బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే సహించం  | Corporator Sujatha Naik Awareness On Sanitation Hyderabad | Sakshi
Sakshi News home page

బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే సహించం 

Feb 25 2022 6:09 AM | Updated on Feb 25 2022 5:26 PM

Corporator Sujatha Naik Awareness On Sanitation Hyderabad - Sakshi

నందనవనంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కార్పొరేటర్‌ సుజాతనాయక్‌  

హస్తినాపురం: డివిజన్‌లోని కాలనీల ప్రధాన రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే సహించేది లేదని కార్పొరేటర్‌ బానోతు సుజాతానాయక్‌ అన్నారు. గురువారం డివిజన్‌ పరిధిలోని నందనవనం కాలనీలో పారిశుద్ధ్య సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కార్పొరేటర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డివిజన్‌లోని అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించేలా అధికారులు తరచూ పరిశీలించాలన్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ గణేశ్, జవాన్‌ శంకర్, నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి , మల్లేశ్‌గౌడ్‌ , రాజుగౌడ్, మారం శ్రీధర్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement