Sri Lanka
-
శ్రీలంకను చిత్తు చేసిన న్యూజిలాండ్
మహిళల క్రికెట్లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (మార్చి 16) జరిగిన టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో రెండో మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ శ్రీలంకను 113 పరుగులకే (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు బ్రీ ఇల్లింగ్, జెస్ కెర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఫ్లోరా డెవాన్షైర్, బ్రూక్ హ్యలీడే చెరో వికెట్ దక్కించుకున్నారు. కెప్టెన్ సూజీ బేట్స్ (4-1-16-0) వికెట్ తీయకపోయినా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్లో మనుడి ననయక్కార (35) టాప్ స్కోరర్గా నిలువగా.. చమారీ ఆటపట్టు (23), కవిశ దిల్హరి (12), నిలాక్షి డిసిల్వ (20), హర్షిత మాధవి (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. విష్మి గౌతమ్ డకౌట్ కాగా.. సుగంధిక కుమార్ 1 పరుగు చేసి ఔటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. సుజీ బేట్స్ (47), బ్రూక్ హ్యాలీడే (46 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడి న్యూజిలాండ్ను గెలిపించారు. న్యూజిలాండ్ ప్లేయర్స్లో జార్జియా ప్లిమ్మర్ 4, ఎమ్మా మెక్లియాడ్ 11 పరుగులకు ఔటయ్యారు. హ్యాలీడే.. ఇజ్జీ షార్ప్తో (8 నాటౌట్) కలిసి న్యూజిలాండ్ను విజయతీరాలకు చేర్పింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో నిలిచింది. తొలి టీ20లో శ్రీలంక న్యూజిలాండ్పై సంచలన విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో టీ20 మార్చి 18న డునెడిన్లో జరుగనుంది. కాగా, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం శ్రీలంక న్యూజిలాండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్ను ఆతిథ్య న్యూజిలాండ్ 2-0 తేడాతో గెలుపొందింది. -
న్యూజిలాండ్కు షాకిచ్చిన శ్రీలంక
పరిమత ఓవర్ల సిరీస్ల కోసం న్యూజిలాండ్లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల జట్టు తొలి విజయం సాధించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (మార్చి 14) జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. లంక బౌలర్లు మల్కి మదారా 3, కవిష దిల్హరి, ఇనోషి ప్రియదర్శిని తలో 2, సుగంధిక కుమారి, చమారీ ఆటపట్టు చెరో వికెట్ తీసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో ఎమ్మా మెక్లియోడ్ (44), కెప్టెన్ సూజీ బేట్స్ (21), జెస్ కెర్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జార్జియా ప్లిమ్మర్ 2, బ్రూక్ హ్యాలిడే 4, ఇజ్జి షార్ప్ 0, మ్యాడీ గ్రీన్ 5, పోల్లి ఇంగ్లిస్ 4, రోస్మేరీ మైర్ 0, ఎడెన్ కార్సన్ 7 పరుగులు చేశారు. లంక బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు.అనంతరం ఓపెనర్ చమారీ ఆటపట్టు (48 బంతుల్లో 64 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిలాక్షి డిసిల్వతో (12 నాటౌట్) కలిసి ఆటపట్టు లంకను విజయతీరాలకు చేర్చింది. లంక ఇన్నింగ్స్లో విష్మి గౌతమ్ 7, హర్షిత సమరవిక్రమ 2, కవిశ దిల్హరి 12 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 2 వికెట్లు పడగొట్టింది. ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా, ఈ పర్యటనలో శ్రీలంక ముందుగా వన్డే సిరీస్ ఆడింది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండు, మూడు మ్యాచ్ల్లో న్యూజిలాండ్ జయకేతనం ఎగురవేసింది. రెండో టీ20 క్రైస్ట్చర్చ్ వేదికగా మార్చి 16న జరుగనుంది. -
శ్రీలంకలో నటి కీర్తి సురేష్ సందడి ఫోటోలు వైరల్
-
శ్రీలంకను చిత్తు చేసిన శిఖర ధవన్ సేన
ఆసియా లెజెండ్స్ లీగ్ ఆరంభ ఎడిషన్లో (2025) శిఖర్ ధవన్ నేతృత్వంలోని ఇండియన్ రాయల్స్ బోణీ కొట్టింది. నిన్న (మార్చి 11) శ్రీలంక లయన్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ 46 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.5 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. వన్డౌన్ బ్యాటర్ ఫయాజ్ ఫజల్ (52) మెరుపు అర్ద సెంచరీ సాధించి భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో శిఖర్ ధవన్ 16, రాహుల్ యాదవ్ 21, మనోజ్ తివారి 3, యోగేశ్ నగర్ 0, మన్ప్రీత్ గోని 28, జకాతి 23, అనురీత్ సింగ్ 2 పరుగులు చేయగా.. రోహన్ రతి, మునాఫ్ పటేల్ డకౌట్లయ్యారు. లంక బౌలర్లలో సంజయ 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను ఇబ్బంది పెట్టాడు. తిలకరత్నే దిల్షన్ 2, అరుల్ ప్రగాసమ్, ఉపుల్ ఇంద్రసిరి, తుషారా, కెప్టెన్ తిసారి పెరీరా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో జకాతి 3 వికెట్లు పడగొట్టగా.. మనోజ్ తివారి, అనురీత్ సింగ్, మన్ప్రీత్ గోని తలో 2 వికెట్లు తీశారు. లంక ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 పరుగులు చేసిన లసిత్ లక్షన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. మెవన్ ఫెర్నాండో (20 నాటౌట్), రవీన్ సాయర్ (18), తిసారి పెరీరా (10) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ బ్యాటర్ తిలకరత్నే దిల్షన్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఈ టోర్నీలో భారత్ మొన్న (మార్చి 10) జరగాల్సిన మ్యాచ్లో బంగ్లాదేశ్ టైగర్స్తో తలపడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నిన్న జరగాల్సిన మరో మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్పై ఆసియా స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.కాగా, ఆసియా లెజెండ్స్ లీగ్ తొలి ఎడిషన్ (2025) మార్చి 10న ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు (ఏషియన్ లయన్స్, శ్రీలంక లయన్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్, ఇండియన్ రాయల్స్, బంగ్లాదేశ్ టైగర్స్) పాల్గొంటున్నాయి. ఏషియా ప్రాంతానికి చెందిన మాజీ స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియన్ రాయల్స్ తరఫున టీమిండియా స్టార్లు శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, మనోజ్ తివారి, మునాఫ్ పటేల్ తదితర స్టార్లు ఆడుతున్నారు. -
సంగక్కర విధ్వంసకర శతకం.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన శ్రీలంక
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో శ్రీలంక మాస్టర్స్ జోరు కొనసాగుతుంది. ఇంగ్లండ్ మాస్టర్స్తో నిన్న (మార్చి 10) జరిగిన మ్యాచ్లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో భారత మాస్టర్స్ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు నాకౌట్స్కు అర్హత సాధించింది. 4 మ్యాచ్లు ఆడినా ఒక్క విజయం కూడా సాధించని ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.నిన్నటి మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక.. ఇంగ్లండ్ మాస్టర్స్ను స్వల్ప స్కోర్కే కట్టడి చేసింది. శ్రీలంక బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉడాన, దిల్రువన్ పెరీరా, గుణరత్నే, చతురంగ, జీవన్ మెండిస్ తలో వికెట్ తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ మస్టర్డ్ (39 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (10), టిమ్ ఆంబ్రోస్ (17), డారెన్ మ్యాడీ (15), టిమ్ బ్రేస్నన్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఉడాన బంతితో సత్తా చాటడంతో పాటు ఫీల్డింగ్లోనూ మెరిశాడు. ఈ మ్యాచ్లో అతను మూడు క్యాచ్లు పట్టాడు.సంగక్కర విధ్వంసకర శతకంస్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక ఓపెనర్ కుమార సంగక్కర విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. సంగ 47 బంతుల్లో 19 ఫోర్లు, సిక్సర్ సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. సంగక్కరకు మరో ఎండ్లో ఎలాంటి సహకారం లభించనప్పటికీ.. ఒంటిచేత్తో శ్రీలంకను గెలిపించాడు. లంక ఇన్నింగ్స్లో రొమేశ్ కలువితరణ 16, అసేల గుణరత్నే 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. సంగక్కర సుడిగాలి శతకంతో చెలరేగడంతో శ్రీలంక 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది (వికెట్ కోల్పోయి). శ్రీలంక కోల్పోయిన ఏకైక వికెట్ (కలువితరణ) మాస్కరెన్హాస్కు దక్కింది.ఈ గెలుపుతో ప్రస్తుత మాస్టర్స్ లీగ్ ఎడిషన్లో శ్రీలంక విజయాల సంఖ్య నాలుగుకు (5 మ్యాచ్ల్లో) చేరింది. భారత మాస్టర్స్తో ఆడిన మ్యాచ్ మినహా శ్రీలంక అన్ని మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో భారత మాస్టర్స్ రెండో స్థానంలో ఉంది. భారత్ సైతం ఈ టోర్నీ ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగు విజయాలు సాధించింది. భారత్ ఒక్క ఆస్ట్రేలియా మాస్టర్స్ చేతుల్లో మాత్రమే ఓడింది. పాయింట్ల పరంగా భారత్, శ్రీలంక సమంగా ఉన్నప్పటికీ లంక రన్రేట్ భారత్తో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉంది. పాయింట్ల పట్టికలో శ్రీలంక, భారత్ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉన్నాయి. ఆసీస్, విండీస్ తలో 4 మ్యాచ్లు ఆడి రెండ్రెండు విజయాలు సాధించగా.. సౌతాఫ్రికా నాలుగింట ఒకే ఒక విజయం సాధించింది. టోర్నీలో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించని ఇంగ్లండ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. కాగా, తొలిసారి జరుగుతున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 6 దేశాలకు చెందిన దిగ్గజ, మాజీ క్రికెటర్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
రాణించిన సంగక్కర.. విండీస్పై శ్రీలంక ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్-2025లో శ్రీలంక మూడో విజయం నమోదు చేసింది. వెస్టిండీస్తో నిన్న (మార్చి 6) జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మాస్టర్స్.. కెప్టెన్ కుమరా సంగక్కర (42 బంతుల్లో 47) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. గుణరత్నే (64) అర్ద సెంచరీతో సత్తా చాటాడు. వీరిద్దరు మినహా లంక ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. తిరుమన్నే (14), ఆఖర్లో చతురంగ (17 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. జయసింఘే, ప్రసన్న, లక్మల్ డకౌట్లు కాగా.. తరంగ, జీవన్ మెండిస్ తలో పరుగు చేశారు. విండీస్ బౌలర్లలో ఆష్లే నర్స్ 3 వికెట్లు పడగొట్టగా.. టీనో బెస్ట్ 2, జెరోమ్ టేలర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ డ్వేన్ స్మిత్ (49), లెండిల్ సిమన్స్ 37 (నాటౌట్) విండీస్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరికి ఇతరుల నుంచి సహకారం లభించకపోవడంతో విండీస్ శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. చాడ్విక్ వాల్టన్ డకౌట్, నర్సింగ్ డియోనరైన్ 14, జోనాథన్ కార్టర్ 17, ఆష్లే నర్స్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో దినేశ్ రామ్దిన్ (15 నాటౌట్) వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లంక బౌలర్లలో ఇసురు ఉడాన పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు తీశాడు. చతురంగ డిసిల్వ, జీవన్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. సచిన్ నేతృత్వంలోని భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారత్, శ్రీలంక తలో 4 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించినప్పటికీ.. మెరుగైన రన్రేట్ కారణంగా భారత్ టాప్ ప్లేస్లో ఉంది. లంక చేతితో ఓటమితో విండీస్ మూడో స్థానానికి పడిపోయింది. విండీస్ ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించింది. ఆసీస్, ఇంగ్లండ్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు తలో 3 మ్యాచ్లు ఆడి చెరో మ్యాచ్లో గెలిచారు. ఈ టోర్నీలో ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఓటమిపాలై, చిట్ట చివరి స్థానంలో ఉంది. -
గ్రీన్ అద్భుత శతకం.. శ్రీలంకను చిత్తు చేసిన న్యూజిలాండ్
న్యూజిలాండ్, శ్రీలంక మహిళా జట్ల మధ్య ఇవాళ (మార్చి 7) వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ శ్రీలంకను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. మిడిలార్డర్ బ్యాటర్ మ్యాడీ గ్రీన్ అద్భుత సెంచరీతో (100) కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్రీన్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. జార్జియా ప్లిమ్మర్ 28, ఇసబెల్లా గేజ్ 19, జెస్ కెర్ 38, పోల్లీ ఇంగ్లిస్ 34 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ సూజీ బేట్స్ 5, ఎమ్మా మెక్లియోడ్ 6, బ్రూక్ హ్యల్లీడే 6 పరుగులకు ఔటయ్యారు. ఈ దశలో జార్జియా ప్లిమ్మర్ కొద్ది సేపు సంయమనంతో బ్యాటింగ్ చేసింది. ప్లిమ్మర్ 54 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేసి ఔటైంది. అనంతరం గ్రీన్.. గేజ్, కెర్, ఇంగ్లిస్ సహకారంతో సెంచరీ పూర్తి చేసుకుంది. గ్రీన్ సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటైంది. శ్రీలంక బౌలర్లలో చమారీ ఆటపట్టు 2 వికెట్లు పడగొట్టగా.. అచిని కులసూరియ, ఇనోషి ప్రియదర్శిని, కవిశ దిల్హరి తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 46.4 ఓవర్లలో 167 పరుగులకే చాపచుట్టేసి ఓటమిపాలైంది. కివీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంక బ్యాటింగ్ లైనప్కు కుప్పకూల్చారు. హన్నా రోవ్ 4, బ్రీ లింగ్, ఏడెన్ కార్సన్ తలో 2, సూజీ బేట్స్ ఓ వికెట్ తీశారు. జెస్ కెర్ వికెట్ తీయకపోయినా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్లో హర్షిత సమరవిక్రమ (59) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించారు. కవిష దిల్హరి 25, నీలాక్షి డిసిల్వ 20, అనుష్క సంజీవని 13 (నాటౌట్), కుగంధిక కుమారి, కెప్టెన్ ఆటపట్టు తలో 11 పరుగులు చేశారు. మనుడి ననయక్కార, ఇనోషి ప్రియదర్శిని డకౌట్లు కాగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడు వన్డేలు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శ్రీలంక న్యూజిలాండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో నేపియర్ వేదికగా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. మూడో వన్డే నెల్సన్ వేదికగా మార్చి 9న జరుగనుంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. మార్చి 14, 16, 18 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. తొలి రెండు మ్యాచ్లు క్రైస్ట్చర్చ్లో జరుగనుండగా.. మూడో టీ20 డునెడిన్లో జరుగనుంది. -
ఏప్రిల్, మే నెలల్లో ట్రై సిరీస్ ఆడనున్న భారత్
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో శ్రీలంకలో మహిళల ముక్కోణపు వన్డే టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో శ్రీలంక సహా భారత్, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. ప్రతి జట్టు నాలుగు గ్రూప్ స్టేజీ మ్యాచ్లు ఆడుతుంది. గ్రూప్ మ్యాచ్ల అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్లకు కొలొంబోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మ్యాచ్లన్నీ డే మ్యాచ్లుగా జరుగుతాయి. ఏప్రిల్ 27న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య జట్టు టీమిండియాతో తలపడనుంది. మే 11న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీ ఈ ఏడాది చివర్లో భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్కు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఈ టోర్నీలో పాల్గొనే మూడు జట్లు ఇదివరకే వరల్డ్కప్కు అర్హత సాధించాయి.ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ఏప్రిల్ 27- భారత్ వర్సెస్ శ్రీలంకఏప్రిల్ 29- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 1- శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికామే 4- భారత్ వర్సెస్ శ్రీలంకమే 6- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 8- సౌతాఫ్రికా వర్సెస్ శ్రీలంకమే 11- ఫైనల్కాగా, భారత్ ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఐర్లాండ్తో వన్డే సిరీస్ ఆడింది. ఈ సిరీస్లో భారత్ జయకేతనం ఎగురవేసింది. గతేడాది చివర్లో సౌతాఫ్రికా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్కు ఆతిథ్యమిచ్చింది. ఈ సిరీస్ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. శ్రీలంక విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ప్రస్తుతం భారత్లో డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ జరుగుతుంది. ఈ లీగ్ చివరి దశకు చేరింది. 15 మ్యాచ్లు అయిపోయే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఆడిన 7 మ్యాచ్ల్లో ఐదింట విజయాలు సాధించి ప్లే ఆఫ్స్కు కూడా అర్హత సాధించింది. గత రెండు సీజన్లలో చివరి స్థానంలో నిలిచిన గుజరాత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. గతేడాది రన్నరప్ ముంబై ఇండియన్స్ మూడులో, ఢిపెండింగ్ చాంపియన్ ఆర్సీబీ నాలుగో స్థానంలో, యూపీ వారియర్జ్ ఐదో స్థానంలో ఉన్నాయి. లీగ్లో భాగంగా ఇవాళ (మార్చి 6) యూపీ వారియర్జ్, ముంబై ఇండియన్స్తో తలపడనుంది. -
లంకపై భారత్ మాస్టర్స్ గెలుపు
నవీముంబై: అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ (ఐఎంఎల్)లో ఉత్కంఠ రేపిన పోరులో భారత్ మాస్టర్స్ జట్టు 4 పరుగుల తేడాతో శ్రీలంక మాస్టర్స్పై గెలుపొందింది. 223 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన శ్రీలంక గెలిచేందుకు ఆఖరి బంతి దాకా పెద్ద పోరాటమే చేసింది. చివరి 6 బంతులకు 9 పరుగులు చేయాల్సి ఉండగా అభిమన్యు మిథున్ చక్కని బౌలింగ్తో లంక బ్యాటర్లను కట్టడి చేశాడు. ఆఖరి ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చాడు. దీంతో ఈ లీగ్లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ మాస్టర్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు సచిన్ (10), అంబటి రాయుడు (5) ఇద్దరు నిరాశపరచగా, స్టువర్ట్ బిన్నీ (68), యూసుఫ్ పఠాన్ (56 నాటౌట్), గుర్కీరత్ సింగ్ (44), యువరాజ్ (31 నాటౌట్) లంక బౌలర్లపై దంచేయడంతో 200 పైచిలుకు స్కోరు సాధించింది. లంక బౌర్లలో సురంగ లక్మాల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం శ్రీలంక మాస్టర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 218 పరుగులకు పరిమితమైంది. కుమార సంగక్కర (51), జీవన్ మెండిస్ (42) రాణించారు. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ 3 వికెట్లు పడగొట్టగా, ధవళ్ కులకర్ణి 2 వికెట్లు తీశాడు. -
డబ్ల్యూపీఎల్ చివరి దశ మ్యాచ్లకు శ్రీలంక స్టార్ దూరం
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో యూపీ వారియర్స్ జట్టుకు ఆడుతున్న శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ చమరి అటపట్టు చివరి దశ మ్యాచ్లకు దూరం కానుంది. మార్చి 4 నుంచి 18 వరకు న్యూజిలాండ్తో న్యూజిలాండ్లో జరిగే మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో పాల్గొనే శ్రీలంక జట్టుకు చమరి కెపె్టన్గా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో ఈనెల 26న ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్ తర్వాత చమరి యూపీ వారియర్స్ జట్టును వీడి న్యూజిలాండ్కు బయలుదేరుతుంది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో నాలుగు మ్యాచ్లు ఆడిన చమరి 28 పరుగులు చేయడంతోపాటు మూడు వికెట్లు తీసుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ అమెలియా కెర్ మాత్రం డబ్ల్యూపీఎల్ పూర్తి సీజన్ ఆడుతుంది. శ్రీలంకతో జరిగే సిరీస్లో అమెలియా కెర్ పోటీపడటం లేదు. -
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ కోసం భారత్, శ్రీలంక జట్ల ప్రకటన
ఫిబ్రవరి 22 నుంచి భారత్లో జరుగనున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (International Masters League) అరంభ ఎడిషన్ (2025) కోసం భారత్ (Indian Masters), శ్రీలంక (Sri Lanka Masters) జట్లను ఇవాళ (ఫిబ్రవరి 14) ప్రకటించారు. ఈ టోర్నీలో భారత మాస్టర్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) నాయకత్వం వహించనుండగా.. శ్రీలంక మాస్టర్స్కు కుమార సంగక్కర (Kumara Sangakkar) సారధిగా ఉంటాడు.భారత మాస్టర్స్ జట్టులో సచిన్తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు తదితర మాజీ స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. శ్రీలంక మాస్టర్స్ జట్టులో సంగక్కర, కలువితరణ, ఉపుల్ తరంగ తదితర స్టార్లు పాల్గొంటున్నారు.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లకు చెందిన మాజీలు, దిగ్గజాలు ఈ టోర్నీలో పాల్గొంటారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లను ప్రకటించాల్సి ఉంది. వెస్టిండీస్కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నారు.ఈ టోర్నీలో వెస్టిండీస్ తరఫున క్రిస్ గేల్, సౌతాఫ్రికా తరఫున మఖాయ ఎన్తిని, ఇంగ్లండ్ తరఫున మాంటి పనేసర్ లాంటి మాజీ స్టార్లు పాల్గొంటున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మొత్తం మూడు వేదికల్లో నిర్వహించబడుతుంది. మొదటి ఐదు మ్యాచ్లు నవీ ముంబైలో జరుగనుండగా.. ఆతర్వాతి ఆరు మ్యాచ్లకు రాజ్కోట్ వేదిక కానుంది. చివరి ఏడు మ్యాచ్లతో పాటు నాకౌట్ మ్యాచ్లు రాయ్పూర్లో జరుగనున్నాయి.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ ఎడిషన్ రౌండ్ రాబిన్ పద్దతిలో జరుగనుంది. ఈ దశలో ప్రతి జట్టు మిగతా ఐదు జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ దశ అనంతరం మొదటి నాలుగు స్థానాల్లో ఉండే జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. సెమీస్లో విజేతలు మార్చి 16న రాయ్పూర్లో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.ఈ టోర్నీలోని మ్యాచ్లన్నీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి. కలర్స్ సినీప్లెక్స్ (SD & HD), కలర్స్ సినీప్లెక్స్ సూపర్హిట్స్లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. మ్యాచ్లన్నీ రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి. టోర్నీ తొలి మ్యాచ్లో శ్రీలంక.. భారత జట్టుతో తలపడుతుంది.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో భారత మాస్టర్స్ జట్టు: సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, రాహుల్ శర్మ, షాబాజ్ నదీమ్, నమన్ ఓఝా (వికెట్కీపర్), స్టువర్ట్ బిన్నీ, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, పవన్ నేగి, గురుకీరత్ మాన్, అభిమన్యు మిధున్శ్రీలంక మాస్టర్స్ జట్టు: కుమార సంగక్కర (కెప్టెన్), రొమేశ్ కలువితరణ (వికెట్కీపర్), అషాన్ ప్రియరంజన్, ఉపుల్ తరంగ, లహీరు తిరుమన్నే, చింతక జయసింఘే, సీక్కుగే ప్రసన్న, జీవన్ మెండిస్, ఇసురు ఉడాన, దిల్రువన్ పెరీరా, చతురంగ డిసిల్వ, సురంగ లక్మల్, నువాన్ ప్రదీప్, దమ్మిక ప్రసాద్, అసేల గణరత్నే -
జయసూర్య జమానాలో పూర్వ వైభవం దిశగా శ్రీలంక
1996 వన్డే వరల్డ్ కప్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, ఏకంగా టైటిల్నే ఎగరేసుకుపోయిన శ్రీలంక.. ఆతర్వాత రెండు దశాబ్దాల పాటు వన్డే క్రికెట్లో అద్భుత విజయాలు సాధించింది. 1999 వరల్డ్కప్లో గ్రూప్ స్టేజ్లో పరిమితమైన లంకేయులు.. 2003లో సెమీస్కు.. 2007, 2011 ప్రపంచకప్ల్లో ఫైనల్స్కు చేరారు. 2015 వరల్డ్కప్ వరకు వన్డేల్లో లంక ప్రయాణం సాఫీగా సాగింది.అయితే గత దశాబ్దకాలంలో ఆ జట్టు శోభ మసకబారింది. సంగక్కర, జయవర్దనే లాంటి స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్తో శ్రీలంక బలహీన జట్టుగా మారిపోయింది. భారత్లో జరిగిన 2023 వరల్డ్కప్కు క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధించింది. ఘన కీర్తి కలిగిన శ్రీలంక క్వాలిఫయర్స్ ద్వారా ప్రపంచకప్లో పోటీపడటం.. అక్కడ కూడా దారుణ పరాజయాలు మూటగట్టుకోవడంతో ఈ జట్టు పనైపోయిందని అంతా అనుకున్నారు.అయితే దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య రాకతో (హెడ్ కోచ్గా) శ్రీలంక ప్రదర్శనల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. టెస్ట్లు, టీ20ల విషయాన్ని పక్కన పెడితే.. ద్వీప జట్టు వన్డేల్లో అమోఘంగా రాణిస్తుంది. జయసూర్య జమానాలో శ్రీలంక.. భారత్, న్యూజిలాండ్ లాంటి పటిష్ట జట్లను మట్టికరిపించింది. తాజాగా శ్రీలంక.. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించింది.రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. గతేడాది ఈ జట్టు భారత్ను సైతం 2-0 తేడాతో ఓడించింది. ప్రస్తుతం లంక జట్టులో ఉన్న ఆటగాళ్లు పాతవారే అయినప్పటికీ జయసూర్య ఆధ్వర్యంలో వారు రాటుదేలుతున్నారు. నిస్సంక, కుసాల్ మెండిస్, కమిందు మెండిస్, చరిత్ అసలంక బ్యాటింగ్లో అద్భుతాలు చేస్తున్నారు. లంక జట్టు బౌలింగ్ గతంలో పోలిస్తే మరింత బలపడింది. నాణ్యమైన స్పిన్నర్లు తయారవుతున్నారు. మొదటి నుంచే ఆ జట్టు పేస్ విభాగం బలంగా ఉంది.జయసూర్య రాక ముందు చిన్న జట్ల చేతుల్లో సైతం ఘోర పరాజయాలను ఎదుర్కొన్న శ్రీలంక.. త్వరలో జరుగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. ఈ మెగా టోర్నీలో శ్రీలంక 2002లో భారత్తో కలిసి సంయుక్తంగా ఛాంపియన్గా నిలిచింది. త్వరలో జరుగబోయే మెగా టోర్నీకి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లు అర్హత సాధించినా, శ్రీలంక మాత్రం క్వాలిఫై కాలేకపోయింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంకతో పాటు ఘన చరిత్ర కలిగిన వెస్టిండీస్కు కూడా అర్హత సాధించలేకపోయింది.జయసూర్య హెడ్ కోచ్గా ఉండగా శ్రీలంక సాధించిన విజయాలువన్డే సిరీస్లో భారత్పై 2-0 తేడాతో విజయంఇంగ్లండ్లో టెస్ట్ విజయంన్యూజిలాండ్పై టెస్ట్ సిరీస్లో విజయంవెస్టిండీస్పై టీ20 సిరీస్ విజయంవెస్టిండీస్పై వన్డే సిరీస్ 2-1 తేడాతో విజయంన్యూజిలాండ్తో టీ20 సిరీస్ డ్రాన్యూజిలాండ్పై వన్డే సిరీస్ 2-0 తేడాతో విజయంఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ 2-0 తేడాతో విజయం -
లంక చేతిలో ఘోర పరాజయం.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్కు అవమానం
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాకు ఘోర అవమానం జరిగింది. శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆసీస్ 0-2 తేడాతో చిత్తుగా ఓడింది. ఇవాళ (ఫిబ్రవరి 14) జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 174 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయాలతో సతమతమవుతున్న ఆసీస్ను ఈ పరాజయం మరింత కృంగదీసింది.మ్యాచ్ విషయానికొస్తే.. కొలొంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక (6) వికెట్ కోల్పోయింది. అయితే నిషాన్ మధుష్క (51), కుసాల్ మెండిస్ (101) రెండో వికెట్కు 98 పరుగులు జోడించి లంక ఇన్నింగ్స్కు జీవం పోశారు. మధుష్క ఔటైన అనంతరం కుసాల్ మెండిస్.. కెప్టెన్ అసలంక (78 నాటౌట్) సహకారంతో ఇన్నింగ్స్ను నిర్మించాడు. మెండిస్, అసలంక నాలుగో వికెట్కు 94 పరుగులు జోడించి తమ జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. ఇన్నింగ్స్ చివర్లో అసలంకతో కలిసి జనిత్ లియనాగే (32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిష్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. తొలుత ఆసీస్ను అశిత ఫెర్నాండో (4-0-23-3) ఇబ్బంది పెట్టాడు. ఆతర్వాత దునిత్ వెల్లలగే (7.2-0-35-4), వనిందు హసరంగ (7-2-23-3) ఆసీస్ భరతం పట్టారు. లంక బౌలర్ల ధాటికి ఆసీస్ 100 పరుగులు చేయడం కూడా అసాధ్యమనిపించింది. మొత్తానికి ముక్కీమూలిగి ఆసీస్ 24.2 ఓవర్లలో 107 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (29) టాప్ స్కోరర్ కాగా.. జోస్ ఇంగ్లిస్ (22), ట్రవిస్ హెడ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.కాగా, ఆసీస్ తొలి వన్డేలోనూ ఇదే రీతిలో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ మ్యాచ్లో కూడా తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కెప్టెన్ అసలంక సెంచరీ చేయడంతో అతికష్టం మీద 214 పరుగులు చేయగలిగింది. అయితే ఈ ఇంతటి లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఆసీస్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మహీశ్ తీక్షణ (9.5-1-40-4), అశిత ఫెర్నాండో (5-1-23-2), వెల్లలగే (7-0-33-2), హసరంగ (6-0-47-1), అసలంక (2-0-5-1) ఆసీస్ను దెబ్బకొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్లో అలెక్స్ క్యారీ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఇదిలా ఉంటే, ఆసీస్.. శ్రీలంక నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నేరుగా పాకిస్తాన్కు బయల్దేరుతుంది. ఛాంపియన్స్ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో ఆసీస్.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి.2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. [ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ] -
ఆసీస్తో తొలి వన్డే.. స్వల్ప స్కోర్కే పరిమితమైన శ్రీలంక.. సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన అసలంక
రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కొలొంబో వేదికగా ఆస్ట్రేలియాతో (Australia) జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక (Sri Lanka) కెప్టెన్ చరిత్ అసలంక (Charith Asalanka) సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్లో కష్టాల్లో ఉన్న తన జట్టును అసలంక ఒంటిచేత్తో ఆదుకున్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 55 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో అసలంక.. వెల్లలగే (30), మిగతా టెయిలెండర్ల సాయంతో ఇన్నింగ్స్ను నిర్మించాడు. మరో ఎండ్లో బౌలర్ ఎషాన్ మలింగను (26 బంతుల్లో 1 నాటౌట్) పెట్టుకుని అసలంక కెరీర్లో నాలుగో వన్డే సెంచరీని పూర్తి చేశాడు. అసలంక 112 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ మార్కును తాకాడు. 127 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అసలంక తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో అషిత ఫెర్నాండో డకౌట్ కావడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 214 పరుగుల వద్ద ముగిసింది (46 ఓవర్లలో).అంతకుముందు శ్రీలంక బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్లు పథుమ్ నిస్సంక 4, అవిష్క ఫెర్నాండో ఒక్క పరుగుకే ఔటయ్యారు. వన్డౌన్లో వచ్చిన కుసాల్ మెండిస్ 19 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఆతర్వాత కమిందు మెండిస్ 5, జనిత్ లియనాగే 11 పరుగులకు ఔటయ్యారు. టెయిలెండర్లు వనిందు హసరంగ 7, మహీశ్ తీక్షణ 2 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇల్లిస్ 9 ఓవర్లలో 2 మెయిడిన్లతో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మరో పేసర్ ఆరోన్ హార్డీ 6 ఓవర్లలో 13 పరుగులిచ్చి అవిష్క ఫెర్నాండో, కుసాల్ మెండిస్ వికెట్లు పడగొట్టాడు. సీన్ అబాట్ 3, స్పెన్సర్ జాన్సన్ 2, మాథ్యూ షార్ట్ ఓ వికెట్ పడగొట్టారు.కాగా, ఈ వన్డేకు ముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఆసీస్ 2-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన ఆసీస్.. రెండో టెస్ట్లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు పాకిస్తాన్ను వెళ్లనుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో ఆసీస్.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి. ఈ టోర్నీకి శ్రీలంక అర్హత సాధించలేకపోయింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. [ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ] -
చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. డబుల్ సెంచరీ.. తొలి ఆస్ట్రేలియన్గా రికార్డు
