర్ 12కి వాయిదా పడింది. -
అప్పుడే సర్వే వివరాలు విడుదల: లగడపాటి
సాక్షి, పెనుకొండ రూరల్: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని.. అది రాష్ట్రప్రజల బలమైన ఆకాంక్ష అని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కోనాపురంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో ప్రత్యేకహోదా రాదని.. పోరాటాల ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రజలు ఇదే విషయాన్ని బలంగా విశ్వసిస్తున్నారన్నారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రాన్ని విభజించినందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని, ప్రత్యేకహోదా ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి అదే గతి పడుతుందన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని.. ఎన్నికల సర్వే వివరాలు ఎన్నికలకు ముందుగా విడుదల చేస్తానని చెప్పారు. -
‘లగడపాటి’ కంపెనీకి ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుటుంబానికి చెందిన ల్యాంకో తీస్థా హైడ్రో పవర్ లిమిటెడ్కు ఎదురుదెబ్బ తగిలింది. ఐసీఐసీఐ బ్యాంకు నేతృత్వంలోని పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.313.1 కోట్ల అప్పును చెల్లించే పరిస్థితిలో సంస్థ లేదని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ–హైదరాబాద్) తేల్చింది. దాంతో దివాలా ప్రక్రియను (ఐసీపీఆర్) ప్రారంభిస్తున్నట్లు పేర్కొం ది. హుజేఫా సితాబ్ఖాన్ను దివాలా పరిష్కార నిపుణుడు (ఐఆర్పీ)గా నియమించింది. ‘‘ల్యాంకో తీస్థా తన ఆస్తుల విక్రయం, బదలాయింపు, తాకట్టు వం టివి చేయరాదు. దివాలా ప్రక్రియ మొదలైనట్టు ఐఆర్పీ ప్రకటన ఇవ్వాలి. ఇన్సాల్వెన్సీ, బ్యాం క్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) వెబ్సైట్లో ఉంచడంతో పాటు మీడియా ద్వారా ప్రకటనలివ్వాలి. రుణదాతలతో కమిటీ వేసి సంస్థ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవాలి’’ అని ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. ఎన్సీఎల్టీ జ్యుడీషియల్ సభ్యుడు విత్తనాల రాజేశ్వరరావు ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులిచ్చారు. సిక్కింలో తీస్థా నదిపై 500 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఐసీఐసీఐ బ్యాంకు నేతృత్వంలో పలు బ్యాంకుల నుంచి 2007లో ల్యాంకో రూ.400 కోట్ల రుణం తీసుకుంది. రుణం చెల్లించకపోవడంతో ల్యాంకో రుణ ఖాతాను నిరర్థక ఆస్తిగా ప్రకటిస్తూ ఐసీఐసీఐ నేతృత్వంలోని బ్యాంకుల జాయింట్ లెండర్స్ ఫోరం (జేఎల్ఎఫ్) నోటీసు జారీ చేసింది. 2017 నవంబర్ 30 నాటికి రుణ బకాయి రూ.313.1 కోట్లకు చేరింది. హైడ్రో ఎలక్ట్రికల్, గ్యాస్ ఆధారిత విద్యుత్కేంద్రాల పరిస్థితి తిరోగమనంలోకి వెళ్లడంతో తమకు తీరని నష్టం కలిగిందన్న ల్యాంకో తీస్థా న్యాయవాది రవికుమార్ వాదనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. -
పద్మావతీదేవికి లగడపాటి లక్ష్మీహారం
తిరుపతి: తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీపద్మావతీ అమ్మవారికి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లక్ష్మీహారాన్ని కానుకగా అందజేశారు. నిన్న (ఆదివారం) ఉదయం 9 గంటలకు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న లగడ పాటి మొక్కులు చెల్లించుకునే క్రమంలో ప్రత్యేకంగా తయారు చేయించిన రూ.7.74 లక్షల విలువ గల లక్ష్మీహారాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు. మంచి ముత్యాలు, కెంపులు, పచ్చలు, పగడాలను బంగారంలో పొదిగి 235 గ్రాముల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించిన హారాన్ని రాజగోపాల్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో మునిరత్నంరెడ్డికి అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు బాబూస్వామి వారికి పూలు, కుంకుమ అందజేశారు. -
రసకందాయంలో బెజవాడ రాజకీయం
-
రసకందాయంలో బెజవాడ రాజకీయం
విజయవాడ: బెజవాడ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ట్రావెల్స్ వ్యవహారంలో ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే బోండా ఉమా... ముఖ్యమంత్రి వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. కాపుల గొంతు కోస్తున్నారంటూ బోండా ఉమా తన ఆగ్రహాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఆర్టీఏ కార్యాలయం వివాదంతో ఎంపీ కేశినేని నానీకి... ముఖ్యమంత్రికి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రావెల్స్ మూసివేత నిర్ణయం వద్దని ముఖ్యమంత్రి వారించినా నాని మాత్రం ఆయన మాటను ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాలకు కేశినేని నాని దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే...ఇటీవల చంద్రబాబు కోడలు నారా బ్రహ్మాణికి విజయవాడ ఎంపీ సీటు ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం రాత్రి వెలగపూడిలో సీఎంను కలవడం ....బెజవాడ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా కేశినేని నాని పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడంతో పాటు, ఎంపీ సీటు కోసం భారీగానే మూల్యం చెల్లించారు. అవసరం ఉన్నంతవరకూ వాడుకుని, ఆ తర్వాత కూరలో కర్వేపాకులా పక్కన పడేయడం చంద్రబాబు నాయుడు అలవాటు అయిన విషయం తెలిసిందే. దీంతో తనకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారంటూ నాని అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. కాగా లగడపాటి రాజగోపాల్ కూడా భారీ ఆఫర్... ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
కేశినేని నానికి చంద్రబాబు చెక్ చెడుతున్నారా?
-
చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్ భేటీ
అమరావతి: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. వెలగపూడిలోని సచివాలయంలో వీరిద్దరు సుమారు 40 నిమిషాలు ఏకాంతంగా చర్చలు జరిపారు. లగడపాటి ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. వెలగపూడిలో సచివాలయం నిర్మాణం చాలా బాగుందంటూ పొగిడారు. కాగా చంద్రబాబును లగడపాటిని కలవడం విజయవాడ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు గతంలో ప్రతినబూనిన లగడపాటి... ఏకంగా చంద్రబాబుతో సచివాలయంలోనే సమావేశం కావడం టీడీపీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ...గత కొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో కేశినేని ట్రావెల్స్ నడపనుంటూ ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్న తానే వ్యవస్థనే మార్చలేకపోతున్నానని, ఆ మార్పులు చూసి తట్టుకేలేక తన ట్రావెల్స్ మూసివేస్తున్నానంటూ కేశినేని నాని బాహాటంగానే నిరసన ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేశినేని నానికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2019 ఎన్నికలకు విజయవాడ ఎంపీ సీటు లగడపాటికి కేటాయించబోతున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు ఈ భేటీపై ఇప్పటికే టీడీపీ వర్గాలు ఆరా తీయడం ప్రారంభించారు. అయితే చంద్రబాబుతో తన భేటీ మర్యాదపూర్వకమే అని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని లగడపాటి రాజగోపాల్ తెలిపారు. -
కేసీఆర్పై లగడపాటి ఇంట్రస్టింగ్ కామెంట్స్!
రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి హర్షనీయమని, ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. యాదాద్రి అభివృద్ధి పనులు దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నాని, ఇంతకుముందు యాదాద్రి రూపురేఖలు మారబోతున్నాయని మీడియాలో మాత్రమే చూశానని, ఇప్పుడు ప్రత్యక్షంగా తిలకించానని రాజగోపాల్ అన్నారు. ఇంతకుముందు యాదాద్రిని సందర్శించుకున్న తర్వాతే తాను ఎంపీగా గెలిచానని కూడా లగడపాటి చెప్పారు. అయితే.. ఇప్పుడు రాజకీయాల్లోకి మళ్లీ రావడంపై మాత్రం ఆయన స్పందించలేదు. మొత్తమ్మీద చాలాకాలం తర్వాత ఆయన వార్తల్లోకి రావడం విశేషం. యాదాద్రి పర్యటనలో మాజీ ఎంపీ లగడపాటితో పాటు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నట్లు తెలిసింది. -
ఈ నాయకులంతా ఏమయ్యారు
హైదరాబాద్: రెండేళ్ల కిందట ఈ నాయకులు చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. విభజనకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో నానా హడావిడి చేసిన కొందరు నాయకులు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయాల నుంచి దాదాపుగా కనుమరుగయ్యారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయినప్పటికీ అప్పట్లో హడావిడి చేసిన నేతలెవరూ ఇప్పుడు బయట కనిపించడం లేదు. ఒకవైపు విభజన ఉద్యమం మరోవైపు సమైక్య ఉద్యమం నడుస్తున్న కాలంలో రాష్ట్రం ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోదని చెబుతూ తెగ హడావిడి చేసిన నేతలు చేసేదేమీ లేక గడిచిన రెండేళ్లుగా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి.. ఇలా ఒక్కొక్కరుగా ఎంతో మంది నేతలు రాష్ట్ర విభజనకు ముందు ఎంతో హడావిడి చేశారు. విభజన జరగదని ఆనాడు గంటాపథంగా చెప్పారు. సాధారణ ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన చట్టం చేయడం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పాటు కావడం జరిగిపోయాయి. ఈ నాయకులు కూడా సైలెంట్ అయిపోయారు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోదని చెబుతూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఆ పార్టీని ఎన్నికల రంగంలో నిలిపారు. జర్మనీ నుంచి ఆయన మిత్రుడొకరు తెచ్చిన రాయిని చూపించి విడిపోయినా మళ్లీ రెండు రాష్ట్రాలు కలుస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత అంతే... ఆయనెక్కడా కనిపించలేదు. తన సన్నిహితులకు చెందిన ఒకరిద్దరు నిర్వహించిన శుభకార్యాలకు హాజరు కావడం మినహాయిస్తే రాజకీయంగా ఆయన పూర్తిగా తెరమరుగైపోయారు. ఆయన బీజేపీలో చేరనున్నారని ఆ మధ్యన వార్తలొచ్చాయి. కానీ అదీ జరగలేదు. ఆయన నియోజకవర్గానికి కూడా వెళ్లిన దాఖలాలు లేవు. తానూ హైదరబాదీనే అని చెప్పుకున్న కిరణ్ ఈ రెండేళ్లు దాదాపుగా హైదరబాద్ ఇంటికే పరిమితమయ్యారు. పాత మిత్రులతో పిచ్చాపాటి మాట్లాడుకోవడం తప్ప ఇప్పుడు రాజకీయాలపై ఆయన మక్కువ చూపడం లేదని సన్నిహితులు చెబుతున్నారు. ఇకపోతే, లగడపాటి రాజగోపాల్... సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో నాటకీయ ఫక్కీలో నిమ్స్ ఆస్పత్రిలో చేరి హడావుడి చేసిన ఆయన రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు చేశారు. అన్నట్టుగానే ఆయన గత ఎన్నికల్లో పోటీ చేయకపోగా, గడిచిన రెండేళ్లుగా ఏ వేదికపైనా కూడా ఆయన కనిపించలేదు. ఆయనతో పాటు విశాఖ మాజీ ఎంపీ సబ్బం హరి, మరో మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజులు కూడా ఏ వేదికలపైనా కనిపించడం లేదు. విభజన జరిగితే తమకు రాయల తెలంగాణ కావాలని నినదించిన మాజీ మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరుల హడావిడి కూడా లేదు. పేరుకు టీడీపీలో చేరినప్పటికీ ఆ పార్టీలో వారికి పెద్దగా పనిలేకుండా పోయింది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగిన శైలజానాథ్ ఆ తర్వాత కిరణ్ ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి, ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. మధ్యలో టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు కూడా సాగినప్పటికీ ఫలించలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన అప్పడుప్పుడు మీడియా సమావేశాల్లో కనిపిస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ ఆ రోజుల్లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ ఆ తర్వాత తెరపైన పెద్దగా కనిపించడం లేదు. టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో అసంతృప్తితోనే ఉన్నట్టు చెబుతున్నారు. ఈ రాజకీయ నాయకుల పరిస్థితి ఇలా ఉంటే, సమైక్య ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నేతగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీవో నేత అశోక్ బాబు రాష్ట్ర విభజన తర్వాత కాలంలో క్రియాశీలంగా లేకపోవడం గమనార్హం. -
పార్లమెంట్ వద్ద నేడు వీహెచ్ మౌనదీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో ఓబీసీల రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఓబీసీ పార్లమెంటరీ ఫోరం కన్వీనర్, కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు సోమవారం మౌనదీక్ష చేపట్టనున్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఓబీసీల రిజర్వేషన్ల అమలులో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బ్యాంక్ల రుణాలు ఎగవేసిన విజయ్మాల్యాతో పాటు కేంద్రమంత్రి సుజనాచౌదరి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్పై కూడా కేంద్రం చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. -
లగడపాటీ.. ఇదేంటి!
విజయవాడ: కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం సృష్టిస్తూ వార్తల్లోని వ్యక్తిగా నిలిచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజకీయ సన్యాసం విరమిస్తున్నారా.. ఎన్నికల ముందు చేసిన ప్రతిజ్ఞను పక్కనపెట్టి వేరే పార్టీలో చేరనున్నారా! ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని విజయవాడ వీధుల్లో వెలిసిన పోస్టర్లను చూస్తే ఎవరికైనా సందేహం రాక మానదు. ఈ పోస్టర్లపై నటుడు పవన్కల్యాణ్, బీజేపీ నాయకుల ఫొటోలు ఉండడం విశేషం. పొలిటికల్ కలరింగ్ ఇచ్చి బర్త్డే జరుపుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటనేది నగరవాసుల్లో చర్చనీయాంశమైంది. ఇంత జరిగినా రాజగోపాల్ మాత్రం పెదవి విప్పలేదు. ఆయన బెంగళూరులో ఉండగా అభిమానులు ఇక్కడి కార్యాలయంలో కేక్ కట్ చేశారు. తమ నాయకుడు రానున్న ఎన్నికలనాటికి తిరిగి రాజకీయాల్లోకి వస్తారని వారు ఘంటాపథంగా చెబుతున్నారు. ఫ్లెక్సీలపై పవన్ ఫొటోలు వేయడంతో రాజగోపాల్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని కొంతమంది, వైఎస్సార్ సీపీలో చేరతారని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు. కానీ లగడపాటి ఇంతవరకు ఆయా పార్టీల ముఖ్య నేతలెవరినీ కలవలేదు. -
పెప్పర్ స్ప్రే ఉచ్చులో సీమాంధ్ర ఎంపీలు
పార్లమెంటులో ఏం జరిగింది -45 యథావిధిగా.. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయం వాయిదా పడిపోయింది. మళ్లీ సభ ప్రారంభమైంది. ఆ రోజు ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు’ ప్రవేశపెడ్తారని అందరూ అనుకుంటున్నారు గానీ ‘లిస్ట్ ఆఫ్ బిజినెస్’, ఆ రోజు లోక్సభలో జరగవలసిన వ్యవహారాల జాబితాలో ఎ.పి. బిల్లు ప్రస్తావన లేదు! 11 నుంచి 12 గంటల మధ్య, సభ వాయిదా పడినప్పుడు, అందరమూ సెంట్రల్ హాల్ లోనే ఉన్నాం. కొంత మంది ఒడిశా సభ్యులు ‘బిల్లు ప్రవేశపెడితే సీమాంధ్ర ఎంపీలు కొందరు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తారట గదా..’ అని ప్రశ్నించారు. ఈ విషయం, కొన్ని పత్రికల్లో బాగా ప్రచారం చేయబడింది. బిల్లుకు నిరసనగా స్పీకర్ సమక్షంలోనే విషం తాగి చచ్చిపోయే ప్రయత్నం కొందరు ఎంపీలు చేస్తారని గట్టిగా పుకారు నడిచింది గానీ, ఆ ఎంపీలు ఎవ్వరో మాత్రం ఎవ్వరికీ తెలియదు! 12 గంటలకు సభ మొదలవుతోందంటూ లోక్ సభ బెల్ మోగుతోంది. స్పీకర్ ముందు భాగం, రోజూ మేము నిలబడి నినాదాలు ఇచ్చే ‘వెల్’ ప్రాంతమంతా కాంగ్రెస్ ఎంపీలతో నిండిపోయి ఉంది. మొత్తం కాంగ్రెస్ ఎంపీలెవ్వరూ వారి సీట్లలో కూర్చునిలేరు. అవిశ్వాస తీర్మానం చదివేటప్పుడు ఎవరి సీట్లలో వారుండాలని మేమంతా ముందే అనుకున్నాం. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబడినప్పుడు, ఆ ప్రతిపాదన చదవకుండా స్పీకర్ మరే అంశమూ మొదలు పెట్టకూడదనేది.. రూల్! అవిశ్వాసాన్ని సమర్థిస్తున్న సీమాంధ్ర ఎంపీలతోపాటు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఎంపీలూ, ఎన్డీయే భాగస్వామి శివసేన ఎంపీలూ లేచి నిలబడి మద్దతు చెప్తారని, దాంతో విభజన బిల్లు ఆగిపోతుందని, అందరూ అనుకున్నారు. ఎందుకు కాంగ్రెస్ ఎంపీలు వచ్చి ‘వెల్’లో నిలబడ్డారో నాకు అర్థం కాలేదు. హఠాత్తుగా పెద్ద కేకలు వినబడ్డాయి. ‘వెల్’ అంతా యుద్ధభూమిలా మారిపోయింది. ఆత్మహత్యా ప్రయత్నం చేయటానికి ఎవరైనా ప్రయత్నిస్తే, వాళ్ల చేతుల్లోని విషం బాటిల్ లాక్కోవడానికి వ్యూహం పన్నారనుకున్నా గానీ, అవిశ్వాసం చదవకుండానే షిండేగారి చేత బిల్లు ప్రవేశ పెట్టించాలనే కపట వ్యూహం ఏర్పాటయిందని నేనూహించలేదు. క్షణకాలంలో స్పీకర్ హడావుడిగా లోపలికి వెళ్లిపోయారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు సభ్యులందరూ దగ్గుతూ, ఆయాస పడుతూ సభలోంచి బైటకొచ్చేస్తున్నారు. ఇందాక ఆత్మహత్యా ప్రయత్నం జరుగుతుందా అని ప్రశ్నించిన ఒడిశా ఎంపీ, ‘పాయిజన్ గ్యాస్ వాడతారని నువ్వు చెప్పనే లేదు’ అంటూ ముక్కు కళ్లు ఖర్చీఫ్తో మూసుకుంటూ వెళ్లిపోయాడు. లగడపాటి రాజగోపాల్ ‘పెప్పర్ స్ప్రే’ ఎవ్వరూ ఊహించని సంఘటన. ఈ సంఘటనతో లగడపాటి సీమాంధ్ర ప్రాంతంలో హీరో అయిపోయాడు. అని ‘హిందుస్తాన్ టైమ్స్’ పత్రిక వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ బిల్లు ఆగిపోతే, మైకు విరిచేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటి రాజగోపాల్, సీమాంధ్ర ప్రాంతంలో హీరోలుగా నిలిచిపోతారని కూడా, ఉత్తరభారతంలో అత్యధిక సర్క్యు లేషన్ కల్గిన ‘హిందుస్తాన్ టైమ్స్’ వ్యాఖ్యానించింది. ఇక్కడ నాకర్థం కాని కొన్ని విషయాలూ, ప్రశ్నలూ మిగిలిపోయాయి. లగడపాటి రాజగోపాల్ మాలాంటి మామూలు ఎంపీ కారు! వేల కోట్ల రూపాయల లాంకో సామ్రాజ్యాధిపతి. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలనేంత బలమైన కోరిక ఉన్న వారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి పాదయాత్రలో, ఆయన తోపాటు, చేవెళ్ల నుండి ఇచ్ఛాపురం వరకూ నడిచిన వారు.. చిన్న వయస్సులోనే, విజయవంతమైన వ్యాపారవేత్తగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి పది మంది పారిశ్రామికవేత్తల్లో ఒకడిగా నిలబడే స్థాయికి చేరిన వారు. అలాంటివాడు, ఎంతో ఆలోచించకుండా, ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడతాడా! ‘‘పెప్పర్స్ప్రే’’తో దేశవ్యాప్తంగా పతాక శీర్షికల్లోకి ఎక్కినవాడు, పర్యవసానంగా బిల్లు ఆగిపోతుందనే నమ్మకం లేకపోతే, ఇలా చెయ్యగలడా!? నువ్వు ‘పెప్పర్స్ప్రే’’ కొట్టు.. బిల్లు ఆగిపోతుందని లగడపాటికి ఎవరు చెప్పివుంటారు? ఒక వేళ ‘కాంగ్రెస్’ చెప్పినా లగడపాటి వింటారా!? అప్పటికే ‘కాంగ్రెస్’ సీమాంధ్రలో ‘జీరో’ అయిపోయిందనీ, యావద్భారతంలో ‘మోదీ’ గాలి వీస్తోందని పసిపిల్లవాడిక్కూడా తెలిసిందే! అలాంటిది, సర్వేల ఎక్స్పర్ట్ లగడపాటి, ఆమాత్రం ఊహించలేరా! నిజానికి, ఆ సమయానికి, లగడపాటి వ్యాపార సంస్థలూ సంక్షోభంలో కూరుకునిపోయి ఉన్నాయి. కొన్నివేల కోట్ల రూపాయల బ్యాంక్ బకాయిలు చెల్లించవల్సి ఉందని అందరికీ తెలుసు. ఆ స్థాయి వ్యాపారవేత్తలు, ప్రభుత్వంతోనూ ప్రతిపక్షంతోనూ మంచి సంబంధాలు కలిగివుండాలి. అటువంటిది, కాంగ్రెస్, బీజేపీ కలిసి ఎలాగోలాగున బిల్లు పాస్ చేయించుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో ‘లగడపాటి’ ఇంత తీవ్రవాద చర్యకు పాల్పడి కాంగ్రెస్, బీజేపీలను దూరం చేసుకుంటారా! కాంగ్రెస్, బీజేపీలిద్దరూ లగడపాటి ‘పెప్పర్స్ప్రే’కి ‘గ్రీన్సిగ్నల్’ ఇచ్చివుంటారా? కాంగ్రెస్ ఎంపీలందరినీ రంగంలోకి దించకపోతే, పెప్పర్స్ప్రే అవకాశమే రాదు. ఎంపీల బదులుగా ‘మార్షల్స్’ని ‘వెల్’లోకి దింపినట్లైతే, కథ మరోలా నడిచి ఉండేది! ఆ ఎవ్వరినీ ‘వెల్’లోకి రాకుండా ‘మార్షల్స్’ వలయం చుట్టి ఉన్నట్లైతే, అవిశ్వాస తీర్మానం చదవక తప్పని పరిస్థితి. తీర్మానం బలపరుస్తూ యాభై మంది సభ్యులు నిలబడే పరిస్థితి, అన్ని బిల్లులూ పక్కనబెట్టి అవిశ్వాసం మీద చర్చ చేపట్టక తప్పని పరిస్థితి.. వచ్చి తీరుతాయి! లోక్సభ గడువు వారం రోజుల్లో ముగుస్తుంది.. అవిశ్వాసం దెబ్బతో అందరి వ్యూహాలూ దెబ్బతింటాయి! లగడపాటిని కాంగ్రెస్+బీజేపీ, ఏదో తీవ్ర చర్య జరిగితే తప్ప ‘ఈ బిల్లు ఆగదు’ అని ప్రోత్సహించి ఉంటాయా!? ఏం జరుగుతుందో, నిజానిజాలైతే నాకు తెలియదు గానీ, ‘పెప్పర్స్ప్రే’ బూచిని చూపించి సీమాంధ్ర ఎంపీలలో 15 మందిని సస్పెండ్ చేసేశారు. రాజ్బబ్బర్, అజారుద్దీన్ లాంటి అందరికీ మొహం తెలిసిన ప్రముఖులు కూడా ‘వెల్’లో దెబ్బలాడినా, వారినెవ్వర్నీ సస్పెండ్ చేయలేదు. ‘ఎందుకు చెయ్యలేదు’ అని విభజనను వ్యతిరేకిస్తున్న పార్టీల వారు కూడా స్పీకర్ని ప్రశ్నించలేదు! ‘పెప్పర్స్ప్రే’ ఘటన సీమాంధ్ర ఎంపీలను ‘ఉగ్రవాదులు’గా చిత్రీకరించటానికి ఉపయోగపడిందే తప్ప ‘బిల్లు’ ఆపటానికి ఏ మాత్రం ఉపయోగపడలేదనేదే నా ఊహ! (నేనూ లగడపాటి, పలు సందర్భాల్లో చర్చించుకున్న రాజకీయ అంశాలు, ఆ రోజు సభలో ప్రవేశించబోయే ముందు, మేం మాట్లాడుకున్న విషయాలని బట్టి... లగడపాటి ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసి ఉంటారని నేను నమ్మాను. ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలనే అంశంలో లగడపాటిది దృఢనిశ్చయం.. అందుకే, ‘లగడపాటి’ని వాడుకుని, సీమాంధ్ర ఎంపీలని ఏకాకులు చేశారేమోనని అనుకుంటున్నాను) ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు a_vundavalli@yahoo.com -
చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్ భేటీ
-
చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్ భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ బాకాలు ఊదిన విజయవాడ లోక్సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన ఆయన ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు పావులు కదుపుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన గురువారం కలిశారు. త్వరలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'మా సీఎంకు లగడపాటి సర్టిఫికెట్ అవసరం లేదు'
