చెంగాళమ్మ గుడిలో వైభవంగా కలశపూజ
సూళ్లూరుపేట: గురుపూర్ణిమ ఉత్సవాల్లో భాగంగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం 108 కలశాలను ప్రతిష్టించి విశేష పూజలు నిర్వహించారు. ఇప్పటికే 45 కలశాలను కాళంగి పరివాహక ప్రాంతంలోని ఆలయాలకు పంపిన సంగతి తెలిసిందే. 19వ తేదీన మొత్తం 153 కలశాల్లోని పవిత్రజలాలతో అమ్మవారికి అభిషేకం చేయనున్నారు. అషాడ పౌర్ణమిని పురస్కరించుకుని అదేరోజు అమ్మవారికి మహాచండీయాగం చేస్తారు.