ఆసీస్ తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ (Steve Smith) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్ల్లో 200 క్యాచ్లు పూర్తి చేసుకున్న తొలి ఆస్ట్రేలియన్గా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో స్మిత్ మొత్తం ఐదు క్యాచ్లు పట్టుకున్నాడు. స్మిత్ క్యాచ్ల్లో డబుల్ సెంచరీ సాధించే క్రమంలో రికీ పాంటింగ్ (Ricky Ponting) రికార్డును అధిగమించాడు. 🚨 HISTORY BY STEVEN SMITH. 🚨- Smith becomes the first ever Australian fielder to complete 200 catches in Tests. 🙇♂️pic.twitter.com/3T2v9jgcid— Mufaddal Vohra (@mufaddal_vohra) February 9, 2025పాంటింగ్ 287 ఇన్నింగ్స్ల్లో 196 క్యాచ్లు అందుకోగా.. స్మిత్ 205 ఇన్నింగ్స్ల్లోనే 200 క్యాచ్లు పూర్తి చేశాడు. ఆసీస్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక క్యాచ్లు పట్టుకున్న నాన్ వికెట్కీపర్ల జాబితాలో స్మిత్, పాంటింగ్ తర్వాతి స్థానంలో మార్క్ వా ఉన్నాడు. మార్క్ వా 209 ఇన్నింగ్స్ల్లో 181 క్యాచ్లు పట్టుకున్నాడు.ఓవరాల్గా ఐదో క్రికెటర్టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే 200 క్యాచ్లు పూర్తి చేశారు. వీరిలో టీమిండియా గ్రేట్ రాహుల్ ద్రవిడ్ (Rahu Dravid) 210 క్యాచ్లతో (164 టెస్ట్ల్లో) అగ్రస్థానంలో ఉండగా.. జో రూట్ (152 టెస్ట్ల్లో 207), మహేళ జయవర్దనే (149 టెస్ట్ల్లో 205), జాక్ కల్లిస్ (166 టెస్ట్ల్లో 200) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. శ్రీలంకతో మ్యాచ్లో స్మిత్ కల్లిస్ సరసన చేరడంతో పాటు 200 క్యాచ్ల క్లబ్లో చేరిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. అలాగే టెస్ట్ల్లో అత్యంత వేగవంతంగా 200 క్యాచ్లు పూర్తి చేసిన ఆటగాడిగానూ స్మిత్ రికార్డు నెలకొల్పాడు. స్మిత్ కేవలం 116 టెస్ట్ల్లోనే 200 క్యాచ్లు పూర్తి చేశాడు. స్మిత్ మరో 11 క్యాచ్లు పడితే టెస్ట్ల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొడతాడు.లంకతో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఐదు క్యాచ్లు పట్టిన స్మిత్.. బ్యాటింగ్లోనూ చెలరేగి టెస్ట్ల్లో 36వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో స్మిత్ టెప్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం స్మిత్, జో రూట్ తలో 36 సెంచరీలతో సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు. టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది.అంతకుముందు స్మిత్ లంకతో జరిగిన తొలి టెస్ట్లోనూ సెంచరీ సాధించాడు. ఇదే మ్యాచ్లో స్మిత్ టెస్ట్ల్లో 10000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్కు దూరం కాగా.. అతని గైర్హాజరీలో స్మిత్ ఆసీస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించాడు. తొలి టెస్ట్లోనూ ఘన విజయం సాధించిన ఆసీస్.. రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో ఊడ్చేసింది. ఫిబ్రవరి 12, 14 తేదీల్లో ఆసీస్.. శ్రీలంకతో రెండు వన్డేలు ఆడనుంది. -
విరాట్ కోహ్లిని అధిగమించిన స్టీవ్ స్మిత్
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సెంచరీతో కదంతొక్కాడు. టెస్ట్ల్లో స్టీవ్కు ఇది 36వ సెంచరీ. ఈ సెంచరీతో స్టీవ్ పలు రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు (జో రూట్తో కలిసి) చేసిన ఆటగాడిగా నిలిచాడు. రూట్, స్టీవ్ ప్రస్తుతం టెస్ట్ల్లో తలో 36 సెంచరీలు చేశారు.టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51) అగ్రస్థానంలో ఉండగా.. జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) ఆతర్వాతి స్థానాల్లో నిలిచారు.ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. స్మిత్, రోహిత్ శర్మ తలో 48 అంతర్జాతీయ శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ (81 సెంచరీలు) టాప్లో ఉండగా.. రూట్ (52) రెండు, కేన్ విలియమ్సన్ (46) నాలుగో స్థానంలో ఉన్నారు.విరాట్ను అధిగమించిన స్టీవ్విదేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) అధిగమించాడు. విరాట్ ఇప్పటివరకు విదేశాల్లో 16 సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో స్టీవ్ విదేశీ సెంచరీల సంఖ్య 17కు పెరిగింది. తాజా సెంచరీతో స్టీవ్.. అలిస్టర్ కుక్, బ్రియాన్ లారా సరసన చేరాడు. కుక్, లారా ఇద్దరూ విదేశాల్లో తలో 17 టెస్ట్ సెంచరీలు చేశారు. ఈ సెంచరీతో స్టీవ్.. విదేశీ టెస్ట్ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. ఈ సెంచరీతో స్మిత్ ఆసియాలో అత్యధిక టెస్ట్ సెంచరీలు (7) చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా అవతరించాడు. ఆసియాలో అలెన్ బోర్డర్ 6, రికీ పాంటింగ్ 5 సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (120), అలెక్స్ క్యారీ (139) అజేయ సెంచరీలతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 73 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆసీస్ ఇన్నింగ్స్లో హెడ్ 21, ఉస్మాన్ ఖ్వాజా 36, లబూషేన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ పడగొట్టారు. -
SL VS AUS 2nd Test: శతక్కొట్టిన అలెక్స్ క్యారీ.. ఆధిక్యంలో ఆస్ట్రేలియా
గాలే వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరుగుతున్న రెండో టెస్ట్లో ఆసీస్ (Australia) వికెట్కీపర్ బ్యాటర్ ఆలెక్స్ క్యారీ (Alex Carey) శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో ఐదో స్థానంలో బరిలోకి దిగిన క్యారీ.. 117 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో కెరీర్లో రెండో టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. క్యారీ తన సెంచరీ మార్కును బౌండరీతో చేరుకున్నాడు. క్యారీ తన తొలి టెస్ట్ సెంచరీని 2022 బాక్సింగ్ డే టెస్ట్లో సాధించాడు.MOST TEST HUNDREDS IN ASIA BY WICKET-KEEPER BATTERS FROM AUSTRALIA:Adam Gilchrist - 4Alex Carey - 1* pic.twitter.com/E7yGUofiiB— Johns. (@CricCrazyJohns) February 7, 2025ఈ మ్యాచ్లో క్యారీకి ముందు స్టీవ్ స్మిత్ (Steve Smith) కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్మిత్కు టెస్ట్ల్లో ఇది 36వ శతకం. స్మిత్, క్యారీ సెంచరీలతో కదంతొక్కడంతో ఆసీస్ ఆధిక్యంలోకి వెళ్లింది. 74 ఓవర్ల అనంతరం తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ స్కోర్ 309/3గా ఉంది. క్యారీ (123), స్మిత్ (115) సెంచరీల అనంతరం అదే జోరుతో ఇన్నింగ్స్లను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆసీస్ ఇన్నింగ్స్లో హెడ్ 21, ఉస్మాన్ ఖ్వాజా 36, లబూషేన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.కాగా, రెండు టెస్ట్ మ్యాచ్లు, రెండు వన్డేల సిరీస్ల కోసం ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో ఆసీస్ ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ (102), స్టీవ్ స్మిత్ (141) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ (247 ఆలౌట్) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.టెస్ట్ సిరీస్ అనంతరం ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్తో తలపడుతుంది. -
శ్రీలంకతో రెండో టెస్ట్.. ఆసీస్ బౌలర్ల విజృంభణ.. హెడ్ వెరైటీ సెలబ్రేషన్
గాలే వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆస్ట్రేలియా (Australia) పైచేయి సాధించింది. ఆ జట్టు బౌలర్లు విజృంభించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు మాత్రమే చేసింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయోన్ తలో మూడు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బేశారు. మాథ్యూ కుహ్నేమన్ 2, ట్రవిస్ హెడ్ ఓ వికెట్ పడగొట్టారు. లంక ఇన్నింగ్స్లో దినేశ్ చండీమల్ (74), కుసాల్ మెండిస్ (59 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. పథుమ్ నిస్సంక 11, దిముత్ కరుణరత్నే 36, ఏంజెలో మాథ్యూస్ 1, కమిందు మెండిస్ 13, ధనంజయ డిసిల్వ 0, రమేశ్ మెండిస్ 28, ప్రభాత్ జయసూర్య 0, నిషాన్ పెయిరిస్ డకౌట్ అయ్యారు. కుసాల్ మెండిస్కు జతగా లహీరు కుమార (0) క్రీజ్లో ఉన్నాడు. లంక ఇన్నింగ్స్లో ముగ్గురు డకౌట్ అయ్యారు.pic.twitter.com/IRsGEkTBll— rohitkohlirocks@123@ (@21OneTwo34) February 6, 2025హెడ్ వినూత్న సంబురాలుఈ మ్యాచ్లో కమిందు మెండిస్ను ఔట్ చేసిన అనంతరం ట్రవిస్ హెడ్ వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్నాడు. చేయి నొప్పి పెడితే కాని, కాలితే కాని ఎలా విదిలించుకుంటామో అలా చేశాడు. హెడ్ ఇలాంటి వెరైటీ సంబురాలు చేసుకోవడం ఇది తొలిసారి కాదు. కొద్ది రోజుల కిందట భారత్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కూడా ఇంచుమించు ఇలాంటి సంబురాలే చేసుకున్నాడు.కాగా, రెండు టెస్ట్లు, రెండు వన్డే మ్యాచ్ల సిరీస్ల కోసం ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటిస్తుంది. తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ (102), స్టీవ్ స్మిత్ (141) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ (247 ఆలౌట్) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.టెస్ట్ సిరీస్ అనంతరg ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్తో తలపడుతుంది. -
రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక స్టార్ క్రికెటర్
శ్రీలంక మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్ తన కెరీర్లో చివరి మ్యాచ్ అని వెల్లడించాడు. 36 ఏళ్ల కరుణరత్నేకు టెస్ట్ల్లో ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన కరుణరత్నే 2012లో తన టెస్ట్ కెరీర్ ప్రారంభించాడు. 13 ఏళ్ల జర్నీలో కరుణరత్నే ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. కెప్టెన్గా శ్రీలంకకు ఎన్నో అపురూప విజయాలు అందించాడు. 2019లో శ్రీలంక జట్టు కరుణరత్నే సారథ్యంలో సౌతాఫ్రికాను వారి సొంతగడ్డపై 2-0 తేడాతో (టెస్ట్ల్లో) ఓడించింది. సౌతాఫ్రికాను వారి స్వదేశంలో 2-0 తేడాతో ఓడించిన ఏకైక ఆసియా కెప్టెన్ కరుణరత్నేనే.టెస్ట్లకు ముందే (2011, జులైలో) వన్డే అరంగేట్రం చేసిన కరుణరత్నే ఈ ఫార్మాట్లో అశించినంతగా రాణించలేకపోయాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో అతను 50 మ్యాచ్లు ఆడి 31.3 సగటున 1316 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు, సెంచరీ ఉంది. కరుణరత్నే తన చివరి వన్డే మ్యాచ్ను భారత్లో జరిగిన 2023 ప్రపంచకప్లో ఆడాడు. వన్డేలతో పోలిస్తే కరుణరత్నే టెస్ట్ గణాంకాలు చాలా బాగున్నాయి. సుదీర్ఘ ఫార్మాట్లో అతను 99 మ్యాచ్లు ఆడి 39.4 సగటున 7172 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కరుణరత్నే శ్రీలంక తరఫున అత్యధిక టెస్ట్లు ఆడిన ఏడో ఆటగాడిగా నిలిచాడు. లంక తరఫున మహేళ జయవర్దనే అత్యధికంగా 149 టెస్ట్లు ఆడాడు. కాగా, ఆసీస్తో రెండో టెస్ట్ గాలే వేదికగా ఫిబ్రవరి 6న మొదలవుతుంది. ఈ మ్యాచ్తోనే కరుణరత్నే ఆటకు వీడ్కోలు పలుకనున్నాడు.తొలి టెస్ట్లో దారుణ పరాజయంఆసీస్తో జరిగిన తొలి టెస్ట్లో శ్రీలంక ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో ఆసీస్ ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉస్మాన్ ఖ్వాజా డబుల్ సెంచరీ (232), స్టీవ్ స్మిత్ (141), జోష్ ఇంగ్లిస్ (102) సెంచరీలు చేసి ఆసీస్కు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (654/6) అందించారు. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్లోనూ లంక ఫేట్ మారలేదు. ఈసారి ఆ జట్టు 247 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో కరుణరత్నే రెండో ఇన్నింగ్స్ల్లో నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో ఆసీస్ స్పిన్నర్లు మాథ్యూ కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టారు. -
శ్రీలంకతో తొలి టెస్ట్.. మిచెల్ స్టార్క్ మరో రికార్డు
శ్రీలంకతో (Sri Lanka) తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా (Australia) భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 654 పరుగుల రికార్డు స్కోర్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. వరుణుడు మూడో రోజు ఆటకు పలు అంతరాయాలు కలిగించాడు. ఈ రోజు కేవలం 27 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 44/3 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక ఇవాళ మరో 92 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. దినేశ్ చండీమల్ (63), కుసాల్ మెండిస్ (10) క్రీజ్లో ఉన్నారు. లంక ఇన్నింగ్స్లో ఒషాడో ఫెర్నాండో, దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్ తలో 7 పరుగులు చేయగా.. కమిందు మెండిస్ 15, కెప్టెన్ ధనంజయ డిసిల్వ 22 పరుగులు చేసి ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ (Mitchell Starc), మాథ్యూ కుహ్నేమన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. నాథన్ లయోన్ ఓ వికెట్ తీశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు శ్రీలంక ఇంకా 518 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీ.. స్టీవ్ స్మిత్ (141), జోస్ ఇంగ్లిస్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో ఆస్ట్రేలియా అతి భారీ స్కోర్ చేసింది. ఓపెనర్గా బరిలోకి దిగిన ట్రవిస్ హెడ్ (57) మెరుపు అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. లబూషేన్ 20, అలెక్స్ క్యారీ 46 (నాటౌట్), వెబ్స్టర్ 23, మిచెల్ స్టార్క్ 19 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రీలంక బౌలరల్లో ప్రభాత్ జయసూర్య, జెఫ్రీ వాండర్సే తలో 3 వికెట్లు పడగొట్టారు.రికార్డుల మోత మోగించిన ఆసీస్ బ్యాటర్లుఈ మ్యాచ్లో ఆసీస్ బ్యాటర్లు రికార్డుల మోత మోగించారు. ఈ మ్యాచ్లో తొలి పరుగుతో స్టీవ్ స్మిత్ టెస్ట్ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో స్టీవ్ స్మిత్ టెస్ట్ల్లో 35వ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్లలో జో రూట్ (36) మాత్రమే స్టీవ్ స్మిత్ కంటే అత్యధిక సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖ్వాజా లేటు వయసులో (38 ఏళ్ల 43 రోజులు) డబుల్ సెంచరీ చేశాడు. టెస్ట్ల్లో అతనికి ఇది తొలి డబుల్ సెంచరీ. ఈ మ్యాచ్తో టెస్ట్ అరంగేట్రం చేసిన జోస్ ఇంగ్లిస్.. అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 21వ ఆస్ట్రేలియన్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. జట్టు స్కోర్ పరంగానూ ఆసీస్ ఈ మ్యాచ్లో రికార్డు సృష్టించింది. ఆసియా పిచ్లపై ఆసీస్కు ఇదే అత్యధిక స్కోర్.మిచెల్ స్టార్క్ మరో రికార్డుఈ మ్యాచ్లో ఇప్పటివరకు రెండు వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ తొలి వికెట్తో అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో కలిపి) 700 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో రెండో వికెట్తో స్టార్క్ మరో రికార్డు సాధించాడు. శ్రీలంక గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక పేసర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్క్ శ్రీలంకలో ఇప్పటివరకు 16.77 సగటున 31 వికెట్లు తీశాడు. గతంలో లంక గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక పేసర్గా వసీం అక్రమ్ ఉన్నాడు. అక్రమ్ లంకలో 20.43 సగటున 30 వికెట్లు తీశాడు.శ్రీలంకలో అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక పేసర్లు..మిచెల్ స్టార్క్-31వసీం అక్రమ్-30రిచర్డ్ హ్యాడ్లీ-27వకార్ యూనిస్-27ఇషాంత్ శర్మ-26 -
డబుల్ సెంచరీతో కదంతొక్కిన ఖ్వాజా.. దిగ్గజాల సరసన చోటు
