నాగాయలంక తీరంలో శ్రీలంక బోటు! | sri lankan boat in nagayalanka | Sakshi
Sakshi News home page

నాగాయలంక తీరంలో శ్రీలంక బోటు!

Published Fri, Nov 13 2015 8:37 AM | Last Updated on Fri, Nov 9 2018 6:39 PM

sri lankan boat in nagayalanka

మచిలీపట్నం: కృష్ణాజిల్లా నాగాయలంక సముద్ర తీరానికి శుక్రవారం తెల్లవారుజామున విదేశీ బోటు కొట్టుకు వచ్చింది. దీంతో మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సముద్ర తీరానికి చేరుకుని... బోటును పరిశీలించారు. సదరు బోటు శ్రీలంకకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

గతంలో ఈ బోటు సముద్రంలో మునిగిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తుపాన్ కారణంగా బోటు తీరానికి కొట్టుకొచ్చి ఉంటుందని పోలీసులు అంటున్నారు. దీనిపై పోలీసులు మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement