music
-
ఆ గానానికి గమ్యం – శ్రీహరి సన్నిధే!
సంగీతం ఆపాతమధురం. భావుకతతో, సమసమాజ భావనలతో, ప్రకృతి వర్ణనలతో... ఇలా హరివిల్లులా సంగీత జగత్తు నాదమయం. అలాగే భక్తి, ప్రపత్తి, శరణాగతులతో గానం చేసిన వారి కీర్తి అజరామరం. మన సమకాలంలో గానం చేస్తున్న, చేసిన సంగీత విద్వాంసులలో తనదైన విలక్షణ గాత్రంతో వెలిగిన ధ్రువతార శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్.నాకు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్తో దశాబ్దాల అనుబంధం. సౌజన్యం, సంస్కారం, వినమ్రత – పరిచయమైన క్షణంలోనే సూదంటురాయిలా ఆకర్షించిన అంశాలు. శక్తి, భక్తి, రక్తి కలిగిన తిరుమల ఆలయ కవి అన్నమయ్య కీర్తనలు పాడి తరించిన సంకీర్తన మహతి.స్వామి పుష్కరిణీ తీరంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని గానం చేసిన భావ పుష్కరిణి అన్నమయ్య. ఆ కీర్తనలలోని రసాత్మ కతను దర్శించి, అనుభవించి స్వర పరచిన మహనీయులలో ఆరాధ్యుడు, అనవధ్యుడు శ్రీ గరిమెళ్ళ. ఒక వాగ్గేయకారుని సహస్ర కీర్తనలు స్వర పరిచి, పాడి, తన శిష్య ప్రశిష్యులతో పాడించిన కారణ జన్ముడు. స్వయంగా వాగ్గేయకారుడు. ‘ఆంజనేయ కృతి మణిమాల’, ‘నవగ్రహ కీర్తనలు’ వంటివి ఇందుకు మణిదర్పణం. లలిత సంగీత రచనల్లో 200 పాటల అందమైన బాలకృష్ణ భావలహరి అజరామరం.గాయకుడిగా, వాగ్గేయకారుడిగా, స్వరకర్తగా, శిష్య ప్రశిష్యులను తీర్చిదిద్దిన సంగీత కులపతి ఆయన. ఉద్యాన వనంలో ఆనేకమైన పూలకుండే పరిమళంలా, ప్రతి పాటకు తాను చేసిన స్వర రచనలో ఎంతో వైవిధ్యం, ఎంతో శాస్త్రీయత ఉట్టిపడుతాయి. అయితే, అంత కన్నా ఎంత ఆర్ద్రత నిండుగా ఉంటుందో స్మరిస్తే పులకించిపోతాం.సంగీత అక్షయ పుణ్యకోశమైన శ్రీ బాలకృష్ణ ప్రసాద్కు నాపై ఉండే ఆదరం నిరుపమానం. లెక్కకు మించిన సార్లు నా ఇంటికి వచ్చి నాకు నచ్చిన పాటలు వినిపించిన ఆత్మబంధువు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడిగా నేను రూపకల్పన చేసిన ‘దళిత గోవిందం’, ‘కల్యాణమస్తు’, ఇంకా, దేశ విదేశాల్లో జరిగిన కల్యాణాల్లో, ఇతర ధార్మిక కార్యక్రమ ప్రస్థానంలో, ఆయన నా సహచరుడు. దళిత గోవిందం, శ్రీనివాస కల్యాణాల్లో – ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’, ‘ఇతడొక్కడే సర్వేశ్వరుడు’ వంటి కీర్తనలు ఆయన ఆలపించిన తీరు నాలో చెరగని ముద్ర వేశాయి. బాలకృష్ణ ప్రసాద్ ఛాందసుడు కాడు. మానవత్వం మొగ్గ తొడగాలని, సమాజంలో అన్ని వర్గాల మధ్య మమతా బంధాలు బలపడాలనే తాత్వికుడు. ఈ సత్యాన్ని తెలిపే వారి లలిత గీతాలు – ఆకాశవాణిలో ఎన్నో ప్రసారం అయ్యాయి. సామ్యవాదాన్ని, సౌమ్య వాదాన్ని మేళవించుకొన్న స్థితప్రజ్ఞడు.రాజకీయ నాయకుల్లో మాట తప్పని, మడమ తిప్పని మహ నీయుడు శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారితో చేయించిన సన్మానం తనకొక మధుర స్మృతిగా నాకు తరచూ చెప్పేవాడు. జన హృదయ నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆదేశిస్తే, తి.తి.దే. అధ్యక్షుడిగా ఆయనకు ‘పద్మశ్రీ’ ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాను. కేంద్ర సంగీత నాటక ఆకాడమీ సన్మానితుడిగా, తి.తి.దే. ఆస్థాన పండితుడిగా, బిరుదులకే గౌరవాన్ని తెచ్చిన, లేదా పెంచిన ప్రజ్ఞాశాలి ఆయన. లాలిపాటల నుండి జోల పాటల వరకు కులశేఖరపడి వద్ద పాడిన అపర అన్నమయ్య.శ్రీవారి సేవలో నాద విద్వాంసుడిగా జీవించిన పూర్ణకాముడు. ఆ గాత్రానికుండే ప్రత్యేకత ఆరు దశాబ్దాల కాలం, ఇలలో సౌగంధికా సౌరభాన్ని నింపింది. ఇక కోనేటి రాయుని కొలువులో నారద,తుంబురులతో గానం చేస్తాడు. అన్నమయ్య కీర్తనలను, తన కీర్తనలను కలిపి గానం చేస్తూ తాళ్ళపాక కవులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతాడు. పులుకు తేనెల తల్లి అమృత హస్తాలతో ఆనందామృతాన్ని గ్రోలుతాడు. ఆ మహనీయుని ధర్మపత్ని శ్రీమతి రాధ, వారి పుత్రులైన శ్రీ అనిల్ కుమార్, శ్రీ పవన్ కుమార్లకు – జాలి గుండెలవాడైన ఏడుకొండలస్వామి నిండైన అండదండగా ఉంటాడని విశ్వసిస్తున్నాను.భూమన కరుణాకర రెడ్డి వ్యాసకర్త పూర్వ అధ్యక్షులు,తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి -
ఇళయరాజా బయోపిక్ కు బ్రేక్ పడిందా ?
-
'ది గ్రామఫోన్ గర్ల్': శాస్త్రీయ సంగీతాన్ని జస్ట్ మూడు నిమిషాల్లో..!
ఫోనోగ్రాఫ్ లేదా గ్రామఫోన్ అనేది రికార్డు చేయబడిన ధ్వనులను ప్లే చేసే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. పాతకాలంలో మ్యూజిక్ వినడానికి దీన్నే ఉపయోగించేవారు. ఆ రోజుల్లో దీని హవా ఎక్కువగా ఉండేది. 1900ల కాలంలో ప్రజల ఇళ్లల్లో ఎక్కువగా ఉండేది. అలాంటి గ్రామఫోన్ కంపెనీకి ప్రదర్శనకారిణిగా తొలి సంతంకం చేసిన భారతీయురాలు ఆమె. మన హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని కేవలం మూడు నిమిషాల్లో రికార్డింగ్ చేసిన ఘనతను అందుకుంది కూడా. అంతేగాదు చాలా భాషల్లో పాటు పాడి ఏకంగా 600కు పైగా రికార్డింగ్లు చేశారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె గాత్రం రికార్డింగుల రూపంలో మన మధ్యే చిరంజీవిగా నిలిచిపోయింది. ఎవరామె అంటే.ఆమె పేరు ఏంజెలీనా యోవార్డ్. జూన్ 26, 1873న జన్మించింది. ఆమె అర్మేనియన్ క్రైస్తవ తండ్రి, తల్లి విక్టోరియా హెమ్మింగ్స్లకు జన్మించారు. ఇక ఆమె అమ్మమ్మ హిందూ, తాత బ్రిటిష్. దీంతో ఆమె బాల్యం విభిన్న సంస్కృతుల మేళవింపుతో సాగింది. అయితే ఆమెకు ఇస్లాం మతం అంటే ఇష్టం. ఆ నేపథ్యంలోనే తన పేరు గౌహర్ జాన్గా మార్చుకుంది. అలా పేరు మార్చుకున్న తర్వాత ఆమె తన తల్లితో కలిసి కోల్కతాకు వెళ్లి నవాబ్ వాజిద్ అలీ షా ఆస్థానాలలో స్థిరపడింది. తర్వాత 1887లో దర్భంగా రాజ న్యాయస్థానాలలో తన తొలి ప్రదర్శన ఇచ్చింది. ఇక అక్కడే బనారస్లోని ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్ నుంచి విస్తృతమైన నృత్య, సంగీతాల్లో శిక్షణ పొంది ఆస్థాన సంగీత విద్వాంసురాలుగా నియమితులైంది. అలా ఆమెకు "తొలి నృత్యకారిణి" అనే పేరు వచ్చింది. కానీ ఆకాలంలో రికార్డింగ్ టెక్నాలజీ గ్రామఫోనే కాబట్టి. ఆ కంపెనీకి తన గాత్రం అందించిన తొలి భారతీయురాలుగా గౌహర్ జాన్ చరిత్రలో నిలిచిపోయింది. ఆమె ఆ గ్రామఫోన్లో ఎన్నో పాటలను రికార్డుచేసింది. ఆ కాలంలో వైశ్యలు బహిరంగా సభలు నిర్వహించి థుమ్రీలు, దాద్రా, కజ్రీ, హోరి, చైతి, భజనలు, ఖయాల్స్ పాడేవారు. ఇక్కడ గౌహర్ కూడా వేశ్య. ఆ కాలం ఆస్థాన నృత్యకారిణులను వేశ్యలగానే పరిగణించేవారు. అయితే ఆమె విలక్షణమైనది ఎందుకంటే బ్రిటిషర్ల గ్రామఫోన్లో మన హిందూ సంగీతాన్ని వినేలా చేసింది ఆమెనే. అయితే ఇది మూడు నిమిషాల్లోనే రికార్డు చేయాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక డిస్క్ అంత సమయం వరకే రికార్డు చేయగలిగేది. గౌహర్ అంత నిడివిలో మన హిందుస్తానీ మ్యూజిక్ని స్వరపరిచి గానం చేయడం విశేషం. అలా ఆమె మొత్తం పది వేర్వేరు భాషల్లో పాటలు పాడి 600కి పైగా రికార్డింగ్లు చేశారు. అంతేగాదు కృష్ణ భక్తికి సంబంధించిన రచనలు చేసేది. విలాసవంతంమైన జీవితం..ఇక ఆమె జీవనవిధానం అత్యంత విలాసవంతంగా ఉండేది. ఆ రోజుల్లో నాలుగు గుర్రాలతో నడిచే బగ్గీని కలిగిన సంపన్నుల్లో ఆమె ఒకరిగా ఉండేది. అంతేగాదు ఈ బగ్గీ కారణంగా వైస్రాయ్కి వెయ్యి రూపాయల జరిమానా కూడా చెల్లించేదట. ఇక ఆ రోజుల్లోనే తన పెంపుడు పిల్లికి పిల్లలు పుట్టారని ఏకంగా రూ. 20 వేలు ఖర్చుపెట్టి గ్రాండ్గా పార్టీ ఇచ్చి అందర్నీ విస్తుపోయేలా చేసిందట. ప్రేమలో విఫలం..ఆమె ఎంతోమందిని ప్రేమించింది గానీ ఏదీ పెళ్లిపీటల వరకు రాలేదు. వాళ్లంతా ఆమె వెనుకున్న ఉన్న డబ్బు కోసమే తప్ప.. స్వచ్ఛమైన ప్రేమను పొందలేకపోయానని బాధపడుతూ ఉండేదట. ఇక గౌహర్ వయసు మీద పడటంతో నృత్యం, పాటలు పాడటం ఆపేసి ఒంటరిగా కాలం వెళ్లదీస్తుండేది. అయితే అంత్యకాలంలో మహారాజా నల్వాడి కృష్ణరాజ వడియార్ IV రాష్ట్ర అతిథిగా, ఆస్థాన సంగీతకారిణిగా మైసూరుకు ఆహ్వానించారు. అయితే అక్కడకు వెళ్లిన 18 నెలలకే తుది శ్వాస విడిచింది. ఆమె నృత్యం, గానంలో తనదైన ముద్రవేయడంతో ఆ కాలంలోని పోస్ట్కార్డ్లు, అగ్గిపెట్టేలపై ఆమె ముఖ చిత్రాన్నే ముద్రించి గౌరవించారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా రికార్డింగ్ చేసిన పాటల రూపంలో మన మధ్య బతికే ఉంది. (చదవండి: జుట్టు కుదుళ్లను బలోపేతం చేసే హెల్మెట్..!) -
యార్కర్ కింగ్ లసిత్ మలింగా పాడిన ఈ పాట విన్నారా?
కొలంబో : శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ గురించి పరిచయం అక్కర్లేదు. దశాబ్దన్నర పాటు క్రికెట్లో తన కళ్లు చెదిరే యార్కర్లతో బ్యాట్స్మెన్ని బోల్తా కొట్టించిన యార్కర్ కింగ్ మళ్లీ యాక్టీవ్ అయ్యారు. సింగర్గా సరికొత్త అవతారం ఎత్తారు. సాంగ్ రైటర్గా ఇప్పటికే ఎంటర్టైన్ చేస్తున్న ఈ స్పీడ్ స్టర్ ఈసారి మరో సాంగ్తో అభిమానుల ముందుకు వచ్చారు. గతంలో పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. శ్రీలంక సింగర్లతో గొంతు కలిపారు. ఆయన పాడిన పాటలు కొన్ని హిందీలో డబ్ అయ్యాయి. ఈ తరుణంలో తాజాగా ఓ సాంగ్ను పాడారు. ఇప్పుడా ఆ సాంగ్ సంగీత ప్రియుల్ని అలరిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ పాట ఎలా ఉందో మీరూ వినేయండి.From Slinga Malinga to Singer Malinga!One of the all time greats, Lasith Malinga 😍🥰 pic.twitter.com/98sxoaAAoc— Dr. Jo (@ERDrJo) December 25, 2024 -
కథల ఫ్యాక్టరీ! అక్కడ కథలు డ్యాన్స్ చేస్తాయి, చిత్రాలు ..
ఆ ఫ్యాక్టరీలో కథలు డ్యాన్స్ చేస్తాయి. చిత్రాలు గీస్తాయి. సంగీత పరికరాలతో ఆటలు ఆడిస్తాయి. ఆ ఫ్యాక్టరీలో కథలు ఎంతో సహజాతిసహజంగా తయారవుతాయి. చిన్నా పెద్ద అందరినీ నవ్వులలో ముంచెత్తుతాయి. పేరు ‘ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ.’ ఫౌండర్ రఘుదత్. హైదరాబాద్ వాసి అయిన రఘు ఆరేళ్లుగా చేస్తున్న ఈ ప్రయాణంలో ‘నా స్టోరీ మీకు స్ఫూర్తినివ్వాలి, నా శరీరం కాదు’ అంటూ సృజనాత్మక ఆలోచనలనూ, ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు... ‘‘ఇటీవల వృద్ధాశ్రమంలో ఒక ప్రోగ్రామ్ చేశాం. అక్కడ ఒక పెద్దావిడ తన చిన్ననాటి స్టోరీ ఒకటి అందరి ముందు పంచుకుంది. చిన్నప్పుడు స్కూల్లో వేదికపైన మాట్లాడాలన్నా, పాట ΄పాడాలన్నా చాలా సిగ్గుపడేవారంట. ఇప్పుడు నలుగురిలో పాడటానికి సిగ్గుపడుతూ అప్పటి రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ తన చిన్ననాటి కథను పంచుకున్నారు. తాత వయసున్న ఒకతను ముందుకు వచ్చి డ్యాన్స్ చేస్తూ తన కాలేజీ రోజులను గుర్తుచేసుకుంటూ నాటి కథను షేర్ చేశారు. అవన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయంటే అక్కడ ఉండి వారి కథల్లో మనమూ గెంతులు వేయాల్సిందే. కొందరు పెయింట్ ద్వారా, మరికొందరు మ్యూజిక్ ద్వారా తమ కథలను పరిచయం చేస్తుంటారు. ఈ విధానం వల్ల అంతర్లీనంగా వారిలో ఉన్న కళ, ఆనందం తమ చుట్టూ ఉన్నవారికి పంచుతారు. ‘ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ’ ఉద్దేశ్యం కూడా అదే. అందరూ కథ ద్వారా బోలెడంత ఆనందాన్ని పొందాలి. అందరిలోనూ ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది. నెలకు ఒకసారైనా మనలో ఉన్న ఆ చైల్డ్ను బయటకు తీసుకువచ్చి, ఎంజాయ్ చేయిస్తే ఇన్నర్లైఫ్ అంతా హ్యాపీగా మారి΄ోతుంది. అందుకే ‘ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ కింద ‘లివ్ యా స్టోరీ’ అని ఉంటుంది. రిజెక్ట్ చేశారనే... పదేళ్లుగా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కౌన్సెలర్గా ట్రెయినింగ్ ఇస్తున్నాను. స్పోర్ట్స్ సైకాలజీలో కోర్సు చేశాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మాస్టర్స్ చేశాను. క్రికెట్ అసోసియేషన్స్, క్రికెట్ పర్సన్స్కి కౌన్సెలర్గా చేశాను. నా స్టూడెంట్స్ కొందరు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఒక స్టోరీ టెల్లింగ్ ఫ్లాట్ఫామ్ వాళ్లు నేను డిజేబుల్డ్ అని, సోషల్ మీడియాలో ఎక్కడా లేనని నన్ను రిజెక్ట్ చేశారని తెలిసి బాదనిపించింది. దీంతో నేనే ఓ కొత్త ఫ్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకున్నాను. అప్పటికే, పేరెంట్స్ని లేని ఒక అమ్మాయిని దత్తతు తీసుకొని చదివిస్తున్నాను. ఆ అమ్మాయి పేరు ఆఫియా. ఇప్పుడు ఇంటీర్మడియెట్ చేస్తుంది. ఆ అమ్మాయి స్టోరీకి మించినదేదీ ఉండదని తనతోనే ఫస్ట్ స్టోరీ స్టార్ట్ చేశాం. అక్కణ్ణుంచి స్కూళ్లు, కాలేజీలు, ఎన్జీవోలకు, వృద్ధాశ్రమాలకు వెళ్లి స్టోరీ ఈవెంట్స్ చేయడం మొదలుపెట్టాం. 2018లో మొదలు పెట్టిన ఈ ప్రోగ్రామ్లో దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు.. ఇలా ఒక వర్గానికి మాత్రమే చెందినవారు ఉండకూడదని, మానవత్వంతో కూడిన కథలే ఉండాలని నియమం పెట్టాం. మా ΄్లాట్ఫామ్ పైన ఆటిజమ్ కిడ్స్ కూడా తమ స్కిల్స్ను ప్రదర్శించేలా వేదికను సిద్ధం చేశాం. లైఫ్స్కిల్స్లో శిక్షణ...‘టిజిటిఎఫ్ విద్య’ పేరుతో ఇప్పుడు 20 మంది పేద పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. పాతికమంది వాలంటీర్లు ఉన్నారు. స్కాలర్షిప్స్ ఇవ్వడమే కాకుండా లైఫ్ స్కిల్స్, వాల్యూస్, కమ్యూనికేషన్స్పై పిల్లలకు, యూత్కి స్కిల్డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాం.స్వచ్ఛందంగా... ఈ యేడాది గోవాలో ఆరు రోజుల పాటు పర్పుల్ ఫెస్ట్ జరిగింది. ప్రపంచంలో ఉన్న దివ్యాంగులు అందరూ ఒక చోట చేరే సందర్బం. అందులో ‘ది గుడ్ టాక్ ఫాక్టరీ’ ఒక వాలంటీర్గా పనిచేసింది. ముందే 1200 స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ట్రెయినింగ్ ఇచ్చాం. ఆరు రోజుల ఈవెంట్లో 60–70 వేల మంది పాల్గొన్నారు. అందులో టిజిటిఎఫ్ పెద్ద పాత్ర పోషించింది.వైకల్యం ఉన్న వ్యక్తి ఏదైనా సాధిస్తే గొప్పగా చూడరు. వారి బాడీలో లోపాన్ని చూపిస్తూ అదొక స్ఫూర్తిగా పరిచయం చేస్తారు. జాలిగా చూస్తారు. చాలా కష్టంగా అనిపిస్తుంది. నా స్టోరీ స్ఫూర్తినివ్వాలి, నా శరీరం కాదు’’ అంటున్నారు ‘ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ’ రఘు. కథ ఎన్జీవో అయితే... స్వచ్ఛందంగా ఓ పది మందిమి కలిసి ఆరేళ్లుగా ఈ కథల ఫ్యాక్టరీకి పనిచేస్తున్నాం. దీని ద్వారా కొంత మంది పేద పిల్లలకు చదువు చెప్పిస్తే బాగుంటుంది కదా అనుకున్నాం. మూడేళ్ల క్రితం ‘టిజిటిఎఫ్ విద్య’ పేరుతో ఎన్జీవోగా తీసుకొచ్చాం. ఈ సంస్థ ద్వారా చైల్డ్ ఎడ్యుకేషన్లో భాగంగా 20 మంది నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేస్తున్నాం. యువతకు, మహిళలకు స్కిల్ డెవలప్మెంట్లో ట్రెయినింగ్స్ ఇస్తున్నాం. ఈ కథల జర్నీలో ఏరుకున్న కథలెన్నో ఉన్నాయి. – రఘు – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: తీవ్ర కాలుష్యం నడుమ..మెరుగైన వాయునాణ్యతతో కూడిన ఇల్లు..!) -
ప్రెజర్ నుంచి ప్లెజర్కు...
పోటీ పరీక్షల ఒత్తిడి, ఉద్యోగంలో పని ఒత్తిడి, సంసార జీవితంలో ఆర్థిక సమస్యల ఒత్తిడి, వ్యాపారంలో నష్టాల ఒత్తిడి... ‘ఒత్తిడి’ రాక్షస పాదాల కింద ఎన్నో జీవితాలు నలిగిపోతున్నాయి. అయితే ఒత్తిడి అనేది తప్పించుకోలేని పద్మవ్యూహమేమీ కాదు. ఒత్తిడిని చిత్తు చేసే వజ్రాయుధం, ఔషధం సంగీతం అని తెలిసిన స్వప్నరాణి... ఆ ఔషధాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు, గృహిణుల నుంచి ఉద్యోగుల వరకు ఎంతోమందికి చేరువ చేస్తోంది. మరోవైపు మరుగునపడిన జానపదాలను వెలికి తీస్తూ ఈ తరానికి పరిచయం చేస్తోంది. ‘సంగీతం ఈ కాలానికి తప్పనిసరి అవసరం’ అంటుంది.నిజామాబాద్కు చెందిన స్వప్నరాణి సంగీతం వింటూ పెరిగింది. సంగీతం ఆమె అభిరుచి కాదు జీవనవిధానంగా మారింది. యశ్వంత్రావ్ దేశ్పాండే దగ్గర హిందుస్తానీ సంగీతంలో డిప్లమా, పాలకుర్తి రామకృష్ణ దగ్గర కర్ణాటక సంగీతంలో డిప్లమా చేసింది. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో సంగీతంలో ఎంఏ, పీహెచ్డీ చేసింది. ఉత్తర తెలంగాణలో సంగీతంలో పీహెచ్డీ చేసిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందింది.‘ఇందూరు జానపద సంగీతంలో శాస్త్రీయ ధోరణులు’ అనే అంశంపై పరిశోధన చేసింది. తన పరిశోధనలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఆరువందలకు పైగా జానపద పాటలను సేకరించింది. సంగీతం అనేది నిలవ నీరు కాదు. అదొక ప్రవాహ గానం. ఆ గానాన్ని సంగీత అధ్యాపకురాలిగా విద్యార్థులకు మాత్రమే కాదు వయో భేదం లేకుండా ఎంతోమందికి చేరువ చేస్తోంది స్వప్నరాణి.స్వప్నరాణి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకోవడానికి కనీస అర్హత ఏమిటి?‘నాకు సంగీతం నేర్చుకోవాలని ఉంది’ అనే చిన్న మాట చాలు.నిజామాబాద్లోని ప్రభుత్వ జ్ఞానసరస్వతి సంగీత, నృత్య పాఠశాలలో అసిస్టెంట్ లెక్చరర్గా పనిచేస్తున్న డాక్టర్ తిప్పోల్ల స్వప్నరాణి ‘నాకు వచ్చిన సంగీతంతో నాలుగు డబ్బులు సంపాదించాలి’ అనే దృష్టితో కాకుండా ‘నాకు వచ్చిన సంగీతాన్ని పదిమందికి పంచాలి’ అనే ఉన్నత లక్ష్యంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.స్వప్నరాణి దగ్గర పాఠాలు నేర్చుకున్న వారిలో కాస్తో కూస్తో సంగీత జ్ఞానం ఉన్నవారితో పాటు బొత్తిగా స ప స లు కూడా తెలియని వారు కూడా ఉన్నారు.స్వప్న శిష్యుల్లో సాధారణ గృహిణుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఎంతోమంది ఉన్నారు.‘సంగీతం గురించి వినడమే కానీ అందులోని శక్తి ఏమిటో తెలియదు. స్వప్న మేడమ్ సంగీత పాఠాల ద్వారా ఆ శక్తిని కొంచెమైనా తెలుసుకునే అవకాశం వచ్చింది. స్ట్రెస్ బస్టర్ గురించి ఏవేవో చెబుతుంటారు. నిజానికి మనకు ఏ కాస్త సంగీతం వచ్చినా ఒత్తిడి అనేది మన దరిదాపుల్లోకి రాదు’ అంటుంది ఒక గృహిణి.‘సంగీతం నేర్చుకోవాలనేది నా చిన్నప్పటి కల. అయితే రకరకాల కారణాల వల్ల ఆ కల కలగానే మిగిలిపోయింది. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నాను. ఈ టైమ్లో సంగీతం ఏమిటి అనుకోలేదు. స్వప్నగారి పాఠాలు విన్నాను. నా కల నెరవేరడం మాట ఎలా ఉన్నా... సంగీతం వల్ల ఒత్తిడికి దూరంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను’ అంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగి.ఇప్పటికి ఐదుసార్లు శతగళార్చన కార్యక్రమాలు నిర్వహించిన స్వప్న ‘సహస్ర గళార్చన’ లక్ష్యంతో పనిచేస్తోంది. ‘రాగం(నాదం), తాళంలో శృతిలయలు ఉంటాయి. నాదంలో 72 ప్రధాన రాగాలు ఉంటాయి. ఏ శబ్దం ఏ రాగంలో ఉండాలో ట్రాక్ తప్పకుండా ఉండాలంటే నేర్చుకునేవారిలో ఏకాగ్రత, నిబద్ధత తప్పనిసరిగా ఉండాలి. ఒక దీక్షలా అభ్యసిస్తేనే సంగీతంలో పట్టు సాధించడం సాధ్యమవుతుంది’ అంటుంది స్వప్నరాణి.భవిష్యత్తుకు సంబంధించి స్వప్నరాణికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. తన విద్యార్థులను ప్రతి ఏటా పుష్య బహుళ పంచమి రోజున తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువాయూరులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలకు సంసిద్ధం చేయడం వాటిలో ఒకటి. భవిష్యత్తులో సహస్ర గళార్చన కార్యక్రమాలు ఎక్కువగా చేసే లక్ష్యంతో శిష్యులను తీర్చిదిద్దుతుంది.సంగీతం... ఈ కాలానికి తప్పనిసరి అవసరం‘సంగీతం మనకు ఏం ఇస్తుంది?’ అనే ప్రశ్నకు ఒక్క మాటల్లో జవాబు చెప్పలేం. సంగీతం అనేది తీరని దాహం. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. పాఠశాల విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఎంతోమంది ఒత్తిడి గురవుతున్నారు. అందుకే ఈ కాలానికి సంగీతం అనేది తప్పనిసరి అవసరం.సంగీతం వినడమే కాదు నేర్చుకోవడం కూడా గొప్ప అనుభవం. నా పరిశోధనలో భాగంగా మరుగున పడిన ఎన్నో జానపదాలను సేకరించిన వాటిని ఈ తరానికి పరిచయం చేస్తున్నాను.– స్వప్నరాణి– టి భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ -
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో 'ది ఫాంటమ్ ఆఫ్ ది ఒపెరా' సంగీత ప్రదర్శన
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రపంచంలోని అత్యుత్తమ సంగీత ప్రదర్శన ‘ది ఫాంటమ్ ఆఫ్ ది ఒపెరా’ని ప్రదర్శించనుంది. ఇది ఒక ఐకానిక్ లవ్ స్టోరీకి సంబంధించిన సంగీతం. మార్చి 05, 2025న ముంబైలోని గ్రాండ్ థియేటర్ నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(ఎన్ఎంఏసీసీ)లో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఎన్ఎంఏసీసీ చైర్మన్ నీతా అంబానీ మాట్లాడుతూ.. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచంలోని అత్యుత్తమమైన సంగీతాన్ని భారతీయ ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఉన్నాం. ప్రస్తుతం ఈ కల్చర్ సెంటర్ రెండొవ వార్షికోత్సవానికి చేరుకున్న నేపథ్యంలో థియేట్రికల్ అద్భుతం 'ది ఫాంటమ్ ఆఫ్ ది ఒపెరాను ప్రదర్శించనున్నాం అని ప్రకటిస్తున్నాందుకు చాలా సంతోషంగా ఉంది." అని నీతా ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఈ సంగీత ప్రదర్శనను వీక్షించేందుకు అందురూ రావాలని ఆహ్వానించారు. బ్రిటన్ ప్రసిద్ధ మ్యూజిక్ కంపోజర్ లాయిడ్ వెబ్బర్ దీనికి సంగీతాన్ని అందించారు. 1910 నవల "ది ఫాంన్టాం ఆఫ్ ఒపెరా" ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇందులో ఫాంటమ్ అనే ఒక యువ సోప్రానో, క్రిస్టీన్ డాయే అనే అమ్మాయితో ప్రేమలోపడతాడు. ఆ కథ అంతా ప్యారిస్ ఒపేరా హౌస్ క్రింద దాగి ఉన్న వ్యక్తి గురించి చెబుతుంది. ఫాంటమ్ అనే యువ సోప్రానో ఈ ప్యారిస్ హౌస్ కింద ఉంటాడు. అతడిని ముట్టడించే ప్రయత్నం చేస్తుంది క్రిస్టీన్ డాయే. ఇది వారిద్దరి మధ్య సాగే ప్రేమ, ముట్టడి, అందం, రాక్షసత్వం మధ్య సాగిన పోరాటమే ఇతివృత్తంగా ఈ సంగీత ప్రదర్శన ఉంటుంది. ఈ సంగీత ప్రదర్శన తొలిసారిగా అక్టోబర్ 9, 1986న లండన్ వెస్ట్ ఎండ్లోని హర్ మెజెస్టి థియేటర్లో ప్రదర్శించారు. ఆ తర్వాత జనవరి 26, 1988న బ్రాడ్వేలో మెజెస్టిక్ థియేటర్లో ప్రదర్శించడం జరిగింది. అలా మొత్తం 70కి పైగా ప్రధాన థియేటర్ అవార్డులను గెలుచుకున్న గొప్ప సంగీత ప్రదర్శనగా నిలిచింది. మొత్తం 21 భాషల్లో 195 నగరాల్లో 160 మిలియన్ల మందికి పైగా వీక్షించిన ప్రసిద్ధ సంగీత ప్రదర్శన కళగా ఘనత దక్కించుకుంది. అంతేగాదు బ్రాడ్ వే థియేటర్లో ఎక్కువ కాలం ప్రదర్శించిన సంగీత ప్రదర్శనగా కూడా నిలిచింది. ముంబైకి వస్తున్న ఈ సంగీత ప్రదర్శన కళని వీక్షించాలంటే ఎన్ఎంఏసీసీ డాట్ కామ్ లేదా బుక్మైషో డాట్ కామ్లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. టిక్కెట్ ధర రూ. 1250 నుంచి మొదలవ్వుతుంది.(చదవండి: అందాల రాణి ఐశ్వర్య రాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
చిన్నప్పుడే విషప్రయోగం కానీ.. ‘క్వీన్ ఆఫ్ గజల్స్’ బేగం అఖ్తర్!
చీకటి తరువాత వెలుగు’ అనేది ప్రకృతి సూత్రం.అయితే బేగం అఖ్తర్ విషయంలో ఈ సూత్రం తిరగబడింది. చీకటి తరువాత చీకటి...మరింత చీకటి... ఆమె జీవితం. అంత అంధకారంలోనూ వెయ్యి దీపకాంతులతో సంగీతంతో వెలిగిపోయింది. అందుకే అఖ్తర్ బేగం ‘క్వీన్ ఆఫ్ గజల్స్’ అయింది. ‘అమ్మీ’ నాటకంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ప్రముఖ నటి పద్మిని కొల్హాపురి అక్తర్ బేగం పాత్ర పోషించిన అమ్మీనాటక ప్రదర్శన వివిధ నగరాలలో ప్రారంభమైన సందర్భంగా..వన్స్ అపాన్ ఏ టైమ్... ఇన్ ఫైజాబాద్: న్యాయవాది అస్ఘర్ హుస్సేన్కు ముస్తారీ రెండవ భార్య. కొద్దికాలం తరువాత భార్య, కవల కుమార్తెలు జోహ్ర, బిబ్బీలను దూరం పెట్టాడు. నాలుగేళ్ల వయసులో అక్కాచెల్లెళ్లపై విష ప్రయోగం జరిగింది. మిఠాయిలు తిన్న అక్కాచెల్లెళ్లు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో జోహ్రా చనిపోయింది. విషయం తెలియని బిబ్బీ ‘జోహ్ర ఎక్కడ?’ అని అడిగింది.‘దేవుడి ఇంటికి వెళ్లింది’ అని చెప్పింది కళ్లనీళ్లతో అమ్మ. అప్పుడు బిబ్బీకి ఏం అర్థం కాలేదు. ఆ తరువాత మెల్లగా అర్థం కావడం మొదలైంది. అక్కతో మాట్లాడడం మిస్ అయింది. అక్కతో కలిసి నవ్వులు పంచుకోవడం మిస్ అయింది. జోహ్ర వీపు మీద కూర్చొని గుర్రంలా స్వారీ చేస్తూ బిగ్గరగా అరవడం మిస్ అయింది. క్రమంగా బిబ్బీ నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది.ఎప్పుడూ మౌనంగా ఉండే అమ్మాయి అయింది. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఉండేది. ఇది గమనించిన తల్లి బిబ్బీని సంగీత తరగతులకు పంపించింది. ఆ తరగతులకు ఇష్టంతో వెళ్లిందా, తల్లి బలవంతం మీద వెళ్లిందా అనేది తెలియదుగానీ ఏడేళ్ల వయసులో చంద్రబాయి అనే ఆర్టిస్ట్ సంగీతానికి ఫిదా అయిపోయింది బిబ్బీ. ఇక అప్పటి నుంచి సంగీతం వైపు ఇష్టంగా అడుగులు మొదలయ్యాయి. పట్నాకు చెందిన ప్రసిద్ధ సారంగి విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్దాద్ఖాన్ దగ్గర సంగీతంలో శిక్షణ పొందింది. తల్లితో కలిసి కోల్కతాకు వెళ్లి లాహోర్కు చెందిన మహ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ఖాన్లాంటి శాస్త్రీయ సంగీత దిగ్గజాల దగ్గర సంగీతం నేర్చుకుంది. బిబ్బీ ‘బేగం అఖ్తర్’ అయిందిపదిహేనేళ్ల వయసులో తొలిసారిగా వేదిక మీద కనిపించింది. నేపాల్–బిహార్ భూకంప బాధితుల సహాయంకోసం ఏర్పాటు చేసిన కచేరిలో బేగం అఖ్తర్ గానాన్ని సరోజినీనాయుడు ప్రశంసించింది. ఆ ప్రశంస తనకు ఉత్సాహాన్ని ఇచ్చింది. గజల్స్, దాద్రాలు, టుమ్రీల గ్రామ్ఫోన్ రికార్డులతో బేగం అఖ్తర్ పేరు మారుమోగిపోయింది. వినేకొద్దీ వినాలనిపించే స్వరం, అందమైన రూపం ఆమెను సినిమా రంగానికి తీసుకెళ్లింది. మన దేశంలో టాకీ శకం మొదలైన తరువాత కొన్ని హిందీ చిత్రాలలో నటించింది. తాను నటించిన అన్ని సినిమాల్లోని పాటలను స్వయంగా పాడింది.లక్నోకు చెందిన ఇష్తియాక్ అహ్మద్ అబ్బాస్ అనే బారిస్టర్తో అఖ్తర్కు వివాహం అయింది. వివాహానంతరం భర్త ఆంక్షల కారణంగా దాదాపు ఐదేళ్ల పాటు గానానికి దూరం అయింది. దీనికి తోడు తల్లి చనిపోవడంతో అఖ్తర్ మానసికంగా, శారీరకంగా బాగా కుంగిపోయింది. ‘మీరు దుఃఖం నుంచి బయటపడే మార్గం సంగీతం మాత్రమే’ అని వైద్యులు సలహా ఇచ్చారు. అలా వారి సలహాతో సంగీతానికి మళ్లీ దగ్గరైంది.సంగీతం వైపు తిరిగిరావడం బేగం అఖ్తర్కు రెండో జీవితం అయింది. ఆల్ ఇండియా రేడియో ద్వారా తన తీపి గళాన్ని దేశం నలుమూలలా వినిపించింది. 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన బేగం అఖ్తర్ అభిమానుల గుండ్లెలో ‘క్వీన్ ఆఫ్ గజల్స్’గా నిచిలింది.‘ఏ మొహబ్బతే’ పుస్తకం రాసిన రీటా గంగూలి మాటల్లో... ‘బేగం అఖ్తర్ అంటే ఏళ్ల తరబడి ఒంటరితనం. నీడలా వెంటాడే బాధ. విషాదం అనేది తన జీవితంలో విడదీయని భాగం అయింది. జీవితంలో లోతైన శూన్యాన్ని అనుభవించిన బేగం అఖ్తర్ దేవుడా, తర్వాత ఏమిటి అనే భయంతోనే జీవించింది. ప్రకాశవంతమైన చిరునవ్వుతో అత్యంత విషాదకరమైన పాటను పాడే సామర్థ్యం ఆమెలో ఉంది’.‘అమ్మీ’గా రంగస్థలం పైకి...నాటకరంగాన్ని తన కాలింగ్ అండ్ కంఫర్ట్జోన్గా పిలిచే నటి పద్మిని కొల్హాపురి గత కొన్ని నెలలుగా ఉర్దూ మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించింది. దీనికి కారణం అమ్మీ. ఈ నాటకంలో ఆమె బేగం అక్తర్గా కనిపిస్తుంది. ‘బేగం అక్తర్ పాత్ర పోషించడంతో నా కల సాకారమైంది’ అంటుంది పద్మిని కొల్హాపురి.పద్మిని గతంలో కొన్ని నాటకాల్లో నటించినా ‘అమ్మీ’ నాటకం మాత్రం ఆమెకు నిజంగా సవాలే.‘బేగం అక్తర్ పాత్రను పోషించడం అనేది కత్తిమీద సాములాంటిది. ఈ పాత్ర ఒకే సమయంలో ఉత్తేజపరుస్తుంది. ఆందోళనలోకి నెడుతుంది. విషాదంలోకి తీసుకువెళుతుంది’ అంటుంది పద్మిని కొల్హాపురి. -
సౌదీ మారుతోంది..దేశవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయులకు..!
అరబ్ దేశాల్లో మహిళలపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయో తెలిసిందే. అక్కడ స్త్రీలు తండ్రిగ్గానీ, భర్తగ్గానీ, దగ్గరి మగవాళ్లగ్గానీ చెప్పకుండా, వారి అనుమతి తీసుకోకుండా ప్రయాణాలు చెయ్యకూడదు. పెళ్లి చేసుకోకూడదు. ఆఖరికి జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్య నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ‘స్థాయి తక్కువ’ మగాళ్లను మహిళలు దగ్గరికి చేరనివ్వకూడదు. అలాంటి సౌదీలో ఇటీల కొంతకొంత మార్పులు సంతరించుకుంటున్నాయి. మొన్నటకీ మొన్నఅందాల పోటీల్లో పాల్గొనే విషయంలో కూడా నియమాల్ని సడలించడమే గాక అంతర్జాతీయంగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఇప్పుడూ ఏకంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఉపాద్యాయులందరికి సంగీత విద్యలో శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని సౌదీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ప్లానింగ్ డైరెక్టర్ నూర్ అల్-దబాగ్ రియాద్లో జరిగిన లెర్న్ కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు. ఎందుకంటే..ప్రాథమిక తరగతుల నుంచి పాఠ్యాంశాల్లో సంగీత విద్యను చేర్చాలనే యోచనలో ఉండటంతో ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా ఉపాధ్యాయులందరికీ సంగీతంలో శిక్షణ ఇస్తున్నట్లు నూర్ పేర్కొంది. దాదాపు 9 వేల మంది మహిళా ఉపాధ్యాయులకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు సదరు శాఖ ప్లానింగ్ డైరెక్టర్ నూర్ తెలిపారు. అలాగే కళలు, సంస్కృతిని కూడా విద్యా పాఠ్యాంశాల్లో విలీనం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అంతేగాదు విద్యార్థుల నాణ్యమైన విద్యను అందించి తద్వారా సౌదీని సుసంపన్న దేశంగా మలచాలన్న దిశవైపుకు అడుగులు వేస్తోంది. ఇది నిజంగా సౌదీ ప్రగతి శిలకు సూచనగా చెప్పొచ్చు. కాగా, 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఇటీవలి కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. ఇప్పటి వరకు మహిళా డ్రైవర్లపై నిషేధం నుంచి అందాల పోటీల్లో పాల్గొనడం వరకు పలు మార్పులు తీసుకురావడం విశేషం.(చదవండి: కొరియన్ నోట భారతీయ సంగీతం.. 'ఔరా' అంటున్న నెటిజన్లు) -
సరికొత్త బాణీలే.. భవిష్యత్తుకు బాటలు!
సాక్షి, సిటీబ్యూరో: సంగీత పరిశ్రమలో సృజనాత్మకతతో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ సృష్టించేవారు చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ సంగీత దర్శకులు కోటి తెలిపారు. జీ తెలుగు వేదికగా ప్రేక్షకాదరణ పొందిన ప్రముఖ షో సరిగమప 16వ సీజన్ ఈ నెల 29న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో సరిగమప న్యాయనిర్ణేత కోటి మాట్లాడుతూ.. దాదాపు 5 వేల మందిలో అత్యుత్తమ కళా నైపుణ్యాలున్న 26 మందిని ఎంపిక చేశామన్నారు.ప్రస్తుతం ఏఐ వంటి మాధ్యమాలు వచ్చి నకిలీ సంగీతాన్ని సృష్టిస్తున్నాయని, ఇలాంటి ఎన్ని సాంకేతికతలు వచ్చినా స్వచ్ఛమైన, సహజమైన సంగీతం ఎప్పుడూ తన ప్రశస్తిని పెంచుకుంటూ పోతుందని అన్నారు. ప్రముఖ లిరిసిస్ట్ శ్యామ్ క్యాసర్ల ఈ సీజన్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఎంపిక చేసిన మట్టిలో మాణిక్యాలను ప్రముఖ సింగర్లుగా తీర్చిదిద్దేలా సానబెడతామని తెలిపారు. రెండు తరాలకు మధ్య వారధిలా సంగీత, సాహిత్య అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఆయన చెప్పారు. ఈ సీజన్లో విలేజ్ వోకల్స్, సిటీక్లాసిక్స్, మెట్రో మెలోడీస్ అనే 3 జట్లుగా పోటీలు కొనసాగుతాయని మరో జడ్జి ఎస్పీ శైలజ వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ సింగర్లు రువంత్, రమ్య, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.ఇవి చదవండి: అతడేమి పాపం చేశాడు.. ఒక్క కారణం చెప్పండి? సెలక్టర్లపై ఫైర్ -
సరిగమప 16వ సీజన్కు ముహూర్తం ఫిక్స్
సంగీత పరిశ్రమలో ముద్రపడిపోయిన ట్రెండ్లను అనుకరించడం కన్నా సృజనాత్మకతతో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్లను సృష్టించేవారు చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ సంగీత దర్శకులు కోటి తెలిపారు. జీ తెలుగు వేదికగా ప్రేక్షకాదరణ పోందిన ప్రముఖ షో సరిగమప 16 వ సీజన్ ఈ నెల 29న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో సరిగమప న్యాయనిర్ణేత కోటీ మాట్లాడుతూ., దాదాపు 5 వేల మందిలో అత్యుత్తమ కళా నైపుణ్యాలున్న 26 మందిని ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం ఏఐ వంటి మాధ్యమాలు వచ్చి నకిలీ సంగీతాన్ని సృష్టిస్తున్నాయని., ఇలాంటి ఎన్ని సాంకేతికతలు వచ్చినా స్వచ్చమైన, సహజమైన నంగీతం ఎప్పుడూ తన ప్రశస్తిని పెంచుకుంటూ పోతుందన్నారు.ప్రముఖ లిరిసిస్ట్ శ్యామ్ క్యాసర్ల ఈ సీజన్లో జడ్జిగా వ్యవహారించనున్నారు. మట్టిలో మాణిక్యాలను ప్రముఖ సింగర్లుగా వెలుగొందేలా సానబెడతామన్నారు. రెండు తరాలకు మధ్య వారధిలా సంగీత, సాహిత్య అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని శ్యామ్ అన్నారు. ఈ సీజన్లో విలేజ్ వోకల్స్, సిటీక్లాసిక్స్, మెట్రో మెలోడీస్ అనే 3 జట్లుగా పోటీలు కొనసాగుతాయని మరో జడ్జి ఎస్పీ శైలజ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్లు రువంత్, రమ్య, అనుధీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఏఐతో పాటలు
సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘శారీ’. ఈ సినిమాకు గిరికృష్ణ కమల్ దర్శకుడు. ఆర్జీవీఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రవి వర్మ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో నవంబరులో రిలీజ్ కానుంది. ‘ప్రేమా... ప్రేమా.. ప్రేమా... నీ కోసం నా నిరీక్షణ.. నీ కోసం నా అన్వేషణ’ అంటూ మొదలై, ‘ఐ వాంట్ లవ్... ఐ వాంట్ లవ్...’ అంటూ సాగే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు.‘‘మా భాగస్వామి రవివర్మతో కలిసి ‘ఆర్జీవీ డెన్ మ్యూజిక్’ను ఆరంభిస్తున్నానని చెప్పడానికి థ్రిల్ అవుతున్నాను. ఇందులో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృతిమ మేధ) యాప్స్తో రూపొందిన సంగీతం మాత్రమే ఉంటుంది. ‘శారీ’ మొత్తం ఏఐ సంగీతంతోనే సాగుతుంది. నేపథ్య సంగీతానికి కూడా ఏఐ మ్యూజిక్నే వాడాం. వందేళ్ల భారతీయ చలన చిత్ర చరిత్రలో ఏఐ మ్యూజిక్తో వస్తున్న పూర్తి స్థాయి, మొదటి చలన చిత్రంగా ‘శారీ’ నిలుస్తుందని గర్వంగా చెప్పగలశ్రీశ్రీం’’ అని రామ్గోపాల్వర్మ పేర్కొన్నారు. -
జీ తెలుగు ‘స రే గ మ ప - సీజన్ 16’ .. త్వరలో
తెలుగు నాట సంగీతానికి సంబంధించిన రియాల్టీ షోలు బుల్లితెరపై బహుళ ఆదరణ సంపాదించాయి. అలాంటి వాటిల్లో ఒకటి జీ తెలుగు సమర్పించిన సరిగమప. ఈ కార్యక్రమం ద్వారా గత 15 సీజన్లలో ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇపుడిక ‘సరిగమప సీజన్ 16- ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ త్వరలో రాబోతోంది. ప్రతిభావంతులైన గాయనీగాయకులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకునే అవకాశం అందిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాల్లో ఆడిషన్స్ నిర్వహంచింది. కొత్త గాయకులను పరిచయం చేసే ఈ పోటీలో 15-30 సంవత్సరాల వయస్సుగల , గాయనీ గాయకులు పాల్గొనేందుకు అర్హులు. విజేతగా నిలిచిన గాయని లేదా గాయకుడు ‘సరిగమప సీజన్ 16–ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ టైటిల్ గెల్చుకుంటారు. -
Natarajan: సంగీతానికి ఇన్స్ట్రుమెంట్ ఈ కుటుంబం..
భక్తి పాటల భజనకైనా, జానపద గీతాలకైనా, సంగీత కచేరీలకైనా తంబురా, హార్మోనియం, డోలక్, తబలా వంటి వాద్యాలు తప్పనిసరి! పాపులర్ మ్యూజిక్లో వీటి జాడ అరుదు ఇంకా చెప్పాలంటే కరవూ! కానీ కర్నూల్లోని నటరాజన్ ఇంట్లో ఇప్పటికీ ఇవి శ్రుతి సరిచేసుకుంటున్నాయి.. శ్రోతలకు మెలోడీ ఫెస్ట్ని అందివ్వడానికి!నటరాజన్ సంగీత వాద్యపరికరాలు తయారు చేయడంలో ఘనాపాఠి! ఇది ఆయనకు వారసత్వంగా అబ్బిన, అందిన విద్య, వృత్తి, సంపద కూడా! నటరాజన్ తాత, ముత్తాతల కాలం నుంచీ ఇది కొనసాగుతోంది. ఆ కుటుంబంలోని అందరూ బాగా చదువుకున్నవారే. నటరాజన్ ముత్తాత మురుగేషన్ మొదలియార్.. బ్రిటిష్ కాలంలో హార్మోనియం గురువుగా ఉన్నారు. డ్రామాలకు దుస్తులను సరఫరా చేసే కంపెనీనీ నడిపారు. ఆయన ఇద్దరు కొడుకుల్లో ఒకరైన రామస్వామి కొడుకే నటరాజన్ తండ్రి.. బాలసుబ్రహ్మణ్యం.పేపర్ మిల్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పనిచేసేవారు. ఆ మిల్లు మూతపడటంతో తాతల వృత్తి సంగీత వాద్యపరికరాల తయారీని జీవనోపాధిగా మలచుకున్నారు. దాన్ని తన కొడుకు నటరాజన్కూ నేర్పారు. నటరాజన్ కూడా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. అయినా తండ్రి నేర్పిన విద్యకే ప్రాధాన్యం ఇచ్చారు. హార్మోనియం, వయొలిన్, వీణ, మృదంగం, డోలక్, తబలా, ఫ్లూట్ వంటి వాయిద్యాలను యువతను ఆకర్షించేలా తయారుచేస్తున్నారు. వీరి ఈ పరికరాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటకలోనూ డిమాండ్ ఉంది. ఈయన దగ్గర అయిదు వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల దాకా విలువ చేసే హార్మోనియం, వీణ, తబలాలు అందుబాటులో ఉన్నాయి.‘నేటి స్ట్రెస్ఫుల్ లైఫ్కి మంచి ఊరట సంప్రదాయ వాద్య సంగీతం. ఇది మనసును ఇట్టే తేలిక చేసి సాంత్వననిస్తుంది. అయితే ఎలక్ట్రానిక్ సంగీత పరికరాలు అందుబాటులోకి రావడంతో అలనాటి సంగీత పరికరాలను మర్చిపోతున్నారు. గత అయిదారు సంవత్సరాల నుంచి దేవాలయాల్లో భజన కార్యక్రమాలు ఎక్కువవడంతో మళ్లీ అలనాటి సంగీత పరికరాలకు ఆదరణ పెరిగి.. మాకు మళ్లీ చేతినిండా పని దొరికినట్టయింది’ అని చెబుతున్నారు నటరాజన్. – కె.రామకృష్ణ -
మానసిక ఆరోగ్యంపై సంగీత ప్రభావం.. ‘మ్యూజిక్ ఆఫ్ హోప్’..!
సాక్షి, సిటీబ్యూరో: శిశుర్వేత్తి, పశుర్వేత్తి వేత్తిగాన రసం ఫణిః అనే విశ్వాసాన్ని అనుసరిస్తూ. వంధ్యత్వానికి చికిత్సలో సంగీతాన్ని మిళితం చేస్తూ ‘మ్యూజిక్ ఆఫ్ హోప్’ పేరిట ఓ ట్యూన్ను నగరానికి చెందిన ఫెర్టీ–9 ఫెర్టిలిటీ సెంటర్ రూపొందించింది. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవ వేడుకల ముగింపును పురస్కరించుకుని దీనిని విడుదల చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.మానసిక ఆరోగ్యంపై సంగీతం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, ఒత్తిడి, ఆందోళనను తగ్గించి ప్రశాంతత, విశ్రాంతి భావాన్ని కలిగిస్తుందని నిరూపితమైన నేపథ్యంలో ఈ ట్యూన్ ప్రత్యేకంగా తయారు చేశామన్నారు. అదే విధంగా ‘టుగెదర్ ఇన్ ఐవీఎఫ్’ పేరిట వంధ్యత్వానికి సంబంధించిన అపోహలను పోగొట్టడం లక్ష్యంగా నిర్వహించిన ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 15 వేర్వేరు ప్రదేశాల్లో వీధి నాటకాలు లేదా నుక్కడ్ నాటకాలను ప్రదర్శించామని వివరించారు. -
శ్రవణమే.. నయనం
పుట్టుకతోనే అంధత్వంతో అంతా చీకటి. కానీ తన కళతో చుట్టూ ఉన్న ప్రపంచానికి వెలుగులు పంచాడు. అంధత్వంతో పాటు పేదరికం పుట్టినప్పటి నుంచి అతడిని వెక్కిరిస్తూ వస్తోంది. అయినా తన సంకల్పం ముందు ఇవన్నీ దిగదుడుపే అయ్యాయి. ఢోలక్, కంజీర, రిథమ్ ప్యాడ్ వాయిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అతడి పేరే సిరిపురం మహేశ్. మంచిర్యాల జిల్లా హాజీపురం మండలం దొనబండ మహేశ్ స్వగ్రామం. ఇటీవలే నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన మహేశ్ తన ప్రతిభతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాడు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉండేది. పుట్టుకతోనే చూపు లేకపోయినా తనకు వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుందని తన నమ్మకం. శాంతారాం అనే తన చిన్ననాటి స్నేహితుడు ఢోలక్ను పరిచయం చేశాడు. అప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి పెరిగిందని మహేశ్ పేర్కొన్నాడు. అయితే దుర్గం శంకర్ అనే మాస్టారు ఢోలక్లో మెళకువలు నేరి్పంచి, తనను ఇంతవరకూ తీసుకొచ్చాడని గుర్తు చేసుకున్నాడు. చాలా ఫంక్షన్లలో జరిగే ఆర్కెస్ట్రాల్లో వాయిద్య పరికరాలను వాయిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అవార్డులు, రివార్డులు తెలుగు టాలెంట్స్ మ్యూజిక్ అవార్డు, తెలంగాణ ప్రభుత్వం కళోత్సవం సందర్భంగా రెండుసార్లు అవార్డు తనను వరించింది. ఆర్కెస్ట్రాలో ఢోలక్, కంజీర వాయిస్తుంటే చాలా మంది ఆశ్చర్యపోయి మెచ్చుకునే వారని మహేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక సంగీతంతో పాటు తెలుగులో కూడా ప్రావీణ్యం సాధించాడు మహేశ్. పేరడీ పాటలు, కవితలు కూడా రాస్తుంటాడు. అదే నా కల.. భవిష్యత్తులో తెలుగు టీచర్గా స్థిరపడాలనేది తన కల అని చెబుతున్నాడు. అంధులకు తెలుగులో వ్యాకరణం నేర్చుకోవడం చాలా కష్టం. కానీ నిజామ్ కాలేజీలో చంద్రయ్య శివన్న అనే తెలుగు మాస్టారు ఎంతో ఓపికగా పాఠాలు నేరి్పంచేవారని చెప్పుకొచ్చారు. పదో తరగతి వరకూ బ్రెయిలీ లిపిలో పాఠాలు ఉండేవని, ఇంటర్ తర్వాత అంధులు పాఠాలు నేర్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నాడు. చంద్రయ్య మాస్టారు పుస్తకాలను పీడీఎఫ్లోకి మార్చి తన లాంటి వారికి ఇచ్చేవారని చెప్పాడు. -
మొక్కలను కాపాడే స్మార్ట్ కుండీ ఇదే!
ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి కుండీలను వాడుతుంటాం. ఇంటి అందం కోసం కుండీలను ఏర్పాటు చేసుకున్నా, వాటిలోని మొక్కల ఆలనా పాలనా మనమే చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మొక్కల ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటే, అవి ఎండిపోయి, చనిపోతాయి. మొక్కల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టి, అందుకు అనుగుణంగా వాటి బాగోగులను చూసుకోవడం కష్టమే!ఈ సమస్యను తొలగించడానికే అమెరికన్ కంపెనీ ‘స్మార్టీ ప్లాంట్’ సంస్థ కుండీల్లోని మొక్కల రక్షణ కోసం స్మార్ట్ సెన్సర్ను తయారుచేసింది. సెన్సర్ అమర్చిన ఈ స్మార్ట్ కుండీల్లోని మొక్కలకు సునాయాసంగా రక్షణ కల్పించవచ్చు. అవి నిత్యం పచ్చగా కళకళలాడేలా చూసుకోవచ్చు. ఈ కుండీల్లోని స్మార్ట్ సెన్సర్ యాప్ ద్వారా పనిచేస్తుంది. వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ, కుండీలోని మట్టిలోని తేమ, మొక్కల వేళ్లు, కాండంలోని పోషకాల పరిస్థితులను ఎప్పటికప్పుడు యాప్ ద్వారా సమాచారం అందిస్తుంది. దీని ధర 45 డాలర్లు (రూ.3,760) మాత్రమే!పిల్లల కోసం ఫిట్నెస్ వాచీ..రక్తపోటు, గుండె పనితీరు, శరీరంలో ఆక్సిజన్ స్థాయి వంటి వివరాలను చెప్పే స్మార్ట్ వాచీలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ పెద్దల కోసం రూపొందించినవి. అయితే, అమెరికన్ కంపెనీ ‘ఫిట్బిట్’ ప్రత్యేకంగా పిల్లల కోసం ‘ఏస్ ఎల్టీఈ’ పేరుతో ఈ ఫిట్నెస్ వాచీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫిట్నెస్ ట్రాకింగ్ సెన్సర్లు పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తాయి.ఆ సమాచారాన్ని యాప్ ద్వారా స్మార్ట్ఫోన్కు చేరవేస్తాయి. ఈ వాచీని ఫోన్లా కూడా ఉపయోగించుకునే వీలు ఉంది. ఇందులోని కమ్యూనికేషన్స్ టాబ్ ద్వారా అవసరమైప్పుడు కాల్స్ చేసుకోవడానికి, మెసేజ్లు పంపుకోవడానికి కూడా వీలవుతుంది. ఏడేళ్లకు పైబడిన వయసు గల పిల్లలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ‘ఫిట్బిట్’ కంపెనీ చెబుతోంది. దీని ధర 229 డాలర్లు (రూ.19,126) మాత్రమే!నానోబాక్స్ మినీ డ్రమ్స్..మృదంగం, తబలా, డ్రమ్స్ వంటి తాళ వాయిద్యాలు లేకుండా సంగీత కచేరీలు పరిపూర్ణం కావు. అయితే, ఈ పరికరాలు కొంచెం భారీగా ఉంటాయి. ఆక్టోపాడ్ వంటి ఎలక్ట్రిక్ డ్రమ్స్ అందుబాటులోకి వచ్చినా, అవి కూడా కొంచెం భారీగా ఉండేవి, స్థలాన్ని ఆక్రమించుకునేవే! అమెరికన్ సంగీత పరికరాల తయారీ సంస్థ ‘1010 మ్యూజిక్’ ఇటీవల డ్రమ్స్ను అరచేతిలో ఇమిడిపోయే పరిమాణానికి కుదించి, ‘నానోబాక్స్’ను అందుబాటులోకి తెచ్చింది.‘రాజ్మాటాజ్’ పేరుతో రూపొందించిన ఈ మినీ డ్రమ్స్ను మిగిలి ఎలక్ట్రానిక్ సంగీత పరికరాల్లాగానే వాడుకోవచ్చు. ఈ ‘నానోబాక్స్’ పొడవు 3.75 అంగుళాలు, మందం 1.5 అంగుళాలు, వెడల్పు 3 అంగుళాలు. ఇందులోని 64 స్టెప్ సీక్వెన్సర్ ఔత్సాహికుల సాధనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ నానోబాక్స్కు ఉన్న టచ్స్క్రీన్ ద్వారా కోరుకున్న ధ్వనులను, శబ్దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీని ధర 399 డాలర్లు (రూ.33,327) మాత్రమే! -
తానొక.. రాక్ 'మాయా'జాలం!