గాలే వేదికగా శ్రీలంక (Sri Lanka), ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో రికార్డుల మోత మోగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా (Australia) రికార్డు స్కోర్ సాధించింది. వ్యక్తిగతంగానూ ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఆసీస్ వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖ్వాజా (Usman Khawaja) కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించగా.. స్టీవ్ స్మిత్ టెస్ట్ల్లో తన 35వ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో మరో ఆసీస్ ఆటగాడు సెంచరీతో మెరిశాడు. జోస్ ఇంగ్లిస్ ఆసీస్ తరఫున తన అరంగేట్రం టెస్ట్లోనే శతక్కొట్టి రికార్డుల్లోకెక్కాడు. జట్టు స్కోర్ పరంగానూ ఆసీస్ ఈ మ్యాచ్లో రికార్డు సృష్టించింది. ఆసియా పిచ్లపై ఆసీస్కు ఇదే అత్యధిక స్కోర్.దిగ్గజాల సరసన చేరిన ఖ్వాజాఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా ఈ మ్యాచ్లో 352 బంతులు ఎదుర్కొని 16 బౌండరీలు, సిక్సర్ సాయంతో 232 పరుగులు చేశాడు. కెరీర్లో తన డబుల్ సెంచరీని ఖ్వాజా 38 ఏళ్ల 43 రోజుల వయసులో సాధించాడు. ఆసీస్ తరఫున క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ మాత్రమే ఖ్వాజా కంటే లేటు వయసులో డబుల్ సెంచరీలు చేశాడు. బ్రాడ్మన్ 38 ఏళ్ల 108 రోజుల వయసులో ఒకసారి.. 39 ఏళ్ల 149 రోజుల వయసులో మరోసారి డబుల్ సెంచరీలు చేశాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత లేటు వయసులో డబుల్ సెంచరీ చేసిన రికార్డు సౌతాఫ్రికాకు చెందిన ఎరిక్ రోవన్కు దక్కుతుంది. రోవన్ 42 ఏళ్ల 6 రోజుల వయసులో డబుల్ సెంచరీ సాధించాడు. టెస్ట్ క్రికెట్లో ఖ్వాజా కంటే లేటు వయసులో డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో జాక్ హాబ్స్, వినూ మన్కడ్, గ్రహం గూచ్, యూనిస్ ఖాన్, శివ్నరైన్ చంద్రపాల్ వంటి దిగ్గజాలు ఉన్నారు. వీరిలో భారత్కు చెందిన వినూ మన్కడ్ 38 ఏళ్ల వయసులో రోజుల వ్యవధిలో రెండు సార్లు డబుల్ సెంచరీలు సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో.. స్టీవ్ స్మిత్ (141), జోస్ ఇంగ్లిస్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 654 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఖ్వాజా, స్మిత్, ఇంగ్లిస్తో పాటు ట్రవిస్ హెడ్ (57), అలెక్స్ క్యారీ (46 నాటౌట్) కూడా రాణించారు. లబూషేన్ (20), వెబ్స్టర్ (23), స్టార్క్ (19 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య, జెఫ్రీ వాండర్సే తలో మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది.లంక బ్యాటర్లు ఒషాడో ఫెర్నాండో, దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్ తలో ఏడు పరుగులు చేసి ఔట్ కాగా.. చండీమల్ (9), కమిందు మెండిస్ (13) క్రీజ్లో ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్కు శ్రీలంక ఇంకా 610 పరుగులు వెనుకపడి ఉంది. -
శ్రీలంకతో తొలి టెస్ట్.. 700 వికెట్ల క్లబ్లో మిచెల్ స్టార్క్
ఆస్ట్రేలియా పేస్ గన్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలురాయికి తాకాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో దిముత్ కరుణరత్నే వికెట్ పడగొట్టిన స్టార్క్.. 700 వికెట్ల క్లబ్లో (మూడు ఫార్మాట్లలో కలిపి) చేరాడు. అంతర్జాతీయ క్రికెట్లో కేవలం 17 మంది మాత్రమే 700 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు. స్టార్క్కు ముందు ముత్తయ్య మురళీథరన్ (1347), షేన్ వార్న్ (1001), జేమ్స్ ఆండర్సన్ (991), అనిల్ కుంబ్లే (956), గ్లెన్ మెక్గ్రాత్ (949), వసీం అక్రమ్ (916), స్టువర్ట్ బ్రాడ్ (847), షాన్ పొలాక్ (829), వకార్ యూనిస్ (789), టిమ్ సౌథీ (776), రవిచంద్రన్ అశ్విన్ (765), చమింద వాస్ (761), కోట్నీ వాల్ష్ (746), బ్రెట్ లీ (718), షకీబ్ అల్ హసన్ (712), హర్భజన్ సింగ్ (711), డేనియల్ వెటోరీ (705) మాత్రమే ఈ ఘనత సాధించారు.కెరీర్లో 94 టెస్ట్లు ఆడిన స్టార్క్ 377 వికెట్లు తీశాడు. 127 వన్డేల్లో 244, 65 టీ20ల్లో 79 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా స్టార్క్ తన కెరీర్లో 286 మ్యాచ్లు ఆడి 700 వికెట్లు తీశాడు. ఇందులో 24 ఐదు వికెట్ల ఘనతలు, 2 పది వికెట్ల ఘనతలు ఉన్నాయి.శ్రీలంకతో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు రెండో రోజు టీ సెషన్ వరకు బ్యాటింగ్ చేసి 654/6 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (232) కెరీర్లో తొలి డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. స్టీవ్ స్మిత్ (141), జోస్ ఇంగ్లిస్ (102) సెంచరీలతో సత్తా చాటారు. స్టీవ్ స్మిత్కు ఇది టెస్ట్ కెరీర్లో 35వ సెంచరీ కాగా.. ఇంగ్లిస్ తన అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరితో పాటు ట్రవిస్ హెడ్ (57), అలెక్స్ క్యారీ (46 నాటౌట్) కూడా రాణించడంతో ఆస్ట్రేలియా శ్రీలంక గడ్డపై తొలిసారి 600 పరుగుల మార్కును దాటింది. ఆసీస్ ఇన్నింగ్స్లో లబూషేన్ 20, వెబ్స్టర్ 23 పరుగులు చేసి ఔట్ కాగా.. మిచెల్ స్టార్క్ 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య, జెఫ్రీ వాండర్సే తలో మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది.లంక బ్యాటర్లు ఒషాడో ఫెర్నాండో, దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్ తలో ఏడు పరుగులు చేసి ఔటయ్యారు. చండీమల్ (9), కమిందు మెండిస్ (13) క్రీజ్లో ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్కు శ్రీలంక ఇంకా 610 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్, రెండు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటిస్తుంది. -
అరంగేట్రంలోనే శతక్కొట్టిన ఆసీస్ బ్యాటర్
గాలే వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరుగుతున్న తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా (Australia) వికెట్కీపర్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ (Josh Inglis) సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్తోనే టెస్ట్ అరంగేట్రం చేసిన ఇంగ్లిస్.. అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 21వ ఆస్ట్రేలియన్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే గడిచిన పదేళ్లలో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియన్ బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆడమ్ వోగ్స్ 2015లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రంలోనే సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో ఇంగ్లిస్ మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. శ్రీలంక గడ్డపై అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఆరో బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఫవాద్ ఆలం (పాకిస్తాన్, 2009), సురేశ్ రైనా (భారత్, 2010), షాన్ మార్ష్ (ఆస్ట్రేలియా, 2011), మొహమ్మద్ అష్రాఫుల్ (బంగ్లాదేశ్, 2001), బెన్ ఫోక్స్ (ఇంగ్లండ్, 2018) శ్రీలంక గడ్డపై టెస్ట్ అరంగేట్రంలోనే సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లిస్కు ముందు ఉస్మాన్ ఖ్వాజా, స్టీవ్ స్మిత్ కూడా సెంచరీలు చేశారు. ఖ్వాజా సెంచరీతో ఆగకుంగా డబుల్ సెంచరీతో (232) కదంతొక్కగా.. స్టీవ్ స్మిత్ 141 పరుగులు చేసి ఔటయ్యాడు. 90 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్న ఇంగ్లిస్ 102 పరుగుల (10 ఫోర్లు, సిక్స్) వద్ద ఔటయ్యాడు. It's a century on Test debut for Josh Inglis!From just 90 balls, with 10 fours and a six, Inglis is the first Australian to make a century on Test debut since Adam Voges in 2015 #SLvAUS pic.twitter.com/yFCXF74UK9— 7Cricket (@7Cricket) January 30, 2025ఇంగ్లిస్ సెంచరీ చేయగానే అతని తల్లిదండ్రులు ఫ్లైయింగ్ కిస్లతో అభినందించారు. ఖ్వాజా, స్మిత్, ఇంగ్లిస్ సెంచరీలతో కదంతొక్కడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 600 పరుగుల మార్కును తాకింది. శ్రీలంక గడ్డపై ఆస్ట్రేలియా తొలిసారి టెస్ట్ల్లో పరుగులు చేసింది.రెండో వేగవంతమైన శతకంఈ మ్యాచ్లో 90 బంతుల్లో శతక్కొట్టిన ఇంగ్లిస్ టెస్ట్ అరంగేట్రంలో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. టెస్ట్ అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా ఆటగాడు శిఖర్ ధనవ్ పేరిట ఉంది. ధవన్ 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 85 బంతుల్లోనే శతక్కొట్టాడు. ధవన్, ఇంగ్లిస్ తర్వాత టెస్ట్ అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు వెస్టిండీస్కు చెందిన డ్వేన్ స్మిత్ పేరిట ఉంది. స్మిత్ 2003లో సౌతాఫ్రికాపై 93 బంతుల్లో సెంచరీ చేశాడు.ట్రవిస్ హెడ్ మెరుపు అర్ద శతకంఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన ట్రవిస్ హెడ్ మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. హెడ్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి 40 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో లబూషేన్ 20 పరుగులు చేయగా.. అలెక్స్ క్యారీ (39), బ్యూ వెబ్స్టర్ (23) తమ ఇన్నింగ్స్లను కొనసాగిస్తున్నారు. 148 ఓవర్ల అనంతరం ఆస్ట్రేలియా స్కోర్ 627/5గా ఉంది. -
స్టీల్ స్మిత్...
లెగ్ స్పిన్నర్గా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆ కుర్రాడు... క్లిష్ట సమయాల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందాడు. చిత్రవిచిత్రమైన స్టాన్స్తో ప్రత్యర్థి బౌలర్లను తికమక పెట్టడమే పనిగా పెట్టుకున్న అతడు... సుదీర్ఘ ఇన్నింగ్స్లకు కేరాఫ్ అడ్రస్గా మారాడు. ‘బాల్ ట్యాంపరింగ్’ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరమైనా... తిరిగి వచ్చాక తన పరుగుల దాహం తీరనిదని నిరూపించుకున్నాడు. టెస్టు క్రికెట్లో రెండు వేర్వేరు దేశాలపై 10కిపైగా సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కిన ఆ ప్లేయర్... తాజాగా మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 10,000 పరుగులు పూర్తి చేసుకున్న 15వ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. మనం ఇంత సేపు చెప్పుకున్నది ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ గురించే. శ్రీలంకతో తొలి టెస్టు ద్వారా 10 వేల పరుగుల మైలురాయిని దాటిన నాలుగో ఆస్ట్రేలియా ప్లేయర్పై ప్రత్యేక కథనం... సాక్షి క్రీడా విభాగం టెక్నిక్లో విరాట్ కోహ్లిని సమం చేయలేకపోయినా... నిలకడలో జో రూట్ని తలపించకపోయినా... క్లాసిక్ షాట్లలో కేన్ విలియమ్సన్తో పోటీ పడలేకపోయినా... భారీగా పరుగులు చేయడంలో మాత్రం స్టీవ్ స్మిత్ ఈ ముగ్గురికి ఏమాత్రం తీసిపోడు. ఆధునిక క్రికెట్లో ‘ఫ్యాబ్–4’గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నలుగురిలో ఇప్పటికే ఇంగ్లండ్ మాజీ సారథి రూట్ (12,972) పది వేల పరుగుల మైలురాయి దాటగా... శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా 35 ఏళ్ల స్టీవ్ స్మిత్ (10,103) ఈ క్లబ్లో చేరాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ విలియమ్సన్ (9,276), భారత మాజీ సారథి కోహ్లి (9,230) ఈ జాబితాలో కాస్త వెనక ఉన్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో భారీగా పరుగులు చేయడం అలవాటుగా మార్చుకున్న స్మిత్... 115వ టెస్టులో 10 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా భారత్పైనే స్మిత్ ఈ మార్క్ అందుకుంటాడు అనుకుంటే... సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 4 పరుగుల వద్ద అవుటై... 9,999 పరుగుల వద్ద నిలిచిపోయాడు. గతంలో ఆస్ట్రేలియా నుంచి 10 వేల పరుగుల మైలురాయి దాటిన అలెన్ బోర్డర్, స్టీవ్ వా సిడ్నీలోనే ఈ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించగా... తాజాగా స్మిత్ గాలే స్టేడియంలో ఆ జాబితాలో చేరాడు. 55 కంటే ఎక్కువ సగటుతో... మ్యాచ్ల సంఖ్య పరంగా చూసుకుంటే స్మిత్ 115వ టెస్టులో 10 వేల పరుగుల మైలురాయి దాటి... సంగక్కరతో కలిసి వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా నిలిచాడు. బ్రియాన్ లారా 111వ టెస్టులోనే ఈ మార్క్ దాటి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇన్నింగ్స్ల పరంగా స్మిత్ (205) ఐదో స్థానంలో ఉన్నాడు. లారా (195 ఇన్నింగ్స్లు), సచిన్ టెండూల్కర్ (195 ఇన్నింగ్స్లు), కుమార సంగక్కర (195 ఇన్నింగ్స్లు), రికీ పాంటింగ్ (196 ఇన్నింగ్స్లు) ముందున్నారు. ఇక టెస్టు క్రికెట్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న వారిలో స్మిత్ మూడో అత్యుత్తమ సగటు (56.44) నమోదు చేసుకున్నాడు. పాంటింగ్ (58.72), టెండూల్కర్ (57.61) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కెరీర్లో తొలి 20 టెస్టుల్లో దాదాపు లెగ్స్పిన్నర్గానే జట్టులో చోటు దక్కించుకున్న స్మిత్... ఆ తర్వాత ఆడిన 50 టెస్టుల్లో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు. వరుసగా 78వ టెస్టు మ్యాచ్లో 55 కంటే ఎక్కువ సగటుతో బ్యాటింగ్ చేసిన తొలి ప్లేయర్గా స్మిత్ రికార్డుల్లోకెక్కాడు. సచిన్ వరుసగా 65 టెస్టుల్లో 55కు పైగా సగటుతో బ్యాటింగ్ చేశాడు. 2015లో చివరిసారి స్మిత్ సగటు 55 కంటే తక్కువ నమోదైంది. ఆ తర్వాత భారీ ఇన్నింగ్స్లు ఆడుతూ ముందుకు సాగిన స్మిత్ రికార్డులు తిరగరాయడమే పనిగా పెట్టుకున్నాడు. గోడకు కొట్టిన బంతిలా... అటు ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్, ఇటు భారత్తో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పరుగుల వరద పారించిన స్మిత్... దశాబ్ద కాలానికి పైగా ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న ఈ రెండు సిరీస్ల్లోనూ స్మిత్ తనదైన ముద్ర వేశాడు. చాన్నాళ్లుగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వస్తున్న స్మిత్... ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించేందుకు కూడా వెనుకాడలేదు. ఆసీస్ తరఫున వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడి జట్టును గెలిపించడమే తన లక్ష్యమని గతంలో పలుమార్లు వెల్లడించిన స్మిత్... దక్షిణాఫ్రికా సిరీస్లో ‘బాల్ ట్యాంపరింగ్’తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ సంఘటన అనంతరం తన తప్పేం లేదని చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చిన స్మిత్... నిషేధం ముగించుకొని తిరిగి వచ్చాక ఇతర ఆటగాళ్ల సారథ్యంలోనూ అంతే నిబద్ధతతో ఆడాడు. గోడకు కొట్టిన బంతిలా విజృంభించి విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించాడు. యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్పై ఇప్పటి వరకు 12 శతకాలు బాదిన స్మిత్... ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో సెంచరీని కలుపుకుంటే టీమిండియాపై 11 శతకాలు కొట్టాడు. రెండు వేర్వేరు జట్లపై 10కి పైగా టెస్టు సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ స్మిత్ మాత్రమే అంటే అతడి నిలకడ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంటా బయటా అనే తేడా లేకుండా పరుగుల దాహంతో దూసుకుపోతున్న స్మిత్ ఇదే జోరు కొనసాగిస్తే... అతడి ఖాతాలో మరిన్ని రికార్డులు చేరడం ఖాయమే! -