రాయికల్ (నిజామాబాద్ జిల్లా): తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న గోదావరి మహా పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్కు అభినందనలు అంటూ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల కాళేశ్వరంలో పుష్కరస్నానం చేసిన సందర్భంగా పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పుష్కరాలను అన్ని విధాలుగా ఘనంగా నిర్వహించడం ప్రభుత్వం బాధ్యతని, ఇందుకు సీఎం కేసీఆర్కు లగడపాటి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. మంగళవారం ఆమె కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్ర, మహారాష్ట్రల నుంచి పుష్కర స్నానాల కోసం తెలంగాణకు లక్షలాది మంది భక్తులు వస్తున్నారని, ఇది గమనించే లగడపాటి కాళేశ్వరానికి వచ్చారన్నారు. -
కాళేశ్వరంలో ప్రముఖుల స్నానాలు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరముక్తీశ్వర క్షేత్రంలో ఆదివారం సాయంత్రం పలువువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదనాచారితోపాటూ మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలు పుణ్యస్నానాలు చేశారు. మరో వైపు కాళేశ్వరం వద్ద గోదావరి పుష్కరాల్లో రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 3 గంటల సమయానికి 3.5 లక్షల మంది స్నానాలు చేశారని అధికారులు చెబుతున్నారు. అయితే, కాళేశ్వరం- మహదేవపూర్ మార్గంలో దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. -
హైదరాబాద్లో లగడపాటి విగ్రహం పెట్టాలి
కేసీఆర్కు జన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి వినతి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చరిత్రను భావితరాలకు తెలిపేందుకు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటనారాయణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. మంగళవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తాను గాంధేయవాదినని చెప్పుకుంటూ తిరిగే లగడపాటి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మరిచిపోలేని విధంగా పార్లమెంటులో తెలంగాణవాదులపై దాడి చేసి బిల్లును అడ్డుకున్నాడని వివరించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న లగడపాటిని తెలంగాణ ప్రజలు మరువకుండా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అతని ఘన చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. -
రేవంత్ రెడ్డికి లగడపాటికి పట్టిన గతే పడుతుంది
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్, టీడీపీలే కారణమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... యాత్రల పేరిట కాంగ్రెస్, టీడీపీ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీ.టీడీపీ నేతలు బానిసలుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేకుంటే భవిష్యత్తులో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్కి పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని హెచ్చరించారు. -
నేడు చారిత్రాత్మక తీర్పు
జగన్ సీఎం కావడం ఖాయం లగడపాటివి సన్నాసి మాటలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఉదయభాను జగ్గయ్యపేట అర్బన్, న్యూస్లైన్ : రాష్ట్ర ప్రజలు నేడు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, పేట అసెంబ్లీ అభ్యర్థిసామినేని ఉదయభాను స్పష్టం చేవారు. చిల్లకల్లు రోడ్డులోని స్థానిక పట్టణపార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుని అధికారంలోకి రావడం ఖాయమనిఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల వెలువడిన మున్సిపల్, మండల, జిల్లాపరిషత్ ఎన్నికల ఫలితాల్లో వెఎస్సార్ సీపీకి తక్కువ సీట్లు వచ్చినా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 110సీట్లకు పైగా తమ పార్టీ కైవసం చేసుకుని విజయదుందుభి మోగిస్తుందన్నారు. మున్సిపల్,మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలకు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు అసలు సంబంధమే ఉండ దన్నారు. ఆ ఎన్నికలు కేవలం ఒక ప్రాంతానికి చెంది, స్థానిక రాజకీయాలు, స్థానిక గ్రూపు రాజకీయాల ప్రభావంతో నిండి ఉంటాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన నాటికి, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయానికి మధ్యలో అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరించనున్నారన్నారు. గతంలోనూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షం తెలుగుదేశానికి ఎక్కువ స్థానాలు వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న వైఎస్సార్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా నీరాజనాలు పలికే విధంగా ఫలితాలు రానున్నాయన్నారు. జిల్లాలోనూ అత్యధిక స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నిలిపే సమర్థవంతమైన వైఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం ఖాయమన్నారు. లగడపాటివి సన్నాసి మాటలు... రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రగాల్భాలు పలికిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సన్యాసం మాటున సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని ఉదయభాను అన్నారు. కుళ్లు, కుతంత్రాలతో ఏ ఎండకు ఆ గొడుగు పట్టే విధంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటట్లు ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు వెల్లడించడం ఆయనకు పరిపాటేనని దుయ్యబట్టారు. బెట్టింగులకు పాల్పడుతూ అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. 2009లో కూడా ఈ విధంగానే బెట్లు కాస్తూ కోట్లాదిరూపాయలు గడించారని, ప్రస్తుతం 48గంటల్లో ఫలితాలు వెల్లడవుతాయని తెలిసి కూడా బెట్టింగ్ రాజకీయాలు చేస్తూ అనేక కుటుంబాలను నాశనం చేస్తున్నారన్నారు. ఆయనపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ నేతలు తన్నీరు నాగేశ్వరరావు, షేక్ మదార్సాహెబ్, తుమ్మేపల్లి నరేంద్ర, తుమ్మల ప్రభాకర్, చింకా వీరాంజనేయులు, జె.ఉదయభాస్కర్, సిహెచ్.జగదీష్, నంబూరి రవి, ఇంటూరి రాజగోపాల్, కాకాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
'లగడపాటి ఎలాంటి సర్వేలు చేయించలేదు'
గుంటూరు : లగడపాటి రాజగోపాల్ ఎలాంటి సర్వేలు చేయించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ లగడపాటి నిజంగా సర్వే చేయించి ఉంటే ఏ సంస్థలో చేయించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని అంబటి అన్నారు. లగడపాటి సర్వేను నమ్మి ఎవరూ పందాలు కాయొద్దని అంబటి సూచించారు. జాతీయ సంస్థలన్ని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని వెల్లడించాయని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల మధ్య నెలరోజుల సమయం ఉందని, ఆ సమయంలో చాలా మార్పులు జరిగాయని అంబటి పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు తాము పోటీ చేయలేమంటూ చేతులెత్తేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 110కంటే ఎక్కువ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని అంబటి ధీమా వ్యక్తం చేశారు. -
'ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సీపీదే విజయం'
-
'ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సీపీదే విజయం'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని ఆపార్టీ అధికార ప్రతినిధి ఓవీ రమణ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే విజయమని సర్వేలు చెబుతున్నాయని ఆయన గురువారమిక్కడ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని జాతీయ ఛానెళ్లు, జాతీయ దినపత్రికలు వెల్లడిస్తున్నాయన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఓవీ రమణ మండిపడ్డారు. చిల్లర దందాలు, బెట్టింగ్ల కోసమే లగడపాటి సర్వే అంటూ ఊదరగొడుతున్నారని అన్నారు. -
'బెట్టింగ్ల కోసమే లగడపాటి సర్వేలు'
-
లగడపాటి సర్వే సన్నాసి సర్వే....
హైదరాబాద్ : లగడపాటి రాజగోపాల్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ లగడపాటి సర్వే సన్నాసి సర్వే అని వ్యాఖ్యానించారు. లగడపాటి సర్వే బెట్టింగ్ల కోసమేనని అన్నారు. ఆయన రాజకీయాలు మానేసి బెట్టింగ్ వ్యాపారం మొదలు పెట్టారని గట్టు రామచంద్రారావు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని లగడపాటికి తెలుసునని, అయితే బెట్టింగ్ల ద్వారా సంపాదనే లక్ష్యంగా లగడపాటి సర్వే ఉందన్నారు. 16వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన తర్వాత లగడపాటి కమండలం పట్టుకుని హిమాలయాలకు వెళతారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని గట్టు ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ఇటువంటి సర్వేలన్ని రివర్స్ అవ్వడం ఖాయమన్నారు. -
‘తెలుగునాడు’గా మార్చాలి : లగడపాటి
విజయవాడ, న్యూస్లైన్ : కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగునాడుగా పేరు మార్చాలని దీని కోసం అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం తీర్మానం చేయాలని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కోరారు. మొగల్రాజపురంలోని జనశిక్షణ సంస్థాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బుధవారం ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.10వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. హైదరాబాద్లో ఉన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ కొత్త రాష్ట్రంలోనే ప్రమాణస్వీకారం చేయాలని కోరారు. ఎంత త్వరగా కొత్త రాజధాని ఏర్పాటు జరిగితే అంతే వేగంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు వీలైనంత త్వరగా కొత్త రాష్ట్రానికి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఉన్నారని తెలిపారు. జేఎస్పీతో సంబంధం లేదు.. జైసమైక్యాంధ్ర పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని లగడపాటి స్పష్టం చేశారు. జై సమైక్యాంధ్ర ఉద్యమం అనేది ప్రజల్లోని ఐక్యత అని, పార్టీతో సంబంధం ఉండదని చెప్పారు. మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ.. తనకు పునర్జన్మ మీద నమ్మకం లేదని, మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని తాను భావించటం లేదన్నారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గానీ, ఒక పార్టీలోకి వెళ్లాలనే ఉద్దేశంతో గానీ తాను సర్వే ఫలితాలు ప్రకటించటం లేదన్నారు. కొందరు తన పేరు ఉపయోగించుకుని దొంగ సర్వేలు చేస్తున్నారని, దీంతో తాను సర్వేలు చేయటం ప్రస్తుతానికి నిలిపివేశానని చెప్పారు. గెలుపోటములపై పోలింగ్ శాతం ప్రభావం న్నికల్లో ట్రెండ్ అనేది పోలింగ్ సరళిని ఆధారంగా మారుతుందన్నారు. పోలింగ్ శాతం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ట్రెండ్ను సృష్టిస్తుందన్నారు. పోలింగ్ మొత్తం పూర్తయిన తరువాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంపై తాను ఒక అభిప్రాయానికి వస్తానన్నారు. ఓటర్లలో చైతన్యం పెరిగిందన్నారు. ఈ నెల 12వ తేదీన వెలువడే మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు దగ్గరగానే ఇంచుమించు అసెంబ్లీ ఫలితాలు ఉంటాయని జోస్యం చెప్పారు. -
రాజకీయ సన్యాసి సర్వేలు చేయించటమా?
నిజామాబాద్ : రాజకీయంగా ఎదుర్కోలేకనే చతికిలపడి రాజకీయ సన్యాసం పుచ్చుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు సర్వేలేందుకని వైఎస్సార్ సీపీ ఎల్లారెడ్డి ఇన్చార్జి పెద్దపట్లోళ్ల సిద్దార్థరెడ్డి విమర్శించారు. లగడపాటి తన ఆస్తులను కాపాడుకునేందుకు తప్పుడు సర్వేలు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతుండగా, లగడపాటి టీడీపీ అధికారంలోకి వస్తుందని తప్పుడు సర్వేలతో దుష్ర్పచారం చేయడం సిగ్గుచేటన్నారు. లగడపాటి తిక్క ఉన్న లెక్కలేని మనిషి అని విమర్శించారు. జగన్ను విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్కు లేదన్నారు. సినిమాల్లో బొమ్మలాట ఆడే వ్యక్తి ప్రజల కోసం శ్రమించే వ్యక్తిని విమర్శించడమేంటని సిద్ధార్థరెడ్డి ప్రశ్నించారు. ప్రజారాజ్యం పేరిట పార్టీ స్థాపించిన చిరంజీవి, పవన్ కల్యాణ్ కాంగ్రెస్ కు అమ్ముడు పోయారని ఆరోపించారు. యువరాజ్యం స్థాపించిన పవన్ యువకులను చైతన్యం చేస్తానని టీడీపీ, బీజేపీలను చైతన్యం చేస్తున్నారన్నారు. ఆయనకు తిక్క, లెక్కలు లేవుగాని అధికార దాహం ఉందన్నారు. జనసేన పేరిట పార్టీ పెట్టిన పవన్ ఎన్నికల్లో పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతామన్న భయంతో పార్టీ పెట్టకుండా ఇతరులకు మద్దతు పలుకుతున్నారని అన్నారు. -
లగడపాటి ‘పచ్చ’వాదన
లీకుల వెనకున్న ప్యాకేజీ ఏంటి? విశ్వసనీయత కోల్పోయా రంటున్న ఆయన వర్గం నేతలు సాక్షి, విజయవాడ : సర్వేలు చేస్తూ ఆంధ్రా ఆక్టోపస్గా పేరు తెచ్చుకున్న లగడపాటి తన విశ్వసనీయతను కోల్పోయారని ఆయన వర్గం నేతలే ఆరోపిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకూ ఎన్నడూ పోలింగ్ ముందు తన సర్వేలను వెల్లడించలేదు. పోలింగ్ అయిపోయిన తర్వాత తన సర్వే ఫలితాలను వెల్లడిస్తూ వచ్చారు. అయితే దీనికి భిన్నంగా చంద్రబాబు ఏజెంటులా...ఆయన ప్రదర్శించిన అత్యుత్సాహం పలు విమర్శలకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ విడిపోదంటూ చెబుతూ వచ్చిన ఆయన రాజీనామా చేయడం కోసం ఆడిన డ్రామాలతో విజయవాడ ప్రజల్లో చులకనయ్యారు. ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నా...కిరణ్కుమార్రెడ్డితో జై సమైక్యాంద్ర పార్టీ పెట్టించడం వెనుక కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. సీమాంధ్రలో ఎన్నికలకు ఇంకా మూడు రోజుల సమయం ఉండగా ఆయన మీడియా ముందుకు వచ్చి తెలంగాణాలో టీఆర్ఎస్, ఆంధ్రాలో తెలుగుదేశం - బీజెపీ కూటమి గెలుస్తుందంటూ జోస్యం చెప్పారు. ఎగ్జిట్పోల్స్పై నిషేధం ఉన్నా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పడం వెనుక చంద్రబాబు హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే మోడీ, పవన్ కళ్యాణ్లతో ప్రచారం చేయించినా తన పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఈ విధమైన మైండ్గేమ్కు తెరలేపినట్లుగా సమాచారం. అయితే కొంతకాలంగా ఆయన చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్పై ఎదురుదాడికి దిగిన ఆయన ఒకదశలో ఏలూరు తెలుగుదేశం సీటుకు పోటీపడుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా వెళ్లినా... తెలుగుదేశంకు అనుకూల వైఖరినే అవలంభిస్తూ వస్తున్నారు. బీజెపీ - తెలుగుదేశం పార్టీ కూటమిని చూసి మైనారిటీలు, క్రైస్తవులు భయబ్రాంతులకు లోనౌతూ ఆ కూటమిని ఓడించాలని కంకణం కట్టుకుంటే ఈ కూటమి గెలుస్తుందని చెప్పడానికి రాజగోపాల్ ప్రాతిపదిక ఏంటని ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు వ్యాఖ్యానిస్తున్నారు. 290 సీట్లు సమైక్యవాదులే గెలుస్తారంటూ ఢంకా భజాయించి చెబుతూ వచ్చిన లగడపాటి రాజగోపాల్ ఈ రోజున రాష్ట్ర విభజనకు సహకరించిన తెలుగుదేశం, బీజేపీ కూటమికి అనుకూలంగా ఎలా వ్యాఖ్యలు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణాలో అతి తక్కువ సీట్లు గెలుచుకునే ఈ కూటమి ఏ ప్రాతిపదికతో ఇక్కడ గెలుస్తుందో చెప్పాలని వారు నిలదీస్తున్నారు. -
బాబు కోసం లగడపాటి ఆరాటం: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలనే తాపత్రయంతోనే టీడీపీ గెలుస్తుందనే ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆదివారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే లగడపాటికి తొలి నుంచే ద్వేషమేనని, అందుకే ఆయనపై విషం చిమ్ముతున్నారని చెప్పారు. జగన్పై మూడేళ్ల క్రితం నుంచే లగడపాటి విషం కక్కుతూ మాట్లాడుతున్నారన్నారు. చివరి ప్రయత్నంగా బాబుకు ఉడతా భక్తిగా సాయం చేద్దామని ప్రజాభిప్రాయం పేరిట సీమాంధ్రలో టీడీపీ గెలుస్తుందని లగడపాటి ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ సన్యాసం పుచ్చుకున్నానని ప్రకటించిన లగడపాటి అంతటితో ఊరుకోక అభిప్రాయాల పేరుతో రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని పద్మ ఎద్దేవా చేశారు. సన్యాసం తీసుకోవడం మాటేమిటోగానీ ఆయన మాత్రం ఒక సన్నాసి అని మండిపడ్డారు. -
'చంద్రబాబుతో చేరడానికి లగడపాటి తాపత్రయం'
హైదరాబాద్: లగడపాటి రాజగోపాల్, పవన్ కళ్యాణ్లు పొలిటికల్ జోకర్లు అని వైఎస్ఆర్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు పంచన చేరడానికే లగడపాటి తాపత్రయపడుతున్నారని అన్నారు. లగడపాటి, పవన్ ప్రచారంతో తమ పార్టీకే లాభమని చెప్పారు. చంద్రబాబును ఓటమి భయం చుట్టుముట్టిందని, అందుకే పోలింగ్కు 2 రోజుల ముందు కాపులను బీసీల్లో చేరుస్తానని అబద్ధపుహామీ ఇస్తున్నారని అన్నారు. బీసీ, కాపులకు మెజార్టీ సీట్లు ఇవ్వలేని చంద్రబాబు ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవులను ఎర వేస్తున్నారని దుయ్యబట్టారు. కాపు, బీసీలతో పాటు పేద, మధ్యతరగతి, మహిళ, యువత అన్ని వర్గాల ప్రజలు వైఎస్ఆర్ సీపీ వెంటే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు రావణాసురుడు లాంటి వారని ఆక్షేపించారు. వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక మోడీ, పవన్, లగడపాటి, రామోజీలను అరువు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ-టీడీపీ కూటమి, పవన్ ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని వాసిరెడ్డి పద్మ అన్నారు. -
లగడపాటి రాజకీయ సన్యాసి కాదు.. సన్నాసి!!
-
లగడపాటి సర్వేకు ఎల్లో కలరింగ్!
సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని, ప్రజల ఆదరణను తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ వేస్తున్న చవకబారు ఎత్తుగడలు ప్రజల్ని విస్తుపోయేలా చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రజలకు ఉన్న బంధాన్ని తెంచేందుకు చేస్తున్న పలు ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రాష్ట్ర విభజన అంశంలో రెండు కళ్ల సిద్దాంతంతో సీమాంధ్రలో దాదాపు తుడుచుకుపెట్టుకుపోయిన తెలుగుదేశం అభ్యర్ధులను అరువు తెచ్చుకుని పోటీలో దిగింది. అయినా తెలుగుదేశం పార్టీపై నమ్మకం, విశ్వసనీయత కలుగకపోవడంతో అనేక దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ఇటీవల సినీనటుడు పవన్ కళ్యాణ్ తో చేసిన ప్రయోగం దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దాంతో ఏం చేయాలో తెలియక 'సర్వే'పాటి రాజగోపాల్ హడావిడిగా రంగంలోకి దించారు. ప్రెస్ మీట్ పేరుతో లగడపాటి సర్వేలను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చెప్పేలా నాటకమాడించారు. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని.. సీమాంధ్రలో తెలుగుదేశం, బీజేపీల కూటమి విజయం సాధిస్తుందని లగడపాటి జోస్యం చెప్పారు. ఎన్నికల నిబంధనలు కారణాల వల్ల పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నానని చివరగా ఓ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. రాష్ట్ర విభజన కారణంగా రాజకీయాలకు స్వస్తి చెప్పిన లగడపాటి రాజగోపాల్.. ప్రస్తుతం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన తెలుగుదేశం పార్టీకి వంత పాడుతున్నారు. రెండు కళ్ల సిద్దాంతంతో అడ్డగోలు విభజనకు కారణమైన టీడీపీని నిలదీయాల్సి పోయి... కీలక ఎన్నికల తరుణంలో అదేపార్టీకి అనుకూల ప్రచారానికి తెరలేపారు. ఎన్ని ఎత్తుగడలు, అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజాతీర్పును ఇలాంటి చవకబారు చేష్టలతో అడ్డుకోలేమన్నది వారికి కూడా తెలియందే కాదు. అయినా ఏదో విధంగా లబ్ది పొందాలనే ఆశతో 'ఆంధ్రా ఆక్టోపస్' లగడపాటిని కూడా చంద్రబాబు వాడుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సర్వేలు, పొత్తులు, సినీ గ్లామర్ లాంటి అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయలేదని సగటు ఓటరు అభిప్రాయం. నిర్ణయం ఇప్పటికే జరిగిపోయింది. తీర్పు ఇవ్వడానికి ఓటర్లు మే 7 తేది కోసం వేచి చూస్తున్నారు. ఎన్ని ఎత్తులు వేసినా, లగడపాటి సర్వే ప్రభావం సగటు ఓటరు తీర్పుపై ఉండదనేది త్వరలోనే అర్దమవ్వడం ఖాయం. -
లగడపాటి మారీచ రాజకీయం
* రాజకీయ ఒత్తిళ్లతో సర్వే అంటూ కాకిలెక్కలు: మైసూరా * పోలింగ్కు ముందు ఓటర్లను ప్రలోభ పెట్టే కుయుక్తులని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: తాను రాజకీయాల్లో లేనంటూనే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ ఒత్తిళ్లకు లొంగి సర్వేల పేరుతో మారీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తెలుగుదేశం పార్టీ ఒత్తిళ్లకు లొంగో, వారితో కుమ్మక్కయ్యో ఆ పార్టీకి ప్రయోజనం కలిగించేలా సర్వే ప్రకటనలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఎం.వి.మైసూరారెడ్డి విమర్శించారు. తన సర్వే ఫలితమంటూ కాకి లెక్కలు చెబుతూ, పోలింగ్ ముంగిట్లో పరోక్షంగా ఓటర్లను ప్రలోభ పెట్టే ఈ కుయుక్తులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది అనైతికమే కాకుండా ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కూడా మైసూరా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘నీ సర్వే ఏంటి? శాంపిల్ ఎంత? మెథడాలజీ ఏమిటి? ఇవేమీ లేకుండా తెలుగుదేశం పార్టీకి అనుకూలించే ప్రకటనలు చేయడం ఏ రకంగా సమంజసం?’ అని ప్రశ్నించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఇటువంటి ప్రకటనలు చేయడాన్ని తాము సవాల్ చేస్తామని పేర్కొన్నారు. ‘తెలంగాణలో తెరాస ఆధిక్యత ఉందనేదే నీ సర్వే ఫలితమైతే, 30 తేదీన అక్కడ పోలింగ్ అయిన వెంటనే ఎందుకు చెప్పలేదు?’ అని నిలదీశారు. సర్వేల పేరుతో రాజకీయ దురుద్దేశాల్ని వెల్లడించడం ఆయనకు కొత్తేమీ కాదని, లోగడ ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారని, ఆయన సర్వేలోని విశ్వసనీయత ఎంతో ఆనాటి ఫలితాలతోనే సుస్పష్టంగా తేలిపోరుుందని గుర్తు చేశారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ సొంతంగా ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తాయని తన సర్వేలో తేలిందని లగడపాటి శనివారం మీడియూ సమావేశంలో చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి 270కి పైగా సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు. -
వెయ్యికోట్లిస్తే లగడపాటినీ చేర్చుకుంటారా?
టీఆర్ఎస్కు ఎంపీ రాజయ్య ప్రశ్న రాయపర్తి, వెయ్యి కోట్లు ఇస్తే సమైక్యవాది అయిన లగడపాటిని కూడా టీఆర్ఎస్లో చేర్చుకుంటారా అని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ప్రశ్నించారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులను టీఆర్ఎస్లో చేర్చుకోవడం వల్ల అమరుల ఆత్మలు ఘోషిస్తాయని పేర్కొన్నారు. -
కిరణ్ ది షోలే జైలర్ లాంటి పరిస్థితేనా?
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢీలా పడిపోయారా? సమైక్యవాదిగా ముద్ర పడితే ప్రజలు తండోపతండాలుగా వచ్చేస్తారని అనుకున్న కిరణ్ కుమార్ రెడ్డికి నిరాశ ఎదురైంది. మొన్నటి శ్రీకాకుళం రోడ్ షో అయినా, శుక్రవారం నాటి జగ్గయ్యపేట రోడ్ షో అయినా జనాన్ని ఆకర్షించలేకపోయింది. జగ్గయ్యపేటలో లగడపాటి రాజగోపాల్ కి చాలా ప్రభావం ఉంది. ఇది ఆయన ఎంపీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం. పైగా ఆయన మాజీ సీఎం స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకి ప్రధాన సలహాదారు కూడా. లగడపాటి ఎంత ప్రయత్నించినా జనం రోడ్ షో పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. జనాలు రాకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రసంగాన్ని హడావిడిగా ముగించేశారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయిల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఎంపీ సాయిప్రతాప్ లు కూడా తెలుగుదేశం వైపు పక్కచూపులు చూస్తున్నారు. వీరిద్దరూ కిరణ్ పార్టీకి ఉపాధ్యక్షులు. షోలేలో జైలర్ అన్నట్టు 'సగం మంది కుడివైపు, సగం మంది ఎడమ వైపు, మిగిలినవారు నా వెంట రండి' అన్నట్టుంది కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి! -
హవ్వా.. ఇదేం సన్యాసం
తప్పుకున్నానంటూనే రాజకీయం సర్వేల పేరుతో గిమ్మిక్కుల వైనం విషయం ఏదైనా వ్యక్తిగత ప్రచారం ఇవీ లగడపాటి చీప్ పాలి‘ట్రిక్స్’ కాశీకి పోయాను రామాహరి గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి కాశీకి పోలేదు రామాహరి మురుగు కాల్వలో నీళ్లండీ రామాహరి శ్రీశైలమెళ్లాను రామాహరి శివుని విభూది తెచ్చాను రామాహరి శ్రీశైలం పోలేదు రామాహరి ఇది కాష్టంలో బూడిద రామాహరి ఈ తరం వారికి ఈ పాట పరిచయం లేకపోయినా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తరం వారికి హాస్యభరితమైన ఈ సినీ గీతం సుపరిచితమే. అప్పు చేసి పప్పు కూడు సినిమాలో రేలంగి, గిరిజలు తమ నటనతో ఈ సన్నివేశంలో నవ్వులు పండించారు. సన్యాసం వేషం వేసి జనాన్ని మాయచేసే ప్రయత్నాన్ని తిప్పికొడుతూ అవన్నీ ఉత్తుత్తివేనని... నమ్మవొద్దని తనూ పాట రూపంలోనే కౌంటరిస్తుంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్రం విడిపోదని గట్టిగా చెప్పారు.. తీరా విభజన అయ్యాక తనదైనశైలిలో రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు. రాజకీయ సన్యాసం చేశానంటారు.. మళ్లీ కొత్త రాజకీయ పార్టీలో కీలకంగా కొనసాగుతున్నారు. ఆయన చేసే చీప్ పాలి‘ట్రిక్స్’ను చూసి ‘హవ్వా ఇదేం సన్యాసం’ అంటూ జిల్లా ప్రజలు చీదరించుకుంటున్నారు. చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన ఉండదనడానికి ఇదో ఉదాహరణ. ఇదేమి కిరికిరి... రాజకీయ సన్యాసం అంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడం అని అందరికీ తెలుసు. అయితే ఆయన ఇప్పుడు రాజకీయ సన్యాసానికి కొత్త నిర్వచనాన్ని రచిస్తున్నారు. రాజకీయాల్లో కీలకంగా కొనసాగుతూనే ... రాజకీయ సన్యాసం చేస్తారట..! ఇదేమి సన్యాసం అని ఆయనను ఎన్నుకున్న ఓటర్లే కాదు ఆయన అనుచరులు కూడా జుట్టు పీక్కుంటున్నారు. శకునం చెప్పే బల్లి కుడితి కుండీలో పడ్డట్టు... మాజీ ఎంపీ పర్వతనేని ఉపేంద్ర అల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చిన లగడపాటి విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి 2004, 2009లో గెలుపొందారు. రెండు పర్యాయాలు ఎంపీ అయిన ఆయన పలు సందర్భాల్లో చేయించిన సర్వేలు ఫలితాలకు కాస్త దగ్గరగా ఉండటంతో తాను చెప్పేదంతా జరుగుతుందన్న విశ్వాసాన్ని చాటుకునే ప్రయత్నం చేసేవారు. అందుకే సర్వేలను సాకుగా చూపించి ఆయన చాలా విషయాలు చెబుతూ ఉంటారు. రాష్ట్ర విభజన విషయంలో కూడా ఆయన పలుసార్లు ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ర్టం సమైక్యంగా ఉంటుందని గట్టిగా నమ్మించే ప్రయత్నం చేశారు. సర్వేలను నమ్ముకున్న లగడపాటి ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సర్వే చేయించి నివేదికలు పంపించామని, అవి నిజమని తేలిన తర్వాత కేంద్రం విభజన విషయంలో వెనక్కి తగ్గుతుందని ప్రకటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ విభజన విషయంలో వేగం పెంచింది. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది. పార్లమెంట్లో బిల్లు పెట్టలంటేనే భయపడేలా చేస్తామన్నారు. ఇంత హడావుడి చేసిన లగడపాటి విభజన విషయంలో అధికార పార్టీ ఎంపీగా చేతులెత్తేసి రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు. అయితే అందరూ ఆయన ఇంకా రాజకీయాల్లో ఉండరని, వ్యాపారాలు చేసుకుంటూ ఉండిపోతారని భావించారు. అలా జరిగితే రాజగోపాల్ ఎందుకు అవుతారు. అందుకే ఆయన మరుసటి రోజు నుంచి నిత్యం రాజకీయాల్లోనే మునిగి తేలుతున్నారు. అంతేకాదు విజయవాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభినందన సభలు పెట్టి లగడపాటిని కీర్తించుకునేలా అనువైన క్యాడర్ను బతిమాలుకోవాల్సి వచ్చింది. అంతటితో ఆగకుండా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. దీంతో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన లగడపాటికి వ్యూహకర్త బాధ్యతలు అప్పగిస్తున్నట్టు కిరణ్ ప్రకటించారు. ప్రచారమే పరమావధి... లగడపాటి ఏది చేసినా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కోరుకుంటారు. అదే క్రమంలో రాజకీయ సన్యాసం నిర్ణయాన్ని ప్రకటించి విజయవాడ వచ్చిన సందర్భంగాను పెద్ద్ద హైడ్రామాకు తెరతీశారు. తనకు అనుకూలంగా ఉండే కార్యకర్తలు, నాయకులను భారీగా సమీకరించి లగడపాటి రాజకీయాల్లో కొనసాగాల్సిందేనంటూ వారితో హడావుడి చేయించారు. దీని కోసం చాట్రాయిలో ఒక కార్యకర్త ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అక్కడికి వెళ్లిన లగడపాటి రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చినా, కిరణ్ పార్టీ పెట్టినా రాజకీయాల్లో కొనసాగుతానంటూ రాజకీయాలపై తనకున్న మక్కువను బయటపెట్టారు. ఏదో ఒకరకంగా రాజకీయాల్లో నెట్టుకొచ్చేందుకు ఆయన తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో తాజాగా విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున సొంత ప్యానల్ను పెట్టి రాజకీయంగా ఉనికిని కోల్పోకుండా ప్రయత్నాలకు తెరతీశారు. రాజకీయం అనే నీటిలో చేపలా మారిన లగడపాటి పదవే పరమావధిగా ఏదో ఒక సాకుతో మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతారని ప్రజలు చర్చించుకోవడం కొసమెరుపు. -
రండి బాబూ రండి.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం..
-
కిరణ్ కొత్త పార్టీ
* ఎట్టకేలకు ప్రకటించిన మాజీ సీఎం * 12న రాజమండ్రి సభలో పార్టీ పేరు, విధానాల ప్రకటన * తెలుగుజాతి ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యం * కిరణ్ వెంట నలుగురు కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలు, ఓ మాజీ మంత్రి సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఎట్టకేలకు కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈనెల 12న రాజమండ్రి బహిరంగ సభలో కొత్తపార్టీ పేరు, విధానాలు ప్రకటిస్తామన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవ పరిరక్షణ కోసమే పార్టీ పెడుతున్నామని, పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నామని పిలుపునిచ్చారు. కిరణ్కుమార్రెడ్డి గురువారం తన ప్రైవేటు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కొత్త పార్టీ గురించి ప్రకటన చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ బహిష్కృత ఎంపీల్లో కేవలం నలుగురు (లగడపాటి రాజగోపాల్, సబ్బంహరి, సాయిప్రతాప్, హర్షకుమార్), మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి మాత్రమే ఉన్నారు. కిరణ్ చెప్పిన మాటలు నమ్మి సొంతపార్టీని వీడి ఆయన వెంట నడిచిన నాయకులు తమ పరిస్థితి ఎటూ కాకుండాపోతోందని ఒత్తిడిచేయడంతో ఎట్టకేలకు పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారని తెలుస్తోంది. ఆయనేమన్నారంటే... * రాష్ట్ర విభజన ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్, బీజేపీలు దెబ్బతీశాయి. బిల్లు రూపొందించిన తీరు, పార్లమెంటులో అప్రజాస్వామికంగా ఆమోదించిన విధానం సిగ్గుచేటు. * అధికార దాహంతోనే టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయి. ఇద్దరూ విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చారు. బాబు, జగన్లకు సీఎం పదవిలోకి ఏదోవిధంగా రావాలన్నదొక్కటే లక్ష్యం. * పురుడుపోసి తల్లిని చంపేశారని మోడీ చెబుతున్నారు. నలుగురు ఎంపీలు పోడియంలోకి వెళ్తే హృద యం గాయపడింద ని ప్రధాని అంటున్నారు. కానీ వీరెవ్వరూ తెలుగు ప్రజల గుండెకు తగిలిన గాయం గురించి ఆలోచించలేదు. * ప్రస్తుతం ఎన్నికల సంఘం కొత్తగా ‘నోటా’ (పైవారెవ్వరూ కాదు అన్న ఆప్షన్) పెడుతున్నందున రాష్ట్ర ప్రజలంతా ఆయా పార్టీలకు కాకుండా నోటాపై ఓటువేసే ఉద్దేశంతో ఉన్నారు. అలాంటి వారందరికీ విన్నవిస్తున్నాను. మీ ఆలోచనల మేరకు నడిచే, మీ ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు కొత్త పార్టీ పెడుతున్నాం. ‘నోటా’కు బదులుగా మాకు ఓటేయండి. * రాజమండ్రి బహిరంగసభలో పార్టీపేరు, విధానాలు, అధ్యక్షుడితోపాటు అన్ని విషయాలూ చెబుతాం. సీమాంధ్రతోపాటు, తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీచేస్తాం. * నా జీవితం తెరచిన పుస్తకం. నాపై ఆరోపణలు చేస్తున్నవారు ఆధారాలు చూపించాలని సవాల్ విసురుతున్నాను. నేను చేసిన ప్రతి నిర్ణయం చట్టం, నిబంధనల ప్రకారమే జరిగింది. గవర్నర్కే కాదు ఎక్కడైనా ఫిర్యాదులు ఇచ్చుకోనివ్వండి. నన్నెవరూ ఏమీ చేయలేరు. * సీఎం నిర్ణయాలు తిరగదోడేందుకు గవర్నర్ ఎవరు? వచ్చే ప్రభుత్వాలు తిరగదోడొచ్చేమో కానీ గవర్నర్ ఎవరు? తిరగదోడితే మాత్రం ఏమవుతుంది? ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే మంచిది. * రాష్ట్ర విభజనపై నేను సుప్రీంకోర్టును ఆశ్రయించా. ఏమవుతుందో చూడాలి. మాకు అన్ని పార్టీలూ ప్రధాన పోటీదారులే. * ఒకప్పుడు వేర్వేరుగా ఉన్న ఉభయ జర్మనీ దేశాలు గోడలు పగులకొట్టి మరీ ఏకంకాలేదా? ఇక్కడ అలా గోడలు కూడా లేవు కదా? -
సుప్రీం స్టే విధిస్తే.. రాజకీయాల్లో కొనసాగుతా: లగడపాటి
కృష్ణా: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో స్టే వస్తే రాజకీయాల్లో కొనసాగుతానని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉభయ సభలు ఆమోదం తెలుపడంతో లగడపాటి రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. లగడపాటి తీసుకున్న నిర్ణయానికి మార్చుకుని..రాజకీయాల్లో కొనసాగాలని ఆయన అనుచరుడు ఆంద్రీయ దీక్షను చేపట్టారు. ఆంద్రీయ దీక్షను లగడపాటి విరమింప చేశారు. ఆ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ.. రాష్ట్రం సమైక్యంగా ఉంటే తాను రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని లగడపాటి వెల్లడించిన విషయం తెలిసిందే. -
త్యాగశీలి లగడపాటి రీఎంట్రీ!?
విజయవాడ లోక్సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం స్వీకరించి నాలుగు రోజులైనా గడవక ముందే ఆయన మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు లోక్సభలో ఆమోదం లభించగానే ఆయన కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. ఆ తరువాత రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించగానే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. లోక్సభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అవి ఆమోదం పొందాయి. సమైక్యవాదినని చెప్పుకుంటూ లగడపాటి చాలా కాలం పోరాడారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీమాంధ్ర కేంద్ర మంత్రులను, ఎంపిలను తమ చెప్పుచేతలలో పెట్టుకుంది. తను చేయాలనుకున్నది చేసేసింది. అయితే మొదటి నుంచి చెప్పినట్టే రాష్ట్రవిభజన జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న రాజగోపాల్ అన్నమాట ప్రకారమే రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. మళ్లీ ఆ తరువాత జరిగే సంఘటనలే ఆయన మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నట్లు తెలియజేస్తున్నాయి. లగడపాటి ఓ త్యాగమూర్తి అంటూ కీర్తిస్తూ కృష్ణా జిల్లాలో భారీ ప్లెక్సీలు, పోస్లర్లు వెలిశాయి. ఆ ప్లెకీలు, పోస్లర్లపైన లగడపాటిని ఉద్దేశించి “పోరాటమే ఊపిరిగా పోరుబాట పట్టావు. నీ సత్తా చూపావు. రాజకీయ త్యాగివై నిలిచావు. ఆరు కోట్ల ఆంధ్రులకు ఆరాధ్యనీయుడైనావు...ఇట్లు మిత్రుడు, వసంత కృష్ణప్రసాద్” అని ఉంది. విజయవాడ ప్రధాన కూడళ్లలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ వీటిని ఏర్పాటు చేశారు. కృష్ణప్రసాద్కు లగడపాటికి మంచి సాన్నిహిత్యం ఉంది. ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతో మంచి దిట్టగా లగడపాటికి పేరుంది. దాంతో ఈ ప్లెక్సీలు చర్చకు దారి తీశాయి. ఒక్క లగడపాటివే కాకుండా సీమాంధ్ర ఎంపీలతో కూడా అక్కడక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్ర విభజన జరుగుతుంటే ఏం చేయలేక చివరిక్షణం వరకు పదవుల్లో వేలాడిన వీరు త్యాగమూర్తులు ఎలా అవుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారి పోరాటంలో విజయం సాధించి, రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే త్యాగశీలురని గానీ, పోరాటయోధులని గానీ అనవచ్చు. ప్రజలు కూడా వారిని నెత్తిన పెట్టుకునే వారు. ఏమీ సాధించలేనివారిని త్యాగమూర్తుగా ఏలా గుర్తించగలం అని అడుగుతున్నారు. అసలే విభజనతో రగిలిపోతున్న జనానికి ఈ ప్లెక్సీలు ఎక్కడలేని కోపాన్ని తెప్పిస్తున్నాయి. కాంగ్రెస్ అన్నా, కాంగ్రెస్ నేతలన్నా జనం మండిపడుతున్నారు. ఈ ప్లెక్సీల వ్యవహారం అంతా లగడపాటి మళ్లీ రాజకీయ పునరాగమనం కోసమేనని పలువురు అంటున్నారు. -
బిల్లు తెచ్చిన తంటాభవితపై బెంగ
ఎన్నికలపై అయోమయం తెలంగాణ బిల్లు ఆమోద ఫలితం కాంగ్రెస్లో రాజీనామాల పర్వం టీడీపీ శ్రేణుల్లో అయోమయం వైఎస్సార్సీపీకి ‘సమైక్య’ బలం కేంద్రంలోని యూపీఏ సర్కార్ అనుకున్నంత పనిచేసింది.. తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా నిలువునా చీల్చింది.. ఈ చర్యపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ముందుకు వెళ్లడం ఎలా? రానున్న ఎన్నికలను ఎదుర్కోవడం ఎలా? అనే సంశయం కాంగ్రెస్, టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. సాక్షి, మచిలీపట్నం : రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదించడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొనేందుకు జిల్లాలోని కాంగ్రెస్, టీడీపీ నేతలు సిద్ధంగా లేరు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తిచేసే మిషతో మరో ఆరు నెలలపాటు అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనను అధికార పార్టీ తెరపైకి తెచ్చింది. అదే జరిగితే షెడ్యుల్ ప్రకారం లోక్సభ ఎన్నికలను నిర్వహించి, అసెంబ్లీ ఎన్నికలకు మరికొంత గడువు ఇచ్చే అవకాశం ఉందని జిల్లాలోని అధికార కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజాభిమానం తమకు అండగా ఉంటుందన్న ధీమా వ్యక్తం చేస్తోంది. అధికారులు సిద్ధం! ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమేనా? అనే ప్రశ్న ఎన్నికల కమిషన్, రాజకీయ పార్టీలు, ప్రజలను వెంటాడుతోంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుపుతామని ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తున్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మరోపక్క ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్రావు, ఎస్పీ జె.ప్రభాకరరావు ఇతర ముఖ్య అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ పలు పర్యాయాలు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి ఎన్నికలు సజావుగా నిర్వహించేలా సూచనలు చేశారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తుది జాబితా ఖరారు, ఎన్నికల బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెబుతున్నారు. ‘రిక్త హస్త’మేనా..! తొలి నుంచి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు అత్యుత్సాహం చూపడంతో జిల్లాలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్టేనని నేతలు కలవరపడుతున్నారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ సమైక్యవాదిగా వేసిన ఎత్తులు అనుకూలించలేదు. లోక్సభలో పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తనకు పరిస్థితి అనుకూలించకపోవడంతో రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించిన లగడపాటి ఎంతవరకు మాటపై నిలబడతారో వేచి చూడాల్సిందే. జిల్లాలో ఏకైక మంత్రి కొలుసు పార్థసారధి తాను సమైక్యవాదినేని చెబుతూనే పదవిని పట్టుకుని వేలాడుతూ వచ్చారు. ప్రస్తుత పరిస్థితిలో ఆయన సీఎం కిరణ్తో కలిసి తన పదవికి రాజీనామా చేసి రాజకీయ భవిష్యత్ కోసం వ్యూహాలు రచించే పనిలో పడ్డారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించి మరో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వారి రాజీనామాలు ఆమోదించాల్సి ఉంది. జిల్లాలో మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, డీవై దాసు తమ రాజకీయ భవితపై మేధోమథనం చేస్తున్నారు. పలువురు కీలక నేతలు సైతం ఇదే పార్టీలో ఉంటే తమ రాజకీయ భవితవ్యం ఇక ముగిసిపోయినట్టేననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేశారన్న అపవాదును మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో దాదాపు నూకలు చెల్లిపోయినట్టేనని, ఇటువంటి తరుణంలో ఎన్నికలను ఎదుర్కోవడం పార్టీకి ఇబ్బందేనని ఆ పార్టీ వర్గాలే ఆందోళన చెందుతున్నాయి. పారని ఎత్తులు.. పొడవని పొత్తులు రెండు కళ్ల సిద్ధాంతంతో రెండు ప్రాంతాల్లోను వేగం పుంజుకుంటుందనుకున్న సైకిల్ రెండు చక్రాలకు గాలిపోయే పరిస్థితి వచ్చిందని టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీకి కూడా ఇప్పుడు ఎన్నికల భయం వెంటాడుతోంది. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి తెలంగాణలో ఒకమాట, సీమాంధ్రలో మరోమాట చెబుతూ వచ్చిన చంద్రబాబు ఎత్తులు ఈసారి ఎన్నికల్లో బెడిసికొట్టే ప్రమాదం ఉందని ఆ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మోడీ ఇమేజ్ను చూసి బీజేపీతో పొత్తు పెట్టుకుని లబ్ధి పొందుదామనుకున్న టీడీపీకి పొత్తుల పొద్దు బెడిసికొట్టేలా ఉంది. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీల ఓట్లు పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్న తరుణంలో విభజనకు కాంగ్రెస్తో కుమ్మక్కైన బీజేపీతో చెలిమి మరింత ముంచుతుందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. టీడీపీ మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు లోక్సభలో గుండెపోటుకు గురికావడం, ముంబైలోని ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేయడంతో ఆయన వాణి జిల్లాలో వినిపించడానికి మరికొద్ది రోజులు పడుతుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావును ఇప్పటికే వర్గవిభేదాలు చుట్టుముట్టాయి. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు తన పదవికి రాజీనామా ప్రకటించారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు అంబటి శ్రీహరిప్రసాద్ (అవనిగడ్డ), శ్రీరాం తాతయ్య (జగ్గయ్యపేట), జయమంగళ వెంకటరమణ (కైకలూరు) తమ రాజకీయ భవిష్యత్పై మల్లగుల్లాలు పడుతున్నారు. పట్టు పెంచిన వైఎస్సార్సీపీ తొలి నుంచి తమ నినాదం సమైక్యమేనని తేటతెల్లం చేస్తూ వచ్చిన వైఎస్సార్సీపీ జిల్లాలో మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఓట్లు, సీట్లు గురించి ఆలోచించకుండా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్య చాంపియన్గా నిలిచారు. జగన్మోహన్రెడ్డి పిలుపుతో ఎప్పటికప్పుడు సమైక్య ఉద్యమాన్ని నడపడంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు వైఎస్ కుటుంబానికి అండగా ఉండేందుకు గతంలోనే టీడీపీ నుంచి కొడాలి నాని, కాంగ్రెస్ నుంచి పేర్ని నాని, జోగి రమేష్లు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అన్ని నియోజకవర్గాల్లోను సత్తా చాటుతామని వైఎస్సార్సీపీ శ్రేణులు ఉత్సాహంగా కదులుతున్నాయి. -
లగడపాటి రాజీనామాను ఆమోదించిన స్పీకర్
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన లోక్సభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను స్పీకర్ మీరాకుమార్ బుధవారం ఆమోదించారు. లగడపాటి రాజీనామా లేఖను స్పీకర్ సభలో చదివి వినిపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు మంగళవారం లోక్సభలో ఆమోదం పొందటంతో లగడపాటి తీవ్ర మనస్థాపం చెందారు. ఈ నేపథ్యంలో తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించారు. తన రాజీనామా లేఖను మంగళవారం ఆయన స్పీకర్ కు పంపారు. దాంతో బుధవారం ఉదయం స్పీకర్ మీరాకుమార్ లోక్ సభలో లగడపాటి రాజీనామా లేఖను చదవి సభ్యులకు వినిపించారు. -
చివరివరకూ పోరాటం చేశాం: లగడపాటి
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానన్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇకనుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచేందుకు చివరికంటా పోరాటం చేశామని ఆయన బుధవారిమిక్కడ అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు లోక్సభ ఆమోదం పొందింది కాబట్టి..ఇకపై తెలుగు ప్రజల ఐక్యత కోసం కృషి చేస్తానని లగడపాటి తెలిపారు. జరిగిందేదో జరిగిపోయింది కాబట్టి భావోద్వేగాలు, సెంటిమెంట్లను మరచి తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని ఆయన కోరారు. -
కాంగ్రెస్కు గుడ్బై.. సీమాంధ్రలో రాజీనామాల వెల్లువ
సాక్షి నెట్వర్క్: లోక్సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్లో రాజీనామాలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రులు మొదలు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పేస్తున్నారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజు, వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి పురందేశ్వరి తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు రాజకీయ సన్యాసం ప్రకటించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డిలు కూడా తమ పదవులకు, పార్టీకి గుడ్బై చెప్పేశారు. విశాఖ జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు పంచకర్ల రమేష్బాబు(పెందుర్తి), ముత్తంశెట్టి శ్రీనివాస్ (భీమిలి), చింతపూడి వెంకట్రామయ్య( గాజువాక), యూవీ రమణమూర్తి (యలమంచిలి)లు పదవులకు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేశారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు (గిద్దలూరు), డాక్టర్ ఆదిమూలపు సురేష్ (యర్రగొండపాలెం)లతో పాటు కొండపి నియోజకవర్గం జరుగుమల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.జయప్రసాదరావులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తమ పదవులకు రాజీనామా చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీకి రాజీనామా చేసినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. కృష్ణాజిల్లా గన్నవరం మాజీ శాసనసభ్యుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ను వదిలారు. చిత్తూరు శాసనసభ్యుడు సీకే బాబు అలియూస్ జయచంద్రారెడ్డి మంగళవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. కోర్టుకు వెళతాం: కావూరి సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై తాము సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్టు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు పేర్కొన్నారు. మరో కేంద్రమంత్రి జేడీ శీలం కాంగ్రెస్ అధ్యక్షురాలికి లేఖ రాశారు. లగడపాటి రాజకీయ సన్యాసం లోక్సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడంతో కలత చెంది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ బహిష్కృత విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మంగళవారం ప్రకటించారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. లోక్సభ సచివాలయానికి రాజీనామా లేఖను పంపానని, దాన్ని ఆమోదించుకునేందుకు బుధవారం లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను కలవనున్నట్లు చెప్పారు. -
లగడపాటికి భగత్ సింగ్కు పోలికా ?