అమెరికాస్ గాట్ టాలెంట్ వేదికపై తన ప్రదర్శనతో ఉర్రూతలూగించిన మాయా నీలకంఠన్ను సైమన్ కోవెల్ ‘రాక్ దేవత’ అని ప్రశంసించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను ప్రశంసల్లో ముంచెత్తాడు. ముంబైలోని మహీంద్రా బ్లూస్ ఫెస్టివల్లో మాయ త్వరలో ప్రదర్శన ఇవ్వనుంది. రెండేళ్ల వయసు నుంచే సంగీతంతో స్నేహం మొదలు పెట్టింది మాయ. నాన్న గిటార్ వాయించేవాడు. ఆయన ద్వారా ఎన్నో పాటలు నేర్చుకుంది మాయ.యూట్యూబ్ వీడియోల ద్వారా గిటార్ వాయించడం ఎలాగో తండ్రి నేర్పించాడు. ఆరేళ్ల వయసు నుంచే గిటార్ ప్లే మొదలు పెట్టింది. యాభైమంది ప్రేక్షకులు ఉన్న హాలులో తొలిసారి స్టేజీపై ప్రదర్శన ఇచ్చింది. ఇంటి నాలుగు గోడలౖకే పరిమితమైన తన ప్రతిభ తొలిసారిగా ప్రేక్షకుల్లోకి వచ్చింది.ప్రపంచంలోనే నంబర్ వన్ టాలెంట్ షో అమెరికాస్ గాట్ టాలెంట్(ఏజీటీ)లో వెయ్యిమంది ప్రేక్షకుల మధ్య ప్రదర్శన ఇచ్చింది. తాను స్టేజీ మీదికి వెళుతున్నప్పుడు ప్రేక్షకులు అరవడంతో మాయ కాస్త భయపడింది. అయితే మాయ ప్రదర్శన మొదలు కావడంతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.గిటార్ ప్రసన్న అనే గురువు దగ్గర కర్నాటక సంగీతం నేర్చుకుంది మాయ. ‘ఏజీటీ’ కోసం రెండు మూడు వారాల పాటు శిక్షణ తీసుకుంది. శిక్షణ సమయంలో ప్రసన్నతో పాటు ఎంతోమంది తనకు సలహాలు ఇచ్చారు.‘ఏజీటీ’ వేదికపై మూమెంట్స్కు సంబంధించి నెటిఫ్లిక్స్ సిరీస్ ‘ఆరేంజ్ ఈజ్ ది న్యూ బ్లాక్’తో అవార్డ్ గెలుచుకున్న జెస్సికా పిమెంటల్ శిక్షణ ఇచ్చింది. షో కోసం మానసికంగా సిద్ధం కావడానికి అవసరమైన సలహాలు ఇచ్చింది. ‘విభిన్నమైన జానర్స్తో నాదైన సంగీతాన్ని సృష్టించాలనేది నా కల’ అంటుంది మాయా నీలకంఠన్. -
Priya Sisters: ఆదాయం కన్నా.. అభిరుచిగానే మిన్న!
సాక్షి, సిటీబ్యూరో: ‘సంగీతంలో రాణించాలని అనుకోవడం మంచిదే. అయితే అదే సమయంలో చదువును ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు’ అంటున్నారు ప్రియా సిస్టర్స్. ఉన్నత చదువులు చదివి ఆ తర్వాత శాస్త్రీయ సంగీతంలో లబ్ధప్రతిష్టులుగా పేరొందిన అచ్చతెలుగు అక్కా చెల్లెళ్లు హరిప్రియ, షణ్ముఖ ప్రియలు వేల సంఖ్యలో కచేరీలు చేశారు.ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో పుట్టి అద్భుతమైన గానామృతాన్ని పంచుతూ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు మహిళ ప్రతిభను చాటారు. శ్రీ వాసవీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నగరంలోని రవీంద్రభారతిలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో సంభాషించారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే...జన్మ ధన్యమైన సందర్భాలెన్నో... ‘జీవనసాఫల్య పురస్కారం అందుకుంటున్న సందర్భంగా మా జీవితం ధన్యమైంది అనకున్న సందర్భాలను మననం చేసుకోవాలంటే ఎన్నో ఉన్నాయి.. పుట్టపర్తి సాయిబాబా గారి ముందు కచేరీ నిర్వహించడమే కల సాకారం అవడం అనుకుంటే, కచేరీ ముగిశాక మరోసారి ఓ కీర్తన ఆలపించమంటూ ప్రత్యేకంగా అడగడం... అలాగే శాస్త్రీయ సంగీతంలో వశిష్టుడు అని చెప్పదగ్గ స్వర్గీయ సుబ్బుడు (పి.వి.సుబ్రహ్మణ్యం)... మా సిస్టర్స్ని అనేక రకాలుగా ప్రశంసిస్తూ.. ట్రాన్సిస్టర్స్ అంటూ గొప్పగా అభివరి్ణంచడం... కంచి పరమాచార్య గారిని వ్యక్తిగతంగా కలిసి ఆయన ముందు పాడడం, ఆయన ప్రసాదం ఇవ్వడం...ఇలాంటివెన్నో ఉన్నాయి. ఇంకా జన్మ ధన్యం కావాల్సిన సందర్భాలు ఎన్నో రానున్నాయనే అనుకుంటాం’.సినిమా తాపత్రయం లేదు... శాస్త్రీయ సంగీతానికి తనదైన ప్రత్యేకత ఉంది. దానికే పరిమితమైన మేం సినిమా సంగీతంతో మమేకం కాలేదు.. కాలేం కూడా. మూడు నాలుగు సినిమాల్లో పాటలు పాడామంటే ఆయా సినిమాల రూపకర్తలకు ఆ పాటకు మా గాత్రం నప్పుతుందని మమ్మల్ని సంప్రదించడం వల్లే తప్ప సినిమా అవకాశాల గురించి మేం ఎప్పుడూ ఆలోచించలేదు. ఇక సినిమా నటన గురించి అంటే... చాలాకాలం క్రితం కె.బాలచందర్ గారు నన్ను (హరిప్రియ) సింధుబైరవి సీక్వెల్ సినిమా తీస్తున్న సందర్భంలో ఓ పాత్రకు అడిగారు. అయితే ఎందుకో అది కుదరలేదు.పాపులారిటీ సరే... లాంగ్విటీ కూడా అవసరమే... సాంకేతిక విప్లవం పుణ్యమాని పాపులారిటీ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. అయితే షార్ట్ టర్మ్ పాపులారిటీ కన్నా దీర్ఘకాలం పాటు నిరూపించుకునే స్థిరత్వం ముఖ్యం. ప్రస్తుతం యువ కళాకారులకు శిక్షణ ఇస్తున్నాం. 2, 3 ఏళ్లలో అకాడమీని స్థాపించాలని అనుకుంటున్నాం. మా పిల్లల్లో ఎవరూ మా వారసులుగా రావాలని అనుకోవడం లేదు. మేం ఒత్తిడి చేయడం లేదు. మా చివరి శ్వాస వరకూ కచేరీలు ఇస్తూనే ఉండాలి.. భావి తరాలకు శాస్త్రీయ సంగీతం పంచాలని తప్ప...వేరే కలలు, లక్ష్యాలు అంటూ ఏమీ లేవు.నా మనసు పాటనే ఎంచుకుంది..నేను (హరిప్రియ) చిన్న వయసులో క్రికెటర్గా జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా ఆడాననేది నిజమే. అలాగే మరోవైపు శాస్త్రీయ సంగీతంలోనూ రాణిస్తున్న ఆ సమయంలో ఏ రంగం ఎంచుకోవాలి? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు నా మనసు పాట వైపే మొగ్గింది. నేడు మహిళా క్రికెట్కు ఆదరణ పెరగడం చూస్తున్నా...అది ఆనందాన్నిస్తోంది. నా చిన్నప్పుడు ఇలాంటి పరిస్థితే ఉన్నా సంగీతాన్నే కెరీర్గా ఎంచుకునేదాన్ని తప్ప క్రికెట్ను కాదనేది నిజం. -
11 ఏళ్లకే గిటార్తో ప్రదర్శన.. అమెరికా ప్రముఖ షోని మెస్మరైజ్ చేసింది!
జస్ట్ 11 ఏళ్ల చిన్నారి తన గిటార్ కళా నైపుణ్యంతో అమెరికా గాట్ టాలెంట్ని మెస్మరైజ్ చేసింది. ఆ చిన్నారి పేరు మాయ నీలకంఠన్. ఇటీవల అమెరికా గాట్ టాలెంట్ కోసం జరిగిన అడిషన్లో మొత్తం షో దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో పాపా రోచ్ లాస్ట్ రిసార్ట్ వేదికపై తన గిటార్ ప్రదర్శనతో ఆ షో జడ్జిలనే ఆశ్చర్యపరిచింది. మాయ తన అద్భుతమైన గిటార్ ప్రదర్శన ఆ వేదికపై ఉన్న దిగ్గజ జడ్జిలు సైమన్ కోవెల్, సోఫియా వెర్గారా, హెడీ క్లమ్, హౌవీ మాండెల్ల మనసులను గెలుచుకుని ప్రశంసలందుకుంది. మాయ ఆడిషన్ వీడియో నెట్టింట పెను సంచలనంగా మారింది. పైగా ఈ కళా ప్రావిణ్యమే ఆమెకు భారతదేశపు అత్యంత పిన్న వర్దమాన రాక్ స్టార్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. వేలాది మంది ఆమె గిటార్ మ్యూజిక్ ప్రదర్శనకు అభిమానులుగా మారిపోయారు. నెట్టింట యాక్టివ్గా ఉండే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సైతం ఆమె గిటార్ మ్యూజిక్కి ఫిదా అయ్యారు. ఇంత చిన్న వయసులోనే అంత అపారమైన ప్రతిభను సొంత చేసుకోవడం గ్రేట్ అంటూ ప్రశంసించారు. అంతేగాదు ముంబైలో జరిగే మహీంద్రా బ్లూస్ ఫెస్టివల్లో సంగీత ప్రదర్శన ఇవ్వాల్సిందిగా ఆహ్వానించారు కూడా. దేవతల భువి నుంచి వచ్చిన ప్రతిభాశాలి అంటూ మాయపై ప్రశంసలు కురిపించారు. Oh My GodMaya Neelakantan is only 10 years old. 10! Yes, Simon, she’s a Rock Goddess. From the land of Goddesses. We have to get her back here to do her stuff at the @mahindrablues !@jaytweetshah @vgjairam pic.twitter.com/sRNHPBondg— anand mahindra (@anandmahindra) June 29, 2024మాయ నీలకంఠన్ నేపథ్యం.. 11 ఏళ్ల మాయ తమిళనాడులోని చెన్నైకి చెందింది. ఆమెకు సొంత యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఈ చిన్న గిటారిస్ట్కి సంబంధించిన పలు ప్రదర్శన వీడియోలు ఉన్నాయి. ఆమె గిటార్పై కర్ణాటక సంగీతాన్ని ఆలపిస్తుంది. ఆమె గురువు ఆర్ ప్రసన్న. ఆమె అమెరికాలోని పాపా రోజ్ లాస్ట్ రిసార్ట్ వేదికపై గిటార్తో కర్ణాటక నటభైరవి రాగ ఉపోద్ఘాతాన్ని సోలోగా ప్లే చేసినట్లు తెలిపారు. మెటల్ రాక్ బ్లూస్ పదబంధాల తోపాటు కర్ణాటక గమకాలు చాలా అలవోకగా ప్లే చేసిందని మెచ్చుకున్నారు. ఏళ్ల క్రితమే కర్ణాటక సంగీతాన్ని గిటార్పై ప్లే చేయడం ప్రారంభించారు. గానీ ఇలా ఒక 11 ఏళ్ల బాలిక అమెరికాస్ గాట్ టాలెంట్ వంటి ప్రపంచ వేదికపై ప్లే చేయడం అనేది నిజంగా ప్రశంసించదగ్గ విషయం అని అన్నారు. ఇది చాలా గొప్ప ప్రతిభ అని, ఇప్పుడు తానే తన శిష్యురాలికి అభిమానిని అని గర్వంగా చెప్పారు మాయ గురువు ప్రసన్న. (చదవండి: -
గోడలకు వేలాడే సంగీతం ఇది.. ఎప్పుడైనా విన్నారా!
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అలనాటి సామెతల్ని కొత్తగా నిర్వచిస్తోంది. గోడలకూ చెవులుంటాయని పెద్దలు చెబితే.. గోడల నుంచి సుస్వరాలు వినిపిస్తాయని సరికొత్త మ్యూజిక్ ఫ్రేమ్స్ నిరూపిస్తున్నాయి. గోడకు ఫొటో ఫ్రేమ్స్లానే తమ మ్యూజిక్ ఫ్రేమ్ను కూడా వేలాడదీస్తే ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చని అంటోంది ప్రసిద్ధ గృహోపకరణాల బ్రాండ్ శామ్సంగ్..తాజాగా ఈ బ్రాండ్ రూపొందించి సిటీ మార్కెట్లోకి విడుదల చేసిన ఈ వైర్లెస్ మ్యూజిక్ ఫ్రేమ్ ద్వారా వీనులవిందైన సంగీతాన్ని వినడం మాత్రమే కాదు వ్యక్తిగత ఫొటోలు, కళాత్మక చిత్రాలు సైతం పొందుపర్చుకోవచ్చు. డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచి్చన ఈ ఫ్రేమ్.. అందాన్ని పెంచే ఇంటీరియర్లా అమరిపోతుందంటున్నారు.ఇవి చదవండి: ఆన్లైన్ గేమర్స్ను వరించనున్న.. రూ. 2 కోట్ల ప్రైజ్ మనీ.. -
పాటే మంత్రము.... గానం బంధము...
సాక్షి, హైదరాబాద్: : ఆమె పాట... స్వరాల ఊయలలూగించింది... అనుభూతుల లోకంలో ముంచింది. ప్రముఖ నేపథ్య గాయని సుమధుర గాత్రంతో సంగీత సంచలనం ఎఆర్ రెహమాన్ను సైతం తన అభిమానిగా మార్చుకున్న రోంకిణి గుప్తా... నగరవాసుల్ని పాటల లోకంలో విహరింపజేశారు. తెలంగాణ పర్యాటక శాఖ, సురమండల్ సంస్థల ఆధ్వర్యంలో నగరంలోని మాసబ్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఆవరణలో నిర్వహించిన సంగీత ప్రదర్శనలో ఈ సంప్రదాయ సంగీత కళాకారిణి...హిందూస్థానీ క్లాసికల్ రాగాలాపనతో ప్రారంభించి తన ప్రాచుర్యం పొందిన పాటల్ని ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఆమెకు తోడుగా తబలా విద్వాంసులు అశిష్ రగ్వానీ, హార్మోనియం విద్వాంసులు దీపక్ మరాతెలు తమ స్వరాలతో సంగీతాభిమానులను ఓలలాడించారు. ఇద్దరు స్థానిక టంపోరా కళాకారులు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. -
సంగీతానికి ఆ శక్తి ఉందా?
సంగీతానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ఇది మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని నయం చేయడమే గాక ఉల్లాసంగా ఉండేలా చేస్తుందని చెబుతుంటారు. ఇవాళ ప్రపంచ సంగీత దినోత్సవం(జూన్ 21న) పురస్కరించుకుని దీని ప్రాముఖ్యత గురించి, ఆరోగ్య ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.శ్రావ్యమైన సంగీతం విభిన్న సంస్కృతులను, సరిహద్దులను దాటి భాషలకు అతీతంగా అందర్నీ ఒక్కటి చేస్తుంది. దాని మాధుర్యానికి ఎవ్వరైన పరవశించిపోవాల్సిందే. మంచి రమ్యమైన సంగీతం మనసు స్వాంతన చేకూర్చి.. శాంతిని అందించగలదు కూడా. అలాంటి ఈ సంగీతం మన అనారోగ్య సమస్యలను నయం చేసే శక్తి ఉందని చెబుతున్నారు నిపుణులు. ప్రతి రోజు మంచి సంగీతం వినడం వల్ల జ్ఞాపకశక్తి, హీలింగ్ రేటు పెరుగుతుందట. ఇదెలా నయం చేస్తుందంటే..సంగీతం ప్లే చేసినప్పుడూ ఆ తరంగాలు మన చెవిని తాకగానే మన శరీరం ఒక విధమైన విశ్రాంతి మూడ్లోకి వెళ్లిపోతుంది. దీంతో రక్తం సులభంగా శరీరం మంతట ప్రసరిసించి..హృదయస్పందన రేటు, రక్తపోటు స్థాయిలు తగ్గడమే గాక కార్డిసాల్ స్టాయిలు కూడా తగ్గడం జరుగుతుంది. అలాగే రక్తంలోని సెరోటోనిన్ ఎండార్ఫిన్ స్థాయిలను పెంచుతుంది. మానసిక స్థితిని పెంచుతుంది. డిప్రెషన్ను తగ్గిస్తుంది. సంగీతం మెదుడలో డోపమైన హార్మోన్ ఉత్పత్తిని పెంచి ఆందోళన, డిప్రెషన్ వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్రపోయేముందు సంగీతం మంచి ఓదార్పునిచ్చి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. శారీరీక అసౌకర్యం, నొప్పి వంటి వాటిని దూరం చేసే శక్తి సంగీతానికి ఉంది. సంగీతం వల్ల మెదడు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. పలు అధ్యయనాల్లో మన మనసు, శరీరాలపై ప్రశాంతమైన ప్రభావాన్ని చూపించాయి. ఇది హృదయ స్పందన రేటు, బీపీని, ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేగాదు సంగీతాన్ని వినడం వల్ల ప్రతికూల ఆలోచనలు దూరమై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. అంతేగాదు పరధ్యానాన్ని అడ్డుకుని అటెన్షన్తో ఉండేలా చేస్తుంది.(చదవండి: పాశ్చాత్యులకు యోగాను పరిచయం చేసింది ఈయనే..! ఏకంగా 60 దేశాలకు..) -
Arpan Kumar Chandel: తొలి ఆల్బమ్తోనే.. రాగాల రారాజుగా..
తొలి ఆల్బమ్తోనే వేలాది అభిమానులను సంపాదించుకున్నాడు దిల్లీకి చెందిన అర్పణ్ కుమార్ చందెల్. మల్టీపుల్ సూపర్–హిట్ ఆల్బమ్లతో అభిమానుల చేత ‘కింగ్’ అనిపించుకున్నాడు. స్వరరచనలోనే కాదు పాటల రచనలోనూ భేష్ అనిపించుకున్నాడు. చిన్న వయసులోనే పెద్ద మ్యూజిక్ కంపెనీలతో కలిసి పని చేసిన ‘కింగ్’ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో చోటు సంపాదించాడు....పాపులర్ ర్యాప్ రియాలిటీ షో ‘హసల్’తో తొలి గుర్తింపు పొందాడు అర్పణ్ కుమార్ చందెల్. ‘టాప్ 5’లో ఒకరిగా చోటు సంపాదించాడు. ఆ తరువాత ‘హసల్ 2.వో’లో స్క్వాడ్ బాస్గా మరింత పేరు తెచ్చుకున్నాడు.‘వివిధ రంగాలలో విజేతలుగా నిలిచిన వ్యక్తుల గురించి తెలుసుకోవడం నాకు ఇష్టం. వారి గురించి చదివినప్పుడల్లా ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. ఎప్పటికప్పడు కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే నాకు ఇష్టం’ అంటున్న అర్పణ్ దిల్లీలోని సాధారణ కుటుంబనేపథ్యం నుంచి వచ్చాడు.మొదట్లో ఫుట్బాల్ ఆటను బాగా ఆడేవాడు. ఫుట్బాల్ ప్లేయర్గా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. అయితే ‘ఆట’ నుంచి ‘పాట’ వైపు అతని మనసు మళ్లింది. సంగీతంపై ఆసక్తి అంతకంతకూ పెరగడం మొదలైంది. మ్యూజిక్ పట్ల తన ఆసక్తి, ప్రయోగాలకు యూట్యూబ్ వేదిక అయింది. పాటలు రాయడం మొదలు పెట్టాడు.‘చిన్నప్పటి నుంచి నాకు రకరకాల సందేహాలు ఉండేవి. ఆ సందేహాలు, నాలోని ఊహాలతో పాటలు రాయడం మొదలుపెట్టాను’ అంటాడు అర్పణ్. ‘ది కార్నివాల్’ ‘షాంపైన్ టాక్’ ‘న్యూ లైఫ్’లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్లతో సంగీత ప్రపంచంలో సందడి చేసి ‘కింగ్’గా పేరు తెచ్చుకున్నాడు అర్పణ్. ‘మేరీ జాన్’ పాట బిల్బోర్డ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.ప్రేమ, భావోద్వేగాలు, జ్ఞాపకాలతో కూడిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శ్రోతలను ఆకట్టుకుంది. ‘ప్రతి జెనరేషన్ కనెక్ట్ అయ్యేలా మేరీ జాన్ పాటను రూపొందించాను. ఈ పాటలోని ఒక వాక్యం....నీ నీడలా ఎప్పుడూ నీతో ఉంటాను అనేది యువతరానికి బాగా నచ్చింది’ అంటాడు అర్పణ్.చార్ట్బస్టర్ ‘తూ ఆఖే దేఖ్లే’ తనను సంగీతకారుడిగా మరో మెట్టు పైకి ఎక్కించింది. ‘నేను చేసిన మంచి పని ఏమిటంటే నాలోని భావాలను కాగితంపై పెట్టడం. వాటికి బాణీ కట్టడం. నాకు తోచినది నేను రాస్తాను. అది శ్రోతలకు నచ్చింది. అందుకే వారు నన్ను కింగ్ అనిపిలుస్తున్నారు. తమ భావాలకు ప్రతినిధిగా చూస్తున్నారు’ అంటాడు అర్పణ్.అర్పణ్ సక్సెస్ మంత్రా ఏమిటి? ఆయన మాటల్లోనే... ‘ఓపికగా ఎలా ఉండాలో, ఇతరులతో ఎలా వ్యవహరించాలో....ఇలా ఎన్నో విషయాలను నా ప్రయాణంలో నేర్చుకున్నాను. నేర్చుకున్నది ఏదీ వృథా పోదు’ నాన్–బాలీవుడ్ హిప్–హప్ కింగ్గా పేరు తెచ్చుకున్న అర్పణ్ కుమార్ చందెల్ ఇప్పుడు బాలీవుడ్ పాటలతోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.సింపుల్గా స్పీడ్గా...‘సింపుల్గా ఉండాలి, అందరూ కనెక్ట్ అయ్యేలా ఉండాలి’ అనుకొని పాట ప్రయాణం మొదలుపెడతాను. నా పాటలు శ్రోతలను ఆకట్టుకోవడానికి ఇదొక కారణం. ఈ పాట ఎవరి గురించో అనుకోవడం కంటే, ఈ పాట నా గురించే అనుకోవడంలో విజయం ఆధారపడి ఉంటుంది. పాట అనేది గాలిలో నుంచి పుట్టదు. దాని వెనుక ఏదో ఒక ప్రేరణ ఉంటుంది. నా పాటల నుంచి ఇతరులు స్ఫూర్తి పొందితే అంత కంటే కావల్సింది ఏముంది! – అర్పణ్ కుమార్ చందెల్ -
Fathers Day 2024: కన్నా... నేనున్నా
తల్లి ఎదురుగా ఉంటే ఎంతమంది ఉంటే మాత్రం ఏమిటి? సంప్రదాయ నృత్య దుస్తులు ధరించిన అమ్మాయి భయం భయంగా స్టేజీ ఎక్కింది. ఎదురుగా ఎంతోమంది జనం. తన వైపే చూస్తున్నారు. ‘భయపడవద్దు’ అన్నట్లుగా సైగ చేసింది తల్లి. అంతేకాదు...మ్యూజిక్ స్టార్ట్ కాగానే డ్యాన్స్ స్టెప్స్ను ఆటిస్టిక్ కుమార్తెకు చూపెట్టడం మొదలుపెట్టింది. స్టేజీ ముందు ఉన్న తన తల్లిని నిశితంగా గమనిస్తూ అందంగా, అద్భుతంగా డ్యాన్స్ చేసింది ఆ అమ్మాయి. ‘స్పెషల్–నీడ్స్ చిల్డ్రన్ ఆలనా పాలనకు ఎంతో ఓపిక, అంకితభావం కావాలి. అవి ఈ తల్లిలో కనిపిస్తున్నాయి’ అని నెటిజనులు స్పందించారు. అపర్ణ అనే యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
నా చిట్టి తల్లిని చూస్తుంటే గర్వంగా ఉంది: సుకుమార్
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2: ది రూల్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే పుష్ప పుష్ప అంటూ ఫ్యాన్స్ను ఊపేసే ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఈ సాంగ్లో అల్లు అర్జున్ షూ స్టెప్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పుష్ప-2 త్వరలోనే సెకండ్ సింగిల్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.అయితే సుకుమార్- తబిత దంపతులకు సుకృతి వేణి అనే ఓ కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమెకు ఉత్తమ బాలనటిగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కూడా అందుకున్నారు. గాంధీ తాత చెట్టు అనే చిత్రానికి ఈ అవార్డ్ దక్కించుకున్నారు. అయితే సుకృతి సింగర్ కూడా రాణిస్తున్నారు. తాజాగా ఆమె ఓ మ్యూజిక్ కన్సర్ట్లో సాంగ్ పాడిన వీడియోను సుకుమార్ తన సోషల్ మీడియాలో ఖాతాలో పంచుకున్నారు. నా చిట్టి తల్లిని చూస్తుంటే గర్వంగా ఉందంటూ సుకుమార్ పోస్ట్ చేశారు. అంతే కాకుండా సుకృతి పాడిన యూట్యూబ్ లింక్ను ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం సుకృతి పాడిన సాంగ్ సంగీత ప్రియులను అలరిస్తోంది. కాగా.. పుష్ప 2: ది రూల్ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. -
ప్రకృతి ఒడిలో పల్లవించే సంగీతం
వాయిద్యాలు వారికి సరిగమలు తెలియవు. శృతి లయలు అసలే తెలీదు. కానీ శ్రవణానందంగా పాడగలరు. శ్రోతలను రంజింపజేయగలరు. తకిట తథిమి అనే సప్తపదులు నేర్చుకోలేదు. కానీ లయ బద్ధంగా అడుగులు వేయగలరు. సంప్రదాయ నృత్యరీతుల్లో ఎన్ని మార్పులొచ్చినా... తరతరాలుగా అలవాటైన పద విన్యాసాలనే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ప్రకృతిని పరవశింపజేస్తున్నారు. ఇందుకోసం వినియోగించే వాయిద్య పరికరాలు కూడా వారు సొంతంగా తయారు చేసుకున్నవే. ఇంతగొప్ప నైపుణ్యం గలిగిన వీరు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో జీవిస్తున్నారు. పురాతనంగా వస్తున్న సంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగిస్తూప్రకృతి ప్రసాదించిన అడవితల్లి ఒడిలో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్న వారి జీవనం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. బుట్టాయగూడెం: దట్టమైన అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా కొండ కోనల నడుమ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న కొండరెడ్డి గిరిజనుల జీవనశైలి విచిత్రంగా ఉంటుంది. సంస్కృతీ, సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. వీరికి బయటి ప్రపంచంతో పనిలేదు. అటవీ ప్రాంతమే వారికి ఆలవాలం. చుట్టూ కొండకోనలు వాగు వంకలతో అలరారే గిరి పల్లెల్లో ప్రకృతి నేరి్పన సంగీతం, నాట్యంతోనే జీవితాన్ని ఆనందంగా మలచుకుంటున్నారు.గిరిజనుల్లోనే కోయ తెగకు చెందిన వారు ‘రేరేలయ్య.. రేల... రేరేలా... రేలా..’ అంటూ పాడుకుంటే... కొండరెడ్లు ‘జొన్నకూడు.. జొన్న విల్లు.. జొన్నకూలితే.. పోతేనత్త’ అంటూ కొత్త పంటలు వచ్చిన సమయంలో పసుపు పచ్చ పండగ, మామిడి పండగ, చింత పండగ, భూదేవి పండగల్లో పాడుకుంటారు. అలాగే పెళ్లిళ్ల సమయంలో కొండరెడ్లు ‘కళ్లేడమ్మ.. కళ్లేడమ్మ.. గోగుల పిల్లకు.. కెచ్చెల పిల్లోడు’ అంటూ పెళ్లికి సంబంధించిన పాటలు పాడుతూ లయ బద్ధంగా డోలు వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. ఇప్పటికీ గిరిపల్లెల్లో పండుగలు, శుభ కార్యాల్లో ఆదివాసీ గిరిజన సంప్రదాయ డోలు, కొమ్ముల నృత్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. సొంతంగా వాయిద్య పరికరాల తయారీ కొండరెడ్డి గిరిజనులు వాయిద్య పరికరా లు సొంతంగా తయారు చేసుకుంటారు. అడవిలో లభించే ఉస్కటేకు, వేగెసా చెట్ల తో డప్పుల నమూనాలను తయారు చేసి వాటికి మేక చర్మాలను అతికించి వాయి ద్య పరికరాలను తయారు చేసుకుంటారు. అలాగే అడ్డతీగ గిల్లలతో గుత్తులు కట్టి డప్పు వాయిద్యాల నడుమ ఆ గిల్లలు ఊపుతూ చక్కటి తాళంతో మహిళలు నృత్యం చేస్తూ ఉంటారు. ప్రతి ఏటా గ్రామాల్లో పండగ సమయాల్లో నృత్యాలు చేస్తారు. బాట పండగ, పప్పు పండగ, మామిడి పండగ నాడు వీరి ఆటపాటలతో కొండలు ప్రతిధ్వనిస్తుంటాయి. పోడు వ్యవసాయమే జీవనాధారం పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో సుమారు 11వేల మంది కొండరెడ్డి గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకునే వీరు పోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప కొండ దిగి బయట ప్రపంచం వైపు రారు. ఆయా గ్రామాల్లో అందరూ కలిసి కట్టుగా ఉంటూ అన్ని శుభకార్యాలను వారి సంప్రదాయంలో ఎంతో వైభవంగా చేసుకుంటారు. పూర్వికుల నుంచి వస్తున్న సంప్రదాయం మా పూర్వీకుల నుంచి గ్రామాల్లో శుభకార్యాలకు డోలు కొయ్య నృత్యాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్నే మేం కొనసాగిస్తున్నాం. సమాజంలోని మార్పుల వల్ల ఎన్ని కొత్త రకాల వాయిద్యాలు వచ్చినా మా డోలు కొయ్యి వాయిద్యమే మాకు వినసొంపుగా ఉంటుంది. అందులోనే మాకు సంతోషం ఉంటుంది. మాకు ప్రకృతి నేరి్పన సంగీతమిది. – బొల్లి విశ్వనాథరెడ్డి ఆ నృత్యాల్లో అందరం మైమరచిపోతాం మా గిరిజన గ్రామాల్లో ఏటా వేసవిలో బాట పండగ, పప్పు పండగ, మామిడి పండగతో పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో మేం తయారు చేసుకొన్న వాయిద్య పరికరాలు వాయిస్తూ లయబద్ధంగా నృత్యాలు చేస్తాం. ఆ సమయంలో చిన్నాపెద్ద తేడా ఉండదు. అందరూ కలసి సంతోషంగా ఆనందంగా నృత్యాలు చేస్తాం. ఇది మా పూర్వికుల నుంచి వస్తున్న ఆచారం. – గోగుల గంగరాజు రెడ్డి -
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
తమిళసినిమా: ఇతరుల గురించి పట్టించుకోవడం తన పని కాదని, అంత తీరిక కూడా తనకు లేదని, తన పనిని తాను సక్రమంగా చేసుకుంటున్నానని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు. ఇటీవల ఈయన పేరు నిత్యం వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇళయరాజా సంగీతాన్ని అందించిన పాటకు కాపీ రైట్స్ కోరుతున్న విషయం విధితమే. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఇటీవల తన అనుమతి లేకుండా తన సంగీతాన్ని కాపీ కొట్టారంటూ సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు కూడా జారీ చేశారు. అసలు సంగీతం గొప్పదా? సాహిత్యం గొప్పదా? అనే ప్రశ్నకు గీతరచయిత వైరముత్తు తెర లేపారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఇళయరాజా గురువారం ఒక వీడియోను తన సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేశారు. అందులో ఇటీవల తన గురించి ఏవేమో వార్తలు వస్తున్నట్లు వింటున్నానన్నారు. అయితే వాటి గురించి పట్టించుకునే సమయం తనకు లేదని, అలాంటి వాటిపై దృష్టి పెట్టడం తన పని కాదన్నారు. తన పని తాను సక్రమంగా చేసుకుంటున్నానని, చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూనే, ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నానని, అయినప్పటికీ 35 రోజుల్లో సింపోనీ రాసి పూర్తిచేసినట్లు చెప్పారు. ఇది సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. ఇళయరాజా జూలై 14న భారీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక నందనంలోని వీఎంసీఏ గ్రౌండ్లో జరగనున్న ఈ సంగీత విభావరిలో ఇళయరాజా కనీసం 50 నుంచి 60 పాటలు పాడే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. pic.twitter.com/6Bkj59HOhi— Ilaiyaraaja (@ilaiyaraaja) May 16, 2024 -
Pavithra Chari నా కల నెరవేరింది, ఆయనతో పనిచేయడం నా అదృష్టం
దిల్లీకి చెందిన పవిత్రాచారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... మల్టీ–టాలెంటెడ్ ఆర్టిస్ట్. ప్లేబ్యాక్ సింగర్, సాంగ్ రైటర్, వోకలిస్ట్, కంపోజర్గా రాణిస్తోంది. ‘కళ కళ కోసం కాదు. సమాజం కోసం’ అని నమ్మిన పవిత్ర తన ‘కళ’తో వివిధ స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. తాజాగా ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో ‘ఎంటర్టైన్మెంట్’ విభాగంలో చోటు సాధించింది... దశాబ్దకాలం పాటు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఏఆర్ రెహమాన్లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేసింది. ప్రతి దిగ్గజం నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడంలో ముందుంటుంది పవిత్ర. ‘శూన్యం నుంచి కూడా రెహమాన్ సంగీతం సృష్టించగలరు’ అంటుంది. 65వ గ్రామీ అవార్డ్లలో పవిత్ర పాట ‘దువా’ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీకి నామినేట్ అయింది. హెచ్సీఎల్, ఇండిగో ఎయిర్లైన్స్లాంటి ప్రముఖ కంపెనీల యాడ్స్లో నటించింది. ‘అనిరుథ్ వర్మ కలెక్టివ్’లో భాగంగా యూఎస్లో ఎన్నో ప్రాంతాలలో తన సంగీతాన్ని వినిపించింది. ‘చిత్రహార్ లైవ్’ టైటిల్తో చేసిన ఇన్స్టాగ్రామ్ సిరీస్కు మంచి పేరు వచ్చింది, ‘ఈ ప్రాజెక్ట్ ద్వారా సంగీతానికి సంబంధించిన నాస్టాల్జియాను హైలైట్ చేశాను. వ్యక్తిగతంగా, ఆన్లైన్లో ఈ ప్రాజెక్ట్కు ఎంతో స్పందన వచ్చింది’ అంటుంది పవిత్ర.గత సంవత్సరం కొన్ని అద్భుతమైన వోటీటీ ప్రాజెక్ట్లలో భాగమైన పవిత్ర ఆ ప్రాజెక్ట్ల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడమే కాదు, తన ప్రతిభతో వాటికి కొత్తదనాన్ని తెచ్చింది. ‘దిల్లీ అమ్మాయి’గా పాపులర్ అయినప్పటికీ పవిత్ర మూలాలు చెన్నైలో ఉన్నాయి. తన సంగీతయాత్రలో భాగంగా దిల్లీ, చెన్నై, ముంబై నగరాల మధ్య తిరుగుతుంటుంది. ఇప్పుడు చెన్నైలో ఎక్కువ రోజులు ఉండడానికి ప్రాధాన్యత ఇస్తోంది. హిందీ పాటలే కాదు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలాంటి భాషల్లోనూ పాడుతోంది. మల్టిపుల్ ప్రాజెక్ట్లలో భాగం కావడమే కాదు వాటిపై తనదైన ముద్ర వేయడంలో ప్రత్యేకత సాధించింది పవిత్ర.‘ఒకేదగ్గర ఉండిపోవడం కంటే నిరంతర అన్వేషణతో కొత్త దారులు వెదుక్కోవడం నాకు ఇష్టం. ప్రతి దారిలో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లడం అంటే ఇష్టం. కొత్త ఆసక్తి అన్వేషణకు కారణం అవుతుంది. ఆ అన్వేషణలో భాగంగా కంఫర్ట్జోన్ నుంచి బయటికి వచ్చి కొత్త ప్రపంచంలోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది. మల్టిపుల్ ప్రాజెక్ట్లలో గుర్తింపు తెచ్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది పవిత్ర. సంగీతం, సామాజికం అనేవి రెండు వేరు వేరు ప్రపంచాలని ఎప్పుడూ అనుకోలేదు పవిత్ర. ఆర్ట్స్–బేస్డ్ థెరపిస్ట్గా ఎంతోమందికి సాంత్వన చేకూర్చింది. వారి నడకకు కొత్త బలాన్ని ఇచ్చింది.‘లైఫ్స్కిల్స్ ఎడ్యుకేషన్ విత్ మ్యూజిక్’ కాన్సెప్ట్తో వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల కోసం సంగీత కచేరీల ద్వారా నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పాటే కాదు పరిశోధన కూడా.. పవిత్రకు సంగీతప్రపంచం అంటే ఎంత ఇష్టమో, సంగీత ధోరణులకు సంబంధించిన పరిశోధన అంటే కూడా అంతే ఇష్టం. ప్రఖ్యాత గాయని శుభాముద్గల్ దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్న పవిత్ర ‘ఖాయాల్’పై ఆసక్తి పెంచుకోంది. ఈ సంగీత ప్రపంచంలోని స్త్రీవాద ధోరణుల గురించి లోతైన పరిశోధన చేసింది. భారత ఉపఖండంలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రధాన రూపం... ఖాయాల్. అరబిక్ నుంచి వచ్చిన ఈ మాటకు అర్థం... ఊహ. ‘హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్యార్థిగా ఖాయాల్ సంగీతంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. పరిశోధన ఫలితంగా కొత్త విషయాల పట్ల అవగాహన ఒక కోణం అయితే నా గానాన్ని స్వీయ విశ్లేషణ చేసుకోవడం మరో కోణం’ అంటున్న పవిత్ర ఖాయాల్ సంగీతానికి సంబంధించి రిసోర్స్ బ్యాంక్ను తయారు చేసింది. దీనికి ముందు ఖాయాల్ రచనలు, వాటి మూలం, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అధ్యయనం చేసింది. ఎంతోమంది నిపుణులతో మాట్లాడింది. -
సొంత వాహనంలో చార్ధామ్ యాత్ర.. విధివిధానాలివే!
మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో యాత్రసాగించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేస్తోంది. రవాణా శాఖ కూడా ప్రయాణికులకు పలు మార్గదర్శకాలు జారీచేసింది. వీటి ప్రకారం గ్రీన్ కార్డ్ లేని వాహనాలను యాత్రా మార్గంలో అనుమతించరు. అలాగే వాహనాల్లో సంగీతాన్ని ప్లే చేయడంపై నిషేధం విధించారు. దీంతో పాటు వాహనాల్లో ప్రథమ చికిత్స బాక్సు తప్పనిసరి చేశారు.తేలికపాటి వాహనాలకు గ్రీన్కార్డు రుసుముగా రూ.400, భారీ వాహనాలకు రూ.600గా నిర్ణయించారు. చార్ధామ్ యాత్రకు సంబంధించి గురువారం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖల సన్నాహాలను ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. ఏప్రిల్ 10 నుంచి చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నాలుగు ధామ్లలో హెలికాప్టర్ సర్వీస్ కోసం బుకింగ్ కూడా కొనసాగుతోంది.ఈ ఏడాది చార్ధామ్ యాత్రపై భక్తుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఇప్పటి వరకు 16.37 లక్షల మంది ప్రయాణికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. హోటళ్లను కూడా ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే ఈసారి చార్ధామ్ యాత్ర గత రికార్డులను బద్దలు కొడుతుందని రాష్ట్ర పర్యాటక, దేవాదాయ శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నాలుగు ధామ్లను దర్శించుకునేందుకు గత ఏడాది 56.31 లక్షల మంది భక్తులు వచ్చారని తెలిపారు. -
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
యువ సంగీతాభిమానులకు అచ్చంగా సరిపోయే మాట... మ్యూజిక్ మేక్స్ ఎవ్రీ థింగ్ బెటర్. ఇట్టే మరిచిపోయే లక్షణం నుంచి జ్ఞాపకశక్తి పెరగడం వరకు, క్రియేటివిటీని ఎంజాయ్ చేయడం నుంచి క్రియేటివ్ పవర్ పెంచుకోవడం వరకు, జడత్వం నుంచి నిత్యజీవనోత్సాహం వెల్లివిరియడం వరకు, అనామకత్వం నుంచి ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదగడం వరకు ఎన్నోరకాలుగా సంగీతం యువతకు బలం అయింది. సంగీత రత్నాలను వెదుకుతూ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలోకి అడుగు పెట్టిన యువతరం ఆ ప్లాట్ఫామ్లలోనే మ్యూజిక్ స్టార్లుగా మెరవడం ఈ తరంలో కనిపిస్తున్న ప్రత్యేకత.∗ స్పాటిఫైతో ప్రయాణం ప్రారంభించి స్టార్గా ఎదిగిన ఆర్టిస్ట్లలో జస్లీన్ రాయల్ ఒకరు. సింగర్, సాంగ్ రైటర్, కంపోజర్గా మంచి పేరు తెచ్చుకుంది. హిట్ బాలీవుడ్ ట్రాక్స్ కంపోజ్ చేసింది. ‘ప్రపంచ ప్రేక్షకులతో కనెక్ట్ కావడానికి, శ్రోతల అభిప్రాయాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా మ్యూజిక్ కంపోజింగ్లో మార్పులు చేయడానికి స్పాటిఫై ఉపయోగపడింది’ అంటుంది జస్లీన్ రాయల్.∗ ఆరు సంవత్సరాల వయసులో పాటల కోసం గొంతు సవరించింది బెంగళూరుకు చెందిన దియా వదిరాజ్. రకరకాల మ్యూజిక్ జానర్లలో టాలెంటెడ్ సింగర్గా పేరు తెచ్చుకుంది. కోల్కతాకు చెందిన రనితా బెనర్జీ అయిదు సంవత్సరాల వయసులో ‘సింగింగ్ స్టార్’ షోలో పాల్గొంది. ‘స రే గ మ ప’ లిటిల్ ఛాంప్స్లో ఫస్ట్ రన్నర్–అప్గా నిలిచింది. ‘స్వీట్ వాయిస్’ రనిత గొంతు నుంచి వచ్చిన ‘జరాసీ ఆహట్’ పాట 6.2 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది.∗ మల్టీ టాలెంటెడ్ సింగర్గా పేరు తెచ్చుకుంది అంకిత కుందు. రియాల్టీ షోలలో పాడడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిహార్కు చెందిన మిథాలీ ఠాకూర్ ‘రైజింగ్ స్టార్’ షోతో ఫేమ్ అయింది. భోజ్పూరి, క్లాసికల్, ఫోక్ సాంగ్స్ను పాడడంలో మంచి పేరు తెచ్చుకుంది. యూట్యూబ్లో ఆమె వీడియోలు మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకున్నాయి. ఇండియన్–అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ లిశా మిశ్రా పాటలను రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేది. బాలీవుడ్ సినిమాలలో కూడా పాడింది. ఇండియన్ ఐడల్ జూనియర్గా 2015లో సంగీత ప్రపంచానికి పరిచయం అయింది భువనేశ్వర్కు చెందిన అనన్య నందా. బాలీవుడ్ పాటల్లోనే కాదుక్లాసికల్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. మెలోడియస్ వాయిస్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.∗ బోస్టన్ (యూఎస్)లో పుట్టిన అవంతి నగ్రల్కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. ముంబైకి వచ్చిన తరువాత తన పాషన్నే కెరీర్గా చేసుకుంది. మ్యూజిక్లో రకరకాల జానర్స్ను మిక్స్ చేయడంలో గట్టి పట్టు సాధించిన అవంతికి యూట్యూబ్ చానల్ కూడా ఉంది. ఇందులో తన లైవ్ పర్ఫార్మెన్స్ వీడియోలను అప్లోడ్ చేస్తుంది. అవంతికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.∗ ఆర్ అండ్ బీ, హిప్–హాప్, సోల్, పాప్ మ్యూజిక్లలో బహుముఖ ప్రజ్ఞ చాటుకుంటోంది ఇలీన హ్యాట్స్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ముంబైకి చెందిన సాచి రాజాధ్యక్ష ఆల్ట్–పాప్ మ్యూజిక్లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఆమె పవర్ఫుల్, సోల్ వాయిస్కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.∗ దియ నుంచి అవంతి వరకు ఎందరో, ఎందరెందరో యంగ్ మ్యూజిషియన్స్ సంగీతం పట్ల అంకితభావంతో సెల్ఫ్–మేడ్ సూపర్స్టార్లుగా ఎదిగారు. ఎంతోమంది ఔత్సాహికులకు రోల్ మోడల్స్గా మారారు. -
Mohini Dey: మూడు సంవత్సరాల వయసు నుంచే బాస్ గిటార్తో..
పదకొండు సంవత్సరాల వయసులోనే బాస్ గిటారిస్ట్గా మంచి పేరు తెచ్చుకుంది మోహిని డే. మోహిని మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి సుజయ్ డే బాస్ గిటార్ చేతికి అందించాడు. అలా మూడు సంవత్సరాల వయసు నుంచే బాస్ గిటార్తో మోహిని ఫ్రెండ్షిప్ మొదలైంది. జాజ్ ఫ్యూజన్ గిటారిస్ట్గా సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టిన సుజయ్ ఆ తరువాత జాజ్కు దూరమై కుటుంబ పోషణ కోసం కోల్కత్తా నుంచి ముంబైకి వచ్చాడు. సెషన్స్ ఆర్టిస్ట్గా మారాడు. మోహిని విషయానికి వస్తే తండ్రి సుజయ్ తొలి మ్యూజిక్ టీచర్. తండ్రి సహకారంతో చిన్న వయసులోనే పేరున్న పెద్ద కళాకారులతో కలిసి సంగీత కచేరీలు చేసింది మోహిని. పదమూడు సంవత్సరాల వయసులో ప్రసిద్ధ పృథ్వీ థియేటర్ నుంచి మోహినికి ఆహ్వానం అందింది. ‘మ్యూజిక్ ప్రాక్టిస్ చేస్తున్న నా దగ్గరకు నాన్న వచ్చి రంజిత్ అంకుల్ నుంచి కాల్ వచ్చింది, బ్యాగ్ సర్దుకో అని చెప్పారు. పృథ్వీ థియేటర్కు వెళ్లిన తరువాత అక్కడ జాకీర్ హుస్సేన్ను, ఫిల్మ్స్టార్స్ను చూశాను. రంజిత్ అంకుల్ నన్ను జాకీర్ అంకుల్కు పరిచయం చేశారు. ఆ తరువాత స్టేజీ మీద బాస్ గిటార్ ప్లే చేశాను. మంచి స్పందన వచ్చింది’ అంటూ తన మ్యూజికల్ మెమోరీలోకి వెళుతుంది మోహిని. తండ్రి సుజయ్ బాస్ గిటారిస్ట్. ఎంత బిజీగా ఉన్నా కూతురికి సంగీత పాఠాలు నేర్పడానికి అధికప్రాధాన్యత ఇచ్చేవాడు. విక్టర్ వుటెన్ నుంచి మార్కస్ మిల్లర్ వరకు ఎంతో మంది గిటారిస్ట్ల ప్రభావం మోహినిపై ఉంది. ఒకే స్టైల్కి పరిమితం కాకుండా రకరకాల స్టైల్స్ను ప్లే చేయడంలోప్రావీణ్యం సంపాదించింది. ‘రకరకాల స్టైల్స్నుప్రాక్టిస్ చేస్తున్న క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. ఆ సవాళ్లను అధిగమించగలిగినప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. స్కూల్, కాలేజి రోజుల్లో నా ఆలోచనలు స్నేహితులకు వింతగా అనిపించేవి. నా ఆలోచనలు, ఐడియాలు ఎప్పుడు నా వయసు వారి కంటే చాలా భిన్నంగా ఉండేవి’ అంటుంది మోహిని. ‘ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి?’ అనే ప్రశ్నకు మోహిని ఇచ్చే జవాబు ఇది.. ‘సొంతంగా మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయాలనేది నా కల. జంతుసంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనాలనుకుంటున్నాను. వోన్ మ్యూజిక్ షోతో ప్రేక్షకులకు నచ్చే మ్యూజిక్ అందించాలనుకుంటున్నాను’ తల్లిదండ్రులే నా సంగీత పాఠశాల.. తల్లిదండ్రులే నాకు వరం. వారు నాకు సంగీత పాఠశాలలాంటి వారు. ప్రశంస ఎవరికైనా సరే ఉత్సాహాన్ని ఇస్తుంది. నాకు ఎన్నో ప్రశంసలు వచ్చినప్పటికీ అహం ప్రదర్శించలేదు. ఇది కూడా నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నదే. బాస్ గిటార్తో జీవనోపాధికి ఇబ్బంది అని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం అనుకునే సమయంలో యువతకు బాస్ గిటార్పై ఆసక్తి పెరిగేలా చేశాను. – మోహిని డే ఇవి చదవండి: Japnit Ahuja: డిజిటల్ జెండర్ గ్యాప్ను కోడింగ్ చేసింది! -
సంగీతంలో అపశ్రుతి
సంగీతంలో సప్తస్వరాలు ఉన్నాయి. పశుపక్ష్యాదుల ధ్వనుల నుంచి ఇవి పుట్టినట్లు ప్రతీతి. శ్రుతి లయలు స్వరాల గమనానికి దిశానిర్దేశం చేసి, సంగీతాన్ని మనోరంజకం చేస్తాయి. సంగీతానికి ఆధారభూతమైన సప్తస్వరాలైనా, శ్రుతిలయాదులైనా– అన్నీ ప్రకృతి నుంచి పుట్టినవే! ప్రకృతికి కులమతాలు లేవు. ప్రకృతి నుంచి పుట్టిన సంగీతానికి కూడా కులమతాలు లేవు, సరిహద్దులు లేవు. చక్కని సంగీతానికి శ్రావ్యతే గీటురాయి. సంగీత కళను శాస్త్రబద్ధం చేసిన తొలి రోజుల్లో సంగీతానికి సంబంధించిన శాస్త్రీయ సంప్రదాయాలు కొన్ని ఏర్పడ్డాయి. తర్వాతి తరా లలో కొందరు సంగీత విద్వాంసులు పూర్వసంప్రదాయాలను, చాదస్తాలను తోసిపుచ్చి, తమదైన సృజనతో కొత్త ఒరవడికి నాంది పలికారు. తొలినాళ్లలో ఏకరీతిలో ఉన్న భారతీయ సంగీతంలో పద్నాలుగో శతాబ్దం నాటికి విభజన ఏర్పడింది. భారతీయ సంగీతంలో హిందుస్తానీ సంగీతం, కర్ణాటక సంగీతం ప్రధాన శాఖలుగా ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సంగీతంలో ఎన్ని శాఖలు ఉన్నా, అవన్నీ శైలీభేదాల వల్ల ఏర్పడి నవి మాత్రమే! కర్ణాటక సంగీతానికి పురందరదాసు పితామహుడిగా పేరుగాంచారు. ఆయన తర్వాతి కాలంలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి ‘కర్ణాటక సంగీత త్రిమూ ర్తులు’గా పేరుపొందారు. వీరందరూ ఎవరి స్థాయిలో వారు ప్రయోగాలు చేసిన వారే గాని, పూర్వ శాస్త్రగ్రంథాల్లోని పాఠాలకు కట్టుబడి, వాటినే తు.చ. తప్పకుండా వల్లెవేసిన వారు కాదు. వారంతా మడిగట్టుకుని పూర్వగ్రంథాల్లోని పద్ధతులకే పరిమితమై ఉన్నట్లయితే, ఈనాడు కర్ణాటక సంగీతం ఇంతటి ఉత్కృష్ట స్థాయికి చేరుకునేదే కాదు. ముత్తుస్వామి దీక్షితార్ సాహసోపేతమైన ప్రయోగాలే చేశారు. ఈస్టిండియా కంపెనీ అధికారి కర్నల్ జేమ్స్ బ్రౌన్ ప్రోత్సాహంతో ఇంగ్లిష్ సంగీత బాణీలకు సంస్కృత రచనలు చేశారు. ఈస్టిండియా కంపెనీ బ్యాండ్ ఆర్కెస్ట్రాలో ఉపయోగించే వయొలిన్ను చూసి ముచ్చటపడి కర్ణాటక సంగీత కచేరీల్లోకి తీసుకువచ్చారు. ముత్తుస్వామి సోదరుడు బాలుస్వామి తొలిసారిగా కర్ణాటక సంగీత కచేరీలో వయొలిన్ వాయించారు. పాశ్చాత్య శైలిలో ‘నోటు స్వరాలు’ కూర్చి సంప్రదాయ కచేరీల్లో వినిపించడం ప్రారంభించారు. ముత్తుస్వామి దీక్షితార్ చేసిన ప్రయోగాలు ఆనాటిసంప్రదాయవాదులకు మింగుడుపడనివే! చాదస్తపు విమర్శలకు భయపడి ముత్తుస్వామి తన ప్రయోగాలను విరమించుకున్నట్లయితే, ఆయన అనామకంగానే కాలగర్భంలో కలిసిపోయేవారు. ముత్తుస్వామి దీక్షితార్ తర్వాతికాలంలో కూడా కొందరు విద్వాంసులు క్లారినెట్, శాక్సాఫోన్, మాండొలిన్, గిటార్, వయోలా, పియానో వంటి పాశ్చాత్య వాద్యపరికరాలను కర్ణాటక సంగీత కచేరీలకు పరిచయం చేశారు. త్యాగరాజు కాలం నాటికి అప్పటి తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య సంగీతానికి కూడా సమాదరణ ఉండేది. త్యాగరాజు రాజాశ్రయానికి దూరంగా తనసంగీత సాధన కొనసాగించినా, ఆయనపైనా పాశ్చాత్య సంగీత ప్రభావం లేకపోలేదు. త్యాగరాజు ఏటా వేసవిలో ఎక్కువగా తిరువయ్యారులో గడిపేవారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన పాశ్చాత్యసంగీతాన్ని ఆస్వాదించారు. త్యాగరాజు ఆ తర్వాతి కాలంలో శంకరాభరణ రాగంలో కూర్చిన ‘వరలీలా గానలోలా’, ‘సారస నేత్ర’, సుపోషిణి రాగంలో కూర్చిన ‘రమించు వారెవరురా’ వంటి కొద్ది కీర్తనల్లో పాశ్చాత్య సంగీత ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రయోగాలు లేకుండా ఏ కళా, ఏ శాస్త్రమూ అభివృద్ధి చెందదు. మన కాలానికి చెందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ కూడా కర్ణాటక సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసి శ్రోతలను మెప్పించారు. సంగీత సంప్రదాయం ప్రకారం ఆరోహణ అవరోహణలలో ఒక రాగానికి కనీసం ఐదేసి స్వరాలు ఉండాలి. ఆరోహణ అవరోహణలలో ఐదు కంటే తక్కువ స్వరాలను ఉపయో గించి ఆయన కొత్త రాగాలను సృష్టించారు. నేటితరంలో టి.ఎం.కృష్ణ తనదైన శైలిలో సంగీతంలో ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. సంప్రదాయ కచేరీ నమూనాలోనే మార్పులను తీసుకొచ్చారు. వర్ణాలు, కృతులు, తిల్లానాలు వంటి వాటితోనే సాగే కర్ణాటక సంగీత కచేరీల్లో టి.ఎం.కృష్ణ క్రైస్తవ గీతాలను, ఇస్లాం గీతాలను, తమిళ కవుల గేయాలను కూడా పాడటం ద్వారా కొత్త ఒరవడికి నాంది పలికారు. కచేరీల్లో టి.ఎం. కృష్ణ ఈ మార్పులను తెచ్చినప్పటి నుంచి మతతత్త్వవాదులు ఆయనపై విమర్శలు గుప్పిస్తూ వస్తు న్నారు. టి.ఎం.కృష్ణ సంగీత రంగానికి మాత్రమే పరిమితం కాకుండా; దేశంలోని సామాజిక పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందించే తీరు, దళితవాడలకు వెళ్లి కచేరీలు చేస్తూ సంగీతాన్ని సామాన్యుల చెంతకు చేరుస్తున్న పద్ధతి కూడా వారికి కంటగింపుగా మారింది. ఇదివరకు టి.ఎం. కృష్ణకు రామన్ మెగసెసె అవార్డు వచ్చినప్పుడు రుసరుసలు వినిపించాయి. ఇటీవల ఆయనకు మ్యూజిక్ అకాడమీ ‘సంగీత కళానిధి’ అవార్డును ప్రకటించింది. దీనికి నిరసనగా గాయనీమణులు రంజని, గాయత్రి మ్యూజిక్ అకాడమీలో ఈసారి కచేరీ చేయబోమంటూ, అకాడమీ అధ్యక్షుడికి లేఖ రాశారు. మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు ఎన్. మురళి ఆ లేఖకు ఇచ్చిన సమాధానంలో వారి తీరును తప్పుపట్టారు. టి.ఎం.కృష్ణపై అక్కసు వెళ్లగక్కుతున్న వారంతా ఆయన సంగీత సామ ర్థ్యాన్ని గురించి మాట్లాడకుండా, ఆయన సంప్రదాయాన్ని మంటగలిపేస్తున్నాడంటూ గగ్గోలు పెడుతుండటం గమనార్హం. రంజని, గాయత్రి వంటి వారి తీరు సంగీత ప్రపంచంలో ఒక అపశ్రుతి. అయితే, సంగీతం ఒక స్వరవాహిని. ఇలాంటి అపశ్రుతులను సవరించుకుంటూ తన ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. -
సంగీతం వస్తేనే సింగర్ అయిపోరు అని ప్రూవ్ చేసింది!
ఎలాంటి సంగీత నేపథ్యం లేకున్నా పాటను చక్కగా ట్యూన్ చేయగలదు. ఆమె పాటలను రాసి ట్యూన్ చేసి పాడేస్తుంది. అవే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఫేమస్ అయ్యింది. అదే సినీ ఇండస్ట్రీలోకి వచ్చేల చేసింది. అంతేకాదండోయ్ ఫేమస్ పాట 'జిందగీ' పాడింది కూడా ఈమెనే. ఆమె ఎవరంటే.. లాక్డౌన్ కాలంలో దొరికిన విరామంలో ఎంతోమంది తమలోని క్రియేటివ్ టాలెంట్స్ను మెరుగు పరుచుకున్నారు. అలాంటి వారిలో హనియా ఒకరు. కేరళలోని కోచికి చెందిన హనియా నసిఫా లాక్డౌన్లో ఖాళీ సమయం దొరకడంతో సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. ‘నాకు ఎలాంటి సంగీత నేపథ్యం లేదు. అయితే పాటలను రాసి ట్యూన్ చేస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపించేది. అలా పాటలనేవి నా దిన్యచర్యలో భాగం అయ్యాయి’ అంటుంది హానియా. ఇన్స్టాగ్రామ్లో ఆమె ట్రాక్స్ వైరల్ అయ్యాయి. ఇది హానియాను లైమ్లైట్లోకి తీసుకువచ్చింది. ‘నా షార్ట్ మ్యూజిక్ క్లిప్స్కు వేలల్లో వ్యూస్ రావడం మొదలు కావడంతో మరింత ఉత్సాహం వచ్చింది. ఇక అప్పటి నుంచి పాటలను ప్రొఫెషనల్గా రికార్డ్ చేయడం ప్రారంభించాను. మ్యూజిక్ ఇన్స్ట్రూమెంట్స్ను అప్గ్రేడ్ చేశాను’ అంటుంది ఇరవై సంవత్సరాల హనియా. హనియా తన టాలెంట్తో సోషల్ మీడియా నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ఎంతో కాలం పట్టలేదు. మన తెలుగు సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో ‘జిందగీ’ అనే పాటను పాడింది. (చదవండి: ఈజీగా బరువు తగ్గేందుకు సులభమైన మూడు మార్గాలు ఇవే!) -
Adithi Sehgal: ‘ఎవ్రీబడీ డ్యాన్సెస్ టు టెక్నో’
‘నా జీవితంలో సంగీతం భాగం అయిపోయింది’ అంటుంది అదితి సెహగల్. రాక్ మ్యూజిషియన్ అమిత్ సెహగల్, నటి షెనా గమత్ల కుమార్తె అయిన అదితి ‘డాట్’ పేరుతో కూడా మ్యూజిక్ వరల్డ్లో పాపులర్ అయింది. ఆరేళ్ల వయసులో పియానో ప్లే చేయడం నేర్చుకుంది. పన్నెండేళ్ల వయసులో మ్యూజిక్ కంపోజింగ్లోకి వచ్చింది. 'ప్రాక్టిస్ రూమ్స్’ ఆల్బమ్ ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. ‘ఎవ్రీబడీ డ్యాన్సెస్ టు టెక్నో’ మ్యూజిక్ వీడియో వైరల్ హిట్ అయింది. గాఢమైన స్నేహబంధానికి అద్దం పట్టే ‘గర్ల్స్ నైట్’ సాంగ్ కూడా అదితికి ఎంతో పేరు తెచ్చింది. ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ తాజా జాబితాలో సంగీత విభాగంలో చోటు సాధించిది అదితి. ఆదితి సంగీతకారిణి మాత్రమే కాదు మంచి నటి కూడా. జోయా అక్తర్ ‘ది ఆర్చీస్’ సినిమాలో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇవి చదవండి: Ambitio: ధైర్యం ఇస్తూ... దారి చూపుతూ -
మారుతున్న కాలానుగుణంగా.. ఈ కొత్త టెక్నాలజీ మీకోసం..
'అతి వేగంగా పరుగెడుతున్న ఈ కాలాన్ని ఆపడం ఎవరి వలన కాదు. ఈ కాలంతోపాటుగా కొత్త టెక్నాలజీ కూడా అంతే వేగంగా పరుగెడుతుంది. దానిని మనం గుప్పిట్లో దాచి, సరైన క్రమంలో.. టెక్నాలజీని ఉపయోగించుటకై సరికొత్త పరికరాలు మీ ముందుకు వస్తున్నాయి. మరి వాటిని గురించి పూర్తిగా తెలుసుకందామా..!' మిల్క్ వే ట్యాబ్.. మన దేశ విద్యారంగంలోని కీలకమైన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ టెక్ సంస్థల సహాకారంతో ‘ఎపిక్’ ఫౌండేషన్ రూపొందించిన ట్యాబ్ మిల్క్ వే. కొన్ని వివరాలు: సైజ్: 8 అంగుళాలు రిజల్యూషన్: 1,280“800 పిక్సెల్స్ మీడియా టెక్ 8766 ఏప్రాసెసర్ 4జీబి ర్యామ్/64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 5,100 ఎంఏహెచ్ హానర్ మ్యాజిక్ బుక్ 16ప్రో.. సైజ్: 16.00 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 165 హెచ్జడ్ రిజల్యూషన్: 3072“1920 పిక్సెల్స్ ఆపరేషన్ సిస్టమ్: విండోస్ 11 స్టోరేజ్: 16జీబి ప్లస్ 512జీబి సపోర్ట్: ఫింగర్ప్రింట్ సెన్సర్ బరువు: 1.75 కేజీ కలర్స్: వైట్ పర్పుల్ ఫ్రెండ్ మ్యాప్ ఫీచర్.. ‘ఫ్రెండ్ మ్యాప్’ అనే కొత్త ఫీచర్పై పనిచేస్తోంది ఇన్స్టాగ్రామ్. ప్లాట్ఫామ్లోని యూజర్లకు తమ స్నేహితుల లోకేషన్ను చెక్ చేయడానికి ఈ ఫీచర్ ఉపకరిస్తుంది. స్నాప్చాట్లోని ‘స్నాప్ మ్యాప్’ను పోలిన ఫీచర్ ఇది. తమ లొకేషన్ను ఎవరు చూడాలో ఎంపిక చేసుకోవడానికి అనుమతిస్తుంది. ‘ఫ్రెండ్ మ్యాప్’లో యూజర్ తన చివరి యాక్టివ్ లొకేషన్ను దాచే ‘ఘోస్ట్ మోడ్’ కూడా ఉంటుంది. స్టిక్కీ నోట్స్.. మైక్రోసాఫ్ట్ వారి ‘స్టిక్కీ నోట్స్’ యాప్ కొత్త హంగులతో ముందుకు వచ్చింది. పాత ‘స్టిక్కీ నోట్స్’ను రీవ్యాంప్ చేసి ఎన్నో కొత్త ఫీచర్లు తీసుకువచ్చారు. నోట్స్ క్రియేట్ చేయడానికి, స్క్రీన్ షాట్లను తీసుకోవడానికి, ఆడియోను రికార్డ్ చేయడానికి ఇది యూజర్లను అనుమతిస్తుంది. ఇవి చదవండి: అసలు వీటి గురించి మీకు తెలుసా..! -
Muthuswami Dikshitar: ఒక్కసారయినా అక్కడ పాడాలి
ముత్తుస్వామి దీక్షితార్ వారు గంగే మాం పాహి... అంటూ కీర్తన చేస్తూ... గంగ వైభవాన్ని చాలా అద్భుతంగా కీర్తించారు. నీళ్ళబిందె తలమీద పెట్టుకుని ఆడుతుంటే ఎలా ఉంటుందో శివుడు తన జటాజూటంలో గంగను బంధించి తాండవం చేస్తుంటే ఆ దృశ్యం అలా ఉంటుందంటుంది రావణ కృత స్తోత్రం. భగీరథుడు ప్రార్థన చేస్తే వదిలిపెట్టాడు శివుడు గంగను. శంకరుడి శిరస్సు నుండి పాదాల వరకు తగిలి కిందకు ప్రవహించింది. ఆ గంగను ...ఆ నీళ్ళను తలమీద చల్లుకుంటే.. దేవతాస్థానాలనుంచి పడిపోతున్న వాళ్లుకూడా మళ్ళీ తమ పూర్వ వైభవాన్ని పొందుతారట.. అటువంటి శక్తి ఆ గంగమ్మది. గంగే మాం పాహి గిరీశ శిరస్థితే/గంభీరకాయే గీత వాద్య ప్రియే/అంగజతాత ముదే అసి వరుణా మధ్యే....’’. అంటారు దీక్షితార్ వారు తమ కీర్తనలో. ఆమె ప్రవాహ తీరును గంభీర కాయే.. అన్నారు.. ఆమె శరీరం అలా ఉంటుందట.‘...శేషాహే రనుకారిణీ ...’ అంటారు శంకరులు. ఆది శేషుడు భూమి మీద పాకి వెడుతుంటే ఎలా ఉంటుందో గంగా ప్రవాహం అలా ఉంటుందంటారు ఆయన. శేషుడు ఉత్తర దిక్కున ఉంటాడు. ఆయనను స్మరిస్తే మనకున్న ఆపద లు తొలగుతాయని ఒక నమ్మకం. కాశీలో గంగకున్న విశేష లక్షణం ఏమిటంటే... అప్పటివరకు దక్షిణానికి ప్రవహించిన గంగానది అక్కడ ఉత్తర దిక్కుకు మళ్ళుతుంది. దానిని కాశీగంగ అంటారు. అక్కడ గంభీర శబ్దంతో ప్రవహించే గంగను సంగీత వాద్య ప్రియే ... అని కూడా అన్నారు. ఎందుకలా!!! గంగమ్మకు గీతమన్నా, సంగీతమన్నా ఇష్టమట. గంగ ఒడ్డున కూర్చుని పాట పాడినా, వాద్యం మోగించినా, ఆలాపన చేసినా, నృత్యం చేసినా ఆమె సంతోష పడి పోతుందట. అంటే రాజోపచారాలన్నింటినీ అంత ప్రీతితో స్వీకరించగలిగిన భగవత్ స్వరూపం ఆమెది. అంటే నిజమయిన కళాకారుడు నిజజీవితంలో కోరుకోవలసింది ఏమిటంటే – ఒక్కసారయినా గంగ ఒడ్డున కూర్చుని తన ప్రదర్శన ఇచ్చి ఆమెను సంతోష పరచాలి, అని. కాశీలో ఇప్పటికీ ఒక ఏర్పాటు ఉంది. అక్కడ కొన్ని పడవలు అద్దెకిస్తారు. వాటితోపాటూ సంగీత విద్వాంసులు వస్తారు మనతో. వాద్యగోష్ఠి చేస్తారు. కొంతమంది తబలా, వయోలిన్, వీణ వాయిస్తే మరికొంతమంది పాడతారు. సూర్యోదయానికి ముందు తెల్లవారు ఝామున ... అసి, వరుణ – ఈ రెండింటి మధ్యలో అలా సంగీతం వింటూ పడవమీద వెడుతూ ఉంటే గంగమ్మ ప్రసన్నరాలవుతుందని అక్కడి వారి నమ్మకం. గీత వాద్య ప్రియే... అంగజ తాత ముదే... అసి వరుణా మధ్యే...దీక్షితార్ వారి కీర్తనలో కూడా ఇదే వ్యక్తమవుతుంది. అంగజ తాత ముదే... గంగమ్మ ఎవరు? అంగజుడు అంటే మన్మథుని తండ్రి.. మహావిష్ణువు. గంగమ్మ ఆయనకు సంతోషాన్ని కలిగిస్తుందట. తన స్పర్శను పొంది గంగ పునీతమయింది. తిరిగి గంగ ఆ ప్రభావంతో సర్వ జనుల పాపాలను నశింప చేసి ధర్మరక్షణకు కారణమవుతున్నందువల్ల విష్ణువుకు ప్రీతిపాత్రమవుతున్నది అన్నారు ముత్తుస్వామి దీక్షితార్. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
లైసెన్స్ లేని ‘మ్యూజిక్’
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగం 2022 నుంచి పునఃప్రారంభించిన విధానం ప్రకారం ప్రతి పబ్ కచి్చతంగా అమ్యూజ్మెంట్ లైసెన్స్ తీసుకోవాల్సిందే. ఇది లేకపోతే కేవలం ఓ బార్ మాదిరిగా వ్యవహరించాలే తప్ప మ్యూజిక్కు అనుమతి ఉండదు. ఇప్పటికీ సిటీలో అనేక పబ్లు ఈ అనుమతి లేకుండానే యథేచ్ఛగా కార్యకలాపాలు సాగించేస్తున్నాయి. అప్పుడప్పుడు దాడులు చేస్తున్న పోలీసులు సైతం ఓ బెయిలబుల్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. పోలీసు నిబంధనల్ని పట్టించుకోని వారి విషయం ఇలా ఉంటే.. కొందరు పబ్స్ యజమానులు తాము ఈ అమ్యూజ్మెంట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినా అనుమతి లభించట్లేదని ఆరోపిస్తున్నారు. పదేళ్ల క్రితం నిలిచిపోయిన విధానం.. నగరంలో ఒకప్పుడు పబ్స్కు లైసెన్సులు జారీ చేయడంలో పోలీసు విభాగానికీ కీలక పాత్ర ఉండేది. వీళ్లు సైతం క్లియరెన్స్ ఇస్తేనే పబ్ నడిచేందుకు అనుమతి ఉండేది. 2015 నుంచి అమలులోకి వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానంతో ఈ పద్ధతికి ఫుల్స్టాప్ పడింది. వ్యాపార సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడం కోసమంటూ పబ్స్కు పోలీసు లైసెన్స్ విధానాన్ని ప్రభుత్వం అటకెక్కించేసింది. ఫలితంగా కొన్నాళ్లు పరిస్థితులు సజావుగానే ఉన్నా.. ఆపై అసలు సమస్యలు మొదలయ్యాయి. అనేక పబ్స్ ఉల్లంఘనలు, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్లుగా మారిపోయాయి. ఈ విషయంపై హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసులు 2022 నుంచి పాత విధానాన్ని పునరుద్ధరించారు. అధికారిక వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు.. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంటర్టైన్మెంట్, ఎమ్యూజ్మెంట్ లైసెన్సుల జారీకి నగర పోలీసులు 2022 డిసెంబర్ 20 నుంచి శ్రీకారం చుట్టారు. పోలీసుస్టేషన్లు, ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే జారీ చేసే విధానం ప్రారంభించారు. ఈ అవకాశంతో కూడిన నగర పోలీసు వెబ్సైట్ ( ఠీఠీఠీ. జిyఛ్ఛీట్చb్చఛీఞౌ జీఛ్ఛి. జౌఠి. జీn) కొత్త వెర్షన్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా దరఖాస్తును 15 నిమిషాల్లో సబి్మట్ చేసేందుకు ఆస్కారం ఏర్పడింది. దీన్ని పరిశీలించే పోలీసు విభాగం కొత్త లైసెన్సును 30 రోజుల్లో, రెన్యువల్ను 15 రోజుల్లో పూర్తి చేసేలా సమయాన్ని నిర్దేశించారు. దీనికి ముందు స్థానిక శాంతిభద్రతల విభాగం (ఎల్ అండ్ ఓ), ట్రాఫిక్ డీసీపీలు దరఖాస్తుదారుడు పబ్ ఏర్పాటు చేయనున్న భవనాన్ని పరిశీలించేలా నిబంధనలు రూపొందించారు. పక్కా పరిశీలన తర్వాతే అనుమతి... ఈ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా అధికారులు ఆ పబ్ ఉన్న ప్రాంతం, చుట్టుపక్కల వారికి ఏవైనా ఇబ్బందులు కలుగుతాయా? సౌండ్ పొల్యూషన్కు ఆస్కారం ఉందా? అవసరమైన స్థాయిలో పార్కింగ్ వసతులు ఉన్నాయా? తదితర అంశాలను పరిశీలిస్తారు. అవసరమైన అన్ని నిబంధనల ప్రకారం ఉంటేనే అమ్యూజ్మెంట్ లైసెన్సు జారీ చేయాల్సిందిగా కోరుతూ నగర కొత్వాల్కు సిఫార్సు చేస్తారు. ఈ విధానం కొత్తగా ఏర్పాటు చేయబోయే పబ్స్కు మాత్రమే కాదు.. అప్పటికే ఉన్న వాటికీ వర్తింస్తుంది. సరైన పార్కింగ్ వసతి లేని వారిని నిర్ణీత సమయం ఇచ్చి పార్కింగ్ వసతి ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తారు. రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ బయటకు రాకుండా చర్యలు తీసుకునేలా చేస్తారు. కేవలం రాత్రి వేళల్లోనే కాకుండా ఏ సమయంలో ఈ పబ్స్లో వచ్చే శబ్దాలతో స్థానికులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటారు. వాళ్లు తీసుకోరు.. వీళ్లు అడిగినా ఇవ్వరు.. ► ఎమ్యూజ్మెంట్ లైసెన్స్ విధానం పునరుద్ధరించి 14 నెలల దాటుతున్నా.. ఇప్పటికీ నగరంలోని అనేక పబ్స్ ఇది లేకుండా, కేవలం ఎక్సైజ్, జీహెచ్ఎంసీ అధికారులు ఇచి్చన పర్మిషన్లతో నడిపించేస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా పబ్ల జాబితా రూపొందించి, వాటిలో ఎన్నింటికీ ఈ ఎమ్యూజ్మెంట్ లైసెన్స్ ఉంది? ఎన్ని దరఖాస్తు చేశాయి? ఎన్ని ఈ నిబంధనల్ని పట్టించుకోవట్లేదు? అనే అంశాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ► పోలీసులు మాత్రం అప్పుడప్పుడు దాడులు చేస్తున్నారు. లైసెన్స్ లేదంటూ ఓ కేసు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. లైసెన్స్ తీసుకోని వారి విషయం ఇలా ఉంటే.. కొందరు దీన్ని పొందాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసినా.. పోలీసులు పట్టించుకోవట్లేదు. కొత్త లైసెన్సు జారీ 30 రోజుల్లో, రెన్యువల్ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేసేలా గడువు నిర్దేశించుకున్నా ఇది అమలు కావట్లేదు. ఈ విషయం తెలిసిన మిగిలిన పబ్స్ యజమానులూ దరఖాస్తు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. -
గ్రామీ అవార్డుల పంట!
సంగీతం ఎల్లలెరుగదు. అది విశ్వభాష. ఏ ప్రాంతానిదో తెలియదు... ఎవరు మాట్లాడే భాషో తెలియదు... కనీసం దాని భావమేమిటో కాస్తయినా అర్థంకాదు. కానీ శ్రుతిలయలు జతకలిసి హృదయాలను స్పృశించినప్పుడు ఆ రాగలహరిలో మునకేయని మనిషంటూ వుండరు. అందుకే ఆదివారం రాత్రి అమెరికాలో జరిగిన 66వ గ్రామీ అవార్డుల ఉత్సవంలో మన సంగీత దిగ్గజాలు జకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్, రాకేష్ చౌరాసియా అవార్డుల పంట పండించారు. విఖ్యాత తబలా విద్వాంసుడు జకీర్ హుస్సేన్ ఏకంగా మూడు పురస్కారాలు అందుకున్నారు. నిరుడు జూన్లో శక్తి బ్యాండ్ తరఫున విడుదలైన ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్కు శంకర్ మహదేవన్తో కలిసి ఆయనకు ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ పురస్కారం లభించగా, సొంతంగా రూపొందించిన ‘యాజ్ వి స్పీక్’ ఆల్బమ్కు పాష్తో కేటగిరిలో మరో రెండు పురస్కారాలొచ్చాయి. ఇదే ఆల్బమ్కు ఫ్లూటు అందించిన రాకేష్ చౌరాసియాకు సైతం రెండు అవార్డులొచ్చాయి. ఎనిమిది గీతాలతో రూపొందించిన ‘దిస్ మూమెంట్’కు శంకర్ మహదేవన్ గాత్రం సమకూర్చగా, జకీర్ తబలా, జాన్ మెక్లాగ్లిన్ గిటార్, గణేష్ రాజగోపాలన్ వయోలిన్ రాగాలు అందించారు. శక్తి బ్యాండ్ విలక్షణమైనది. దాని స్థాపన వెనకున్న ఉద్దేశాలు ఉన్నతమైనవి. 1973లో మెక్ లాగ్లిన్ నేతృత్వంలో అవతరించిన ఆ బృందం ఖండంతరాల్లోని సంగీత దిగ్గజాలను ఒక దరికి చేర్చి ప్రాచ్య, పాశ్చాత్య సంగీత రీతులను మేళవించి తరతరాలుగా ప్రపంచ సంగీత ప్రియులను అబ్బురపరుస్తోంది. ఇప్పుడు గ్రామీ పుర స్కారాల ఉత్సవంలో ఎందరో సంగీత దిగ్గజాల సృజనను దాటుకుని ‘దిస్ మూమెంట్’ విజేతగా నిలిచిందంటే అది సాధారణమైనది కాదు. నిజానికి శక్తి బ్యాండ్ ప్రత్యేక ఆల్బమ్ రూపొందించి దాదాపు 45 ఏళ్లవుతోంది. అనంతరం నిరుడు ‘దిస్ మూమెంట్’ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ ఆల్బమ్ ఎన్నో ప్రశంసలు అందుకుంది. జకీర్ హుస్సేన్ గ్రామీ అందుకోవటం ఇది మొదటిసారి కాదు. 1992, 2009లలో కూడా గ్రామీ పురస్కారాలు గెలుచుకున్నాడు. అరవై ఆరేళ్ల గ్రామీ పురస్కారాల చరిత్రలో ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ 1967లో తొలిసారి ఆ అవార్డు గెలుచుకుని భారత సంగీతానికి ప్రపంచఖ్యాతిని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయనను 1972, 2001 సంవత్సరాల్లోనూ గ్రామీ అవార్డులు వరించాయి. 2008లో ఏఆర్ రెహమాన్ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి రెండు గ్రామీ అవార్డులు గెలుచుకోగా మన దేశానికి ఒకేసారి ఆరు పురస్కారాలు లభించటం ఇదే తొలిసారి. విశ్వవిఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లారఖా కుమారుడిగా జకీర్ హుస్సేన్కు ఆ విద్య చిన్ననాడే పట్టుబడింది. పట్టుమని పన్నేండళ్ల ప్రాయానికే దేశదేశాల్లోనూ కచేరీలు ఇవ్వగలిగాడు. ఇరవయ్యేళ్ల వయసుకే ఏటా 150 సంగీత కచేరీలు నిర్వహించేంత తీరికలేని విద్వాంసుడు కావటం జకీర్ ప్రత్యేకత. 70వ దశకంలో ప్రపంచాన్ని విస్మయపరిచిన బీటిల్స్ బృందంతో జతకట్టి అందరితో ఔరా అనిపించుకున్నాడు. సంగీతంలో వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందటమే కాదు... ప్రిన్స్టన్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీల్లో ఔత్సాహికుల కోసం వర్క్షాప్లు నిర్వహించి ఎందరినో తీర్చిదిద్దిన ఘనత జకీర్ది. తాను ప్రపంచంలో ఉత్తమ తబలా విద్వాంసుణ్ణి కాదని, ఎందరో విద్వాంసుల్లో ఒకడిని మాత్రమేనని చెప్పుకొనే వినమ్రత జకీర్ సొంతం. తనకు తబలా నేర్పాలని ఏడేళ్ల వయసులో తండ్రి అల్లారఖాను అడిగినప్పుడు ‘బేటా ఇందులో నిష్ణాతుణ్ణి కావాలని అత్యాశపడకు. ఒక మంచి విద్యార్థిగా ఎదగాలని కోరుకో. అప్పుడు మెరుగ్గా తయారవు తావు’ అని సలహా ఇచ్చారట. తండ్రికిచ్చిన మాట ప్రకారం రోజూ తెల్లారుజామున మూడు గంట లకు లేచి తబలా వాద్యంలో మెలకువలు నేర్చుకోవటం ఆయన ప్రత్యేకత. తాను పుట్టిపెరిగిన ముంబై నగరంలో అందరూ గాఢనిద్రలో వుండేవేళ ఆయన సంగీత సాధన మొదలయ్యేది. అందుకే మరో అయిదేళ్లకే కచేరీలు చేసే స్థాయికి జకీర్ ఎదిగాడు. ఈ కళలో మరేదో నేర్చుకోవాలన్న నిరంతర తపన, ఎప్పటికప్పుడు తనను తాను పునరావిష్కరించుకోవటం అనే గుణాలే జకీర్ను ఉన్నత శిఖరా లకు చేరుస్తూ వచ్చాయి. తన సంగీతయానంలో ప్రపంచవ్యాప్తంగా ఎందరో విద్వాంసులను కలుసు కునే అవకాశం లభించటం, వారినుంచి ఎన్నో సంగతులు నేర్చుకోవటం తన ఉన్నతికి దోహద పడ్డాయంటారు జకీర్. కొందరు సంగీత విద్వాంసులు అభిప్రాయపడినట్టు ఆయన సృష్టించిన మేళనాలు వాటికవే విప్లవాత్మకమైనవి కాదు. కానీ తన వాద్యంపై ఆయన సాధించిన అసాధారణ మైన పట్టు, సంక్లిష్ట స్వరాల మలుపులకు అనుగుణంగా అలవోకగా తబలాను పలికించటం, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని రూపొందించుకోవటం జకీర్ విశిష్టత. ఒక సంగీతకారుడన్నట్టు కళాత్మకమైన సృజనే సంగీత నియమాలను సృష్టిస్తుంది. నిబంధనలు సంగీతాన్నీ, సంగీతకారులనూ సృజించలేవు. జకీర్ అయినా, గుక్కతిప్పుకోకుండా ఎంతటి సంక్లి ష్టమైన స్వరాలనైనా ఏకబిగిన పలికించగల శంకర్ మహదేవన్ అయినా, వేణుగాన విన్యాసంలో పేరుప్రఖ్యాతులు గడించిన రాకేష్ చౌరాసియా అయినా గాల్లోంచి ఊడిపడరు. ఎప్పటికప్పుడు తమను తాము ఉన్నతపరుచుకోవాలన్న తపన, నిరంతర అధ్యయన శీలత వారిని ప్రపంచంలో ఉత్త ములుగా నిలుపుతాయి. ఏ రంగంలో ఎదగదల్చుకున్నవారికైనా దగ్గరదారులంటూ ఉండవు. సంగీత ప్రపంచాన మన ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిన ఈ ముగ్గురూ రాగలకాలంలో ఎందరికో ఆదర్శనీయులవుతారు. -
Violinist Tadepalli Subbalakshmi: స్వరవీణ
ఇంట్లోకి అడుగుపెట్టగానే సోఫా కార్నర్లో త్యాగయ్య విగ్రహం అతిథులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది. అదే గదిలో మరోదిక్కున వీణాపాణిౖయెన సరస్వతీ మాత పాదాల చెంత తంబుర మీటుతున్న త్యాగరాజు, కామధేనువు నిత్యపూజలందుకుంటున్న దృశ్యం ఆకట్టుకుంటుంది.‘‘పుష్యమాసం బహుళ పంచమి త్యాగరాజు సిద్ధి పొందిన రోజు. తమిళనాడులో ఆరాధనోత్సవాలు మొదలయ్యాయి’’ అంటూ సంతోషం నిండిన స్వరంతో తన సంగీత ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు తాడేపల్లి సుబ్బలక్ష్మి. ‘‘మాది విజయవాడ. మా పెదనాన్న కొమ్ము వెంకటాచల భాగవతార్ హరికథకులు. కళల నిలయమైన ఇంట్లో పుట్టాను. ఆరవ ఏటనే నా సంగీత సాధన మొదలైంది. ఆకెళ్ల మల్లికార్జున శర్మ, కోటిపల్లి ప్రకాశరావులు నా వయోలిన్ గురువులు. విజయవాడ సత్యనారాయణపురంలో ‘ప్రభుత్వ సంగీత కళాశాల’ పెట్టారు. పదేళ్లకు ఆ కాలేజ్లో చేరాను. మంగళంపల్లి బాలమురళీకృష్ణ మా ప్రిన్సిపల్. ఆ తర్వాత నేదునూరి కృష్ణమూర్తిగారు కూడా. ఆరేళ్లపాటు సాధన చేసి వయోలిన్ లో సర్టిఫికేట్ కోర్సు, డిప్లమో చేశాను. ప్రైవేట్గా వోకల్ కోర్సు కూడా చేశాను. డిప్లమో అందుకోవడం ఆ వెంటనే పెళ్లి. అబ్బాయిని వెతుక్కోవాల్సిన పని పడలేదు. మా వారు ఉమాశంకర్ నా క్లాస్మేట్. జీవితాన్ని పంచుకున్నాం. సంగీత విద్వాంసులుగా వందలాది వేదికలను పంచుకున్నాం. సంగీతసాగరంలో మా జ్ఞానాన్వేషణ కొనసాగుతోంది. సంగీత గురువు సంగీత గురువుగా నా బాధ్యత 1985లో మొదలైంది. జవహర్ బాలభవన్లో వయోలిన్ ఇన్స్ట్రక్టర్గా చేరాను. ఆ తర్వాత నేను చదివిన కాలేజ్లోనే ‘గాయక్ అసిస్టెంట్’గా చేరాను. వేదికల మీద గాత్ర సహకారం, వయోలిన్ సహకారం రెండూ చేయగలగడంతో అనేకమంది ప్రముఖులతో వేదిక పంచుకునే అవకాశం వచ్చింది. ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి శోభానాయుడుకి గాత్ర సహకారం, ప్రముఖ గాయని శోభారాజ్కి వయోలిన్ సహకారం అందించాను. అలేఖ్య పుంజల, భాగవతుల సేతురామ్, ఆనంద్ శంకర్, మంజులా రామస్వామి, ఉమారామారావు, వాసిరెడ్డి కనకదుర్గ వంటి గొప్పవారితో నా సరిగమల, స్వర రాగాల ప్రయాణం సాగింది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత సంగీతసేవ విస్తృతంగా చేయడానికి నాకు అవకాశాలు వచ్చాయి. దూరదర్శన్, భక్తి చానెల్, ఎస్వీబీసీ – నాద నీరాజనంతోపాటు ఇతర దేవాలయాల్లో లెక్కకు మించిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఐసీసీఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్)నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సింగపూర్, టర్కీ, లెబనాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, అబూదాబి వంటి దేశాల్లో కచేరీలు చేయగలిగాను. ఎన్టీఆర్గారు కళలను అభిమానించేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ ప్రారంభగీతం ఆలపించాను. గవర్నర్ రంగరాజన్గారి హయాంలో గవర్నర్ బంగ్లాలో అప్పటి రాష్ట్రపతి కే ఆర్ నారాయణన్ గౌరవార్థం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భక్తి సంగీతం ఆలపించడం వంటి ఎన్నో సంతోషాలను సంగీత సరస్వతి నాకిచ్చింది. నా వయసు 74. ఆరు దశాబ్దాలు దాటిన సంగీత సాధనను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే నాకు ముచ్చట గా అనిపించే సందర్భం జూనియర్ ఎన్టీఆర్ నాట్యప్రదర్శన. మద్రాసు (చెన్నై)లో జరిగిన ఆ కార్యక్రమానికి సంగీత సహకారం అందించాను. ఆ పిల్లవాడు చాలా మంచి డాన్సర్. నిరంతర గాన వాహిని నేను మ్యూజిక్ కాలేజ్ నుంచి రిటైర్ అయ్యేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగం నుంచి మా వారు కూడా రిటైర్ అయి ఉన్నారు. ఇద్దరం కలిసి ‘వాగ్దేవి సంగీత విద్యాలయం’ పేరుతో సంగీత పాఠశాలను స్థాపించాం. పూర్థిస్థాయి శిక్షణ ఇచ్చి డెబ్బైమందికి పైగా విద్యార్థులను పరీక్షలకు పంపించాం. నా స్టూడెంట్స్ కెనడా, యూఎస్, సింగపూర్లలో మ్యూజిక్ స్కూళ్లు నిర్వహిస్తున్నారు. ఈ తరం బాల్యం చాలా చురుగ్గా ఉంటోంది. పిల్లల్లో గ్రహణ శక్తి చాలా మెండుగా ఉంది. త్వరగా నేర్చుకుంటున్నారు. అందుకు టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడుతోంది. అప్పట్లో మాకు గురువు పాడి వినిపించిన పాటను ఇంట్లో సాధన చేసేటప్పుడు ఏదైనా సందేహం వస్తే, మరునాడు క్లాస్లో నివృత్తి చేసుకోవాల్సిందే. ఇప్పుడలా కాదు, గురువు పాడేటప్పుడే రికార్డ్ చేసుకుని మళ్లీ మళ్లీ వింటూ నేర్చుకుంటున్నారు. కానీ సంగీతంలో కొనసాగేవాళ్లు తక్కువ. మూడేళ్లపాటు బాగా నేర్చుకున్న తర్వాత టెన్త్క్లాస్కు వచ్చారని, ఇంటర్మీడియట్ కూడా కీలకం కాబట్టి పూర్తి సమయం చదువుల కోసమే కేటాయించాలనే ఉద్దేశంతో సంగీతసాధనకు దూరమవుతున్నారు. మా రోజుల్లో సంగీతమే అసలు చదువుగా ఉండేది. నేను ప్రైవేట్గా మెట్రిక్యులేషన్ పూర్తి చేశాను. తమిళులు మాత్రం ఉన్నత చదువులు చదువుతూ సంగీతాన్ని కూడా కొనసాగిస్తుంటారు. మన తెలుగు వాళ్లలో ప్రతిభ ఉంది. అయితే అంకితభావమే తక్కువ. ఉపాధికి భరోసా ఉంటే ఈ కళను కెరీర్గా ఎంచుకునే వాళ్ల సంఖ్య పెరుగుతుంది. నాకనిపించేదేమిటంటే... పిల్లలకు స్కూల్ దశలోనే సంగీతం, నాట్యం వంటి కళల కోసం ఒక క్లాసు ఉంటే బాల్యంలోనే కళలు పరిచయమవుతాయి. కళాసాధనతో వచ్చే క్రమశిక్షణ వారిలో దుడుకుతనాన్ని తగ్గించి ఒద్దిక నేర్పుతుంది. పిల్లలు మంచి పౌరులుగా ఎదగడానికి పరోక్షంగా దోహదం చేస్తుంది. కాబట్టి పాఠశాల విద్యలో సంగీత, నాట్యాలను సిలబస్గా పెట్టే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు తాడేపల్లి సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి మంచి టీచర్ ఇది నేను సంపాదించుకున్న బిరుదు. ఇప్పటికీ రోజుకు రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని సాధన చేస్తాను, పిల్లల చేత సాధన చేయిస్తాను. ఇంట్లో సంగీతపాఠాలు చెప్పే టీచర్లు కొందరు పిల్లలను తాళం వేయమని చెప్పి తాము వంట చేసుకుంటూ ఒక చెవి ఒగ్గి గమనిస్తుంటారు. టీచర్ ఎదురుగా ఉంటేనే క్రమశిక్షణ అలవడుతుందని నా విశ్వాసం. సంగీతం అంటే సరిగమలు పలకడం మాత్రమే కాదు, ఆత్మతో మమేకం కావాలి. సంగీత సాధన పట్ల పిల్లల్లో ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించినప్పుడే గురువుగా మేము ఉత్తీర్ణత సాధించినట్లు. అలాగే కళ కోసం జీవించడంలో ఉండే సంతృప్తి జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. నా యూట్యూబ్ చానెల్ ‘తిల్లానా’ కోసం పాటలు పాడి రికార్డ్ చేస్తున్నాను. భగవంతుడు ఒక నైపుణ్యాన్ని ఇస్తాడు, దానిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంటుంది. – తాడేపల్లి సుబ్బలక్ష్మి, గాయని, వయోలిన్ విద్వాంసురాలు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
కళాత్మక భావనలు విరిసిన వేదిక!
హైదరాబాద్: ఆర్ట్ ఆఫ్ లివింగ్, వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరపు అతిపెద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేడుక భావ్-2024 బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో వైభవంగా జరిగింది. దిగ్గజ కళాకారులచే కదిలించే ప్రదర్శనలు, పౌరాణిక పాత్రల ఆధారంగా రచించిన కళారూపకాలు, రామాయణ భావోద్వేగ చిత్రణలు, అంతరించి పోతున్న కళారూపాల పునరుజ్జీవనం మొదలైన అంశాలతో జరిగిన ఈ సదస్సుకు దేశం నలుమూలల నుండి అత్యుత్తమ సాంస్కృతిక ప్రతిభావంతులు, వర్ధమాన కళాకారులు హాజరయ్యారు. మానవతావాది, గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మార్గదర్శకత్వం, ప్రేరణతో జనవరి 25 నుండి 28 వరకు జరిగిన ఈ కార్యక్రమం సంస్కృతి, కళలతో ఆధ్యాత్మికతను మేళవించి సరికొత్త ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది. కళాకారుడి భావోద్వేగ స్థితి ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానంగా, “కళాకారులు భావోద్వేగాలు కలిగి ఉంటారు. ప్రేక్షకులను సంతోషపెట్టే ప్రయత్నంలో కళాకారులు తరచుగా తమను తామే మరచిపోతారు. పాత్రలతో మమేకమై తమ అంతరంగాన్ని, తమ సహజ స్వభావాన్ని సైతం గమనించలేరు. పైగా మనకు ఒకటి కాదు, కోపం, ధైర్యం, దుఃఖం, విరహం – ఇలా తొమ్మిది రకాలైన భావోద్వేగాలు (నవ రసాలు) ఉన్నాయి. జీవితంలో స్థిరత్వం కావాలంటే ఈ భావాలన్నిటినీ అధిగమించి వెళ్లాలి. వీటికి ఆవలగా వెళ్లగలిగినప్పుడే మనకు బలం వస్తుంది.” అని ప్రబోధించారు. ఈ కార్యక్రమానికి తెలుగురాష్ట్రాలకు చెందిన సంగీత, నృత్య కళాకారులు హాజరయ్యారు. వర్ధమాన కళాకారులను, ఇందులో భాగంగా 61 అంశాలపై 153మంది కళాకారులతో పరస్పర చర్చలు, ప్రదర్శనలు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, బృందచర్చలు మొదలైనవి ఏర్పాటు చేశారు. శతాబ్దాల క్రిందటి సంప్రదాయ వర్కరీ యాత్ర, శేషులత కోసురు మొదలైన కర్ణాటక సంగీత ప్రముఖులచే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఈ భావ్-2024 లో భాగంగా నిర్వహించారు. ఈ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఆధ్యాత్మిక అంశం గురించి వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ డైరెక్టర్ శ్రీవిద్య యశస్వి మాట్లాడుతూ.. “ఇటువంటి ప్రదర్శనలలో మనం ఆ ప్రాచీన కాలానికి వెళ్ళిపోయి చూస్తాం. కళాకారుడు కేవలం దైవానికి సమర్పణగా మాత్రమే ప్రదర్శన ఇస్తాడు. ఇక చూసేవారు ఆ అనుభవానికి ప్రేక్షకులుగా ఉంటారు” అని పేర్కొన్నారు. “ఉదాహరణకు, అయోధ్యలోని దేవాలయాల నుండి 7000 సంవత్సరాలకు పైగా తరతరాలుగా సంప్రదాయబద్ధంగా నాట్యం చేస్తున్న కళాకారులను మేము ఆహ్వానించాము. వారి కళానిబద్ధత, అనుభవ సారాంశం ఇక్కడ జరుగుతున్న అన్ని ప్రదర్శనలలోనూ మనం చూడవచ్చు.” అని ఆమె పేర్కొన్నారు. కళారూపాలకు తమ జీవితాలను అంకితం చేసి, వాటిని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసిన ప్రముఖ కళాకారులకు కళాసారథి అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతలలో ఈలపాటకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డా. కొమరవోలు శివప్రసాద్, కేరళకు చెందిన డా. కళామండలం సరస్వతి, మొదలైనవారు ఉన్నారు. డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యుడు, ఈలపాట మాంత్రికునిగా, ఆంధ్రకోకిలగా పేరొందిన డా. కొమరవోలు శివప్రసాద్ మాట్లాడుతూ.. ''కళా సారథి అవార్డు అందుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో అవార్డులు అందుకున్నాను కానీ ఈ కళాసారథి అవార్డు దివ్యత్వంతో కూడినది. పవిత్రమైన ఈ ఆశ్రమ వాతావరణంలో ఎక్కడ చూసినా చాలా కష్టపడి పనిచేసిన కళాకారులు కనిపిస్తున్నారు. 93 ఏళ్ల వయస్సు ఉన్న కళాకారులు సైతం ఉన్నారు. వారిని కలుసుకోగలగడం, వారి ఆశీస్సులు తీసుకోవడం ఒక అందమైన అనుభవం." అని పేర్కొన్నారు. భావ్-2024 సదస్సులో తన అనుభవాన్ని శేషులత కోసూరు పంచుకున్నారు, తనకు సంగీతమే గొప్ప సాంత్వన చేకూరుస్తుందని తెలిపారు. ఇతరుల అనుభవాలను తెలుసుకునేందుకు గొప్ప అవకాశాన్నిచ్చిందని ప్రముఖ వైణికుడు ఫణి నారాయణ పేర్కొన్నారు. ఇలాంటికార్యక్రమాలు ప్రతీ ఏటా జరగాలన్నారు. సంగీతకారులకు భావ్ అనేది చాలా సముచితమైన గౌరవం అని ఈమని శంకరశాస్త్రిగారి కుమార్తె ఈమని కళ్యాణి పేర్కొన్నారు. భానుమతీ నరసింహన్ రచించిన ‘సీత’ పుస్తకం ఆధారంగా నృత్యరూపకాన్ని ప్రదర్శించిన ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారిణి క్రాంతి నారాయణ్, వర్ధమాన నాట్య కళాకారిణి వనజా ఉదయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్తాద్ ఫజల్ ఖురేషీతో పండిట్ కాళీనాథ్ మిశ్రా తబలా వాద్య కచేరీ, కేరళకు చెందిన ఇర్రంగాపురం బాబు చెండ వాద్యం, కథక్ కేంద్ర చైర్పర్సన్ ఉమా డోగ్రా ప్రదర్శించిన ‘శబరి’ నృత్యరూపకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూడు తరాలకు చెందిన కథక్ నృత్య కళాకారిణులు పద్మాశర్మ, గౌరీ, తారిణి తమ అభినయాన్ని ఈ వేదికపై లయబద్ధంగా ప్రదర్శించారు. దృష్టిలోపం, ప్రత్యేక అవసరాలు కలిగిన కళాకారులు రంగ్ గంధ్ పేరిట ప్రదర్శించిన ప్రత్యేక కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇవి చదవండి: ఈజిప్ట్ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు! -
మొక్కల సంగీతాన్ని వినొచ్చు తెలుసా!
మొక్కలకు, చెట్లకు అనుభూతులు ఉంటాయి. వాటిలో అవి సంభాషణలు జరుపుకుంటాయి అని శాస్త్రవేత్తలు ఇదివరకే కనుగొన్నారు. మొక్కలు సంగీతాన్ని కూడా ఆలపిస్తాయి. అయితే వాటి సంగీతం మన చెవులకు సోకదు. మొక్కల సంగీతాన్ని వినగలిగే పరికరాల తయారీ దిశగా శాస్త్రవేత్తలు కొంతకాలంగా కృషి సాగిస్తున్నారు. అందులో భాగంగానే స్వీడన్కు చెందిన వడ్రంగి, సంగీత పరికరాల తయారీదారుడు అయిన లవ్ హల్టన్ మొక్కల సంగీతాన్ని వినగలిగేందుకు వీలుగా ఈ పరికరాన్ని రూపొందించాడు. దీనికి ‘టెగెల్’ అని పేరు పెట్టాడు. చూడటానికి ఇది ఇటుకలతో తయారు చేసినట్లు కనిపిస్తున్నా, పూర్తిగా కలపతోనే తయారైంది. ఇందులోని మట్టి కుండీలో మొక్కను నాటి, దాని నుంచి వెలువడే ధ్వని తరంగాలను స్వీకరించేలా విద్యుత్తు తీగలను అమర్చాడు. దీనిలోని స్పీకర్ అమరిక ద్వారా మొక్కల నుంచి వెలువడే సంగీతం మనకు కూడా వినిపిస్తుంది. అలాగే దీనికి అమర్చిన కీబోర్డును వాయిస్తూ మనుషులు కూడా సంగీతాన్ని సృష్టించవచ్చు. ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ పరికరాన్ని మార్కెట్లోకి తేలేదు. (చదవండి: 93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!) -
Ayodhya Ram Mandir: ఆహూతులను ఆకట్టుకున్న నృత్య, సంగీత ప్రదర్శనలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణ ప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన నృత్య, సంగీత,నాటక ప్రదర్శనలు మంత్రిముగ్ధుల్ని చేశాయి. రామ చరితతోపాటు, 500 ఏళ్ల నుంచి రామ మందిర ప్రాణ ప్రతిష్ట వరకు జరిగిన విశేషాలను ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. ‘బధాయ్, చారీ, గూమర్, భవాయ్, ఝుమర్, ధోబియా, రాయ్, రస్లీల, మయూర్, ఖయాల్ నృత్యం, సతారియా’వంటి జానపద నృత్యాలతో కళాకారులు అమితానందం కల్గించారు. భరతనాట్యం, ఒడిస్సీ, కూచిపూడి, మణిపూరి, మోహని ఆట్టం, కథాకళి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్యాల ప్రదర్శనలు జరిగాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ప్రాణ ప్రతిష్ఠ ముగిసేదాకా ఈ నృత్య ప్రదర్శనలు జరిగాయి. సినీ, క్రీడా రంగ ప్రముఖులు, వ్యాపార, రాజకీయ దిగ్గజాలు ఈ నృత్య, సంగీత, నాటక ప్రదర్శనలను సెల్ఫోన్లలో బంధించారు. చలనచిత్ర, సంగీత కళాకారులు బాల రాముడిపై అభిమానాన్ని పాటల రూపంలో చాటారు. ప్రముఖ సంగీత కళాకారులు శంకర్ మహదేవన్, సోను నిగమ్ ‘రామ్ భజన్’ చేశారు. అనురాధ పౌడ్వాల్, మాలినీ అవస్తీ ‘రామాష్టకం’తో అలరించారు. ‘రాం సియా రాం’ అంటూ సోను నిగం పాడిన పాట ఆకట్టుకుంది. -
రూ.12 వేలకోట్ల సంగీత సామ్రాజ్యం.. టాప్ 10లో 7 మన పాటలే!
చదువు పూర్తయి సంగీత పరిశ్రమలో స్థిరపడాలనుకునే వారి తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన ఎదురవుతోంది. ఆ రంగంలో స్థిరపడేవారి ఆదాయమార్గాలు అంతంతమాత్రంగానే ఉంటాయనే భావన ఉంది. దాంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందేమోనని భయపడుతారు. కానీ 2022లో దేశంలోని మ్యూజిక్ ఇండస్ట్రీ ఏకంగా రూ.12000 కోట్ల వ్యాపారం సాగించింది. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. మొత్తంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో రూ.2.1 లక్షల కోట్ల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. అయితే అందులో మ్యూజిక్ ఇండస్ట్రీ 6 శాతం వాటా కలిగి ఉంది. మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లోని టాప్ 10 పాటల్లో ఏడు భారతీయులవే కావడం విశేషం. పుష్ప సినిమాలో సునిధి చౌహాన్ పాడిన ‘రారా సామీ’ పాట ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. దీనికి 1.55 బిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఇంద్రావతి చౌహాన్ పాడిన ‘ఊ అంటావా’ పాటను 1.52 బిలియన్ల మంది చూశారు. మ్యూజిక్ కంపోజర్లు, గేయ రచయితలు, సింగర్లకు చెల్లించే డబ్బు 2.5 రెట్లు పెరిగినట్లు తెలిసింది. ప్రత్యేకంగా మ్యూజిక్ ఆల్బమ్స్ను క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నవారు, లైవ్షోల ద్వారా అర్జిస్తున్నవారు, డిస్కో జాకీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ది మ్యూజిక్ క్రియేటర్ ఎకానమీ: ది రైజ్ ఆఫ్ మ్యూజిక్ పబ్లిషింగ్ ఇన్ ఇండియా, 2023 నిర్వహించిన సర్వే ప్రకారం.. 40,000 కంటే ఎక్కువ మంది సంగీత సృష్టికర్తలు ఏటా 20,000-25000 పాటలను సిద్ధం చేస్తున్నారు. ఈ సర్వేలో అప్పటికే ఉంటున్న పాటలు, మ్యూజిక్ రీమిక్స్ చేస్తున్నవారిని పరిగణలోకి తీసుకోలేదు. వారిని కూడా కలుపుకుంటే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా పేరున్న సంస్థలు విడుదల చేసే మ్యూజిక్కే ఆదరణ ఉండేదని, కానీ పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా స్థానికంగా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్న వారి కంటెంట్కు సైతం మంచి ఆదరణ లభిస్తోందని సర్వే ద్వారా తెలిసింది. ఇదీ చదవండి: రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు? 1957నాటి కాపీరైట్ చట్టంలో 2012లో మార్పులు తీసుకొచ్చారు. రికార్డింగ్ని యధాతథంగా కాకుండా అదే పాటను మరొక సింగర్ పాడవచ్చు. వేరొక ట్యూన్కి సెట్ చేయవచ్చు. లైవ్షోలో పాడవచ్చు. దాంతో వివిధ మార్గాల నుంచి రాయల్టీలు పొందే వీలుంది. -
Birthday Special: మ్యూజిక్ ఇతడి చేతుల్లో మేజిక్.. ఏఆర్ రెహమాన్ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
కేజీఎఫ్ ప్రజల ప్రేమ అమోఘం: స్టార్ డైరెక్టర్
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా.రంజిత్. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో విక్రమ్ కథానాయకుడుగా తంగలాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ప్రతిభావంతులైన కొత్త సంగీత కళాకారులను ప్రోత్సహించే విధంగా గత కొన్నేళ్లుగా నీలం కల్చరల్ సెంటర్ పేరుతో మార్గశిర మాసంలో పలు గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జనం సంగీత కార్యక్రమాన్ని హోసూరు, చైన్నె, కేజీఎఫ్ ప్రాంతాల్లో నిర్వహించ తలపెట్టారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేజీఎఫ్లోని నగర పరిపాలన మైదానంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఈనెల 28 నుంచి 30 వరకు చెన్నైలో మూడు రోజులపాటు ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకల్లో పాల్గొన్న దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ.. బుద్ధుని ఆశీస్సులతో ఈ జన సంగీత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేజీఎఫ్ ప్రజల ప్రేమాభిమానాలు తనను ఆశ్చర్య పరిచాయన్నారు. ఇకపై కూడా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నానన్నారు. సంగీత కళాకారులతో కలిసి బాబా సాహెబ్ అంబేడ్కర్ మార్గంలో మనమంతా పెద్ద విప్లవాన్ని సృష్టిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నటుడు దినేష్, కలైయరసన్, రచయిత తమిళ్ ప్రభ, దర్శకుడు దినకర్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై పలువురు కళాకారులు జన సంగీత కళలను ప్రదర్శించి ఆహుతులను ఆలరించారు. We are all set at kgf, come join us today and celeberate a music festival straight from the roots✨🎊🥁 Welcome you All! Entry Free! Today at 3pm. Location: Municipality Ground, Robertsonpet. Kolar Gold Fields,Karnataka.@beemji @Neelam_Culture @NeelamSocial @KoogaiThirai pic.twitter.com/qfwusQKKdB — Margazhiyil Makkalisai (@makkalisai) December 23, 2023 రు. -
పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి..
సంగీతం కోసం సంగీత వాయిద్యాలపై పట్టు ఉండాలన్నది గతకాలపు మాట. కృత్రిమ మేధ ఉండగా.. సంగీతానికి కొదవేముంది అంటోంది ఈ కాలం. ఏమిటీ వింత అనుకుంటున్నారా? ఏం లేదండీ... గూగుల్ సంగీత సృష్టికి తాజాగా ఏఐ ఆధారిత టెక్నాలజీ ఒకదాన్ని అభివృద్ధి చేసింది. పేరు ఇన్స్ట్రుమెంటల్ ప్లే గ్రౌండ్’: పేరులో ఉన్నట్లే ఈ టెక్నాలజీ ద్వారా భారతీయ వీణతోపాటు దాదాపు వంద సంగీత వాయిద్యాలను అలా అలా వాడేయవచ్చు. సరిగమలు పలికించవచ్చు. పదాలతో సంగీతాన్ని సృష్టించవచ్చు. తాజాగా గూగుల్ ఏఐ ఆధారిత సంగీత టూల్ ‘ఇన్స్ట్రుమెంట్ ప్లేగ్రౌండ్’ను పరిచయం చేసింది. వీణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 సంగీత వాయిద్యాల శిక్షణ ఇచ్చారు. వినియోగదారులు తమకు ఇష్టమైన పరికరాన్ని ఎంచుకొని పదాల రూపంలో ప్రాంప్ట్ను అందిస్తే చాలు. దీంట్లో సంగీతం నేర్చుకునేందుకు ఉండే సాఫ్ట్వేర్ ఇరవై సెకన్లలోనే సంగీతం క్లిప్ను సృష్టిస్తుంది. సంతోషం, ప్రేమ, అనురాగం వంటి భావోద్వేగాలను మన ప్రాంప్ట్లకు జోడించొచ్చు. ఇదీ చదవండి: ఫన్సెర్చ్ను క్రియేట్ చేసిన గూగుల్.. ఇదే ప్రత్యేకత కృత్రిమ మేధతో సంగీతాన్ని సృష్టించాలని అనుకునే వారు సౌండ్రా ఏఐ సాయమూ తీసుకోవచ్చు. దీనిలోని సంగీతమంతా కాపీరైట్ లేనిదే. ఒక బృందం రూపొందించిన సంగీతం నమూనా ఆధారంగానే దీనికి మొత్తం శిక్షణ ఇచ్చారు. కాబట్టి కాపీరైట్ సమస్యలు వస్తాయేమోననే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
స్వీట్ ట్యూన్ ట్విన్ సిస్టర్స్!
ట్విన్ సిస్టర్స్ సుకృతి, ప్రకృతి కకర్లకు సంగీతం బాల్యం నుంచి సుపరిచితం. తల్లి మ్యూజిక్ టీచర్. అక్క ప్రొఫెషనల్ సింగర్. ఎనిమిది సంవత్సరాల వయసులో సంగీత ప్రపంచంలో తొలి అడుగులు వేశారు. పాపులర్ హిట్స్తో సింగర్స్గా బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అక్క సుకృతి సంగీతంలో తమకు స్ఫూర్తి అని చెబుతారు. అలా అని అక్కను అనుకరించకుండా తమదైన ముద్ర కోసం ప్రయత్నించి విజయం సాధించారు ప్రకృతి. ‘మొదట్లో ప్రశంసలను మాత్రమే ఆస్వాదించే వాళ్లం. విమర్శలను దూరంగా పెట్టేవాళ్లం. అయితే సంగీత పరిశ్రమలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా సహజం అనే వాస్తవం తెలుసుకున్నాను. నిర్మాణాత్మక విమర్శలు ముఖ్యం. ద్వేషపూరిత విమర్శలతో ట్రోలింగ్ చేయడం తగదు’ అంటుంది ప్రకృతి. వంద వరకు లైవ్ షోలు చేసిన ఈ సిస్టర్స్ ‘ప్రతి షో ఒక పాఠం నేర్పుతుంది’ అంటారు. ‘ప్రపంచవ్యాప్తంగా మ్యూజిషియన్లు లైవ్ షోలకు ప్రాధాన్యత ఇస్తారు. మేము కూడా అంతే. ఆన్లైన్లో కంటే ప్రేక్షకుల సమక్షంలో వారి ప్రతిస్పందనలు, ప్రశంసలు, చప్పట్లు ఆస్వాదిస్తూ లైవ్ షో చేయడంలో ఎంతో మజా ఉంటుంది. ఇక ఇండిపెండెంట్ మ్యూజిక్ మాలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది. యువ సంగీతకారులు తమను నిరూపించుకోవడానికి ఇండిపెండెంట్ మ్యూజిక్ సహాయపడుతుంది’ అంటుంది సుకృతి. (చదవండి: చీకటిమయంగా ఉన్న కూతురి జీవితాన్ని 'ప్రేరణ ' ఇచ్చే శక్తిగా మార్చిన ఓ తల్లి కథ!) -
విశ్వకవి జీవితంతో స్ఫూర్తి పొందిన జపాన్ కళాకారిణి..!
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఎంత చెప్పిన తక్కువ. ఆయన ఎందరికో స్ఫూర్తి. ఆయన సాహిత్య రచనలు, సిద్ధాంతాలు ఎందరినో కదిలించాయి. కానీ ఓ జపాన్ కళాకారిణి మన రవీంద్ర నాథ్ ఠాగూర్ ఆలోచనలకు ఫిదా అయ్యానని చెబుతోంది. పైగా ఆ కవి తన స్ఫూర్తి అని చెబుతోంది. ఓ విదేశీయురాలు మన విశ్వకవిని ఆరాధిస్తున్నాడంటే..ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా ఫీలై సంఘటన. ఇంతకీ అతను ఎవరంటే.. కోల్కతాలోని జపాన్ కాన్సులేట్ ఒక సిటీ క్లబ్లో సంగీత వేడుకను నిర్వహించింది. ఆ కార్యక్రమంలో ఓ జపాన్ కళాకారిణి విశ్వకవి గురించి ఎంతగొప్పగానే చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బెంగాల్ కవి రవీంద్ర నాథ్ ఠాగూర్ ఆలోచన, సిద్ధాంతాలు తనను కదిలించాయని చెబుతోంది జపనీస్ కళాకారుడు పియానిస్ట్ యుకికో కుసునోకి. ఆయన ప్రేరణతోనే ఈ కార్యక్రమంలో ఎన్నో మధుర గీతాలను, ఇతర జపనీస్ ట్యూన్లను ప్లే చేశానని చెప్పింది. తన ఆదర్శాలు, ఆలోచనలు ఠాగూర్ తో మమేకమయ్యాయనని ఆనందంగా చెబుతోంది. ఇటీవలే ఠాగూర్ నివాసమైన శాంతినికేతన్ని సందర్శించినట్లు వివరించింది. అక్కడ ప్రజలను కలుసుకుని సంగీత ప్రదర్శన ఇవ్వడం తనకెంతో సంతోషం అనిపించిందని చెబుతుంది. తనకెప్పటీ నుంచో శాంతినికేతన్ని చూడాలన్నేదే చిరాల కోరిక అని అది ఇప్పటికీ నెరవేరిందని సంతోషంగా చెప్పింది. నిజానికి సంగీతం అనేది హద్దులు లేనిది. దీంతో మానవజాతి మధ్య శాంతి సామరస్యలను, ప్రేమ వంటి వాటిని పెంపొందించొచ్చు. అంతేగాదు తాను 2022లో భారత్ సందర్శనానికి వచ్చినప్పుడే ఠాగూర్కి సంబంధించిన మెలోడి సంగీతాన్ని కనుగొన్నానని దానిని తాను ఎంతో కష్టబడి యూట్యూబ్ సాయంతో నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. (చదవండి: 56 ఏళ్ల వయసులో ఎమ్మెస్సీ పాసైన సెక్యూరిటీ గార్డు!ఏకంగా 23 సార్లు..) -
డబుల్ ఇస్మార్ట్కు మణిశర్మ స్వరాలు
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) సూపర్హిట్గా నిలిచింది. ప్రస్తుతం రామ్, పూరి కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చనున్నట్లు చిత్రయూనిట్ శనివారం వెల్లడించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి, చిరుత, ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ సినిమాలకు మణిశర్మ సంగీతం అందించిన సంగతి గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చే ఏడాది మార్చి 8న విడుదల కానుంది. -
ఒక్క పాటతో బాలీవుడ్లో ఫేమస్ అయిన షల్మాలీ
చిన్న వయసులోనే తల్లి నుంచి సంగీతం నేర్చుకుంది షల్మాలీ ఖోల్గాడే. ఆమె తల్లి ఉమా ఖోల్గాడే శాస్త్రీయ గాయని. ప్రసిద్ధ రంగస్థల కళాకారిణి. యూఎస్లో వోకల్ మ్యూజిక్ కోర్సు చేసిన షల్మాలీ బాలీవుడ్ సినిమా ‘ఇష్క్జాదే’లో పరేషాన్ పాటతో బాగా పాపులర్ అయింది. బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్గా ఫిల్మ్ఫేర్ అవార్డ్ అందుకుంది. ‘గతంలో పోల్చితే చాలామంది గాయకులు తమ స్వరాలకు తామే పాట రాసుకుంటున్నారు. గొంతు ఇస్తున్నారు. ఆ పాటల్లో ఒక్క పాట హిట్ అయినా అవకాశాలు మన అడ్రస్ వెదుక్కుంటూ వస్తాయి. కోవిడ్కు ముందు కోవిడ్ తరువాత సంగీతాన్ని గురించి చెప్పుకోవాలంటే కోవిడ్ విరామంలో చాలామంది తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకున్నారు. View this post on Instagram A post shared by Shalmali Kholgade (@shalmiaow) ఆడియో వోటీటీకి ఆదరణ పెరగడం శుభపరిణామం. మ్యూజిక్ అంటే ఫిల్మ్ మ్యూజికే కాదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇండిపెండెంట్ మ్యూజిక్కు కూడా మంచి ఆదరణ ఉంది’ అంటుంది షల్మాలీ ఖోల్గాడే. View this post on Instagram A post shared by Shalmali Kholgade (@shalmiaow) -
మీటింగ్ అయ్యాక గిటార్ వాయించే సీఎం! ఆయనో డిఫరెంట్ ‘ట్యూన్’
నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపుతుంటారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అయితే కొందరు సీఎంలు మాత్రం ఏదో ఒక వ్యాపకంతో ప్రత్యేకత చాటుతూ ఉంటారు. అలాంటి వారిలో మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా (Meghalaya Chief Minister Conrad Sangma) ఒకరు. ఐరన్ మైడెన్ పాటకు ఆయన ఎలక్ట్రిక్ గిటార్పై వాయిస్తున్న వీడియో కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా తన సంగీత అభిరుచి గురించి మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా పలు ఆసక్తి వివరాలను ‘హిందూస్తాన్ టైమ్స్’తో పంచుకున్నారు. సంగీతం తనకు అంతులేని ఉత్సాహాన్ని, ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. తాను ఎప్పుడూ సంగీతంలోనే ఉంటానని, అవకాశం దొరికినప్పుడల్లా ఎలక్ట్రిక్ గిటార్ ప్లే చేస్తానని చెప్పారు. క్యాబినెట్ సహచరులతో ఉన్నప్పుడు, ముఖ్యమైన సమావేశాలు, కార్యక్రమాల అనంతరం లైవ్ ప్రదర్శన ఇవ్వడానికి ఇష్టపడుతుంటానని తెలిపారు. జీ20 సమావేశాల్లో ప్రదర్శన తన సహచరులతో డిన్నర్లో కలిసినప్పుడు తప్పకుండా గిటార్ వాయిస్తానని, సంగీతం తన సంస్కృతిలో అంతర్భాగమని చెప్పుకొచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఏదైనా విషయంలో అసంతృప్తిగా ఉన్నప్పుడు, తన సంగీతాన్ని విని ఆ అసంతృప్తిని మరచిపోతారని వెల్లడించారు. ఇటీవల జీ20 సమావేశాల్లో తన ప్రదర్శను రాయబారులు, సహచరులందరూ ఆనందించారని పేర్కొన్నారు. యువతకు ప్రోత్సాహం తాను యువకుడిగా ఉన్నప్పుడు తన బ్యాండ్కి సంగీతాన్ని రికార్డ్ చేయడానికి స్టూడియో ఉండేది కాదని చెప్పుకొచ్చిన ఆయన రాష్ట్రంలో సంగీత కళాకారుల కోసం మరిన్ని స్టూడియోలను తీసుకురావలనుకుంటున్నట్లు తెలిపారు. సంగీత అవకాశాలతో పాటు, సినిమాలకు లొకేషన్గా మేఘాలయ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మేఘాలయ యువత సినిమా నిర్మాణంలోకి రావాలని ఆకాంక్షించారు. ఇందు కోసం సినిమా థియేటర్ల ఏర్పాటును ప్రోత్సహించడానికి భారీ రాయితీలు అందిస్తున్నామన్నారు. యువ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి రాష్ట్రం తరఫున సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. -
పేద పిల్లలకు సంగీతం నేర్పిస్తున్న అక్కాచెల్లెళ్లు
‘నేర్చుకున్న విద్యను పదిమందికి పంచుదాం’ అంటున్నారు కామాక్ష్మి, విశాల సిస్టర్స్. ముంబైకి చెందిన ఈ అక్కాచెల్లెళ్లు ‘ది సౌండ్ స్పేస్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి తాము నేర్చుకున్న సంగీతాన్ని పేద పిల్లల చెంతకు తీసుకువెళుతున్నారు. గత పది సంవత్సరాలుగా కామాక్షి, విశాల సిస్టర్స్ పది వేలమంది పిల్లలకు సంగీత పాఠాలు బోధించారు. టైమ్తో అప్డెట్ అవుతూ పిల్లలు సులభంగా అర్థం చేసుకునేలా పాఠాలను డిజైన్ చేశారు. ‘జీవితంలో ప్రతి దశలో సంగీతం ఆహ్లాదాన్ని, శక్తిని ఇస్తుంది. సంగీతం అనేది బాగా డబ్బులు ఉన్న వాళ్ల కోసమే అనే భావనను మార్చాలనుకున్నాం’ అంటుంది కామాక్షి. విశాల, కామాక్షి లక్నో యూనివర్శిటీలో మ్యూజిక్ కోర్సు చేశారు. ‘చదువు, ఆరోగ్యం... మొదలైనవి మాత్రమే పిల్లలకు ముఖ్యం అనే వాళ్లు చాలామంది ఉన్నారు. అయితే కోవిడ్ కల్లోల కాలంలో మ్యూజిక్ థెరపి గొప్పదనం ఏమిటో తెలిసింది’ అంటుంది విశాల. -
సంగీతంతో ఒత్తిడి, డిప్రెషన్ దూరం.. అధ్యయనాల్లో వెల్లడి
పాటకు రాళ్లను కరిగించే శక్తి కూడా ఉందంటారు. అంతేకాదు.. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా ఎలాంటి మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా కేవలం మ్యూజిక్ వింటూనే చేయించుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎలాంటి వ్యాధినైనా సంగీతం నయం చేస్తుందనే విషయం ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి. కొన్ని క్లిష్టమైన రోగాలను సైతం నయం చేయగలిగే సత్తా సంగీతానికి ఉంటుంది. మరి సంగీతం వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందామా.. సంగీతం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? మనసు బాగోకపోయినా, సంతోషంగా ఉన్నా, జర్నీలో ఉన్నా.. ఇలా ఏ సందర్భంలో అయినా పాటలు వింటూ ఉంటే చెప్పలేని సంతోషం.ఎలాంటి వ్యాధినైనా సంగీతం నయం చేస్తుందనే విషయం ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి. అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధన ఇదే విషయాన్ని వెల్లడి చేస్తోంది. రెండు రూములను ఎంచుకొని, ఒకే విధమైన విత్తనాలను వాటిలో పెంచడం మొదలుపెట్టారు. వీటిలో ఒక రూములో శాసీ్త్రయ సంగీతం అదనంగా ఏర్పాటు చేశారు. అనూహ్యంగా ఈ మొక్కల ఎదుగుదల ఆరోగ్యకరంగా ఉన్నట్లు పరిశోధన ఫలితం వెల్లడైంది. ►గుండె పనితీరు సక్రమంగా ఉండేందుకు సంగీతం కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ► ప్రతిరోజు ఒక అరగంటపాటు ఇష్టమైన సంగీతాన్ని వినడం వల్ల గుండె పనితీరు పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు సంగీతం వింటూ తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల శరీరంలో గుండెకు మేలు కలిగించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ► డిప్రెషన్, యాంగ్జయిటీ, పెయిన్, స్ట్రెస్ మొదలైన సమస్యలకు ఇప్పుడు సంగీతం కూడా చికిత్సగా ఉపయోగపడుతోంది. సంగీతం వినడం వల్ల విద్యార్థులు మరియు ఉద్యోగులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ► సంగీతం వినడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుంది. ► మనకు నచ్చిన సంగీతం వింటే శరీరంలో హ్యాపీహార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని పూర్తి స్ధాయిలో పోగొడతాయి. ► సంగీతం వినడం వల్ల మతిమరుపు సమస్య కూడా దూరమవుతుంది. దీనికారణంగా అల్జీమర్స్ వంటి సమస్యలు చాలా వరకూ దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. మ్యూజిక్ థెరపీ అనేది చాలా మంది మతిమరుపు సమస్యల్ని దూరం చేశాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నారు. ► ప్రతిరోజూ సంగీతం వినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. -
అమెరికాలో ఉద్యోగం వదిలేసి సింగర్గా రాణిస్తున్న లిసా
‘వీరే ది వెడ్డింగ్’ సినిమాతో బాలీవుడ్ సింగర్గా అరంగేట్రం చేసింది లీసా మిశ్రా. యూనిక్ వాయిస్తో ప్రేక్షకులను మెప్పించింది. తనకు ఇష్టమైన పాటలు పాడి సోషల్మీడియా ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేసే మిశ్రా చికాగోలో డాటా–ఎనలిస్ట్గా ఉద్యోగం చేసింది. సంగీతాన్నే కెరీర్ చేసుకోవడానికి అమెరికా నుంచి ముంబై వచ్చింది. రెండు సంవత్సరాల క్రితం ప్రఖ్యాత సింగర్ లేడీ గాగాతో కలిసి మ్యూజిక్ ప్రోగ్రామ్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో మిశ్రాకు ఎనిమిది లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. తన యూట్యూబ్ చానల్కు మూడు లక్షలమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ‘మ్యూజిషియన్గా పేరు తెచ్చుకోవడానికి నాకు యూట్యూబ్ ఎంతో ఉపయోగపడింది. నా సంగీతం ప్రపంచ వ్యాప్తంగా చాలామందికి పరిచయం కావడానికి సోషల్ మీడియా ఉపయోగపడింది. View this post on Instagram A post shared by Kabeer Kathpalia (@oaffmusic) కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పులా, ఒత్తిడిని జయించే శక్తిలా నా సంగీతం ఉండాలనుకుంటాను. చాలామందికి మన విజయం తప్ప ఆ విజయం కోసం గతంలో పడిన కష్టం గురించి తెలియదు. దీంతో వోవర్ నైట్ సక్సెస్ అంటుంటారు’ అంటుంది సింగర్–సాంగ్ రైటర్ లీసా మిశ్రా. View this post on Instagram A post shared by Lisa Mishra (@lisamishramusic) -
ఫస్ట్ లేడీ డీజే..ప్రపంచంలోనే టాప్-100లో చోటు
డిస్కోనైట్ అయినా, పెళ్లి బరాత్, దావత్ ఏదైనా డీజే మోత మోగి పోవాల్సిందే. నచ్చిన పాటను అడిగి మరీ పెట్టించుకుని స్టెప్పులతో ఊగిపోతుంది నేటి యువతరం. వెరైటీగా మిరుమిట్లు గొలిపే డ్రెస్ వేసుకుని, ఉత్సాహం నింపే పాటలను పెడుతూ ఊగిపోతుంటాడు డీజే. అబ్బాయిలు మాత్రమే డీజేగా కనిపిస్తుంటారు. కానీ డీజేవాలి దీది పురుషులకు ఏ మాత్రం తగ్గకుండా డీజేను దంచి కొడుతోంది. తన రీమిక్స్ బీట్స్తో మ్యూజిక్ లవర్స్ను ఉర్రూతలూగిస్తూ, సరికొత్త బాటలో నడిచేందుకు నేటి యువతరానికి మార్గం చూపుతోంది డీజే రింక్. డీజే రింక్ మరెవరో కాదు 38 ఏళ్ల స్నేహల్ షా. గుజరాత్లో పుట్టినప్పటికీ ముంబైలో పెరిగింది. షాకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తయ్యాక... కామర్స్లో పీజీ చేసింది. మార్కెటింగ్ కంపెనీలో చేరింది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్నేహల్ మన సంతా సంగీతంపైనే ఉండేది. దీంతో.. మంచి మంచి పాటలను వినడం, వాటన్నింటినీ తన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో భద్రపరుచుకోవడం అలవాటుగా మార్చుకుంది. ఇలా స్నేహల్ కలెక్ట్ చేసిన వాటిలో బాలీవుడ్ పాటలు కోకొల్లలు. సంగీతంపై ఉన్న మక్కువతో సౌండ్ ఇంజినీరింగ్ డిప్లొమా కూడా చేసింది. డీజే రింక్గా... ఒకసారి స్నేహల్ పార్టీకి వెళ్లింది. అక్కడ ఎంతో ఉత్సాహమైన డీజే పాటలు వస్తున్నాయి. తనకిష్టమైన పాటను ప్లేచేయమని డీజేను అడిగింది. అందుకు ఆ డీజే ప్లేచేయడం కుదరదు అన్నాడు. దీంతో తనే ప్లే చేసుకుంటాను అని అడిగి పాటను ప్లే చేసింది. అప్పటి నుంచి తను కూడా డీజేగా మారాలనుకుని.. ప్రముఖ డీజే జో అజెరెడో, డీజే సుకేతు దగ్గర డీజే శిక్షణ తీసుకుంది. నైపుణ్యాలన్నింటిని ఔపోసన పట్టాక 2015లో డీజే రింక్గా మారింది. వివిధ రకాల క్లబ్స్లో పనిచేస్తూ ‘డీజేయింగ్’ సంబంధించిన అప్డేటెడ్ టెక్నాలజీ గురించి తెలుసుకునేది. స్నేహల్ ఇష్టాన్ని తల్లిదండ్రులు వెన్నంటే ఉండి ప్రోత్సహించేవారు. తల్లిదండ్రులు ముద్దుగా పిలుచుకునే ‘రింకు’ పేరునే ... డీజే రింక్గా మార్చుకుని డీజే ప్రపంచంలోకి అడుగుపెట్టింది. పదమూడులో పాపులర్... డీజే రింక్ ఈడీఎమ్ ‘‘ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్’’లో కష్టపడి నైపుణ్యం సాధించింది. ముఖ్యంగా హిప్ హాప్, బాంగ్రా పాటలను ప్లేచేయడంలో అందె వేసిన చెయ్యిగా పేరుగాంచింది. పండుగల్లో రీమిక్స్ చేసిన పాటలను కూడా ప్లే చేసేది. అవి అందరినీ ఆకర్షిస్తుండడంతో డీజే రింక్ 2013లో బాగా పాపులర్ అయ్యింది. దీంతో భారతదేశంలో బాలీవుడ్ పాటలను మిక్స్ చేసే తొలి మహిళా డేజేగాను, ఇండియాలోని టాప్ –22 డీజేలలో ఒకటిగా నిలిచింది. పురుషుల ఆధిపత్యం కొనసాగే డిజే సౌండ్స్లో రింక్ ఏమాత్రం భయపడలేదు. ప్రారంభంలో పురుష డీజేలతో కలిసి పనిచేయడం కష్టం అయినప్పటికీ.. తనని తాను నిరూపించుకుని తన కలను నిజం చేసుకుంది. అందర్నీ బీట్ చేస్తూ... మంచి మంచి బీట్స్ను అందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు అనేక రికార్డులను బద్దలు కొడుతోంది స్నేహల్ షా. మల్టీటాలెంటెడ్ సింగర్, రీమిక్సర్, పెర్ఫార్మర్గా అనేక ప్రశంసలు అందుకుంటోంది. సోనీ మ్యాక్స్ ఐపీఎల్ సీజన్ –6లో పాల్గొన్న ఒక్కగానొక్క మహిళా డీజే రింక్ కావడం విశేషం. గత పదేళ్లుగా ప్రపంచంలోని డీజేలతో పోటీ పడుతూ టాప్–100 జాబితాలో ఇండియా తరపున తనకంటూ స్థానం కల్పించుకుంది. 2023 సంవత్సరానికి గాను ఏషియా టాప్–50 డిజేల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది రింక్. అంతేగాక ఇటీవల ‘బెస్ట్ వెడ్డింగ్ డీజే’ అవార్డును అందుకుంది. శ్రావ్యమైన బీట్స్తో సాగిపోతున్న డిజే రింక్ ఎంతోమంది మహిళలు, అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తోంది. అనాదిగా వస్తోన్న పద్ధతులను దాటుకుని తమని తాము నిరూపించుకోవచ్చని తన బీట్స్తో చక్కగా వినిపిస్తోంది. ఇప్పటిదాక రెండు వేల బాలీవుడ్ పాటలను రీమిక్స్ చేసింది. డిజే స్కూల్ నడుపుతూ మరింతమంది డీజేలను తయారు చేస్తోంది. ‘‘డీజే రింక్స్ సౌండ్ ఫ్యాక్టరీ’’ పేరిట యూ ట్యూబ్ ఛానల్ నడుపుతోంది. అమృతారావ్, జాన్ అబ్రహమ్, కరణ్ గ్రోవర్, ఇలియానా డిక్రూజ్ వంటి బాలీవుడ్ సెలబ్రెటీలతో స్టేజ్ పంచుకుంది.‘‘ద వే యూ లైక్ మి’’ పేరిట రింక్ విడుదల చేసిన తొలి ఆల్బమ్కు మంచి ఆదరణ లభించి, బాగా పాపులర్ అయ్యింది. View this post on Instagram A post shared by DJ RINK (@djrinkindia) View this post on Instagram A post shared by DJ RINK (@djrinkindia) -
గాన సరస్వతి
పువ్వుకు రాగం అబ్బితే ఎలా ఉంటుంది? ఆ పువ్వు స్వరాన్ని ఎలా సవరించుకుంటుంది? ఆ తావి గానాన్ని ఎలా శ్రుతి చేసుకుంటుంది? అక్షరాలను పూలరెక్కల్లా పొదివి పట్టుకుంటుంది. సరిగమలు కందకుండా సున్నితంగా గానం చేస్తుంది. ఆ గాన సరస్వతి... మన రావు బాలసరస్వతీదేవి. పువ్వు పాడితే ఎలా ఉంటుందో... రావు బాలసరస్వతీదేవి పాట వింటే తెలుస్తుంది. హైదరాబాద్, మణికొండలోని గాయత్రి ప్లాజాలో ఆమె ఫ్లాట్ గోడలు ఆ గానసరస్వతి రాగాలను నిత్యం వింటుంటాయి. తొంభై ఐదేళ్ల వయసులో కూడా ఆమె స్వరంలో రాగం శ్రుతి తప్ప లేదు. తొంభై ఏళ్లుగా సాగుతున్న సాధనతో ఆ స్వరం అద్దుకున్న తియ్యదనం అది. పారిజాత పువ్వులాంటి మృదుత్వం ఆమె రాగానిది. ఆ గొంతు సన్నజాజి మొగ్గలా పరిమళం వెదజల్లుతోందిప్పటికీ. ఆ సుమధుర గానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తొమ్మిది దశాబ్దాల ఆమె సంగీత సేవను గౌరవిస్తోంది. నవంబర్ ఒకటవ తేదీన (రేపు) ఆమె వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. గ్రామఫోన్ నుంచి సీడీల వరకు సరస్వతి నాలుగవ ఏట నుంచి వేదికల మీద పాడుతున్నారు. ఆరవ ఏట హెచ్.ఎం.వి కంపెనీ ఆమె పాటను గ్రామఫోన్లో రికార్డు చేసింది. తెలుగు సినిమాలో తొలి నేపథ్య గాయనిగా రికార్డు ఆమెదే. ఆకాశవాణి కేంద్రాలు మద్రాసు, విజయవాడ స్టేషన్ల కోసం ప్రారంభగీతం పాడిన రికార్డు కూడా ఆమెదే. తెలుగు, తమిళ, కన్నడ భాషలతోపాటు సింహళ గీతాలనూ ఆలపించారు. బాలనటిగా, బాల గాయనిగా సినీరంగం ఆమెను గారం చేసింది. పేరు ముందు ‘బాల’ను చేర్చింది. కర్ణాటక సంగీతం, హిందూస్థానీ సంగీతాలు సాధన చేసింది. సినిమా షూటింగ్ల కారణంగా స్కూలుకెళ్లడం కుదరకపోవడంతో ఆమె చదువు కోసం ట్యూటర్ ఇంటికి వచ్చి పాఠాలు చెప్పేవారు. ఆమెకు ఇంగ్లిష్ నవలలు చాలా ఇష్టం. ఆ అలవాటును ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గ్రామఫోన్ రికార్డుల కాలం నుంచి క్యాసెట్ టేప్లో రికార్డ్ చేసే టెక్నాలజీని చూశారు. సీడీలు, ఎంపీత్రీలనూ చూశారు. టెక్నాలజీతోపాటు అప్డేట్ అవుతూ వచ్చారు. కానీ, సినిమా సంగీతం, సాహిత్యంలో వచి్చన భాషాపరంగా విలోమమవుతున్న ప్రమాణాలను అంగీకరించలేకపోయారు. సినిమా అంటే శక్తిమంతమైన వినోదసాధనం. పిల్లలు, యువతకు మానసిక వికాసం, మేధో వికాసంతోపాటు వాళ్ల అభివృద్ధికి... వినోదం అనే సాధనంతో బాటలు వేసే గొప్ప కళామాధ్యమంగా ఉండాలి సినిమా. అంతే తప్ప విలువలను దిగజార్చుకునే సాధనం కాకూడదని చెబుతారామె. రెండు వేలకు పైగా పాటలు పాడిన ఈ సంగీత సరస్వతి ఈ రోజుల్లో పాటల సాహిత్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాట కలిపింది ఇద్దరినీ! చెన్నై (మద్రాసు) లో పుట్టి పెరిగిన బాల సరస్వతి పెళ్లి తర్వాత కోడలిగా కోలంక జమీందారీలో అడుగుపెట్టారు. ప్రకృతి ఇద్దరు వ్యక్తులను దూరం చేసిన విషాదాంతాలను సినిమాల్లో చూస్తుంటాం. కానీ ప్రకృతి ఇద్దరు మనుషులను దగ్గర చేయాలనుకుంటే చాలా చమత్కారంగా దగ్గర చేస్తుంది. అందుకు ఈ గానసరస్వతి పెళ్లే గొప్ప ఉదాహరణ. ‘‘నా పాటను వినడానికి స్వయంగా కోలంక జమీందార్... శ్రీ రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు గారు మద్రాసులో మా ఇంటికి వచ్చారు. నేనప్పుడే ‘కలువ రేకుల కనులు గల నా స్వామీ’ అనే పాట రికార్డింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాను. మా నాన్న పాట పాడమనగానే అదే పాట పాడాను. రాజా వారేమో తన పెద్ద కళ్లను వరి్ణస్తూ, వారి మీద ప్రేమను అలా పాట రూపంలో వ్యక్తం చేశాననుకున్నారట. అదే మా పెళ్లికి నాందీ గీతం’ అంటూ ఆనాటి జ్ఞాపకాన్ని సంతోషంగా గుర్తు చేసుకున్నారామె. అందుకే తనకు ఇష్టమైన ప్రదేశం మద్రాసేనని చెబుతారామె. ఈ బాల రెండో బాల్యమిది! బాలసరస్వతీ దేవికి హాఫ్ వైట్ పట్టు చీరలిష్టం. క్రీమ్ కలర్తో అనేక రంగుల కాంబినేషన్లలోనే ఎక్కువగా కనిపిస్తారు. ఆమెకు మల్లెలన్నా ఇష్టమే. ఇక స్వీట్స్... ముఖ్యంగా గులాబ్ జామూన్, జాంగ్రీలను చూస్తే చిన్నపిల్లయిపోతారు. చాక్లెట్ చేతికిస్తే పసి పిల్లల ముఖం వికసించినట్లే ఆమె ముఖంలో నవ్వులు పూస్తాయి. భోజనం గుప్పెడే కానీ, ఆ వెంటనే స్వీట్ తినడం ఆమెకిష్టం, ఆ తర్వాత తియ్యగా పాడడం మరింత ఇష్టం. ఆ సరిగమల వారసత్వం ఇద్దరు కొడుకులకు రాలేదు, మనుమడు, మనుమరాలికీ రాలేదు. కానీ మనుమరాలి కూతురు నేహకు వచ్చింది. గానసరస్వతి కళ్ల ముందే ఆ ఇంట్లో సరిగమల కొత్తతరం వెల్లివిరుస్తోంది. తొంబై ఐదేళ్ల వయసులో హైదరాబాద్లోని పెద్ద కుమారుని ఇంటిలో ప్రశాంతంగా పసిబిడ్డలా జీవిస్తున్నారు బాల సరస్వతీదేవి. కన్నతల్లిని ‘కన్నక్కా’ అని పిలుస్తూ తల్లిని కన్నబిడ్డలా చూసుకుంటున్నారాయన. కోడలు అత్తగారి చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఆమెను అపురూపంగా చూసుకుంటున్నారు. సాక్షి ఇంటర్వ్యూలో ఆమె కొన్ని సంగతులు చెప్తూ మధ్యలో మర్చిపోతుంటే ఆమె పెద్ద కొడుకు, పెద్ద కోడలు అందుకుని పూర్తి చేయడమే అందుకు నిదర్శనం. సినిమాలకు మాత్రమే దూరం... స్వరానికి కాదు! పెళ్లి తర్వాత పదిహేనేళ్లకు బాల సరస్వతీదేవి సినిమాల కోసం పాడడం మానేశారు. కానీ సంగీత సాధన మాత్రం ఆపలేదు. సినారె తెలుగులోకి అనువదించిన మీరాభజన్ గీతాలను ఆలపించారామె. ఎనభై ఏళ్ల వయసులో ఆమె తనకిష్టమైన కొన్ని లలిత గీతాలను ఎంచుకుని స్వీయ సంగీత దర్శకత్వం వహించి ‘రాధా మాధవం’ సీడీ విడుదల చేశారు. కోవిడ్కి ముందు 2018లో అంటే ఆమె తొంబయ్యేళ్ల వయసులో ‘స్వరాభిషేకం’ కార్యక్రమంలో పాడడమే ఆమె చివరి వేదిక. ఆ వేడుక తర్వాత మూడవ రోజు ఇంట్లో జరిగిన ప్రమాదం ఆమెను ఇంటికే పరిమితం చేసింది. అయితే ఆశ్చర్యంగా జారి పడడంతో విరిగిన తుంటి ఎముక దానంతట అదే సరయింది. సంగీతమే తనను స్వస్థత పరిచిందంటారామె. ఇప్పటికీ రోజూ ఆ స్వరం రాగాలను పలుకుతుంటుంది. ఆమె ఊపిరితిత్తులకు శక్తినిస్తున్నది సంగీతమేనని వైద్యులు కూడా నిర్ధారించారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: మోహనాచారి -
ప్రయాణాల్లో సులువుగా..ఈ గిటార్ను మడిచేసుకోవచ్చు...
గిటార్ సంగీతాన్ని ఇష్టపడనివారు ఉండరు. గిటార్ వాద్యంలో విద్వత్తును సాధించిన వారు కొద్దిమంది ఉంటే, కాలక్షేపంగా గిటార్ వాద్యాన్ని సాధన చేసేవారు ఎందరో ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు గిటార్ను తీసుకెళ్లడం కష్టంతో కూడుకున్న పనే! పొడవాటి గిటార్ను జాగ్రత్తగా బాక్స్లో భద్రపరచి తీసుకుపోవాల్సి ఉంటుంది. లగేజీలో ఇది చాలా చోటును ఆక్రమిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, గిటార్ ధ్వంసమయ్యే ప్రమాదాలూ లేకపోలేదు. ఈ సమస్యకు పరిష్కారంగానే అమెరికన్ సంగీత పరికరాల తయారీ కంపెనీ ‘కియరీ గిటార్స్’ సులువుగా మడిచేసుకునే గిటార్ను ‘ఎసెండర్ పీ90 సోలో’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణాలకు వెళ్లేటప్పుడు దీన్ని తేలికగా మడిచి, ప్యాక్ చేసుకోవచ్చు. దీని ధర 1599 డాలర్లు (రూ.1.32 లక్షలు) మాత్రమే! -
Amazon Layoffs: అమెజాన్ మళ్లీ షాక్ ఇచ్చింది: ఈసారి ఎవరంటే..!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్(Amazon) లో మరోసారి ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది.గ్లోబల్ కమ్యూనికేషన్స్ కీలకమైన విభాగాల్లో ఈ లేఆఫ్లను ప్రకటించింది. డెడ్లైన్ నివేదిక ప్రకారం దేశీయ, అంతర్జాతీయంగా కమ్యూనికేషన్ విభాగాలలో దాదాపు 5 శాతం ఉద్యోగాలకు ఉద్వాసన పలకనుంది. ప్రైమ్ వీడియో, మ్యూజిక్ సహా కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగాలను ఇది ప్రభావితం చేయనుందని డెడ్లైన్ రిపోర్ట్ చేసింది. ప్రభావిత ఉద్యోగులకు 60 రోజుల వ్యవధిలో వారి రెగ్యులర్ జీతం, ప్రయోజనాలను అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అలాగే తొలగించిన ఉద్యోగులు విభజన ప్యాకేజీలు, పరివర్తన ప్రయోజనాలు, ఉద్యోగ నియామకంలో సహాయం కోసం అర్హులు. Amazon Studios, Amazon Prime వీడియో, Amazon Music వర్టికల్స్కి సంబంధించిన కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో అమెజాన్ ఇటీవల ఉద్యోగాల కోతలను ప్రకటించింది. కాగా టెక్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం కారణంగా వేలాదిమందిని ఉద్యోగులనుంచి తొలగించాయి. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అమెజాన్ 2022 నవంబర్- జనవరి 2023 మధ్యకాలంలో 18వేలమందిని తొలగించింది. క్లౌడ్ కంప్యూటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, అడ్వర్టైజింగ్ చ ట్విచ్ లైవ్ స్ట్రీమింగ్ సర్వీసెస్వంటి రంగాలపై దృష్టి సారించి, అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ వీడియో, గ్రాసరీ విభాగాల్లో మరికొంతమందిని తీసివేసింది. 2023 మార్చిలో 9వేల మందిని తొలగించింది. దాదాపు 27 వేల మందిని తొలగించడం కష్టమైనదే అయినప్పటికీ కంపెనీ మంచి ఫలితాన్నిస్తుందని అమెజాన్ సీఈవోఆండీ జాస్సీ కంపెనీ వార్షిక సర్యసభ్య సమావేశంలోప్రకటించిన సంగతి తెలిసిందే. -
సప్త స్వరాలు ఎక్కడ పుట్టాయంటే..?
సరస్వతీ దేవి వీణ పట్టుకుని పరమశివుని వైభవాన్ని గానం చేస్తుంటే... అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ, తల ఊపుతూ చిరునవ్వుతో వింటూ ఉంటుందట. ప్రవచనం వినేటప్పుడు కదలకుండా కూర్చుని వినాలి, సంగీతం వినేటప్పుడు తల కదుపుతూ మన అంగీకారాన్ని, సంతోషాన్ని ప్రకటించడం సభామర్యాద. సరిగమపదనీరతాం శాంతం మృదుల స్వాంతం... అన్నాడు కాళిదాస మహాకవి. ఉద్వేగంతో ఉండాల్సిన మహాశక్తి అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నది అంటే... ఆమె సంగీతంలో అంతగా రమిస్తున్నదట. అసలు ఆ సంగీతంలో రమించే మనసు ఎవరికుంటుందో, దానిలో తడిసిముద్దయిపోయే మనసు ఎవరికుంటుందో వారు పరమ కోమలమైన మనసు కలిగి ఉంటారు. మృదువైన మనసు అంటే.. అవతలివారి కష్టం తమ కష్టం అన్నంత బాధపడిపోతూ, దానిని తీర్చడానికి వారు ముందుకు పరిగెడతారు. ఆ దయ, ఆ కరుణ, ఆ ప్రశాంత స్థితి పొందినప్పుడు తమపట్ల కృతఘ్నులై ఉన్నా పట్టించుకోరు. అమ్మవారే కాదు, అయ్యవారిదీ అదే పరిస్థితి. ‘నాదతనుమనిశం శంకరం’ అని త్యాగరాజ స్వామి ఒక కీర్తన చేశారు. నిజానికి శంకరుడి శరీరం నాదమే. ‘సద్యోజాతాది పంచ వక్త్రజ సరిగమపదని వర సప్తస్వరవిద్యాలోలం...’’ లౌల్యం అట ఆయనకు .. ఏ సంగీతం మీద... అంటే... అసలు శంకరుడివే ఐదు ముఖాలు. సద్యోజాత, అఘోర, సత్పురుష, వామదేవ, ఈశానములు. సద్యోజాతం పశ్చిమాన్ని చూస్తుంది. అందుకే శివాలయాల్లో... పశ్చిమ ముఖంగా ఉండే శివాలయం గొప్పదంటారు. అఘోర ముఖం– దక్షిణం. సత్పురుష ముఖం – తూర్పు. వామదేవ ముఖం – ఉత్తరం. ఈశాన ముఖం –ఊర్థ్వ ముఖం. ఇవి ఐదు.. ఐదు శక్తులను కలిగి ఉంటాయి. అందుకే శివుడికి ఎటువైపు అభిషేకం చేసినా ఆయనకు అందుతుంది. ఆ ముఖాలతో ఆయన సరిగమలనబడే వాటియందు ఎప్పుడూ రమిస్తుంటాడు. లౌల్యం అంటే... ఇక ఇప్పటికి చాల్లేండి... అన్న మాట అనకుండా ఎంత అనుభవించినా, ఎంత చేసినా ఇంకా చేయాలనిపిస్తే లౌల్యం అంటారు. అసలు ఆ స్వరాలు ఎక్కడ పుట్టాయంటే... అవి ఆయన ఐదు ముఖాల్లోంచే పుట్టాయి. సప్త స్వరాలు ఏడయినప్పుడు ముఖాలు ఐదే కదా... అన్నప్పుడు... వీటిలో షడ్జం, పంచమం.. స, ప స్వరాలు. వీటిని ప్రకృతి స్వరాలంటారు. పరమశివుడు ఎంత సనాతనుడో, ఎంత స్వయం భూనో, ఆయనకు ఆద్యంతాలు ఎలా లేవో అలా సంగీతంలో ఈ రెండు ప్రకృతి స్వరాలూ ఆద్యంతాలు లేకుండా ఈశ్వరుడంతటి నిత్యములు, సనాతనాలై ఉన్నాయి. మిగిలినవి వికృతి స్వరాలు. అవి మిగిలిన ఐదు ముఖాల్లో నుంచి వచ్చాయి. అంటే సంగీతం ఎంత శక్తిమంతమో, భారతీయ సంగీతంలో సప్త స్వరాలు అంతే శక్తిమంతమూ, సనాతనమై, నిత్యనూతనమై వెలుగుతున్నాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు (చదవండి: అసలు... కొసరు) -
అట్లాంటా తెలుగు ఐడల్ 2023
-
తెలుగింటి సంస్కృతి మ్యూజిక్ వీడియోకి అద్భుత స్పందన
-
మేము ఎప్పుడు తండ్రిలా చూడలేదు.. ఆయన ఎప్పుడూ మాకు గురువు
-
ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ప్రముఖ సింగర్ కూతురు..
ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా? తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియకపోయినా బీటౌన్ ప్రేక్షకులకు మాత్రం ఈమె సుపరిచితమే. సడెన్గా చూస్తే.. ఈమె కంగనా రనౌత్, రాధికా ఆప్టేల పోలికలతో ఉన్నట్లు కనిపిస్తుంది. మరో యాంగిల్లో చూస్తుంటే.. హ్యాపీడేస్ ఫేమ్ స్రవంతి లాగానూ అనిపిస్తుంది. తన టాలెంట్ కన్నా గ్లామర్ ట్రీట్తో జనాలకు బాగా పరిచయమున్న ఈ బ్యూటీ పేరు అంజలి శివరామన్. తన యూనిక్ స్టైల్తో నటిగా మంచి పేరు తెచ్చుకున్న అంజలి శివరామన్ చక్కని గాయని కూడా. ‘నా నటనకు గానం అనేది ఎంతో ఉపయోగపడింది. క్రమశిక్షణతో ఉండడానికి కారణం అయింది. నన్ను నేను వ్యక్తీకరించుకునే సాధనం అయింది’ అంటుంది అంజలి. సింగర్ చిత్ర అయ్యర్ కూతురైన అంజలికి చిన్నప్పటి నుంచే స్వరాలతో స్నేహం ఏర్పడింది. స్కూల్ ఫంక్షన్ల నుంచి ఫ్యామిలీ ఫంక్షన్ల వరకు అంజలి పాట వినిపించాల్సిందే. పాటలు అంటే ఇష్టం ఉన్నప్పటికీ మ్యూజిక్ క్లాస్కు తరచుగా బంక్ కొట్టేది. ఆ తరువాత మాత్రం సంగీత శిక్షణ ప్రాముఖ్యత తెలుసుకొని ప్రతిరోజూ క్లాస్కు తప్పకుండా హాజరయ్యేది. ‘సంగీతం నా రక్తంలోనే ఉంది’ అంటుంది అంజలి, అంజలి నోట పాట విన్న వారు...‘అమేజింగ్ వాయిస్’ అనకుండా ఉండలేరు. ‘జాజ్ బ్లూస్ తన స్టైల్ ఆఫ్ మ్యూజిక్’గా చెబుతుంది అంజలి. View this post on Instagram A post shared by 𑁍 𝔸 ℕ 𝕁 𝔸 𝕃 𝕀 𑁍 (@anjalisivaraman) ముంబైలోని ఒక మ్యూజిక్ స్టూడియోలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న అంజలి యాదృచ్ఛికంగా నటనరంగంలోకి వచ్చింది. మోడలింగ్, టీవీ కమర్షియల్స్ ద్వారా గుర్తింపు పొందిన అంజలి క్రైమ్ డ్రామా థ్రిల్లర్ ‘క్లాస్’లో లీడ్రోల్ పోషించింది. సుహాని అహుజా పాత్రతో మంచి మార్కులు కొట్టేసింది. View this post on Instagram A post shared by 𑁍 𝔸 ℕ 𝕁 𝔸 𝕃 𝕀 𑁍 (@anjalisivaraman) -
స్ట్రీమింగ్ మ్యూజిక్ హవా! మ్యూజీషియన్లుగా యువత
స్ట్రీమింగ్ సర్వీస్ల ద్వారా మ్యూజిక్ వినడానికి ఇష్టపడుతున్న యువతరం అవే సర్వీసుల ద్వారా సంగీతంపై అవగాహన ఏర్పర్చుకుంటోంది. ఆ అవగాహనతో యువ సంగీత ప్రేమికులు, శ్రోతలు స్పాటిఫై, యాపిల్ మ్యూజిక్, ఆడియో మ్యాక్... మొదలైన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా మ్యూజిషియన్లుగా మారుతున్నారు... శ్రోతలు సంగీతం వినే విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా మార్పు వచ్చింది. ఇంటర్నెట్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది ఫోనోగ్రాఫిక్ ఇండస్ట్రీ(ఐఎఫ్పీఐ) చేసిన సర్వేలో 78 శాతం మంది స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా మ్యూజిక్ను వింటున్నట్లు తెలిసింది. అందులో యువతరం ఎక్కువ. అయితే యువతరంలో కొంతమంది సంగీతాన్ని విని ఎంజాయ్ చేయడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. తమను ప్రపంచానికి పరిచయం చేసుకునే వేదికలుగా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించుకుంటున్నారు. ‘మన్ మేరీ జాన్’ పాటతో అపర్ణ కుమార్ చందెల్ అలియాస్ కింగ్ ‘టాప్ 50 చార్ట్స్’లో మొదటి స్థానంలో నిలిచి వైరల్ సెన్సేషన్ అయ్యాడు. నాన్–ఫిల్మ్ ఇండియన్ మ్యూజిక్ ఆ స్థాయిలో ప్రాచుర్యం పొందడం అరుదు. అపర్ణ కుమార్ ఇప్పుడు ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ స్పాటిఫై మోస్ట్ పాపులర్ ఆర్టిస్ట్లలో ఒకరు. కొన్ని సంవత్సరాల క్రితం శ్రోతగా స్పాటిఫైకి దగ్గరయ్యాడు అపర్ణ కుమార్. కొత్త ఆర్టిస్ట్ల గురించి తెలుసుకోవడంలో, వారి నుంచి స్ఫూర్తి పొందడంలో అపర్ణ కుమార్కు ఉపయోగపడిన ప్లాట్ఫామ్లలో స్పాటిఫై ఒకటి. మూడు సంవత్సరాల క్రితం ఈ ర్యాపర్ తన తొలి ఆల్బమ్ ‘కార్నివాల్’తో క్రియేటర్గా మారాడు. అతడి ‘తు ఆకే దేఖ్లే’ పాట వైరల్గా మారింది. ‘స్పాటిఫై ద్వారా శ్రోతలు ఎలాంటి పాటలు వినడానికి ఇష్టపడుతున్నారో సులభంగా అవగాహన చేసుకోవచ్చు’ అంటున్నాడు అపర్ణ కుమార్. కుమార్కు మాత్రమే కాదు ఎంతోమంది యంగ్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్లకు స్పాటిఫైలాంటి ప్లాట్ఫామ్ల క్రియేటర్–సెంట్రిక్ అప్రోచ్ వరంలా మారింది. పెద్ద ప్రాజెక్ట్లు వచ్చేలా చేయడంలో, మ్యూజిక్ను కెరీర్ ఆప్షన్గా మలుచుకోవడంలో, ప్రపంచానికి వారి ప్రతిభను పరిచయం చేయడంలో స్పాటిఫైలాంటి ప్లాట్ఫామ్లు యూత్కు ఉపయోగపడుతున్నాయి. ‘ఒకప్పుడు యంగ్ ఆర్టిస్ట్లు తమ గురించి తాము తెలుసుకోలేకపోయేవారు. తమ సంగీతాన్ని వినడానికి ఎవరు ఇష్టపడుతున్నారు? ఎలాంటి సంగీతం చేయాలి? అనే విషయంలో స్పష్టత ఉండేది కాదు. ఈ పరిస్థితిలో మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు మార్పు తీసుకువచ్చాయి. స్పాటిఫై ఫర్ ఆర్టిస్ట్ యాప్ ద్వారా తమకు ఎలాంటి మ్యూజిక్ ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు... అనేది అర్థం చేసుకోవడానికి వీలవుతుంది’ అంటుంది చెన్నైకి చెందిన సంగీత ప్రేమికురాలు నిధి. ‘మ్యూజిక్ ఇండస్త్రీలో చాలా మార్పులు వచ్చాయి. బడ్డింగ్ మ్యూజిషియన్లు తమ టాలెంట్ను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇప్పుడు ఎన్నో సోషల్ మీడియా అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఒకరు పాపులర్ కావడానికి సినిమా మాధ్యమమే ఏకైకమార్గం అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ హవా నడుస్తోంది. ఔత్సాహికులు తమ మ్యూజిక్ టాలెంట్ను పరిచయం చేసుకోవడానికి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లాంటి ఎన్నో వేదికలు ఉన్నాయి’ అంటున్నాడు ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ సలీమ్ మర్చెంట్. మ్యూజిక్ కంపోజర్గా మంచి పేరు తెచ్చుకుంది కోల్కత్తాకు చెందిన అలోక దాస్గుప్తా. చిన్న వయసు నుంచే మ్యూజిక్ కంపోజ్ చేసేది. అయితే తాను కంపోజ్ చేసింది ఎవరికైనా వినిపించాలంటే భయంగా ఉండేది. కెనడా యార్క్ యూనివర్శిటీలో మ్యూజిక్ పెరఫార్మెన్స్ అండ్ కంపోజిషన్లో డిగ్రీ చేసినా తనమీద తనకు నమ్మకం కలగడానికి ఆలోక దాస్గుప్తాకు కొంత సమయం పట్టింది. ‘స్పాటిఫై లాంటి ప్లాట్ఫామ్స్ యువ ఆర్టిస్ట్లకు గట్టి ధైర్యాన్ని ఇస్తున్నాయి’ అంటుంది అలోకదాస్ గుప్తా. ముంబైకి చెందిన సౌమ్య శ్రీరాగకు లీడింగ్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్పై మంచి అవగాహన ఉంది. భవిష్యత్లో మ్యూజిషియన్గా రాణించాలనేది ఆమె కల. ‘నా ప్రయత్నంలో విజయం సాధిస్తానా? లేదా? అనేది తెలియదుకాని గట్టి ప్రయత్నమైతే చేయాలనుకుంటున్నాను’ అంటున్న శ్రీరాగకు ప్లే బ్యాక్ సింగర్ నికిత గాంధీ ఇచ్చిన సలహా ‘ఏదో ఒకటి రాస్తూనో, కంపోజ్ చేస్తూనో ఉండాలి. అవి బాగున్నాయా? లేదా– అనేది రెండో విషయం. ముందు మన సంతోషం కోసం చేస్తే చాలు’. సంగీతాన్ని వినే అవకాశమే కాదు విశ్లేషించే అవకాశం కూడా ఇస్తున్నాయి కొన్ని ప్లాట్ఫామ్స్. మ్యూజిక్ స్ట్రీమింగ్ అండ్ డిస్కవరీ ప్లాట్ఫామ్ ‘ఆడియోమ్యాక్’ సబ్స్రైబర్లకు తమ ఫేవరెట్ ఆర్టిస్ట్ల ఆల్బమ్లను విశ్లేషించే అవకాశం ఇచ్చింది. శ్రోతలకు నచ్చేలా, మెచ్చేలా మ్యూజిక్ ఇండస్ట్రీ వ్యూహాల మాట ఎలా ఉన్నా... ప్రతి అవకాశాన్ని, ప్రతి ఫీచర్ని తమలోని సంగీత ప్రతిభను మెరుగు పెట్టుకోవడానికి యువతరం ఉపయోగించుకుంటుంది. వివిధ మాధ్యమాల ద్వారా ట్రెండ్స్ను ఫాలో కావడమే కాదు క్రియేట్ చేస్తుంది యువతరం. యంగర్ జనరేషన్ ఏం వింటుంది, దేనికి కనెక్ట్ అవుతుంది అనేదానిపై మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఫిల్మ్ మ్యూజిక్ మాత్రమే కాదు ఇండిపెండెంట్ మ్యూజిక్ వినడానికి కూడా శ్రోతలు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ మ్యూజిక్తో వివిధ మాధ్యమాల ద్వారా తమను తాము నిరూపించుకునే అవకాశం యువ కళాకారులకు ఉంది. – అసీస్ కౌర్, ఫేమస్ స్పాటిఫై సింగర్ఇండిపెండెంట్ మ్యూజిక్ (చదవండి: పాటే కథలా!.. సరికొత్త మ్యూజిక్ తరాన!) -
శాంతం–సంగీతం
వాగ్గేయకారులైన వారు రచించిన గీతాలు మహాకవులయిన ఇతరులు రచించిన పద్యాల సందర్భాల్లాగే ఉంటాయి. శివలింగం అంటే శివుడితో మాట్లాడుతున్నట్లే, ఇది విగ్రహం కాదు రాముడే, ఇది శిల కాదు.. అక్కడ ఉన్నది కామాక్షియే, అది మూర్తి కాదు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే.. అని పరవశాన్ని పొంది లోపలి భావాలను గీతాలుగా స్వరయుక్తంగా ప్రవహింపచేశారు. అవి అజరామరమై ఎన్ని శతాబ్దాలు గడిచినా రామాయణ, భారత, భాగవతాల్లాగే ఉండిపోతున్నాయి. వారికి అనేక శాస్త్రాల్లో నిష్ఠ ఉండేది. త్యాగరాజ స్వామివారి ‘‘మా జానకిచేతపట్టగ..’ కీర్తననే చూడండి.రామాయణాన్ని భవిష్యపురాణంతో కలిపారు. రామావతారంలోంచి శ్రీవేంకటేశ్వర అవతారం లోకి వెళ్ళింది. అంటే వారికి సమస్త పురాణేతిహాసాలు, వేదవేదాంగాలు సప్తధాతువుల్లో జీర్ణమయిపోయాయి. అన్ని సంగీత పరికరాల్లోకి అత్యంత ప్రధానమైన నాదోపాసనకు సాధనమైన వీణ మీద వీరు అధికారం పొందారు. ‘‘వీణావాదనతత్త్వజ్ఞః శృతిజాతి విశారదః తాళజ్ఞప్రయాసేన మోక్షమార్గం సగచ్ఛతి’’ ఎవరయితే ఆ వీణావాద తత్త్వాన్ని, నాదోపాసన చేయగలిగిన స్థితిని పొంది ఉన్నారో, సంగీతంలో ఉన్న అన్ని శబ్దాల గురించి పరిపూర ్ణజ్ఞానాన్ని పొంది ఉన్నారో, తాళం వినగానే తాళ లక్షణాల గురించి చెప్పగలరో వారు మోక్షమార్గంలో పోతున్నారనడం నిస్సందేహం. అంటే భారతీయ సంగీతం మోక్షానికి కారణం. త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, రామదాసు, అన్నమాచార్యులూ ఆ స్థితినే పొందారు. కేవలం మనోరంజకత్వం కాదు, భగవంతునిలో ఐక్యమయిపోవడానికి దివ్యసాధనంగా మనకు ఆ సంగీతాన్ని çపవిత్రమైన వస్తువుగా, గంగాజల భాండంగా, ఆవుపాల కుండగా అందించారు. వారి సంగీతం ఎంత గొప్పగా ఉంటుందో, సాహిత్యం కూడా అంత గంభీరంగా ఉంటుంది. వీరిలో మరో విశేషం కనపడుతుంది. అది సర్వకాల సర్వావస్థల్లో పరమ ప్రశాంతంగా ఉండగలిగిన స్థితి. మనం ఎంత సాధన చేసినా, ఏ యజ్ఞయాగాదులు, జపాలు, పూజలు చేసినా ఎక్కడో ఒకచోట శాంతం తప్పుతాం. అందుకే త్యాగరాజస్వామి అంటారు...‘శాంతములేక సౌఖ్యము లేదు...’ అని. శాంతం అంటే రాగద్వేషాలు లేకుండా ఉండడం. నాకిది కావాలని కానీ, నాకు వారంటే కోపం అని కానీ, వీరంటే చికాకని కానీ ఉండదు. ఎవరిమీదా ప్రేమా ఉండదు, ద్వేషం ఉండదు. రాగద్వేషా లు లేకుండా ఎలా ..? అమ్మ ఈ రెండే పట్టుకుని ఉంటుంది.‘‘రాగ స్వరూపపాశాధ్య క్రోధాంకారేంమేశోజ్వలా..’’ నన్ను ఉపాసన చేయగా చేయగా నీకున్న రాగం అన్న పాశం తీసి భక్తి అన్న పాశం వేసి నా దగ్గరకు లాక్కుంటాను... అంటుంది. అంకుశం పెట్టి పొడిస్తే ఏనుగు ఎంత బాధ పడుతుందో తన కోపం తన శత్రువయి అంత బాధపెడుతుంది. అందువల్ల రాగద్వేషాలు లేని ప్రశాంత స్థితిని పొందాలి. సాధన చేస్తున్నప్పుడు ఈ స్థితిని కొంతవరకే పొందగలం. కానీ ఎప్పుడూ అలా ఉండడం అంత సులభం కాదు. దానిని సాధ్యం చేసేది ఒక్క సంగీతం మాత్రమే. అలా సాధ్యం చేసి చూపారు మనకు వాగ్గేయకారులు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఆటా ఆధ్వర్యంలో జరిగిన రెట్రో నేపథ్య సంగీత పార్టీ
-
ఐదేళ్ల ప్రాయం నుంచే సంగీతంలో శిక్షణ.. స్టార్ సింగర్గా గుర్తింపు
అమ్మమ్మ నోటి నుంచి భక్తి భావనతో వినిపించే కీర్తనలు, గురుద్వారాలో విన్న కీర్తనలు బనత్ నోటి నుంచి తీయగా వినిపించేవి. బనత్ కౌర్ బగ్గాకు చిన్నప్పటి నుంచే సంగీతంతో చక్కని స్నేహం ఉంది. స్కూల్ ఫంక్షన్లలో, ఫ్యామిలీ ఫంక్షన్లలో తన పాట తప్పకుండా ఉండాల్సిందే. అయిదు సంవత్సరాల వయసులోనే హార్మోనియం వాయించి శ్రోతలను అబ్బురపరిచింది. లా స్టూడెంట్గా ఉన్నప్పుడు డెబ్యూ సింగిల్ ‘మూన్’ వచ్చింది. పంజాబీ నేపథ్యం ఉన్న బనత్ హిందీ, పంజాబీ పాటలకు తనదైన మెరుపు ఇస్తుంది. సింగర్–సాంగ్ రైటర్గా పేరు తెచ్చుకున్న బనత్ కౌర్ బగ్గా పాప్ అండ్ రాక్, నియో క్లాసికల్ అండ్ ఫోక్లో మంచి పేరు తెచ్చుకుంది. తీరికవేళల్లో చక్కటి కవిత్వాన్ని ఆస్వాదించడం తనకు ఇష్టం. కొన్నిసార్లు మ్యూజిక్ కంటే కవిత్వ పంక్తులు రాసుకోవడం అంటేనే ఇష్టం. పిల్లల కోసం ముంబైలో ‘క్లాస్రూమ్’ పేరుతో మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసింది బనత్ కౌర్ బగ్గా. -
పాటలు.. నా సామి రంగ
కొత్త సినిమా కోసం మ్యూజిక్ ఆన్ చేశారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నాగార్జున హీరోగా నటించనున్న చిత్రం ‘నా సామిరంగ’. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్, విజయ్ బిన్ని ఈ మ్యూజిక్ సిట్టింగ్స్లో పాల్గొంటున్నారు. యాక్షన్ ఫిల్మ్గా తెరకెక్కనున్న ‘నా సామిరంగ’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హృదయాన్ని తాకేది... పాటే..!
శరీరం బలంగా ఉండి మనసు సంస్కారవంతంగా లేనప్పుడు అది లోకానికి ప్రమాదం. రావణుడు బలవంతుడే, కానీ సంస్కారవంతుడుకాదు.. దానితో లోకమంతా క్షోభించి పోయింది. అందువల్ల మనకు బలం అవసరమే. కానీ దానిని ఎలా ఉపయోగిస్తున్నామనే దాని మీద వ్యక్తిగత శాంతి, సమాజ శాంతి ఆధారపడి ఉంటుంది. మంచి కీర్తన విన్నారు. కీర్తనకు ఉన్న లక్షణం– అది సామవేదగానం. త్వరగా మనసుకు హత్తుకుంటుంది. దానితో మనసుని ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తుంది. దానిలోని సాహిత్యం ఆలోచనలను మధిస్తుంది. మనసుని పోషిస్తుంది. మనసు ఉద్వేగంతో, అశాంతితో ఉన్నప్పుడు అది రాక్షసత్వానికి కారణం అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉండి ఉద్వేగరహితం అయిందనుకోండి అది సత్వగుణానికి కారణమవుతుంది. ఎక్కడ సత్వగుణం ఉంటుందో అక్కడ ఉత్తమ కర్మ ఉంటుంది. ఎక్కడ అశాంతి ఉందో, ఎక్కడ ఉత్ప్రేరకం ఉందో అక్కడ ఆ వ్యక్తి ఎంత ప్రమాదకరమైన పని అయినా చేస్తాడు...అందుకే ‘‘క్రుద్ధం పాపం న కుర్యాత్కాః క్రుద్ధో హన్యాద్గురువునపి/క్రుద్ధః పరుషయా వాచా నరః సాధునాధిక్షిపేత్ ’’ అంటాడు హనుమ రామాయణంలో. క్రోధానికి గురయిన వ్యక్తిఎంతటి దుస్సాహసానికయినా పూనుకుంటాడు. వారించబోయిన పెద్దలను కూడా లెక్కచేయడు. అశాంతి ఎంత పాపాన్నయినా చేయిస్తుంది. ఆ అశాంతిని తొలగించడానికి ప్రధాన సాధనం సంగీతమే. గజాసుర సంహార వృత్తాంతంలో ఒక విచిత్రం కనబడుతుంది. గజాసురుడు కాశీపట్టణంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాడు. పరమశివుడు త్రిశూలంతో పొడిచి పైకెత్తిపెట్టాడు. త్రిశూలం అతనిలో గుణాత్మక స్థితిని కల్పించింది. గజాసురుడు ప్రాణాంతకస్థితిలో ఉండికూడా సామవేదగానం చేసాడు. ద్వంద్వాలకు అతీతుడయిన శివుడు ఆ అసురుడిలో లోపాలను పక్కనబెట్టి మార్పు వచ్చిందా లేదా అని చూసాడు. నీకేం కావాలని అడిగాడు. నా తోలు వలిచి నువ్వు కట్టుకోవాలని కోరాడు. నీవు నన్ను సంగీతంతో, సామవేద మంత్రాలతో సంతోషపెట్టావు కనుక నిన్ను అనుగ్రహించడానికి గుర్తుగా కృత్తివాసేశ్వరుడుగా ఉంటాను..అని ఆ పేర కాశీలో వెలిసాడు. సంగీతం అంత త్వరగా హృదయాన్ని తాకుతుంది. అదే గంభీరమైన విషయాలను మరో రూపంలో.. పద్యం, శ్లోకం వంటి రూపాల్లో చెబితే ఇంత త్వరగా మనసును ప్రభావితం చేస్తుందని చెప్పలేం. అందుకే వాల్మీకి రామాయణాన్ని లవకుశులకు గానంగా నేర్పాడు... అని ఉంది బాలకాండలో. అది వాద్య తంత్రులకు కట్టుబడుతుంది. మంచి సంగీతం అంటే... త్యాగబుద్ధితో, ఎటువంటి స్వప్రయోజనం ఆశించకుండా లోకానికి అందించిన వారు దానిని పాటగా అందించారు. దానిని ఎలా పాడాలో కూడా వారే నిర్ణయించేసారు. అంటే వారే స్వరపరిచారు. సాహిత్యం కూడా వారే సమకూర్చారు. అది కూడా ప్రణాళికతో కాదు. భగవంతుని గుణాలతో లోలోపల రమించి పోయి, ఆ పరవశంతో గీతంగా వారి నోటినుంచి ప్రవహించింది.. అదీ వాగ్గేయకారుల గొప్పదనం. పాట సంస్కృతికి శాశ్వతత్త్వాన్ని ఇస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Saxophonist: శాక్సాఫోన్ సుబ్బలక్ష్మి
సుబ్బలక్ష్మి ఇంటి పేరు ఎవరికీ తెలియదు. ప్రపంచమంతా ఆమెను శాక్సాఫోన్ సుబ్బలక్ష్మి అనే పిలుస్తుంది. మగవారు మాత్రమే వాయించే ఈ వాయిద్యంలో సుబ్బలక్ష్మి స్త్రీగా ఉనికి సాధించింది. పట్టుచీర, వడ్డాణం ధరించి వేదిక మీద సంప్రదాయ ఆహార్యంలో ఈ ఆధునిక వాయిద్యం మీద వెస్ట్రన్, కర్నాటక్లో అద్భుత ప్రతిభ చూపుతుంది. డైరీలో ఒకరోజు కూడా ఖాళీ ఎరగని ఈ బెంగళూరు వాద్యకారిణి సక్సెస్ స్టోరీ. 40 ఏళ్ల సుబ్బలక్ష్మి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలంటే సంవత్సరం ముందు బుక్ చేసుకోవాలి. ఆమె డైరీలో ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు. ఇవాళ చెన్నై, రేపు బెంగళూరు, ఎల్లుండి దుబాయ్... ఆమె కచ్చేరీలు సాగిపోతూ ఉంటాయి. భర్త కిరణ్ కుమార్కు ఐ.టి. రంగంలో మంచి ఉద్యోగం. కానీ ఈమె కచ్చేరీల బిజీ చూసి ఉద్యోగం మానేసి సాయంగా ఉంటున్నాడు. బెంగళూరులో నివాసం ఉండే సుబ్బలక్ష్మి సొంతింట్లో ఉండేది తక్కువ. కచ్చేరీలకు తిరిగేది ఎక్కువ. కాని ఈ విజయం అంత సులువు కాదు సుమా. ఒక్కతే శిష్యురాలు సుబ్బలక్ష్మి పూర్తిపేరు ఎం.ఎస్.సుబ్బలక్ష్మి. అవును. మహా గాత్ర విద్వాంసులు ఎం.ఎస్.సుబ్బులక్ష్మిని జ్ఞప్తికి తెచ్చే పేరు. ఆ పేరు ప్రభావమో, ఇంట్లో సంగీతం ఉండటమో సుబ్బలక్ష్మికి కూడా సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. సుబ్బలక్ష్మి తాత మైసూర్ సంస్థానంలో ఆస్థాన సంగీత విద్వాంసుడుగా ఉండేవాడు. సుబ్బలక్ష్మి తండ్రి సాయినాథ్ మంగళూరులో మృదంగ విద్వాంసుడు. అతడు అనేకమంది సంగీతకారులకు కచ్చేరీల్లో వాద్య సహకారం అందించేవాడు. ఐదో ఏట నుంచే గాత్ర సంగీతం నేర్చుకుంటున్న సుబ్బలక్ష్మి ఒకసారి తండ్రితోపాటు కచ్చేరీకి వెళ్లింది. అది శాక్సాఫోన్ విద్వాంసుడు కద్రి గోపాల్నాథ్ కచ్చేరి. అందులో గోపాల్నాథ్ అద్భుతంగా శాక్సాఫోన్ వాయిస్తుంటే సుబ్బలక్ష్మి మైమరిచిపోయింది. తాను కూడా శాక్సాఫోన్ నేర్చుకోవాలనుకుంది. అప్పుడు ఆమెకు 13 ఏళ్లు. ఆ రోజుల్లో ఆడపిల్లలు శాక్సాఫోన్ను అంతగా నేర్చుకునేవారు కాదు. గురువులు నేర్పించేవారు కూడా కాదు. అది పూర్తిగా మగవారి వాయిద్యం. కాని సుబ్బలక్ష్మి పట్టుబట్టింది. మొత్తం 16 మంది శిష్యులు ఆ సమయంలో కద్రి గోపాల్నాథ్ దగ్గర ఉంటే వారిలో ఒకే ఒక శిష్యురాలు సుబ్బలక్ష్మి. గర్భం దాల్చాక కూడా సుబ్బలక్ష్మి శాక్సాఫోన్ వాయించడంలో ఒక వరుస ఉంటుంది. ఆమె మొదట కర్నాటక సంగీతం వాయించి ఆ తర్వాత ఫ్యూజన్లోకి వస్తుంది. వెస్ట్రన్ను, కర్నాటక్ను మిళితం చేసి కచ్చేరీల్లో ఒక ఊపు తెస్తుంది. అది జనానికి నచ్చుతుంది. ఇది కూడా కొంతమంది శాక్సాఫోన్ విద్వాంసులకు నచ్చదు. ఆమెను విమర్శిస్తుంటారు. ‘నన్ను ఎన్నో విమర్శిస్తారు. కాని నేను భయపడలేదు. కచ్చేరీలు కొనసాగించాను. 7 కిలోల శాక్సాఫోన్ను రెండు గంటల పాటు పట్టుకుని కచ్చేరి చేయడం ఎంత కష్టమో ఆలోచించండి. ఆడది అలా చేయలేదు అనేవాళ్లకు సమాధానంగా నిలిచాను. నా ఊపిరితిత్తుల బలం నాకు సహకరించింది. పెళ్లయి గర్భం దాల్చాక నా శత్రువులు ఇక ఆమె కచ్చేరీలు చేయదు అనే ప్రచారం మొదలెట్టారు. డెలివరీ అయ్యాక కచ్చేరీలు సాధ్యం కాదని ఆర్గనైజర్స్ను భయపెట్టారు. దాంతో షోలు బుక్ చేసిన ఆర్గనైజర్స్ అడ్వాన్సులు వెనక్కు ఇమ్మని అడగడం మొదలెట్టారు. నేను పట్టుదలగా ఆ పుకార్లను తోసి పుచ్చాను. రేపు డెలివరీ అనగా ఇవాళ కూడా కచ్చేరీ చేశాను. నిండు గర్భవతిగా స్టేజ్ మీద శాక్సాఫోన్ వాయించింది నేనే అనుకుంటా. అలాగే డెలివరీ అయిన 15 రోజులకు మళ్లీ స్టేజ్ మీదకు వచ్చాను. ఈ రంగంలో నేనేమిటో నిరూపించుకోవాలనే నా పట్టుదలే నాకు బలాన్ని ఇచ్చింది’ అంటుంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి సోదరి లావణ్య కూడా శాక్సాఫోన్ విద్వాంసురాలిగా రాణిస్తోంది. వీరు విడివిడిగా కచ్చేరీలు చేసినా కలిసి చేసే కచ్చేరీలు కూడా వీనుల విందుగా ఉంటాయి. ఎన్నో వెక్కిరింతలు సాధనలో అబ్బాయిలు సుబ్బలక్ష్మిని అస్సలు సహించలేదు. ‘నేను శాక్సా పట్టుకుని సాధన చేస్తుంటే వాళ్లు నవ్వుతుండేవారు. కుర్చీ కిర్రుకిర్రుమన్నట్టు ఉంది అనేవారు. గురువు గారి భార్య మా అమ్మకు స్నేహితురాలు. వీళ్లు నవ్వుతుంటే ఆమె బయటికొచ్చి చూసి– వాళ్లు నవ్వనీ ఏమైనా అననీ... నువ్వు మాత్రం ట్రై చేస్తూనే ఉండు. నీకు వస్తుంది అని ఎంకరేజ్ చేసింది. ఆమె ప్రోత్సాహం వల్ల ధైర్యం తెచ్చుకున్నాను. నేను శాక్సాఫోన్ నేర్చుకోవడంలో ప్రోత్సాహం కంటే అవమానమే ఎక్కువ. కచ్చేరీల్లో కావాలని నా టైము మధ్యాహ్నం ఇచ్చేవారు. ఆ సమయంలో ఆడియెన్స్ ఉండరు. మహా అయితే పది నిమిషాలు కేటాయించేవారు. మగవారు సాయంత్రం నిండు సభలో వాయించేవారు. వారికి గంట సమయం దొరికేది. నన్ను ప్రత్యేకంగా మహిళా శాక్సాఫోనిస్ట్ అని విడిగా చూసేవారు’ అని తెలిపింది సుబ్బలక్ష్మి. -
క్షిపణుల నుంచి సంగీతం దాకా..
న్యూఢిల్లీ: ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ మహిళలు క్షిపణుల నుంచి సంగీతం వరకు వివిధ రంగాల్లో ఎంతో సాధించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహిళా శక్తిపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలోని మానెక్ షా సెంటర్లో సోమవారం జరిగిన ఆర్మీ అధికారుల భార్యల సంక్షేమ సంఘం(ఏడబ్ల్యూడబ్ల్యూఏ) సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ‘మహిళల సాధికారిత దిశగా ఏడబ్ల్యూడబ్ల్యూఏ సాగిస్తున్న ప్రయత్నాలను మెచ్చుకుంటున్నాను’అని అన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనేది పాత సామెత. కానీ, ఈ రోజు దానిని విజయం సాధించిన ప్రతి పురుషుడి పక్కన ఒక మహిళ ఉంది అని చెప్పుకోవచ్చని ముర్ము అన్నారు. ‘నారీశక్తి అందించే సేవలు సమాజానికే కాదు, యావత్తు దేశం పురోగతికి కీలకంగా మారాయి. క్షిపణుల నుంచి సంగీతం వరకు, మహిళలు అనేక అవరోధాలను ఎదుర్కొంటూ ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు’అని ఆమె అన్నారు. -
అనిరుధ్ సంగీతంపై బాలీవుడ్ కంప్లైంట్
-
మనిషి బ్రెయిన్ వేవ్స్తో..ఏకంగా "పాట"..
