అలరించిన ఎస్పీ శైలజ గానామృతం
శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఎస్పీ శైలజ, శివకాకాని బృందం వారి భక్తి సంగీత విభావరి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ శైలజతోపాటు గోపికాపూర్ణిమ, శ్రీనివాస్, హరి, పారిజాత, హరిప్రియలు శివ శివ శంకరా, బ్రహ్మమురారి, ఓం నమఃశివాయా, శృతినీవు, గతినీవు విభాతన తలపున, అందెల రవమిది తొలిమంచు, అనతి నియరా ప్రభు, వేదం... అణువణువన నాదం తదితర గీతాలను ఆలపించారు. అలాగే వేణుగానాన్ని సత్యశ్రీనివాస్, కీబోర్డును వెంకటేష్, పుణి, వినయ్ డోలక్, సంతోష్, ముఖేష్ తబల సహకారాన్ని అందించారు. కార్యక్రమంలో ఈఓ నారాయణభరత్గుప్త, జేఈఓ హరినాథ్రెడ్డి, స్థానికులు, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కళానీరాజనంలో భాగంగా మంగళవారం యల్లా వెంకటేశ్వరరావు బృందం వారి మృదంగ స్వరలయమాధురి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ తెలిపారు.