విజయవాడ లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ను స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్తో పోల్చడం హాస్యాస్పందంగా ఉందని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లొండలో విలేకర్లతో మాట్లాడారు. ఆంగ్లేయుల బానితస్వంలో మగ్గుతున్న భారత దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పరితపించి భగత్ సింగ్ అశువులుబాసారని గుత్తా ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాంటి మహానియుడితో లగడపాటిని పోలుస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లును అడ్డుకునే పార్టీలకు పతనం తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో అడ్డుకుంటామని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఇటీవల ప్రకటించారు. ఆ క్రమంలో గురువారం లోక్సభకు బిల్లు వచ్చింది. ఈ నేపథ్యంలో సభ వెల్ లోకి సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎంపీ దూసుకొచ్చారు దాంతో ఆయనను అడ్డుకొనేందుకు కొంత మంది ఎంపీలు ప్రయత్నించారు. సీమాంధ్ర టీడీపీ ఎంపీని రక్షించేందుకు అక్కడకు చేరుకున్న లగడపాటిని కూడా అడ్డుకునేందుకు ఆ సదరు ఎంపీలు ప్రయత్నించారు. దాంతో లగడపాటి ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే ను స్ప్రే చేశారు. దాంతో లోక్సభలో తీవ్ర భయానక పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో సభలో లగడపాటి వ్యవహరించిన తీరు పట్ల సీమాంధ్ర ప్రజలు హర్షం ప్రకటించారు. దాంతో లగడపాటి ఆంధ్రప్రదేశ్ భగత్ సింగ్ అంటూ మీడియాలో ప్రచార హోరు మిన్నంటింది. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డిపై విధంగా స్పందించారు. -
కొండెక్కిన అభివృద్ధి!
గాంధీకొండ అభివృద్ధి హుళక్కేనా! కాగితాలకే పరిమితమైన నిధుల మంజూరు పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి చేసింది శూన్యమే! లగడపాటి హడావుడే ఎక్కువ సాక్షి, విజయవాడ : జిల్లాలో పర్యాటకాభివృద్ధి ఎక్కడే వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చిరంజీవి నగరంపై వరాలు వర్షం కురిపించారు. గత ఎన్నికల్లో నగరం నుంచి పీఆర్పీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నిక కావడంతో.. వారు చిరంజీవి ద్వారా నిధులు తీసుకొచ్చి పర్యాటక అభివృద్ధికి పాటుపడతారని ప్రజలు కూడా ఆశించారు. ఇప్పటి వరకు చిరంజీవి హామీలు అమలుకు నోచుకోలేదు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా కొండపల్లి సర్క్యూట్ ప్రాజెక్టు, గాంధీకొండకు నూతన శోభ, కూచిపూడి గ్రామాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చేందకు కేంద్ర పర్యాటక శాఖ నిధులు మంజూరు చేస్తోందంటూ హడావుడి చేశారు. ఆయన కూడా నిధులు రాబట్టలేకపోయారు. ప్రస్తుత యూపీఏ-2 ప్రభుత్వానికి చివర రోజులు కావడం... ఎంపీ లగడపాటి రాజగోపాల్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించడంతో పర్యాటకాభివృద్ధి సాధ్యమేనా.. అని ప్రజలు సంశయిస్తున్నారు. గాంధీకొండ అభివృద్ధి హుళక్కే! గాంధీకొండపై రూ.5 కోట్లతో బిర్లా ప్లానిటోరియం, ఆధునిక టెక్నాలజీతో రైలు, మ్యూజిక్ ఫౌంటెయిన్, వివిధ రకాల అందమైన చెట్లు, పిల్లలు ఆడుకునేందుకు సరికొత్త క్రీడాపరికరాలు, గాంధీ స్థూపానికి సొబగులు, పర్యాటకులను ఆకట్టుకునేలా గ్రీనరీ ఏర్పాటుచేస్తామని ప్రజాప్రతినిధులు ప్రకటించారు. అప్పటి కలెక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి కూడా గాంధీకొండ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. వివిధ శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. ఆయన బదిలీ తర్వాత ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. కేంద్రం వద్దనే ఫైల్ పెండింగ్! చిరంజీవి, లగడపాటి రాజగోపాల్ హామీల వరద కురిపించడంతో జిల్లా పర్యాటక శాఖ అధికారులు గాంధీకొండ అభివృద్ధికి ప్రాజెక్టు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపారు. ఈలోపు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం కావడంతో ఆ ఫైల్ కేంద్రం వద్ద పెండింగ్లో పడింది. పార్లమెంట్ సమావేశాలు పూర్తికాగానే ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో జిల్లాలో పర్యాటకాభివృద్ధికి నిధులు మంజూరు చేసే ఫైల్స్ క్లియర్ చేయడం సాధ్యపడకపోవచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో గాంధీ కొండ అభివృద్ధి కాగితాలకే పరిమితం అయింది. కొండపల్లి సర్క్యూట్ ప్రాజెక్టు తీరూ అంతే.. కొండపల్లి పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం సర్క్యూట్ ప్రాజెక్టు రూపొందించారు. ఈ ప్రాజెక్టు అమలుకు రూ.50 కోట్లు మంజూరు అవుతాయని, కొండపల్లిలో అభివృద్ధి పనులతోపాటు హస్తకళా వస్తువుల పరిశ్రమ ఏర్పాటు చేయాలని జిల్లా పర్యాటక శాఖ అధికారులు నిర్ణయించారు. పెడనలో చేనేత పరిశ్రమ, మంగినపూడి బీచ్, కూచిపూడి గ్రామం తదితర పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలని భావించారు. ఇందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. అయితే ఒక్క రూపాయి కూడా మంజూరు కాకపోవడంతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. -
రెండోరోజూ.. భగ్గుమన్న జిల్లా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సీమాంధ్ర నేతల వైఖరిపై తెలంగాణవాదులు రెండోరోజూ భగ్గుమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా పార్లమెంట్లో వ్యవహరించిన సీమాంధ్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రుల కమిటీ (జీఓఎం) సిఫారసుల మేరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన టీ బిల్లుపై చర్చను అడ్డుకోవడంపై నిరసస వ్యక్తం చేశారు. టీ బిల్లుపై బీజేపీ దాటవేసే ధోరణితో వ్యవహరించిందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయగా... బీజేపీ నేతలు ఖండించారు. ‘తెలంగాణ’కు కట్టుబడి ఉన్నామని కమలదళ నేతలు స్పష్టం చేశారు. నిరసనల హోరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును అడ్డుకోవాలని చూసిన సీమాంధ్ర ఎంపీల వైఖరిని ఎండగడుతూ జిల్లాలో శుక్రవారం తెలంగాణవాదులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో వివిధ పార్టీలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, న్యాయవాద జేఏసీలు ఆందోళనల్లో పాల్గొన్నాయి. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిజామాబాద్లో తెలంగాణ జాగృతి, పీడీఎస్యూల ఆధ్వర్యంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మను దహనం చేయగా.. బస్టాండ్ ఎదుట టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీజేపీ అగ్రనేతలు వెంకయ్యనాయుడు, అద్వానీల దిష్టిబొమ్మలను తగలబెట్టారు. కామారెడ్డి, భిక్కనూరు, నవీపేట, రెంజల్ మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో లగడపాటి దిష్టిబొమ్మలను అగ్నికి ఆహుతి చేశారు. లగడపాటిపై కేసు పెట్టాలి పార్లమెంట్లో తెలంగాణ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసిన లగడపాటి రాజగోపాల్ తదితరులపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాల ని న్యాయవాదులు డిమాండ్ చేశారు. నిజామాబాద్, బోధన్ కోర్టులలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ నెల 21 వరకు విధులు బహిష్కరించనున్నట్లు బోధన్ న్యాయవాదులు ప్రకటించా రు. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలంగాణవాదులు పేర్కొన్నారు. -
సస్పెన్షన్ ఎత్తి వేయండి: లగడపాటి, సబ్బం
తమపై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని విజయవాడు ఎంపీ లగడపాటి రాజగోపాల్, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను డిమాండ్ చేశారు. శుక్రవారం మీరాకుమార్కు ఆ ఇద్దరు ఎంపీలు ఈ మేరకు లేఖలు రాశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ లోక్సభ వెల్లోకి 100 మంది ఎంపీలు దూసుకొస్తే మమ్మల్ని మాత్రమే సస్పెండ్ చేశారని వారు ఆరోపించారు. ఇది పక్షపాత ధోరణి కాదా అని వారు రాసిన లేఖలో స్పీకర్ మీరా కుమార్ను ప్రశ్నించారు. -
అధిష్ఠానమే మాపై దాడి చేయించింది: లగడపాటి
-
పెప్పర్ ప్రభావం ఏ‘పాటి’
సాక్షి, విజయవాడ : గత ఏడాది ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో మహిళా ఉద్యోగులు తమ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే ఉపయోగించడం మొదలు పెట్టారు. మెట్రో నగరాల్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగులకు మాత్రమే పరిమితమయిన పెప్పర్ స్ప్రే గురువారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. లోక్సభలో తనపై దాడి చేస్తున్న తెలంగాణా ఎంపీల నుంచి తప్పించుకునేందుకు లగడపాటి పెప్పర్ స్ప్రే వాడారు. దీంతో లోక్సభలో కలకలం చెలరేగింది. దాని ఘాటుకు తట్టుకోలేక కొందరు ఆస్పత్రి పాలవ్వగా, ఎంపీలందరూ భయంతో బయటకు పరుగులు తీశారు. ఏంటీ పెప్పర్స్ప్రే... పెప్పర్ స్ప్రే ప్రాణాంతకమైంది కాదు. దీన్ని స్ప్రే చేయగానే వెంటనే కళ్లు మండుతాయి. కొద్ది సేపటి వరకూ కళ్లు తెరవలేము. శ్వాస ఇబ్బంది అవుతుంది. దాని ఘాటుకు తుమ్ములొస్తాయి. ముక్కు నుంచి నీరు కారుతుంది. దగ్గు వస్తుంది. స్ప్రే ఎంత దగ్గర నుంచి ఎంత మోతాదులో వాడతామనే దానిపై ప్రభావం ఆదార పడి ఉంటుంది. దీని పూర్తి ప్రభావం తగ్గడానికి ఆరగంట నుంచి గంట వరకూ సమయం పడుతుంది. ఒకసారి స్ప్రే చేయడం వల్ల కళ్లకు ఎటువంటి హాని ఉండదు. ఆస్తమా ఉన్న రోగులకు మాత్రమే కొంత ఇబ్బంది కరంగా ఉంటుంది. ఈ పెప్పర్ స్ప్రే చేతిలో ఇమిడిపోయే బాటిల్స్లో మార్కెట్ అందుబాటులో ఉంది. మహిళలు ఆకతాయిల నుంచి అత్మరక్షణ కోసం మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. -
అధిష్ఠానమే మాపై దాడి చేయించింది: లగడపాటి
పార్లమెంటులో జరిగిన సంఘటనపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానమే దీనికి కారణమన్నారు. వేరే పార్టీకి చెందిన ఎంపీని కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు.. వేరే రాష్ట్రానికి చెందినవాళ్లు దాడిచేసి కొడుతుంటే ఆయనను కాపాడేందుకే తాను వెల్ లోకి వెళ్లానని, అంతేతప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో కాదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం పురమాయింపుతో కొంతమంది ఎంపీలు తమపై దాడికి దిగారని, పిడిగుద్దులు గుద్దారని లగడపాటి చెప్పారు. ఆ సమయంలో ఆత్మరక్షణ కోసం, ఒకేచోట గుమిగూడినవారిని అక్కడి నుంచి చెదరగొట్టి, శాంతియుత పరిస్థితి నెలకొల్పేందుకే తాను పెప్పర్ స్ప్రే ఉపయోగించానని, అది కూడా ఆత్మరక్షణ కోసం తప్ప ఎవరినీ ఇబ్బందిపెట్టేందుకు కాదని ఆయన తెలిపారు. అయినా.. జరిగిన సంఘటనకు తాను ఆవేదన చెందుతున్నానని గురువారం నాడు మీడియాతో చెప్పారు. -
సంయమనం పాటించండి: కేసీఆర్
తెలంగాణపై ఆందోళన వద్దు: కేసీఆర్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటు గురించి ఆందోళ న అవసరం లేదని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆగదని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ వాదులంతా సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విషయంలో నిరసనలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలను ఇచ్చారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో పాస్ చేయించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం పట్టుదలతో ఉందని, స్వంతపార్టీ ఎంపీలే వ్యతిరేకంగా ఉండటం ఆ పార్టీకి తలనొప్పిగా మారిందన్నారు. లగడపాటి టార్గెట్ స్పీకర్! స్పీకర్ను లక్ష్యంగా చేసుకుని పెప్పర్ స్ప్రేను చల్లాలని ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రయత్నించారని, ఆయన ప్రయత్నాన్ని తెలంగాణ ప్రాంత సభ్యులు అడ్డుకున్నారని కేసీఆర్ తనను కలసిన తెలంగాణ జేఏసీ నేతలకు చెప్పారు. లోక్సభలో లగడపాటి పెప్పర్ స్ప్రేను ప్రయోగించడాన్ని ప్రస్తావిస్తూ.. స్పీకర్పై చల్లడం ద్వారా టీ బిల్లును ప్రవేశపెట్టడానికి వీల్లేకుండా చేయాలనేదే వారి ప్రయత్నమని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. తెలంగాణ సభ్యులు అప్రమత్తంగా ఉండటం వల్ల సాధ్యం కాలేదని అన్నారు. లోక్సభలో బిల్లు పెట్టడం ద్వారా ఇప్పటిదాకా అంతా అనుకున్నట్టుగానే జరిగిందని చెప్పారు. సీమాంధ్ర నేతల క్రూరత్వం ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలకే తె లుసునని, పార్లమెంటులో జరిగిన ఘటనలతో దేశమంతా అర్థమైందని వ్యాఖ్యానించారు. సీమాంధ్ర నేతలతో కలిసి ఉండలేరని అన్ని పార్టీల నేతలు అంటున్నారన్నారు. -
పార్లమెంట్లో కేంద్రమంత్రి బలరాంనాయక్కు అస్వస్థత
ఆందోళనకు గురైన జిల్లా ప్రజలు లగడపాటి తీరుపై ప్రజల ఆగ్రహం మహబూబాబాద్, న్యూస్లైన్ : కేంద్ర హోంశాఖ మంత్రి షిండే గురువారం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతుండగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ టి బిలు ్లను వ్యతిరేకిస్తూ పెప్పర్ స్ప్రేను ప్రయోగించారు. దీంతో పార్లమెంట్లో గం దరగోళ పరిస్థితి నెలకొంది. ఈ గ్యాస్ మూలంగా మానుకోట పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రి బలరాం నాయక్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మానుకోట పట్టణ ప్రజలు ఆందోళనకు గురయ్యూరు. లగడపాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఎన్నికల్లో అనర్హత వేటు వేయాల ని వారు డిమాండ్ చే శారు. మంత్రి త్వరగా కోలుకోవాలని ప్రజలు ప్రార్థించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు త్వరగా ఆమోదం పొందాలని ఆకాంక్షిస్తున్నారు. -
ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే: లగడపాటి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభలో పెప్పర్ స్ప్రే వాడిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాను చేసిన దాంట్లో ఎలాంటి తప్పూ లేదని సమర్థించుకున్నారు. ఆత్మరక్షణ కోసమే తాను పెప్పర్ స్ప్రే ప్రయోగించానని స్పష్టంచేశారు. గురువారం పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘సభ వెల్లో నిరసన తెలుపుతున్న టీడీపీ ఎంపీ వేణుగోపాల్రెడ్డిని కొందరు కాంగ్రెస్ ఎంపీలు చుట్టుముట్టారు. ఆయన్ను రక్షించడానికి మరోవైపు నుంచి నేను అక్కడికి దూసుకెళ్లాను. అయితే వారు నాపై దాడి చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆత్మరక్షణార్థం వారిపై పెప్పర్ స్ప్రే కొట్టాను’’ అని లగడపాటి అన్నారు. ఇప్పటికే తనపై ఎన్నోమార్లు దాడులు జరిగాయని, అయినా ఏనాడూ గన్మెన్లను పెట్టుకోలేదని చెప్పారు. తనకు తీవ్ర ముప్పు ఉన్న దృష్ట్యా తన జేబులో ఎప్పుడూ పెప్పర్ స్ప్రే పెట్టుకుంటానని ఆయన అన్నారు. అది నిజమేనని పక్కనే ఉన్న సీమాంధ్ర ఎంపీలు చెప్పుకొచ్చారు. చేసిందంతా చేసి కాంగ్రెస్ నిందలేస్తోంది: ఆస్తమా, ఇతర శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడే సీనియర్ సభ్యులున్న సభలో వారికి హానికలిగించే పెప్పర్ స్ప్రే వాడడం సమంజసమేనా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘తమపై దాడి, అత్యాచారం జరుగుతుందని భావించినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి మహిళలు పెప్పర్ స్ప్రే వాడుతుంటారు. ఇక్కడ నాపై దాడి జరిగింది. అందుకే ఉపయోగించాను’’ అని లగడపాటి అన్నారు. ప్రతిపక్షాల మద్దతుతో నడుస్తున్న చేతకాని సర్కారిది: లోక్సభలో తెలంగాణ బిల్లును స్పీకర్ ప్రవేశపెట్టిన తీరు పక్షపాత ధోరణిని పట్టిచూపుతోందని లగడపాటి అన్నారు. ఎవరి అంగీకారం లేకుండానే ఎవరూ ఎస్, నో అని చెప్పకుండానే సభలో బిల్లుపెట్టామనడాన్ని ప్రతిపక్షాలు సైతం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ భవిష్యత్తు కోసమే స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గురువారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మరోసారి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల మద్దతుతో నడుస్తున్న సంఖ్యా బలంలేని, చేతకాని ప్రభుత్వం ఏకపక్షంగా ఇలా వ్యవహరిస్తోందన్నారు. బిల్లు ప్రవేశపెడుతున్న సమయం లో తాము నిరసన తెలిపేందుకు వెల్లోకి వెళ్లినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే తెలంగాణతోపాటు మిగిలిన రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు వంద మంది వరకు వెల్లోకి దూసుకొచ్చి తమపై దాడికి యత్నించారన్నారు. అడ్డుకుంటే వెలేయాలని గతంలో అన్న లగడపాటి! రాజకీయాల్లో ఇంతకు మించిన వైచిత్రి ఉండదేమో! లోక్సభలో మిరియాల ద్రావకం చల్లి అంతులేని గందరగోళానికి కారణమైన విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్, నిజానికి పార్లమెంటులో సభ్యులు అమర్యాదకరంగా ప్రవర్తించకుండా నియంత్రించాలంటూ ఒకప్పుడు వాదించారు! అంతేకాదు, ఆ మేరకు 2009 జూలై 31న లోక్సభలో ప్రైవేట్ బిల్లును విజయవంతంగా ప్రవేశపెట్టారాయన!! సభా కార్యకలాపాలను అడ్డుకునే వారికి జరిమానాలు విధించాలని కూడా ఆయన ప్రతిపాదించారు. ఒకే సెషన్లో మూడుసార్లు సభా కార్యకలాపాలను అడ్డుకుంటే ఆ ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని అందులో లగడపాటి ప్రతిపాదించారు! -
'పార్లమెంట్ నుంచి లగడపాటిని డిబార్ చేయాలి'
న్యూఢిల్లీ: లోకసభలో పెప్పర్ స్పే చేసి దుమారం సృష్టించిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ నుంచి లగడపాటిని డిబార్ చేయాలని జైరాం వ్యాఖ్యానించారు. లగడపాటి ప్రవర్తన పార్లమెంట్ సభ్యులందరి ప్రతిష్టను దిగజార్చిందన్నారు. పార్లమెంట్ ప్రతిష్టను మంటగలిపిన లగడపాటిని ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరణ వేటు వేయాలని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకించడానికి రాజగోపాల్ హక్కు ఉంది. అతని హక్కును గౌరవిస్తాను.. అతను నిరసన తెలిపే హక్కుంది. కాని ఆయన ప్రవర్తించిన తీరు పార్లమెంట్ విలువలను దిగజార్చేలా ఉన్నాయని అన్నారు. లోకసభలో పెప్పర్ స్పే ఘటన జరగడానికి 10 నిమిషాల ముందు రాజగోపాల్ తో మాట్లాడాను అని జైరాం తెలిపారు. చట్టాలను అనుసరించి అతనిపై ఏ స్థాయిలో కఠిన చర్య తీసుకోవాలో నిర్ణయిస్తాం అని ఆయన అన్నారు. -
ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే వాడా: రాజగోపాల్
తాను ఆత్మరక్షణ కోసం మాత్రమే పెప్పర్ స్ప్రేను ఉపయోగించానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ ఎంపీపై సొంత పార్టీ వాళ్లతో పాటు ఇతరులు కూడా దాడి చేశారని, అప్పుడు మాత్రమే తాను వెల్ లోకి దూసుకెళ్లానని ఆయన తెలిపారు. మార్షల్స్ అదుపులోకి తీసుకుని, తిరిగి వదిలసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే కాక, ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా తమపై పాశవికంగా దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో తమ ప్రాణరక్షణ కోసం మాత్రమే తాను పెప్పర్ స్ప్రే ఉపయోగించానని, అంతేతప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కాదని రాజగోపాల్ చెప్పారు. -
చాకు లేదు....విరిగిన మైక్ ముక్కే..