మనిషి తన టాలెంట్ని వెలకితీసి మరీ రకరకాలుగా సంగీతాన్ని సృష్టిస్తున్నాడు. తన గాత్రంతో లేదా తన అవయవాలతో రకరకాల విన్యాసాలు చేసి మరి సృష్టించడం చూశాం. మనిషిలోని మెదడు తరంగాల ఆధారంగా మ్యూజిక్ని సృష్టించడం గురించి విన్నారా!. ఔను తాజాగా సైంటిస్టులు ఆ కొత్త విషయాన్ని కనిపెట్టారు. కేవలం మనిషిలోని మెదడు తరంగాల ఆధారంగా సంగీతాన్ని పునర్నిర్మించారు. అందుకు అమెరికాలోని బర్కలీలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుల బృందం మూర్చ రోగులపై పరిశోధనలు జరిపారు. 1979 నాటి పింక్ ఫ్లాయిడ్ మూవీలోని క్లాసిక్ పాట "అనదర్ బ్రిక్ ఇన్ ది వాల్" పాటను మూర్చ రోగులకు వినిపించారు. ఆ సమయంలో వారి మెదడులో ఉత్ఫన్నమయ్యే సంకేతాల ను పదాలుగా అర్థమయ్యేలా ప్రసంగంగా మార్చి పునర్నిర్మించడంలో విజయవంతమయ్యారు పరిశోధకులు. తొలిసారిగా శాస్త్రవేత్తలు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లను(బీసీఐ) ఉపయోగించి సంగీతాన్ని పునః సృష్టించారు. 2009 నుంచి 2015 మధ్య న్యూయార్క్లోని అల్బానీ మెడికల్ సెంటర్లో చికిత్స పొందిన దాదాపు 29 మంది మూర్చ రోగులపై పరిశోధనలు జరిపారు. గాయకుడు వాల్టర్స్ పాడిన "అనదర్ బ్రిక్ ఇన్ ది వాల్" పాటను ఆ రోగుల ముందు ప్లే చేసేటప్పుడే వారి మెదడులకు ఎలక్ట్రోడ్లను అమర్చారు. అవి బ్రెయిన్లో సంగీతానికి స్పందించే సంకేతాలను ఎన్కోడింగ్ చేసింది. ఆ తర్వాత డేటాను అర్థ చేసుకునేందుకి రిగ్రెషన్ ఆధారిత నమునాలను ఉపయోగించారు. తద్వారా స్పెక్ట్రోగ్రామ్(పాట)ను పునః సృష్టిచగలిగారు. మెదడు సంకేతాలు ఎలా ఫ్రీక్వెన్సీలుగా మారతాయో తెలుపుతోంది ఈ ఆడియో ఫైల్. మెదడు సంగీత శ్రావ్యత, లయ, ఒత్తిడి, స్వరం, ధ్వని వంటి అంశాలన్నింటినికి మెదడు నుంచి వచ్చే తరంగాలను ఎలా అర్థవంతమైన పదాలుగా మలిచి పాటను పునర్నిర్మించొచ్చు అనేది ఈ అధ్యయనంలో వెల్లడైందన్నారు శాస్తవేత్తలు. ఇది భవిష్యత్తులో జరిగబోవు మెదడు ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సలకు సంగీతం ఉపకరిస్తుందని ఈ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయన్నారు శాస్త్రవేత్తలు. అయినా ఇప్పటికే వైద్యులు కొంతమంది రోగులకు బ్రెయిన్కి సంబంధించిన శస్త్ర చికిత్సల కోసం వారికి నచ్చిన మ్యూజిక్ని ప్లే చేసి మరి ఆపరేషన్లు చేసిన ఉందంతాలను చూశాం. (చదవండి: పూజారి కమ్ బైక్ రేసర్.. ఒకేసారి రెండు విభిన్న రంగాల్లో..) -
సముద్ర గర్భంలో సంగీత కచేరి!..ఈదుకుంటూ వచ్చి మరీ వింటారట!
ఎన్నో రకాల సంగీత కచేరీల గురించి విని ఉంటారు. నీటి అడుగును ప్రేక్షకులను అలరించేలా మ్యూజిక్ షో నిర్వహించడం గురి విని ఉన్నారా. అదికూడా సముద్రంలోనా! అసలు ఎలా ప్లే చేయగలం. వినేవాళ్లు ఎవర?... ఎవరబ్బా?.. ఇలాంటి మ్యూజిక్ షో నిర్వహించాలనుకున్నారు.. అసలు ఇది ఎక్కడ జరుగుతుంది? ఏంటీ అనే కథ కమామీషు గురించి చూద్దాం! వివరాల్లోకెళ్తే..అమెరికాలోని ఫ్లోరిడాలో అభయారణ్యానికి సుమారు 201 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లోరిడా కీస్ నేషనల్ మైరైన్ శాంక్చురీ ప్రాంతంలోని లూకీ రీఫ్లో ఈ మ్యూజిక్ షో జరుగుతుంది. దీన్ని "లోయర్ కీస్ అండర్వాటర్ మ్యూజిక్ ఫెస్టివల్" అంటారు. ప్రతి ఏడాది ఆగస్టులో నిర్వహిస్తుంటారు. ఎంతోమంది డైవింగ్ చేసుకుంటూ వచ్చి మరీ ఆ మ్యూజిక్ షాలో పాల్గొంటారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ మ్యూజిక్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు అక్కడి అధికారులు. ఆ సంగీతాన్ని వినేందుకు ఔత్సాహికులు ఈదుకుంటూ వచ్చి మరీ పాల్గొనడం విశేషం. పగడపు దిబ్బలపై పర్యావరణ ప్రభావాలను తగ్గించేలా అవగాహన కల్పించడమే ముఖ్యోద్దేశంగా ఇలా వినూత్న రీతిలో మ్యూజిక్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు ఫ్లోరిడా అధికారులు. ఆ సంగీత కచేరిలో సింగర్స్ 'వాటర్' నేపథ్య సంగీతాన్ని అలపిస్తారు. వాటర్ప్రూఫ్ స్పీకర్ల ద్వారా సంగీతం సముద్రంలోకి పైప్ చేస్తారు. అంతేకాదు పగడపు దిబ్బల రక్షణపై అవగాహన కల్పించేలా ప్రతి ఏడాది ఒక్కో థీమ్తో ఈ మ్యూజిక్ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. చూసేందుకు అవకాశం లేని ప్రజల కోసం ఈ మ్యూజిక్ని స్థానిక ఎఫ్ఎం రేడియోస్టేషన్లో కూడా ప్రసారం చేయడం విశేషం. ఈ కార్యక్రమం నాలుగు గంటల పాటు ఆహ్లాదభరితంగా జరుగుతుంది. ఈ పగడపు దిబ్బలను వారంతా సముద్రపు వర్షారణ్యాలు అని పిలుస్తారు. కాగా, ఈ ఏడాది శనివారం జరిగిన 39వ వార్షిక లోయర్ కీస్ అండర్ వాటర్ మ్యూజిక్ ఫెస్టివల్కు డజన్ల కొద్దీ డైవర్లు, స్నార్కెలర్లు హాజరయ్యారు. పర్యావరణంపై స్ప్రుహ కలిగించేలా ఇంతటి సాహసోపేతమైన కార్యక్రమాలు నిర్వహించడం గ్రేట్ కదా!. (చదవండి: అతనో రాజవంశస్తుడు..'గే' కావడంతో..ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి..) -
తాలిబాన్ దురాగతాలు: బ్యూటీ పార్లర్లు ఫినిష్.. ఇప్పుడు వాయిద్య పరికరాల వంతు!
అఫ్ఘానిస్తాన్లో తాలిబాన్ ఆంక్షలు, దురాగతాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా తాలిబన్ ప్రభుత్వ అధికారులు సంగీతం అనైతికమైనదని తీర్మానిస్తూ ప్రజల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న సంగీత పరికరాలను హెరాత్ ప్రాంతంలో దహనం చేశారు. ఈ సందర్భంగా స్థానిక అధికారి అల్-ముజ్రిమ్ మాట్లాడుతూ సంగీతాన్ని ప్రోత్సహించడం అనేది నైతిక విలువలను దెబ్బతీస్తుందని, సంగీతాన్ని వాయించేవారు తప్పుదారి పడతారని వ్యాఖ్యానించారు. 2021 ఆగస్టులో అఫ్ఘానిస్తాన్ను కబ్జా చేసుకున్న తాలిబాన్ నేతలు ఇష్టమొచ్చిన రీతిన కఠిన శాసనాలను, చట్టాలను చేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా బహిరంగంగా సంగీతం ఆలపించడంపై నిషేధం విధించారు. దీనికి ముందు బ్యూటీ పార్లర్లపై నిషేధం విధించారు. తాజాగా వేల డాలర్ల విలువైన వాయిద్య పరికరాలను స్థానిక ప్రజల నుంచి స్వాధీనం చేసుకుని వాటిని దహనం చేశారు. వీటిలో గిటార్, తబలా, డ్రమ్ తదితర వాయిద్య పరికరాలతో పాటు ఆంప్లిఫయర్, స్పీకర్ మొదలైనవి కూడా ఉన్నాయి. ఇది కూడా చదవండి: రణభూమిలో యోగ సాధన: సిరియా ముఖచిత్రాన్ని మారుస్తున్న రిషికేశ్ "Music causes moral corruption and playing it will cause the youth to go astray." Afghanistan's vice ministry burns musical instruments and equipment, deeming music immoralhttps://t.co/as5hDUQ7BX pic.twitter.com/eh9xSgWhkU — AFP News Agency (@AFP) July 31, 2023 -
ఈమె ర్యాప్కి విదేశాల్లో కూడా రీసౌండ్.. తొలి సినిమాకే రెహమాన్తో
ప్యాషన్నే ప్రొఫెషన్గా మలుచుకుంటే అంతకు మించిన ఘన విజయం ఏముంటుంది?చిన్నప్పుడు సరదాగా కవిత్వం రాసిన, మన పాటలను ర్యాప్లోకి మార్చి సరదాగా పాడిన కలైవాణి నాగరాజ్ అలియాస్ లేడి కాష్ తొలి తమిళ్–ఇంగ్లీష్ ఫిమేల్ ర్యాపర్గా తనదైన గుర్తింపు సాధింంది. ఏఆర్ రెహమాన్ ఆమెకు పెట్టిన పేరు మినీ డైనమెట్. కాష్ తండ్రి ప్రొఫెషనల్ డ్యాన్సర్. తల్లికి చిత్రకళ ఆసక్తికరమైన సబ్జెక్ట్. ఇంతకు మించి కష్కు కళానేపథ్యం లేదు. ఇక సంగీతం తెలిసిన వారు ఎవరూ లేరు. కథలు చెప్పడం, కవిత్వం పోటీలలో చురుగ్గా పాల్గొనేది. రేడియోలో పాటలు వినడం ద్వారా, మ్యూజిక్ చానల్స్ చూడడం ద్వారా సంగీతంపై ఆసక్తి మొదలైంది. ‘మ్యూజికే నా కెరీర్’ అని కాష్ అన్నప్పుడు తల్లిదండ్రులు అభ్యంతరం పెట్టకపోగా చాలా ప్రోత్సహించారు. తాను విన్న పాటలను ర్యాప్ సాంగ్ స్టైల్లో పాడడం కాష్కు ఒక సరదా. కవిత్వం రాయడం మరో సరదా. అయితే ఈ సరదాలేవి వృథా పోలేదు. తన కెరీర్కు గట్టి పునాదిరాళ్లుగా ఉపయోగపడ్డాయి. భాషపై పట్టు కోసం లైబ్రరీ నుంచి ఇంగ్లీష్, తమిళ భాషల్లోని పుస్తకాలను తెచ్చుకొని చదివేది. ర్యాప్లో తనదైన టాలెంట్ చూపుతున్న కాష్కు ‘రోబో’ సినిమా సౌండ్ట్రాక్ కోసం ఏఆర్ రెహమాన్తో పనిచేసే అవకాశం వచ్చింది. ఇది తనకు మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి లాంచ్ప్యాడ్గా ఉపయోగపడింది. ‘ఆ సౌండ్ట్రాక్ అనేది నా కెరీర్లో మైలుస్టోన్ మాత్రమే కాదు ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ల్యాండ్మార్క్గా నిలింది. యూఎస్, యూకే ఐట్యూన్ చార్ట్స్లో టాప్లో నిలింది. గతంలో ఏ ఆల్బమ్ ఇలాంటి ఘనతను సాధించలేదు. ఇదొక అద్భుతమైన, ఆనందకరమైన అనుభవం. మ్యూజిక్లో ఉండే పవర్ ఏమిటో తెలిసొచ్చింది. సంగీతం బాగుంటే సరిహద్దులు చెరిగిపోతాయి. అన్ని దేశాలు ఆ సంగీతాన్ని స్వంతం చేసుకుంటాయి’ అంటుంది లేడీ కాష్. -
రోడ్డుపై సావధానంగా వెళ్లండి.. చక్కని సంగీతం వినండి.. వీడియో వైరల్
ట్విట్టర్లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో హంగరీలోని ఒక మ్యూజికల్ రోడ్డు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ రోడ్డుపై తగిన స్పీడుతో వెళుతున్నప్పుడు ఈ సంగీత మాధుర్యం వినిపిస్తుంది. హంగరీ టుడే తెలిపిన వివరాల ప్రకారం ఈ రోడ్డును రోడ్డు నంబర్ 37 అని అంటారు. ఈ రోడ్డు హంగరీలోని ఈశాన్య ప్రాంతంలో ఉంది. ఈ రహదారి స్లోవాకియా సరిహద్దులలోని ఫెస్లోజసోల్కా మీదుగా సటోరల్జౌజెలీ వరకూ సాగుతుంది. ఔట్లెట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ రోడ్డుపై వాహనం సావధానంగా వెళ్లినప్పుడు ఎరిక్ ఎ స్జొలో అనే జానపద గీతం వినిపిస్తుంది. హంగరీకి చెందిన సోమోగీ కౌంటీలో రెండేళ్ల క్రితం ఈ రోడ్డును నిర్మించారు. అప్పటి నుంచి ఈ రోడ్డు వార్తల్లో ఉంది. ఈ రోడ్డుకు సంబంధించిన వీడియో తరచూ వైరల్ అవుతోంది. ఈ రోడ్డుకు సంబంధించిన వీడియోకు 15 మిలియన్లకుపైగా వ్యూస్ రాగా, 1.5 లక్షల లైక్స్ దక్కాయి. ఈ రహదారిలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఈ రోడ్డు నిర్మాణంలో ప్రత్యేక అమరిక ఉంది. ఈ రోడ్డుపై వెళ్లే వాహనాల టైర్లకు.. రోడ్డుకు మధ్య రాపిడి జరిగినప్పుడు శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. ఒకవేళ డ్రైవర్ వాహనాన్ని వేగంగా పోనిస్తే వికృతమైన శబ్ధాలు వినిపిస్తాయి. మరికొన్ని దేశాలు కూడా ఇటువంటి ప్రయోగాన్ని చేశాయి. మొదట 1995లో డెన్మార్క్లోని గైలింగ్లో రెండు కిలోమీటర్ల మేర ఇటువంటి రోడ్డు నిర్మించారు. రోడ్డుపై ఉబ్బెత్తు ఫుట్పాత్ మార్కర్స్ సాయంతో దీనిని నిర్మించారు. ఫ్రాన్స్లో 2000లో విలోపింట్ నగరంలో ఇటువంటి రోడ్డు నిర్మించారు. అయితే 2006లో పలువురు డ్రైవర్లు రోడ్డుపై వచ్చే ఈ సౌండ్ తమ ఏక్రాగ్రతను దెబ్బతీస్తున్నదని ఆరోపించారు. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడికి అతి పెద్ద కష్టం Hungary’s musical road will sing to drivers going the right speed pic.twitter.com/AdI9efp88z — Historic Vids (@historyinmemes) July 24, 2023 -
మా స్నేహం చాలా గొప్పది..
-
సంగీతం..సంస్కారానికి ఆవిష్కారం
సంగీతం మనసును, మెదడును ఒకేసారి కదిలిస్తుంది. సంగీతంవల్ల మనసులో మెదడు, మెదడులో మనసు ఒకేసారి మెదులుతూ ఉంటాయి. మనిషిలోంచి మనిషిని బయటకులాగి తనలోకి తీసుకుంటుంది సంగీతం. జీవనావసరాలకు అతీతంగా మనిషిని మనిషిని చేస్తుంది సంగీతం. ‘భూమి సారం నీరు, నీటి సారం మొక్క , మొక్క సారం మనిషి , మనిషి సారం మాట, మాట సారం సంకీర్తన లేదా సంగీతం‘ అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. సంగీతం అన్నిటికన్నా గొప్పది అని ఉపనిషత్ కాలం నుంచీ నేలపై నెలకొన్న సత్యం. మనిషికన్నా సంగీతం గొప్పది కాబట్టే మనిషికి సంగీతం మేలు చెయ్యగలిగేది అయింది. ‘ఆశతో బతికే వ్యక్తి సంగీతంతో నాట్యం చేస్తాడు’ అని ఒక ఇంగ్లిష్ సామెత తెలియజెబుతోంది‘. ‘తనలో సంగీతం లేని వ్యక్తి, మధురమైన శబ్దాలతో కలిసిపోని వ్యక్తి అననురాగానికి, కపటోపాయానికి, దోపిడికి తగిన వాడు అవుతాడు‘ అని ఇంగ్లిష్ కవి షేక్స్పియర్ ఒకచోట చెబుతాడు. అన్నింటికన్నా సంగీతం మనిషికి ఉన్నతమైన తోడు. సంగీతాన్ని వింటున్నప్పుడు మనల్ని మనం ఒకసారి చూసుకుంటే మనకు మనం కనిపించం! ఇంతకన్నా మనకు జరిగే మంచి మరొకటి ఉంటుందా? సంగీతం వింటున్నంత సేపూ మనం మెరుగైన స్థితిలో ఉంటాం. మన నుంచి మనం కోలుకోవడానికి సంగీతం కావాలి. సంగీతం మనల్ని ఎప్పుడూ మోసం చెయ్యదు! బంధువులవల్లా, స్నేహితుల వల్లా, సమాజంవల్లా మనం మోసపోతూ ఉంటాం. కానీ సంగీతంవల్ల మనం మోసపోవడం లేదు. కొన్ని రచనలు మనల్ని పాడుచెయ్యచ్చు. కొన్ని వాక్యాలు మనల్ని తప్పుడు దారి పట్టించచ్చు. కానీ సంగీతం మనల్ని పాడుచెయ్యదు. సంగీతం మనల్ని తప్పుడువాళ్లను చెయ్యదు. కొన్ని సందర్భాల్లో సాహిత్యం కొందరికి చెడుపు చేసింది. కానీ సంగీతం ఎప్పుడూ ఎవరికీ ఏ చెడుపూ చెయ్యదు. సంగీతం సలహాలు ఇవ్వదు. సంగీతం సూచనలు చెయ్యదు. సలహాలు, సూచనలు లేకుండా సంగీతం మనతో చెలిమి చేస్తుంది. సంగీతం మనదైపోతుంది. సంగీతాన్ని వింటున్నప్పుడు మైమరిచిపోయి తనకు తెలియకుండా మనిషి నిజంగా బతుకుతాడు. సంగీతం వల్ల మనిషి బుద్ధికి అతీతంగా సిద్ధుడు అవుతాడు. మనుగడలో భాగంగా మనం మనల్ని కోల్పోతూ ఉంటాం. సంగీతం వింటూ ఉండడంవల్ల మనల్ని మనం మళ్లీ మళ్లీ పొందచ్చు. వయసు రీత్యా ఎదిగాక పసితనం పోయిందని మరణించేంత వరకూ మనం మాటిమాటికీ బాధపడుతూ ఉంటాం. సంగీతాన్ని వింటున్నప్పుడు తెలివి, ప్రతిభ, పాండిత్యాలు లేని స్థితిలోకి వెళ్లిపోయి మనం మనంగా కాకుండా పసితనంతో ఉంటాం. ప్రతిమనిషికీ తెలుసు తాను కొంత మేరకు దుర్మార్గుణ్ణే అని. సంగీతాన్ని వింటున్నంతసేపూ తననుంచీ, తన మార్గం నుంచీ మనిషి బయటకు వచ్చేస్తాడు కాబట్టి సంగీతం కాసేపైనా మనిషిని మంచిలో ఉంచుతుంది. సంగీతం విన్నంతసేపూ అనడమో, ఏదో చెయ్యడమో ఉండవు కాబట్టి మనవల్ల అవకతవకలు, అన్యాయం, అకృత్యాలు జరగవు. శబ్దానికి సంస్కారం సంప్రాప్తిస్తే సంగీతం అవుతుంది. సంగీతం ఒక సంస్కారానికి ఆవిష్కారం. మనకూ, మన జీవనాలకూ కూడా సంస్కారం ఉండాలి. వీలైనంతగా సంగీతానికి చేరువ అవుదాం. సంగీతంలో మైమరిచిపోతూ ఉందాం. సంగీతంలో మైమరచిపోతూ ఉండడం మనం మళ్లీ, మళ్లీ పుడుతూ ఉండడం అవుతుంది. రండి, సంగీతం వల్ల మనం మళ్లీ మళ్లీ పుడుతూ ఉందాం. అద్భుతమైన అభివ్యక్తి సంగీతం; ఆస్వాదించాల్సిన ఆనందం సంగీతం. కృష్ణుడు తన పిల్లనగ్రోవి సంగీతంలో తాను ఆనందం పొందుతూ తన్మయుడు అవుతూ ఉండేవాడు. సంగీతం కృష్ణతత్త్వంలో ఒక అంశం. కృష్ణుణ్ణి సంపూర్ణ అవతారంగా చెబుతారు. ఆ సంపూర్ణ అవతారంలో సంగీతం ఒక అంశం. అంటే సంపూర్ణత్వానికి సంగీతం ముఖ్యం అని గ్రహించాలి. – రోచిష్మాన్ -
సేవ చేసేందుకే సంగీత నిలయం
వేములవాడ: ప్రజలకు సేవల చేసేందుకే వేములవాడలో సంగీత నిలయాన్ని కట్టుకున్నానని ఎమ్మెల్యే రమేశ్బాబు పేర్కొన్నారు. స్థానిక సంగీత నిలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. 60 ఏళ్ల తన తండ్రి రాజకీయ వారసత్వం నుంచి ఎన్నో అంశాలు నేర్చుకునే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. వేములవాడ తనకు తల్లి లాంటిదని, తుదిశ్వాస వరకు అభివృద్ధి కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో సిట్టింగ్లకే సీట్లు అని సీఎం కేసీఆర్ ప్రకటించారని, సీట్లు రాని ఎమ్మెల్యేలను స్వయంగా పిలి పించుకుని మాట్లాడారని, తనను మాత్రం పిలవలేదన్నారు. పార్టీ ఆదేశాల మేరకే నియోజకవర్గంలో ఏడు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల ద్వారా వందల కోట్లు సంపాదించిన వారు ఏదేదో పేరుతో వస్తున్నారనీ, పేదవాడికి మెరుగైన వైద్యం అందించేందుకే వేములవాడలో వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించామని స్పష్టం చేశారు. గుడి చెరువులోకి 365 రోజులు గోదావరి జలాలతో నింపుతామనీ, మూలవాగును మల్కపేట రిజర్వాయర్తో జీవనదిలా మార్చుతామన్నారు. భారత రాష్ట్ర సమితి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రూ.100 కోట్ల పనులను ప్రారంభించుకుందామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, పార్టీ అధ్యక్షుడు పుల్కం రాజు, గోస్కుల రవి, కౌన్సిలర్లు మారం కుమార్, జోగిని శంకర్, సిరిగిరి చందర్, యాచమనేని శ్రీనివాస్రావు, నరాల శేఖర్, ఇప్పపూల అజయ్, కో–ఆప్షన్ సభ్యుడు కట్కూరి శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఏశ తిరుపతి పాల్గొన్నారు. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం వేములవాడఅర్బన్: తిప్పాపూర్లోని తెలంగాణచౌక్ వద్ద ఎమ్మెల్యే రమేశ్బాబు ఆధ్వర్యంలో వికలాంగులు సీఎం కేసీఆర్ చిత్రాపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ దేశంలోనే సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని పుట్టినిల్లుగా చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. వికలాంగుల ఇబ్బందులు తెలుసుకుని రూ.3016 ఉన్న ఫించన్ను మరో రూ.4,016 చేశారన్నారు. కౌన్సిలర్లు శ్రీనివాసరావు, అజయ్, జోగిని శంకర్, టేలర్ శ్రీనివాస్ ఉన్నారు. -
ఈ గిటార్ చాలా స్మార్ట్ గురూ..!.. ధర ఎంతంటే?
ఫొటోలో కనిపిస్తున్న గిటార్ సాదాసీదా గిటార్ కాదు. ఇది చాలా స్మార్ట్ గిటార్. చైనాకు చెందిన బహుళజాతి సంస్థ ‘ఎన్యా ఇంటర్నేషనల్’ ఇటీవల ఈ ఆల్ ఇన్ వన్ స్మార్ట్ గిటార్ను మార్కెట్లోకి తెచ్చింది. బిల్టిన్ ప్రీయాంప్, 50 వాట్ల బ్లూటూత్ స్పీకర్ ఈ గిటార్ ప్రత్యేకతలు. ఈ గిటార్ వాయిస్తున్నప్పుడు బ్లూటూత్ స్పీకర్ ద్వారా ఇతర సంగీత పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిని స్మార్ట్ఫోన్ యాప్కు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సోలో కచేరీలకు, గ్రూప్ బ్యాండ్ కార్యక్రమాలకు కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది నాలుగు రంగుల్లో దొరుకుతోంది. దీని ధర 900 డాలర్లు (రూ.74,007) మాత్రమే చదవండి👉 రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కేంద్రం ఆమోదిస్తే.. త్వరలో -
ప్రధాని మోదీ మనసు గెలిచిన చిన్నారి
-
స్వరరాగ మధుర తరంగాలు
‘సాధన చేయుమురా నరుడా.... సాధ్యం కానిది లేదురా!’ అన్నది పెద్దల మాట ఇంగ్లీష్ పాట విషయంలో కూడా ఆ విలువైన మాటను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాల్లో పుట్టిన వారు, ప్రవాసభారతీయులు మాత్రమే ఇంగ్లీష్ పాటను బాగా పాడగలరా? ‘సాధన చేస్తే ఎవరైనా పాడగలరు’ అని నిరూపించింది నెక్సా మ్యూజిక్ ల్యాబ్... గోవాలో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో యువగళాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఎవరు వీరు?’ అని ఆరా తీసేలా చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాలు, భిన్నమైన సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన వారు, ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అని స్టూడియోలు, స్టేజ్ల చుట్టూ చక్కర్లు కొట్టిన గాయకులు కూడా ఇందులో ఉన్నారు. అలాంటి వారు తమ టాలెంట్ను ఈ మ్యూజిక్ ఫెస్టివల్లో ప్రదర్శించే అవకాశం రావడానికి ప్రధాన కారణం నెక్సా మ్యూజిక్ ల్యాబ్. నేషనల్వైడ్ టాలెంట్ డిస్కవరీ ప్లాట్ఫామ్ ‘నెక్సా మ్యూజిక్ ల్యాబ్’ మారుమూల ప్రాంతాల నుంచి మహా పట్టణాల వరకు మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకువచ్చి అంతర్జాతీయ స్థాయిలో మెరిపిస్తోంది. ఈ పోటీలో పాల్గొనదలచినవారు మూడు నిమిషాల నిడివి ఉన్న ఒరిజినల్ ఇంగ్లీష్ మ్యూజిక్ కంపోజిషన్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పాప్, జాజ్, ఫ్యూజన్...మ్యూజిక్ జానర్ ఏదైనా ఫరవాలేదు. దీంతో పాటు నెక్సా మ్యూజిక్ అడిషన్లో కూడా పాల్గొనవలసి ఉంటుంది. ఎంట్రీలకు మినీమం ఏజ్ లిమిట్...పద్దెనిమిది సంవత్సరాలు. సబ్మిట్ చేసిన ఎంట్రీలు నియమ, నిబంధనలకు తగినట్లుగా లేకపోతే నెక్సా గ్యాలరీలో కనిపించవు. అయినా నిరాశ చెందనక్కర్లేదు. తప్పులు సవరించుకొని ఫ్రెష్గా పంపవచ్చు. వ్యక్తిగత స్థాయిలోనూ, మ్యూజిక్ బ్యాండ్లో ఒకరిగా కూడా పాల్గొనవచ్చు. ఏఆర్ రెహమాన్ నేతృత్వంలోని జ్యూరీ 24 మందిని ఎంపిక చేస్తుంది. వీరికి నెక్సా మ్యూజిక్ సీజన్లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ ఇరవైనాలుగు మంది నుంచి ఫైనల్గా నలుగురిని ఎంపిక చేసి, వారి చేత పాడించిన ఆల్బమ్లను అంతర్జాతీయంగా విడుదల చేస్తారు. దిల్లీకి చెందిన నిశా నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన యువ మ్యూజిక్ బ్యాండ్ ‘హీట్ సింక్’ వరకు ఎంతోమందిలో కొత్త వెలుగు తీసుకువచ్చింది నెక్సా మ్యూజిక్ ల్యాబ్. బహుముఖ ప్రతిభ నెక్సా సీజన్ 1 విజేతగా నిలిచిన దిల్లీకి చెందిన నిశా శెట్టి సింగర్, సాంగ్రైటర్, వాయిస్ ఒవర్ ఆర్టిస్ట్గా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది. చిన్నప్పటి నుంచి నాటకాలు, వాటికి సంబంధించిన వర్క్షాప్లను చూస్తూ పెరిగింది. కథక్, కూచిపూడి, హిందుస్థానీ శాస్త్రీయసంగీతం నేర్చుకుంది. చిన్న చిన్న షోలలో పాల్గొనే నిశాకు ‘నెక్సా మ్యూజిక్ ల్యాబ్’ టర్నింగ్ పాయింట్గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. ‘ఎంపికైన విజేతలలో మీరు ఒకరు’ అంటూ నిర్వాహకుల నుంచి వచ్చిన మెయిల్ నేహాకు ఎప్పుడూ గుర్తుండే తియ్యటి జ్ఞాపకం. ‘కలలు కనడం వరకు మాత్రమే పరిమితం కాకూడదు. కల సాకారం చేసుకునే శక్తి కోసం ఎక్కడెక్కడో వెదకనక్కర్లేదు. అది మన దగ్గరే ఉంది’ అంటుంది నిశా శెట్టి. -
తమన్ ట్యూన్స్ ప్రిన్స్ కు నచ్చడం లేదా?
-
యంగ్ టాలెంట్
థాయ్లాండ్లో పుట్టిన వర్షిత పదమూడేళ్ల వయసులో తల్లిదండ్రులతో ఇండియాకు వచ్చింది. సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. చెన్నైలోని ‘కేఎం మ్యూజిక్ కన్జర్వేటరీ’లో మ్యూజిక్ కోర్సు చేసింది. ‘స్వర్ణభూమి అకాడమీ ఆఫ్ మ్యూజిక్’ నిర్వహించిన వర్క్షాప్కు హాజరైన తరువాత జాజ్ మ్యూజిక్పై ఆసక్తి మొదలైంది. వర్షిత ఫస్ట్ సింగిల్ ‘స్టే’కు మంచి స్పందన వచ్చింది. స్పాటిఫై, యూట్యూబ్, సౌండ్క్లౌడ్లో ఆమె పాటలు ఎంతో ఆదరణ పొందాయి. ఇరవై సంవత్సరాల వయసులో సెవెన్ ఐలాండ్ ఫిల్మ్ఫెస్టివల్, కోవ్లాంగ్ పా యింట్ సర్ఫ్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్లాంటి ఎన్నో ఫెస్టివల్స్లో తన గాత్రాన్ని వినిపించింది వర్షిత. ఏఆర్రెహమాన్ మ్యూజిక్ ట్రూప్లో భాగంగా దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. 22 సంవత్సరాల వర్షిత పాటలు పడడంలోనే కాదు రాయడంలో కూడా ప్రతిభ చూపుతుంది.వర్షిత ΄పాటల్లో ఎంత మాధుర్యం ఉంటుందో, మాటల్లో అంత ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. వ్యక్తిత్వ వికాస కోణంలో ఎన్నో కళాశాలల్లో స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇచ్చింది. -
25 దేశాల్లో వరల్డ్ మ్యూజిక్ టూర్.. రాజమౌళి చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్
సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ సినిమా రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా 25 దేశాల్లో వరల్డ్ మ్యూజికల్ టూర్ని మార్చి 17 నుంచి ప్రారంభిస్తున్నారామె. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ప్రపంచంలో 5 భాషల్లో 80 సినిమాలకు సంగీతం అందించిన ఏకైక మహిళా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ. తను ఎంతో సాధించినందుకు అభినందనలు’’ అన్నారు. ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ– ‘‘రాజమౌళి అన్న చేతుల మీదగా నా వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ లాంచ్ కావడం ఆనందంగా ఉంది. ఆయన దర్శకత్వం వహించిన మొట్టమొదటి టెలీ సీరియల్ ‘శాంతినివాసం’కి నేను సంగీతం అందించాను. రవి మెలోడీస్ బ్యానర్ ద్వారా ఇన్వెస్టర్ గ్రోవ్స్ సహకారంతో మిడిల్ ఈస్ట్ (ఖతార్) నుంచి మొదలయ్యే వరల్డ్ మ్యూజిక్ టూర్ 25 దేశాల్లో జరుగుతుంది. ఈ టూర్లో 25 మంది సింగర్స్ పాల్గొంటారు’’ అన్నారు. -
సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ శబ్దాలు.. ఇండియా మొత్తంలో ఆయన ఒక్కరేనా?
సినిమా అంటే సాధారణంగా అందరి దృష్టి హీరో, హీరోయిన్లపైనే ఉంటుంది. ఆ తర్వాత స్థానం డైరెక్టర్, మ్యూజిక్ ఎవరనేది తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. కానీ మీకెవరికీ కనిపించకుండా బ్యాక్ గ్రౌండ్లో కష్టపడేవారి గురించి మీకు తెలుసా? కనీసం వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి అరుదైన వారి గురించిప్రత్యేక కథనం. మీరెప్పుడైనా సౌండ్ లేకుండా సినిమా చూశారా? బాహుబలి లాంటి సినిమాలో గుర్రపు స్వారీ శబ్దాలు లేకుండా చూడగలరా? మరీ దీనికంతటికీ కారణం ఎవరు? అసలు ఆ శబ్దాలు సృష్టించేది ఎవరో మీకు తెలుసా? ఈ పనిని ఎలా నిర్వర్తిస్తారో తెలుసా? దీని వెనుక చరిత్ర ఏంటీ? అసలు ఈ పనిని ఎవరు చేస్తారు? వారు ఎలా చేస్తారో తెలుసుకుందాం. సినిమాలోని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్లో వచ్చే శబ్దాలు చేసే వారిని ఫోలీ ఆర్టిస్ట్ అంటారు. వీరు సినిమాలోని సందర్భాన్ని బట్టి శబ్దాలు సృష్టించడం వీరి పని. ఎంత పెద్ద సినిమా అయినా వీరు చేసే శబ్దాలు లేకుండా చూడడం చాలా అరుదు. ఈ ఫోలియో ఆర్ట్ అంటే మన రోజు వారి జీవితంలో ఉపయోగించే వస్తువులతో సౌండ్ ఎఫెక్ట్స్ అందించండం. ఈ పనులన్నీ ప్రీ ప్రొడక్షన్ సమయంలో చేస్తారు. కరణ్ అర్జున్ సింగ్ సినీ పరిశ్రమలోని ఫోలీ ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించారు కరణ్ అర్జున్ సింగ్. ఆయన చిన్న వయసులోనే ఫేమస్ అయ్యారు. ఆయన పలు రకాల భాషా చిత్రాలకు ఫోలీ పేరుతో సౌండ్ ఆర్ట్ను రూపొందిస్తున్నారు. బాహుబలి సినిమాతో సహా పలు ప్రముఖ చిత్రాలకు ఆయన బ్యాక్ గ్రౌండ్ శబ్దాలు ఇచ్చారు. సినీ పరిశ్రమలో రాణించాలనుకునే వారికి ఆయన ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. అర్జున్ సింగ్ మాట్లాడుతూ..' ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చేవారు ఎక్కడ లేరు. కేవలం ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోవాల్సిందే. ఫోలీ ఆర్టిస్ట్కు సౌండ్ ప్రధానం. ఇప్పటివరకు దీనిపై శిక్షణ ఇచ్చే సంస్థ లేదు. మంచి ఫోలీ ఆర్టిస్ట్ కావాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది.' అని అన్నారు. కరణ్ అర్జున్ సింగ్ ఎవరు? కరణ్ అర్జున్ సింగ్ ఒక ప్రముఖ ఫోలీ ఆర్టిస్ట్. 35 సంవత్సరాలకు పైగా బాలీవుడ్ (ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ)తో సహా పలు చిత్రాలకు పని చేస్తున్నారు. ఆయన దాదాపు 3000 కంటే ఎక్కువ చిత్రాలకు పనిచేశారు. అతను ముంబైలో అత్యంత ప్రతిభావంతులైన ఫోలీ కళాకారులు, సౌండ్ ఇంజనీర్లు, సౌండ్ ఎడిటర్లు, సౌండ్ డిజైనర్లతో జస్ట్ ఫోలీ ఆర్ట్ అనే పేరుతో సౌండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోని ప్రారంభించారు. -
అదిరేటి స్టెప్పు మేమేస్తే (ఫొటోలు)
-
దుబాయ్లో సిట్టింగ్
మహేశ్బాబు–త్రివిక్రమ్–తమన్–నాగవంశీ... ఈ నలుగురూ దుబాయ్లో ల్యాండ్ అయ్యారు. ఎందుకంటే ఈ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం. మహేశ్బాబు, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నాగవంశీ నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తయింది. త్వరలో రెండో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ గ్యాప్లో దుబాయ్లో మ్యూజిక్ సిట్టింగ్స్ ఆరంభించారు. ఓ వారం పది రోజుల పాటు పాటల పని జరుగుతుంది. అనంతరం హైదరాబాద్ చేరుకుని చిత్రీకరణ ఆరంభిస్తారు. -
వంద కోట్ల యువతకు శబ్దపోటు
వాషింగ్టన్: నిరంతరం హెడ్ఫోన్లు పెట్టుకునే సంగీతం వింటున్నారా ? ప్రతి ఫోన్కాల్, ఆడియో, వీ డియో శబ్దాలు నేరుగా కాకుండా కేవలం ఇయర్ బడ్స్ ద్వారానే వింటున్నారా ? చెవులు చిల్లులు పడే శబ్దమయ సంగీత విభావరిలకు హాజరవుతున్నారా ? అయితే వినికిడి సమస్య మిమ్మల్ని వెంటాడటం ఖాయమని ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గ్యాడ్జెట్లకు అతుక్కుపోతున్న దాదాపు 100 కోట్ల మంది టీనేజీ వయసువారికి చెముడు సమస్య పొంచి ఉందని బీఎంజే గ్లోబల్ హెల్త్ జర్నల్లో ప్రచురి తమైన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ దేశాలు తమ టీనేజర్ల కోసం అత్యవసరంగా శబ్ద సంబంధ చట్టాలకు పదునుపెట్టాలని అమెరికా లోని సౌత్ కరోలినా వైద్య విశ్వవిద్యాలయం పరిశో ధకులతో కూడిన అంతర్జాతీయ అధ్యయన బృందం సూచనలు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మంది వినికిడి సమస్యతో బాధపడుతు న్నారని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నాయ ని పరిశోధకులు గుర్తుచేశారు . ‘‘సొంత శబ్ద సాధనాలు(పర్సనల్ లిజనింగ్ డివైజెస్–పీఎల్డీ) స్మార్ట్ఫోన్, హెడ్ఫోన్, ఇయర్బడ్స్ల అతివాడకమే సమస్యకు కారణం. వాస్తవానికి వయోజనులు 80 డెసిబెల్స్, చిన్నారులు 75 డెసిబెల్స్ స్థాయిలోనే శబ్దాలు వినాలి. కానీ, పీఎల్డీ వినియోగదారులు అత్యధికంగా 105 డెసిబెల్స్ వాల్యూమ్స్లో శబ్దాలు వింటున్నారు. ఇక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో ఇది 112 డెసిబెల్స్కు చేరుతోంది. 2022 ఏడాదిలో 12–34 ఏళ్ల వయసువారిలో ఏకంగా 280 కోట్ల మంది వినికిడి సమస్యను ఎదుర్కొనే ప్రమాదముంది’’ అని అంచనావేశారు. -
స్నాప్చాట్ గుడ్ న్యూస్: వారికి నెలకు రూ. 2 లక్షలు
న్యూఢిల్లీ: కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే పాపులర్ ఫొటో మెసేజింగ్ ట్యాప్ స్నాప్చాట్ తాజాగా మరో అద్భుతమైన ఫీచర్ను ప్రకటించింది. భారతదేశంలో స్నాప్చాట్ సౌండ్స్ క్రియేటర్ ఫండ్ను ప్రారంభించినట్లు స్నాప్చాట్ మాతృ సంస్థ స్నాప్మంగళవారం ప్రకటించింది. ఇందుకు డిజిటల్ మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ డిస్ట్రోకిడ్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తద్వారా నెలకు 20 మంది బడ్డింగ్ ఆర్టిస్టులకు ఒక్కొక్కరికి 2,500 (దాదాపు రూ. 2,04,800) ప్రోత్సాహాన్ని అందించనుంది. కొత్తగా ప్రకటించిన స్నాప్ సౌండ్స్ క్రియేటర్ ఫండ్ ద్వారా దేశంలోని అభివృద్ధి చెందుతున్న కళాకారులను గుర్తించి వారికి నగదు ప్రోత్సాహకాలను అందించనుంది. నెలకు మొత్తంగా 50వేల డాలర్ల (దాదాపు రూ.41 లక్షలు) వరకు గ్రాంట్లను అందజేస్తామని కంపెనీ ప్రకటించింది. భవిష్యత్తు కళాకారులే లక్ష్యంగా ప్లాట్ఫారమ్లోని స్నాప్లు, ఇతర క్రియేషన్లకు లైసెన్స్ పొందిన సంగీతాన్ని జోడించేలా సౌండ్స్ ఫీచర్ను తీసుకొచ్చింది. నవంబర్ మధ్య నాటికి ఈ గ్రాంట్ ప్రోగ్రాం షురూ అవుతుందని అంచనా. స్నాప్చాట్ సౌండ్స్ ఫీచర్ మ్యూజిక్ వీడియోలు 2.7 బిలియన్లకు పైగా క్రియేట్ అయ్యాయని, వీటిని 183 బిలియన్లకు పైగా వీక్షించారని కంపెనీ తెలిపింది. కాగా ఈ ఏడాది ఆగస్టులో స్నాప్చాట్+సబ్స్క్రిప్షన్ ఇండియాలో లాంచ్ చేసింది. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా యూజర్లు ప్రత్యేకమైన ప్రయోగాత్మక, ప్రీ-రిలీజ్ ఫీచర్లకు ముందస్తుగానే యాక్సెస్ పొందొచ్చు. అంతేకాదు దేశంలో స్నాప్చాట్ ప్లస్ నెలవారీ సబ్స్క్రిప్షన్ను రూ.49గా నిర్ణయించగా, యూఎస్లో ప్లస్ సర్వీస్కు నెలకు 3.99 డాలర్లు ( సుమారు రూ.330) వసూలు చేస్తోంది. -
యూత్ని రాక్ చేస్తున్న మాషప్ మ్యానియా
-
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్పై కేసు నమోదు
-
‘బిట్ బోర్డ్’ ఇది మార్కెట్లోకి వస్తే.. సంగీతకారులకు పండగే!
ఎలక్ట్రానిక్ కీబోర్డులు వచ్చాక సంగీత సృజన కొంత తేలికైంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం సంగీత సృజనను మరింత సులభతరం చేస్తుంది. కాలిఫోర్నియాలో స్థిరపడిన చైనీస్ డిజైనర్ చెన్ సిన్ ఈ పరికరాన్ని ‘బిట్ బోర్డ్’ పేరుతో ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఈ అధునాతన సంగీత పరికరాన్ని రూపొందించినందుకు ఈ ఏడాది ‘రెడ్ డాట్ డిజైన్ కాన్సెప్ట్స్’ పోటీల్లో ‘బెస్ట్ ఆఫ్ ద బెస్ట్’ అవార్డును కూడా సాధించారు. ఇది ఎక్కడికైనా తీసుకువెళ్లడానికి అనువుగా ఉండటమే కాదు, ఇందులో నానా రకాల తంత్ర, తాళవాద్యాల ధ్వనులను శ్రావ్యంగా పలికించుకోవచ్చు. ఇందులోని ఆప్షన్స్ను ఉపయోగించుకుని, ఏకకాలంలోనే పలు వాద్యాల ధ్వనులనూ పలికించుకోవచ్చు. ఇందులో వాల్యూమ్ కంట్రోల్, లూపింగ్, బ్లూటూత్ ద్వారా వైర్లెస్ కనెక్టివిటీ వంటి ఆప్షన్స్ కూడా ఉండటం విశేషం. ఈ పరికరం ఇంకా మార్కెట్లోకి రావాల్సి ఉంది. ఇది అందుబాటులోకి వస్తే, సంగీతకారులకు పండగేనని చెప్పవచ్చు. చదవండి: ‘బకరాల్ని చేశాడు.. మస్క్ ట్వీట్తో మబ్బులు వీడాయ్’ -
తన మ్యూజిక్తో గోవులను ఆకర్షించేస్తున్నాడు.. వీడియో వైరల్
-
అద్భుత దృశ్యం.. ఆ గోవులన్నీ శ్రీకృష్ణుడే వచ్చాడనుకున్నాయేమో..!
పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు తన పిల్లనగ్రోవితో మంత్రముగ్ధుల్ని చేసేవాడని చెబుతారు. పిల్లనగ్రోవి వాయిస్తుంటే గోవులన్నీ ఎక్కడున్నా ఆయన చుట్టూ చేరేవి. ఆ సంఘటనను ఇప్పుడు గుర్తు చేశారు ఈ మోడ్రన్ కృష్ణుడు. సాక్సోఫోన్ వాయిస్తుంటే ఓ పొలంలో గడ్డి మేస్తున్న ఆవులన్నీ పరుగున వచ్చి ఆయన చుట్టూ చేరాయి. సంగీతానికి భాష అవసరం లేదని నిరూపించారు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఆవులు గడ్డి మేస్తున్న ప్రాంతంలో రోడ్డు పక్కన నిలుచుని సాక్సోఫోన్ వాయించాడు. ఆయన మ్యూజిక్ విన్న కొద్ది క్షణాల్లోనే దూరంగా ఉన్న ఆవులన్నీ పరుగున వచ్చి చుట్టూ చేరాయి. సుమారు 20-30 గోవులు ఉన్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ సంగీతం శక్తి ఇది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను 10 లక్షలకుపైగా మంది వీక్షించారు. దీనిపై పలువురు కామెంట్లు చేశారు. ‘ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మన భగవాన్ క్రిష్ణ చేసిన విధంగానే ఉంది. ఆయన తన పిల్లన గ్రోవితో అందరిని తనవైపు ఆకర్షించేవారు, ఆయన గోవులను సైతం’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ఇదీ చదవండి: క్రాకర్ కాల్చడం ఇంత కష్టమా.. ఎమ్మెల్యే తిప్పలు చూస్తే నవ్వు ఆగదు.. వీడియో వైరల్ -
లోకల్ ఆర్టిస్టులకు గుడ్న్యూస్: వింక్ మ్యూజిక్ రూ.100 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంగీతంలో ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహించేందుకు ఎయిర్టెల్కు చెందిన వింక్ మ్యూజిక్ రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. స్వతంత్య్ర కళాకారుల కోసం పంపిణీ విభాగంలోకి ప్రవేశించనున్నట్టు వెల్లడించింది. ‘ఔత్సాహిక సంగీత కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడమేగాక సంపాదించుకోవచ్చు. చదవండి: ఇన్స్టాలో కొత్త అవతార్, స్నాప్చాట్లో స్పెషల్ ఫీచర్లు వింక్ వేదిక ద్వారా ప్రపంచవ్యాప్తంగా 5,000 మంది ఆర్టిస్టులను ఏడాదిలో పరిచయం చేయాలని లక్ష్యంగా చేసుకున్నాం. ప్రస్తుతం 100 మంది ఉన్నారు. భారత్లో ప్రజాదరణ పొందిన పాటల్లో 30 శాతం స్వతంత్య్ర కళాకారులవే. పరిశ్రమను భవిష్యత్లో నడిపించేది వీరే. భారతీయులు వారంలో సగటున 21 గంటలు సంగీతం వింటున్నారు. ప్రపంచ సగటు 18 గంటలు ఉంది’ అని ఎయిర్టెల్ డిజిటల్ సీఈవో అదర్శ్ నాయర్ తెలిపారు. చదవండి: Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే! -
ఆసుపత్రిలో సంగీత కచేరీలు...అక్కడ రోగులకు అదే ఔషధం!
సంగీతంతో చికిత్స అందిస్తారని మనం టీవీల్లోనూ లేదా సినిమాల్లోనూ విని ఉంటాం. నిజ జీవితంలో సంగీతంతో చికిత్స చేయడం గురించి వినటం అరుదు. మానసిక వ్యాధితో బాధపడుతున్నవాళ్లకు సంగీతంతో మార్పు తీసుకరావడం వంటివి చేస్తున్నారు. గానీ ఒక హాస్పటల్ పేషంట్ల కోసం ఏకంగా సంగీత కచేరీనే ఏర్పాటు చేసి చికిత్స అందించడం అంటే ఆశ్చర్యమే కదా. వివరాల్లోకెళ్తే..ఉరుగ్వేలో కిడ్ని రోగులకు సంగీతంతో చికిత్స అందిస్తున్నారు. మాంటెవీడియోలోని డయావెరమ్ క్లినిక్ కిడ్ని పేషంట్ల కోసం బ్యాండోనియన్ ప్లేయర్లు, గాయకులు, గిటారిస్టులు చేత సంగీత కచేరిని ఏర్పాటు చేస్తోంది. ఆ సంగీత బృందం రోగులను క్లాసిక్ టాంగో పీస్ "నరంజో ఎన్ ఫ్లోర్ వంటి సంగీతాలతో అలరిస్తారు. వాస్తవానికి కిడ్ని పేషంట్ల డయాలసిస్ చేయించుకోవడమనేది విపరీతమైన బాధతో కూడుకున్న చికిత్స. పైగా వాళ్లు వారానికి మూడుసార్లు క్లినిక్కి వచ్చి డయాలసిస్ చేయించుకోక తప్పదు. తమకు ఏదో అయిపోయిందన్న భావనతో నిరాశ నిస్ప్రహలతో నీరశించి పోతుంటారు. అలాంటి రోగులు ఈ సంగీత కచేరిని వింటూ... డయాలసిస్ చికిత్స తీసుకుంటారు. ఆ క్లినిక్లో ఉన్న రోగులంతా తాము ఇంతవరకు భయాందోళనలతో జీవతం మీద ఆశలేకుండా జీవచ్ఛవంలా బతుకుతున్నా మాకు ఈ సంగీతం మాకు కొత్త ఊపిరిని ఇస్తోందంటున్నారు. తాము రోజువారీ పనులు కూడా చేసుకునేందుకు ఆసక్తి కనబర్చలేకపోయాం. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలంటేనే భయపడే వాళ్లం అని చెబుతున్నారు. ఇప్పుడు తమకు క్లినిక్ ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారిందని ఆనందంగా చెబుతున్నారు పేషంట్లు. ఆ ఆస్పత్రిని సంగీత బృందం స్పానిష్ మ్యూజిషియన్స్ ఫర్ హెల్త్ ఎన్జీవో నుంచి ప్రేరణ పొంది ఈ స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అదీగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సంవత్సరాలుగా ఆరోగ్య వ్యవస్థల్లో కళా సంస్కృతిని చేర్చాలని సిఫార్సు చేసిందని అందుకే తాము డయాలసిస్ పేషెంట్లకు రెండు దశాబ్దాలుగా టాంగో సంగీతాన్ని అందిస్తున్నామని చెబుతోంది ఆ సంగీత బృందం. నెఫ్రాలజిస్ట్ గెరార్డో పెరెజ్ చొరవతోనే "హాస్పిటల్ టాంగో" అనే ప్రాజెక్ట్ ఏర్పాటైంది. ఇది ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో మినీ కచేరీలను నిర్వహిస్తుంది. అంతేగాదు సంగీతం వినడం వల్ల ఆందోళన ఒత్తిడి తగ్గుతుందని, హృదయ స్పందన స్థిరంగా ఉంటుందని శాస్త్రీయ పరిశోధనలు నిరూపితమైంది కూడా. (చదవండి: కొడుకు టార్చర్ భరించలేక తల్లిదండ్రులు ఏం చేశారంటే.... ఇనుప గొలుసులతో బంధించి) -
బధిరులకూ సంగీతానుభూతి...
ఫొటోలో ఉన్నవాళ్లు ఏదో సంగీతానికి అనుగుణంగా సంతోషంగా చిందులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు కదా! సంగీతం వింటూ సంతోషంగా చిందులు వేయడం మామూలే కదా అనుకుంటున్నారా? మామూలే అనుకోండి. కాని, ఈ ఫొటోలో కనిపిస్తున్న వాళ్లంతా బధిరులు. అయితే, వాళ్లు సంగీతానికి అనుగుణంగానే చిందులు వేస్తున్నారు. బధిరులు సంగీతానికి అనుగుణంగా చిందులు వేయడమేంటని అవాక్కవుతున్నారా? ఫొటోను జాగ్రత్తగా గమనించండి. వాళ్ల ఒంటిపై ముందువైపు కనిపిస్తున్న స్ట్రాప్స్ వెనక్కు వేలాడేలా భుజాన తగిలించుకున్న బ్యాగులవి కావు. ఇవి వాళ్లు తొడుక్కున్న ‘హాప్టిక్ సూట్’కు చెందినవి. చేతి మణికట్లకు, ఒంటికి అంటిపెట్టుకునేలా ఉండే ఈ స్ట్రాప్స్తో కూడిన సూట్ను ధరిస్తే, ఈ సూట్ సంగీతానికి అనుగుణమైన ప్రకంపనలు సృష్టిస్తుంది. దాంతో బధిరులూ సంగీతాన్ని అనుభూతించగలరు. దీనిని ‘వోడాఫోన్’ కంపెనీ రూపొందించింది. -
పిల్లల భవిష్యత్తు కోసం...
తల్లిదండ్రులకు పిల్లలంటే పంచ ప్రాణాలు. వారి కోసం ఏ త్యాగానికి అయినా సిద్ధంగా ఉంటారు. చెప్పలేనంత ప్రేమ కురిపిస్తారు. ఇవన్నీ సహజమే. వారి మెరుగైన భవిష్యత్తుకు మీరు ఏమి చేయగలరు? ఇది అత్యంత కీలకమైన విషయం. ‘పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి విద్య’ అని వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు. కనుక పిల్లలపై ప్రేమతో మీరు ఏం చేసినా అది నాణేనికి ఒక కోణమే. వారికి నాణ్యమైన విద్య అందించడం రెండో కోణం అవుతుంది. దీనికి ముందు చూపు కావాలి. పక్కా ఆచరణతో నడవాలి. మెరుగైన ప్రణాళిక కావాలి. దీనికి క్రమశిక్షణ తోడవ్వాలి. అప్పుడే కల నెరవేరుతుంది. భవిష్యత్తుకు సంబంధించి ఏ లక్ష్యాలు సాధించాలని అనుకుంటున్నారు? వాటికి ఎంత వ్యవధి ఉంది? వీటిపై ముందు స్పష్టత తెచ్చుకోవాలి. పిల్లలకు సంబంధించి భవిష్యత్తు లక్ష్యాల్లో ముందుగా వచ్చేది విద్యా అవసరాలే. తర్వాత వివాహం. సాధారణ ద్రవ్యోల్బణం కంటే విద్యా ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా ఉంటోంది. ఫీజులు ఏటా 10–15% చొప్పున పెరుగుతున్నాయి. కనుక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో విద్యకు అయ్యే వ్యయంపై అంచనాలకు రావాలి. ఉన్నత విద్యా ఖర్చుల కోసం ముందు నుంచి సన్నద్ధం కావాలి. వివాహ ఖర్చు అన్నది మీ చేతుల్లో ఉండేది. పరిస్థితులకు అనుగుణంగా కొంత తగ్గించుకోగలరు. ముందు విద్యకు ప్రాధా న్యం ఇచ్చి, ఆ తర్వాత వివాహ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. విద్యా ఖర్చుకు సంబంధించిన అంచనాల్లో ఎక్కువ మంది బోల్తా పడుతుంటారు. ఆ సమయం వచ్చే సరికి కావాల్సినంత సమకూరదు. కనుక పెరిగే ఖర్చులకు తగ్గట్టు పొదుపు ప్రణాళికలు ఉండాలి. అధిక నాణ్యమైన విద్యను అందించే సంస్థలు, అత్యుత్తమ బోధనా సిబ్బంది, వసతులు, విదేశీ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు కలిగినవి సహజంగానే విద్యార్థులను ఆకర్షిస్తుంటాయి. ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే ఈ తరహా విద్యా సంస్థల ఫీజులు అధికంగా ఉంటుంటాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఇవి గరిష్ట ఫీజులను వసూలు చేస్తుంటాయి. చదువుతోపాటు ఇతర కళలు విద్యతోపాటే సమాంతరంగా పిల్లలకు నేర్పించే ఇతర నైపుణ్యాలు కూడా ఉంటాయని మర్చిపోవద్దు. క్రీడలు, సంగీతం, కళలు తదితర వాటిల్లో ఏదైనా ఒక విభాగంలో మీ చిన్నారిని చాంపియన్గా తీర్చిదిద్దాలనుకోవచ్చు. కనుక ఈ తరహా నైపుణ్యాల కోసం చేసే ఖర్చు అదనంగా ఉంటుంది. దీనికితోడు విడిగా ట్యూషన్ చెప్పించాల్సి రావచ్చు. ఆ ఖర్చును కూడా తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకోవాలి. వ్యయ అంచనాలు శిశువుగా ఉన్నప్పుడే పిల్లలకు సంబంధించి ప్రణాళిక మొదలు పెడితే.. పెట్టుబడులకు ఎంతలేదన్నా 15–20 ఏళ్ల కాలవ్యవధి మిగిలి ఉంటుంది. ఈ కాలంలో ద్రవ్యోల్బణం సగటున ఎంత ఉంటుందన్న అంచనాకు రావాలి. ఒకవేళ ఉన్నత విద్య కోసం పిల్లలను విదేశీ విద్యా సంస్థలకు పంపించాలనుకుంటే అప్పుడు ద్రవ్యోల్బణంతోపాటు.. రూపాయి మారకం విలువను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సగటు విద్యా ద్రవ్యోల్బణం 8–10 శాతం మధ్య ఉంటోంది. ఐదేళ్ల క్రితం ఇది 6 శాతం స్థాయిలోనే ఉంది. కనుక భవిష్యత్తులోనూ 8–10 శాతం వద్దే ఉంటుందని అనుకోవడానికి లేదు. ఇంకాస్త అదనపు అంచనా వేసుకున్నా నష్టం ఉండదు. భవిష్యత్తులో ఏ కోర్సు చేయాలన్నది పిల్లల అభిమతంపైనే ఆధారపడి ఉంటుంది. అది ముందుగా తెలుసుకోలేరు. కనుక తల్లిదండ్రులు తమ ఇష్టానుసారం ఒక కోర్సును అనుకుని దానికి సంబంధించి ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఈ అంచనాకు 10 శాతం అదనంగా సమకూర్చుకునే ప్రణాళికతో ముందుకు సాగిపోవాలి. విదేశీ విద్య అయితే.. గతంతో పోలిస్తే విదేశాల్లో గ్రాడ్యుయేషన్, ప్రోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వారి సంఖ్య పెరిగింది. విదేశీ విద్యతో విదేశాల్లోనే మెరుగైన అవకాశాలు సొంతం చేసుకుని అక్కడే స్థిరపడాలన్న ధోరణి కూడా పెరుగుతోంది. తల్లిదండ్రులుగా మీ పిల్లలను విదేశాలకు పంపించాలనుకుంటే.. లేదా పిల్లలు భవిష్యత్తులో విదేశీ ఆప్షన్ కోరుకునే అవకాశం ఉందనుకుంటే.. అందుకోసం పెద్ద నిధి అవసరం పడుతుంది. ఐఐఎంలో చేసే కోర్సు వ్యయంతో పోలిస్తే హార్వర్డ్ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కోర్సు వ్యయం నాలుగైదు రెట్లు అధికంగా ఉంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కోర్సులను అందించే దేశీయ ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ కోర్సుల వ్యయాలు అధికంగానే ఉన్నాయి. విదేశీ విద్య అయితే అక్కడ నివాస వ్యయాలు కూడా కలుస్తాయి. ఇవి ఎక్కువగా ఉంటాయి. దేశీయంగా అయితే నివాస వ్యయాలు తక్కువగా ఉంటాయి. పేరున్న విద్యా సంస్థల్లో అధిక ఫీజులు ప్రైవేటు విద్యా సంస్థల్లో కోర్సులకు అధిక ఫీజులు చెల్లించాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చౌకగా పూర్తవుతుందనే అభిప్రాయం ఉంటే దాన్ని తీసివేయండి. ప్రభుత్వంలోనూ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు చాలానే ఉన్నాయి. వీటిల్లో కోర్సుల వ్యయాలు ప్రైవేటుకు ఏ మాత్రం తీసిపోవు. ఐఐటీలు, నిట్లు, ఏఐఐఎంఎస్, ఐఐఎస్సీ, ఐఐఎంల్లో ప్రవేశాలకు ఏటా డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇక్కడ సరఫరా తక్కువ డిమాండ్ ఎక్కువ. కాకపోతే వీటిల్లో కోర్సులకు ‘హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ’ నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. వీటిల్లో చాలా ఇనిస్టిట్యూషన్స్ సొంతంగానే వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కనుకనే ఎప్పటికప్పుడు ఇవి ఫీజులను సవరిస్తున్నాయి. ప్రాథమిక విద్య నిర్లక్ష్యం వద్దు.. పిల్లల భవిష్యత్తు విద్యా అవసరాలకు ప్రణాళిక వేసుకునే సమయంలో పాఠశాల విద్యను తక్కువ అంచనా వేసుకోవద్దు. కొన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నత విద్యా కోర్సుల స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. పిల్లల విద్య ఖర్చు భరించలేక అప్పులు చేసే వారు చాలా మంది ఉన్నారు. ముందు చూపు లేకపోవడం వల్ల వచ్చే సమస్యే ఇది. ముందు నుంచే కావాల్సినంత మేర పొదుపు, మదుపు చేస్తూ వస్తే రుణాల అవసరం ఏర్పడదు. ఒకవేళ కొంచెం అంచనాలు తప్పినా పెద్ద ఇబ్బంది ఏర్పడదు. విద్యా రుణాలను ఉన్నత విద్య సమయంలో తీసుకోవడం తప్పు కాదు. అది పూర్తగా వారికొచ్చే వేతనం నుంచి చెల్లింపులు చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ, పాఠశాల విద్యకు సొంత వనరులే మార్గం కావాలి. మొదటి నుంచే రుణ బాట పడితే.. 15 ఏళ్ల తర్వాత భారీ వ్యయాలు అయ్యే కోర్సుల్లో చేరటం కష్టమవుతుంది. పెట్టుబడుల పోర్ట్ఫోలియో పిల్లల విద్యకు సంబంధించి పెట్టుబడుల విషయంలో భావోద్వేగాలకు చోటు ఇవ్వొద్దు. తమ అవసరాలకు సరిపడే ఉత్పత్తులను ఎక్కువ మంది ఎంపిక చేసుకోకపోవడాన్ని గమనించొచ్చు. పిల్లల కోసం పెట్టుబడి, తమకు ఏదైనా జరగరానికి జరిగితే బీమా రక్షణ కలగలసిన ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటుంటారు. కానీ, బీమా, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈ రెండూ విడిగా లభించే సాధనాలు. అటువంటప్పుడు రెండింటినీ కలపాల్సిన అవసరం ఏముంటుంది? అందుకుని ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్ను తగినంత కవరేజీతో తీసుకోవాలి. ఏదైనా ఊహించనిది జరిగితే ఎంతో ప్రేమించే తమ కుటుంబం ఇబ్బందుల్లో పడకుండా టర్మ్ ప్లాన్ ఆదుకుంటుంది. కుటుంబ వ్యయాలు, పిల్లల విద్యా వ్యయాలు, ఇతర అవసరాలను కలిపి టర్మ్ కవరేజీ ఎంతన్నది నిర్ణయించుకోవాలి. ఆరోగ్య అవసరాలు, రుణ అవసరాలు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముందే ఆరంభిస్తే కాంపౌండింగ్ కలిసొస్తుంది. రిస్క్ తీసుకుని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు లభిస్తుంది. ఎక్కువ పెట్టుబడులను ఈక్విటీకే కేటాయించుకోవచ్చు. తద్వారా అధిక రాబడులు అవకాశం ఉంటుంది. ఈక్విటీల్లో స్వల్ప కాలంలోనే (3–5ఏళ్లు) రిస్క్. దీర్ఘకాలంలో కళ్లు చెదిరే రాబడులు ఉంటాయి. అదే ఆలస్యంగా మొదలు పెడితే రిస్క్కు అవకాశం ఉండదు. కనుక డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. వీటిల్లో రాబడి 8 శాతం మించదు. ద్రవ్యోల్బణం కూడా ఇదే స్థాయిలో ఉంటుంది కనుక నికరంగా వచ్చే రాబడి ఏమీ ఉండదు. కనీసం ఐదేళ్లకు పైబడిన కాలానికే ఈక్విటీలను ఎంపిక చేసుకోవచ్చు. ఐదేళ్లలోపు కోసం అయితే ఈక్విటీలు సూచనీయం కాదు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలన్నది నిపుణుల సూచన. బీమా, ఈక్విటీలతో కూడిన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, వీటిల్లో వ్యయాలు ఎక్కువ. రాబడులను సమీక్షించుకోవడం మ్యూచువల్ ఫండ్స్ పథకాలతో పోలిస్తే కొంచెం క్లిష్టం. కనుక మెరుగైన ఈక్విటీ ఫండ్స్ను ఎంపిక చేసుకోవడమే మంచి మార్గం అవుతుంది. ఒకవేళ పిల్లల విదేశీ విద్య కోసం అయితే.. విదేశీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా కరెన్సీ మారకం విలువ మార్పులకు హెడ్జ్ చేసుకున్నట్టు అవుతుంది. డెట్ సాధనాల్లో అయితే సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెల కోసం), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ను పరిగణనలోకి తీసుకోవచ్చు. పొదుపు... చిన్న అడుగులు పొదుపు ముందే ప్రారంభిస్తే లక్ష్యం సులభం అవుతుంది. ఆలస్యం చేసిన కొద్దీ అది భారంగా మారుతుంది. 5 ఏళ్లు ఆలస్యం చేసినా, చేయాల్సిన పొదుపు రెట్టింపు అయిపోతుంది. అందుకనే చిన్నారి జన్మించిన వెంటనే పొదుపు, పెట్టుబడి ఆరంభించాలి. ఆలస్యం చేసినా మొదటి పుట్టిన రోజు నుంచి అయినా ఈ ప్రణాళికను అమలు చేయాలి. అప్పుడే అనుకున్నంత సమకూర్చుకోగలరు. ఉన్నత విద్య కోసం సాధారణంగా 18 ఏళ్లు ఉంటుంది. ప్రాథమికోన్నత పాఠశాల విద్య కోసం 10 ఏళ్ల వ్యవధి ఉంటుంది. అందుకని ఉన్నతవిద్య, ప్రాథమిక విద్యకు వేర్వేరుగా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. విద్యా రుణం ఇది చివరి ఎంపికగానే ఉండాలి. విద్యా రుణం చాలా సులభంగా లభిస్తుంది. ఫీజులకు చాలకపోతే రుణం తీసుకోవచ్చులేనన్న భరోసాతో పెట్టుబడులను నిర్లక్ష్యం చేయవద్దు. నిజాయితీ పెట్టుబడులు చేస్తూ, చివర్లో కావాల్సిన మొత్తానికి తగ్గితే (రాబడుల అంచనాలు మారి) లేదా అంచనాలకు మించి కోర్సుల వ్యయాలు పెరిగిపోతే అప్పుడు ఎలానూ అదనంగా సమకూర్చుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో విద్యారుణం బాట పట్టొచ్చు. లేదా ఉద్యోగం లేదా ఉపాధి పరంగా సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. అటువంటి పరిస్థితుల్లో విద్యా రుణాన్ని ఆశ్రయించొచ్చు. అది కూడా ఉద్యోగం పొందిన తర్వాత పిల్లలు చెల్లించే సౌలభ్యం పరిధిలోనే ఉండేలా చూసుకోవడం మర్చిపోవద్దు. -
ఆ మాటలను లతా మంగేష్కర్ ఎప్పుడూ మరవలేదట!
ప్రపంచమంతా పడి చచ్చే తన గాత్రం నిజానికి అంత గొప్పదేమీ కాదని వినమ్రంగా చెప్పేవారు లతా మంగేష్కర్. ‘‘నేనో మంచి గాయనిని. అంతే. నాలో అసాధారణ ప్రతిభా పాటవాలేమీ లేవు. నాకంటే గొప్పగా పాడే చాలామంది కన్నా పేరు ప్రఖ్యాతులు దైవదత్తంగా నాకొచ్చాయంతే. అందుకే విజయాన్ని ఎప్పడూ నెత్తికెక్కించుకోకూడదు’’అని చెప్పేవారామె. ‘‘చిన్నప్పుడు సంగీత శిక్షణను తప్పించుకునేందుకు తలనొప్పి, కడుపు నొప్పి అంటూ నాన్నకు చాలా సాకులు చెప్పేదాన్ని. సాధన చేయిస్తుంటే పారిపోయేదాన్ని. ఆయన వెంటపడి పట్టుకుంటే నీ ముందు పాడటానికి సిగ్గేస్తోందంటూ పెనుగులాడేదాన్ని. దాంతో ‘నేను నాన్నను మాత్రమే కాను, నీ గురువును కూడా. ఎప్పటికైనా గురువును మించాలని తపించాలి. అంతే తప్ప పాడటానికి సిగ్గేస్తోందని అనకూడదు’అని ఓ రోజు అనునయించారు. ఆ మాటలను ఎప్పుడూ మరవలేదు’’అని చెప్పారు. సంగీతమంటే అయిష్టం నాన్నతో సహా ఇంట్లో ఎవరికీ సినీ సంగీతం పెద్దగా నచ్చేది కాదని, వాళ్లకు కర్ణాటక సంగీతమే ఇష్టమని లతా మంగేష్కర్ అంటారు. ‘‘నాన్నకు సినిమాలే ఇష్టం లేదు. మమ్మల్ని సినిమాలు కూడా చూడనిచ్చేవారు కాదు’’అని ఆమె పలుమార్లు గుర్తుచేసుకున్నారు. ఫొటోగ్రఫీ అంటే లతకు చాలా ఇష్టం. క్రికెట్ అన్నా అంతే. వెస్టిండీస్ దిగ్గజాలు గ్యారీ సోబర్స్, రోహన్ కన్హాయ్ నుంచి గవాస్కర్, సచిన్ దాకా అందరినీ బాగా ఇష్టపడేవారు. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్మన్ సంతకం చేసిచ్చిన ఫొటోను ప్రాణంగా దాచుకున్నారు లత. -
పండిత అనురాధా పాల్.. తబలా మాంత్రికురాలు
ఉస్తాద్ అల్లారఖా పెద్ద తబలా మాస్టర్. ఉస్తాద్ జాకిర్ హుసేన్ కూడా. శంకర్ ఘోష్, ఉదయ్ మజుందార్... ఎందరో పురుష ఉస్తాద్లు.. పండిత్లు. కాని వీరితో సరిసాటిగా కాదు కాదు తనే ఒక విలక్షణ మాస్టర్గా అనురాధా పాల్ తబలా వాదనలో ఖ్యాతి గడించింది. స్త్రీలు ఈ రంగంలో రాణించడం సామాన్యం కాదు. ఎన్నో అడ్డంకులను అపధ్వనులను దాటి ఆమె ఈ స్థితికి చేరుకుంది. ఆమె పరిచయం... ముంబైలో అనురాధా పాల్ తబలా కచ్చేరీ జరుగుతోంది. దానికి హాజరైన చిత్రకారుడు ఎం.ఎఫ్.హుసేన్ ఆసాంతం ఆ కచ్చేరి చూసి, ఆమెను కలిసి, ‘రేపు మీ ఇంటికి వస్తున్నాను’ అని వెళ్లిపోయాడు. ఎందుకు వస్తున్నట్టు? మరుసటి రోజు హుసేన్ ఆమె ఇంటికి వచ్చాడు. ఆయనతోపాటు రఫ్ కట్ చేసిన ‘గజ్గామిని’ సినిమా ఉంది. మాధురి దీక్షిత్తో ఎం.ఎఫ్.హుసేన్ తీసిన సినిమా అది. త్వరలో విడుదల కావాల్సి ఉంది. ‘దీనికి నువ్వు నేపథ్య సంగీతం అందించాలి’ అన్నాడు హుసేన్. అనురాధా పాల్ ఆశ్చర్యపోయింది. ‘నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఏమిటి? మీరు తలుచుకుంటే ప్రపంచంలోని మహా మహా సంగీతకారులు ఎవరైనా ఇస్తారు’ అని అనురాధా పాల్ అంది. ‘కాదు నువ్వు ఇవ్వాలి. సినిమా అంతా నీ తబలా వినిపిస్తే చాలు’ అని మీటింగ్ ముగించాడు ఎం.ఎఫ్.హుసేన్. అనురాధా పాల్ తాను ఒక్కతే తబలా వాయిస్తూ ‘గజ్గామిని’కి రీ రికార్డింగ్ చేసింది. బహుశా ప్రపంచంలో కేవలం తబలా మీద అదీ ఒక స్త్రీ వాయిద్యకారిణి వాయిస్తూ ఉంటే రీ రికార్డింగ్ ముగించుకున్న సినిమా అదొక్కటే ఏమో. అది అనురాధా పాల్ ఘనత. ప్రపంచలోనే ఆమె తొలి మహిళా తబలా వాయిద్య కారిణి. అనురాధా పాల్ది ముంబై. అక్కడే పుట్టి పెరిగింది. వాళ్ల కుటుంబం తాతగారి హయాంలో దేశ విభజన సమయంలో ముంబై వచ్చేసింది. ఆమె తండ్రి దేవిందర్ పాల్ వీధి దీపాల కింద చదువుకుని పెద్ద ఫార్మా కన్సల్టెంట్ అయ్యాడు. తల్లి ఇళా పాల్ గాయని, పెయింటర్. ఆ ఇంట్లో కళల పట్ల ఆసక్తి ఉండేది. పిల్లలు ఏదో ఒక కళలో కనీస అభిరుచి కలిగి ఉండాలని తల్లిదండ్రులు కోరుకునేవారు. అయితే చదువు తప్పనిసరి. కాని ఇంటి చిన్న కుమార్తె అయిన అనురాధా పాల్కు చదువు కంటే కళ మీదే ఎక్కువ ఆసక్తి ఏర్పడింది. ఆమె ముందు గాత్రం నేర్చుకుంది. కాని గాత్రం కొనసాగిస్తూ ఉంటే తోడు వాయిద్యం అయిన తబలా ఆమెను ఆకర్షించింది. పాడుతూనే తబలా మీద కొట్టవలసిన తాళాన్ని అందించేది. తబలా ఎందుకు నేర్చుకోకూడదు? అని ఆమెకు అనిపించింది. ఆడపిల్లలు సితార్, వీణ, వయొలిన్ వంటి వాయిద్యాలు నేర్చుకుంటారు. కాని తబలా పూర్తిగా మగవాళ్ల విద్యగా చలామణిలో ఉంది. అలాంటి విద్యను ఆడపిల్ల నేర్చుకోవడమా? కాని తొమ్మిదో ఏటకే అనురాధా పాల్ తబలాలో ప్రావీణ్యం సంపాదించింది. కచ్చేరి ఇచ్చింది కూడా. అనురాధా పాల్ మొదట బెనారస్ ఘరానాలోని గురువుల దగ్గర తబలా నేర్చుకున్నా చివరకు ఉస్తాద్ అల్లారఖా ఆ తర్వాత ఉస్తాద్ జాకిర్ హుసేన్ శిష్యురాలైంది. 18 ఏళ్లకు ఆమె ముంబైలో కచ్చేరి ఇస్తే పత్రికలు ఆమెకు ‘లేడీ జాకిర్ హుసేన్’ అనే బిరుదు ఇచ్చాయి. నిజానికి ఇలాంటి బిరుదులు పరోక్షంగా స్త్రీల శక్తిని తక్కువ అంచనా వేసేవే. కాలక్రమంలో అనురాధా పాల్ తన పేరుతో తానే ఒక గొప్ప తబలా విద్వాంసకురాలిగా పేరు పొందింది. ఆమె పర్కషనిస్ట్ కూడా. అంటే ఒకటికి మించి తోడు వాయిద్యాలను వాయించే వారిని పర్కషనిస్ట్ అంటారు. అనురాధా పాల్ కనీసం 40 రకాల వాయిద్యాలను వాయించగలదు. అలా తానే అన్ని వాయిద్యాలు వాయిస్తూ ఆమె ఆల్బమ్ చేసింది కూడా. అయితే కొత్తల్లో ఆమెకు అంత సజావుగా ఎంట్రీ దొరకలేదు. ‘‘ఒక కచ్చేరిలో నన్ను కొన్ని తాళాలు మాత్రమే వాయించమన్నారు. దూకుడుగా వాయించాల్సిన తాళాలను మగ తబలా ప్లేయర్ వాయిస్తాడని చెప్పారు. కారణం అడిగాను. ‘దూకుడు తాళాల పని నీకు అప్పచెప్తే ఆడపిల్లతో కష్టం చేయిస్తున్నారన్న మాట వస్తుంది’ అని చెప్పారు. నేను అడ్డం తిరుక్కుని మొత్తం వాయించి ప్రేక్షకుల హర్షధ్వానాలు అందుకున్నాను’’ అంటుంది అనురాధా పాల్. సాధారణంగా కచ్చేరీలలో మగవారు గాత్రంలో ఉంటే మగ సహ వాద్యకారులనే తోడు తీసుకుంటారు. ఆడవాళ్లను ప్రోత్సహించరు. ఆ విషయంలో కూడా అనురాధా పాల్ సుదీర్ఘ పోరాటం చేసి పెద్ద పెద్ద గాత్ర విద్వాంసుల తోడు కూచుని కచేరీ చేయగలిగింది. ‘నేను మహిళను. ఈ శక్తి నాది. నా శక్తికి విలువ ఇవ్వండి. నేను మహిళను కాబట్టి నాకు మెచ్చుకోలులో వాటా ఇవ్వకండి’ అంటుంది అనురాధా పాల్. ఆమె అందరూ మహిళా విద్వాంసులు ఉండే ‘స్త్రీ శక్తి’ అనే బ్యాండ్ను తయారు చేసి ప్రపంచంలో అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చింది. అలాగే క్లాసికల్ను వెస్ట్రన్తో జత చేస్తూ ‘రీచార్జ్’ అనే బ్యాండ్ ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇస్తుంది. తన సోలో ప్రదర్శనలు ప్రత్యేకం. ఇంత సాధించినా ఆమెకు ‘పద్మశ్రీ’ ఇంకా దక్కలేదు. సంగీత ప్రపంచంలో పురుషుల ప్రాభవం ఇంకా కొనసాగుతున్నదనే అనుకోవాలి. కాని ఎంత కాలం? అనురాధా పాల్ లాంటి వాళ్లు మరెందరో పుట్టుకు వచ్చి ఇదంతా కచ్చితంగా మార్చరూ? -
లెట్స్ సీ వాట్ ఐ కెన్ డూ.. అదే ఆమె మంత్రం!
ఆడిపాడే పదిహేడేళ్ల ప్రాయంలో ముంబై అమ్మాయి కాంచన్ డేనియల్పై క్యాన్సర్ అనే పిడుగు పడింది. ఎటుచూసినా చీకటి... మనసు నిండా నిరాశ! ఏవేవో ఆలోచనలు. మునపటిలా చురుగ్గా ఉండడానికి తనకు ఇష్టమైన మ్యూజిక్ను నమ్ముకుంది. మ్యూజిక్ మ్యాజిక్తో హుషారు తెచ్చుకోవడమే కాదు ఆ తరువాత క్యాన్సర్ నుంచి బయటపడింది. పందొమ్మిది సంవత్సరాల వయసులో వేదికపై జాన్ మేయర్ ‘గ్రావిటీ’ పాట పాడి ‘వాహ్’ అనిపించుకుంది. ఒక అద్భుతాన్ని సృష్టించే ముందు ‘లెట్స్ సీ వాట్ ఐ కెన్ డూ’ అంటూ నినదించడం ఆమె మంత్రం. టీనేజ్లో క్యాన్సర్ బారిన పడిన వారికి ధైర్యం ఇవ్వడం కోసం కాంచన్ క్లినికల్ సైకాలజీ చదువుకుంది. ముంబై కేంద్రంగా మిత్రులతో కలిసి మొదలుపెట్టిన ‘బ్లూస్ రాక్’ మ్యూజిక్ బ్యాండ్ సూపర్ హిట్ అయింది. మ్యూజిక్, మెంటల్ హెల్త్లను కలిపి కొత్త టానిక్ తయారు చేసిన కాంచన్... మొన్నటి కరోనా పరిస్థితుల్లో డిప్రెషన్ బారిన పడిన ఎంతోమంది టీనేజర్లకు తన సంగీతంతో ధైర్యాన్ని ఇచ్చింది. కృంగుబాటు నుంచి బయటికి వచ్చేలా చేసింది. (చదవండి: పురోహితురాలు.. అమెరికాలో పెళ్లిళ్లు చేస్తున్న సుష్మా ద్వివేది) -
తగ్గిస్తే పోయేది.. కుదరదన్నాడు.. చివరికి ప్రాణమే పోయింది
ముంబై: సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని మన పెద్దలు చెప్తుంటారు. అంతెందుకు మనం బాధలో ఉన్నప్పుడు మధురమైన సంగీతం వింటే చాలు మనసు కాస్త కుదుట పడుతుంది. కాకపోతే ఎదైనా సరే సృతి మించకుండా ఉండాలి లేదంటే వాటి పరిణమాలు తీవ్రంగా ఉంటాయి. ఎంతటి మధురమైన సంగీతమైన సరే తగిన మోతాదులో సౌండ్ పెట్టుకుని వింటేనే ఓ అందం వినే వాళ్లకి ఆనందం. కానీ అదే సౌండ్ పెద్దగా పెడితే వినే వాళ్ల పరిస్థితి ఏమోగానీ పోరుగున ఉన్న వాళ్లకి చికాకు కలుగుతోంది. ఈ తరహాలోనే ఓ వ్యక్తి తన ఇంట్లో మ్యూజిక్ పెద్దగా పెట్టి.. చివరికి హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని అంబుజావాడి ప్రాంతంలో సురేంద్ర కుమార్ గున్నార్ అనే వ్యక్తి తన ఇంట్లో మ్యూజిక్ పెట్టుకుని వింటున్నాడు. కాకపోతే అదేదో చిన్నగా తనవరకు వినపడేలా కాకుండా పెద్దగా సౌండ్ పెట్టి సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడు. అంతలా శబ్ధం వస్తుండడంతో ఆ ఇంటి పక్కనే ఉన్న సైఫ్ అలీ చంద్కు కాస్త చికాకు కలిగింది. దీంతో అతను సురేంద్ర కుమార్ వద్దకు వెళ్లి సౌండ్ తగ్గించమని కోరాడు. అందుకు సురేంద్ర కూమార్ ససేమిరా అన్నాడు. అసలే చిరాకు, అందులో అతను సౌండ్ తగ్గించేందుకు అంగీకరించకపోవడంతో సైఫ్ అలీ సురేంద్రపై దాడి చేయడంతో అతను అక్కడే కుప్ప కూలిపోయాడు. కుటుంబ సభ్యులు సురేంద్ర కుమార్ను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సైఫ్ అలీని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: బంధువుల ఇంట్లో గృహ ప్రవేశం.. పెరుగు తెస్తానని వెళ్లి -
పెళ్లి బాజాలతో.. 65 కోళ్లు మృతి!..ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!!
భువనేశ్వర్: వివాహ వేడుక అనగానే బ్యాండ్ మేళాలతో డ్యాన్స్లు వేస్తూ, మరోవైపు బాణసంచాల కాల్పులతో అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. అయితే అవి మోస్తారు పరిధిలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఆహ్లాదభరిత వాతావరణంలో చేసుకువాల్సిన తంతు. కానీ ఇక్కడొక వివాహ వేడుకలోని మోగిన సంగీత భాజాలు కారణంగా కోళ్లు చనిపోయాయి. (చదవండి: పాపం ఎంత దాహం వేసిందో!.....ఆ కోబ్రా గ్లాస్తో తాగేస్తోంది.) అసలు విషయంలోకెళ్లితే... తూర్పు ఒడిషాలోని రంజిత్ కుమార్ పరిదా అనే వ్యక్తి పౌల్ట్రీ ఫారమ్కి కొద్ది దూరంలో పెళ్లి బాజాలతో బాణసంచా కాలుస్తూ, డ్యాన్స్ చేసుకుంటూ పెద్ద ఎత్తున వివాహ ఊరేగింపుగా వస్తున్నట్లు చెబుతున్నాడు. పైగా వాళ్లు పెద్ద ఎత్తున మ్యూజిక్ పెట్టారని, అంతేకాక చెవులు చిల్లులు పడేంత శబ్దంతో వాళ్లంతా చిందులేస్తూ ఉన్నారని అన్నారు. అయితే సదరు వ్యక్తి మ్యూజిక్ సౌండ్ తగ్గించమంటే వాళ్లు వినలేదని చెబుతున్నాడు. దీంతో తన కోళ్ల ఫారమ్లోని 65 కోళ్లు చనిపోయినట్లు చెప్పాడు. కోళ్లు గుండెపోటుతో చనిపోయాయని పశువైద్యుడు నిర్ధారించినట్టు రంజిత్ తెలిపాడు. ఈ క్రమంలో జంతువుల ప్రవర్తనపై పుస్తకాన్ని రచించిన జువాలజీ ప్రొఫెసర్ సూర్యకాంత మిశ్రా పెద్ద పెద్ద శబ్దాలు పక్షులలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని చెప్పారు. అంతేకాదు వివాహ నిర్వాహకులు నష్ట పరిహారం చెల్లించడానికి నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని రంజిత్ చెప్పాడు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవల్సిందిగా సూచించడంతో చివరికి కథ సుఖాంతం అయ్యింది. పైగా రంజిత్ ఫిర్యాదు ఉపసంహరించుకోవడంతో తాము ఎటువంటి చర్య తీసుకోలేదని పోలీసు అధికారి ద్రౌపది దాస్ తెలిపారు. (చదవండి: ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో) -
'రజనీకాంత్ సినిమాలకు చేయాలంటే నరకంలా ఫీల్ అయ్యేవాడిని'
సూపర్ స్టార్ రజనీకాంత్, ఏ ఆర్ రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కలెక్షన్ల పరంగానే కాక మ్యూజికల్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసింది. ఈ వరుసలో ముత్తు, శివాజీ, రోబో, రోబో 2.0 వున్నాయి. ఈ లెజెండరీల కాంబినేషన్లో సినిమా వస్తుందంటే చాలు మూవీ లవర్స్ కు పండగే. అయితే ఇదంతా తెరపైన మనకి కనపడేవి.కానీ దీని వెనుక చాలా వ్యయ ప్రయాసలు,కష్టాలు, దగున్నాయని అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు ఏ ఆర్ రెహమాన్. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. రజనీకాంత్ సినిమాలకు పనిచేసిన రోజులు అంత ఆహ్లాదకరంగా ఉండేవి కాదని, ఆయన సినిమాకు పనిచేయడమంటే నరకంలా భవించేవాడినని చెప్పాడు. ఇప్పట్లో కొంచెం నయం అని, అప్పట్లో రజనీకాంత్ సినిమాలకు చాలా వరకు దీపావళికి విడుదలయ్యేవి. సినిమాకు పాటలు, బీజీఎం అధిరిపోవాలని అందరూ అనేవాళ్ళు. పైగా ఆయన చిత్రాలకు చాలా తక్కువ సమయం ఉండటంతో ఒత్తిడి కూడా అధికంగా వుండేదని, ఓ రకంగా చాలా ఒత్తిడి కూడా ఉండేదని చెప్పుకొచ్చాడు రెహమాన్. -
తాలిబన్ల దుశ్చర్య.. 13 మంది ఊచకోత
కాబూల్: అఫ్గనిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. ఓవైపు ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.. దేశంలో మాంద్యం పెరిగితోంది. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా.. చాంధస పాలన కొనసాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తాలిబన్లు ఓ మహిళా క్రీడాకారిణి తల నరికిన ఘటన గురించి చదివాం. తాజాగా తాలిబన్లు మరో దుశ్చర్యకు పూనుకున్నారు. పెళిల్లో మ్యూజిక్ బంద్ చేయించడం కోసం ఏకంగా 13 మందిని చంపేశారు. ఈ విషయాన్ని అఫ్గన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ శనివారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. అమ్రుల్లా చెప్పిన దాని ప్రకారం నంగర్హార్ ప్రావిన్స్ ప్రాంతంలో ఓ చోట వివాహం జరుగుతుంది. ఇక పెళ్లి అంటే సందడి ఉంటుంది కదా. అలానే ఆ వివాహ వేడుక వద్ద మ్యూజిక్ ఏర్పాటు చేశారు. అది తాలిబన్లకు నచ్చలేదు. మ్యూజిక్ ఆపమని చెప్పడానికి వారు అక్కడున్న జనాల్లో ఓ 13 మందిని ఊచకోత కోశారు. (చదవండి: తోబుట్టువుల కడుపు నింపడం కోసం పసికందు అమ్మకం ) ఈ సందర్భంగా అమ్రుల్లా ‘‘తాలిబన్ మిలిటెంట్లు నంగర్హార్ ప్రావిన్స్ ప్రాంతంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో సంగీతాన్ని ఆపడం కోసం 13 మందిని ఊచకోత కోశారు. మనం కేవలం ఖండించడం ద్వారా మాత్రమే ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేం. మన సంస్కృతిని చంపేయడం కోసం పాకిస్తాన్ వీరికి దాదాపు 25 ఏళ్ల పాటు శిక్షణ ఇచ్చింది. మన సంస్కృతి స్థానంలో ఐఎస్ఐ కల్చర్ని తీసుకువచ్చి.. మన ఆత్మలను నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ రాక్షస పాలన ఎంతో కాలం కొనసాగదు. కానీ ఉన్నన్ని రోజులు అఫ్గన్లు మూల్యం చెల్లించుకోవాల్సిందే’’ అంటూ ట్వీట్ చేశారు. Taliban militiamen have massacred 13 persons to silence music in a wedding party in Nengarhar. We can't express our rage only by condemnation. For 25 years Pak trained them to kill Afg culture & replace it with ISI tailored fanaticism to control our soil. It is now in works. 1/2— Amrullah Saleh (@AmrullahSaleh2) October 30, 2021 (చదవండి: అఫ్గాన్ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు?) అఫ్గనిస్తాన్ను ఆక్రమించుకున్న నాటి నుంచి తాలిబన్లు దేశంలో కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో మ్యూజిక్, టీవీల్లో ఆడవారి గొంతు వినిపించకూడదంటూ నిషేధం విధించారు. అఫ్గనిస్తాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ కాలేజీని కూడా మూసేశారు. చదవండి: ఆ డబ్బులు అఫ్గనిస్తాన్వి.. మాకు తిరిగివ్వండి: తాలిబన్లు -
ఎవరు ఈమె..నా పియానో వాయిస్తుంది ?
కొన్ని వ్యాధులను సంగీతం నయం చేయగలదని అంటారు. అలాగే బాగా ఒత్తిడిగా ఉన్నా మూడ్ బాగోకపోయినా కాస్త మంచి సంగీతం వింటే త్వరితగతిన రిలాక్స్ అవ్వగలం. కానీ కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారిని మానసికంగా ఆరోగ్యవంతులుగా చేయడానికి సంగీతం ఎంతగానో ఉపకరిస్తుంది అనడంలో సందేహం లేదు. కానీ ఇక్కడోక అమ్మాయి వాళ్ల తాత అల్జీమర్స్ వ్యాధితో ఎవర్ని గుర్తు పట్టలేక ఇబ్బంది పడుతుంటే అతని మనవరాలు పీయానో వాయిస్తు అతనికి జ్ఙాపకం తెప్పించడానికీ ఎలా ప్రయత్నిస్తోందో చూడండి. ఏంటిదీ అసలేం జరిగింది ఎవరామె చూద్దాం రండి. (చదవండి: జెఫ్ బెజోస్ ఈవెంట్లో పునీత్ రాజ్కుమార్ ఆ నటుడ్ని కలవాలనుకున్నారట!) అసలు విషయంలోకెళ్లితే...షీలాకు 93 ఏళ్ల తాతయ్య ఉన్నారు. ఆయన అల్జీమర్స్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. అంతేకాదు పైగా ప్రతి పది నిమిషాలకు ఎవరు నువ్వు అని అడుగుతుంటారు. అయితే ఆమె వాళ్ల తాతయ్య గదిలోకి వెళ్లి పియానో వాయిస్తూ ఉంటుంది. దీంతో వాళ్ల తాతయ్య మొదట ఎవరు నా గదిలోకి వచ్చి పియానో వాయిస్తున్నారని చాటుగా చూస్తుంటాడు. తర్వాత నెమ్మదిగా మనవరాలి దగ్గరకి వచ్చి నిలుచుంటాడు. కాసేపటికీ మనవరాలు వాయిస్తున్న పియానో సంగీతాన్ని వింటూ నవ్వు ముఖం పెడతాడు. ఆ సన్నివేశాన్ని చూస్తే అతను తన మనవరాలిని గుర్తు పట్టినట్లుగా ఉంటుంది. ఈ మేరకు షీలా ఈ వీడియో తోపాటుగా జీవితం చాలా చిన్నది. మీ ప్రియమైన వారితో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి అనే క్యాప్షన్ని జోడించి మరీ సోషల్ మీడియోలో పోస్ట్ చేస్తుంది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాకా ప్రతి నెటిజన్లు హృదయాన్ని కదిలించింది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్లు వచ్చాయి, మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: అది రాయి కాదు 20 కోట్లు ఖరీదు చేసే డైమండ్!) View this post on Instagram A post shared by Sheela Awe 魏喜来 (@sheelaawe) -
సర్కారువారి పాట: క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్
సూపర్స్టార్ మహేశ్ బాబు పరశురాం దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. మహేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్లో జరుగుతుంది. ఆ సినిమాకు సంబంధించి ఎస్.ఎస్ తమన్ అభిమానులకు క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. రీసెంట్గా ఈ మూవీ మ్యూజిక్ కంపోజిషన్ పూర్తి అయినట్లు తమన్ పేర్కొన్నాడు. ఈ మేరకు మహేశ్తో తీసుకున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఇందులో సూపర్ స్టైలిష్గా మహేష్ ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ఈ సినిమా ముందుకు రానుంది. చదవండి: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలి నిర్ణయం 'నాట్యం' ఫేమ్ సంధ్యారాజు బ్యాక్గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. Here We Complete the Compositions of Our Very Own #Superstar’s #SarkaruVaariPaata Here is Our #Superstar Shining @urstrulyMahesh gaaru 💥❤️ #SarkaruVaariPaataMusic 🎵🎧 pic.twitter.com/C6Tp63P2uC — thaman S (@MusicThaman) October 22, 2021 #Rhythmisgod 💥🎵 Just getting into the groove warming up and creating templates before our sessions start for #SarkaruVaariPaataMusic #SarkaruVaariPaata 🎵🎧💪🏼❤️🇪🇸 pic.twitter.com/StrHGVKp7x — thaman S (@MusicThaman) October 21, 2021 -
మ్యూజిక్ కోసం అబ్బాయి అవతారం.. ట్విస్ట్ ఏంటంటే..
మ్యూజిక్ అంటే ఇష్టంతో ఓ బాలిక.. అబ్బాయిగా అవతారం ఎత్తింది. చైనాకు చెందిన 13 ఏళ్ల ఫు జియువాన్ అనే బాలిక.. అబ్బాయిగా ప్రముఖ యూఎన్జీ యూత్ క్లబ్ సంస్థ మ్యూజిక్ బ్యాండ్లో చేరింది. అయితే బ్యాండ్ ట్రైనింగ్లో భాగంలో పలు వీడియో పర్ఫార్మేన్స్లను ఆమె సోషల్ మీడియాలో షేర్చేసింది. దీంతో ఫు జియువాన్ అబ్బాయి కాదని.. బాలిక అని యూఎన్జీ యూత్ క్లబ్ అభిమానులు, నెటిజన్లు గుర్తించారు. అయితే ఈ విషయంపై ఫు జియువాన్ స్పందించింది. ‘మీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి నన్ను క్షమిచండి. ఇక నేను భవిష్యత్తులో ఎంటర్టైన్మెంట్ రంగంలోగాని, వీడియో ప్లాట్ఫామ్స్లో గాని కనిపించను’ అని తెలిపింది. అయితే ఈ విషయంపై యూఎన్జీ యూత్ క్లబ్ ప్రతినిధి స్పందిస్తూ.. యూఎన్జీ క్లబ్ కేవలం 11 నుంచి 13 ఏళ్ల అబ్బాలను మాత్రమే చేర్చుకుంటుదని తెలిపారు. వారికి మ్యూజిక్, డ్యాన్స్లపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్ ఆడిషన్స్ను సరిగా చేయకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పారు. ఇటువంటి తప్పులు మళ్లీ జరగవని తెలిపారు. చైనాలో ఈ బ్యాండ్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. మ్యూజిక్, డ్యాన్స్పై ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలు ఇందులో చేరి శిక్షణ పొంది ఫేమస్ కావాలని ఆశపడుతుంటారు. మ్యూజిక్పై ప్రేమతో ఆమె చేసిన ధైర్యాన్ని అభిమానులు కొందరు ప్రశంస్తున్నారు. యూఎన్జీ క్లబ్ లాభాలు పొందాలనే ఇలా చేస్తోందని విమర్శిస్తున్నారు. -
వెరైటీ థెరపీలు... విలువైన ప్రయోజనాలు!
రాతి పనిముట్ల వాడకం మొదలెట్టడంతో మానవ పరిణామ క్రమంలో నూతనాధ్యాయం ఆరంభమైంది. క్రమంగా చక్రం, నిప్పు కనుగొనడం ఈ పరిణామ క్రమాన్ని మరింత వేగవంతం చేసింది. జంతు లక్షణాల నుంచి బయటపడ్డ మనిషి ఇతర జంతువుల్లాగా కాకుండా తమలో తాము సంభాషించుకోవడానికి భాషను సృష్టించాడు, అలాగే తాను చూసిన వాటిని పాతరాతియుగం నాటి మానవుడు కొండగుహల్లో చిత్రీకరించడం ఆరంభించాడు. క్రమంగా సంచార జీవనం వదిలి స్థిరజీవనం దిశగా ఆదిమ సమాజాలు పయనించడంతో మనిషిలో మరిన్ని కళలు బయటపడ్డాయి. భాష నుంచి సంగీతం, దానికనుగుణంగా నాట్యం వంటి అనేక కళలు మానవ జీవితంలోకి ప్రవేశించాయి. తర్వాత కాలంలో కళారూపాలు శాఖోపశాఖలుగా విస్తరించాయి. ఇలాంటి కళా రూపాలు కేవలం మానసికోల్లాసానికే కాదని, వీటిని సరిగా ఆచరిస్తే ఆరోగ్యం కూడా మెరుగవుతుందని మనిషి కనుగొన్నాడు. ఆధునిక యుగంలో కూడా ఈ కళా రూపాలను ఉపయోగించి పలు దీర్ఘకాల వ్యాధులను, చికిత్స దొరకని రోగాలను ఉపశమింపచేసే థెరపీలు అనేకం ఉన్నాయి. కళలే కదా అని కొట్టి పారేయకుండా ఈ థెరపీలతో పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నది నిపుణుల అభిప్రాయం. ఆధునిక వైద్యం ఈ థెరపీలను సమర్థించదు కానీ వీటి వాడకాన్ని వద్దనలేదు. సైడ్ ఎఫెక్టులు ఉండని కొన్నిరకాల ప్రత్యామ్నాయ థెరపీల గురించిన వివరాలు... పెట్ థెరపీ మనిషి జీవితంలో జంతువులను మచ్చిక చేసుకోవడం ఎంతో కలిసివచ్చింది. దీనివల్ల నాగరికతలు దూసుకుపోయాయి. మనిషి మనసును అర్ధం చేసుకొనే పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు మధ్య ఒక మానసిక బంధం ఏర్పడుతుంది. దీని ఆధారంగా యానిమల్ అసిస్టెడ్ లేదా పెట్ థెరపీ పుట్టుకొచ్చింది. సాధారణంగా మనిషి పెంచుకునే కుక్క, పిల్లి, గుర్రం, పంది, పక్షులతో ఈ థెరపీ ప్లాన్ను రూపొందిస్తారు. ఆటిజం, బిహేవియరల్ సమస్యలు, మెంటల్ కండీషన్స్, స్క్రీజోఫ్రీనియా ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే పెట్ అలెర్జీ ఉన్నవారు, జంతువులంటే అసహ్యం ఉన్నవారు ఈ థెరపీకి దూరంగా ఉండడం మంచిది. ఈ విధానంలో మన పెంపుడు జంతువుతో మనకు ఎమోషనల్ బంధం బలపడేలా థెరపిస్టు చేస్తాడు. దీనివల్ల మనిషి మనసులో సున్నితత్వం మెరుగుపడుతుంది. ఇతర జీవులపై ప్రేమ పెరుగుతుంది. దీనివల్ల మెదడులో కరుణ, జాలి భావాలకు ప్రాధాన్యం పెరిగి మానసికంగా బలోపేతం అవుతాడు. ఈ థెరపీలో కేవలం వైయుక్తిక విధానమే ఉంటుంది. గ్రూప్ థెరపీ ఉండదు. మ్యూజిక్ థెరపీ శిశుర్వేత్తి పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణిః అన్నాడు ప్రవచనకారుడు. సంగీతానికి పరవశించని జీవం ఉండదన్నది అందరికీ తెలిసిన సంగతే! అలాంటి సంగీతాన్నే ఆధారంగా చేసుకొని స్వాంతన చేకూర్చేది మ్యూజిక్ థెరపీ. పిల్లలో, పెద్దల్లో ఎదురయ్యే యాంగై్జటీ, డిప్రెషన్, నొప్పులు, ఆటిజం, ఆల్జీమర్స్, డిమెన్షియా, మెదడుకు దెబ్బతగలడం తదితర అనేక రకాల ఇక్కట్లకు ఈ థెరపీ బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతారు. ఇందులో రెండు రకాలున్నాయి. వినడం(రెసెప్టివ్ విధానం), పాడడం(యాక్టివ్ విధానం)లో మనకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. భారతీయ సంస్కృతిలో సంగీతానికి ప్రాధాన్యత మెండు. వివిధ రకాల మానసిక స్థితులకు తగినట్లు సంగీతంలో వివిధ రాగాలను సృష్టించారు. ఉదాహరణకు కరుణ రసాన్ని గాంధారం ప్లస్ నిషాధం అలాగే గాంధారం ప్లస్ షడ్జమం శౌర్య రసాన్ని ప్రేరేపిస్తాయి. రస, రాగ సమ్మిళితంతో మానసికోల్లాసమేకాకుండా, ఆరోగ్యం కూడా లభిస్తుందని భారతీయులు గుర్తించారు. పాశ్చాత్య సంగీతంలో కూడా ఆయా స్థితులకు తగ్గట్లు నోట్స్ను సృష్టించారు. ఇలా పనిచేస్తుంది... మనిషి పుట్టినప్పటి నుంచి చివరివరకు శబ్దమయ జీవితం గడుపుతాడు. శబ్దాలను క్రమపద్ధతిలో పేరిస్తే సంగీతమవుతుంది. సంగీతం వినడం ఒకలాగా, సొంతంగా పాడడం ఒకలాగా ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు మతిమరుపు, అల్జీమర్స్ లాంటి వ్యాధులతో బాధపడేవాళ్లకు గతంలో విన్న సంగీతం కారణంగా మెదడులో గత న్యూరాన్లకు ప్రేరణ కలుగుతుంది. అలాగే సొంతంగా హమ్మింగ్ లేదా పాడుతూ పనిచేయడం శ్రమ తెలియనివ్వదు. మ్యూజిక్ థెరపీ చేసేవాళ్లు ముందుగా క్లయింట్ కండీషన్ బట్టి ఎలాంటి విధానం అవలంబించాలో నిర్ణయించుకుంటారు. అలాగే క్లయింట్కు మ్యూజిక్లో, సంగీత వాయిద్యాల్లో ప్రవేశం ఉన్నట్లయితే అందుకు తగిన విధానాన్ని సూచిస్తారు. అలాగే క్లయింట్ అవసరాన్ని బట్టి గ్రూప్ థెరపీని లేదా వైయుక్తిక సిట్టింగ్ను సూచిస్తారు. శ్రావ్య సంగీతం వినేప్పుడు శరీరంలోని రక్తపోటు, హదయ స్పందన రేటు నెమ్మదిస్తాయి. ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతుంది. ఉద్రేకపూరిత సంగీతం వింటే ఈ మార్పులు రివర్సులో జరుగుతాయి. పేషెంటు కండీషన్ను బట్టి థెరపిస్టు సంగీతాన్ని ఎంచుకుంటాడు. ఒక పాటను విన్నప్పుడు, పాడినప్పుడు మనసులో కలిగే స్పందనలను గుర్తించేలా థెరపిస్టులు ప్రేరేపిస్తారు. తద్వారా ఆరోగ్యం మెరుగుపడేందుకు అవసరమైన టెక్నిక్స్ను వాడతారు. ఆర్ట్ థెరపీ ఆదిమమానవ కాలం నుంచి మనిషిలో ఉండే క్రియేటివిటీ చిత్రాల రూపంలో బయటపడుతోంది. మనలోని సైకలాజికల్, ఎమోషనల్ ఆలోచనలకు ఒక రూపాన్నివ్వడంలో చిత్రలేఖనం ఉపయోగపడుతుంది. దీన్ని ఆధారంగా తీసుకొని ఆర్ట్ థెరపీ అభివృద్ధి చేశారు. ఇందులో చిత్రలేఖనం(పెయింటింగ్), రేఖాలేఖనం(డ్రాయింగ్), రంగులద్దడం(కలరింగ్), శిల్పాలు చెక్కడం(స్కల్ప్టింగ్)వంటివి మనిషిలో గూడుకట్టుకున్న భావాలను డీకోడ్ చేసేందుకు ఉపయోగపడతాయి. ఏ వయసు వారిలోనైనా ఆత్మస్థైర్యం పెంచడానికి, వ్యసనాలను దూరం చేయడానికి, ఒత్తిడి నివారణకు, యాంక్జైటీ, డిప్రెషన్ తగ్గించడానికి ఆర్ట్ థెరపీని వాడతారు. పైనవాటిలోలాగానే ఇందులో కూడా గ్రూప్ థెరపీ, వైయుక్తిక థెరపీ ఉంటాయి. మన అవసరాన్ని బట్టి థెరపిస్టు సరైన విధానం సూచిస్తాడు. ఆర్ట్ థెరపీ అంటే మనలో ఆర్టిస్టిక్ ట్యాలెంట్ ఉండాల్సిన పనిలేదు. ఇది మన అంతఃచేతనలోని ఆలోచనలను బయటపెట్టడానికి చేసే ప్రయత్నమని గుర్తించాలి. థెరపీలో క్లయింట్ ఫీలింగ్స్ను థెరపిస్టు గమనించి తగిన టెక్నిక్స్ నేర్పుతాడు. వివిధ రంగుల సమ్మిళితాలను చిత్రీకరించడం, చూడడం వంటివి మనిషి మనసును తేటపరుస్తుందని అమెరికన్ ఆర్ట్ థెరపీ అసోసియేషన్ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మానవతాత్మక థెరపీ ప్రపంచంలో జరిగే సంక్షోభ కారణాలను గుర్తించి నివారించడానికి యత్నించడమే మానవత్వం. సాటివారి బాధను అర్థం చేసుకున్నవాడే అసలైన మానవుడు అన్న సూక్తి ఆధారంగా హ్యూమనిస్టిక్ థెరపీ ఆరంభమైంది. మనం చూసే, వినే, అనుభవించే వాటిని మరింతగా అర్థం చేసుకోవడంలో ఈ థెరపీ ఎంతో పయ్రోజనకారి. ఆత్మనూన్యత సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధలు పడుతుండడం, ఇతరులతో సరైన సంబంధాలు లేకపోవడం, సున్నిత భావనలకు స్పందించకపోవడం వంటి పరిస్థితుల్లో ఈ థెరపీ ఉపయోగపడుతుంది. జీవితానికి అర్థం చెప్పడం ద్వారా మానవ జీవిత విలువను క్లయింట్కు థెరపిస్టు తెలియజేస్తాడు. జీవన విలువ తెలిసిన తర్వాత ఇతరులకు కీడు చేయాలనే ఆలోచన మనసుకు రాదు. అదేవిధంగా సర్వమానవ సౌభ్రాతృత్వ దృష్టి అలవడుతుంది. నెగిటివ్ జడ్జిమెంట్ చేసే గుణం తొలగిపోతుంది. ఇది ఎక్కువగా థెరపిస్టుకు, క్లయింట్కు మధ్య సంభాషణల ద్వారా జరుగుతుంది. క్లయింట్ ఆలోచనా విధానంలో లోపాలను సున్నితంగా ఎత్తి చూపడం, వాటిని సరైన దారికి మళ్లించడం, ఎదుటివారిని నొప్పించకుండా సంభాషించడాన్ని అలవాటు చేయడం ద్వారా క్లయింట్ను థెరపిస్టు సరైన మార్గంలోకి తీసుకుపోతాడు. దీనివల్ల క్లయింట్ క్రమంగా తనతో, ఇతరులతో సత్సంబంధాలు పెంచుకుంటాడు. డ్యాన్స్ థెరపీ పదంతో కలిసి కదం తొక్కినప్పుడు శరీరానికి నూతనోల్లాసం కలుగుతుంది. దీని ఆధారంగా డ్యాన్స్ థెరపీ ఆరంభమైంది. అందుకే ఆధునిక కాలంతో దీన్ని అనేక మొండి వ్యాధులకు స్వాంతనకోసం వాడుతున్నారు. నొప్పులు, ఒత్తిళ్లు, మానసిక చింత, కుంగుబాటు, కండరాల్లో బాధ, స్ట్రెస్, ఊబకాయం తదితర పలు ఇబ్బందులకు ఈ థెరపీ ఉపయోగపడుతుంది. కరోనా కాలంలో పిల్లల్లో పెరిగిన ఒత్తిడి తగ్గించడంలో దీని పాత్ర అమోఘమని అమెరికాకు చెందిన స్టెస్ర్ల్యాబ్ పేర్కొంది. సాంకేతికత పెరిగి శారీరక శ్రమ తగ్గుతూ వస్తున్న ఈ రోజుల్లో నృత్య సాధనతో శరీరానికి తగినంత వ్యాయామం కూడా లభిస్తుంది. డ్యాన్స్ థెరపీతో అటు మానసిక, ఇటు శారీరక ప్రయోజనాలు కలుగుతాయన్నది నిపుణుల మాట. నృత్యాల్లో అభినయించే ముద్రలు, స్టెప్పులు మూవ్మెంట్ థెరపీలో కీలక పాత్ర పోషిస్తాయి. దీన్ని క్రమపద్ధతిలో పాటించడం వల్ల శరీరంలో ఒక రిథమ్ పెరగడంతోపాటు ఆత్మవిశ్వాసం మెరుగుపడడం గమనించవచ్చు. చిన్నపిల్లలకు అలవాటు చేయడం వల్ల వారి మానసిక, శారీరకోన్నతికి తోడ్పాటు లభిస్తుంది. ఇందులో కూడా గ్రూప్, వైయుక్తక థెరపీలుంటాయి. మన అవసరాన్ని బట్టి కావాల్సిన విధానాన్ని థెరపిస్టు సూచిస్తాడు. యోగాలో జరిగినట్లే డ్యాన్స్ థెరపీలో శ్వాసపై ధ్యాస పెరుగుతుంది. దీర్ఘ శ్వాసలు తీసుకోవడం వల్ల వంట్లో ఉండే వేగస్ నరం చురుగ్గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని అతిపెద్ద నరం. దీని ప్రభావం పలు జీవ క్రియలపై ఉంటుంది. దీన్ని చురుగ్గా ఉంచడమంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే! (చదవండి: అదిరిపోయే బ్రైడల్ కలెక్షన్.. చూపు తిప్పుకోలేరు!) వినూత్న థెరపీలను ఎంచుకోవడమే కాదు, వాటిని ఆచరించే చిత్తశుద్ధి కూడా అవసరం. లేకుంటే ఎన్ని థెరపీలు చేపట్టినా ఏ ప్రయోజనం ఉండదు. అలాగే నకిలీలను ఎంచుకోకుండా సర్టిఫైడ్ థెరపిస్టుల వద్దకు వెళ్లడం మరువకూడదు. ఇప్పుడు ఇండియాలో పలు యూనివర్సిటీలు, కాలేజీలు ఇలాంటి థెరపీల్లో డిగ్రీలను ఆఫర్ చేస్తున్నాయి. అందువల్ల ఇలాంటి థెరపిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అవగాహన, అనుభవం ఉన్న థెరపిస్టు వద్ద తీసుకునే థెరపీ ఎప్పటికీ ప్రయోజనమే! – శాయి ప్రమోద్ (చదవండి: ఈ కాఫీ తాగితే బరువు తగ్గొచ్చు.. ఇంకా) -
పియానో బామ్మ కొత్త ఆల్బమ్.. 107లో సిక్సర్
వయసు ఏడుపదులు దాటిందంటే చాలామందికి అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టమే అవుతుంటుంది. కొంతమంది మాత్రం ఆరోగ్యవంతమైన జీవనశైలితో హుషారుగా కనిపిస్తారు. ఫ్రెంచి దేశానికి చెందిన కొలెట్ట్ మేజ్ వయసు సెంచరీ దాటి ఏడేళ్లు అయ్యింది. అయినా పియానోపై రాగాలు పలికించడమే గాక ఏకంగా కొత్త ఆల్బమ్ను విడుదలచేసింది. 107 ఏళ్ల వయసులో డెబ్భై ఏళ్లకు పైబడ్డ కొడుకుతో కలిసి ఈ ఆల్బమ్ను విడుదల చేసింది కొలెట్ట్. 1914 జూన్ 16 న ఫ్రెంచ్లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది కొలెట్ట్ మేజ్. నాలుగేళ్ల వయసులో ఒకరోజు కొలెట్ట్ వాళ్లింటికి పక్కింటి పిల్లలు వచ్చి పియానో వాయించడం ఆమె వినింది. అప్పటినుంచి ఆమెకు పియోను వాయించాలన్న ఆసక్తి కలిగింది. దీంతో చిన్నతనంలో బాగా సంగీతం, పియానో వాయిస్తూ అదే లోకంగా గడిపేది. మ్యూజిక్ కోర్సు చేస్తానని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ వద్దని వారించారు. అయినప్పటికీ కొలెట్ట్ ఎలాగైనా పియానో వాద్యకారిణి కావాలనుకుని..15 ఏళ్ల వయసులో మ్యూజిక్ స్కూలులో పియానో నేర్చుకుని 16వ ఏట పియానో టీచర్గా చేరింది. అప్పటి నుంచి అనేక ఏళ్లపాటు పియానో టీచర్గా పనిచేసింది. ఆ తర్వాత కూడా కొలెట్ట్ పియానో వదల్లేదు. ఆరో ఆల్బమ్.. షూమాన్, క్లాడ్ డెబస్సీ మ్యూజిక్ను ఇష్టపడే కొలెట్. 84 ఏళ్ల వయసులో తొలిసారి ఆల్బమ్ విడుదల చేసిన కొలెట్ట్. తాజాగా 107 ఏళ్ల వయసులో ఆరో ఆల్బమ్ను విడుదల చేసింది. గత పదిహేనేళ్లుగా రోజుకి ఎనిమిది గంటలు పియానో వాయించి వాటిని రికార్డు చేసి, సౌండ్ ఇంజినీర్ సాయంతో ఆల్బమ్లుగా మారుస్తోంది. ఇంతటి వృద్ధాప్యంలోనూ.. ఆమె ఎంతో యాక్టివ్గా ఉంటూ పియానో పై కీస్ ను ప్రెస్చేస్తూ సుమధుర సంగీతాన్ని అందిస్తోంది. పియానో వాయించడం ద్వారా తనని తాను బిజీగా ఉంచుకుంటుంది. సలాడ్ కన్నా ఆత్మీయ ఆహారం ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వాద్యకారిణిగా పేరొందిన కొలెట్ట్ మేజ్... సలాడ్ తినడానికి పడే కష్టం కంటే పియానోను వాయించడం తేలిక అని చెబుతున్నారు. ‘‘సంగీతం అనేది చాలా ప్రభావ వంతమైన, భావోద్వేగాలతో కూడుకున్న మాధ్యమం. ప్రకృతి, భావోద్వేగాలు, ప్రేమ, కలలు, ఆశలు వంటి వాటన్నింటికి సంగీతమే ఆత్మీయ ఆహారంగా పనిచేస్తుంది. అందుకే నేను మ్యూజిక్ను కంపోజ్ చేయడానికి ఇష్టపడతాను’’ అని చెబుతోంది నవ్వుతూ. -
జేమ్స్ బాండ్ థీమ్ మ్యూజిక్ వాయిస్తున్న ముంబై పోలీసులు
-
సంగీతమే సమతామంత్రం
సంగీతం అనాదికళ. పశుపక్ష్యాదుల ధ్వనులను మనుషులు అనుకరించడంతో సంగీతం పుట్టిందంటారు. భాష కంటే ముందే సంగీతం పుట్టి ఉంటుంది. తన బిడ్డను నిద్రపుచ్చడానికి ఏ ఆదిమ మాతృమూర్తి గళం నుంచో ప్రారంభ స్వరఝరి ప్రవహించి ఉంటుంది. వేదకాలం నాటికి సామగానంతో సంగీతానికి భాషతో చెలిమి కుదిరింది. ప్రపంచంలో పుట్టుకొచ్చిన ప్రతి భాషనూ సంగీతం అక్కున చేర్చుకుంది. అలా పాట పుట్టింది. పనికి పాట తోడైంది. పాట మనిషికి తన బతుకు పయనంలో ఊతమైంది, ఊరటైంది, ఊపిరైంది. ప్రపంచం నలుమూలలా విస్తరించిన సంగీతంలో ఎన్నో శైలీభేదాలు, వాటికి అనుగుణంగా సంగీత సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఎన్ని సంప్రదాయాలు, ఎన్ని శైలీభేదాలున్నా సంగీతం ఒక్కటే! అందులో ఉండేవి ఆ సప్తస్వరాలే! సంగీతం విశ్వజనీన భాష! సంగీతం మనసును తేలికపరుస్తుంది. సంగీతం జీవనోత్సాహాన్ని నింపుతుంది. సంగీతం మనుషుల మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః’ అని ఆర్యోక్తి. శ్రావ్యమైన సంగీతానికి మనుషులే కాదు, పశుపక్ష్యాదులూ స్పందిస్తాయి. ఈ సంగతిని ఆధునిక శాస్త్ర పరిశోధనలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. సంగీతాన్ని ఇష్టపడని వారు లోకంలో బహు అరుదు. సంగీతానికి స్పందించని మనిషి అత్యంత ప్రమాదకారి అని జ్యోతిష గ్రంథం ‘ఉత్తర కాలామృతం’ చెబుతోంది. మహాక్రూరులుగా పేరుమోసిన రాక్షసులు సైతం సంగీతాన్ని ఆస్వాదించిన ఉదంతాలు పురాణాల్లో ఉన్నాయి. ఆ లెక్కన సంగీతానికి స్పందించని వాళ్లు, సంగీతాన్ని ద్వేషించేవాళ్లు ఎంతటి కర్కశులో. సంగీతాన్ని ద్వేషించేవాళ్లంతా ఏకమై, జట్టుకడితే వాళ్లనే తాలిబన్లు అంటారు. సంగీతాన్ని ఏవగించుకునేవాళ్లు, పాటను పంజరంలో బంధించాలనుకునేవాళ్లు, గాలిలో స్వేచ్ఛగా ఎగిరే పాటను వేటాడాలనుకునేవాళ్లు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాళ్లు తాలిబన్ సోదరులే! తాలిబన్లకు తాతల నాటి నాజీలు సంగీతాన్ని నిషేధించలేదు గాని, సంగీతాన్ని తమ హింసాకాండకు పక్కవాద్యంలా వాడుకున్నారు. నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో జరిగిన ఘాతుకాల వెనుక ఆ క్యాంపుల్లో వినిపించిన సంగీతం పాత్ర గురించి తెలుసుకున్నాక విచలితుడైన ఫ్రెంచి సంగీతకారుడు, రచయిత పాస్కల్ కిగ్నార్డ్ తన సంగీత కార్యకలాపాలన్నింటినీ విరమించుకుని, ‘హేట్రెడ్ ఆఫ్ మ్యూజిక్’ అనే పుస్తకం రాశాడు. చరిత్రలోని వివిధకాలాల్లో సంగీతంలో చోటు చేసుకున్న పరిణామాలపై అధ్యయనం జరిపి, మనుషుల ఆలోచనలపైనా భావోద్వేగాలపైనా సంగీతం చూపగలిగే ప్రభావంపై విస్తృత పరిశోధన చేశాడాయన. సంగీతాన్ని ఆస్వాదించలేకపోవడం మానసిక రుగ్మత. ‘మ్యూజికల్ ఎన్హెడోనియా’ అనే వ్యాధికి లోనైనవారు సంగీతాన్ని ఆస్వాదించే శక్తిని కోల్పోతారు. ఇంకొందరికి ‘మ్యూజికల్ హాల్యూసినేషన్స్’– అంటే సంగీతభ్రాంతులు కలుగుతుంటాయి. చుట్టుపక్కల పరిసరాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నా, వీరికి చెవులో నిరంతరం సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ఏవేవో పాటలు, వాద్యగోష్ఠులు వినిపిస్తూ ఉంటాయి. దీనినే ‘మ్యూజికల్ ఇయర్ సిండ్రోమ్’ అంటారు. ఇవన్నీ నాడీవ్యవస్థ లోపాల వల్ల తలెత్తే మానసిక వ్యాధులు. సంగీతం పట్ల నిరాసక్తత, నిర్లిప్తత ప్రమాదకరంకాని మానసిక రుగ్మత. సంగీతం పట్ల నిరాసక్తత కలిగిన వారు జనాభాలో ఐదుశాతానికి మించి ఉండరని అంచనా. సంగీతం పట్ల ద్వేషం ఎలాంటి వ్యాధి అవుతుందో, దానికి నివారణ మార్గమేమిటో, దానిని నయం చేయగలిగిన చికిత్సా పద్ధతులేమిటో నిపుణులే చెప్పాలి. అసలు సంగీతమే చాలా రోగాలను నయం చేస్తుందంటారు. సంగీతంతో వ్యాధులను నయం చేసే ‘మ్యూజిక్ థెరపీ’ చికిత్సలు చేస్తున్నారు. సంగీతం సర్వరోగనివారిణి కాకపోయినా, చాలావరకు మానసిక రుగ్మతలను, మానసిక అలజడుల కారణంగా తలెత్తే శారీరక వ్యాధులను నయం చేయగలదని ఆధునిక నిపుణులు కూడా చెబుతున్నారు. మన భారతీయ సంగీతకారుల్లో ముత్తుస్వామి దీక్షితార్ తొలిసారిగా ఇలా సంగీతంతో వ్యాధిని నయం చేసినట్లు చెబుతారు. కడుపునొప్పితో విలవిలలాడుతున్న శిష్యుడిని చూసి ఆయన ఆశువుగా ‘తారాపతే బృహస్పతే’ అంటూ గురుగ్రహాన్ని స్తుతిస్తూ కీర్తనను గానం చేశారని, ఆయన గానానికి శిష్యుడు స్వస్థత పొందాడని ప్రతీతి. ఇటీవల మ్యూజిక్ థెరపీపై శాస్త్రీయ పద్ధతుల్లో ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. సంగీతం మానసిక అలజడిని దూరం చేస్తుందని, దిగులు గుబులు వంటి ప్రతికూల భావనలను దూరం చేస్తుందని, ఉత్సాహాన్ని నింపి కార్యోన్ముఖులను చేస్తుందని, రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుందని పరిశోధనలు తేల్చాయి. సంగీత ప్రపంచంలో ఇదివరకటి చాదస్తాలన్నీ ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. సంగీతంలోని భిన్న సంప్రదాయాలు ‘ఫ్యూజన్’ ప్రయోగాలతో పెనవేసుకుంటున్నాయి. సంగీతం తన శాస్త్రీయ పునాదులను పటిష్ఠం చేసుకుంటూనే, మరింతగా విస్తరిస్తోంది. ముక్కపచ్చలారని చిన్నారులు సంగీత ప్రపంచంలో సరికొత్త సంచలనాలను సృష్టిస్తున్నారు. ‘ఇండియన్ ఐడల్’, ‘సా రె గా మా పా’, ‘ది వాయిస్ ఆఫ్ ఇండియా’ వంటి టీవీ మ్యూజిక్ షోలే ఇందుకు నిదర్శనం. సంగీతం మరో పదికాలాల పాటు చల్లగా బతుకుతుందనడానికి కొత్తతరం గాయనీగాయకుల శ్రద్ధాసక్తులే తార్కాణం. ఎన్నో సంప్రదాయ కళలు కనుమరుగైపోతున్న తరుణంలో సంగీతం మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా జవసత్త్వాలను పుంజుకోవడం విశేషం. ఈర్షా్య ద్వేషాల సంకుచిత ప్రపంచంలో మనుషుల మధ్య మమతానురాగాలను పదిలపరచడానికి సంగీతమే సమతామంత్రం. -
indian idol season 12: విజేత ఎవరు?
తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ సంగీత అభిమానులకు ఉత్కంఠనిస్తోంది. ఇండియన్ ఐడెల్ సీజన్ 12 టాప్ 6లో ఉన్న షణ్ముఖప్రియ ఆగస్టు 15న జరిగే ఫైనల్స్కు చేరినట్టే లెక్క. షో నిర్వాహకులు ఎలిమినేషన్స్ ఆపేసి ముగ్గురు గాయనులు, ముగ్గురు గాయకులతో ఫైనల్స్కు వెళ్లనున్నారని సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటివరకూ ఇండియన్ ఐడెల్ను ముగ్గురు స్త్రీలు గెలిచారు. ఈసారి ఫైనల్స్కు వెళుతున్న ముగ్గురిలో ఒకరు నాలుగోసారి టైటిల్ గెలుస్తారా? ఇంటర్ పాసైన షణ్ముఖ ప్రియ సంగీత ప్రియుల రివార్డులను డిగ్రీలుగా లెక్క వేస్తే చాలా డిగ్రీలు పాసైనట్టే లెక్క. వైజాగ్ మధురవాడలో నివాసం ఉండే తల్లిదండ్రులు శ్రీనివాస కుమార్, రత్నమాలల ఏకైక కూతురు షణ్ముఖ ప్రియ బహు భాషలలో చిన్నప్పటి నుంచి పాడటం ప్రాక్టీసు చేసింది. టీవీ షోస్లో పాల్గొని లెక్కకు మించి ప్రైజులు కొట్టింది. కాని అవన్నీ ఒకెత్తు. ఇప్పుడు ఇండియన్ ఐడెల్లో పాల్గొనడం ఒకెత్తు. ఒక్కసారి ఇండియన్ ఐడెల్ వేదికనెక్కితే దాదాపుగా భారతీయులు నివసించే అన్నీ దేశాలకు ఆ గాయకులు తెలిసి పోతారు. అంత పెద్ద వేదిక అది. భారీ కాంపిటీషన్ను ఎదుర్కొని పోటీలోకొచ్చిన షణ్ముఖ ప్రియ, ఆమెతో పాటు టాప్ సిక్స్లో నిలిచిన మరో ఇద్దరు గాయనులు అరుణిమ, సాయిలీ మేల్ సింగర్స్ పవన్దీప్, మహమ్మద్ దానిష్, నిహాల్ తౌరోకు గట్టి పోటీ ఇస్తున్నారు. సవాళ్లను ఎదుర్కొన్న షో నవంబర్ 28, 2020న సోనీ టీవీలో ఇండియన్ ఐడెల్ సీజన్ 12 అనేక వడపోతల తర్వాత మిగిలిన 15 మంది కంటెస్టెంట్లతో మొదలైంది. సాధారణంగా ఆరు నెలల్లో ముగిసే ఈ షో లాక్డౌన్ కారణాల రీత్యా, బయట మరో వినోదం లేకపోవడం వల్ల మరో మూడు నెలలు పొడిగింప బడింది. మధ్యలో గాయనీ గాయకులు కరోనా బారిన పడినా, షూటింగ్ లొకేషన్ ‘డమన్’ (గోవా) కు షిఫ్ట్ అవడం వల్ల జడ్జిలు మారినా ఒక్క వారం కూడా నాగా లేకుండా కొనసాగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన గాయనీ గాయకుల్లో తెలుగు నుంచి శిరీష భాగవతుల, షణ్ముఖ ప్రియ గట్టి పోటీని ఇచ్చారు. శిరీష 11వ కంటెస్టెంట్గా ఎలిమినేట్ కాగా షణ్ముఖప్రియ టాప్ 6లో చేరింది. యోడలింగ్ క్వీన్ యోడలింగ్ చేయడంలో గాయకుడు కిశోర్ కుమార్ దిట్ట. యోడలింగ్ను గాయనులు చేయరు. అందుకు గొంతు అంతగా వీలు కాదు. కాని షణ్ముఖప్రియ యోడలింగ్లో మహామహులు దిగ్భ్రమ చెందే ప్రతిభను వ్యక్త పరిచింది. యోడలింగ్ చేస్తూ కిశోర్ కుమార్ పాడిన హిట్ సాంగ్ ‘మై హూ ఝుమ్ఝుమ్ ఝుమ్రు’ పాటను షణ్ముఖప్రియ అద్భుతంగా పాడి అందరినీ ఆకట్టుకుంది. షోకు గెస్ట్లుగా హాజరైన ఏ.ఆర్. రహమాన్, ఉదిత్ నారాయణ్, ఆశా భోంస్లే లాంటి పెద్దలు ఎందరో షణ్ముఖప్రియను అభినందించారు. స్టేజ్ మీదే సినిమా ఆఫర్లు కూడా ఇచ్చారు. అయితే అంతమాత్రాన ఆమెకు పోటీ లేదని కాదు. ఉంది. పవన్దీప్ మహమ్మద్ దానిష్ నిహాల్ తౌరో బెంగాల్, మహారాష్ట్రల పోటీ షణ్ముఖ ప్రియకు బెంగాల్ గాయని అరుణిమ, ముంబై గాయని సాయిలీ సమవుజ్జీలుగా ఉన్నారు. ముఖ్యంగా అరుణిమ దాదాపు లతా వారసురాలిగా పాడుతూ ఓట్లు పొందుతోంది. మరోవైపు సాయిలీ స్పీడ్, స్లో పాటలు కూడా ప్రతిభావంతంగా పాడుతూ అభిమానులను సంపాదించుకుంది. ముగ్గురూ ముగ్గురేగా వేదికపై సవాలు విసురుతుండటంతో జడ్జీలు ఎవరిని ఎలిమినేట్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మన షణ్ముఖ ప్రియకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగువారి నుంచి ఓట్ల మద్దతు రావాల్సి ఉంది. 12 గంటల పాటు ఫైనల్స్ ఆగస్టు 15న కనీవినీ ఎరగని స్థాయిలో 12 గంటల పాటు ఇండియన్ ఐడెల్ ఫైనల్స్ జరగనున్నాయి. అతిరథ మహారథులు ఈ ఫైనల్స్కు హాజరయ్యే అవకాశం ఉంది. ఆ వేదిక మీదనే ఈ ఆరు మంది ఫైనలిస్ట్లు ప్రతిభ చూపుతారు. లోకమంతా ఈ వేడుక వీక్షించనుంది. విజేతలకు 25 లక్షల నగదు బహుమతి ఉంటుంది. తెలుగు నుంచి గతంలో శ్రీరామచంద్ర ఈ టైటిల్ మొదటగా సాధించి తెలుగు ప్రతిభను చాటాడు. షణ్ముఖప్రియది తర్వాతి పేరు కావాలని ఆశిద్దాం. మగవారూ తక్కువ కాదు ఈసారి ఇండియన్ ఐడెల్ కిరీటాన్ని తన్నుకుపోతాడని అందరూ ఊహిస్తున్న పేరు ఉత్తరాఖండ్కు చెందిన పవన్ దీప్ది. ఇతను పాడటమే కాదు సకల వాద్యాలు వాయిస్తూ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇతనికి ముంబై సెలబ్రిటీలందరూ ఫిదా అయిపోయారు. ఉత్తరాఖండ్ ఆహార్యంలో వినమ్రంగా కనిపించే పవన్ దీప్ పాటలో సోల్ ఉంటుంది. ఆ సోల్ అతనికి కిరీటం తెచ్చి పెట్టవచ్చని ఒక అంచనా. ఇతను కాకుండా ముజఫర్ నగర్కు చెందిన మహమ్మద్ దానిష్, మంగళూరుకు చెందిన నిహాల్ తోరో గట్టి ప్రతిభను చూపుతున్నారు. -
సంగీత ప్రియులను అలరిస్తున్న కమల్ హాసన్కు సభ్యత్వం
బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్ హాసన్కు సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. ఆయన 46 ఏళ్ల సినీ పయనంలో ఎన్నో జనరంజకమైన పాటలను ఆలపిస్తూ సంగీత ప్రియులను అలరిస్తున్నారు. అలాంటి కమల్ హాసన్కు సినీ సంగీత కళాకారుల సంఘం గౌరవ సభ్యత్వాన్ని అందించింది. ఈ సంఘం అధ్యక్షుడు దీనా మంగళవారం స్థానిక ఆల్వార్ పేటలోని కమల్ కార్యాలయానికి వెళ్లి ఆయనకు సినీ సంగీత కళాకారుల సంఘంలో గౌరవ సభ్యత్వానికి సంబంధించిన గుర్తింపుకార్డును అందజేశారు. ఈ సందర్భంగా దీనాతో పాటు సినీ సంగీత కళాకారుల సంఘం కార్యదర్శి జోనా భగత్కుమార్ ఎస్.డి, ఆ సంఘం ట్రస్ట్ చైర్మన్ ఎస్.ఎ.రాజ్ కుమార్ కమల్హాసన్ కలిశారు. -
సంగీతంతో సమరభేరి.. అయినా సరే, ‘తగ్గేదే లేదు’
సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటారు... అదేమిటోగానీ సెర్బియాలోని ఆల్–ఫిమేల్ రోమా బ్యాండ్ తమ సంగీతంతో శతాబ్దాలుగా తిష్ట వేసిన పురుషాధిక్య భావజాలంపై సమరభేరీ మోగిస్తోంది. బాల్య వివాహాలను నుంచి గృహహింస వరకు స్త్రీలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలను పాటలుగా పాడి వినిపిస్తుంది. కేవలం సమస్య గురించి మాట్లాడడమే కాదు వాటికి పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తోంది.ఆల్–ఫిమేల్ రోమా బ్యాండ్ది నల్లేరుపై నడకేమీ కాదు. ‘పెళ్లివిందు దగ్గర బ్యాండ్ వాయించండి. మీ వల్ల ఒరిగేదేమీ ఉండదు’ అని వెక్కిరించిన వాళ్లు కొందరైతే ‘మా పిల్లల పెళ్లి గురించి మాట్లాడడానికి మీరెవరు!’ అంటూ భౌతికదాడులు చేసినవారు ఇంకొందరు. అయినా సరే, ‘తగ్గేదే లేదు’ అంటు ముందుకు సాగుతున్నారు. బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దీన్ని అరికట్టడానికి సెర్బియన్ ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినా దాని వల్ల పెద్దగా ఫలితం రాలేదు. అయితే రోమా బ్యాండ్ ప్రచారం వల్ల తరతరాల సంప్రదాయ ఆలోచనల్లో గణనీయమైన మార్పు వస్తుంది. ‘మీకంటూ ఒక సొంతవ్యక్తిత్వం ఉంది. భవిష్యత్ను నిర్మాణం చేసుకునే హక్కు పూర్తిగా మీ మీదే ఉంది’లాంటి మాటలు వినేవారికి మొదట ఆశ్చర్యంగా అనిపించేవి. ఆ తరువాత వాటి విలువను గ్రహించడం మొదలైంది’ అంటోంది 24 సంవత్సరాల సిల్వియా సినాని అనే సభ్యురాలు. ఫిమేల్ బ్యాండ్ ఇచ్చిన చైతన్యంతో చాలామంది బాల్యవివాహాలకు దూరంగా ఉన్నారు. చదువులపై దృష్టి కేంద్రీకరించారు. చిత్రమేమిటంటే ‘రోమా బ్యాండ్’లోని కొందరు సభ్యులకు కూడా తెలిసీ తెలియని వయసులో బాల్యవివాహాలు జరిగాయి. వారు తమ అనుభవాలను, ఎదుర్కొన్న కష్టాలను చెబుతుంటే వినేవారికి కంటతడి తప్పదు. అనుభవాన్ని మించిన జ్ఞానం ఏముంటుంది! ర్యాప్ అండ్ ట్రెడిషనల్ రోమా–ఫోక్ బీట్ మిళితం చేసి శ్రోతలను ఆకట్టుకుంటున్న ఈ ‘ఆల్–ఫిమేల్ బ్యాండ్’ సభ్యులు ఒకప్పుడు స్థానిక ‘బాయ్స్ బ్యాండ్’లో పనిచేసిన వాళ్లే. అక్కడ రకరకాలుగా అవమానాలు ఎదుర్కొన్నవారే. ‘ఎవరి కోసమో ఎందుకు మన కోసం మనం’ అంటూ ఆల్–ఫిమేల్ బ్యాండ్ మొదలైంది. అప్పుడు కేవలం వినోదం కోసం అయితే ఇప్పుడు ‘స్త్రీ చైతన్యం’ ప్రధాన ఎజెండాగా పనిచేస్తోంది. ఒకప్పడు సెర్బియాకే పరిమితమైన ఈ బ్యాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆదర్శం అయింది. -
భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ
ఆమె భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ... హెచ్సిఎల్ కంపెనీ సిఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. విద్యాజ్ఞాన్ చైర్పర్సన్... ఆమె రోష్నీ నాడార్ మల్హోత్రా... శివ్ నాడార్ ఏకైక కుమార్తె. భారతదేశంలో విజయాలు సాధించిన మహిళల గురించి మాట్లాడుకునేటప్పుడు రోష్నీ నాడార్ మల్హోత్రా గురించి తప్పక చెప్పాలి. కోవిడ్ – 19 మహమ్మారి సమయంలో సమర్థమైన నాయకత్వ లక్షణాలు చూపించిన 25 మంది పారిశ్రామిక వేత్తలలో రోష్నీ పేరు కూడా ఉంది. 38 సంవత్సరాల రోష్నీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ అయ్యారు. అంతకు ముందు భారతీయ ఐటీ కంపెనీని నడిపించిన మొట్టమొదటి మహిళగా మరో విజయం సాధించిన గుర్తింపు పొందారు. చిన్నతనంలోనే... సాంకేతిక దిగ్గజం, హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అయిన శివ్ నాడార్కు ఏకైక సంతానంగా ఢిల్లీలో 1982లో జన్మించిన రోష్నీ వసంత్ వ్యాలీ పాఠశాలలో చదువుకున్నారు. నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ, కెలాగ్స్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబిఏ చేశారు. చదువు పూర్తి కాగానే బ్రిటన్లో న్యూస్ ప్రొడ్యూసర్గా కెరీర్ ప్రారంభించారు. 27 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి ప్రారంభించిన వ్యాపారంలో భాగస్వాములయ్యారు. హెచ్సిఎల్లో చేరిన సంవత్సరానికే ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మాత్రమే కాకుండా కంపెనీ సిఈవో బాధ్యతలు కూడా చేపట్టారు. విచిత్రమేమిటంటే, ఆమెకు సాంకేతిక రంగం మీద అస్సలు ఆసక్తి లేదు. వార్తా మాధ్యమం నుంచి ఆమె ప్రయాణం సాంకేతిక రంగం వైపుకి మళ్లింది. తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలంటే, పని మీద పూర్తిగా దృష్టి పెట్టాలని అర్థం చేసుకుని, తన రంగాన్ని అలా మార్చుకున్నారు. తక్షణం భారతదేశానికి తిరిగివచ్చి తన ఫ్యామిలీ బిజినెస్ మీద పనిచేయటం ప్రారంభించారు. సాంకేతిక రంగం మీద అవగాహన లేకపోయినప్పటికీ, రోష్నీ చూపిన శ్రద్ధ, అంకితభావం కారణంగా ఆ కంపెనీ ఆర్థికంగా, పరిపాలనా పరంగా బాగా ఎదిగింది. తండ్రి శివ్ నాడార్తో రోష్నీ నాడార్ మల్హోత్రా సంగీత సేవా కార్యక్రమాలలో.. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు, యోగా మీద ఆసక్తి ఎక్కువ. హెచ్సిఎల్లో చేరటానికి ముందు రోష్నీ ‘శివ నాడార్ ఫౌండేషన్’లో ట్రస్టీగా సేవలు అందించారు. ఈ సంస్థ లాభాపేక్ష లేకుండా ‘శ్రీశివసుబ్రమణ్య నాడార్ ఇంజినీరింగ్ కాలేజీ’ ని చెన్నైలో నడుపుతోంది. విద్యాజ్ఞాన్ సంస్థకు అధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు రోష్నీ. ఈ సంస్థలో.. ఆర్థికంగా వెనుకబడినవారికి, ఉత్తరప్రదేశ్లోని గ్రామీణ ప్రజలకు మాత్రమే ప్రవేశం. గ్రామీణ భారతం నుంచి నాయకులను తయారు చేయాలనేదే ఆమె కోరిక. వన్యప్రాణి పరిరక్షణ రోష్నీ నాడార్కు వన్యప్రాణి సంరక్షణ అంటే చాలా ఇష్టం. వాటిని సంరక్షించటంతోపాటు పరిరక్షించటమంటే మరీ ఇష్టం. 2018లో హ్యాబిటేట్స్ ట్రస్ట్ను స్థాపించి, ఈ సంస్థ ద్వారా భారతదేశానికి చెందిన ప్రాణులను పరిరక్షిస్తుంటారు. వివిధ వన్యప్రాణి సంస్థలతో కలిసి వన్యప్రాణి సమతుల్యతకు కృషి చేస్తున్నారు. హోండా కంపెనీలో పనిచేస్తున్న శిఖర్ మల్హోత్రాను 2009లో వివాహమాడారు. వివాహానంతరం హెచ్సిఎల్లో చేరి, ప్రస్తుతం ‘హెచ్సిఎల్ హెల్త్కేర్’లో వైస్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం అర్మాన్, జహాన్. ఆమె సాధించిన విజయాలకు అనేక అవార్డులు అందుకున్నారు. -
బాబ్రే.. నీ పెయింటింగ్స్ అద్భుతం!
అర్ధ శతాబ్దం పాటు.. అమెరికా మేధావుల్ని అదిలించి, కదిలించిన జానపదబాణి.. వాణి బాబ్ డిలాన్. సంగీత ప్రపంచాన్ని ఏలిన ఈ అమెరికా దిగ్గజం, నోబెల్ బహుమతి పొందిన తొలి పాటల రచయితగా రికార్డు సృష్టించిన బాబ్ డిలాన్ అద్భుతమైన చిత్రకారుడు కూడా. ఆశ్చర్యపోవడం అందరి వంతు. 2007లో ఒకసారి జర్మనీలో ‘ద డ్రాన్ బ్లాంక్ సిరీస్’ పేరిట బాబ్ డిలాన్ పెయింటింగ్స్ను ప్రదర్శిచడంతో ఆయనలోని మరో కళాత్మక కోణం అబ్బురపరిచింది. ఆ పెయింటింగ్స్ను చూసిన వారంతా..‘‘బాబ్ డిలాన్ పాటలు ఎంత మధురమో.. ఆయన చిత్రాలూ అంతే రమణీయం’ అని అభినందించారు. ఆతరువాత లండన్లోని నేషనల్ పోర్టరేట్, డెన్మార్క్లోని ద నేషనల్ గ్యాలరీ ఆఫ్ డెన్మార్క్, మిలాన్, షాంఘైలలో డిలాన్ పెయింటింగ్లను ప్రదర్శించారు. ఇప్పటిదాకా ఎవ్వరూ చూడని బాబ్ పెయింటింగ్స్ను తొలిసారి అమెరికాలో ప్రదర్శించనున్నారు. తన అరవైఏళ్లు్లలో డిలాన్ వేసిన చిత్రాలు అధికారికంగా ప్రదర్శనకు రానున్నాయి. ఫ్లోరిడాలోని మియామి నగరంలో ‘ప్యాట్రీషియా అండ్ ఫిలిప్ ఫ్రాస్ట్ ఆర్ట్ మ్యూజియం’ ఇందుకు వేదిక కానుంది. ఈ ఏడాది నవంబర్ 30న ‘రెట్రోస్పెక్ట్రమ్’ పేరిట ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో బాబ్ డిలాన్ వేసిన 120కి పైగా పెయింటింగ్స్, డ్రాయింగ్స్, శిల్పాలను ఉంచుతారు. అయితే ‘రెట్రోస్పెక్ట్రమ్’ ఎగ్జిబిషన్ను 2019లో చైనాలోని షాంఘైలోనూ ఏర్పాటు చేశారు. దాన్నే ఇప్పుడు అమెరికాలో పెట్టబోతున్నారు. ‘ఇప్పటిదాక ఎవ్వరూ చూడని కొత్త వస్తువులను ప్రదర్శించడం అనే సరికొత్త వెర్షన్తో ఈసారి రెట్రోస్పెక్ట్రమ్ను ఏర్పాటు చేయనున్నాం. దీనిలో వివిధ రకాల కొత్త బ్రాండ్లు, వాటి సిరీస్లను ‘అమెరికన్ పాస్టోరల్స్’ పేరుతో ప్రదర్శిస్తారు. ఇది 2021 నవంబర్ 30న మొదలై 2022 ఏప్రిల్ 17 వరకు కొనసాగుతుంది. బాబ్ డిలాన్.. అమెరికాలోని వివిధ ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆయన చూసిన ప్రాంతాలు, ఎదురైన సన్నివేశాలు, సంఘటనలు పెయింటింగ్స్గా ప్రతిబింబిస్తాయ’ని ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెప్పారు. ఈ ఏడాది మే 24న బాబ్ డిలాన్ 80వ జయంతి. ఆ సందర్భంగా ఆయన పెయింటింగ్స్ ప్రదర్శనకు రావడం విశేషం. డిలాన్ 80వ పుట్టినరోజును పురస్కరించుకుని బీబీసీ రేడియో–4, ఇంకా అమెరికాలో వివిధ రేడియోల్లో ఆయనపై ప్రత్యేక కార్యక్రామలను ప్రసారం చేయనున్నాయి. – పి. విజయా దిలీప్ చదవండి: ద బాబ్రే... నిత్య యవ్వనం నీ స్వరం! -
మనవరాలికి సంగీత పాఠాలు
ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా తన మనవరాలికి సంగీత పాఠాలు నేర్పిస్తున్నారు. ఇళయరాజా తనయుడు యువన్శంకర్ రాజా కుమార్తె జియా యువన్ ఇటీవల తాత దగ్గర పియానో నేర్చుకుంటున్న వీడియో చాలామందిని ఆకట్టుకుంది. పియానోతో సరిగమలు ఎలా పలికించాలో మనవరాలికి నేర్పుతున్న దృశ్యాన్ని వీడియో తీసి, సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు యువన్. ఈ వీడియో చూసిన శ్రుతీహాసన్ , విజయ్ ఏసుదాసు, శ్వేతాపండిట్ వంటి వారు ‘చాలా బాగుంది’ అంటూ జియాని అభినందిస్తూ కామెంట్లు పెట్టారు. కాగా ఇళయరాజా ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆ సంగతలా ఉంచితే.. ఇళయరాజా వారసులుగా కుమారులు కస్తూరి రాజా, యువన్ శంకర్ రాజా, కుమార్తె భవతారిణి కూడా సంగీతప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ ముగ్గురూ సంగీతదర్శకులుగానే కాదు పాటలు కూడా పాడతారు. మరి.. ఇప్పుడు మనవరాలికి కూడా స్వరాలు నేర్పిస్తున్నారంటే ఇళయరాజా కుటుంబం నుంచి మరో మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ వచ్చే అవకాశం ఉందని ఊహించవచ్చు. -
నయా రహమానియా
-
దివికేగిన లలిత గానం; కుమారి లలిత
జంటకవుల సాహిత్యం, సంగీతం చెవికి వినసొంపుగా ఉంటాయి. తిరుపతి వేంకటకవుల జంట అవధానం గురించి తెలిసిందే. లలిత, హరిప్రియల జంట కూడా అదేవిధంగా సంగీత ప్రియులను అలరించింది. నిజానికి వీరు కన్నడ దేశస్థులు. కాని హైదరాబాద్లోనే పుట్టి పెరగటం వల్ల, హైదరాబాద్ సిస్టర్స్గా పేరు సంపాదించుకున్నారు. కుమారి లలిత, శ్రీమతి హరిప్రియ.. ఈ జంటలో కుమారి లలిత హైదరాబాద్లోని స్వగృహంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు అక్షర నివాళిగా... హైదరాబాద్ సిస్టర్స్ పేరిట తమ అమృత గానంతో సంగీత ప్రపంచాన్ని ఓలలాడించారు లలిత, హరిప్రియ. సోదరీమణులు జంటగా గానం చేయటం అందరినీ ఆకర్షించింది. లలిత అక్టోబర్ 6, 1950 లో బి. సరోజ, బి. శివచంద్ర దంపతులకు జన్మించారు. తల్లిగారి దగ్గరే సంగీత శిక్షణ ప్రారంభించి, ఆ తరవాత టి. జి పద్మనాభన్ దగ్గర సంగీత శిక్షణ అందుకున్నారు. తొమ్మిదో ఏట హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో మొట్టమొదటి సంగీత కచేరీ చేశారు. వీరు అలత్తూరు సోదరుల సంగీత కచేరీలు విని ప్రభావితులయ్యారు. వీరికి సంగీత జ్ఞానం కంటె, సంగీతం విలువలు నేర్పారు గురువుగారు. ‘‘మా గురువు గారైన టి. జి. పద్మనాభన్ వల్ల మాకు సంగీతం మీద శ్రద్ధ కలిగింది. సంగీతాన్ని స్వయంగా అధ్యయనం చేయటం అలవాటు చేసుకున్నాం. ప్రతి కచేరీనీ మేం చాలెంజింగ్గా తీసుకుని, శిక్షణ తీసుకునేవాళ్లం’’ అనేవారు ఈ సోదరీమణులు. ఎన్. ఎస్. శ్రీనివాసన్ అనే ఫ్లూట్ విద్వాంసులు వీరిరువురికీ అపురూపమైన, అరుదైన త్యాగరాజ కీర్తనలు, తమిళ సంప్రదాయ కీర్తనలు నేర్పారు. వీటిని వీరు తమిళనాడులో పాడి వారి ప్రశంసలు అందుకున్నారు. రాగాలాపన, స్వరకల్పనలలో వారికి వారే సాటి అనిపించుకున్నారు. తమిళనాడులోని కృష్ణగానసభలో ప్రతి సంవత్సరం వీరి కచేరీ తప్పనిసరిగా ఉండేది. తమిళనాట తెలుగువారు అవార్డులు అందుకోవటం అందనిద్రాక్షగానే చెప్పుకుంటారు. అయితే ఈ సోదరీమణులు తమ అమృతగానంతో కృష్ణగాన సభ వారి ‘సంగీత చూడామణి’ బిరుదు అందుకున్నారు. లలిత, హరిప్రియ జంటకు కాంభోజి, ఖరహరప్రియ రాగాలంటే ఇష్టం. ఆ రాగాలలో ఎంతోసేపు స్వరప్రస్తారం చేసేవారు. కీర్తనను నేర్చుకున్నది నేర్చుకున్నట్లుగా ఇంపుగా పాడేవారు. వీరికి సంగీత జ్ఞానం సహజంగానే అలవడింది. వీరి కుటుంబంలోని ఎనిమిదిమంది సంతానమూ సంగీతజ్ఞులే. లలిత, హరిప్రియ సోదరీమణులకు సంగీతం అలవోకగా, అప్రయత్నంగానే అలవడింది. కచేరీలకే జీవితం అంకితం చేశారు. ఎంతోమంది శిష్యుల్ని తయారుచేశారు. శ్రద్ధ ఉన్నవారిని ఇంటికి పిలిపించి, దగ్గరుండి తర్ఫీదు ఇచ్చేవారు. ఇటువంటి వారు సంగీత ప్రపంచంలో చాలా అరుదు. పిట్స్బర్గ్ వెంకటేశ్వర దేవాలయంలో రెండు సంవత్సరాలు టీచింగ్ కాంట్రాక్ట్లో పాఠాలు చెప్పారు. హిందుస్థానీ సంగీతం పట్ల వీరికి అవగాహన ఉండటం వల్ల, కచేరీలు మరింత రక్తి కట్టేవి. ఈ సోదరీమణులు తెలుగు రాష్ట్రాల నుంచి పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలలో కచేరీలు చేసి, అందరి ప్రశంసలు అందుకోవటమే కాదు, ఇలా జంటగా పాడిన మొట్టమొదటి సోదరీమణులు కూడా వీరే. కుమారి లలిత తన జీవితాన్ని సంగీతానికే అంకితం చేశారు. రామ్ కోఠీ సంగీత కళాశాలలో సంగీత అధ్యాపకురాలిగా పనిచేశారు. సహృదయులు. మృదుభాషి. పేరుకు తగ్గట్టే లలితంగా మాట్లాడేవారు. రెండు రోజుల క్రితం కూడా యూ ట్యూబ్ లో ప్రత్యక్ష కచేరీ చేశారు. ‘‘వ్యక్తిగతంగా లలిత చాలా సౌమ్యురాలు. కళాకారుల్లో ఇంతమంచి లక్షణాలు ఉండటం చాలా అరుదు. స్నేహశీలి. వయసులో పెద్దవారి ని ఎంత గౌరవంగా చూసేవారో, చిన్నవారిని కూడా అంతే గౌరవంగా చూసేవారు. వారి వయసుకి కాకుండా, వారిలోని సరస్వతికి ప్రణమిల్లేవారు’’ అంటారు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మోదుమూడి సుధాకర్. ‘‘వీరు ఎంతోమందికి ఆదర్శం. నేను, మా అన్నయ్య మల్లాది శ్రీరామ్ ప్రసాద్ ఇద్దరం జంటగా పాడుతున్నామంటే అందుకు వీరే ఆదర్శం’’ అంటున్నారు మల్లాది సోదరులలో ఒకరైన మల్లాది రవి కుమార్. – డా. వైజయంతి పురాణపండ -
బాయ్ ఫ్రెండ్తో శృతిహాసన్ మ్యూజిక్ వీడియో
డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతీహాసన్ ప్రేమలో ఉన్నారని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య శ్రుతీ బర్త్డేకి శాంతను పెట్టిన పోస్టులు, ముంబైలో వీళ్లు ప్రేమగా చక్కర్లు కొట్టడం ఈ వార్తలకు బలం ఇస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలసి ఓ మ్యూజిక్ వీడియో చేయడానికి రెడీ అయ్యారట. కొంతకాలంగా మ్యూజిక్ కంపోజింగ్ మీద కూడా శ్రుతి బాగా దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. లండన్లో కొన్ని షోలు కూడా చేశారామె. తాజాగా శ్రుతి చేస్తున్న మ్యూజిక్ వీడియోలో శాంతను ర్యాప్ పాడనున్నారట. ఇంతకుముందు ర్యాపర్గా కొన్ని పాటలు పాడిన అనుభవం శాంతనుకు ఉంది. రికార్డింగ్ స్టూడియోలో ఈ మ్యూజిక్ వీడియోకి పని చేస్తూ శాంతనుతో సరదాగా చిన్న వీడియోను షేర్ చేసుకున్నారు శ్రుతీ. మరి ఈ మ్యూజిక్ వీడియో ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి. అలాగే తమ రిలేషన్షిప్ గురించి ఈ ఇద్దరూ ఎప్పుడు బయటపెడతారో చూడాలి. -
ఈ సిక్స్ ప్యాక్ బ్యాండ్ గురించి తెలుసా?
సంగీతానికి అవధుల్లేవు అన్నది అందరికీ తెలిసిన మాట. అయితే సంగీత కచేరీకీ షరతుల్లేవు అని నిరూపించింది ఓ ట్రాన్స్జెండర్ గ్రూప్. ఆరుగురు ట్రాన్స్జెండర్లు కలిసి మ్యూజిక్ బ్యాండ్గా ఏర్పడి పాటలను వదిలారు. చెడామడా తిట్టిన నోళ్లే తమను మెచ్చుకుంటుంటే పొంగిపోయారు. ఆత్మస్థైర్యం పెంచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ఈ సిక్స్ ప్యాక్ బ్యాండ్ భారత్లోనే తొలి ట్రాన్స్జెండర్ల సంగీత సమూహం కావడం విశేషం. (చదవండి: వారెంట్ జారీ అయ్యిందని తెలిసి షాకయ్యా: దర్శకుడు శంకర్) ఈ బ్యాండ్లో ఫిదా ఖాన్, రవీనా జగ్తప్, ఆశ జగ్తప్, చాందిని సువర్ణకర్, కోమల్ జగ్తప్, భవికా పాటిల్ అనే ఆరుగురు ట్రాన్స్జెండర్లు ఉంటారు. 2016లోనే ఏర్పడ్డ ఈ బ్యాండ్ నుంచి ఇప్పటి వరకు ఐదు పాటలు వెలువడ్డాయి. పాట రిలీజైన ప్రతిసారి అభిమానులు వాటిని విని, కొత్తగా ఉన్నాయంటూ మెచ్చుకునేవారు. సాధారణ ప్రేక్షకులే కాదు హృతిక్ రోషన్, సోనూ నిగమ్, అర్జున్ కపూర్, రహత్ ఫతే అలీ ఖాన్ వంటి పలువురు సెలబ్రిటీలు సైతం బ్యాండ్ ప్రతిభకు సపోర్ట్ చేస్తూ వారి పాటల వీడియోలో తళుక్కున మెరిశారు. సోనూ నిగమ్ అయితే వీరిని సంగీత పరిశ్రమలో గేమ్ ఛేంజర్గా పేర్కొన్నారు. (చదవండి: అరవై రోజులు ఆగకుండా షూటింగ్...!) నిజంగానే సమాజంలో వివక్షకు గురవుతున్న వీళ్లు ఇక్కడివరకు రావడం అంటే మాటలు కావు. అందరి ట్రాన్స్జెండర్ల లాగే వీళ్లకు కూడా ఎన్నో అవమానాలు, చీత్కారాలు, వేధింపులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ దాటి ముందడుగు వేశారు. సంగీత సరిగమలతో ప్రజల మనసు దోచుకునే బ్యాండ్గా ఎదిగారు. బాలీవుడ్లోనూ మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు అదే సంగీతాన్ని అస్త్రంగా చేసుకుని జెండర్ ఈక్వాలిటీ కోసం, వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. (చదవండి: సుశాంత్ వదిలేసుకున్న 7 బ్లాక్బస్టర్ సినిమాలు!) -
మ్యూజిక్ ప్రియుల కోసం సరికొత్త టెక్నాలజీ..!!
భారతదేశంలో మ్యూజిక్ ప్రియులు చాలా మంది ఉంటారు. కొందరు పనిచేసుకుంటూ పాటలు వింటే, మరికొందరు గేమ్స్ ఆడుతూ, ఇంకొందరూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ పాటలు వినడం చాలామందికి అలవాటు. అందుకే మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులకు బాగా డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు మనకు నచ్చిన పాటలను ఒక ప్లేలిస్ట్ చేసుకొని వినడమే తప్ప. ప్రత్యేకంగా మన మూడ్ను బట్టి పాటలు ప్లే అయ్యే విధానం లేదు. కానీ తాజాగా మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పాటిఫై ఈ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ రైట్స్ పొందింది. ఈ కొత్త టెక్నాలజీ మీ ఎమోషన్ బట్టి వాయిస్ టోన్ ఆధారంగా అది పాటలను రికమెండ్ చేస్తుంది.(చదవండి: జియోపై ఎయిర్టెల్ పైచేయి) గ్లోబల్ ఆడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై ఈ పేటెంట్ కోసం మొట్టమొదట ఫిబ్రవరి 2018లో దరఖాస్తు చేసుకుంది. తాజాగా ఈ నెలలో యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్మార్క్ ఆఫీస్(యుఎస్పిటిఓ) ఆ పేటెంట్కు ఆమోద ముద్ర వేసింది. ఈ పేటెంట్ ప్రకారం, యూజర్లు మీరు మాట్లాడే టోన్ బట్టి ఈ సరికొత్త టెక్నాలజీ మీకు పాటలను వినిపిస్తుంది. యూజర్ల మూడ్ ను గుర్తించి వారికి ఆహ్లాదకరంగా ఉండేందుకు వీలుగా స్పాటి ఫై కంపెనీ కి కొత్త టెక్నాలజీని తీసుకు వచ్చింది. -
ఇండియన్ ఐడల్ 12: పిజ్జా పార్టీ ఇచ్చిన జడ్జి
ముంబై: సోనీ టీవీ నిర్వహిస్తున్న ప్రముఖ రియాల్టీ మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్ 12’ గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూలైలో ప్రారంభమైన ఈ మ్యూజిక్ షో గ్రాండ్ ప్రీమియర్కు చేరుకుంది. డిసెంబర్ 19, 20వ తేదీలో సోని టీవీలో రాత్రి 8 గంటలకు ప్రసారం కానున్న ఈ గ్రాండ్ ప్రిమియర్ షో సందడిగా జరగనుంది. ఇందులోని టాప్ 15 కంటెస్టెంట్స్ ట్రోఫీ కోసం ఒకరితో ఒకరూ పోటీ పడుతూ తమ గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేయనున్నారు. వారాంతంలో జరిగే ఈ షోలో టాప్ 15 ఫైనలిస్టులు అద్భుతమైన ప్రదర్శను ఇవ్వనుండగా.. షో జడ్జిలైన విశాల్ దాద్లానీ, నేహా కక్కర్, హిమేష్ రేష్మియాలు పోటీదారుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జడ్జిలంతా వారికి సంబంధించిన కొన్ని సరద క్షణాలను కంటెస్టెంట్స్తో పంచుకొనున్నారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా గ్రాండ్ ప్రీమియర్ సందర్భంగా షోలోని అందరికి పిజ్జా పార్టీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో షో హోస్ట్ అదిత్య నారాయణ్, జడ్జి నేహా కక్కర్లు కంటెస్టెంట్స్ తల్లిదండ్రులతో కలిసి సరదాగా స్టెప్పులేశారు. (చదవండి: జాతీయ స్థాయిలో షణ్ముఖ స్వరం) The Grand Premiere of #IndianIdol2020 unfolds this weekend!@SonyTV #IndianIdol #SonyTV #Tellychakkar https://t.co/RtlXEHHRRV — princess Arisham khan (@p_Arisham_khan) December 16, 2020 ఇండియల్ ఐడిల్ సీజన్ 12 టాప్ 15 కంటెస్టెంట్స్లో ఏపీ నుంచి ముగ్గురు ఈ సీజన్లో మొదటి 12 మంది కంటెస్టెంట్స్ వరుసగా.. ఉత్తరప్రదేశ్కు చెందిన మొహద్ డానిష్, ఆంధ్రప్రదేశ్కు నుంచి.. శిరీష భగవతుల, అంజలి; మహారాష్ట్రకు చెందిన సాయిలీ కిషోర్ కాంబ్లే; న్యూఢిల్లీకి చెందిన సమ్యాక్ ప్రసానా; కేరళకు చెందిన వైష్ణవ్ గిరీశ్; పశ్చిమ బెంగాల్కు చెందిన అరుణీతా కంజీలాల్, అనుష్క బెనర్జీ; కర్ణాటకకు చెందిన నిహాల్ టౌరో; హర్యానాకు చెందిన సాహైల్ సోలంకి; ఉత్తరాఖండ్కు చెందిన పవన్దీప్ రాజన్; రాజస్థాన్కు చెందిన సవాయి భట్; ఆంధ్రప్రదేశ్కు చెందిన షణ్ముఖ ప్రియా; ముంబైకి చెందిన నాచీకెట్ లేలే; పూణేకు చెందిన ఆశీస్ కులకర్ణిలు. (చదవండి: షణ్ముఖప్రియ పాటకు న్యాయనిర్ణేతలు ఫిదా) View this post on Instagram A post shared by Indian idol 2020 (@indian__idol12) -
బాబ్రే... నిత్య యవ్వనం నీ స్వరం!
బాబ్ డిలాన్ ఆరువందలకు పైగా పాటల హక్కులను యూనివర్సల్ మ్యూజిక్ పబ్లిషింగ్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈ బ్లాక్బస్టర్ అగ్రిమెంట్ ద్వారా మూడువందల మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వస్తుందట. వాళ్లెవరో సొంతం చేసుకోవడం ఏమిటి? ఆ పాటలను ప్రపంచంలో ఆబాలగోపాలం ఎప్పుడో సొంతం చేసుకుంది అనుకుంటే అది కూడా అక్షరాల నిజమే! బాబ్ పాట మీద హక్కు సాంకేతిక విషయం మాత్రమే. అది అందరి పాట. ఎందుకంటే.. మాస్టర్స్ ఆఫ్ వార్ (1963) ఇప్పుడు యుద్దాలు ఆత్మరక్షణ కోసం జరగడం లేదు, ప్రజల దృష్టిని మళ్లించి పాలనను సుస్థిరం చేసుకోవడానికి జరుగుతున్నాయి. ఇప్పుడు యుద్దం అంటే హింస మాత్రమే కాదు అనేక కుట్రసిద్దాంతాల సమహారం. అందుకే ఒక కళాకారుడిగా బాబ్ డిలాన్ గళం విప్పాడు. యుద్దోన్మాదాన్ని నడివీధిలో నగ్నంగా నిలబెట్టాడు. ప్రపంచాన్ని ఆటబొమ్మగా చేసుకుని ఆడుకునే మాస్టర్స్ ఆఫ్ వార్ని ఇలా నిలదీశాడు... ‘యూ ప్లే విత్ మై వరల్డ్ లైక్ ఇట్స్ యువర్ లిటిల్ టాయ్ యూ పుట్ ఏ గన్ ఇన్ మై హ్యాండ్ అండ్ యూ హైడ్ ఫ్రమ్ మై ఐస్’ న్యూ మార్నింగ్ (1970) స్వప్నించే హృదయం ఉండాలేగానీ ప్రతి ఉదయం ఒక కొత్త ఉదయాన్ని పరిచయం చేస్తుంది. ‘ఆ..ఏముంది లే. అన్ని రోజుల్లాగే ఈరోజు కూడా’ అనుకునే నిత్య నిరాసక్తవాదులకు ఈ పాట సరికొత్త మేలుకొలుపు. సింప్లీ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ విలువ ఏమిటో చెబుతుంది. ‘సో హ్యాపీ జస్ట్ టు బీ అలైవ్’ ‘సో హ్యాపీ జస్ట్ టు సీ యువర్ స్మైల్’ సేవ్డ్ (1980) భగవంతుడు మన కోసం ఎన్నో చేశాడు. అతడి కోసం ఏం చేయగలం? రుణాన్ని ఎలా తీర్చుకోగలం? కనిపించని భగవంతుడు నిత్యం మనకు కనిపించే మనుషుల్లో దానం, ధర్మం, త్యాగం...రకరకాల రూపాల్లో ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటాడు. ‘యూ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ టు మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ యూ హ్యావ్ గివెన్ మీ ఐస్ టు సీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ’ అండర్ ది రెడ్ స్కై (1990) గబ్బీ గూగూ (ముద్దుపేరు) అనే అమ్మాయికి అంకితం ఇచ్చిన ఈ పాట సింపుల్ ఎక్స్ప్రెషన్స్తో సాగుతుంది. పిల్లలకు నచ్చే జానపదకథలాంటి పాట ఇది. కాల్పనిక ప్రపంచంలో మనల్ని ఊరేగించే పిల్లల పెద్దల పాట. అంతేనా! కానే కాదు అంటారు విశ్లేషకులు. పర్యావరణానికి మన చేటును గురించి హెచ్చరించి పాట అంటారు. ‘లెట్ ది బర్డ్ సింగ్...లెట్ ది బర్డ్ ఫ్లై’ షాడోస్ ఇన్ ది నైట్ (2015) నిన్ను చూడడం తప్పేమో తెలియదు. చూస్తూనే ఉంటాను. నిన్ను పలకరించడం తప్పేమో తెలియదు. పలకరిస్తూనే ఉంటాను. నిన్ను ధ్యానించడం తప్పేమో తెలియదు. ధ్యానిస్తూనే ఉంటాను. నిన్ను ప్రేమించడం తప్పేమో తెలియదు. ప్రేమిస్తూనే ఉంటాను.... ‘ఐ లవ్ యూ ఐ నీడ్ యూ...ఐ నో ఇట్స్ రాంగ్...ఇట్ మస్ట్ బీ రాంగ్ బట్ రైట్ ఆర్ రాంగ్ ఐ కాంట్ గెట్ ఎలాంగ్ విత్ఔట్ యూ’ -
బాబ్ డిలాన్ పాటలన్ని కొనేసిన యూజీ
న్యూయార్క్: ప్రఖ్యాత రచయిత బాబ్ డిలాన్ పాటలు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. ఆయన రాసిన మొత్తం 600 పాటలను యూనివర్సల్ మ్యూజిక్ పబ్లిషింగ్ గ్రూప్ తన సొంతం చేసుకున్నట్లు సోమవారం ప్రకటించింది. అంటే ఇకపై ఆయన పాటలపై పూర్తి హక్కులన్ని తమకే ఉంటుందని సదరు మ్యూజిక్ సంస్థ స్పష్టం చేసింది. అయితే ఇటీవల ఇందుకు సంబంధించి ఒప్పందం కూడా ముగిసినట్లు యూఎంపీజీ తెలిపింది. ఇందుకోసం యూఎంపీజీ ఆయనకు ఎంత మొత్తం చెల్లించిందనేది మాత్రం పేర్కొనలేదు. అయితే ఆయన పాటలకు ఎంత ప్రాముఖ్యత ఉంతో తెలిసిన విషయయే. ఇందుకోసం యూఎంపీజీ ఆయనతో భారీగానే ఒప్పందం కుదర్చుకున్నట్లు సమాచారం. ఆయన పాడిన పాటల క్యాట్లాగ్ను విలువను బట్టి కనీసం రూ. 100 మిలియన్ డాలర్లు ఉండోచ్చని స్థానికి మీడియా అంచనాలు. (చదవండి: బాబ్ డిలాన్ 'నోబెల్'ను అంగీకరించినట్లేనా?) అయితే యూఎంపీజీ తన ప్రకటనలో బాబ్ డిలాస్ 1962 నుంచి ఇప్పటి వరకు పాడిన మొత్తం క్యాట్లాగ్ పాటల జాబితాను తమ సంస్థ కనుగోలు చేసినట్లు వెల్లడించింది. కాగా ఈ సంస్థ ప్రస్తుతం అమెరికాలోని డిలాస్ మ్యూజిక్ కంపెనీతో పాటు సోనీ, ఏటీవి మ్యూజిక్ పబ్లిసింగ్ నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఈ ఒప్పందం ముగిసే వరకు అమెరికా వెలుపల జరిగే పలు మ్యూజిక్ షోలను యూఎంపీజీనే నిర్వహిస్తుందని సోనీ, ఏటీవీ అధికారులు స్పష్టం చేశారు. కాగా బాబ్ డిలాన్ 2016లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం పొందారు. నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న తొలి పాటల రచయితగా ఆయన రికార్డు సృష్టించారు. -
నేను చాలా లక్కీ: అనూప్ రూబెన్స్
రాజ్తరుణ్, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించారు. నేడు ఆహా ఓటీటీ చానల్ ద్వారా ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ మీడియాతో చెప్పిన విశేషాలు. ‘ఒరేయ్ బుజ్జిగా’ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. దర్శకుడు విజయ్కుమార్ కొండాతో ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలాకోసం’, సినిమాల తర్వాత ‘ఒరేయ్ బుజ్జిగా’ హ్యాట్రిక్ ఫిల్మ్ చేశాను. దేనికదే విభిన్నంగా ఉండే ఈ సినిమాలోని ఐదు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లాక్డౌన్లో మ్యూజిక్ చేశాను, కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి ఉండేది. కారణం అంతకుముందు దర్శకుడు, నిర్మాత అందరూ కలిసి కూర్చుని ఇక్కడ ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుంది అని చర్చించుకుని సినిమాకి సంగీతం చేసేవాళ్లం. ఒక్కడినే ఇంటిదగ్గర కూర్చుని మ్యూజిక్ చేయటం కష్టంగా అనిపించింది. ఈ సినిమాలోని ‘ఈ మాయ పేరేమిటో...’ అనే సాంగ్ పర్సనల్గా నాకెంతో ఇష్టం. అలాగే ‘కృష్ణవేణి..’ అనే పాట కూడా ఇష్టం. ఎందుకంటే ఆ పాటలో రాజ్తరుణ్ డ్యాన్స్ ఇరగదీశాడు. ఒక సినిమాకి సంగీతం అందించేటప్పుడు హీరోని, కథను దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ చేస్తాను. ఒక సంగీత దర్శకునిగా నాకు అన్ని రకాల సినిమాలు చేయటం ఇష్టం. లక్కీగా ‘ఇష్క్’, ‘మనం’, ‘గోపాల గోపాల’, ‘టెంపర్’, ‘కాటమరాయుడు’, ‘పైసా వసూల్’, ‘పూలరంగడు’, ‘సోగ్గాడే చిన్నినాయనా’... ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ జోనర్స్లో సినిమాలు చేసే అవకాశం అభించింది. ఇప్పటివరకు 55 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు. ప్రసుత్తం రాధామోహన్గారు నిర్మిస్తున్న ‘ఓదెల రైల్వేస్టేషన్’, రాజ్తరుణ్–విజయ్కుమార్ కొండా కాంబినేషన్లో మరో సినిమా చేస్తున్నాను. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు ఉన్నాయి. అలాగే ఈ లాక్డౌన్లో కొన్ని ప్రైవేట్ సాంగ్స్ రికార్డ్ చేశాను. మంచి టైమ్ చూసుకుని ఈ పాటలను విడుదల చేస్తాను. -
చుట్టూ చెంగావి చీర కట్టాలి చిలకమ్మా
గాయకులుగా ఉంటూ సంగీత దర్శకత్వం చేసిన వారిలో చిత్తూరు నాగయ్య, ఘంటసాల, భానుమతి రామకృష్ణ తర్వాత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వస్తారు. నెల్లూరులో పాట కచ్చేరీలు ఇచ్చే నాటి నుంచే సొంతగా పాట రాసి ట్యూన్ కట్టే ప్రయత్నం చేసిన బాలు సినిమా గాయకుడిగా బిజీ అయ్యాక సంగీత దర్శకుడిగా పాటలు చేయాలని ప్రత్యేకంగా ప్రయత్నించలేదు. కాని ప్రయోగాలు చేయడంలో సిద్ధహస్తుడైన దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు ‘కన్య–కుమారి’ (1977) సినిమాకు తొలి అవకాశం ఇచ్చారు. వేటూరి రాసిన ‘ఇది తొలి పాట’ బాలు స్వరపరిచిన తొలి పాట. ఈ పాటను ఆ తర్వాత ఆయన తన ప్రతి కచ్చేరీలో పాడేవారు. అయితే గాయకుడిగా చాలా బిజీగా ఉంటున్న బాలూను సినిమా సంగీతం కోసం అడగడం నిర్మాత దర్శకులకు కొంత సంశయం అనే చెప్పాలి. ఎందుకంటే దానికి వారు అడిగినంత సమయం బాలు ఇవ్వలేకపోవచ్చు అనే సందేహం ఉండేదేమో. అయినప్పటికీ తెలుగులో బాలు 31 సినిమాలకు సంగీతం వహించారు. తమిళంలో 5, కన్నడంలో 9 సినిమాలు ఆయన స్వర పర్యవేక్షణలో వచ్చాయి. బాపుతో కలిసి దర్శకుడు బాపు ‘తూర్పు వెళ్లే రైలు’ సినిమాకు బాలు చేత పాటలు చేయించుకున్నారు. ఇవి మంచి అభిరుచి ఉన్న పాటలుగా నిలిచాయి. జాలాది రాసిన ‘సందె పొద్దు అందాలున్న చిన్నది’, ఆరుద్ర రాసిన ‘చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలుకమ్మ’ పాటలు నేటికీ నిలిచి ఉన్నాయి. చుట్టూ చెంగావి చీర పాటకు మెహదీ హసన్ ‘రఫ్తా రఫ్తా’ ప్రేరణ. ఆ తర్వాత బాపూతో బాలు ‘సీతమ్మ పెళ్లి’, ‘జాకీ’ సినిమాలు చేశారు. ‘సీతమ్మ పెళ్లి’ తమిళంలో సూపర్హిట్ చిత్రానికి రీమేక్. అయినప్పటికీ ఆ పాటల ఛాయలు లేకుండా ఒరిజినల్ పాటలు చేశారు బాలు. అందులోని ‘చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే’ పాట ప్రేక్షకులకు గుర్తుంటుంది. ఇక ‘జాకీ’లో పాటలన్నీ హిట్టే. శోభన్బాబు, సుహాసిని నటించిన ఈ సినిమాలో బాలు, జానకి పోటీలు పడి పాడారు. ‘శశివదన మొరను వినలేవా’, ‘అలా మండి పడకే జాబిలీ’, ‘నిదుర లెమ్ము నిమ్మకాయ’ అలరించాయి. ‘మన ఊరి పాండవులు’ సినిమాను బాపు హిందీలో ‘హమ్ పాంచ్’ పేరుతో రీమేక్ చేస్తే బాలు దానికి రీ రికార్డింగ్ చేశారు. జంధ్యాలతో జంధ్యాలతో బాలూ చేసిన ‘పడమటి సంధ్యారాగం’ క్లాసిక్గా నిలిచింది. ఈ సినిమాకు పేరు బాలూయే పెట్టారు. అందులో ‘లైఫ్ ఈజ్ షాబీ’ పాటను రాసి పాడారు కూడా. ఇందుకోసం అమెరికాలో పాటను రికార్డు చేసి, అలా రికార్డు చేసిన తెలుగు సినిమా రికార్డును సొంతం చేసుకున్నారు. పడమటి సంధ్యారాగంలోని ‘ఈ తూరుపు ఆ పశ్చిమం’ పాట బాలు చేసిన చాలామంచి పాటల్లో ఒకటి. అలాగే ‘పిబరే రామరసం’ పాట ఎంతో స్పందనాయుతంగా ఉంటుంది. జంధ్యాలతో ‘వివాహ భోజనంబు’, ‘నీకూ నాకూ పెళ్లంట’ సినిమాలు చేశారు బాలు. అవార్డు తెచ్చిన సినిమా బాలూకు అవార్డులు, రివార్డులు తెచ్చి పెట్టిన సినిమాగా ‘మయూరి’ని చెప్పవచ్చు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలు సంగీత ప్రతిభకు ఒక తార్కాణంగా నిలిచింది. ఇందులో ‘ఈ పాదం ఇలలోని నాట్య వేదం’, ‘ఇది నా ప్రియనర్తన వేళ, ‘మౌనం గానం మధురం మంత్రాక్షరం’ పాటలు హిట్గా నిలిచాయి. ఈ సినిమా బాలూకు ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు తెచ్చి పెట్టింది. సింగీతం దర్శకత్వంలోనే ‘ఊరంతా సంక్రాంతి’ సినిమాకు పాటలు చేశారు బాలు. ప్రతి సంక్రాంతికి వినిపించే ‘సంబరాల సంకురాత్రి’ పాట ఈ సినిమాలోదే. శోభన్బాబు ‘కొంగుముడి’, బాలకృష్ణ ‘రాము’, నాగార్జున ‘జైత్రయాత్ర’ సినిమాలకు బాలూ సంగీతం అందించారు. జైత్రయాత్రలోని ‘ఎన్నాళ్లమ్మా ఎన్నేళ్లమ్మా’ పాట హిట్గా నిలిచింది. దర్శకుడు వంశీతో ‘లాయర్ సుహాసిని’ చేశారు బాలు. ఇందులోని పాటలన్నీ మెలొడీతో ఉంటాయి. ‘తొలిసారి పూసే మురిపాల తీవ’, ‘ఏమైంది ఇల్లాలుగారు’, ‘మహరాజా మర్యాద’ చాలా బాగుంటాయి. ఇక చిన్న సినిమా ‘కళ్లు’కు పెద్ద సంగీతం అందించారు బాలు. ఇందులో ‘తెల్లారింది లెగండోయ్’ పాటను ఆ పాట రాసిన సిరివెన్నెల చేత పాడించారు. బాలు పాటల్లోనే కాదు నేపథ్య సంగీతంలో కూడా ఒక మార్క్ ఉండేలా చూసుకున్నారు. ఆయన పాటల్లో ‘కలకాలం ఇదే పాడనీ’ (ఏజంట్ గోపీ), ‘చెలి సఖీ మనోహరి’ (బంగారు చిలక), ‘ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం’ (మగధీరుడు), ‘తెల్లమబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామ’ (చిన్నోడు పెద్దోడు) గుర్తుకు వస్తాయి. ‘నా షరతులతో పాటలు చేయడానికి అంగీకరించిన వారికే పాటలు చేస్తాను’ అని చెప్పిన బాలు 1990ల తర్వాత సంగీత దర్శకత్వానికి దూరంగానే ఉండిపోయారు. బాలు – జానకి నిరంతరమూ వసంతములే బాలు నెల్లూరు బిడ్డ అయితే ఎస్. జానకి నెల్లూరు కోడలు. ఇద్దరూ పోటీ పడి పాడిన పాటలు తెలుగువారికి కండశర్కరలుగా మారాయి. ముఖ్యంగా ఇళయరాజా తెలుగులో చేసిన పాటలు చాలా వాటికి వీరిద్దరే గొంతునిచ్చారు. ఆ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్గా నిలిచాయి. ‘మాటే మంత్రము’ (సీతాకోక చిలుక), ‘ఏమని నే చెలి పాడుదును’ (మంత్రిగారి వియ్యంకుడు), ‘నిరంతరము వసంతములే’ (ప్రేమించు–పెళ్లాడు), ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ (రాక్షసుడు), ‘మాటరాని మౌనమిది’ (మహర్షి), ‘మౌనమేలనోయి’ (సాగర సంగమం), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’ (స్వాతిముత్యం), ‘ఎదలో తొలి వలపే’ (ఎర్ర గులాబీలు), ‘సన్నజాజి పడక మంచె కాడ పడక’ (క్షత్రియపుత్రుడు), ‘మధుర మురళి హృదయ రవళి’ (ఒక రాధ–ఇద్దరు కృష్ణులు)... ఇవన్నీ కమనీయ పాటలు. ఇక ఇతర సంగీత దర్శకుల కోసం కూడా వీరు ఎన్నో మనోహరమైన పాటలు పాడారు. ‘వీణ వేణువైన సరిగమ’ (ఇంటింటి రామాయణం), ‘సిరిమల్లె పువ్వల్లే నవ్వు’ (జ్యోతి), ‘నీ చేతులలో తలదాల్చి’ (కార్తీక దీపం), ‘అలివేణి ఆణిముత్యమా’ (ముద్దముందారం), ‘కాస్తందుకో దరఖాస్తందుకో’ (రెండు రెళ్లు ఆరు)... ఈ పాటలు వింటుంటే కాలం తెలుస్తుందా? జానకి దగ్గర బాలూకు కొంచెం చనువు ఉండేది. ‘ఆమె ఒక చేతిలో కర్చిఫ్ పట్టుకుని పాడేవారు. అది ఆమె అలవాటు. తీరా రికార్డింగ్ సమయానికి ఆ కర్చిఫ్ దాచేసేవాణ్ణి. ఆమె నన్ను కోప్పడేవారు’ అని సరదాగా చెప్పుకున్నారు బాలు. పాట నుంచి విరమించుకుని విశ్రాంత జీవితం గడుపుతున్న జానకి ఈ వార్త విని ఎలా స్పందిస్తారో. అసలు తట్టుకోగలరో లేదో. -
వామ్మో.. ఏంటి ఇది నిజమేనా.?!
సంగీతానికి రాళ్లు కరుగుతాయి... రాతిలో నుంచి కూడా సంగీతం వినిపిస్తుంది అని మనకు తెలుసు. కానీ పండ్ల నుంచి మ్యూజిక్ రావడం ఎప్పుడైనా చూశారా.. కనీసం విన్నారా లేదు కదా. అయితే ఈ వీడియో చూడండి. ఆశ్చర్యంతో మీకు కూడా నోట మాట రాదు. ఎందుకంటే ఓ వ్యక్తి పుచ్చకాయ, కివి పండ్ల ముక్కలను పియానో కీస్లాగా వాయిస్తూ.. వాటి నుంచి సంగీతాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను మాజీ బాస్కెట్ బాల్ ఆటగాడు రెక్స్ చాప్మన్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. ‘బ్రో.. ఇతను పుచ్చకాయలతో వాయిస్తున్నాడు’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. (చదవండి: అనుకోని అతిధి రాకతో అద్భుతం..) Bro - he’s playing melons...pic.twitter.com/Q8v93qRG46 — Rex Chapman🏇🏼 (@RexChapman) September 3, 2020 వివరాలు.. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ యువకుడు స్విమ్మింగ్ ఫూల్ వద్ద కూర్చుని ఉన్నాడు. అతని ఎదురుగా బల్లమీద వరుసగా పుచ్చకాయ ముక్కలతో రెండు కివి ముక్కలు కూడా ఉన్నాయి. వాటి నుంచి వైర్లను ఓ మెటల్ బోర్డుకి కనెక్ట్ చేశాడు. దాన్ని ల్యాప్టాప్కి కలిపాడు. కింద కాలు దగ్గర పెడల్స్ ఉన్న డ్రమ్ కూడా ఉన్నది. ఇక ఆ వ్యక్తి పుచ్చకాయ ముక్కలను సింథసైజర్ కీస్లాగా నొక్కడం ప్రారంభించగానే వాటి నుంచి శబ్దం వస్తుంది. కొన్ని సెకన్ల తర్వాత డ్రమ్ని కాలితో వాయిస్తాడు. చివరకు కివి ముక్కలను కూడా నొక్కుతాడు. అవి కూడా శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. మొత్తానికి మాంచి మ్యూజిక్ని ప్లే చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా అతడు నిజంగానే పండ్ల ముక్కల నుంచి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నాడా.. లేక వేరే సెటప్ ఉందా అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే వేలాది మంది ఈ వీడియోను చూశారు.. మీరూ ఓ లుక్కేయండి. -
ఆన్లైన్లో సంగీత పోటీలు
తెలుగు గాయకుల ప్రతిభను వెలికి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ‘తెలుగు డిజిటల్ ఐడల్’ తొలిసారి సంగీత పోటీలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా గాయనీ గాయకులకు తెలుగు పాటకు పట్టంకట్టే విధానంలో శాస్త్రీయ, సినీ, లలిత సంగీత విభాగాల్లో ఈ పోటీ జరగనుంది. ఇందుకు సంబంధించిన లోగోను సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఆవిష్కరించారు. ‘‘అంతర్జాతీయంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేవలం ఆన్లైన్లోనే మాత్రమే వీక్షించగలరు. ఇందులో పాల్గొనే గాయనీ గాయకుల వయో పరిమితి కనీసం 16 సంవత్సరాలు. మొదటి రౌండులో ఎంపికైన వారికి ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తాం. ఈ నెల 31 రాత్రి 11 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు తాము పాడిన శాస్త్రీయ, సినీ, లలిత గీతాల తాలూకు వీడియో నిడివి 2 నిమిషాలకు మించకూడదు. ఈ పోటీల్లో పాల్గొనే ఔత్సాహిక గాయనీ గాయకులు తమ పేర్లను www.telugudigitalidol.com వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి’’ అని నిర్వాహకులు కోరారు. -
రెహమాన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత బాలీవుడ్ పరిశ్రమలో నెపోటిజంపై పెద్ద దుమారమే రేగింది. దీంతోపాటు సంగీత పరిశ్రమ మాఫియా గుప్పిట్లో చిక్కుకుందంటూ సోనూ నిగంలాంటి ప్రముఖ గాయకులు కూడా బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మేస్ట్రో ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సంబంధించిన కొన్ని పుకార్లు ఇండస్ట్రీలో వ్యాపించాయని, దీని వెనక ఒక గ్యాంగ్ ఉందని పేర్కొన్నారు. సంగీతాభిమానులు, బాలీవుడ్ తన నుంచి చాలా ఆశిస్తోంటే..దానికి ఒక ముఠా అడ్డుపడుతోందని ఆరోపించారు. రేడియో మిర్చి ఆర్జే సురేన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. బాలీవుడ్ సినిమాలకు సంగీతాన్నిఎందుకు కంపోజ్ చేయలేదని అడిగినపుడు పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. తాను మంచి సినిమాలకు ఎపుడూ నో చెప్పలేదని, కానీ ఒక ముఠా తనపై పుకార్లను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. సినిమాలు తన వరకు రాకుండా కుట్ర చేస్తున్నారనీ, సమయానికి స్వరాలు ఇవ్వరనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రెహమాన్ను సంప్రదించవద్దని సలహా ఇచ్చారంటూ దిల్ బెచారా దర్శకుడు ముఖేష్ ఛబ్రా మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. రెహమాన్ దగ్గరికి వెళ్లొద్దని బాలీవుడ్లో ఛబ్రాకు పలువురు చెప్పారని అన్నారు. కానీ ముఖేష్ ఛబ్రాకు కేవలం రెండు రోజుల్లో నాలుగు పాటలకు స్వరాలు కూర్చి ఇచ్చినట్టు వివరించారు. (కరోనా: కూరలమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు) కాగా తమిళ, తెలుగు సహా అనేక భాషల్లో అద్భుతమైన స్వరాలను అందించిన రెహమాన్ హిందీలో తమాషా, రాక్స్టార్, దిల్ సే, గురుతో సహా ఇతర బాలీవుడ్ సినిమాలకు నేపథ్య సంగీతాన్ని అందించారు. ఆయన తాజా ఆల్బం సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి చిత్రం దిల్ బెచారా. ఇటీవల మరణించిన సుశాంత్కు నివాళిగా రెహమాన్ బృందం వర్చువల్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. ఒక స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇందులో రెహమాన్ తో పాటు ఇతర ప్రముఖ గాయకులు, ఈ చిత్ర గేయ రచయిత అమితాబ్ భట్టాచార్య తమదైన రీతిలో నివాళి అర్పించిన సంగతి తెలిసిందే. (ఆ కథనంపై చలించిన సోనూసూద్) -
శ్రుతి లేదు.. భృతి లేదు
చీరాల అర్బన్: ఒక కమ్మని పాటకు శ్రుతి ఎంతో ప్రధానం. లయబద్దంగా సాగే పాటకు శ్రుతి సక్రమంగా ఉంటేనే ఆ పాట శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది. శ్రుతి, లయను సమ్మోహనంగా మిళితం చేసి గానం చేస్తే ఆ పాట సంగీత ప్రియులను రంజింప చేస్తుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న సంగీతాన్ని అందరికీ పంచే కళాకారులు జిల్లాలో ఎందరో ఉన్నారు. అలానే జానపద కళాకారులు, సుమధుర గాత్రంతో రంగస్థలంపై ఏకపాత్రాభియం చేస్తూ నాటకాన్ని రక్తికట్టేంచే వారూ లేకపోలేదు. ఎంతో మంది ప్రముఖులతో సన్మానాలందుకున్న కళాకారులు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. శ్రుతిలయలను నమ్ముకున్న వారు నేడు భృతి కోసం ఎదురు చూస్తున్నారు. సప్త స్వరాలను సమ్మోహనంగా ఆలపించడంతో పాటు సంగీత వాద్యాలను అలవోకగా పలికిస్తూ పలువురికి సంగీత, వాద్య విద్యను చెప్పే కళాకారుల జీవితాల్లో కరోనా కల్లోలం సృష్టించింది. సంగీత వాద్య కళాకారులకు లాక్డౌన్ కారణంగా ఉపాధి కరువైంది. చీరాల, వేటపాలెం మండలాలల్లో ఎంతో మంది సంగీత, రంగస్థల కళాకారులు ఉన్నారు. వీరిలో చాలా మంది సంగీత, వాద్య కళాకారులు కళను నమ్ముకుని జీవిస్తున్నారు. ఒకప్పుడు చీరాలలోని వాణి కళానికేతన్ లో ఎంతో మంది సంగీతాన్ని నేర్చుకున్నారు. ప్రస్తుతం వారందరూ వేర్వేరు ప్రాంతాలలో స్థిరపడి మంచి సంగీత కళాకారులుగా రాణిస్తున్నారు. చీరాలలో వీణ, వయోలిన్తో పాటు సంగీతం చెప్పేవారు కళాకారులు ఉన్నారు. ఒకప్పుడు సంగీత కళలకు పెట్టింది పేరుగా ఉన్న చీరాలలో ప్రస్తుతం తక్కువ సంఖ్యలోనే కళాకారులు ఉన్నారు. కొంతమంది ఇంటివద్దనే సంగీతం నేర్పుతుండగా, మరికొందరు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి సంగీతం, వయోలిన్ నేర్పుతున్నారు. అలానే నాదస్వర కళాకారులకు కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. లాక్డౌన్ కారణంగా నాలుగు నెలలుగా శిక్షణ తరగతులు నిర్వహించడంలేదు. కొంతమంది సంగీతం, నాట్యం ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటున్నారు. విజయవాడకు చెందిన నాట్యకళాకారిణి ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు ఆన్లైన్లో నాట్యం నేర్పుతున్నారు. చీరాలకు చెందిన 20 మంది విద్యార్థులు ప్రతిరోజూ ఆన్లైన్లో చూస్తూ నాట్యం నేర్చుకుంటున్నారు. అలానే సంగీతం కూడా అదే మాదిరిగా ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. రంగస్థలంపై రాణించినా..! రంగస్థలంపై ఏకధాటిగా గంటల కొద్ది ప్రదర్శనలు ఇచ్చి ఎందరో ప్రముఖుల చేత సన్మానాలు అందుకున్న కళాకారులు నేడు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. జానపద కళలు, నాటకాలు, ఏకపాత్రాభినయాలు వంటివి చేసి అందరిని మెప్పించినా ప్రస్తుతం వారికి ఆదరణ కరువైంది. జాండ్రపేటలో నివసించే చల్లా రాజేశ్వరి రేడియో ఆర్టిస్ట్. ఆమెను కళాకారిణిగా గుర్తించి ప్రభుత్వం గుర్తింపు కార్డు అందించింది. ఎన్నో స్టేజి ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాలు ఇచ్చినా కళాకారుల పెన్షన్ మాత్రం రావడంలేదని వాపోయింది. ఐదు సంవత్సరాలుగా కళాకారులకు ప్రభుత్వం అందించే నగదు కోసం దరఖాస్తులు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కళాకారులను కూడా కరోనా సమయంలో ఆదుకోవాలని వారు విన్నవించుకుంటున్నారు. అలానే వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇటీవల పట్టణంలోని 26 వార్డులో ఉన్న కళాకారులకు నిత్యవసరాలు, కూరగాయలను పంపిణీ చేశారు. కళలకు జీవం పోసే కళాకారుల జీవనం కరోనా వైరస్ కారణంగా కష్ట పరిస్థితుల్లోకి వెళ్లింది. ఆన్లైన్లో సంగీత పాఠాలు.. చీరాల వైకుంఠపురంలోని బాలసాయినగర్కు చెందిన కొణికి సుష్మ బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. చిన్న వయస్సు నుంచే కర్నాటక సంగీతం నేర్చుకున్న సుష్మ కర్నాటక సంగీతంలో డిప్లమో పొందింది. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దనే ఉంటూ తాను నేర్చుకున్న సంగీతాన్ని ఆన్లైన్ ద్వారా మరికొందరికి నేర్పుతోంది. -
అద్భుతంగా మారిన సంగీతం...
-
అనుకోని అతిధి రాకతో అద్భుతం..
ఇంటర్నెట్ ప్రపంచంలో వింతలకు కొదవ లేదు. సామాజిక మాద్యమాలలో ఎక్కడ చూసిన మనల్ని ఆశ్చర్యపరిచే విషయాలు కనబడుతూనే ఉంటాయి. అలాంటి ఒక విషయాన్నే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ‘నా హార్ప్ సెషన్ డిస్నీ చలన చిత్రంగా మారింది’ అనే శీర్షికతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఓ యువతి ఆరుబయట నిలబడి ఒక వీణలాంటి (తీగలతో కూడిన ముక్కోణ ఆకారపు వాద్యము) పరికరాన్ని వాయించింది. 1965లో వచ్చిన ‘హిట్ ది సౌండ్ ఆఫ్ సైలెన్స్’ అనే మ్యూజిక్ను ప్లే చేసింది. దీనిని వాయిస్తున్న సమయంలో ఆమె వీడియో తీసుకుంది. చదవండి: ఎక్కడా చూసి ఉండరు.. ఇండియాలోనే సాధ్యం! తరువాత ఆ వీడియోను చూసి ఆమె ఆశ్చర్య పోయింది. మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు అటుగా వచ్చిన ఒక జింక దానిని వింటూ అక్కడే ఆగిపోయింది. జాగ్రత్తగా ఆ సంగీతాన్ని వింటూ, ఆ వాయిద్యాన్ని చూస్తూ అక్కడే ఉండిపోయింది. తరువాత ఆ జింక అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వీడియో ముగుస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ చాలా క్యూట్గా ఉంది. అది మీ దగ్గరకు రావాలనుకుంది కానీ భయంతో అక్కడే ఉండిపోయింది అనుకుంటా. దానికి మీ సంగీతం బాగా నచ్చింది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఇది ప్రపంచంలోనే క్యూటెస్ట్ విషయం అని మరో నెటిజన్ స్పందించాడు. ఈ వీడియోను ఇప్పటి 32,000లకు పైగా లైక్ చేయగా 880కి పైగా కామెంట్స్ వచ్చాయి. చదవండి: వైరల్: పులికి చెమటలు పట్టించిన పైథాన్ -
లాక్డౌన్: ప్రశాంత సంగీతం
సంగీతానికి స్పందింపచేసే గుణం మాత్రమే కాదు ప్రశాంతతను ఇచ్చే శక్తి కూడా ఉంది. ఒక పది నిమిషాలు మనసును సంగీతంలో లయం చేస్తే ఆందోళన తొలగిపోతుంది. లాక్డౌన్ వేళ సంగీతం ఒక మంచి ఊరట. మన శాస్త్రీయ సంగీతంలో కొన్ని రాగాలు మనసుకు దివ్యౌషధాలు. వీలైతే ఈ రాగాలను నిత్యం వినే ప్రయత్నం చేయండి. అలజడులు మీ చెంతకు చెరకుండా చూసుకోండి. మనసు, శరీరం, ఆలోచన అన్నీ సక్రమంగా, ప్రశాంతంగా ఉంచుకోవలసిన సమయం ఇది. మనసుకు ఆనందాన్ని కలిగించటంలో సంగీతానికి మించినది లేదు. అనంతకోటి రాగాలలో కొన్ని రాగాలు వినగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఇటువంటి సమయంలో సంగీతమే మనలను ఉత్తేజపరుస్తుంది. అటువంటి కొన్ని రాగాలను చూద్దాం. సామ రాగం ఈ రాగం పేరుతోనే అర్థమవుతుంది.. ఎంతో సౌమ్యంగా ఉంటుందని. ఈ రాగంలోనే త్యాగరాజు ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ అంటూ మనం ప్రశాంతంగా ఉంటేనే హాయిగా ఉండగలుగుతామని ఒక కీర్తన రాశాడు. ‘గుప్పెడు మనసు’ చిత్రంలో మంగళంపల్లి బాలమురళి గానం చేసిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ ఈ రాగం ఆధారంగా చేసినదే. ఇంకా ‘శంకరాభరణం’లోని సదాశివబ్రహ్మం ‘మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే’ కూడా ఈ రాగంలో చేసినదే. మలయమారుతం ఈ రాగంలో త్యాగరాజు ‘మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే’ అంటూ మనోహ్లాదం కల్గించమని రాముని నుతించాడు. ఈ రాగంలోనే ‘ఉయ్యాలజంపాల’ చిత్రంలోని ‘కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది’ పాటను స్వరపరిచారు. మోహన రాగం ‘నను పాలింపగ నడచి వచ్చితివా’ అంటూ త్యాగయ్య ఈ రాగంలో సాక్షాత్తు భగవంతుడు తనను పాలించటానికి వచ్చాడని సంతోషంతో కీర్తించాడు. ఈ రాగంలో మనలను బాగా ఆకట్టుకుని, పడవ మీద ప్రయాణింపచేసిన పాట ‘మాయాబజార్’ చిత్రంలోని ‘లాహిరిలాహిరి లాహిరిలో’. హిందోళ ఈ రాగంలో త్యాగరాజు రచించిన ‘సామజవరగమనా’ అందరికీ సుపరిచితమైన కీర్తన. ‘సువర్ణ సుందరి’ చిత్రంలోని ‘పిలువకురా అలుగకురా’ పాట ఈ రాగంలో సంగీతం సమకూర్చినదే. వలజి ఈ రాగంలో ఓగిరాల వీర రాఘవశర్మ ‘శ్రీగాయత్రీదేవీ’ అంటూ అమ్మవారిని కీర్తించాడు. ఇదే రాగంలో ‘శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ’ చిత్రంలో ‘వసంత గాలికి వలపులు రేగ /వరించు బాలిక మయూరి కాగా’ పాట ఉంది. ‘ప్రేమించి చూడు’ చిత్రంలో పి. బి. శ్రీనివాస్ పాడిన ‘వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావా నా చెలి’ పాట ఈ రాగంలో స్వరపరిచినదే. మధ్యమావతి ఈ రాగంలో ‘అలకలల్లలాడగ గని’ అంటూ రాముడిని కీర్తించాడు త్యాగయ్య. ఇదే రాగంలో ‘ధర్మదాత’ చిత్రంలోని ‘జో లాలీ,.. లాలీ నా చిట్టి తల్లీ’ పాటను స్వరపరిచారు. కొన్ని రాగాలు మనసుకు ఉల్లాసం కలిగించడనికి కారణం స్వరస్థానాల మధ్య దూరం ఉండటమే. సంగీతం సప్తస్వర సమ్మిళితం. కాని ఈ రాగాలలో కేవలం ఐదు స్వరస్థానాలు మాత్రమే ఉంటాయి. దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. అంటే అర్థం కొన్ని స్వరస్థానాల కలయిక వల్ల ఆ మాధుర్యం వస్తుంది. ‘సరిగమపదని’ అనే స్థానాలలో రి అక్షరం మొత్తం మూడు రకాలుగా ఉంటుంది. గ రెండు రకాలుగా ఉంటుంది. అంటే స పక్కన మొదటి రి కాకుండా రెండో రీ వస్తే అప్పుడు వాటి కలయిక కారణంగా పాటకు మాధుర్యం వస్తుంది. స పక్కన మొదటి రి, గ పక్కన మొదటి మ వస్తే అవి వీరోచిత రాగాలుగా వినిపిస్తాయి. దూరం ఉండాలి కాని, దూరంగా ఉండకూడదు. అటువంటివి ఈ రాగాలన్నీ. ఈ రాగాలు వింటే మానసిక ప్రశాంతత వస్తుంది. – మోదుమూడి సుధాకర్, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు. మానసిక ఆరోగ్యం కోసం ఎక్కువ శక్తివంతంగా ఉండే రాగాలను వినిపిస్తాం. సంతోషం కోసం ‘హంసదర్శని’ రాగాన్ని వినిపిస్తాం. ‘కేదారగౌశ’, «‘దీర శంకరాభరణం’ వంటి రాగాలు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ‘అభోగి రాగం’ ప్రశాంతతను చేకూరుస్తుంది. ‘అభేరి’ సంతోషాన్ని ఇస్తుంది. నేను రాగాల మీద పరిశోధన చేశాను. ఏ రాగం ఎటువంటి సమయంలో, ఏ విధంగా పనిచేస్తుందనే అంశం ఆధారంగా అవసరమైన వారికి మ్యూజిక్ థెరపీ చేస్తాను. – డాక్టర్ మీనాక్షి రవి, డైరెక్టర్, మీరా సెంటర్ ఫర్ మ్యూజిక్ థెరపీ, బెంగళూరు. –డాక్టర్ వైజయంతి పురాణపండ -
దేశభక్తిని ప్రేరేపించే సంగీతం
అడ్డగుట్ట: ఆలిండియా పోలీస్ బ్యాండ్ కాంపిటీషన్ 20వ ముగింపు వేడుకలు ఆదివారం సికింద్రాబాద్లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ (ఆర్ఎస్సీ) గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. సంగీతం సాయుధ దళాలలో ధైర్యాన్ని, శౌర్యాన్ని రేకెత్తిస్తుందన్నారు. దేశభక్తిని, దేశ రక్షణపై నిబద్ధతను ప్రేరేపిస్తుందన్నారు. నిజాయితీతో కూడిన సేవలతో అవసరమైన మిత్రుడిగా ప్రజల అంచనాలకు అనుగుణంగా జీవించాల్సిన బాధ్యత దేశంలోని అన్ని పోలీసు దళాలకు ఉందన్నారు. ఆలిండియా పోలీస్ బ్యాండ్ ఛాంపియన్షిప్ పోటీలు అన్ని సాయుధ, పారా సైనిక దళాల మధ్య సహకారాన్ని మెరుగుపరుస్తాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్కుమార్ అన్నారు. పోటీలను ఆర్పీఎఫ్ జాతీయ స్థాయిలో 3వసారి నిర్వహిస్తోందన్నారు. అనంతరం, బ్రాస్ బ్యాండ్ క్యాటగిరీలో 20వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ ఛాంపియన్షిప్ విజేత ట్రోఫీని సీఆర్పీఎఫ్, పైప్ బ్యాండ్ ట్రోఫీని మహారాష్ట్ర పోలీసులకు అందజేశారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా, అదనపు జీఎం బి.బి.సింగ్, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ సెక్యూరిటీ కమీషనర్ ఈశ్వరరావు పాల్గొన్నారు. వరంగల్పై ప్రత్యేక ప్రేమ సాక్షి ప్రతినిధి, వరంగల్: కాకతీయుల సుపరిపాలనకు కేంద్రమైన ఓరుగల్లుకు రావడం.. ఇక్కడి గడ్డపై జరిగే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. వరంగల్లో ఆంధ్రా విద్యాభివర్ధిని (ఏవీవీ) కళాశాల 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆయన మాట్లాడారు. వరంగల్ సాంస్కృతిక వారసత్వం ఘనమైనదని, ప్రఖ్యాతి గాంచిన ఓరుగల్లు ఖిలాతో పాటు, వేయి స్తంభాల గుడి, రామప్ప, లక్నవరం, పాకాల వంటి అతి పెద్ద చెరువులు వరంగల్ నగరానికి కంఠాభరణాల్లాంటివని కొనియాడారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న నగరం కాబట్టే.. కేంద్ర ప్రభుత్వం.. ఓరుగల్లును ‘హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్’పథకం కింద మరింత అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రావ్యంగా సాగిన మధురగీతం జాకబ్ సన్!!
తెలుగు క్రైస్తవలోకంలో ఎన్నో ఏళ్లపాటు తనదైన ముద్ర కలిగిన ఎంతో శ్రావ్యమైన క్రైస్తవ భక్తి సంగీత బాణీలతో విశ్వాసులను ఎంతో అలరించి కాంతులీనిన క్రైస్తవ సంగీత దర్శకుడు ఎం.డి.జాకబ్ సన్ అనే ఒక అద్భుతమైన తార కనుమరుగైంది. కొంతకాలంగా అనారోగ్యంగా ఉండి, 67 ఏళ్ళ వయసులో ఇటీవలే ఆయన కన్ను మూశారు. ఆయనకు భార్య రోసెలిన్, ఇద్దరు కూతుళ్లు సునయన, కత్రీనా ఉన్నారు. క్రైస్తవలోకంలో ఈ రోజున గొప్ప గాయకులుగా, సంగీత వాద్యకారులుగా ఉన్న చాలామంది జాకబ్ సన్ చేతిలోనే శిక్షణనొంది, ఆయన బాణీలద్వారానే పేరు పొందారు. ఆయన 1978 నుండి, 1980, 1990 దశకాల్లో ‘విశ్వవాణి’ అనే అద్భుతమైన క్రైస్తవ రేడియో కార్యక్రమాలకు చేసిన సంగీత పరిచర్య చిరస్మరణీయమైనది. అప్పట్లో పల్లెటూళ్లలో ఉన్నవాళ్లకు విశ్వవాణి కార్యక్రమంతోనే తెల్లవారేది, మళ్ళీ విశ్వవాణి కార్యక్రమంతోనే రాత్రయ్యేది. ఆ రోజుల్లో విశ్వవాణి రేడియో కార్యక్రమంలో దైవజనులు ఆరార్కే మూర్తి ప్రసంగం జనహృదయాలకు ఎంతగా హత్తుకునేదో, జాకబ్ సన్ పాటలు కూడా అంతే జనరంజకంగా ఉండేవి. ఆ తరాల తెలుగు క్రైస్తవులకు జాకబ్ సన్ ఒక సెలెబ్రిటీ!! ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెదధన్వాడ గ్రామానికి చెందిన జాకబ్ సన్ మహబూబ్ నగర్లో డిగ్రీ చదువుతున్నపుడు పెట్కార్ గారనే ఇంగ్లీష్ మిషనేరీ గారు. ఆరార్కే మూర్తి అనే దైవజనులు ఆయనలోని సంగీత ప్రతిభను గుర్తించి హైదరాబాద్లో తాము కొల్పిన ‘దేవుడు మాట్లాడాడు’ అనే స్టూడియోకు తీసుకొచ్చి తమ సంస్థ నిర్మించి, ప్రసారం చేస్తున్న తెలుగు క్రైస్తవ కార్యక్రమాలకు సంగీత దర్శకుడుగా నియమించారు. అదే కాలక్రమంలో విశ్వవాణి అనే పేరుతో ప్రాబల్యం పొందింది. అలా ఆరంభమైన జాకబ్ సన్ సంగీతపరిచర్య ద్వారా తెలుగు రాష్ట్రంలోని ఎందరో గాయకులూ, సంగీతకారులకు ఆయన స్టూడియోలో పాడి, వాయించి, అలా తెలుగు క్రైస్తవుల మన్నన పొందే ఆధిక్యత లభించింది. ‘దేవా నా దేవా’, ‘నా హృదయ సీమలో’, ‘దేవా నీవే నా ..’, ‘నే పాపినో ప్రభువా’, ‘దేవుని ఉపకారములలోన’, ‘ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు’ వంటి కబ్ సన్ బాణీ, సంగీతం కూర్చిన పాటలు, ఆ రోజుల్లో క్రెస్తవ చర్చిలు, విశ్వాసుల నాలుకలపై ఆడి, దైవికంగా మధురానుభూతులను పంచాయి. ఆయన సంగీతంలో, బాణీల్లో విశిష్టత ఏమిటంటే, అవి నేరుగా విశ్వాసి హృదయాన్ని తాకి మరో లోకంలోకి తీసుకెళ్తాయి. చాలా సాధారణమైన ఆ బాణీలు, ప్రజల్లోకి సునాయాసంగా వెళ్లి వాళ్లంతా హాయిగా పాడుకునేలా చేస్తాయి. ఆయన బాణీల్లో శ్రావ్యతే ప్రాధాన్యంగా ఉంటుంది. ఇంత గొప్ప ప్రతిభావంతుడైనా, అతిశయం, అహంకారమనేది ఆయనకసలు తెలియదు. ఎంతో నిరాడంబరంగా, వివాదాలకు దూరంగా, మృదుభాషిగా అందరిపట్లా స్నేహభావంతో మెలిగాడాయన. ఎంతోమంది అనామకులైన అతి సాధారణ గాయకులూ కూడా, ఆయన సంగీతం, ఆయన బాణీల్లోని విశిష్టత వల్ల గొప్ప గాయకులుగా పేరు ప్రతిష్టలు పేరొందారు. అందరితో కలిసిమెలిసి, ఆడుతూ, పాడుతూ, హాస్యోక్తులు వేస్తూ, తాను నవ్వుతూ అందరినీ నవ్వించడమే తప్ప ఎప్పుడూ ఎవర్నీ ఆయన నొప్పించిన సందర్భమే లేదు. సంగీతం, పాటలే తన లోకంగా బతికాడాయన. గోరంత ప్రతిభకు, తమ సొంత ‘మార్కెటింగ్ తెలివితేటలు’ జోడించి చూస్తుండగానే ఎంతో ఎత్తుకు ఆయన పరిచయం చేసిన అతి సాధారణ గాయకులు, సంగీతకారులే ఎదిగిపోయినా, ఎన్నడూ ఆయన వ్యసనపడలేదు. ఎంతటి పరిస్థితుల్లోనైనా తాను నొచ్చుకోకుండా, ఎవరినీ నొప్పించకుండా ఉండడానికే ప్రయత్నించేవాడే తప్ప, ధనార్జన పైన, పేరు సంపాదించడం పైన ఎన్నడూ దృష్టిపెట్టినవాడు కాదాయన. ప్రతి పరిస్థితిలోనూ, ఎంతో గుంభనంగా, నిండుగా జీవించాడు జాకబ్ సన్. జీవితమే క్రైస్తవ స్ఫూర్తితో సాగిన ఒక శ్రావ్యమైన సంగీత బాణీ జాకబ్ సన్!! అసూయకు, విమర్శలకు, వివాదాలకు తావివ్వని అసమానమైన విశ్వాసి ఆయన. తెలుగు క్రైస్తవ భక్తి సంగీత ప్రపంచంలో కొన్ని మైలు రాళ్ళ మీద ఆయన పేరు తప్పకుండా ఉంటుంది. శ్రావ్యమైన సంగీతంతో విలసిల్లే పరలోకంలో జాకబ్ సన్ తప్పక మరింత సంతోషంగా, ఆనందంగా ఉంటాడని సువార్తికుల విశ్వాసం. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ prabhukirant@gmail.com -
కాదలన్ కాదలిక్కుమ్ రీమిక్సింగ్ పాట
-
ఈ పాటల మాంత్రికుడి పాటలు వింటారా!
-
ఈ పాటల మాంత్రికుడి పాటలు వింటారా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘పాట మాధుర్యాన ప్రాణాలు విడుతునే’ అనడంలోనే పాట గొప్పతనం తెలుస్తోంది. సంగీత, సాహిత్యాల మేళవింపుతోనే పాటకు ఆ మాధుర్యం అబ్బుతుంది. కచేరి పాటలకన్నా సినిమా పాటలు ఎవరైనా ఎక్కువగా వింటారు. నాటి సినిమాల్లో పాట సాహిత్యానికి సంగీతం సమకూర్చగా నేటి రోజుల్లో సంగీత బాణికి పాటను కూరుస్తున్నారు. ఏదైనా శ్రోతలకు కావాల్సింది పాట మాధుర్యం. కొందరికి పాత పాటలు బాగా నచ్చవచ్చు. కొందరికి కొత్తవే నచ్చవచ్చు. మరికొందరికి పాత, కొత్త రెండూనూ. అది వారి వారి అభిరుచులపై ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఏ పాట నచ్చినా అందులో మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే ఆ పాట కూర్చిన రికార్డింగ్ రూమ్లో అది ఎలా వినిపిస్తుందో మన శ్రవణానికి అలాగే వినిపించాలి. పాట ప్రసారంలో కొంత నష్టం జరగొచ్చు. ఎక్కువ జరిగితే మాత్రం పాట మాధుర్యాన్ని కోల్పోతాం. ఒకప్పుడు ఎల్పీ రికార్డులు, పూల్ టేపులు, క్యాసెట్లు, తర్వాత సీడీలు, డీవీడీల, ఎంపీ 3ల రూపాల్లో మనకు పాటలు చేరాయి. రికార్డులు దెబ్బతిన్న, టేపులు నలిగినా, సీడీ, డీవీడీలు, గీతలు పడిన పాట వినసొంపులు పోయేవి. మళ్లీ మళ్లీ రికార్డులు చేయడానికి అప్పుడు మాస్టర్ కాపీలను భద్రంగా ల్యాబ్లో దాచేవారు. ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. అమెజాన్ మ్యూజిక్, ఆపిల్ మ్యూజిక్, గూగుల్ ప్లే మ్యూజిక్, ఐ ఇయర్ రేడియో, ట్యూన్ ఇన్ రేడియో, స్పాటిఫై, డీజర్, పండోరా, సౌండ్ క్లౌడ్ లాంటి ‘మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్’ చాలా వచ్చాయి. వీటి ద్వారా పాట ప్రసారంలో ‘నష్టం’ చాలా తక్కువ. తాజాగా టైడల్ అనే మరో యాప్ వస్తోంది. అందులో నష్టం మరీ, మరీ తక్కువ. అయితే వారు తీసుకునే సోర్స్ను బట్టి పాట నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే పాత పాటలు చాలా దెబ్బతిని ఉన్నాయి. ఇక్కడకే మనకు పాటలను మరమ్మతు చేసే మాంత్రికుడు సౌండ్ ఇంజనీర్ శ్రీజేష్ నాయర్ సేవలు అవసరం. పాత, కొత్త తేడా లేకుండా ఏ పాటనైనా ఆయన మునుపటిలా మరమ్మతు చేసి ఇవ్వగలరు. ‘జోధా అక్బర్, కామినీ, గ్యాంగ్స్ ఆఫ్ వాసేయ్పూర్ –2 సినిమాలకు ఆయన రీ రికార్డింగ్ మిక్సర్గా పనిచేశారు. వాసేయ్పూర్ చిత్రానికిగాను ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది. ఆయన పాత పాటలను మరమ్మతు చేసి వాటిని వినిపించడం కోసం 2017లో ‘ది మాస్టరింగ్ ప్రాజెక్ట్’ పేరిట ఓ యూట్యూబ్ చానెల్ను పెట్టారు. 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్య వచ్చిన హిందీ, తమిళ్, మలయాళం పాటలలో తనకు నచ్చిన పాటలను మరమ్మతు చేసి, వాటిని తన చానెల్ ద్వారా వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన చానెల్కు దాదాపు 50 వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 1994లో విడుదలైన ‘కాదలన్’ చిత్రంలో ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన పాటలను ఆయన మొదట మరమ్మతు చేశారు. ఎస్పీ బాల సుబ్రమణ్యం, ఉదిత్ నారాయణన్ పాడిన ‘కాదలన్ కాదలిక్కుమ్’ అనే పాటను ఇప్పుడు వింటుంటే నిన్ననే రికార్డు చేసినట్లు ఉంటుంది. ఆయన ఇప్పటి వరకు 430 పాటలను మరమ్మతుచేసి రీలోడ్ చేయగా, వాటిలో 169 పాటలు రెహమాన్ సమకూర్చినవి, 38 పాటలు ఇళయరాజా సమకూర్చినవి ఉన్నాయి. శ్రీజేష్ నాయర్ మరమ్మతు చేసిన వాటిలో ‘జియా జలే, దిల్ సే రే, తాల్ సే తాల్ మిలా, హే కాలీ కాలీ హాంకే, ముష్కిల్ బడా ఏ ప్యార్ హై లాంటి మధురమైన పాటలు ఎన్నో ఉన్నాయి. ఇదివరకు దూరదర్శన్లో ప్రతి ఆదివారం ఉదయం ‘చిత్రహార్’ కార్యక్రమం పేరిట వచ్చే పాటలను వింటున్నప్పుడు వాటిలో చాల దెబ్బతిన్న పాటలు నాయర్కు కనిపించాయట. అప్పటికి ‘డాల్బీ నాయిస్ రిడక్షన్’ వ్యవస్థ స్పీకర్లలలో ఉన్నప్పటికీ ఎక్కువ ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ దిశగా తాను కషి చేయాలని నాయర్ నిర్ణయానికి వచ్చాడట. అప్పటి నుంచి పాటలలోని సంగీతపరంగా చోటు చేసుకున్న లోపాలను గుర్తించి రీమిక్సింగ్ మొదలు పెట్టారు. అందుకోసం ఆయన ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ‘అవిడ్ ప్రో టూల్స్, ఏడిఎక్స్ ట్రాక్స్లతోపాటు ఇతర సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తున్నారు. నాయర్ మరమ్మతు చేసిన కొన్ని పాటలు అస్సలు వాటికన్నా బాగున్నాయని ఆయన చానెల్ సబ్స్క్రైబర్లు ప్రశంసిస్తుంటే, ఆయన ఒరిజనల్ పాటలో లేకున్నా కొన్ని చోట్ల బాస్ (మంద్ర ధ్వని), మరి కొన్ని చోట్ల ట్రెబుల్ (మూడింతల పిచ్) పెంచుతున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఒరిజనల్ పాటలో లేకపోయినా అక్కడ సంగీత దర్శకుడు రాబట్టాలనుకున్న పరిపూర్ణతను దష్టిలో పెట్టుకొని తాను మరమ్మతు చేస్తున్నానని ఆయన వివరణ ఇచ్చారు. -
సంగీతంతో ఎక్కువ పాలు ఇస్తున్న ఆవులు
సాక్షి, జగిత్యాల: పురాణాల్లో సంగీతాన్ని భగవంతుడిగా భావించడం జరిగింది. పెద్దవ్యాధులు కూడా సంగీతం వల్ల నయమవుతాయన్న విషయాన్ని ఆయుర్వేదం చెప్పింది. పశువులు కూడా సంగీతపు ఆనందాన్ని ఆస్వాదిస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. పాలు పితికే సమయంలో మధుర సంగీతాన్ని ఆలపిస్తే..పాల దిగుబడి పెరుగుతుంది. ఇప్పటికే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి వంటి కొన్ని దేవాలయాల గోశాలలో, కొన్ని డైరి ఫారాలలో ఈ పద్ధతి ఆచరిస్తున్నారు. మహారాష్ట్రలోని పూనే వద్ద కల పరాగ్ మిల్క్ ఫుడ్స్లో పాలు పితికే సమయాల్లో గాయకులు కిశోర్కుమార్, మహ్మాద్ రఫీల పాటల సీడీలు వేస్తున్నారు. దీంతో ఆవుల చెవులకు ఇంపైన సంగీతం వినిపిస్తే పాల దిగుబడి 3 శాతం పెరిగిందని పరాగ్ పుడ్స్ సీఎంఓ మహేష్ ఇస్రాని తెలిపారు. బారామతిలోని ఫ్రైబర్ డైనామిక్స్ డెయిరీ ఫాంలో కూడా ఆవులకు సితార్, తబలా సంగీతం వినిపిస్తున్నారు. -
కోడి ముందా? గుడ్డు ముందా?
ఈ సామెత తెలియనివాళ్లు ఉండరు. దీనికి సమాధానం తెలిసినవాళ్లూ ఉండరు. ఇప్పుడు శ్రుతీహాసన్ కూడా తన జీవితానికి ఈ సామెతను ఆపాదించారు. సినిమాలంటే మీకు చిన్నప్పుడే ఇష్టం ఏర్పడిందా? లేక మీ అమ్మానాన్న (కమల్హాసన్, సారిక), ఇంకా ఇతర కుటుంబ సభ్యులు సినిమాల్లో ఉన్నందువల్ల మీరూ వచ్చేశారా? అనే ప్రశ్న శ్రుతీహాసన్ ముందుంచితే– ‘‘కోడి ముందా? గుడ్డు ముందా? అంటే ఏం చెబుతాం. ఇది కూడా అంతే. నేను సినిమా వాతావరణంలోనే పెరిగాను. అయితే మీ ఫస్ట్ చాయిస్ ఏంటి? అని అడిగితే, ‘సంగీతం’ అంటాను. అయితే నన్ను సినిమానే సెలక్ట్ చేసుకుంది. ఎందుకంటే అది నా డెస్టినీ అని నా ఫీలింగ్. చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే మా నాన్నగారు యాక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ లొకేషన్కి వెళ్లేదాన్ని. జనరేటర్ వ్యాన్ దగ్గర కూర్చుని హోమ్వర్క్ రాసేదాన్ని. ప్రొడక్షన్లో ఉన్నవాళ్లంతా నన్ను గారం చేసేవారు. అందుకే చికెన్ అండ్ ఎగ్ ఎగ్జాంపుల్ చెప్పా. నాకు సినిమా మీద దానంతట అదే ప్రేమ పెరిగిందో, సినిమా పరిశ్రమ పిలిచింది కాబట్టి వచ్చానో తెలియడంలేదు. అయితే ఒకటి మాత్రం నిజం. నా జీవితాన్ని సినిమా నుంచి వేరుచేసి చూడలేను’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఓ అభిమాని ఇటీవల శ్రుతీహాసన్ని కలిశాడు. అభిమాన తారను కలిసినందుకు బోలెడంత ఆనందాన్ని వ్యక్తం చేసి, ‘మీ పెళ్లెప్పుడు? విందుకి వస్తాను’ అని ట్వీటర్ ద్వారా శ్రుతీని అడిగాడు. ‘‘పెళ్లి విందు అంటే ఇంకా చాలా టైమ్ ఉంది. నా బర్త్డే విందుకి వద్దువుగానిలే’’ అని సరదాగా సమాధానం ఇచ్చారామె. బాయ్ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే నుంచి విడిపోయిన శ్రుతి ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని అభిమానికి ఆమె ఇచ్చిన సమాధానం స్పష్టం చేస్తోంది కదూ. -
ఒక గంటలో అరవై పాటలు.. రికార్డు
టీ.నగర్: ఒక గంట సమయంలో 60 పాటలు పాడి రాజేష్ వైద్య ఆదివారం రికార్డ్ సాధించాడు. వీణ విద్వాంసుడిగా మేస్ట్రో అవార్డును అందుకున్న రాజేష్ వైద్య ప్రముఖ సంగీత దర్శకుడు జి.రామనాధన్ తమ్ముడి కుమారుడు. రాజేష్వైద్య తన బృందంతో 60 నిమిషాల్లో 60 పాటలు పాడి ఆసియా స్థాయిలో ఒక కొత్త రికార్డును సృష్టించాడు. ఆదివారం సాయంత్రం ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ రికార్డు సృష్టించారు. ఆసియా దేశంలో గల ప్రముఖులను ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా ఆ సంస్థ వెలుగులోకి తీసుకువస్తున్నది. ఆదివారం జరిగిన కార్యక్రమంలో రాజేష్వైద్య రికార్డును నెలకొల్పడంతో అనేక మంది నుంచి ప్రశంసలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నటుడు ప్రసన్న, నటి సుహాసినిలు పాల్గొని రాజేష్వైద్యను అభినందించారు. -
దిగ్గజాల ‘పాటల’ పల్లకి
న్యూఢిల్లీ: దేశీయంగా చౌక డేటా ప్యాక్లు అందుబాటులోకి రావటంతో ఆన్లైన్లో పాటల శ్రోతలు, వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో బడా విదేశీ సంస్థలూ భారత మార్కెట్పై దృష్టి పెడుతున్నాయి. కొత్త కొత్త కంపెనీల రాకతో ఆన్లైన్ పాటల మార్కెట్లో గట్టి పోటీ నెలకొంది. యాపిల్ మ్యూజిక్, యూట్యూబ్ మ్యూజిక్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, స్పాటిఫై, గానా, జియోసావన్ వంటి సంస్థలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ మ్యూజిక్ మార్కెట్ 2020 నాటికి 273 మిలియన్ డాలర్లకు చేరవచ్చని మార్కెట్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ అంచనా వేసింది. డిజిటల్ కంటెంట్లో మ్యూజిక్ హవా.. దేశీ యూజర్లు అత్యధికంగా వినియోగిస్తున్న డిజిటల్ కంటెంట్పై స్టాటిస్టా అనే డేటాబేస్ ప్లాట్ఫామ్ గతేడాది నిర్వహించిన సర్వే ప్రకారం పాటల కేటగిరీ అగ్రస్థానంలో ఉంది. 0–4 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్కోరులో మ్యూజిక్కు అత్యధికంగా 3.13 పాయింట్లు దక్కాయి. యాప్స్, టీవీ షోలు, సినిమాలు, వార్తాపత్రికలు, వీడియో గేమ్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం భారత్లో సుమారు 55 శాతం జనాభా.. మ్యూజిక్ వినడంపై దాదాపు 30 శాతం సమయాన్ని వెచ్చిస్తున్నారు. టాప్లో గానా.. పాటలంటే చెవి కోసుకునే దేశీవాసులు.. వినూత్న మ్యూజిక్ యాప్స్ వైపు మళ్లుతున్నారు. భారత్లో లాంచ్ చేసిన వారం రోజుల్లోనే యూట్యూబ్ మ్యూజిక్ను ముప్ఫై లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం దీనికి నిదర్శనం. ఇక ఇటీవలే భారత మార్కెట్లోకి ప్రవేశించిన స్వీడన్కు చెందిన మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ స్పాటిఫై విషయానికొస్తే వారం రోజుల వ్యవధిలో పది లక్షల మంది యూజర్లు దీనికి నమోదయ్యారు. సీఎంఆర్ గణాంకాల ప్రకారం దేశీయంగా యూజర్లు అత్యధికంగా ఇష్టపడుతున్న ఆన్–డిమాండ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్లో గానా (25 శాతం) అగ్రస్థానంలో ఉంది. యాపిల్ (20 శాతం), యూట్యూబ్ (20 శాతం), వింక్ (14 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మొబైల్ ఫోన్ మాధ్యమం ద్వారా చౌకగా, సులభతరంగా లభ్యమవుతుండటంతో దేశీయంగా ఆన్లైన్ మ్యూజిక్ శ్రోతల సంఖ్య పెరుగుతోందని సీఎంఆర్లో భాగమైన ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజీ) హెడ్ ప్రభు రామ్ పేర్కొన్నారు. ఆకర్షణీయ ప్యాకేజీలు.. యూజర్లను ఆకర్షించేందుకు ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థలు ఫీజులు తగ్గిస్తున్నాయి. నెలవారీ ప్యాకేజీలతో పాటు వారం వారీ, రోజువారీ ప్లాన్స్ను కూడా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి. జియోసావన్ తమ వార్షిక ఫీజును రూ.999 నుంచి రూ.299కి తగ్గించింది. గానా కూడా రూ. 1,098 నుంచి రూ.299కి తగ్గించింది. యాపిల్ మ్యూజిక్ కూడా భారత్లో నెలవారీ రేట్లను రూ.99కి తగ్గించింది. అటు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సైతం రూ. 99కే నెలవారీ ప్లాన్ అందిస్తోంది. అమెజాన్ మరికాస్త ఎక్కువగా ఆఫర్ చేస్తోంది. నెలకు రూ.129 ఫీజుకి అమెజాన్ ప్రైమ్తో పాటు అమెజాన్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. ఈ విషయంలో స్పాటిఫై కాస్త వెనుకబడినప్పటికీ కొంత ఆకర్షణీయమైన ప్లాన్స్ను ప్రవేశపెడుతోంది. భారత్లో రూ.119 సబ్స్క్రిప్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. సింగిల్ డే పాస్ నుంచి ఆరు నెలల దాకా గడువుండే ప్రీపెయిడ్ ప్లాన్స్ను అందిస్తోంది. అయితే, యూజర్ల నుంచి సబ్స్క్రిప్షన్పరంగా ఓటీటీ సంస్థలకు సమీపకాలంలో ఆదాయాలు పెద్దగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. మిగతా సంపన్న దేశాలతో పోలిస్తే కంటెంట్ను కొనుక్కునేందుకు దేశీ వినియోగదారులు అంతగా ఇష్టపడకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నాయి. -
సంగీతం ఎందుకు నేర్పుతున్నానో తెలుసా !!!
వాగ్గేయకారులలో ఒకరిగా ఖ్యాతి గడించిన శ్యామశాస్త్రి గారు పచ్చిమిరియం అప్పయ్య శాస్త్రి గారనే సంగీత విద్వాంసుడి దగ్గర అభ్యాసం కొనసాగిస్తున్నారు. ఒక సదాచారం ఏమిటంటే గురువుల ముందు తాంబూల చర్వణం చేయకూడదు. కానీ శ్యామశాస్త్రి గారికి తాంబూలం బాగా అలవాటు. గురువుగారు కూడా కాదని ఏనాడూ అనలేదు. ఒకనాడు గురువుగారితో మాట్లాడుతుండగా నోటిలో ఉన్న తాంబూల ఉచ్చిష్టం గురువుగారి ఉత్తరీయం మీద పడింది. పశ్చాత్తాప భావనతో వెంటనే శ్యామశాస్త్రి గారు... ఆ ఉత్తరీయం ఇస్తే ఉతికి పట్టుకొస్తానన్నారు. దానికి గురువుగారు...‘‘నీకు సంగీతం ఎందుకు నేర్పుతున్నానో తెలుసా ? ఏ నాటికయినా నీ నోటి తాంబూలం ఈ ఉత్తరీయం మీద పడాలని...’’ అన్నారు. అమ్మవారే పురుష స్వరూపంలో పుట్టిందని భావించిన అప్పయ్య శాస్తిగ్రారు– శ్యామశాస్త్రిని ఆ పేరుతో పిలిచేవారు కారు... ‘కామాక్షీ’ అని పిలిచేవారు. ఈ శిష్యుడికి తాను సంగీతం నేర్పడం లేదు, అతనిలో అప్పటికే ఉన్న సంగీతాన్ని ప్రచోదనం చేస్తున్నానంతే – అని భావించేవారు. సౌందర్యలహరిలో శంకరులంటారు – అమ్మవారి తాంబూలం ఎవరినోట్లోకయినా వెళ్ళిందా వారు మహా కవులయి పోతారు– అని. అలాభావించినగురువుగారు పొంగిపోయారు. తరువాత కాలంలో శ్యామశాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులయ్యారు.ఆ రోజుల్లో భూలోకం చాపచుట్టు కేశవయ్య గారని బిరుదులతో కూడిన గొప్ప సంగీత విద్వాంసుడు ఏనుగెక్కి వస్తుండేవారు. ‘నన్ను గెలవగలిగిన వాడెవడయినా ఉన్నాడా ?’ అని చాటింపు వేసుకుని వచ్చాడు. శ్యామశాస్త్రి గారితో వాదనకు రాజాస్థానంలో ఏర్పాటు చేసారు. వాదనలో మొదటివంతు శ్యామశాస్త్రి గారిది. శిరస్సు కదపకుండా తానం పలకమన్నారు. శాస్త్రరీత్యా తానం పలికేటప్పుడు శిరస్సు కదపకూడదు. వచ్చిన ఆ విద్వాంసుడు అలా చేయలేకపోయారు. తరువాతి వంతు కేశవయ్యగారిది. సింహనందనరాగంలో పాడమని సవాల్ విసిరారు. శ్యామశాస్త్రి అలవోకగా పాడేసారు. తరువాతి వంతు వచ్చినప్పుడు.. శరభనందన రాగంలో పాడమని ఆయన కేశవయ్యగారిని అడిగారు. శరభుడంటే సింహాన్ని చంపగలిగి, 8 కాళ్ళు కలిగి, పక్షి శిరస్సు కలిగిన ఒక స్వరూపం. ఈ రాగాన్ని శ్యామశాస్త్రి గారు అభివృద్ధి చేసారు. అందులో 19 3/4 వంతు మాత్రలు. ఒక ఆవృతిలో 79 అక్షరాలు వచ్చేటట్లుగా ఆలాపన చేయాలని సవాల్ విసిరారు. ఓటమిని అంగీకరించిన కేశవయ్యగారు, శ్యామశాస్త్రి గారి ఔన్నత్యాన్ని అభినందించి వెళ్ళిపోయారు. ఆ విధంగా ఆయన నాయకరాజుల గౌరవాన్ని నిలబెట్టారు.శ్యామశాస్త్రి జ్యోతిష శాస్త్ర నిపుణులు కూడా. తన భార్య మరణించిన ఐదవరోజున తాను మరణిస్తానని ముందుగానే చెప్పారు. చెప్పినట్లుగానే ఆయన ఇచ్ఛామోక్షాన్ని పొందారు. మిగిలిన ఇద్దరూ... త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు కూడా ఇలా ఇచ్ఛామోక్షాన్ని పొందిన వారే. త్యాగయ్యగారి కయితే బ్రహ్మకపాల మేధనం జరిగింది. ఈ ముగ్గురూ నాదోపాసన చేసిన వారే.శ్యామశాస్త్రి గారు అద్భుతమైన రెండు కీర్తనల్ని సంస్కృతంలో, తెలుగులో ఇచ్చారు. ఈ రెండూ కళ్యాణి రాగంలో ఉంటాయి. వీటిని మీరు ఏదయినా సంగీత వాద్య పరికరంమీద మోగిస్తే, ఏ కీర్తన పలికిస్తున్నారో తెలియదు. కేవలం కంఠంతో పాడితేనే ఇది ఫలానా కీర్తన అని తెలుస్తుంది. అలా ఇచ్చిన కీర్తనలో ఒకటి–‘హిమాద్రిసుతే పాహిమాం వరదే పరదేవతే/సుమేరుమధ్యవాసినీ, అంబ శ్రీకామాక్షి....’ -
నగరంలో ఒకరోజు...
ఆయన పేరు బంక సంగీతం కుమార్. వీరి నాన్న పేరు బంక అప్పారావు. ఈయన సంగీతం అంటే చెవి కోసుకుంటాడు. ఈ క్రమంలో రెండుసార్లు చెవికి సర్జరీ కూడా అయింది. సంగీతంపై తనకున్న వీరాభిమానానికి గుర్తుగా కొడుక్కి ‘సంగీత కుమార్’ అని పేరు పెట్టి మురిసిపోయేవాడు.‘‘నీకు అక్షరాలు రాకపోయినా ఫరవాలేదు. సరిగమలు వస్తే చాలు’’ అంటుండేవాడు కొడుకుతో.సంగీతంకుమార్కి మాత్రం ‘సంగీతం’ తప్ప ప్రపంచంలోని ప్రతి విషయమూ ఆసక్తికరమే.కొడుకు అనాసక్తిని గమనించిన తండ్రి....‘‘నువ్వు సంగీతం నేర్చుకొని కచేరి ఇవ్వకపోయావా...నా శవాన్ని కళ్ల జూస్తావు’’ అని ఒక ఫైన్మార్నింగ్ వార్నింగ్ ఇచ్చాడు.దీంతో...‘30 రోజుల్లో సంగీతం’ క్లాసులకు వెళ్లాడు సంగీతం కుమార్. ఆ మరుసటిరోజు నగరంలో ‘కళాతృష్ణ’ ఆడిటోరియంలో అరంగేట్రానికి పూనుకున్నాడు.రసజ్ఞులైన ప్రేక్షకులతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది.కచేరి మొదలైన పావుగంటలోనే...టీవీలో బ్రేకింగ్ న్యూస్...‘కళాతృష్ణ ఆడిటోరియంలో ఉగ్రవాదుల బాంబుదాడి’పూర్తి వివరాలు ఇంకా తెలియకముందే టీవీలో మరోవైపు చర్చాకార్యక్రమం మొదలైంది.‘‘ఈ ఉగ్రవాదం ఉంది చూశారు...’’ అని ఒకాయన అందుకున్నారు.‘‘ఏం చూడమంటారు నా బొంద....ఇన్ని రోజులు కళ్లు మూసుకున్నారా! పట్టపగలు నట్టనడివీధిలో ఆడిటోరియంలో ఉగ్రవాదులు బాంబు దాడి చేస్తే...చట్టం ఏం చేస్తుంది? అసలు ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి? గుర్రు పెట్టి నిద్రపోతున్నాయా!’’‘‘నిద్రపోవడం మీ పార్టీ వాళ్ల పేటెంట్.. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా ప్రశాంతంగా ఉందా? మా పార్టీ అధికారంలో ఉన్నప్పటి కంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే శాంతిభద్రతలు సవ్యంగా లేవని పాత న్యూస్పేపర్లను తిరిగేస్తే అర్థమవుతుంది’’ ‘‘మిమ్మల్ని వాళ్లు, వాళ్లని మీరు తిట్టడం సమస్యకు పరిష్కారం కాదు. అందరం కలిసికట్టుగా ఈ సమస్యకు పరిష్కారం వెదకాలి ఈలోపు బ్రేకింగ్ న్యూస్...‘కళాతృష్ణ బాంబుదాడి ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణహాని జరగలేదు. ఒక్కరిద్దరూ మాత్రం తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం అయింది’ బాంబుస్క్వాడ్ రంగంలోకి దిగింది. ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ వాడారా? ఇతర పేలుడు పదార్థాలు వాడారా? అనేదాని గురించి లోతుగా దర్యాప్తు జరిగింది. కానీ చిన్న ఆధారం కూడా దొరకలేదు. మిస్టరీ వీడలేదు. దీంతో ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిది ప్రభుత్వం. రెండు రోజులు తరువాత జరిగిన ప్రెస్మీట్లో దర్యాప్తు అధికారులు ప్రకటించిన విషయాలు ఇలా ఉన్నాయి...‘‘అందరూ అనుకున్నట్లు కళాతృష్ణలో ఉగ్రవాదుల బాంబుదాడి జరగలేదు. ఏ ఉగ్రవాద కుట్ర కూడా ఇందులో లేదు. ఈ విధ్వంసానికి మూలకారణం ఎవరో తెలుసా? సంగీత కుమార్...సంగీతంలో ప్రావీణ్యం సంపాదిస్తే విద్వాంసుడు అవుతాడు...పైపైన నేర్చుకొని కచేరీలు ఇస్తే విధ్వంసుడు అవుతాడని చరిత్ర మరోసారి నిరూపించింది. తన తండ్రి బలవంతం మేరకు హడావుడిగా సంగీతం నేర్చుకొని, అంతకంటే హడావుడిగా కచేరి ఏర్పాటు చేశాడు కుమార్. ఈయన సంగీతం ధాటికి ప్రేక్షకులు తాళలేకపోయారు. ఎటువాళ్లు అటు పరుగులు తీశారు. తొక్కిసలాట జరిగింది. అనేక మంది గాయపడ్డారు.సంగీతానికి రాళ్లు కరుగుతాయని అంటారు... దీనిసంగతేమిటోగానీ... కుమార్ సంగీతం ధాటికీ హాలు పూర్తిగా దెబ్బతింది. పైనున్న ఫ్యానులు ఊడిపడి ప్రేక్షకుల తలలకు గాయాలయ్యాయి....’’టీవీలో దర్యాప్తు అధికారుల ప్రెస్మీట్ను చూసి కుప్పకూలిపోయాడు బంక అప్పారావు.‘‘పదితరాలకు సరిపడే ఆస్తులు సంపాదించాను. కానీ ఏంలాభం? నా కోరికను నెరవేర్చుకోలేకపోతున్నాను.నా కొడుకు కచేరి చేయాలనేది నా చిరకాల కోరిక.ఇక ఇప్పుడు వాడి కచేరి చూడడానికి ఎవరు వస్తారు? ప్రాణాలు ఎవరు పణంగా పెడతారు. అయ్యో దేవుడా...నాకు ఎంత పెద్ద శిక్ష విధించావయ్యా’’ అని మంచం పట్టాడు అప్పారావు.మంచానా పడ్డ అప్పారావును తిరిగి మామూలు మనిషిని చేయడానికి దేశవిదేశాలనుంచి పెద్ద పెద్ద డాక్టర్లను రప్పించారు. ఏవేవో వైద్యాలు చేశారుగానీ ఏవీ వర్కవుట్ కాలేదు. చైనా వైద్యుడు డా.కుంపె డాంగ్ ఇలా అన్నాడు...‘‘నాయనా కుమారూ...మనోవ్యాధికి మందులేదు. నువ్వు కచేరి చేయాలనేది ఆయన కోరిక. అది చేస్తేగానీ మీ నాయిన మళ్లీ మామూలు మనిషి కాలేడు’’అప్పుడు కుమార్ అసిస్టెంట్ ఇలా ఆందోళనగా అరిచాడు...‘‘అయ్యగారు కచేరి చేయకపోతే...పోయేది పెద్ద అయ్యగారు మాత్రమే.చేస్తే...పోతారు....అందరూ పోతారు...నాతో సహా’’ ‘‘విక్రమార్కా! ఇప్పుడు చెప్పు. మంచం పట్టిన అప్పారావు...చచ్చి శ్మశానానికి వెళ్లాడా? లేక కోలుకున్నాడా? సంగీతకుమార్ కచేరి చేశాడా? నా ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయావో...’’ హెచ్చరించాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు గొంతు విప్పాడు....వారం తిరగకముందే అప్పారావు భేషుగ్గా కోలుకున్నాడు.దీనికి కారణం కుమార్ సంగీత కచేరి చేయడం. విశేషం ఏమిటంటే...కచేరి పూర్తయేంత వరకు పిన్డ్రాప్ సైలెన్స్. ఒక్కరూ సీట్లో నుంచి లేవలేదు. కచేరి బ్రహ్మాండంగా విజయవంతమైంది’’‘‘అంటే...సంగీత కుమార్ సంగీతంలో ప్రావీణ్యం సాధించాడా?’’ ఆసక్తిగా అడిగాడు భేతాళుడు.‘‘ప్రావీణ్యమా పాడా!’’‘‘మరి ఎలా?’’‘‘చెబుతావిను. సంగీతకుమార్కి టెక్ నాగలింగం అని ఒక మిత్రుడు ఉన్నాడు. అతనికి టెక్నాలజీ మీద మంచి పట్టు ఉంది. సైన్స్ పత్రికలు రెగ్యులర్గా చదువుతుంటాడు. ఆమధ్య ఒక ఆర్టికల్ చదివాడు. బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కర్ణకఠోర శబ్దాలను నిరోధించే త్రీడి టెక్నాలజీని తయారుచేశారు. ఈ టెక్నాలజీ సహాయంతో విమాన,హెలికాప్టర్లు, డ్రోన్లు...మొదలైన వాటి నుంచి భీకరశబ్దాలు వినిపించకుండా నిరోధించవచ్చు. ఈ ఆర్టికల్ చదివిన వెంటనే ‘లడ్డూ కావాలా నాయనా’ అని నాగలింగం మెదడులో ఒక ఐడియా ఫ్లాష్ అయింది. అంతే...బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలను సంప్రదించి వారి టెక్నాలజీని కళాతృష్ణ ఆడిటోరియంలో వాడారు. దీంతో...కుమార్ కచేరి ఇస్తున్న మాటేగాని...అతని నోటి నుంచి ఒక్క శబ్దం కూడా ప్రేక్షకమహాశయులకు వినిపించలేదు. అలా కథ సుఖాంతమైంది’’ అని చెప్పాడు విక్రమార్కుడు. – యాకుబ్ పాషా -
భారత్లోకి ప్రవేశించిన యూట్యూబ్ మ్యూజిక్
న్యూఢిల్లీ: మ్యూజిక్ సేవలను అందించే యూట్యూబ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ను యూట్యూబ్ బుధవారం భారత్లో ఆవిష్కరించింది. వేలాది పాటలు, రీమిక్స్లు, లైవ్ ప్రదర్శనలు, కవర్, మ్యూజిక్ వీడియోలు ఇందులో లభించనున్నాయి. అన్ని రకాల మ్యూజిక్లను మొదటి సారిగా ఒకే వేదికగా అందిస్తున్నట్టు యూట్యూబ్ తెలిపింది. ప్రకటనలతో కూడిన మ్యూజిక్ సేవలు ఉచితంగా పొందొచ్చు. అదే సమయంలో యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం వెర్షన్ను కూడా యూట్యూబ్ తీసుకొచ్చింది. సభ్యత్వ రుసుం చెల్లించడం ద్వారా పూర్తి స్థాయి మ్యూజిక్ సేవలను ఇందులో పొందొచ్చు. ప్రతీ నెలా రూ.99 నుంచి సబ్స్క్రిప్షన్ మొదలవుతుంది. ఇందులో ప్రకటనలు ఉండవు.