
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కోదాడఅర్బన్: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కోదాడ ఆర్టీసీ డిపో గేటు ఎదుట టీఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీలో టిమ్స్ సర్వీసులు రద్దు చేయాలని, పెంచిన కిలోమీటర్లు తగ్గించాలని, గ్యారేజీలకు మరమ్మతులు నిర్వహించాలని కోరారు. లేని పక్షంలో తమ ఆందోళలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ఎస్గౌడ్, కేవీరావు, డిఆర్ దాస్,బీఎస్ నారాయణ, పీ.సైదులు తదితరులు పాల్గొన్నారు.