-
సభలో అసలేం జరిగింది?
లోక్సభలో యుద్ధవాతావరణం మధ్య మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం బిల్లు ప్రవేశపెట్టేందుకు స్పీకర్ మూజువాణి పద్ధతిలో అనుమతి తీసుకున్నారు. సభ్యుల ఆందోళనల మధ్యే షిండే పొడిపొడిగా బిల్లును చదివారు. ఆ తతంగం క్షణాల్లోనే ముగిసింది. ఇంతలో స్పీకర్ పోడియం వద్ద ఒక్కసారిగా యుద్ధవాతావరణం వాతావరణం నెలకొంది. స్పీకర్ వద్ద మైకులను తొలగించేందుకు సీమాంధ్ర ఎంపీలు ప్రయత్నించగా, వారిని అడ్డుకునేందుకు తెలంగాణ ఎంపీలు కలబడ్డారు. ఇరు ప్రాంత ఎంపీల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ నెలకొంది. ఈలోగా లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లారు. ఎంపీలు, మీడియా ప్రతినిధులు ఉక్కిరి బిక్కిరై దగ్గుతూ పరుగులు తీశారు. లోక్సభ సెక్రటరీ బల్లపై ఉన్న ఫైళ్లను మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చిందరవందరగా చేశారు. తెలంగాణ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలపై పిడిగుద్దులు కురిపించారు. వెంటనే స్పీకర్ మీరాకుమార్ సభను వాయిదా వేశారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినట్టేనని లోక్సభ అధికారులు తెలిపారు. లోక్సభలో ఘర్షణకు దిగిన ఎంపీలపై చర్యలు ఉంటాయని ఆ తర్వాత హోం మంత్రి షిండే తెలిపారు. తప్పులు చేసిన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కపిల్ సిబల్ అన్నారు. -
చాకు లేదు....విరిగిన మైక్ ముక్కే..
న్యూఢిల్లీ : లోక్సభలో తనపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని నర్సరావు పేట టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సెక్రటరీ జనరల్ వద్ద ఉన్న మైక్ లాక్కునానే కానీ తన వద్ద చాకు లేదని తెలిపారు. విరిగిన మైక్ ముక్కే తన వద్ద ఉందన్నారు. నిరసన తెలుపుతున్న తనపై కాంగ్రెస్ ఎంపీలు రాజ్ బబ్బర్, అంజన్ కుమార్ యాదవ్ అడ్డుకున్నారని మోదుగుల అన్నారు. మార్షల్స్కు బదులు కాంగ్రెస్ ఎంపీలే తనపై దాడి చేశారని ఆయన వ్యాఖ్యానించారు. -
కత్తితో లోక్సభకు వచ్చిన ఎంపీ మోదుగుల
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంతో సీమాంధ్ర ఎంపీలు బీభత్సం సృష్టించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మిరియాల పొడిని స్ప్రే చేశారు. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సెక్రటరీ జనరల్ వద్ద మైకులు విరగ్గొట్టారు. స్పీకర్ టేబుల్పై అద్దాన్ని పగులగొట్టి దాంతో పొడుచుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఆయన చాకుతో లోక్సభకు వచ్చినట్టు గుర్తించారు. తెల్లంగాణ బిల్లును నిరసిస్తూ సీమాంధ్ర ఎంపీలు బల్లలపైకి ఎక్కి, కాగితాలు చించేసి విసిరేశారు. వీరిని తెలంగాణ ఎంపీలు అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఇరు ప్రాంతాల నేతలు బాహాబాహికి దిగారు. సీమాంధ్ర ఎంపీల బీభత్సంతో పార్లమెంట్ ఉభయ సభలు కురుక్షేత్రాన్ని తలపించింది. లగడపాటి, మోదుగులను బహిష్కరించే యోచనలో స్పీకర్ కార్యాలయం ఉన్నట్టు సమాచారం. వీరిద్దరినీ అరెస్ట్ చేసే అవకాశముందంటున్నారు. -
ముగ్గురు ఎంపీలను అస్ప్రతికి తరలింపు
-
లోక్సభలో మిరియాల పొడి స్ప్రే చేసిన లగడపాటి
-
దాడి చేస్తుంటే...ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే
న్యూఢిల్లీ : ఆత్మరక్షణ కోసమే లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్పే చేశారని ఎంపీ హర్షకుమార్ తెలిపారు. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై దాడి చేస్తూంటే తాము అడ్డుకున్నామన్నారు. ఈ సందర్భంగా లగడపాటిపౌ దాడికి యత్నించిన సమయంలో ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్పే ఉపయోగించారని హర్షకుమార్ అన్నారు. తమ దగ్గర ఉన్న ఆయుధం అదొక్కటేనని... ప్రజల కోసమే తాము అలా చేశామని ఆయన పేర్కొన్నారు. లోక్సభ విజువల్స్ బయటపెట్టాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. మరోవైపు లగడపాటి పెప్పర్ స్పే చేయటంతో పలువురు ఎంపీలకు దగ్గు, కళ్ల నుంచి నీళ్ళు రావటంతో భయంతో బయటకు పరుగులు తీశారు. అస్వస్థతకు గురైన ఎంపీలను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. -
లోకసభలో మిరియాల పొడి స్పే చేసిన లగడపాటి
విజయవాడ: విభజన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించారు. నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలకలం రేపారు. సభలో మిరియాల పొడి స్ప్రే చేశారు. దీంతో ఒక్కసారిగా సభలో అయోమయం నెలకొంది. మంటలు వస్తాయనే భయంతో సభ్యులు బయటకు పరుగులు తీశారు. కళ్లలోంచి నీళ్లు, దగ్గు రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయారు. అక్కడితో ఆగకుండా కంప్యూటర్ను లగడపాటి ధ్వంసం చేశారు. పెప్పర్ స్ప్రే తో ఇబ్బందులకు గురైన ఎంపీలను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. సభలో పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటిని అరెస్ట్ చేసే అవకాశముందని చెబుతున్నారు. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మైకులు విరిచేశారు. ఆయనను తెలంగాణ టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్ అడ్డుకునే యత్నం చేశారు. ఇరుప్రాంతాల నేతలు బాహాబాహికి దిగారు. -
'రాష్ట్రాన్ని విడదీయటం ఎవరివల్లాకాదు'
హైదరాబాద్: తెలంగాణ బిల్లును మొదట రాజ్యసభలో పెట్టడం సరికాదని లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే లోక్సభలోనే బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విడదీయటం ఎవరివల్ల కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజీనామా చేయవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు లగడపాటి తెలిపారు. -
'సీఎంను మార్చే అవకాశం లేదు'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇప్పట్లో మార్చే అవకాశం లేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. క్యాంప్ ఆఫీసులో శనివారం సాయంత్రం ఆయన సీఎంను కలిశారు. కిరణ్ కుమార్ రెడ్డిని మార్చే అవకాశం ఉంటే ఆరు నెలల క్రితమే మార్చే వారని లగడపాటి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం మార్చులు చేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ముందుకు రావడం కష్టమేనని చెప్పారు. పార్లమెంట్కు రాకుండా అడ్డుకుంటామని లగడపాటి అన్నారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును యధాతథంగా పార్లమెంట్లో ప్రవేశపెడితే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని కిరణ్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా బిల్లులో సవరణలు చేయకుండా కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో లగడపాటి పైవిధంగా స్పందించారు. -
'పార్లమెంట్లో కబడ్డీ ఆడుకుంటాం'
విజయవాడ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన రాజీనామా వ్యవహారంపై ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కిరణ్ తన నిర్ణయాన్ని ఈనెల 21 వరకూ వేచి చూడాలని చెప్పామన్నారు. ఆ తర్వాతే శాసనసభను రద్దు చేయాలని సీఎంకు వివరిస్తామని లగడపాటి అన్నారు. ముఖ్యమంత్రిని గుడ్డిగా నమ్మినవారికి న్యాయం చేయాల్సి బాధ్యత కూడా ఆయనపైనే ఉందని లగడపాటి అన్నారు. రాష్ట్రం విడిపోకుండా కిరణ్ ఏం చేసిన ఆయనతోనే ఉంటానని స్పష్టం చేశారు. కేంద్రం సీమాంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని...ప్రతికారం తీర్చుకునేందుకు కేంద్రమంత్రులు బిల్లును అడ్డుకోవాలన్నారు. తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు... వెల్లోకి కేంద్రమంత్రులు ప్రవేశిస్తే బిల్లు ఆగిపోతుందన్నారు. తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి అన్ని రకాల వ్యూహాలతో ముందుకు వెళుతున్నామని లగడపాటి తెలిపారు. పార్లమెంట్లో కబడ్డీ ఆడుకుంటామని ఆయన తెలిపారు. ఏం చేసి అయినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని అన్నారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును కేబినెట్ ఆమోదించటం దురదృష్టకరమన్నారు. ఆదివారం జరగబోయే సమైక్య రన్లో ప్రజలంతా పాల్గొనే సమైక్యవేడి ఢిల్లీ తాకేలా చేయాలని పిలుపునిచ్చారు. -
దీక్ష చేసినా...వేషాలు వేసినా విభజన తథ్యం
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష చేసినా......లగడపాటి రాజగోపాల్ ఎన్ని వేషాలు వేసినా రాష్ట్ర విభజన తథ్యమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఢిల్లీకి చేరిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత నేతలు కూడా ఢిల్లీ బాటపట్టారు. ఈ సందర్భంగా హస్తిన చేరుకున్న గండ్ర అక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కిరణ్, లగడపాటి దగ్గర ఎలాంటి అస్త్రాలు లేవని అన్నారు. కాగా అవసరం అయినప్పుడు చివరి బ్రహ్మస్త్రాన్ని వాడతామని లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అసెంబ్లీలో చర్చ ముగించుకుని రాష్ట్రపతికి చేరుతున్న తరుణంలో ఉభయ ప్రాంతాల నేతలు ఢిల్లీలో మోహరించారు. తెలుగుదేశం, కాంగ్రెస్లకు చెందిన ఇరు ప్రాంతాల నేతలు వేర్వేరుగా హస్తినకు చేరుకుంటున్నారు. 5 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావే శాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండడంతో దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించేందుకు ఉభయ ప్రాంతాల నేతలు సిద్ధమవుతున్నారు. -
'అవసరమైనప్పుడు చివరి బ్రహ్మస్త్రం'
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపేందుకు తమవద్ద బ్రహ్మాస్త్రాలు చాలా ఉన్నాయని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి వ్యాఖ్యానించారు. అవసరం అయినప్పుడు చివరి బ్రహ్మస్తాన్ని వాడతామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజన జరగదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అసలు బిల్లును పంపకుండా నకిలీ బిల్లును అసెంబ్లీకి పంపారని లగడపాటి ఆరోపించారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు పార్లమెంట్లో చర్చకు రాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రాన్ని విభజించవద్దని కోరతామని లగడపాటి తెలిపారు. -
లక్ష మందితో సమైక్య పరుగు
కోటగుమ్మం(రాజమండ్రి), న్యూస్లైన్ : జిల్లాలో లక్ష మందితో ‘సమైక్య 5కే రన్’ను ఏర్పాటు చేస్తున్నట్టు విజయవాడ ఎంపీ లగడపాటి రాజ్గోపాల్ తెలిపారు. శనివారం స్థానిక ఎన్జీఓ హోంలో ఉద్యోగ జేఏసీ నాయకులతోను, విద్యార్థి సంఘాలతోను, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, న్యాయవాదుల జేఏసీ, మున్సిపల్ జేఏసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సమైక్య 5కే రన్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో లక్ష మందితో కాకినాడ, అమలాపురం, రాజమండ్రిల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. రాజమండ్రిలో సుబ్రహ్మణ్య మైదానం నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు, అక్కడి నుంచి తిరిగి సుబ్రహ్మణ్య మైదానానికి చేరుకుంటుందని వివరించారు. ఎన్జీఓ జేఏసీ నాయకులు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు, వాకర్స్, మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదుల జేఏసీ తదితర అన్ని సంఘాల వారు దీనిని విజయవంతం చేయాలన్నారు. తద్వారా సమైక్యాంధ్ర సెగ కేంద్రానికి తాకేలా చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎన్జీఓ జేఏసీ అధ్యక్షుడు గెద్దాడ హరిబాబు, విద్యుత్ ఉద్యోగుల తరఫున పద్మనాభం, నర్శింహారావు, విద్యార్థి సంఘాల తరఫున అర్షద్, మున్సిపల్ జేఏసీ తరఫున శ్రీనివాసరావు, రమణారావు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఈనెల 9న ‘సమైక్య’పరుగు
సాక్షి, ఏలూరు :రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా జై సమైక్యాంధ్ర రన్ను నిర్వహిస్తున్నట్లు విజయవాడ ఎంపీ, రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. శనివారం సాయంత్రం ఏలూరు రెవెన్యూ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఏలూరు నగరంలోనూ జై సమైక్యాంధ్ర రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దాదాపు లక్ష మందితో స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి ఇండోర్స్టేడియం వరకూ 3 కిలోమీటర్ల సమైక్యాంధ్ర రన్ జరపనున్నట్లు ఆయన వివరించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం చివరి వరకూ అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు. సమైక్య ఉద్యమంలో ఉద్యోగులు, మీడియా పాత్రను లగడపాటి ప్రశంసించారు. నిరుత్సాహ పడి పోరాటాన్ని ఆపాల్సిన అవసరం లేదని, ఈ నెల 21న విజయోత్సవం చేసుకోవచ్చని రాష్ట్రం ఖచ్చితంగా విడిపోదని అన్నారు. 2004లో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నానని, అనివార్య కారణాల వల్ల విజయవాడ నుంచి పోటీ చేశానని గుర్తుచేశారు. ఇక ముందు కూడా విజయవాడ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ తన సీటు వేరొకరికి ఇచ్చినా రాష్ట్రం సమైక్యంగా ఉంచితే వారికి సహకరిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఎల్.సాగర్, జిల్లా కార్యదర్శి టి.యోగానందం, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బడేటి వెంకటరామయ్య, ఫ్లాష్ సంస్థ నిర్వాహకుడు యర్రంశెట్టి శ్రీనివాస్, ఏపీఎన్జీ సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, కె.రమేష్కుమార్ పాల్గొన్నారు. -
కొత్త పార్టీ ఏర్పాటుకు సమయం లేదు: లగడపాటి
సమైక్యాంధ్రకు మద్దతుగా త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. శనివారం రాజమండ్రి వచ్చిన రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. సాధారణ ఎన్నికలు దూసుకువస్తున్న తరుణంలో కొత్త పార్టీలు వచ్చేందుకు సమయం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీలతోనే రాష్ట్ర విభజనను అడ్డుకుంటామన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 9న సీమాంధ్ర ప్రధాన పట్టణాలలో నిర్వహించనున్న 2కే రన్ విజయవంతం చేయాలని సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన దృష్ట్యా సీమాంధ్రలో కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందని ఇటీవల ఊహగానాలు ఊపందుకున్నాయి. అదికాక టి.బిల్లు తప్పుల తడక అని ఈ నేపథ్యంలో ఆ బిల్లును తిప్పి రాష్ట్రపతికి పంపాలని కిరణ్ కుమారు రెడ్డి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు ఇచ్చారు. దాంతో టి.బిల్లును రాష్ట్రపతికి పంపుతూ అసెంబ్లీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దాంతో విలేకర్లు రాజగోపాల్ను ప్రశ్నించినప్పుడు ఆయనపై విధంగా స్పందించారు. -
రాష్ట్రాన్ని ఏ శక్తి విడదీయలేదు: లగడపాటి
విజయనగరం: రాష్ట్రాన్ని ఏ శక్తి విడదీయలేదు అని లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా.. రాజకీయాల్లో కూడా ఉండను అని లగడపాటి స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు విషయంలో అసెంబ్లీలో జరిగిందే పార్లమెంటులోనూ జరుగుతుంది ఆయన జోస్యం చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఫిబ్రవరి 9న సీమాంధ్రలోని ప్రతి జిల్లాలో లక్ష మందితో 5 కి.మీ.సమైక్య రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని లగడపాటి తెలిపారు. ఫిబ్రవరి 9న నిర్వహించే సమైక్య రన్ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలిరావాలని లగడపాటి పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
ఆపేందుకు చాలా అస్త్రాలున్నాయి
పార్లమెంటులో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఆపేందుకు తమ వద్ద చాలా అస్త్రాలున్నాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా బిల్లును ఆమోదింపజేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ 15 రోజుల పాటు రాజకీయ పార్టీలన్నింటినీ ప్రజలు పరుగులు పెట్టించాలని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్న నమ్మకం ఇప్పటికీ తమకుందని, బీహార్ విభజనతో ఆంధ్రప్రదేశ్ విభజనను పోల్చి చూడకూడదని లగడపాటి తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలందరూ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక్కటవ్వడం చాలా హర్షణీయమని రాజగోపాల్ అన్నారు. -
జేసీ కాలం చెల్లిన మెడిసిన్: మధు యాష్కీ
న్యూఢిల్లీ: సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ నేతలపై నిజమాబాద్ ఎంపీ మధుయాష్కీ భగ్గుమన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి లాంటివారు కాలం చెల్లిన (ఎక్స్ పైరీ) మెడిసిన్ లాంటివారు అని యాష్కీ వ్యాఖ్యానించారు. ఇక అధిష్టానం చుట్టూ తిరిగినా రాజ్యసభ టికెట్ రాకపోవడంతో ఎంపీ లగడపాటి రాజగోపాల్ లాంటివాళ్లు కాంగ్రెస్ పనైపోయిందని అనడంపై ఆయన తప్పుపట్టారు. జేసీ, లగడపాటిలాంటి వారు కాంగ్రెస్ను ఏమీ చేయలేరు అని ఆయన అన్నారు. జేసీ నమ్మి టికెట్ ఇస్తే ట్రావెల్స్ పెట్టి ప్రజల ప్రాణం తీస్తున్నారు అని తీవ్రమైన ఆరోపణలు చేశారు. సమైక్యం కోసం రాజీనామా చేశామని చెప్పుకుంటున్న నేతలు రాజ్యసభ సీట్లు ఎందుకు అడుగుతున్నారో సీమాంధ్ర ప్రజలు గమనించాలి ఎంపీ మధుయాష్కీ అన్నారు. -
సమైక్యవాదులు కాకపోతే ఎమ్మెల్యేలే ఓడిస్తారు
రాజ్యసభ ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు సమైక్యవాదులు కాకపోతే.. వారిని ఆ పార్టీల ఎమ్మెల్యేలే ఓడిస్తారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు జాతిని ఎవరూ విడదీయలేరని, తనకు రాజకీయం కంటే రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని రాజగోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అన్ని క్లాజులపై ఓటింగ్ పెట్టి సభలో బిల్లును ఓడిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఏర్పడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
టీ బిల్లు ఓడిస్తాం... సమైక్యాంధ్ర సాధిస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘‘అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ బిల్లుపై చర్చకు అదనపు గడువు అడిగాం. బిల్లును ఓడిస్తాం. అలాగే క్లాజుల వారీగా చర్చించి ఓటింగ్ జరుపుతాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అన్ని క్లాజులపై ఓటింగ్ పెట్టి ఓడిస్తాం. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఏర్పడదు’’ అని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉద్ఘాటించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా సాగింది. ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి.అశోక్బాబు అధ్యక్షోపన్యాసం చేస్తూ... తొలిసారిగా ప్రజాప్రతినిధులను సభకు ఆహ్వానించామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రాణత్యాగాలకైనా సిద్ధమని చెప్పారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ అహంకారంతో రూపొందించిన విభజన బిల్లును అసెంబ్లీ, పార్లమెంట్ల్లో ఓడించి కనువిప్పు కలిగించాలని రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు. ఇందుకు జెండాలు, ఎజెండాలు పక్కకు పెట్టి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ...అవిశ్వాసం ప్రతిపాదన తీసుకొచ్చి సత్తా చూపాం. అది కేవలం ట్రైలర్ మాత్రమే, బిల్లు పార్లమెంటుకు వచ్చిన తరువాత అసలు సినిమా ఉంటుంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే సమైక్యవాది. టి.బిల్లుపై ఓటింగ్కు ఎవరైనా మొహం చాటేస్తే ‘కెవ్వు కేకే.. అంటూ హెచ్చరించారు. ‘పార్లమెంటులో మేము ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితే ప్రభుత్వమే ఉండదు. అయినా అసెంబ్లీలో బిల్లును ఓడించడం ద్వారా తెలంగాణను అడ్డుకుంటాం’అని ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ..పార్లమెంటుకు బిల్లు వస్తే ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు అని అన్నారు. మంత్రులు టీజీ వెంకటేశ్, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్రెడ్డి, వట్టి వసంతకుమార్, కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఓడించి తిరిగి పంపే బృహత్తర బాధ్యత ప్రతి ఎమ్మెల్యేపై ఉందని చెప్పారు. 1972లో ఇందిరాగాంధీ దేశాన్ని ముక్కలు చేయవద్దని అన్ని ప్రాంతాలు కలిసి సాగాలని చెప్పగా, ఇప్పుడు సోనియాగాంధీ విభ జిస్తానంటున్నారని టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప విమర్శించారు. ధర్నాలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వి.శ్రీనివాస్, ఉగ్ర నరసింహారెడ్డి, నాగేశ్వర్రావు, దేవినేని ఉమా, దాసరి బాలవర్ధన్ రావు, శివరామరాజు, శ్రీరాం తాతయ్య, గాదె వెంకటరెడ్డి, పయ్యావుల కేశవ్, ఎమ్మె ల్సీ నన్నపనేని రాజకుమారి, బీఏసీ చైర్మన్ కేఈ కృష్ణమూర్తి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతిలు ప్రసంగించగా, వెంకటరామయ్య, రమేష్, ధర్మాన ప్రసాదరావు, చిక్కాల రామచంద్రరావు, లింగారెడ్డి, వెంకటరెడ్డి తదితరులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. లగడపాటిపై దాడి ధర్నా సందర్భంగా ఎంపీ లగడపాటి రాజ్గోపాల్పై తెలంగాణవాదులు దాడి చేశారు. వేదికపై ప్రసంగం ముగించి వెళ్లిపోయేందుకు సన్నద్ధం అవుతుండగా తెలంగాణ యువసేన (టీవైఎస్) కార్యకర్తలు లగడపాటి కాళ్లు పట్టుకొని లాగడంతో వేదిక పైనుంచి కిందికి పడిపోయారు. దాడిచేసిన వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించగా వారికి ముసు గులు వేసి తీసుకెళ్లారు. టీవైఎస్ కార్యకర్తలు ముగ్గురు, ఒక కానిస్టేబుల్, మరో వ్యక్తి జై తెలంగాణ నినాదాలు చేశారు. మరోవైపు ఉద్యోగులు ఏర్పాటుచేసిన సభ ఆద్యంతం కాంగ్రెస్, టీడీపీల ఉమ్మడి సభలా సాగిం ది. సభకు అధ్యక్షత వహించిన అశోక్బాబు.. కాంగ్రెస్, టీడీపీ ప్రజా ప్రతినిధులనే వేదికపైకి ఆహ్వానించి ప్రసంగించేలా చేశారు. -
అప్పుడే మాట్లాడొద్దని సీఎంకు చెప్పా: లగడపాటి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అసెంబ్లీ ప్రాంగణంలో కలిశారు. తెలంగాణ విషయమై అప్పుడే ఏమీ మాట్లాడవద్దని తాను ముఖ్యమంత్రికి చెప్పినట్లు లగడపాటి ఆ తర్వాత విలేకరులకు తెలిపారు. తెలంగాణ బిల్లుపై చర్చకు పొడిగింపు వస్తుందా, లేదా అనే విషయం ఈరోజు సాయంత్రం 4 గంటలకల్లా తెలుస్తుందని, పొడిగించాల్సిన గడువు వారమా, రెండు వారాలా అన్న మీమాంస మాత్రమే ఇప్పుడు నడుస్తోందని లగడపాటి అన్నారు. ముందు ఒక వారం, తర్వాత ఇంకోవారం పొడిగించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పొడిగింపు రాకుంటే.. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభించాలనిని కోరినట్లు రాజగోపాల్ తెలిపారు. -
లగడపాటిని స్టేజ్ మీదనుంచి లాగేసిన తెలంగాణవాదులు
హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్కు వద్ద ఏపీ ఎన్జీవోలు నిర్వహిస్తున్న మహాధర్నా వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతుండగా, కొందరు తెలంగాణ వాదులు ప్రవేశించి ఆయనను స్టేజి మీద నుంచి కిందకు లాగేశారు. దీంతో అక్కడే భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు జోక్యం చేసుకున్నారు. తెలంగాణ యువశక్తి సంస్థకు చెందిన ముగ్గురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు. అంతకుముందు మహాధర్నా సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ధర్నా ప్రాంతమైన ఇందిరాపార్కు చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏపీఎస్పీకి చెందిన 20 దళాలు, సీఆర్పీఎఫ్ కంపెనీ ఒకటి, ఆర్ఏఎఫ్ కంపెనీ ఒకటి, స్వాట్ దళాలు 6, 50 మంది ఎస్ఐలు, 15 మంది సీఐలు, 10 మంది డీఎస్పీలు, 100 మంది మహిళా పోలీసులను అక్కడ మోహరించారు. -
ఎంపీ పాస్తో ఏఐసీసీ భేటీకి వచ్చా: లగడపాటి
కాంగ్రెస్ పార్టీ తనకు పాస్ మంజూరు చేయకపోయినా తాను ఎంపీ పాస్పై ఏఐసీసీ సమావేశాలకు వచ్చానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అందులో భాగంగా లగడపాటి సమైక్యాంధ్ర ప్లకార్డులను ప్రదర్శించి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. దాంతో లగడపాటికి పోటీగా తెలంగాణ ప్రాంతా నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు తెలంగాణ ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయిప్రతాప్, సబ్బం హరి, హర్షకుమార్లకు పాసులు నిరాకరించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఈ సమావేశాల్లో సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించవచ్చనే అనుమానంతో వారికి అనుమతి నిరాకరించారు. అదికాక ఏఐసీసీ సమావేశాలకు హాజరుకావద్దని సోనియా రాజకీయ వ్యవహరాల కార్యదర్శి అహ్మద్ పటేల్ స్వయంగా ఫోన్ చేసి లగడపాటికి వెల్లడించారని సమాచారం. -
ఎట్టకేలకు సీమాంధ్ర ఎంపీలకు ఆహ్వానం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు ఏఐసీసీ సమావేశాలకు ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు ఆహ్వానం పంపింది. దాంతో ఏఐసీసీ సమావేశాలకు ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్ హాజరయ్యారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయిప్రతాప్, సబ్బం హరి, హర్షకుమార్లకు పాసులు నిరాకరించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సమావేశాల్లో సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించవచ్చనే అనుమానంతో వారికి అనుమతి నిరాకరించినట్లు సమాచారం. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తటంతో కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గింది. కాగా ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హాజరు అయ్యారు. -
ఇంతకీ స్పాన్సర్స్ ఎవరు?
35 కళా బృందాలు 1500 భారీ హోర్డింగులు 10 లక్షల టీ-షర్టులు 15 లక్షల టోపీలు ఈ లిస్టు ఏంటనుకుంటున్నారా? సీఎం కిరణ్ పెట్టే కొత్త పార్టీకి సన్నాహాలు. సమైక్య నినాదాన్ని ఘనంగా వినిపించే ప్రయత్నంలో భాగం జరుగుతున్న ప్రయత్నం ఇదంతా. సమైక్య ఛాంపియన్ను తానేనని ఎంత గట్టిగా ఘీంకారాలు చేస్తున్నా ఎవరూ గుర్తించకపోవడంతో... ప్రచారాన్ని భారీగా చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించినట్టు సమాచారం. ఈనెల 23వ తేదీ వరకు వేచి చూడాలని, అప్పుడు ఏం జరుగుతుందో మీకే తెలుస్తుందని ఇటీవల చాలా సందర్భాలలో కిరణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి కొత్త పార్టీ ఆవిష్కరణ 23నే జరుగుతుందని భావిస్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల్ని ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ప్రచారం కోసం ఇంత ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. ముంబయి కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత కన్సలెన్ట్సీ ఈ ప్రచార బాధ్యతల్ని భుజాలకెత్తుకుంది. ఎఫ్ఎం రేడియోలు, టీవీలు, థియేటర్లలోనూ సమైక్యవాదం గట్టిగా వినిపిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 3 జిల్లాల్లో ఈ మేరకు రిహార్సిల్స్ మొదలు పెట్టేశారు కూడా. ఇక కొత్త పార్టీ వెనుక విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, సీఎం కిరణ్, ఆయన సోదరుడు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. సీఎం కిరణ్ పైసా విదిల్చే రకం కాదని ఆయన సన్నిహితులే చెప్తారు. లగడపాటికి అంత సీన్ లేదంటారు? మరీ ఇంత భారీ ఫండింగ్ చేస్తున్నది ఎవరూ? సమైక్య పార్టీ హడావుడి ఆర్భాటం వెనుక ఉన్నది రామోజీరావు, చంద్రబాబు నాయుడట. ప్రజాక్షేత్రంలో తిరుగులేని నాయకుడిన ఎదిగిన జగన్ను ఎదుర్కొనేందుకు కిరణ్ను పావుగా ఎంచుకున్నారని సమాచారం. తమ సామాజిక వర్గానికి చెందిన లగడపాటిని మధ్యవర్తిగా పెట్టారని పొలిటికల్ సర్కిల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నాటకంలో లగడపాటి కూడా తన పాత్రను అద్భుతంగా పోషిస్తూ రామోజీ, చంద్రబాబు దగ్గర మంచి మార్కులే కొట్టేస్తున్నారట. కిరణ్ బలాన్ని భూతద్దంలో చూపి సమైక్యం విషయంలో బాహుబలి అని పైకెత్తేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక జనం మాత్రం సమైక్యం పేరుతో చేస్తున్న ప్రచార ఆర్భాటాన్ని తప్పుబడుతున్నారు. ఆరు నెలలుగా అవిశ్రాంతంగా సమైక్యం కోసం ఉద్యమాలు చేస్తుంటే... ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్టు ఈ ప్రచారమేంటని ప్రశ్నిస్తున్నారు. -
వీఆర్వోలే సూత్రధారులు
జగ్గయ్యపేట అర్బన్, న్యూస్లైన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ చేసిన సేవలకు గుర్తింపుగా పేట వీఆర్వోలు తాము నిర్మించుకున్న నూతన భవనానికి ఆయన పేరు పెట్టుకోవడం అభినందనీయమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఎస్.ఆర్.శంకరన్ వీఆర్వోల భవనాన్ని శనివారం ఆయన కలెక్టర్ రఘునందన్రావుతో కలసి ప్రారంభించారు. అలాగే కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శంకరన్ విగ్రహాన్ని కలెక్టర్ రఘునందన్రావు ఆవిష్కరించారు. సభలో ఎంపీ మాట్లాడుతూ వీఆర్వోలు నిర్మించుకున్న నూతన భవనానికి రాష్ట్రంలో తొలిసారిగా ఒక ఐఏఎస్ అధికారి పేరు పెట్టుకోవడం గర్వకారణమని, అదే సమయంలో వారు విధినిర్వహణలో శంకరన్ పేరు నిలబెట్టాలని కోరారు. వివాదాలు పెంచాలన్నా, తగ్గించాలన్నా గ్రామీణ సేవల్లో కీలకపాత్ర పోషించే వీఆర్వోల మీదనే అధారపడి ఉందన్నారు. ఇసుక కొరత వల్ల ఇందిరమ్మ పేజ్-1,2 లలో మంజూరైన గృహాలు నిర్మించుకోవడంలో లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పనులకు సంబంధించిన నిర్మాణాలకు అందుబాటులో ఉన్న నదీతీరాలు, ఏటి ప్రాంతాల్లో నుంచి ఇసుక సరఫరా నిబంధనల్లో వెసులు బాటు కల్పించాలని అధికారులను కోరారు. కలెక్టర్ రఘునందన్రావు మాట్లాడతూ పేటలో వీఆర్వోలు నిర్మించుకున్న భవనానికి ఐఏఎస్ అధికారి శంకరన్ పేరు పెట్టడం అభినందనీయమని, ఆయన పేరు పెట్టుకుంటే సరిపోదని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భవనంలో అడుగుపెట్టిన ప్రతిఒక్క వీఆర్వో శంకరన్ సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ వీఆర్వోలు ఉత్తమమైన సేవలను అందించి గ్రామీణ ప్రాంత ప్రజల మన్నన్నలు పొందాలని సూచించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పేటలో మొట్టమొదటి సారిగా వీఆర్వోలు భవనం నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. ఇప్పటివరకు అనేక గ్రామాల నుంచి తహశీల్థార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు సరైన వసతి లేక చెట్ల కిందే కూర్చునే వారని ఇకనుంచి అలాంటి పరిస్థితి లేకుండా భవనాన్ని నిర్మించుకోవడం శుభపరిణామమన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న బ్రిటీష్కాలం నాటి తహశీల్థార్ కార్యాలయం శిథిలావస్థలో ఉందని, దానిని సబ్జైల్ మాదిరిగా పునర్నిర్మించి ఆధునీకీకరణ చేయాలని కోరారు. అందుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం పేస్-7 భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని బండిపాలెం, పోచంపల్లి, ధర్మవరప్పాడు తండా, అన్నవరం గ్రామాలకు చెందిన16 మందికి 15 ఎకరాల 72 సెంట్ల భూమిని పంపిణీ చేస్తూ పట్టాలను అందజేశారు. జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, సబ్ కలెక్టర్ హరిచందన, డీఎస్పీ చిన్నహుస్సేన్, పేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి తహశీల్దార్లు బాలకృష్ణారెడ్డి, కే ఏఎస్.జెన్నీయస్, మైనర్బాబు, తన్నీరు నాగేశ్వరరావు, మదార్సాహెబ్, ఆకుల శ్రీకాంత్, పాటిబండ్ల వెంకట్రావు, పలు గ్రామాల వీఆర్వోలు పాల్గొన్నారు. -
'30కాదు 70 మంది గుడ్బై చెబుతారు'
విజయవాడ : రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ విభజన జరిగితే కాంగ్రెస్ నుంచి 30మంది కాదని, 70మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడతారన్నారు. అంతే కాకుండా 10 లేదా 12మంది కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు హస్తానికి చేయిస్తారన్నారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఈ సందర్భంగా లగడపాటి రాజగోపాల్ సమర్థించారు. జేసీ వ్యాఖ్యలో పార్టీ నాశనం అవుతుందన్న ఆవేదన ఉందన్నారు. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ వ్యవహారం తనకు తెలియదని లగడపాటి దాటవేశారు. ఆయన తన మాటల్లో నాయకత్వాన్ని మార్చాలని పరోక్షంగా తెలిపారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరపాల్సిందేనని లగడపాటి డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి 30మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నిన్న వెల్లడించిన విషయం తెలిసిందే. -
ఉద్యమ స్థైర్యం (2013 రౌండప్)
జిల్లాలో షర్మిల సమైక్య శంఖారావం సమైక్య ఉద్యమానికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చంచల్గూడ జైలులో, గుంటూరు వేదికగా వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్షలు చేపట్టి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. విజయమ్మ తొలుత విజయవాడలో దీక్ష చేపట్టాలని నిర్ణయించగా, అవనిగడ్డ ఉప ఎన్నికల కోడ్ కారణంగా గుంటూరులో నిర్వహించారు. షర్మిల జిల్లాలోని అవనిగడ్డ నుంచి కైకలూరు వరకు సమైక్య శంఖారావం యాత్ర నిర్వహించి అందరిలో ఉద్యమ స్ఫూర్తి తెచ్చారు. అలాగే, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను నేతృత్వంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన దీక్షలు, ఆందోళన నిర్వహించాయి. ఎంవీఎస్ నాగిరెడ్డి, యెర్నేని నాగేంద్రనాథ్ వంటి నేతలు రైతులను సైతం ఉద్యమంలో భాగస్వాముల్ని చేశారు. విజయవాడలో యూఎస్వో నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమం సాగింది. జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితర నేతలు జనంలోకి వెళ్లలేకపోయారు. విభజనకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇవ్వడంతో జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్లు రెండు నాల్కల ధోరణి అవలంబించలేక సతమతమయ్యారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు సమన్యాయం అంటూ జిల్లాలో బస్సు యాత్రకు వచ్చారు. ప్రజా స్పందన లేకపోవడంతో అర్థంతరంగా నిలిపివేశారు. పోరాట ఖిల్లా.. కృష్ణాజిల్లా.. నిరంతరం సమైక్యత కోసం పాటుపడిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో కేంద్రంలోని యూపీఏ సర్కారు 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ఏర్పాటుకు సంకేతాలు ఇచ్చింది. అప్పట్లో జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం సాగింది. అనంతరం రాష్ట్ర విభజన ప్రక్రియను మరింత వేగిరం చేస్తూ గత జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తన నిర్ణయాన్ని ప్రకటించడంతో సమైక్య రాష్ట్రం కోసం మళ్లీ పోరుబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లాలో ఉద్యోగులు 66 రోజులు సమ్మెబాట పట్టగా, ప్రజలు మాత్రం 150రోజులకుపైగా ఉద్యమ బావుటా ఎగురవేశారు. ఏపీఎన్జీవోలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, రైతులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు కదం తొక్కాయి. ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి జిల్లాలో పెద్ద ఎత్తున సకల జనుల సమ్మె మొదలైంది. సుమారు 35వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. జిల్లా అంతటా ఉద్యమం రాష్ట్రస్థాయిలో సమైక్య ఉద్యమానికి ఊపిరిలూదిన పరుచూరి అశోక్బాబు అవనిగడ్డ నియోజకవర్గానికి చెందినవాడు కావడం విశేషం. విజయవాడ, హనుమాన్ జంక్షన్, గుడివాడ, ఉయ్యూరుల్లో జరిగిన సమైక్య గర్జన సభలకు అశోక్బాబు, మిగిలిన రాష్ట్ర నాయకులు హాజరై ఉత్తేజపరిచే ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. బందరులో సెప్టెంబర్ 19న నిర్వహించిన గర్జనలో ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పాల్గొని జిల్లా గొప్పతనాన్ని వివరించారు. రాష్ట్రస్థాయి సమైక్య పోరులో ఒక వెలుగు వెలిగిన వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మన జిల్లా ఆడపడుచే కావడం విశేషం. అలాగే, మనజిల్లాకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. జీతాల్లేవ్.. జిల్లాలోని ఖజానా శాఖ ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు సంక్షోభాన్నే మిగిల్చింది. ట్రెజరీల్లో పనిచేస్తున్న సుమారు 175మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టారు. మచిలీపట్నం ట్రెజరీ ప్రధాన కార్యాలయంతోపాటు జిల్లాలోని 18 సబ్ ట్రెజరీ కార్యాయాల్లో కార్యాకలపాలు స్తంభించారుు. ఉద్యోగుల వేతనాల బిల్లులు, పలు అభివృద్ధి పనులకు విఘాతం ఏర్పడింది. ఉద్యమంలో ఉద్యోగులు, విద్యార్థులు జిల్లాలో ఆగస్టు 22 నుంచి విద్యాసంస్థలు బంద్ పాటించారుు. 3,340 సర్కారీ బడుల్లో పనిచేస్తున్న సుమారు 16వేల మంది ఉపాధ్యాయుల్లో చాలామంది విధులు బహిష్కరించారు. సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు విద్యా సంవత్సారాన్ని నష్టపోయారు. 16 శాఖలకు చెందిన అధికార యంత్రాంగం ఆగస్టు 28 నుంచి సమ్మెబాట పట్టడంతో పాలన పడకేసింది. జిల్లాలోని మండల లెవెల్ స్టాక్పాయింట్ పాయింట్ల నిర్వాహకులు సైతం సమ్మెబాట పట్టడంతో అమ్మహస్తం, కిరోసిన్ వంటి సరుకుల పంపిణీ నిలిచిపోయింది. పింఛన్లూ ఆలస్యంగానే పంపిణీ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ, ఆక్వా రంగాలతో పాటు ప్రజలు నిత్యం సమస్యలతో సతమతమయ్యారు. ప్రజావాణి జరగకపోవడంతో ప్రజల మొరవినే వారు కరువయ్యారు. జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖకు సమ్మె సెగ తగిలింది. జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు 79 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఏఎన్ఎంలు, ప్రభుత్వ వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది సుమారు మూడువేల మంది వరకు సమ్మెబాట పట్టారు. బిగిసిన పిడికిళ్లు.. = జిల్లాలో ఈ ఏడాది సమైక్య పోరు ఒక మైలురాయి కాగా, ఏడాది కాలంలో మరిన్ని ఉద్యమాలు సాగాయి. జిల్లాలో రైతులకు సకాలంలో సాగు నీరివ్వాలని, కరెంట్ సరఫరా సక్రమంగా సాగాలని, మద్దతు ధర ఇవ్వాలని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, రైతు విభాగ రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి. =పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రెండు పర్యాయాలు కలెక్టరేట్ వద్ద ఆందోళనలు నిర్వహించారు. =అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20, 21 సమ్మె చేశారు. జూలై 10న, డిసెంబర్లోనూ నల్లచీరలతో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. =మునిసిపల్ వర్కర్ల సమస్యలపై విజయవాడ కార్పొరేషన్తోపాటు మచిలీపట్నం, గుడివాడ, పెడన, నూజివీడు, జగ్గయ్యపేట మునిసిపాలిటీల్లో ఉద్యమం చేపట్టారు. =అర్హులైన పేదలకు భూములు పంచాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. =పెనుగంచిప్రోలు మండలం కొణకంచిలో సారా నిషేధించాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. =తిరుపతమ్మ ఆలయంలో ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా విధులు బహిష్కరించారు. =బందరు పోర్టు సాధనకు 358 రోజులుగా దీక్షలు కొసాగుతూనే ఉన్నాయి. విద్యుత్ మెరుపు సమ్మెతో కలవరం సమైక్య నినాదంతో విద్యుత్ ఉద్యోగులు నిర్వహించిన మెరుపు సమ్మెతో ప్రభుత్వం కలవరపడింది. అయితే, ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో వారు మూడు రోజుల తరువాత విరమించారు. జిల్లాలోని ట్రాన్స్కో ఉద్యోగులు సుమారు 3వేల మంది, జెన్కో ఉద్యోగులు సుమారు 5వేల మంది ఐదు రోజులు సమ్మె చేశారు. -
ఆలయ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ
పెనుగంచిప్రోలు, న్యూస్లైన్ : రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ పాలకవర్గ చైర్మన్ పదవికి పోటీ రసవత్తరంగా సాగుతోంది. పాలకవర్గం నియామకం కోసం ఈ నెల ఆరోతేదీన దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 20 రోజుల్లో దరఖాస్తులు చేసుకోమని సూచించింది. దరఖాస్తులకు గడువు ఈ నెల 26తో పూర్తికానుంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరువాత అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయ చైర్మన్ పదవి కోసం నాయకులు ఎవరికివారే ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్, నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకలాపాలు చూస్తున్న పాటిబండ్ల వెంకట్రావు ద్వారా నాయకులు చైర్మన్ పదవి కోసం కుస్తీలు పడుతున్నారు. పదవి కోసం యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఏలూరి శివాజీ, అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వాసిరెడ్డి బెనర్జీ ప్రధానంగా పోటీలో ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం వాసిరెడ్డికి చైర్మన్ పదవి ఇస్తే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటామని ఎంపీ ముందు తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శివాజీ జోరుగా తన ప్రయత్నాలు చేస్తున్నారు. పదేళ్లుగా యూత్ కాంగ్రెస్లో ఉంటూ పలు కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా యువజన కాంగ్రెస్లో గుర్తింపు పొందిన తనకు చైర్మన్ పదవి తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఎంపీ హామీ ఇచ్చారని, తనకే చైర్మన్ పదవి వస్తుందని వాసిరెడ్డి చెబుతున్నారు. కాకాని ప్రయత్నాలు... మరోవైపు గత ంలో పాలకవర్గ చైర్మన్గా పనిచేసిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాకాని శ్రీనివాసరావు కూడా తనకు తిరిగి చైర్మన్ పదవి కావాలని అడుగుతున్నారు. తనకు పదవి తప్పక వస్తుందని, రెండోసారి ఇవ్వని పక్షంలో పెనుగంచిప్రోలుకు చెందినవారికే కేటాయించాలని కోరుతున్నారు. తన మద్దతుదారుల పేరును ఆయన సూచిస్తున్నారు. యువజన కాంగ్రెస్ నాయకుడు లగడపాటి శంకర్ కూడా ఎంపీ ద్వారా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మొత్తం మీద పదవిపై ఆశ పెట్టుకున్న నేతలంతా ఎవరికివారే తామే చైర్మన్ అవుతామనే ఆలోచనతో ఉన్నారు. తిరుపతమ్మ అమ్మవారి చైర్మన్ పదవి మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి. -
పాలనే లేదు.. బెస్ట్ సీఎం అవార్డా?: నాగం
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా రాష్ర్టంలో పరిపాలనే లేనపుడు కిరణ్కు ఉత్తమ సీఎం అవార్డు ఇవ్వడం వింతగా ఉందని బీజేపీ నేత, ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి ఎద్దేవా చేశారు. గ్రామాల వారీగా సర్వే నిర్వహిస్తే ఆయన పనితీరు తెలిసేదని శనివారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. సొంత ప్రయోజనాలు తప్ప తెలంగాణ మంత్రులకు, ఆ ప్రాంత సమస్యలు పట్టడం లేదని నాగం విమర్శించారు. విడిపోతే రాజకీయూలకు కిరణ్ దూరం: లగడపాటి సాక్షి, తిరుపతి: రాష్ట్రం సమైక్యంగా కొనసాగకుంటే ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రాజకీయాలకు దూరమవుతారని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. శనివారం తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ నివాసంలో లగడపాటి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోతే తాను రాజకీయాల్లో ఉండనని చెప్పటాన్ని గుర్తు చేస్తూ అదే మార్గంలో కిరణ్కుమార్ కూడా నడుస్తారని ప్రకటించారు. ‘ఇది ముఖ్యమంత్రి నిర్ణయమా?’ అని ప్రశ్నించగా తన అంచనా ప్రకారం ముఖ్యమంత్రి రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పారు. -
‘లగడపాటి ఆస్తులపై విచారణ జరపాలి’
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆర్థిక కార్యకలాపాలపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. లగడపాటి అక్రమ ఆస్తులపై విచారణ చేపట్టాలని త్వరలో సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కేంద్ర మంత్రి బలరాం నాయక్తో కలిసి ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్కుమార్ యాదవ్, రాజయ్య, మధుయాష్కీగౌడ్, సురేష్ శెట్కార్లు గురువారం విలేకరులతో మాట్లాడారు. -
లగడపాటి ఆస్తులపై విచారణ చేయాలి
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు 8వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేయడంపై చీఫ్ విజిలెన్స్ కమిషనర్కు, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. రాజస్థాన్లో సోలార్ కుంభకోణంపై విచారణ చేయాలని, అలాగే లగడపాటి లాంటి వారి ఆస్తులపై విచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు. లగడపాటి లాంటివారు అవినీతితో సంపాదించిన డబ్బుతోనే తమపై పెత్తనం చేయాలని చూస్తున్నారని వారు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకుంటున్నామని సీమాంధ్ర ఎంపీలు చెప్పడం అవివేకమని, అసలు వాళ్లు ఇప్పటివరకు సీడబ్ల్యుసీ, జీవోఎం, తెలంగాణపై కేబినెట్.. ఇలా ఏ ఒక్కదాన్నీ అడ్డుకోలేకపోయారని, ఇక రాష్ట్ర ఏర్పాటును ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. -
కాంగ్రెస్ ఎంపిల అవిశ్వాసం ఉపసంహరణ
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపిలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్ను ఉపసంహరించుకున్నారు. తాము వ్యూహాత్మకంగానే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నట్లు కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి చెప్పారు. రోజుకు ఒక్కొక్కరి చొప్పున అవిశ్వాస నోటీస్ ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతో ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్సభ స్పీకర్కు నోటీసు అందించిన విషయం తెలిసిందే. ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, ఎ.సాయి ప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్లు ఆ నోటీస్పై సంతకం చేశారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి కాంగ్రెస్కు మొత్తం 19 మంది లోక్సభ సభ్యులు ఉండగా, వారిలో ఆరుగురు మాత్రమే నోటీసుపై సంతకాలు చేశారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు సహా మిగతా లోక్సభ సభ్యులు ‘అవిశ్వాసం’పై స్పందించలేదు. అవిశ్వాసం కోసం అని రాజీనామాలు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఏకంగా అవిశ్వాసం కూడా ఉపసంహరించుకున్నారు. ఈ రోజు తమకు తగిన సంఖ్యాబలం లేదని, అందువల్ల అవిశ్వాసం ఉపసంహరించుకున్నట్లు లగడపాటి చెప్పారు. రోజుకు ఒక్కొక్కరం అవిశ్వాస నోటీసు ఇస్తామన్నారు. -
వారిద్దరూ గుడ్బై చెబుతారా?
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కలత చెందిన సీమాంధ్ర ఎంపీలు ఇద్దరు ఏకంగా రాజకీయాలకు గుడ్బై చెబుతారనే వార్తలు ఊపందుకున్నాయి. ఆంధ్రా ఆక్టోపస్గా పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్... రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని ఇప్పటికే బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే బాటలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీర్మానం తర్వాత ప్రజాభీష్టం మేరకు లోక్సభ సభ్యత్వానికి ఉండవల్లి రాజీనామా చేశారు. అంతేకాకుండా తెలంగాణ నోట్పై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసినపుడు తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన సంగతి విదితమే. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, ఢిల్లీలోనే మకాం చేసి, రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీలతో కలిసి సమాలోచనలు సాగిస్తున్న ఉండవల్లి, అనూహ్యంగా సహచరులతో కలిసి సొంత పార్టీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్సభ స్పీకర్కు ఇచ్చారు. ఎన్నడూ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని ఉండవల్లి... అనూహ్యంగా అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి అందర్ని ఆశ్చర్యపరిచారు. ఇంత కాలం నోరు మెదపకుండా ఉన్న ఆయన, నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందిన సమయంలో అదును చూసుకుని మిగిలిన ఎంపీలతో కలిసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి రాజకీయ భవిష్యత్తో పాటు ఆయన వ్యూహమేమిటన్న అంశంపైనే సర్వత్రా చర్చ నెలకొంది. అన్నిటికి సిద్ధపడ్డ ఆయన భవిష్యత్తులో ఇక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్బై చెబుతారని తెలుస్తోంది. ఇక లగడపాటి రాజగోపాల్ ... ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా పిల్లనిచ్చిన మామ ఉపేంద్ర కార్డును ఉపయోగించి ఏకంగా ఒకేసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, తనవద్ద ఉన్న ‘పాశుపతం’తో అడ్డం పడతానని ప్రకటించారు కూడా. అయితే తెలంగాణ ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపడం, అక్కడనుంచి రాష్ట్ర అసెంబ్లీకి రావటం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించినట్టు లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకోవాలి. మరి వీరిద్దరూ రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేదా అనేది తేలాలంటే మరికొద్ది రోజులుగా ఆగాల్సిందే. -
వారిద్దరూ నకిలీ సమైక్యవాదులు: అంబటి
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కోటరీలోని ముఖ్యుల సూచనల మేరకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, ఎంపీ లగడపాటి రాజగోపాల్లు డ్రామా ఆడుతున్నారని, వీరిద్దరూ నకిలీ సమైక్యవాదులని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాం బాబు ధ్వజమెత్తారు. ఆయన గురువారంనాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన విషయంలో వీరిద్దరూ సోనియాగాంధీని, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడినా అధిష్టానం వారిపై చర్యలెందుకు తీసుకోదో అందరికీ తెలుసని విమర్శించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన నాటి నుంచీ కిరణ్ తన పదవిని అంటిపెట్టుకుని ఫైళ్లపై సంతకాలు చేస్తూంటే ఆయన సోదరుడు వసూళ్లు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘‘విభజన నిర్ణయం వెలువడినప్పుడే కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేసి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇంతదాకా వచ్చేదా? అసెంబ్లీని సమావేశ పరచి సమైక్య తీర్మానం చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు డిమాండ్ చేసింది. బీఏసీలో కూడా విజ్ఞప్తి చేశారు. కానీ కిరణ్ అందుకు అంగీకరించలేదు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే చిత్తశుద్ధే ఆయనకుంటే ఇలా చేసేవారా?’’ అని అంబటి ప్రశ్నించారు. ‘‘రూ.1,717కోట్ల విలువగల ‘ల్యాంకో ఇన్ఫ్రా’ కంపెనీ దీర్ఘకాలంగా బకాయి పడిన రూ.8,000 కోట్ల రుణాన్ని రీషెడ్యూల్ (వాయిదా) చేయడమే కాక తాజాగా రూ.3,500 కోట్ల రుణాన్ని ఇస్తున్నారు. లగడపాటి నిజంగా కాంగ్రెస్పై, కేంద్రప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన వ్యక్తే అయితే జాతీయ బ్యాంకులు ఆయన కంపెనీకి ఇలా లబ్ధిని చేకూరుస్తాయా?’’ అని అంబటి విస్మయం వ్యక్తం చేశారు. తాము ఎన్జీవో నేతలతో కలిసి పెట్టబోయే పార్టీ ద్వారా రాజకీయ లబ్ధిపొంది, వచ్చే ఎన్నికల్లో సీట్లను పొంది ఆ తరువాత వాటిని సోనియా కాళ్లముందు పెట్టాలనేది కిరణ్, లగడపాటి ఆలోచనని చెప్పారు. కానీ తెలుగు ప్రజలు వీరి నాటకాలను గమనిస్తున్నారని, వారు పెట్టబోయే పార్టీకి ఒక్క ఓటు గానీ, ఒక్క సీటుగానీ రావని జోస్యం చెప్పారు. సోనియాతో జగన్ కుమ్మక్కయి ఉంటే 16 నెలలు జైల్లో ఎందుకుంటారు? కాంగ్రెస్ పెట్టించిన కేసులతో ఎందుకు వే ధింపులకు గురవుతారు? ఆయన సంస్థలపై దాడులు ఎందుకు జరుగుతాయి? అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్నలు వేశారు. -
కాంగ్రెస్ ఎంపీల అవిశ్వాసం నోటీస్ ఓ డ్రామా
= వారికి సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి లేదు = చంద్రబాబుతో లగడపాటి, జేసీ కుమ్మక్కు = వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ధ్వజం మడకశిర, న్యూస్లైన్ : సమైక్యాంధ్ర విషయంలో కాంగ్రెస్ ఎంపీలు డ్రామాలాడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మడకశిరలోని మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్రెడ్డి స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల్లో హీరోలు కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాసం నోటీసు ఇచ్చారని, అయితే వారికి సమైక్యాంధ్రపై ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదని విమర్శించారు. చిత్తశుద్ధి ఉండివుంటే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించి, ఎందుకు ఆమోదింప జేసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్, జేసీ దివాకర్రెడ్డి కుమ్మక్కై జగన్పై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ టికెట్ల కోసమే వారు చంద్రబాబుతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. టీడీపీ సీమాంధ్ర ఎంపీలు, ప్రజాప్రతినిధులు కూడా సమైక్యాంధ్రపై నాటకాలు ఆడుతున్నట్లు దుయ్యబట్టారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్ జగన్ మోహన్రెడ్డి జాతీయ స్థాయిలో పాటుపడుతున్నట్లు చెప్పారు. జగన్ ప్రయత్నాన్ని సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు హర్షించకుండా విమర్శలు చేయడం దారుణమన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్న విషయం తెలిసికూడా ముఖ్యమంత్రి, సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు పట్టించుకోలేదని విమర్శించారు. 16న మడకశిరలో సమైక్య శంఖారావం సభ మడకశిరలోని వైఎస్సార్సర్కిల్లో ఈ నెల 16న ఉదయం పది గంటలకు సమైక్యశంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్రెడ్డి, పార్టీ జిల్లా అధికారప్రతినిధి వైసీ గోవర్దన్రెడ్డి తెలిపారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్రెడ్డి హాజరవుతారన్నారు. అలాగే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గురునాథ్రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ముఖ్య నేతలు విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి కవిత తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. -
'తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు... అధిష్టానం'
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన నిర్ణయం విషయంలో తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని, కాంగ్రెస్ అధిష్టానమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. యూపీఏపై అవిశ్వాస తీర్మానం పెట్టే అధికారం తమకు ఉందని ఆయన మంగళవారమిక్కడ ఓ టీవీ ఛానల్స్ కార్యాక్రమంలో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతో.. ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్సభ స్పీకర్కు నిన్న నోటీసు అందించారు. కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్కుమార్, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్ సోమవారం ఉదయం ఈమేరకు స్పీకర్ మీరాకుమార్కు నోటీసు ఇచ్చారు. -
నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఓటమి ఖాయం: లగడపాటి
ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోతుంది అని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు మద్దతిచ్చే విషయంపై పార్టీలు పునరాలోచన పడుతాయని ఆంధ్రా ఆక్టోపస్ అన్నారు. కాంగ్రెస్ ఓటమి తనకు బాధ కలిగించినా.. రాష్ట్రం సమైక్యంగా ఉండటానికి ఉపకరిస్తుందన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పనితీరు, పార్టీల బలబలాల్లో తేడాలొస్తాయని లగడపాటి తెలిపారు. ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ, ఏఏపీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది అని అన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం దూకుడు తగ్గుతుంది అని అన్నారు. వేర్పాటువాదంపై ఆధారపడ్డ వాళ్లు చతికిలపడుతారని ఆయన ఎద్దేవా చేశారు. సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తమ వద్ద అస్త్రాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వ్యతిరేకత ఉన్న ఏ బిల్లైనా పాస్ కావడం ఇబ్బందే అని అన్నారు. -
తుపాను రాజకీయం
= సమైక్య ఉద్యమానికి ముఖం చాటేశారు = రచ్చబండలో హంగామా చేశారు = తుపానుల సాకుతో మంత్రి జనంలోకి వచ్చారు = కాంగ్రెస్ నేతల పాలి‘ట్రిక్స్’ = ఈసడించుకుంటున్న ప్రజలు సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్ర విభజనను అడ్డుకోలేరు.. సమైక్యవాదాన్ని వినిపించలేరు.. ప్రజాభీష్టం నెరవేర్చలేరు.. ప్రజల కష్టాలను పట్టించుకోరు.. కానీ తమ రాజకీయ ఉనికిని చాటుకునేందుకు మాత్రం తుపానులను సైతం వాడుకుంటారు.. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు మాత్రం తుపాను రాజకీయాన్ని నెరపుతారు.. ఇదీ కాంగ్రెస్ నేతల తీరుపై జిల్లాలో సాగుతున్న చర్చ. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు పై-లీన్ తుపానును అడ్డుపెట్టుకున్నారు.. జిల్లాలో మేమున్నామని ఉనికిని చాటుకునేందుకు హెలెన్, లెహర్ తుపానులను వాడుకున్నారు. ప్రకృతి ప్రకోపించి సామాన్యుడి నుంచి రైతన్న వరకు చితికిపోయిన తరుణంలోనూ కాంగ్రెస్ మంత్రి కొలుసు పార్థసారథి తుపాను రాజకీయం నెరపారన్న విమర్శలు వినవస్తున్నాయి. నిన్న ముఖం చాటేసి.. నేడు పాలి‘ట్రిక్స్’... కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న యూపీఏ సర్కార్ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం జిల్లాలో ఆ పార్టీకి అడ్రస్ లేకుండా చేసింది. ఇటువంటి తరుణంలో ప్రచార ఆర్భాటాలు చేసే ఎంపీ లగడపాటి రాజగోపాల్ సహా జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రజలకు ముఖం చూపించే సాహసం చేయలేదు. ఉవ్వెత్తున సాగిన ఉద్యమంతో దాదాపు రెండున్నర నెలలపాటు జిల్లాలోని రోడ్లపై తిరిగేందుకే కాంగ్రెస్ నేతలు వెనకడుగు వేశారు. అటువంటి తరుణంలో కోస్తాంధ్రాను వణికించిన పై-లీన్ తుపాను సహాయక చర్యల కోసం మానవతాదృ క్పథంతో సమ్మె విరమించాలంటూ కాంగ్రెస్ సర్కార్ తుపాను పేరుతో రాజీ ఫార్ములాను పండించింది. ఒడిశా, ఉత్తరాంధ్రలోను ప్రభావం చూపిన పై-లీన్ తుపాను సాకుతో కృష్ణా జిల్లాలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ సమైక్య సమ్మెపై నీళ్లు చల్లింది. అంతలోనే ఎత్తుగడగా రచ్చబండ పెట్టి జనాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. మండలాల వారీగా ఏర్పాటుచేసిన రచ్చబండ సభల్లో ఇళ్లు, పింఛన్లు, రేషన్కార్డులు, బంగారుతల్లి, ఇందిరమ్మ కలలు వంటి పథకాలను ఎరవేసి సమైక్య సెగ తగలకుండా ఎత్తుగడ పన్నారు. జిల్లాకు చెందిన మంత్రి సారథి పోలీసుల పహరాలో రచ్చబండ సభలు నిర్వహించి రాజకీయ ఉపన్యాసాలు చేశారు. ఇంతలోనే హెలెన్ తుపాన్ రావడంతో మంత్రి, దిరిశం పద్మజ్యోతి, బూరగడ్డ వేదవ్యాస్, మల్లాది విష్ణుతో పాటు మరికొందరు నేతలు జనంలోకి వచ్చేందుకు దీన్ని వాడుకున్నారు. నవంబర్ 28న తీరాన్ని తాకిన లెహర్ తుపానును అడ్డుపెట్టుకుని మంత్రి సారథి జిల్లాలో విస్తృతంగా తిరిగే ప్రయత్నం చేశారు. ఇదే అదనుగా ప్రజలకు చేరువయ్యేందుకు తాపత్రయ పడ్డారు. కష్టాల్లో ఉన్న ప్రజలు మాత్రం తుపాను రాజకీయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న తమను ఆదుకునేవారి కోసం ప్రజలు, రైతులు ఎదురుచూశారు. నిన్నటివరకు ముఖం చాటేసిన కాంగ్రెస్ నాయకులు తుపాను పేరుతో తమ వద్దకు వచ్చారన్న సంగతిని జనం మరిచిపోలేదు. ఇదే సమయంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు పర్యటించి రైతులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. కృష్ణాజలాల పైనా మొసలికన్నీరే.... ఒకపక్క కృష్ణాజలాలపై వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రంపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి కార్యక్రమాలూ చేపట్టలేదని, కేవలం మొసలి కన్నీరు మాత్రమే కారుస్తున్నారని రైతు నాయకులు విమర్శిస్తున్నారు. మరోపక్క పూర్తిగాని పులిచింతల ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసేందుకు ముఖ్యమంత్రి వస్తున్నట్లు మంత్రి సారథి ప్రకటించడంపై కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రస్తుత కష్టకాలంలో రైతన్నకు అండగా ఉండకుండా కేవలం సమావేశాలకే పరిమితం కావడంపై రైతు సంఘాల నాయకులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇదేసమయంలో కృష్ణా డెల్టాను ఎడారి చేసే బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రైతులతో కలసి ఆందోళనలను ప్రారంభించింది. ఉభయ జిల్లాలకు చెందిన వందలాది మంది రైతులతో శనివారం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఆ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జనంలోకి వెళ్లలేక.. కాంగ్రెస్లో ఇమడలేక.. జిల్లా కాంగ్రెస్లోని పలువురు నాయకుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించి అడ్రస్ గల్లంతయ్యే కాంగ్రెస్లో ఇమడలేక చాలామంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు మధనపడుతున్నారు. కాంగ్రెస్లో ఉంటే జనంలోకి ఎలా వెళ్లేదని పలువురు అంతర్మథనంలో పడ్డారు. ఇప్పటివరకు మంత్రి సారథి తన అధికార దర్పాన్ని అడ్డుపెట్టుకుని జనంలోకి వచ్చారు. మిగిలిన ఒకరిద్దరు నేతలు మినహా ప్రజల ముందుకు వెళ్లేందుకు ముఖం చెల్లటంలేదు. దీంతో సమైక్యాంధ్రకు జై కొట్టి జనాన్ని మెప్పించే ప్రయత్నం చేయడమా? కాంగ్రెసేతర పార్టీల్లో చేరి రాజకీయాల్లో కొనసాగడమా? అని మార్గాలను అన్వేషిస్తున్నారు. -
లగడపాటి రాజకీయాల నుంచి తప్పుకుంటారా?
విజయవాడ లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రాష్ట్రం విడిపోదని ఆయన ధీమా. ఆ ధీమా ఆయనకు ఎక్కడ నుంచి వచ్చిందో అర్ధం కావడంలేదు. కాంగ్రెస్ పార్టీలో సమైక్యత కోసం మొదటి నుంచి ఆందోళన చేస్తున్న రాజగోపాల్ రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పటికీ అదే మాటమీద నిలబడినట్లు ఈ రోజు కూడా చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తు సమైక్యతతో ముడిపడి ఉందని కూడా ఆయన అన్నారు. తమ పదవులకు రాజీనామాలు చేయకుండా, రోజుకో తీరున మాట్లాడుతున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిల నిజాయితీని శంకించినట్లుగానే లగడపాటి మాటలను కూడా జనం నమ్మే పరిస్థితిలేదు. మొదటలో సమైక్యవాదం వినిపించిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఆ తరువాత మాట మార్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం పదవులను లెక్కచేయం అని చెప్పారు. ఉత్తుత్తి రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలను ఆమోదింపజేసుకోలేదు. ఇప్పుడు విభజన అనివార్యం అని, చివరి దశకు వచ్చిందని, ఇంకా సమైక్యత అంటూ పాకులాడటం మంచిదికాదని సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. జనం రాష్ట్ర విభజనను ఎంత వ్యతిరేకిస్తున్నా వారికి పట్టదు. వారిని నిలదీస్తున్నా తలవంచుకొని వెళ్లిపోతున్నారు. వారు విభజనకు సిద్దపడి ప్యాకేజీ అడుగుదాం అనే దగ్గరకు వచ్చారు. పదవుల కోసం ఎంతకైనా తెగిస్తారని స్పష్టమైపోతోంది. ఇక లగడపాటి రాజగోపాల్ కూడా వారికి ఏమీ తీసిపోరు. ఆయనా రాజీనామా చేశారు. ఆమోదింపజేసుకోలేకపోయారు. రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియలో, తెలంగాణ బిల్లు రూపొందించే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోతోంది. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చిన తరువాత కూడా రాష్ట్ర విభజన జరగదని లగడపాటి స్పష్టం చేస్తున్నారు. డిసెంబరు 5 నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టరని కూడా ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు. సమైక్య రాష్ట్రంలోనే వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయని లగడపాటి చెప్పారు. విభజనకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్కరూ కూడా మిగలరని ఆయన పరోక్షంగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను హెచ్చరించారు. తెలంగాణపై సిడబ్ల్యూసి చేసిన తీర్మానాన్నిముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి అందరూ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. విభజన జరిగే ప్రసక్తిలేదని ఆయన ఏ ధీమాతో చెబుతున్నారో అర్ధం కావడంలేదు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా (యుటి) చేయాలనే సీమాంధ్ర కేంద్ర మంత్రులు చిరంజీవి, జెడి శీలం వాదనను ఆయన తప్పు పట్టారు. విభజన జరగకపోతే, జరుగుతుందని అనేవాళ్లు రాజీనామాలు చేస్తారా? అని ఆయన సవాల్ విసిరారు. తాను మాత్రం విభజన జరిగితే మాటకు కట్టుబడి రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని చెప్పారు. విభజన ప్రక్రియ వేగంగా జరిగిపోతున్న నేపధ్యంలో జనం ఎవరి మాటలు నమ్మాలి? లగడపాటి రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉందా? లేదా? అనేది చెప్పాలంటే కొద్దిరోజులు వేచి ఉండక తప్పదు. -
విభజన జరిగితే రాజకీయాలకు గుడ్ బై: లగడపాటి
రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాదని, రాష్ట్ర విభజన జరగదని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో ఆయన శనివారం సమావేశమయ్యారు. వచ్చే ఏడాది సమైక్యరాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని లగడపాటి చెప్పారు. విభజనకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్కరూ మిగలరని పేర్కొన్నారు. విభజన జరిగిపోతోందని చెబుతున్న సీమాంధ్ర నేతలు, జరగకపోతే తామేం చేస్తారే చెప్పాలని రాజగోపాల్ వ్యాఖ్యానించారు. -
విభజన అనివార్యమనే భావన సరికాదు: లగడపాటి
రాష్ట్ర విభజన అనివార్యమని కొందరు నేతలు పేర్కొంటున్నారని, ఆ భావన సరైనది కాదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. బుధవారం న్యూఢిల్లీలో లగడపాటి మాట్లాడుతూ... పార్టీల తీర్మానం మేరకే రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. హైదరాబాద్ను కేంద్రంపాలిత ప్రాంతం చేస్తే విభజనకు అంగీకరిస్తామని కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల లగడపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం లేదని తెలిపారు. నేడు జరగనున్న కేంద్రం మంత్రుల బృందం సమావేశంలో ఏమీ తేలదని భావిస్తున్నట్లు లగడపాటి చెప్పారు. విభజన అంశం రాత్రికి రాత్రే తేలేది కాదని లగడపాటి వెల్లడించారు. -
యూపీఏకు కష్టకాలమే
సాక్షి, హైదరాబాద్: వివిధ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రంలోని యూపీఏ-2 ప్రభుత్వ మనుగడే తల్లకిందులయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. డిసెంబర్ 8న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించిన ముఖచిత్రం కూడా మారిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆదివారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో లగడపాటి మాట్లాడారు. ‘సీమాంధ్రలో 13 మంది కాంగ్రెస్ లోక్సభ సభ్యులంతా రాష్ట్ర విభజన అంశంపై అధిష్టానం తీరును ధిక్కరిస్తారు. హర్యానాలో ఒకరు, మధ్యప్రదేశ్లో మరొకరు వేర్వేరు కారణాలతో పార్టీతో విభేదిస్తున్నారు. ఈ 15 మంది పోను లోక్సభలో యూపీఏకు మిగిలే సంఖ్యా బలం కేవలం 213 మాత్రమే’నని లగడపాటి చెప్పారు. యూపీఏకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న డీఎంకే, బీఎస్పీ, ఎస్పీలకు 58 మంది ఎంపీలున్నారు. డిసెంబర్ 8 ఫలితాల తర్వాత ఈ పార్టీలు యూపీఏ-2 ప్రభుత్వానికి దూరమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణపై సోమవారం కేంద్ర మంత్రి పల్లంరాజు ఇంట్లో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు. జగన్, చంద్రబాబు జెండాలు పక్కన పెట్టి వస్తే వారితో కలిసి సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఉద్యమించడానికి తాము సిద్ధమని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. -
దేవుళ్ల గొడవ వద్దు: లగడపాటి
హైదరాబాద్: మనుష్యుల విభజన గొడవలు పడుతుంటే, భద్రాద్రి రామయ్య పేరుతో దేవుళ్ల గొడవ మంచిదికాదని కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి ఒక లేఖ రాశారు. భద్రాచలం రామయ్య కావాలని కోరుకోవడంలోని లౌకిక సూత్రం ఏమిటి? అని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. విశాలభావంతో ఆలోచించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని జైపాల్ రెడ్డిని లగడపాటి కోరారు. -
మీడియాపై కాంగ్రెసోళ్ల చిందులు
మీడియాలో కనిపించాలని నానా తంటాలు పడుతుంటారు రాజకీయ నాయకులు. రకరకాల వేషాలు వేసి, నాటకాలు ఆడైనా కూడా కాసేపు మీడియాలో ఏదో ఒక రకంగా ప్రచారంలో ఉంటే చాలనుకుంటారు. కానీ అదే మీడియాపై ఈ మధ్యకాలంలో మాత్రం పలువురు కాంగ్రెస్ నాయకులు మీడియా కనపడితే చాలు.. గయ్యిమని ఒంటికాలిమీద లేస్తున్నారు. పదే పదే మీడియామీద మండి పడటమే పనిగా పెట్టుకుంటున్నారు. నిన్నకాక మొన్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విలేకరుల సమావేశం పెట్టి మరీ అందరినీ పిలిచి, సాక్షి మీడియా ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆయన నుంచి స్ఫూర్తి పొందారో ఏంటో గానీ.. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా మీడియా మీద మండిపడ్డారు. నోటికి వచ్చినట్లల్లా మాట్లాడారు. అంతేకాదు వేలు చూపించి మరీ బెదిరించారు. ''అసలు వీళ్లతో మాట్లాడటం దండగ'' అని వ్యాఖ్యానించారు. అదేంటి అలా అంటున్నారు, మీరు ఇలా మాట్లాడటం సరికాదని కొంతమంది మీడియా ప్రతినిధులు అన్నా కూడా వేలు పెట్టి బెదిరించినట్లు చూపించి మరీ వ్యాఖ్యానాలు చేశారు. ''మేం మా ముఖ్యమంత్రితో ఏమైనా మాట్లాడతాం. నా నోరు.. నా ఇష్టం. మీకు ఇష్టం వచ్చినది రాసుకోండి'' అంటూ విసురుగా ప్రవర్తించారు. ఈనెల ఏడో తేదీన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్లో అల్లకల్లోలం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘అల్లకల్లోలం ఎవరు చేస్తారు?’ అని ఇద్దరు విలేకరులు ప్రశ్నించారు. దీనికి సరైన సమాధానమివ్వని లగడపాటి.. సమావేశం తర్వాత వారితో వాగ్వాదానికి దిగారు. అవివేకంగా మాట్లాడొద్దంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రశ్నలు అడిగితే అవివేకం అంటారేమిటి?’ అని విలేకరులు ప్రశ్నించారు. దీంతో లగడపాటి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘‘నోర్ముయ్... నీ పేరేంటి? నీ ఏరియా ఏంటి?’’ అంటూ ఊగి పోయారు. ‘‘అవసరమైతే చేతులు లేస్తాయి’’ అంటూ చిందులుతొక్కారు. తన వాహనం ఎక్కుతూ.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. ‘‘నా సంగతేంటో చూపిస్తా... మీ అంతు చూస్తా!’’ అని నిష్ర్కమించారు. తమకు అవసరమైనప్పుడు, తాము కావాలనుకున్నప్పుడల్లా విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి అందరినీ పిలిచి మరీ గంటలకొద్దీ ఉపన్యాసాలు ఇచ్చే బొత్స, లగడపాటి లాంటి నాయకులు తమకు ఏమాత్రం కాస్త వ్యతిరేకంగా అనిపించినా ఇలా చిందులు తొక్కుతూ రచ్చరచ్చ చేస్తున్నారు. -
దిగ్విజయ్ మాటకు విలువలేదు: లగడపాటి
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ నాయకులు విరుద్ధ వ్యాఖ్యలతో అయోమయం సృష్టిస్తున్నారు. విభజనకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి అంగీకరించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పేర్కొనగా, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దిగ్విజయ్పై ధ్వజమెత్తాడు. దిగ్విజయ్ సింగ్ మాటలు నీట మీద రాతలేనని లగడపాటి విమర్శించారు. దిగ్విజయ్ ఏనాడు మాట మీట నిలబడలేదని ఆరోపించారు. ఇలా కాంగ్రెస్ నాయకులే పరస్పర విమర్శలకు దిగుతూ ప్రజలను తికమకపెడుతున్నారు. -
లగడపాటి క్షమాపణ చెప్పాలి
తెయూ(డిచ్పల్లి), న్యూస్లైన్ : తెలంగాణ పాత్రికేయులపై దురుసుగా ప్రవరిస్తూ, వారి అంతుచూస్తానని బెదిరించిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెంటనే బేషరుతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ యూనివర్సిటీ జేఏసీ, టీఎస్జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. లగడపాటి వైఖరిని నిరసిస్తూ వర్సిటీ కళాశాల భవనం ఎదుట గురువారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. లగడపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీఎస్జేఏసీ జిల్లా కన్వీనర్ యెండల ప్రదీప్ మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన ప్రెస్మీట్లో ప్రశ్నలు అడిగిన పాత్రికేయులను ఎంపీ అయి ఉండి బెదిరించడం సిగ్గుచేటన్నారు. లగడపాటి లాంటి పెట్టుబడిదారులు, కబ్జాకోరులు కొం దరు తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకుని వెంటనే పాత్రికేయులకు క్షమాపణలు చెప్పాలని లేదంటే తెలంగాణలో లగడపాటిని అడుగుపెట్ట నీయబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో తెయూ జేఏసీ నాయకులు నాగభూషణం, సంతోశ్, రమేశ్, శ్రీను, రవి, గౌతమ్, ప్రవీణ్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
మీ అంతు చూస్తా... లగడపాటి
మీడియా ప్రతినిధులపై లగడపాటి చిందులు సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ ఎంపీ లగడపాటి రాజ గోపాల్ మరోసారి మీడియాపై చిందులు తొక్కారు. ప్రశ్నించిన విలేకర్లను మీ అంతు చూస్తానని బెదిరించారు. బుధవారం రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందానికి లేఖ రాసిన లగడపాటి ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్లో అల్లకల్లోలం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘అల్లకల్లోలం ఎవరు చేస్తారు?’ అని ఇద్దరు విలేకరులు ప్రశ్నించారు. దీనికి సరైన సమాధానమివ్వని లగడపాటి.. సమావేశం తర్వాత వారితో వాగ్వాదానికి దిగారు. అవివేకంగా మాట్లాడొద్దంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రశ్నలు అడిగితే అవివేకం అంటారేమిటి?’ అని సదరు విలేకరులు ప్రశ్నించారు. దీంతో లగడపాటి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘‘నోర్ముయ్... నీ పేరేంటి? నీ ఏరియా ఏంటి?’’ అంటూ ఊగి పోయారు. ‘‘అవసరమైతే చేతులు లేస్తాయి’’ అంటూ చిందులుతొక్కారు. తన వాహనం ఎక్కుతూ.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. ‘‘నా సంగతేంటో చూపి స్తా... మీ అంతు చూస్తా!’’ అని నిష్ర్కమించారు. -
నవ్విపోదురుగాక నాకేటి...
సర్వేల సర్వారాయుడు.. ప్రగల్భాల ఉత్తరకుమారుడు.. రాజీనామాల్రాయుడు.. పబ్లిసిటీ స్టంట్ మాస్టర్.. సమైక్యతా మాస్క్ధరుడు.. వ్యక్తిగత ఇమేజ్ తప్ప జనం కష్టనష్టాలు పట్టని విజిటింగ్ వీరుడు.. ఆయనెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిన్నపిల్లోడు సైతం ఠక్కున చెప్పేస్తాడు ఆయన ఎంపీ లగడపాటి రాజగోపాల్ అని. ఇప్పుడు ఆయన మరోకొత్త డ్రామాకు తెరలేపారు. సాక్షి, విజయవాడ : ఎంపీ లగడపాటి నగరానికి వస్తున్నారంటే.. ప్రజా సమస్యలు వినడానికో, పరిష్కరించడానికో కాదు, కేవలం ప్రచారానికి మాత్రమేననేది అందరికీ తెలిసిందే. ఆయన విమానం ఎక్కగానే మీడియాకు మెసేజ్లు వస్తాయి. నగరంలోకి అడుగుపెట్టిన దగ్గర్నుంచి తిరిగి విమానం ఎక్కేవరకూ మీడియాను ఏదో విధంగా తన వెంట తిప్పుకోవడం ఆయన స్టయిల్. తనకు ఓట్లేసి గెలిపించిన జనానికి ఏదో చేయాలనే ఆలోచన కంటే తన ప్రతి మాట, చేతలకు విస్తృత ప్రచారం పొందాలనేది ఆయన యావంతా. అందుకే ఆయనను విజిటింగ్ ఎంపీ అని పిలుచుకోవడానికి జనం అలవాటుపడ్డారు. ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారానికి వాడుకోవడం ఆయన బాగా తెలిసిన విద్య. జనం, రాష్ట్రం ఏమైపోయినా సరే వ్యక్తిగత ఇమేజే ఆయనకు కావాల్సిందల్లా. సమైక్య ఉద్యమాన్ని కూడా ఆయన వదిలిపెట్టలేదు. 2009లో ఉద్యమబాట పట్టినప్పుడు జనం సంతోషించారు. అది ఆవిరికావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఆస్పత్రి నుంచి అదృశ్యమై సినీఫక్కీలో హైదరాబాద్కు పరుగుతీయడంతో ఉద్యమం పరువు తీశారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఈసారి రాజీనామా డ్రామాతో రక్తికట్టించేందుకు తాపత్రయపడి అభాసుపాలయ్యారు. ఇప్పుడు కొత్తగా శుక్రవారం మరో పబ్లిసిటీ స్టంట్ చేశారు. ఇందుకు వన్టౌన్లోని మరుపిళ్ల చిట్టి కేంద్ర కాంగ్రెస్ కార్యాలయాన్ని వేదికగా ఎంచుకున్నారు. తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి చిట్టి కార్యాలయం వద్ద సభ ఏర్పాటుచేశారు. ఈ సభలో కీలకమైన నిర్ణయాలు ప్రకటిస్తారని, బ్రహ్మాండం ఊడిపడిపోతుందంటూ ఎలక్ట్రానిక్ మీడియాకు సమాచారం ఎంపీ కార్యాలయ సిబ్బంది సమాచారం ఇచ్చారు. అంతే మొత్తం మీడియా అంతా లైవ్ టెలికాస్ట్కు రంగం సిద్ధంచేసింది. న్యూస్ బులెటిన్ ఎప్పుడు ప్రారంభమవుతుందో సరిగ్గా అదే సమయానికి తన ఉపన్యాసం ప్రారంభించి అనర్గళంగా అరగంట సేపు మాట్లాడేశారు. అందులో తన రాజీనామా ప్రస్తావనగానీ, కనీసం తాను ఏం చేయబోతున్నదీగానీ ఒక్క మాట కూడా చెప్పలేదు. ఉద్యోగులు అలిసిపోయి ఉద్యమానికి విరామం ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపున గ్రామ గ్రామాన పోరాటం చేపట్టాలని మాత్రమే ఉచిత సలహా పడేశారు. తన సర్వేలతోనే సమైక్యాన్ని సాధించవచ్చంటూ ఓ కొత్త సిద్ధాంతాన్ని వెల్లడించారు. తన చిలకజోస్యాలు ఎప్పుడూ గురితప్పలేదని సోదాహరణలతో ఏకరువు పెట్టారు. త్వరలో ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలలోని ఫలితాలపై అంచనాలను ఇప్పటికే అధిష్ఠానానికి పంపానని, డిసెంబర్ ఎనిమిదిన అవి నిజం కానున్నాయని చెప్పారు. ఆ తర్వాత ఆంధ్రరాష్ట్రంలో పరిస్థితిపై కూడా అంచనాలు ఇస్తానని, అప్పుడు అధిష్ఠానం తన మాట వింటుందని ఆయన చెప్పుకొచ్చారు. అంటే తన సర్వేలతోనే సమైక్య రాష్ట్రాన్ని నిలబెడతానని పరోక్షంగా ఉద్ఘాటించారు. గురువారం రాత్రికి నగరానికి చేరుకున్న రాజగోపాల్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని వేదికగా చేసుకుని హడావిడి చేసి మధ్యాహ్నానికి వెళ్లిపోయారు. తన నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పత్తి, వరి, మిర్చి పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని ఆదుకునే ఆలోచన, చర్యలను చేపట్టే విషయం పక్కనపెట్టినా.. కనీసం వారిని పరామర్శించే ప్రయత్నం కూడా చేయలేదు. తన రాజీనామా ఆమోదింపజేసుకున్న తర్వాతే నగరంలో అడుగుపెడతానని కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో శపథం చేసిన ఆయన ఆ మాటే మర్చి శుక్రవారం రెండోసారి బెజవాడకు వచ్చి వెళ్లిన ఎంపీ తీరును జనం ఏవగించుకున్నారు. -
'డర్టీ డజన్ నేతల్లో లగడపాటి ఒకరు'
హైదరాబాద్ : విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెద్ద మూర్ఖుడని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్రెడ్డి మండిపడ్డారు. సీమాంధ్రలో కాంగ్రెస్ను భ్రష్టు పట్టిస్తున్న డర్టీ డజన్ నేతల్లో ఆయనొకరని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డితో కుమ్మక్కు కావాల్సిన అవసరమేమీ కాంగ్రెస్కు లేదని చెప్పారు. ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడకుండా చేతనైతే ఆధారాలు చూపాలని లగడపాటికి సవాల్ విసిరారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు కె.ఆర్.ఆమోస్, కె.యాదవరెడ్డిలతో కలిసి పాల్వాయి మీడియాతో మాట్లాడారు. జగన్ ఓదార్పు యాత్రలో సోనియాని తిట్టినా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఒక్క మాటా మాట్లాడలేదు. దానివల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిందని పాల్వాయి అభిప్రాయపడ్డారు. -
జగన్ మీద లగడపాటికి ఎందుకంత అక్కసు?
జగడపాటి, సారీ లగడపాటి రాజగోపాల్ బాధపడుతున్నారు, దిగులుగా ఉన్నారు. బెంగటిల్లుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతూ, అంకమ్మ శివాలెత్తుతున్నారు. రంకెలేస్తున్న ఆయన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు చేయాల్సింది 'ఇంత సంస్కారహీనంగా ఆ రంకెలేంట'ని లగడపాటిని తిట్టడం కాదు, ఆ రోగగ్రస్తుని బాధని సానుభూతితో చూడండి. వీలైతే ' గెట్ వెల్ సూన్' అని అతనికో గులాబీ పంపండి. కొన్ని బూతుకూతలు కూసినంత మాత్రాన ఆయన అసభ్యులు కారు, గౌరవనీయులైన భారత పార్లమెంటు సభ్యులు (రాజీనామా చేశానని సాకు చెబుతారేమో). ఎకాయెకిన 10 జన్పథ్లో ఎప్పుడైనా అడుగుపెట్టగల పరపతి ఉన్నవాడు. లగడపాటిని 'స్థితిమంతుడు', 'ఆస్తిపరుడు' వంటి బరువు తక్కువ మాటలతో వర్ణించడం (ఆయనకి) పరువు తక్కువ. ఆయనొక సువిశాల పారిశ్రామిక సామ్రాజ్యాధిపతి. వినుకొండ నుంచి గుంటూరు మీదుగా విజయవాడ దాకా ఎదిగిన ఆయనంటే గిట్టని వారు నడమంత్రపు సిరి అని కూడా అంటే అంటారుగాక, అటువంటి కోటానుకోటీశ్వర్ ఎందుకంత ఏడుస్తున్నారు? ఎందుకలా జుట్టుపీక్కుంటూ అరుస్తున్నారు? ఇప్పుడు, ఎప్పుడూ ఫోకస్ తన మీదే ఉండాలని ఏ రాజకీయ నాయకుడైనా అనుకుంటాడు. కాబట్టి లగడపాటిని నీ అర్హతానర్హతలు ఎంచుకోమని ఎలా చెప్పగలం? తెలంగాణ సమస్య మరోసారి తలెత్తినప్పటి నుంచీ కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయినట్టే కలలు గన్న బొత్స, చిరంజీవి, కావూరి.... వంటి నాయకుల క్యూలో ముందు వరసలో తోసుకుంటూ చొరబడ్డవాడు లగడపాటి. ముఖ్యమంత్రి కావాలని కొందరు లోలోన ఆశలు పెట్టుకుంటే, కొందరు 'కుదిరితే అవుదాం' అని ప్రాక్టికల్గా సరిపెట్టుకుంటే, లగడపాటి వంటి మరికొందరు 'నేను గాక పోతే ఇంకెవడు 'అనే మంకు పట్టుతో ఉంటారు. అలా సీఎం సీటుకు మానసికంగా, భౌతికంగా కమిట్ అయిపోయిన లగడపాటికి దుశ్శకునాలు ఎదురయ్యాయి. ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో అవ్వడం వేరు, లోక్సభకో, రాజ్యసభకో సభ్యుడు కావడం కూడా వేరే, ఏకంగా ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అవ్వడం - జీవితంలో అరుదుగా వచ్చే ఛాన్స్. అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి కూడా గట్టిగా లేని కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఆ ఛాన్సు దక్కినప్పుడు, పార్లమెంటు నియోజకవర్గం స్థాయి ఉన్న తనకి ఎందుకు దక్కకూడదు? ఇలా పరిపరి ఆలోచనలు చేసిన లగడపాటికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అవకాశం ఎంతమాత్రం లేదని తేలిపోవడంతో నిద్రపట్టడం లేదు. ఆయన బ్యాలెన్స్ కోల్పోయారు. కోట్లు మూలుగుతున్నాయి, సూటుకేసులతో గదులు నిండి ఉన్నాయి. అవేవీ తనను సీఎం చేయలేవన్న చేదునిజం ఆయనని మరింత దిగజారుస్తోంది. ఎంత ఎక్కువ డబ్బుంటే, అతనికే పెద్ద పదవి అనుకుంటే, ఈ దేశానికి ముఖేష్ అంబానీ ప్రధాన మంత్రి కావాలి; మన రాష్ట్రానికి జీఎంఆర్ అదినేత గ్రంధి మల్లికార్జునరావు ముఖ్యమంత్రి కావాలి. డబ్బుంటే బంగారం తాపడం చేసిన బీఎండబ్ల్యూ కారు కొనొచ్చు, కానీ జగన్కి ఉన్న జనం ప్రేమను కొనడం మాత్రం సాధ్యం కాదు. కొంత సారా పోయించి, కాసిన్ని బిర్యానీ పాకెట్లు పంచి, మహా అయితే కొన్ని దొంగ వోట్లు వేయించుకోవచ్చు. కానీ జన హృదయనేత కావడం కుదరదు. ఎన్ని జన్మలెత్తినా తాను జగన్ కాలేనని అర్థం కావడమే లగడపాటి అక్కసుకి కారణం. నిన్నగాక మొన్న జగన్ 'సమైక్య శంఖారావం' సభ పెడితే అంత జనం వచ్చారేంటి? వానలు, చెరువులకి గండ్లూ లేకపోతే అంతకంతా వచ్చే వారు కదూ! జగన్కి అంత పాపులారిటీ ఏమిటి? ఆయన మాట్లాడుతుంటే జనం ఉద్వేగంతో ఉరకలెత్తడం ఏమిటి? అనే విషయమే లగడపాటికి కొరుకుడు పడలేదు, మింగుడు పడలేదు. డబ్బున్నవాడు ప్రతి ఒక్కడికీ బుర్ర కూడా ఉండాలని రాయడం బాబాసాహెబ్ అంబేడ్కర్ మర్చిపోయారు. (తన) దురదృష్టవశాత్తు లగడపాటికి బుర్ర చాలా తక్కువ, నోరు బాగా ఎక్కువ. నిన్న సోనియాని సూటుకేసులతో కొనేద్దామని భరోసాగా ఉన్న ఆయన, తన నరం లేని నాలుకను అడ్డగోలుగా వాడుతూ జగన్కి సోనియాకీ కొత్త చుట్టరికం కలుపుతున్నాడు. ఉన్న కాస్త మెదడు మోకాలు నుంచి అరికాలుకి జారిపోయిన కంగాళీ స్థితిలో లగడపాటి తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు కొత్త పార్టీ పెట్టే యోచనలో కూడా ఉన్నారని సమాచారం (లేదా కిరణ్ పెడతారని ప్రచారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి). ఆయన కొత్త పార్టీ పెడితే ఏమౌతుంది? సిఎం మాట అటుంచి, కనీసం ఎంపీ సీటు కూడా గల్లంతౌతుందేమో. వర్తమానం వల్లకాడు, భవితవ్యం కటిక చీకటి. కొన్ని రాజకీయ రుగ్మతలకి మందులుండవు. ఎర్రగడ్డ పిలుస్తోంది రా! కదిలిరా! లగడపాటీ! తలకి రోకలి చుట్టుకొని రా కదలిరా! -
'లగడపాటి అసలు స్వరూపం బయటపడింది'
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వరద బాధిత ప్రజలకు పూర్తి న్యాయం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ హామీ ఇచ్చారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ సమైక్య శంఖారావం సభ విజయవంతం కావటంతో... కాంగ్రెస్, టీడీపీలు ఎందుకు బాధపడుతున్నాయని ప్రశ్నించారు. వారు సమైక్యవాదులేనా అన్న అనుమానం కలుగుతుందని కొణతాల అన్నారు. లగడపాటి రాజగోపాల్ అసలు స్వరూపం ఏమిటో మీడియాపై ధ్వజమెత్తిన తీరు అద్ధం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆదివారంనాడు ‘సాక్షి’పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. పత్రికల్లో రాయలేని భాషను ఉపయోగిస్తూ సాక్షి ప్రతినిధులను దూషించారు. మీదమీదకు వస్తూ వీధి రౌడీలా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన ఇతర పాత్రికేయులనూ వదల్లేదు. బూతు పంచాంగం వినిపించి సంస్కార హీనంగా ప్రవర్తించారు. లగడపాటి తిట్ల దండకం విన్న మీడియా ప్రతినిధులు విస్తుపోయారు. -
లగడపాటి మీడియా సమావేశంలో అసలేం జరిగింది?
-
సాక్షి ప్రతినిధిపై లగడపాటి చిందులపై తెలకపల్లి రవి స్పందన
-
లగడపాటి కుసంస్కారం
-
సాక్షి ప్రతినిధిపై లగడపాటి చిందులు