శతక్కొట్టిన స్టీవ్ స్మిత్.. 35వ టెస్ట్ సెంచరీ.. ఉస్మాన్ ఖ్వాజా కూడా..!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్ స్మిత్ 179 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో కెరీర్లో 35వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) స్మిత్కు ఇది 47వ సెంచరీ. శ్రీలంక గడ్డపై మూడవది (టెస్ట్ల్లో).Steve Smith with yet another 100 It's his 35th test 100✨ pic.twitter.com/4ppbWFEehc— Schrödinger (@srhnation) January 29, 2025టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ ఏడవ స్థానానికి ఎగబాకాడు. సచిన్ టెండూల్కర్ (51), జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38), జో రూట్ (36), రాహుల్ ద్రవిడ్ (36) మాత్రమే టెస్ట్ల్లో స్మిత్ కంటే ఎక్కువ సెంచరీలు చేశారు.తాజా సెంచరీతో స్మిత్ ఫాబ్ ఫోర్లో (టెస్ట్ సెంచరీల పరంగా) రెండో స్థానానికి ఎగబాకాడు. 36 సెంచరీలతో రూట్ అగ్రస్థానంలో ఉండగా.. 33 సెంచరీలతో కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో, 30 సెంచరీలతో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ సెంచరీతో స్మిత్ ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో నాలుగో అత్యధిక సెంచరీలు (మూడు ఫార్మాట్లలో) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ (81) అగ్రస్థానంలో నిలువగా.. రూట్ (52) రెండో స్థానంలో, రోహిత్ శర్మ (48) మూడో స్థానంలో, స్మిత్ (47) నాలుగులో, కేన్ విలియమ్సన్ (46) ఐదో స్థానంలో ఉన్నారు.వివిధ దేశాల్లో స్మిత్ చేసిన సెంచరీలుఆస్ట్రేలియాలో 18ఇంగ్లండ్లో 8భారత్లో 3శ్రీలంకలో 3న్యూజిలాండ్లో 1సౌతాఫ్రికాలో 1వెస్టిండీస్లో 135వ సెంచరీకి ముందు స్మిత్ ఇదే మ్యాచ్లో 10000 పరుగుల మైలురాయిని కూడా దాటాడు. ఈ ఇన్నింగ్స్ తొలి బంతికే స్మిత్ ఈ ఘనత సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియన్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. స్టీవ్కు ముందు రికీ పాంటింగ్ (13378), అలెన్ బోర్డర్ (11174), స్టీవ్ వా (10927) ఈ ఘనత సాధించారు.205వ ఇన్నింగ్స్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న స్మిత్.. బ్రియాన్ లారా (195), సచిన్ టెండూల్కర్ (195), కుమార సంగక్కర (195), రికీ పాంటింగ్ (196) తర్వాత అత్యంత వేగంగా (ఇన్నింగ్స్ల పరంగా) ఈ ఫీట్ను సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.టెస్ట్ క్రికెట్లో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్లలో జో రూట్ (12972) తర్వాత స్టీవ్ స్మిత్ మాత్రమే 10000 పరుగుల క్లబ్లో చేరాడు. స్టీవ్ సమకాలీకులు కేన్ విలియమ్సన్ (9276), విరాట్ కోహ్లి (9230) ఇంకా 9000 పరుగుల క్లబ్లోనే ఉన్నారు.తన టెస్ట్ కెరీర్లో 114 మ్యాచ్లు ఆడిన స్మిత్ 56కు పైగా సగటుతో 10100* పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు, 35 సెంచరీలు, 41 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఇదే మ్యాచ్లో మరో ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖ్వాజా (Usman Khawaja) కూడా సెంచరీ చేశాడు. ఖ్వాజా 135 బంతుల్లో 8 బౌండరీలు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకుని 147 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలికాలంలో పెద్దగా ఫామ్లో లేని ఖ్వాజాకు ఏడాదిన్నర తర్వాత ఇదే తొలి సెంచరీ. టెస్ట్ల్లో ఖ్వాజాకు ఇది 16వ శతకం. ఇటీవల భారత్తో ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఖ్వాజా దారుణంగా నిరాశపరిచాడు (కేవలం 20.44 సగటున పరుగులు చేశాడు).16TH TEST CENTURY FOR USMAN KHAWAJA - A TERRIFIC KNOCK. 💯pic.twitter.com/H2jliMrAVy— Mufaddal Vohra (@mufaddal_vohra) January 29, 2025ఖ్వాజా, స్మిత్ సెంచరీతో కదంతొక్కడంతో లంకతో తొలి టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 81.1 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. మ్యాచ్ ముగియడానికి కొద్ది సేపటి ముందు వర్షం మొదలుకావడంతో అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. ఆసీస్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 57; 10 ఫోర్లు, సిక్స్) చెలరేగి మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. వన్డౌన్ బ్యాటర్ లబూషేన్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రభాత జయసూర్య, జెఫ్రీ వాండర్సేలకు తలో వికెట్ దక్కింది. -
T20 World Cup 2025: సూపర్ సిక్స్లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన శ్రీలంక
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్ 2025 (ICC Under 19 Women's T20 World Cup 2025) చివరి సూపర్ సిక్స్ మ్యాచ్లో శ్రీలంక (Sri Lanka) ఆస్ట్రేలియాకు (Australia) షాకిచ్చింది. ఈ మెగా టోర్నీలో ఓటమి ఎరుగని ఆసీస్కు శ్రీలంక ఓటమి రుచి చూపించింది. మలేసియాలోకి బంగి వేదికగా ఇవాళ (జనవరి 29) జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆసీస్పై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఆసీస్ ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు శ్రీలంక సైతం ఈ టోర్నీలో అద్భుతంగా రాణించినప్పటికీ.. ఆ జట్టుకు అదృష్టం కలిసి రాలేదు. గ్రూప్ దశలో శ్రీలంక.. మలేసియా, వెస్టిండీస్ జట్లపై విజయాలు సాధించినప్పటికీ భారత్ చేతిలో ఘోరంగా ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆతర్వాత సూపర్-6లో తప్పక గెలుస్తుందనుకున్న మ్యాచ్కు వరుణుడు అడ్డుతగిలాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దైంది. ఈ మ్యాచ్ రద్దు కావడం శ్రీలంక సెమీస్ ఆశలను గల్లంతు చేసింది. తాజాగా శ్రీలంక ఆసీస్పై గెలిచినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. శ్రీలంక ఉన్న గ్రూప్-1 నుంచి భారత్, ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఫైనల్ ఫోర్కు చేరాయి. జనవరి 31న జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, ఇంగ్లండ్ ఢీకొట్టనుండగా.. అదే రోజు జరిగే రెండ సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ భారతకాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా.. రెండో సెమీస్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. కాగా, ఈ మెగా టోర్నీ ఆరంభ ఎడిషన్లో (2023) టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో శ్రీలంక ఆసీస్ను 12 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో ఓపెనర్లు సంజన కవిండి (19), సుముదు నిసంసల (18), కెప్టెన్ మనుడి ననయక్కార (15), హిరుని హన్సిక (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో లిల్లీ బాస్సింగ్వైత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టింది. హస్రత్ గిల్, టెగాన్ విలియమ్సన్లు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి చెరి రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. లంక బౌలర్లు మూకుమ్మడిగా అటాక్ చేయడంతో ఒక్కో పరుగు చేసేందుకు నానా ఇబ్బందులు పడింది. చమోది ప్రబోద, ప్రముది మెత్సర, అసేని తలగుణే తలో రెండు వికెట్లు తీయడంతో పాటు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు. లిమాంస తిలకరత్న ఓ వికెట్ పడగొట్టింది. లంక బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి కూడా 8 వికెట్ల నష్టానికి 87 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్లో బే (27) టాప్ స్కోరర్గా నిలువగా.. మెక్కియోన్ (10), కెప్టెన్ హ్యామిల్టన్ (10), వికెట్ కీపర్ గ్రేస్ లయన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. -
స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత.. 10000 పరుగుల క్లబ్లో చేరిక
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ల్లో 10000 పరుగుల క్లబ్లో చేరాడు. గాలే వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 29) ప్రారంభమైన తొలి టెస్ట్లో స్టీవ్ ఈ ఘనత సాధించాడు. 9999 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను ప్రారంభించిన స్టీవ్.. తొలి బంతికే 10000 పరుగుల మార్కును అందుకున్నాడు. స్టీవ్ ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియన్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. స్టీవ్కు ముందు రికీ పాంటింగ్ (13378), అలెన్ బోర్డర్ (11174), స్టీవ్ వా (10927) ఈ ఘనత సాధించారు. 10000 పరుగుల మార్కును తన 205వ ఇన్నింగ్స్లో అధిగమించిన స్టీవ్.. బ్రియాన్ లారా (195), సచిన్ టెండూల్కర్ (195), కుమార సంగక్కర (195), రికీ పాంటింగ్ (196) తర్వాత అత్యంత వేగంగా (ఇన్నింగ్స్ల పరంగా) ఈ ఫీట్ను సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.There it is!Steve Smith is the fourth Australian to reach 10,000 Test runs 🙌#SLvAUS pic.twitter.com/06FLk8iqMI— 7Cricket (@7Cricket) January 29, 2025టెస్ట్ క్రికెట్లో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్లలో జో రూట్ (12972) తర్వాత స్టీవ్ స్మిత్ ఒక్కడే 10000 పరుగుల క్లబ్లో చేరాడు. స్టీవ్ సమకాలీకులు కేన్ విలియమ్సన్ (9276), విరాట్ కోహ్లి (9230) ఇంకా 9000 పరుగుల క్లబ్లోనే ఉన్నారు. రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ (Kane Williamson), విరాట్ కోహ్లిలను (Virat Kohli) ఈ జమానా ఫాబ్ ఫోర్గా కీర్తిస్తారు. స్టీవ్ తన 115 మ్యాచ్ల టెస్ట్ కెరీర్లో 205 ఇన్నింగ్స్లు ఆడి 56.18 సగటున 10056* పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు, 34 సెంచరీలు, 42 అర్ద సెంచరీలు ఉన్నాయి.శ్రీలంకతో మ్యాచ్లో స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో స్టీవ్ 74 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 59 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 51 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (102 నాటౌట్) చాలాకాలం తర్వాత సెంచరీతో మెరువగా, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్ అర్ద సెంచరీలతో రాణించారు. హెడ్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి 40 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా తన సెంచరీలో 8 బౌండరీలు, ఓ సిక్సర్ కొట్టాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్యకు హెడ్ వికెట్ దక్కగా.. జెఫ్రీ వాండర్సేకు లబూషేన్ (20) వికెట్ దక్కింది.కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ (రెండు వన్డేలు కూడా) కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్ ఫలితంతో సంబంధం లేకుండానే ఆసీస్ ఇదివరకే డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరింది. జూన్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్.. సౌతాఫ్రికాతో ఆమీతుమీ తేల్చుకోనుంది.శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా కమిన్స్ ఈ సిరీస్లో పాల్గొనడం లేదు. ఈ కారణంగా స్టీవ్ స్మిత్ ఆసీస్కు సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఈ సిరీస్లో ట్రవిస్ హెడ్కు ప్రమోషన్ లభించింది. మిడిలార్డర్ బ్యాటింగ్కు దిగే హెడ్.. తొలి టెస్ట్లో ఓపెనర్గా బరిలోకి దిగాడు. వచ్చీ రాగానే హెడ్ ఓపెనింగ్ స్థానంలో తనదైన మార్కును చూపించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్గా బరిలోకి దిగే హెడ్.. ఇక్కడ కూడా అదే తరహా చెలరేగిపోయాడు. -
భారత జాలర్లపై శ్రీలంక జవాన్ల కాల్పులు
న్యూఢిల్లీ: శ్రీలంక సరిహద్దు సముద్రజలాల సమీపంలో చేపలవేటకు వెళ్లిన భారతీయ మత్స్యకారుల(Indian Fishermen)పై శ్రీలంక నావికాదళ సభ్యులు కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జీవనోపాధి కోసం వచ్చిన జాలర్లపై గస్తీదళాల కాల్పుల ఘటనను భారత్ సీరియస్గా తీసుకుంది. మిత్రదేశ పౌరులపై శత్రువుల తరహాలో కాల్పులు జరపడమేంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి శ్రీలంక రాయబారిని పిలిపించి ఆయన ఎదుట తీవ్ర నిరసన వ్యక్తంచేసింది.‘‘క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాసరే బలగాలు ఆయుధాలకు పనిచెప్పడం లాంటి అసాధారణ చర్యలకు దిగడం ఏమాత్రం ఆమోదయోగ్యంకాదు. ఇలాంటివి పునరావృతమైతే శ్రీలంకతో సత్సంబంధాల కొనసాగింపుపై మేం మరోసారి తీవ్రంగా సమీక్ష జరపాల్సి ఉంటుంది’’ అని భారత్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది.అసలేం జరిగింది?మంగళవారం తెల్లవారుజామున శ్రీలంక సమీపంలోని డెల్ఫ్ట్ ద్వీపం సమీప సముద్రజలాల్లో 13 మంది భారతీయ జాలర్లు చేపలు పడుతుండగా అక్కడికి శ్రీలంక నావికాదళంలోని గస్తీ బృందం చేరుకుంది. ఇక్కడ చేపలు పట్టే అధికారం భారతీయులకు లేదంటూ ఆ జాలర్లను అదుపులోకి తీసుకునే ప్రయత్నంచేశారు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన జాలర్లపై కాల్పులు జరపడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని దగ్గర్లోని జాఫ్నా టీచింగ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెల్సుకున్న జాఫ్నాలోని భారత కాన్సులేట్ అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి జాలర్ల ఆరోగ్యం గురించి వాకబుచేశారు. అత్యుత్తమ చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. -
ఆస్ట్రేలియా X శ్రీలంక
గాలె: ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కించుకున్న ఆ్రస్టేలియా జట్టు బుధవారం నుంచి శ్రీలంకతో పోరుకు సిద్ధమైంది. ఈ పర్యటనలో భాగంగా ఆసీస్ జట్టు శ్రీలంకతో 2 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వగా... స్టీవ్ స్మిత్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు వరుణుడు అడ్డుపడే అవకాశాలుండగా... ఆస్ట్రేలియా జట్టు సుదీర్ఘ ఫార్మాట్లోనూ ట్రావిస్ హెడ్ను ఓపెనర్గా దింపాలని యోచిస్తోంది. ‘ట్రావిస్ టాపార్డర్లో బరిలోకి దిగుతాడు. భారత్లో అతడు ఓపెనర్గా రాణించిన అంశాన్ని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకున్నారు. కొత్త బంతితో హెడ్ వేగంగా పరుగులు రాబట్టి ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేయగలడు. లంకలోనూ అదే చేస్తాడనే నమ్మకముంది’ అని స్మిత్ పేర్కొన్నాడు. హెడ్ ఓపెనర్గా ప్రమోషన్ దక్కించుకుంటే... టీమిండియాతో ‘బాక్సింగ్ డే’ టెస్టులో చక్కటి ప్రదర్శన కనబర్చిన 19 ఏళ్ల యువ ఓపెనర్ స్యామ్ కొన్స్టాస్కు జట్టులో చోటు దక్కడం అనుమానమే. ఇక చాన్నాళ్లుగా ఆసీస్ తరఫున మెరుగైన ప్రదర్శన చేస్తున్న జోష్ ఇంగ్లిస్ ఈ సిరీస్ ద్వారా టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. ఈ మేరకు స్మిత్ సూచనలిచ్చాడు. మ్యాచ్కు ఒక రోజు ముందే తుది జట్టును ప్రకటించాలని ఆసీస్ భావించినా... వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో మ్యాచ్కు ముందు నిర్ణయిస్తామని స్మిత్ వెల్లడించాడు. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరమైన శ్రీలంక... సొంతగడ్డపై మెరుగైన ప్రదర్శన చేసి కంగారూల విజయయాత్రకు చెక్ పెట్టాలని భావిస్తోంది.కాగా... గాయం కారణంగా తొలి టెస్టు నుంచి లంక ఓపెనర్ నిసాంక దూరమయ్యాడు. అతడి స్థానంలో ఒషాడా ఫెర్నాండో జట్టులోకి రానున్నాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరమైనప్పటికీ... ఈ సిరీస్ను 2–0తో గెలుచుకుంటే పట్టికలో మూడో స్థానంలో నిలిచే అవకాశం మా జట్టుకు ఉంది. అది మా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది’ అని శ్రీలంక సారథి ధనంజయ డిసిల్వా అన్నాడు. -
చరిత్ర సృష్టించిన హసరంగ.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ
శ్రీలంక స్టార్ స్పినర్ వనిందు హసరంగ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. హసరంగకు ముందు ఈ రికార్డు ఆండ్రూ టై పేరిట ఉండేది. టై 211 మ్యాచ్ల్లో 300 వికెట్లు తీయగా.. హసరంగ కేవలం 208 మ్యాచ్ల్లోనే ఈ మైలురాయిని తాకాడు. టామ్ కొహ్లెర్ కాడ్మోర్ హసరంగకు 300వ వికెట్.టీ20ల్లో వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్లు..హసరంగ-208 మ్యాచ్ల్లోఆండ్రూ టై-211రషీద్ ఖాన్-213లసిత్ మలింగ-222ముస్తాఫిజుర్ రెహ్మాన్-243ఇమ్రాన్ తాహిర్-247 ప్రస్తుతం హసరంగ ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో హసరంగ డెజర్ట్ వైపర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. శనివారం జరిగిన మ్యాచ్లో వైపర్స్ షార్జా వారియర్స్ను ఢీకొంది. ఈ మ్యాచ్లో వైపర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (38 బంతుల్లో 55; 9 ఫోర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. కొహ్లెర్ కాడ్మోర్ 42 పరుగులు చేసి ఔటయ్యాడు.వీరిద్దరూ మినహా వారియర్స్ ఇన్నింగ్స్లో అంతా విఫలమయ్యారు. వైపర్స్ బౌలర్లలో ఖుజైమా తన్వీర్ 4 వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ పేన్ 2, మొహమ్మద్ ఆమిర్, హసరంగ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వైపర్స్ 14.5 ఓవర్లలోనే (2 వికెట్లు కోల్పోయి) గెలుపు తీరాలకు చేరింది. అలెక్స్ హేల్స్ (42 బంతుల్లో 77; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్ కర్రన్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలు బాది వైపర్స్ను గెలిపించారు. వారియర్స్ బౌలర్లలో ఆడమ్ మిల్నేకు రెండు వికెట్లు లభించాయి. ఈ గెలుపుతో వైపర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ సీజన్లో వైపర్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో ఆరింట విజయాలు సాధించింది. -
శ్రీలంక ప్లేయర్కు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు
శ్రీలంక నయా బ్యాటింగ్ స్టార్ కమిందు మెండిస్ను ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు వరించింది. కమిందు 2024 సంవత్సరానికి గానూ ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. కమిందు గతేడాది ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. కమిందు గతేడాది 50కి పైగా సగటుతో 1451 పరుగులు సాధించాడు.ఎరాస్మస్కు అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డునమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎంపికయ్యాడు. ఎరాస్మస్ గతేడాది వన్డే, టీ20 ఫార్మాట్లలో అదరగొట్టాడు. అందుకు అతన్ని ఈ అవార్డు వరించింది. ఎరాస్మస్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ ఆకట్టుకున్నాడు. 2024 టీ20 వరల్డ్కప్లో ఎరాస్మస్ అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. నేపాల్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.ఈశా ఓఝాకు మహిళల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుయూఏఈ కెప్టెన్ ఈశా ఓఝాకు మహిళల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు-2024 లభించింది. గతేడాది ఈషా ఆల్రౌండ్ ప్రదర్శనలతో అదరగొట్టింది.ఐసీసీ టెస్ట్ జట్టులో కమిందుశ్రీలంక అప్కమింగ్ స్టార్ కమిందు మెండిస్ 2024 ఐసీసీ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ జట్టులో కమిందుతో పాటు యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, రవీంద్ర జడేజా, పాట్ కమిన్స్, హ్యాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. -
T20 World Cup 2025: శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. సూపర్ సిక్స్లోకి ఎంట్రీ
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 23) జరిగిన చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏ టాపర్గా నిలిచి సూపర్ సిక్స్కు అర్హత సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్ గొంగడి త్రిష (44 బంతుల్లో 49; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేసింది. త్రిషతో పాటు భారత్ ఇన్నింగ్స్లో కెప్టెన్ నికీ ప్రసాద్ (11), మిథిలా వినోద్ (16), వీజే జోషిత (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జి కమలిని 5, సినిక ఛల్కే 0, భవిక అహిరే 7, ఆయుషి శుక్లా 5, పరునిక సిసోడియా ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. షబ్నమ్ షకీల్ (2), వైష్ణవి శర్మ (1) అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో ప్రముది మెత్సర, లిమాంస తిలకరత్న, అసెని తలగుణే తలో 2 వికెట్లు పడగొట్టగా... రష్మిక సేవండి, చమోది ప్రభోద, కెప్టెన్ మనుడి ననయక్కార తలో వికెట్ దక్కించుకున్నారు.119 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. వైష్ణవి శర్మ (4-1-3-1), షబ్నమ్ షకీల్ (4-1-9-2), పరునిక సిసోడియా (4-0-7-2), విజే జోషిత (3-0-17-2), ఆయుషి శుక్లా (4-0-13-1) ధాటికి శ్రీలంక నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 58 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైష్ణవి శర్మ సంధించిన బంతులను ఎదుర్కోలేక లంక బ్యాటర్లు నానా అవస్థలు పడ్డారు. లంక ఇన్నింగ్స్లో ఒకే ఒక్కరు (రష్మిక (15)) రెండంకెల స్కోర్ చేశారు. మిగతా 10 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.కాగా, ఈ టోర్నీలో భారత్.. వెస్టిండీస్, మలేసియా, శ్రీలంక జట్లపై ఘన విజయాలు సాధించి సూపర్-6లోకి ప్రవేశించింది. గ్రూప్-ఏలో భారత్, శ్రీలంక, వెస్టిండీస్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మిగతా గ్రూప్ల విషయానికొస్తే.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, యూఎస్ఏ, ఐర్లాండ్.. గ్రూప్-సిలో సౌతాఫ్రికా, నైజీరియా, న్యూజిలాండ్.. గ్రూప్-డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. -
ఆసీస్కు గుడ్ న్యూస్.. ఫిట్నెస్ టెస్టులో కెప్టెన్ పాస్
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు ఆస్ట్రేలియా గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టాండ్-ఇన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజన్లో సిడ్నీ సిక్సర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్మిత్.. ఆడిలైడ్ స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా స్మిత్ మోచేతికి గాయమైంది. దీంతో అతడు శ్రీలంక సిరీస్ కోసం దుబాయ్లో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరానికి ఆసీస్ జట్టుతో పాటు వెళ్లలేదు.ఈ క్రమంలో అతడు శ్రీలంక పర్యటనకు దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ సోమవారం నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో ఈ ఆసీస్ సూపర్ స్టార్ పాసయ్యాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం అతడికి తిరిగి జట్టులో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియా ఇదే ఆఖరి సిరీస్ కావడం గమనార్హం. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకున్న ఆసీస్.. తమ ఫైనల్ సిరీస్లో కూడా విజయ భేరి మ్రోగించాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య జనవరి 29 నుంచి ఈ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(Pat cummins) దూరమయ్యాడు. అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో ఈ సిరీస్ నుంచి కమ్మిన్స్ తప్పుకున్నాడు. అతడి స్దానంలో స్టీవ్ స్మిత్(Steve Smith ) జట్టు పగ్గాలు చేపట్టాడు.అదే విధంగా ఈ సిరీస్కు ఆసీస్ సెలక్టర్లు యువ సంచలనం కూపర్ కొన్నోలీకి తొలిసారి పిలుపునిచ్చారు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పదేళ్ల తర్వాత బీజీటీని కంగారులు రిటైన్ చేసుకున్నారు.లంకతో సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్స్వీనీ, టాడ్ మర్ఫీ , మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్చదవండి: జడేజా స్ధానంలో అతడికి ఛాన్స్ ఇవ్వాల్సింది: ఆకాష్ చోప్రా -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన న్యూజిలాండ్ ప్లేయర్.. వీడియో వైరల్
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ నాథన్ స్మిత్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద స్మిత్ పక్షిలా గాల్లోకి ఎగిరి సూపర్ మ్యాన్ క్యాచ్ పట్టుకున్నాడు. ఛేదనలో లంక ఇన్నింగ్స్ 29వ ఓవర్లో (ఆఖరి బంతికి) ఇది జరిగింది. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్లో లంక బ్యాటర్ ఎషాన్ మలింగ రూమ్ తీసుకుని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని వికెట్కీపర్ వెనుక భాగంలో డీప్ థర్డ్ దిశగా గాల్లోకి ఎగిరింది. నాథన్ స్మిత్ కొద్ది మీటర్ల పాటు స్ప్రింట్ చేసి బౌండరీ రోప్కు ముందు అద్బుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. NATHAN SMITH GRABS AN ABSOLUTE STUNNER. 🤯pic.twitter.com/wDknkRRFOV— Mufaddal Vohra (@mufaddal_vohra) January 8, 2025దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. క్రికెట్ అభిమానులు నాథన్ స్మిత్ విన్యాసానికి ముగ్దులవుతున్నారు. సూపర్ క్యాచ్ అంటూ కొనియాడుతున్నారు.కాగా, ఈ మ్యాచ్లో శ్రీలంక న్యూజిలాండ్ చేతిలో 113 పరుగుల తేడాతో ఓడింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (63 బంతుల్లో 79; 9 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ద శతకం బాదగా.. వన్ డౌన్ బ్యాటర్ మార్క్ చాప్మన్ (52 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. డారిల్ మిచెల్ (38), గ్లెన్ ఫిలిప్స్ (22), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. విల్ యంగ్ 16, టామ్ లాథమ్ 1, నాథన్ స్మిత్ 0, మ్యాట్ హెన్రీ 1, విలియమ్ ఓరూర్కీ 3 పరుగులు (నాటౌట్) చేశారు. లంక బౌలర్లలో మహీశ్ తీక్షణ హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హసరంగ రెండు, ఎషాన్ మలింగ, అశిత ఫెర్నాండో తలో వికెట్ తీశారు.అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 30.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లంక ఇన్నింగ్స్లో కమిందు మెండిస్ (64) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. చమిందు విక్రమసింఘే (17), జనిత్ లియనగే (22), అవిష్క ఫెర్నాండో (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. కివీస్ పేసర్ విలియమ్ ఓరూర్కీ లంక టాప్ స్కోరర్ కమిందు వికెట్ సహా మూడు వికెట్లు తీశాడు. జాకబ్ డఫీ రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాట్ హెన్రీ, నాథన్ స్మిత్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
NZ Vs SL: తీక్షణ హ్యాట్రిక్ వృధా.. రెండో వన్డేలోనూ ఓడిన శ్రీలంక
శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. హ్యామిల్టన్ వేదికగా ఇవాళ (జనవరి 8) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (63 బంతుల్లో 79; 9 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ద శతకం బాదగా.. వన్ డౌన్ బ్యాటర్ మార్క్ చాప్మన్ (52 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. డారిల్ మిచెల్ (38), గ్లెన్ ఫిలిప్స్ (22), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. విల్ యంగ్ 16, టామ్ లాథమ్ 1, నాథన్ స్మిత్ 0, మ్యాట్ హెన్రీ 1, విలియమ్ ఓరూర్కీ 3 పరుగులు (నాటౌట్) చేశారు.తీక్షణ హ్యాట్రిక్ఈ మ్యాచ్లో లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. 35 ఓవర్లో ఆఖరి రెండు బంతులకు వరుసగా రెండు వికెట్లు తీసిన తీక్షణ.. ఆ తర్వాత 37వ ఓవర్ తొలి బంతికి మరో వికెట్ పడగొట్టి వన్డేల్లో తన తొలి హ్యాట్రిక్ను నమోదు చేశాడు. మిచెల్ సాంట్నర్ను తొలుత ఔట్ చేసిన తీక్షణ.. ఆ తర్వాత వరుసగా నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీని ఔట్ చేశాడు. ఈ మ్యాచ్లో మొత్తం 8 ఓవర్లు వేసిన తీక్షణ 44 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తీక్షణతో పాటు హసరంగ (2), ఎషాన్ మలింగ (1), అశిత ఫెర్నాండో (1) వికెట్లు తీశారు.అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంకను కమిందు మెండిస్ (64), జనిత్ లియనాగే (22) ఆదుకునే ప్రయత్నం చేశారు. లియనాగే 16వ ఓవర్ ఆఖరి బంతికి ఔట్ కావడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. చమిందు విక్రమసింఘే (17) క్రీజ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం వచ్చిన ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఫలితంగా శ్రీలంక 30.2 ఓవర్లలో 142 పరుగులకే చాపచుట్టేసింది. లంక ఇన్నింగ్స్లో నిస్సంక 1, అవిష్క ఫెర్నాండో 10, కుసాల్ మెండిస్ 2, అసలంక 4, హసరంగ 1, తీక్షణ 6, మలింగ 4 పరుగులు చేసి ఔటయ్యారు. కివీస్ పేసర్ విలియమ్ ఓరూర్కీ కీలకమైన కమిందు మెండిస్ వికెట్ పడగొట్టడంతో పాటు ఇద్దరు చివరి వరుస ఆటగాళ్లను పెవిలియన్కు పంపాడు. జేకబ్ డఫీ రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాట్ హెన్రీ, నాథన్ స్మిత్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీశారు.కాగా, మూడు మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ తొలి వన్డేలోనూ విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు చివరి వన్డే జనవరి 11న ఆక్లాండ్లో జరుగనుంది. -
లంక పర్యటనకు కమిన్స్ దూరం
సిడ్నీ: ఆ్రస్టేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ శ్రీలంక పర్యటనకు దూరం కానున్నాడు. అతని భార్య రెండో కాన్పు సమయంలోనే ఆ టూర్ ఉండటంతో ద్వైపాక్షిక సిరీస్ నుంచి తప్పుకునే అవకాశముందని చెప్పాడు. గతేడాది భారత్ పర్యటనలో ఉండగా కమిన్స్ మాతృమూర్తి మృతి చెందడంతో టూర్ మధ్యలోనే అతను తిరుగుముఖం పట్టాడు. అప్పటి నుంచి తన జీవితంలో కుటుంబ ప్రాధామ్యాలు మారాయని కమిన్స్ చెప్పుకొచ్చాడు.కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితానికి తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఈ నెలాఖర్లో లంక పర్యటనకు బయలుదేరనున్న ఆసీస్ అక్కడ రెండు టెస్టుల సిరీస్లో పాల్గొంటుంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్ చేరే రెండో జట్టు ఈ సిరీస్ ఫలితంతోనే ఖరారవుతుంది. జనవరి 29 నుంచి తొలి టెస్టు, ఫిబ్రవరి 6 నుంచి రెండో టెస్టు జరగనున్నాయి. కమిన్స్ గైర్హాజరీలోని ఆ్రస్టేలియాకు అనుభవజు్ఞడైన స్టీవ్ స్మిత్ లేదంటే హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్లలో ఒకరు నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. -
నిప్పులు చెరిగిన డఫీ.. లంకను చిత్తు చేసిన కివీస్.. సిరీస్ కైవసం
మౌంట్ మాంగనూయ్ వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరిగిన రెండో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్ (New Zealand) 45 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్ సిరీస్ను కివీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఇవాళ (డిసెంబర్ 30) జరిగిన రెండో టీ20లో శ్రీలంక టాస్ గెలిచి న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. టిమ్ రాబిన్సన్ (41), మార్క్ చాప్మన్ (42), మిచెల్ హే (41 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్ర 1, గ్లెన్ ఫిలిప్స్ 23, డారిల్ మిచెల్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో మిచెల్ హే (Mitchell Hay) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, మతీశ పతిరణ తలో వికెట్ దక్కించుకున్నారు.187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 19.1 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. జేకబ్ డఫీ (Jacob Duffy) (4-0-15-4) నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించాడు. మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్ తలో రెండు.. మైఖేల్ బ్రేస్వెల్, జకరీ ఫోల్క్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. లంక ఇన్నింగ్స్లో కుసాల్ పెరీరా (48) టాప్ స్కోరర్గా నిలువగా.. పథుమ్ నిస్సంక (37), చరిత్ అసలంక (20), కుసాల్ మెండిస్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. కమిందు మెండిస్ (7), అవిష్క ఫెర్నాండో (5), వనిందు హసరంగ (1), మహీశ్ తీక్షణ (0), బినుర ఫెర్నాండో (3), మతీశ పతిరణ (0) విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 నెల్సన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 2న జరుగనుంది.తొలి మ్యాచ్లోనూ ఇబ్బంది పెట్టిన డఫీన్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ తలో టీ20లోనూ లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఆ మ్యాచ్లో డఫీ 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. తద్వారా ఛేదనలో శ్రీలంక ఇబ్బంది పడి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో డఫీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (62), మైఖేల్ బ్రేస్వెల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో తీక్షణ, హసరంగ, బినుర తలో రెండు వికెట్లు తీయగా.. పతిరణ ఓ వికెట్ దక్కించుకున్నాడు.173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్లు నిస్సంక (90), కుసాల్ మెండిస్ (46) రాణించడంతో ఓ దశలో గెలుపు దిశగా సాగింది. అయితే డఫీ సహా కివీస్ పేసర్లు మ్యాట్ హెన్రీ (2/28), జకరీ ఫోల్క్స్ (2/41) ఒక్కసారిగా విజృంభించడంతో శ్రీలంక ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. లంక ఇన్నింగ్స్లో ఓపెనర్లు మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోయారు. -
యార్కర్ కింగ్ లసిత్ మలింగా పాడిన ఈ పాట విన్నారా?
కొలంబో : శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ గురించి పరిచయం అక్కర్లేదు. దశాబ్దన్నర పాటు క్రికెట్లో తన కళ్లు చెదిరే యార్కర్లతో బ్యాట్స్మెన్ని బోల్తా కొట్టించిన యార్కర్ కింగ్ మళ్లీ యాక్టీవ్ అయ్యారు. సింగర్గా సరికొత్త అవతారం ఎత్తారు. సాంగ్ రైటర్గా ఇప్పటికే ఎంటర్టైన్ చేస్తున్న ఈ స్పీడ్ స్టర్ ఈసారి మరో సాంగ్తో అభిమానుల ముందుకు వచ్చారు. గతంలో పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. శ్రీలంక సింగర్లతో గొంతు కలిపారు. ఆయన పాడిన పాటలు కొన్ని హిందీలో డబ్ అయ్యాయి. ఈ తరుణంలో తాజాగా ఓ సాంగ్ను పాడారు. ఇప్పుడా ఆ సాంగ్ సంగీత ప్రియుల్ని అలరిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ పాట ఎలా ఉందో మీరూ వినేయండి.From Slinga Malinga to Singer Malinga!One of the all time greats, Lasith Malinga 😍🥰 pic.twitter.com/98sxoaAAoc— Dr. Jo (@ERDrJo) December 25, 2024 -
ప్రేమ, సామరస్యమే క్రీస్తు బోధనల సారం
న్యూఢిల్లీ: ప్రేమ, సోదరభావం, సామరస్యమే క్రీస్తు బోధనల సారమని, అందరూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరింత ఉత్సాహంతో పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా(సీబీసీఐ) సోమవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని పాల్గొని, మాట్లాడారు. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసి, హింసను వ్యాపింపజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తోటి వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలనే భావనను అందరం అలవర్చుకున్నప్పుడు మాత్రమే 21వ శతాబ్దపు ప్రపంచంలో కొత్త శిఖరాలకు చేరుకోగలమన్నారు. జర్మనీలో క్రిస్మస్ మార్కెట్పై దాడి, 2019లో శ్రీలంకలో ఈస్టర్ బాంబు దాడులను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ..ఇటువంటి సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. కేరళలో జని్మంచిన జార్జి కూవకడ్ను పోప్ ఫ్రాన్సిస్ ఇటీల కార్డినల్ ప్రకటించడం మనందరికీ గర్వకారణమన్నారు. దేశంలో కేథలిక్ చర్చ్లకు ప్రధాన కేంద్రంగా భావించే సీబీసీఐలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనడం ఇదే మొదటిసారి. -
మైత్రీబంధంలో శుభ పరిణామం
ఇది కొంత ఊహించని పరిణామమే కావచ్చు. కానీ కొత్త ఆశలు చిగురింపజేసిన సంఘటన.శ్రీలంక నూతన అధ్యక్షుడు అరుణ కుమార దిసనాయకె తన తొలి విదేశీ పర్యటనకు భారతదేశాన్ని ఎంచుకోవడం, ఢిల్లీ రావడం ఇరుదేశాల మధ్య సత్సంబంధాలకు సానుకూల సూచన. శ్రీలంకలోని అధికార నేషనల్ పీపుల్స్ పవర్ కూటమిలో ప్రధాన భాగస్వామి, సైద్ధాంతికంగా మార్క్సిస్టు భావజాలం వైపు మొగ్గుచూపే రాజకీయ పక్షమైన జనతా విముక్తి పెరుమున (జేవీపీ), దానికి సారథిగా దిసనాయకె చైనా పక్షం వహిస్తారని భావించారు. పైగా రుణాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు సహా అనేక అంశాలలో ఆధారపడ్డ కొలంబోపై బీజింగ్ ప్రభావమూ తక్కువేమీ కాదు. మరోపక్క, 1980లలో ద్వీపదేశంలో తమిళ వేర్పాటువాదులతో శ్రీలంక అంతర్యుద్ధ వేళ సైన్యాన్ని పంపడం ద్వారా భారత జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, జేవీపీ ఆది నుంచి భారత వ్యతిరేక వైఖరితో వ్యవహరించేది. పైపెచ్చు కొంత కాలంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రాబల్యం కోసం చైనా దూకుడుగా సాగుతూ, మనకు గుబులు పుట్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక భూభాగాన్ని వినియోగించుకొనేందుకు అనుమతించేది లేదంటూ భారత పర్యటనలో శ్రీలంక అధ్యక్షుడు ఇచ్చిన హామీ మండువేసవిలో పన్నీటిజల్లు లాంటిది. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలు, పరస్పర విశ్వాసం, పారదర్శకతతో క్రమం తప్పకుండా జరపా ల్సిన చర్చలను ఉభయ దేశాల సంయుక్త ప్రకటన ప్రతిఫలించడం విశేషం.ద్వీపదేశాధ్యక్షుడికీ, భారత ప్రధాని మోదీకీ మధ్య భేటీ ఉత్సాహజనకంగా సాగడం చెప్పు కోదగ్గ అంశం. భారత విదేశీ విధానానికి దీన్ని ఓ విజయ సూచనగానూ భావించవచ్చు. రాజపక్స లాంటి శ్రీలంక నేతలు భారత్ను అనుమానిస్తూ, ఉద్దేశపూర్వకంగానే చైనా గాఢపరిష్వంగంలోకి చేరిన సందర్భంలో... నూతన అధ్యక్షుడు తన తొలి పర్యటనకు చైనాను కాక భారత్ను ఎంచు కోవడం మళ్ళీ పల్లవిస్తున్న స్నేహరాగం అనుకోవచ్చు. వెరసి, చైనాకు స్వల్పంగా దూరం జరిగి, మళ్ళీ భారత్తో చిరకాల బంధాలను పునరుద్ధరించుకోవడానికి శ్రీలంక ముందుకు రావడం మారు తున్న ఆలోచనా సరళికి సంకేతం. నిజానికి, కరోనా అనంతర కాలంలో ఆర్థికవ్యవస్థ కుప్ప కూలి పోయి, చేదు అనుభవాలు ఎదురుకావడంతో కొలంబో మార్పు వైపు చూసింది. దానికి తోడు అక్కడ మునుపటి వంశపారంపర్య, కుటుంబపాలిత రాజకీయ పార్టీల స్థానంలో కొత్త రాజకీయ నాయకత్వ ఆవిర్భావం మరింత తోడ్పడింది. అలాగే, ఇరుగుపొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్య మంటూ భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం లంకేయుల్ని ఆకట్టుకుంది. 2022లో శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయినప్పుడు 500 కోట్ల డాలర్ల పైచిలుకు మేర భారత్ సాయంమరువరానిది. ఇవన్నీ కొలంబో ఆలోచనలో మార్పుకు దోహదం చేశాయి. హంబన్తోట నౌకాశ్రయాన్ని 99 ఏళ్ళ లీజు మీద చైనాకు కట్టబెట్టడం సహా అనేక తప్పులు శ్రీలంకను వెంటాడాయి. అప్పటి రాజపక్సే సర్కారు వైఖరితో దేశం అప్పుల కుప్పయింది. అలాగే, నిన్నటి దాకా చైనా నౌకలు తమ గూఢచర్య యాత్రలు సాగిస్తూ, నడుమ శ్రీలంక నౌకాశ్రయాల్లో నిష్పూచీగా లంగరు వేసేవి. కానీ, ఇప్పుడు దిసనాయకె తాజా ఆశ్వాసనతో పరిస్థితి మారింది. చైనా నౌకలకు అది ఇక మునుపటిలా సులభమేమీ కాదు. ఇంతమాత్రానికే శ్రీలంకపై చైనా పట్టు సడలిందనుకోలేం. ఢిల్లీ, కొలంబోల మధ్య పాత కథలకు తెరపడి, కొత్త అధ్యాయం మొదలైందనుకో వచ్చు. లంకకు నిధుల అందజేతలో చైనాతో పోటీ పడలేకున్నా, రక్షణ సహా అనేక అంశాల్లో భారత – శ్రీలంకల మధ్య ఒప్పందాలు కలిసొస్తాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, సౌరశక్తి – పవన విద్యుత్ శక్తి, డిజిటల్ కనెక్టివిటీ లాంటివి ఉపకరిస్తాయి. అలాగే, అభివృద్ధి చెందని దేశాలతో దౌత్య పరంగా ముందుకు సాగేందుకు... భారత్ కొంతకాలంగా రుణసాయం నమూనా నుంచి పెట్టుబ డుల ఆధారిత భాగస్వామ్యాల వైపు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదీ కలిసొస్తోంది. అన్ని అంశాలకూ తాజా భేటీ ఒక్కటే సర్వరోగ నివారణి కాకున్నా, చేపల వేటకై శ్రీలంక జలాల్లోకి ప్రవేశిస్తున్న భారతీయ మత్స్యకారులకు ఆ దేశ నౌకాదళం నుంచి ఎదురవుతున్న ఇక్కట్లు, శ్రీలంకలోని తమిళుల ఆకాంక్షల లాంటివి కూడా తాజా భేటీలో ప్రస్తావనకు రావడం సుగుణం. అలాగే, భారత భద్రత, ప్రాంతీయ సుస్థిరత కీలకమని కూడా లంక గుర్తించిందనుకోవాలి. మొత్తం మీద, దిసనాయకె తాజా పర్యటన చిరకాల భారత – శ్రీలంక మైత్రీబంధానికి ప్రతీకగా నిలిచింది. అనేక సంవత్సరాల ఆర్థిక, రాజకీయ సంక్షోభం తర్వాత ద్వీపదేశం పునర్నిర్మాణ బాటలో సాగుతూ, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవడంపై శ్రద్ధ పెట్టడం సంతోషకరమే కాక శ్రేయోదాయకం. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కొలంబో పర్యటన జరిపి, ఆ దేశ ఆర్థిక పునరుజ్జీవానికి మనం కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేయడం లాంటివి ఉపకరించాయి. ఫలప్రదమైన చర్చలకు బలమైన పునాది వేశాయి. సమీప సముద్రయాన పొరుగు దేశంగా వాణిజ్యం నుంచి ప్రాంతీయ భద్రతా పరిరక్షణ వరకు అనేక అంశాల్లో వ్యూహాత్మకంగా భారత్కు శ్రీలంక కీలకం. అదే సమయంలో విదేశాంగ విధానంలో దిసనాయకె ఆచరణాత్మకదృక్పథమూ అందివచ్చింది. మొత్తం మీద ఆయన తాజా పర్యటన, భారత – శ్రీలంకల మధ్యసంబంధాలు కొంత మెరుగవడం ఇరుపక్షాలకూ మేలు చేసేవే. పరస్పర ప్రయోజనాలను అది కాపాడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలకూ కావాల్సింది అదే! -
న్యూజిలాండ్తో టీ20 సిరీస్ కోసం శ్రీలంక జట్టు ప్రకటన
న్యూజిలాండ్తో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (డిసెంబర్ 18) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ కోసం శ్రీలంక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ దునిత్ వెల్లలగేను విడిచిపెట్టింది. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో తలపడిన లంక జట్టులో ఇది ఏకైక మార్పు.ప్రస్తుతం ప్రకటించిన లంక జట్టు పేస్ మరియు స్పిన్ బౌలర్లతో సమతూకంగా ఉంది. గత న్యూజిలాండ్ సిరీస్లో అరంగేట్రం చేసిన సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ చమిందు విక్రమసింఘే తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రముఖ ఆల్రౌండర్ వనిందు హసరంగ స్పిన్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. హసరంగ స్పిన్ టీమ్లో మహీశ్ తీక్షణ, లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండడ్సే ఉన్నారు.లంక పేస్ విభాగాన్ని అశిత ఫెర్నాండో లీడ్ చేయనున్నాడు. నువాన్ తుషార, మతీష పతిరణ, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బినుర ఫెర్నాండో పేస్ టీమ్లో సభ్యులుగా ఉన్నారు. బ్యాటింగ్ విషయానికొస్తే.. కెప్టెన్ అసలంక, నిస్సంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్, చండీమాల్, కమిందు మెండిస్, భానుక రాజపక్సతో ఈ విభాగం పటిష్టంగా ఉంది.కాగా, న్యూజిలాండ్ పర్యటనలో తొలి టీ20 డిసెంబర్ 28న జరుగనుంది. మౌంట్ మాంగనూయ్లోని బే ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అనంతరం డిసెంబర్ 30వ తేదీ రెండో టీ20 జరుగనుంది. తొలి టీ20 జరిగిన చోటే ఈ మ్యాచ్ కూడా జరుగనుంది. వచ్చే ఏడాది జనవరి 2న మూడో టీ20 జరుగనుంది. నెల్సన్లోని సాక్స్టన్ ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. టీ20 సిరీస్ అనంతరం జనవరి 5, 8, 11 తేదీల్లో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనుంది.న్యూజిలాండ్తో టీ20 సిరీస్ కోసం శ్రీలంక జట్టు..చరిత్ అసలంక (కెప్టెన్), పతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, భానుక రాజపక్స, వనిందు హసరంగా, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరణ, జెఫ్రీ వాండర్సే, నువాన్ తుషార, అశిత ఫెర్నాండో, బినుర ఫెర్నాండో, మహేశ్ తీక్షణ -
ఈ తిరుగుబాట్లు ఎందుకు జరిగాయంటే...
సరిగ్గా నాలుగు నెలల కిందట బంగ్లాదేశ్ ప్రధాని నివాసంలో కనిపించిన దృశ్యాలే ఇవాళ సిరియా అధ్యక్ష భవనంలో కనిపిస్తున్నాయి. ప్రజా ఆగ్రహానికి గురై షేక్ హసీనా దేశాన్ని వీడిన వెంటనే ఆమె ప్రధానమంత్రి అధికారిక నివాసంలో తిరుగు బాటుదారులు దాడిచేసి ఇంటిని లూటి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇదే సీన్ సిరియా అధ్యక్ష భవనంలో రిపీట్ అయ్యింది. ఆ దేశ నియంత బషీర్ అల్ అసద్ తిరుగుబాటుదారుల దాడికి దేశాన్ని వీడారు. ఆ వెంటనే అధ్యక్ష భవనంలోకి తిరుగుబాటుదారులు జొర బడి కనిపించిన వస్తువులను ఎత్తుకెళ్లటం చూస్తున్నాం. సిరియా అధ్యక్షుడిగా రెండున్నర దశాబ్దాల పాటు ఆ దేశాన్ని ఏలిన బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి పారి పోవాల్సిన పరిస్థితి వచ్చింది.సిరియా దాదాపు 13 ఏళ్లుగా అంతర్యుద్ధంతో సతమతం అవుతూనే ఉంది. దీనిలో ‘తిలాపాపం తలా పిడికిడు’ అన్నట్లు రష్యా, అమెరికా వంటి దేశాల పాత్రను కూడా మరిచిపోకూడదు. అసద్ తండ్రి హఫీజ్ 1970లో తిరుగుబాటు ద్వారా అధికారం చేజిక్కించుకున్నారు. ఆయన మరణానంతరం అసద్ అధికారంలోకి వచ్చారు. అంటే ఏకంగా 54 ఏళ్ళుగా అసద్ కుటుంబ నియంతృత్వ పాలనలోనే సిరియా మగ్గి పోయింది. ఉగ్రవాదాన్ని, అంతర్యుద్ధాన్ని కట్టడి చేయ లేకపోవటం ప్రజాస్వామిక విధానాలను దరిదాపుల్లోకి రానీయకపోయిన ఫలితాన్ని అసద్ ఇవాళ చవిచూస్తున్నారు. దేశాన్ని వదిలి రష్యా నీడన ఆశ్రయం పొందుతున్నారు. తిరుగుబాటుకు నేతృత్వం వహించిన హయాత్ తహరీర్ ఆల్ షామ్ (హెచ్టీఎస్) సంస్థను ఐక్యరాజ్య సమితి గతంలోనే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న అబూ మహమ్మద్ అల్–జులానీ ఒకప్పుడు అల్ ఖైదా ఉగ్రవాది. అంటే సిరియా దేశంలో నియంతృత్వం అంతరించే సూచనలు కనుచూపు మేరలో కనిపించకపోగా... ఆ దేశ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.సిరియా, బంగ్లాదేశ్ పరిస్థితులను ఒకే గాటన కట్టలేకపోవచ్చు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు రేగి అవి హింసాత్మంగా మారటంతో పరిస్థితి చేయి దాటిపోయింది బంగ్లాదేశ్లో. హసీనా ప్రభుత్వం కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే నిర్ణయం తీసు కున్నా... అప్పటికే ఆమె నిరంకుశ వ్యవహారశైలి పట్ల ప్రజల్లో పేరుకుపోయిన వ్యతిరేకత ఒక్కసారిగా ఎగిసిపడింది. ఆమె దేశాన్ని వదిలి పారిపోవాల్సిన పరిస్థితిని తెచ్చింది. ఈ పరిణామాల తర్వాత బంగ్లాదేశ్ మత ఛాందస దిశగా అడుగులు వేయటం ఆందోళనకరమైన అంశం. నోబెల్ బహుమతి గ్రహీత యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో అక్కడి హిందూ మైనార్టీలపై దాడులు, చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించాలన్న డిమాండ్లు వీటికి సంకేతాలు.కాస్త వెనక్కి వెళితే... రెండేళ్లు వెనక్కి వెళితే 2022 జూలైలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సా కూడా ఇదే విధంగా పెట్టేబేడా సర్దుకుని ఉన్నపళంగా దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆ దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తటంతో తిరుగుబాటుదారులు అధ్యక్ష భవనంపై దాడి చేశారు. అదే సమయంలో ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసానికి కూడా నిప్పు పెట్టారు. ప్రజాగ్రహానికి తలొంచి రణిల్ సైతం ఆ రోజు రాజీనామా చేయక తప్పలేదు. ఇక సిరియా లాంటి తిరుగుబాటును 2021 ఆగష్టులో అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ చవిచూశారు. దశాబ్దాలుగా తీవ్ర సంక్షోభం, ఉగ్రవాదం, అంతర్యుద్ధాలకు కేంద్రంగా మారిన అఫ్గానిస్తాన్లో అష్రఫ్ ఘనీ నియంతలా పాలన చేశారు. చివరకు తాలిబాన్ల దాడిని ఎదుర్కోలేక దేశం విడిచి పారిపోయారు. ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇస్లాం చట్టాల పేరుతో ఏ విధంగా మానవ హక్కులను కాలరాస్తున్నారో యావత్ ప్రపంచం చూస్తూనే ఉంది.చదవండి: ఆ వ్యతిరేకత మనకు కలిసొచ్చేనా?ఈ నాలుగు దేశాల్లో సంక్షోభాలకు కారణాలు వేర్వేరు కావచ్చు, తీవ్రతల్లో తేడాలు ఉండొచ్చు. కాని ఫలితం మాత్రం ఒకటే. అంతే కాదు, పర్యవసానాల్లోనూ సారూప్యత కనిపిస్తోంది. శ్రీలంక మినహాయిస్తే అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, సిరియాల్లో మత ఛాందసవాదమే రాజ్యమేలేటట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు ఆ యా దేశాల ప్రజలకే కాదు ప్రపంచానికి సైతం ప్రమాదకరం.- రెహానా బేగం రాష్ట్ర సమాచార కమిషనర్, ఏపీ -
ఆసీస్ను వెనక్కు నెట్టి టాప్ ప్లేస్కు చేరిన సౌతాఫ్రికా
శ్రీలంకపై రెండో టెస్ట్లో విజయం అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా అగ్రస్థానానికి చేరింది. ఈ మ్యాచ్కు ముందు వరకు ఆస్ట్రేలియా టాప్ ప్లేస్లో ఉండింది. తాజా విజయంతో సౌతాఫ్రికా ఆసీస్ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించింది. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరేందుకు సౌతాఫ్రికా మరో గెలుపు దూరంలో ఉంది. సౌతాఫ్రికా తమ తొలి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే పాకిస్తాన్తో జరుగబోయే రెండు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు.ప్రస్తుతం సౌతాఫ్రికా విజయాల శాతం 63.33గా ఉంది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో సౌతాఫ్రికా ఆడిన 10 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 60.71 విజయాల శాతం కలిగి ఉంది. ఆసీస్ చేతిలో రెండో టెస్ట్లో ఓటమి అనంతరం టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్ విజయాల శాతం 57.29గా ఉంది. ప్రస్తుత సైకిల్లో టీమిండియా 16 మ్యాచ్లు ఆడి తొమ్మిదింట విజయాలు సాధించింది. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ను 0-2 తేడాతో కోల్పోయిన శ్రీలంక నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు విజయాల శాతం 45.45గా ఉంది. న్యూజిలాండ్ను వారి సొంతగడ్డపై వరుసగా రెండు టెస్ట్ల్లో మట్టికరిపించిన ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉంది. స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న న్యూజిలాండ్ ఆరో స్థానంలో.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ వరుసగా 7, 8, 9 స్థానాల్లో ఉన్నాయి.టీమిండియా విషయానికొస్తే.. భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే ఆసీస్తో తదుపరి జరుగబోయే మూడు టెస్ట్ల్లో విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఆసీస్ను వారి సొంతగడ్డపై 4-1 తేడాతో ఓడిస్తే భారత విజయాల శాతం 63.15కు చేరి టేబుల్ టాపర్గా నిలుస్తుంది. ఇలా జరిగితే భారత్ ఇతర జట్ల జయాపజాలపై ఆధారపడకుండా నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఆసీస్తో తదుపరి జరుగబోయే మూడు టెస్ట్ల్లో భారత్ ఒక్క మ్యాచ్లో ఓడినా ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
రెండో టెస్ట్లోనూ సౌతాఫ్రికాదే విజయం.. సిరీస్ కైవసం
గెబెర్హా వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్లో సౌతాఫ్రికా 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 205/5 వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక ఓవర్నైట్ స్కోర్కు మరో 33 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ఛేదనలో శ్రీలంక 238 పరుగులకే చాపచుట్టేసింది. కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించాడు. రబాడ, డేన్ పీటర్సన్ తలో రెండు వికెట్లు.. జన్సెన్ ఓ వికెట్ పడగొట్టారు. లంక సెకెండ్ ఇన్నింగ్స్లో ధనంజయ డిసిల్వ (50) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. కుసాల్ మెండిస్ (46), కమిందు మెండిస్ (35), ఏంజెలో మాథ్యూస్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అంతకుముందు సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 317 పరుగులకు ఆలౌటైంది. ప్రభాత్ జయసూర్య ఐదు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బేశాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో మార్క్రమ్ (55), బవుమా (66) అర్ద సెంచరీలతో రాణించారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 328 పరుగులు చేసింది. 89 పరుగులు చేసిన పథుమ్ నిస్సంక టాప్ స్కోరర్గా నిలిచాడు. డేన్ పీటర్సన్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (101), కైల్ వెర్రిన్ (105 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. లంక బౌలర్లలో లహీరు కుమార అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో సౌతాఫ్రికా తొలి టెస్ట్లోనూ గెలుపొందిన విషయం తెలిసిందే. -
ఐదేసిన జయసూర్య
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టెస్ట్ల్లో జయసూర్యకు ఇది 10వ ఐదు వికెట్ల ఘనత. జయసూర్య కేవలం 34 ఇన్నింగ్స్ల్లోనే 10 ఐదు వికెట్ల ప్రదర్శనలు చేశాడు. జయసూర్య టెస్ట్ అరంగేట్రం నుంచి ఎవ్వరూ ఇన్ని ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయలేదు. జయసూర్య తర్వాత అత్యధికంగా అశ్విన్ 7 ఐదు వికెట్ల ప్రదర్శనలు చేశాడు.జయసూర్య టెస్ట్ అరంగేట్రం తర్వాత అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన బౌలర్లు..ప్రభాత్ జయసూర్య-10 (34 ఇన్నింగ్స్ల్లో)అశ్విన్-7 (38 ఇన్నింగ్స్ల్లో)పాట్ కమిన్స్-6 (39 ఇన్నింగ్స్ల్లో)తైజుల్ ఇస్లాం-5 (25 ఇన్నింగ్స్ల్లో)రబాడ-5 (28 ఇన్నింగ్స్ల్లో)రవీంద్ర జడేజా-5 (32 ఇన్నింగ్స్ల్లో)మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక లక్ష్యానికి 143 పరుగుల దూరంలో ఉంది. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆట ముగిసే సమయానికి శ్రీలంక స్కోర్ 205/5గా ఉంది. ధనంజయ డిసిల్వ (39), కుసాల్ మెండిస్ (39) క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, డేన్ పీటర్సన్ తలో 2 వికెట్లు తీయగా.. రబాడ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అంతకుముందు సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 317 పరుగులకు ఆలౌటైంది. జయసూర్య ఐదు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బేశాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో మార్క్రమ్ (55), బవుమా (66) అర్ద సెంచరీలతో రాణించారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 328 పరుగులు చేసింది. 89 పరుగులు చేసిన పథుమ్ నిస్సంక టాప్ స్కోరర్గా నిలిచాడు. డేన్ పీటర్సన్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (101), కైల్ వెర్రిన్ (105 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. లంక బౌలర్లలో లహీరు కుమార అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో సౌతాఫ్రికా తొలి టెస్ట్లో గెలుపొందిన విషయం తెలిసిందే. -
రికెల్టన్, వెర్రిన్ సెంచరీలు.. సౌతాఫ్రికా భారీ స్కోర్
గెబెర్హా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 103.4 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. ర్యాన్ రికెల్టన్ (101), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (105 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్ టెంబా బవుమా (78) అర్ద సెంచరీతో రాణించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో మార్క్రమ్ 20, టోనీ డి జోర్జి 0, ట్రిస్టన్ స్టబ్స్ 4, బెడింగ్హమ్ 6, మార్కో జన్సెన్ 4, కేశవ్ మహారాజ్ 0, రబాడ 23, డేన్ పీటర్సన్ 9 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లహీరు కుమార 4 వికెట్లు పడగొట్టగా.. అశిత ఫెర్నాండో 3, విశ్వ ఫెర్నాండో 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం రెండో రోజు తొలి సెషన్ ఆట కొనసాగుతుంది.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో సౌతాఫ్రికా 233 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. -
భారత్లో మహిళల అంధుల టీ20 ప్రపంచకప్.. పాక్ మ్యాచ్లు నేపాల్లో!
మహిళల విభాగంలో తొలిసారిగా భారత్ అంధుల టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జరిగే ఈ టోర్నీని నిర్వహించనున్నారు. అయితే, పాకిస్తాన్ ఆడే మ్యాచ్లను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. భారత్లో ఆడేందుకు మహిళల పాకిస్తాన్ అంధుల జట్టుకు ఏమైనా వీసా సమస్యలు వస్తే... నేపాల్ లేదంటే శ్రీలంకలో వారి మ్యాచ్లు జరుగుతాయి. ఈ మేరకు ప్రపంచ అంధుల క్రికెట్ మండలి (డబ్ల్యూబీసీసీ) తమ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో నిర్ణయించింది.ముల్తాన్లో సమావేశంముల్తాన్లో జరిగిన ఈ ఏజీఎంలో 11 సభ్య దేశాల ప్రతినిధులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ బోర్డుల ప్రతినిధులు వర్చువల్ (ఆన్లైన్)గా పాల్గొన్నారు. పురుషుల విభాగంలో అంధుల టీ20 ప్రపంచకప్ను 2027లో నిర్వహించనున్నారు. ఇక వేదిక, తేదీలను వచ్చే ఏడాది జరిగే ఏజీఎమ్లో ఖరారు చేస్తారు. గతేడాదే ఆతిథ్య హక్కుల్ని భారత్కు కట్టబెట్టారని భారత అంధుల క్రికెట్ సంఘం (సీఏబీఐ) అధ్యక్షుడు జీకే మహంతేశ్ తెలిపారు.ఖర్చులన్నీ భారత బోర్డు భరిస్తుందిఅయితే, తటస్థ వేదికపై పాక్ ఆడితే ఇందుకు సంబంధించిన ఖర్చులన్నీ భారత బోర్డు భరిస్తుందని ఆయన వెల్లడించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు సీఏబీఐ అనుబంధ సంఘం కాదు. ఇది పూర్తిగా ప్రపంచ అంధుల క్రికెట్ మండలి (డబ్ల్యూబీసీసీ) గొడుగుకింద పనిచేస్తుంది.ప్రపంచం చాంపియన్గా తొలిసారి పాక్ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై పురుషుల అంధుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా డిఫెండింగ్ చాంపియన్ భారత్ పాక్ పర్యటనకు వెళ్లలేదు. పాకిస్తాన్కు ఇది సానుకూలాంశంగా మారింది. ఈ క్రమంలో ముల్తాన్లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ను ఓడించి పాక్ కొత్త చాంపియన్గా అవతరించింది. ఇప్పటికి నాలుగు సార్లు ఈ టోర్నీని నిర్వహించగా మూడుసార్లు భారత్ ట్రోఫీని గెలుచుకుంది. తొలి రెండు ప్రయత్నాల్లో ఫైనల్లో పాక్ను, ఆఖరిగా బంగ్లాను ఓడించి విజేతగా నిలిచింది. -
లంకతో టెస్ట్ సిరీస్.. సౌతాఫ్రికాకు బిగ్ షాక్
సౌతాఫ్రికా స్వదేశంలో శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా కమాండింగ్ పొజిషన్లో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 281 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ టెంబా బవుమా (70) టాప్ స్కోరర్గా నిలిచాడు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, లహీరు కుమార తలో 3 వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 42 పరుగులకే కుప్పకూలింది. జన్సెన్ (7/13) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో లంక పతనాన్ని శాశించాడు. లంక ఇన్నింగ్స్లో కమిందు మెండిస్ (13), లహీరు కుమార (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.కీలక ఆల్రౌండర్కు గాయంఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా సౌతాఫ్రికా కీలక ఆల్రౌండర్ వియాన్ ముల్దర్ గాయపడ్డాడు. లహీరు కుమార బౌలింగ్ ముల్దర్ బ్యాటింగ్ చేస్తుండగా అతని కుడి చేతి మధ్య వేలు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో అతను తొలి టెస్ట్ మిగతా సెషన్స్తో పాటు రెండో టెస్ట్కు కూడా దూరమయ్యాడు. రెండో టెస్ట్లో ముల్దర్ స్థానాన్ని మాథ్యూ బ్రీట్జ్కీ భర్తీ చేస్తాడని క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. ముల్దర్ గాయమైనప్పటికీ తొలి ఇన్నింగ్స్తో పాటు రెండో ఇన్నింగ్స్లోనూ బ్యాటింగ్ చేయడం విశేషం. -
అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
కుసాల్ పెరీరా ఊచకోత
అబుదాబీ టీ10లో శ్రీలంక ఆటగాడు కుసాల్ పెరీరా రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో న్యూయార్క్ స్ట్రయికర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న పెరీరా.. నార్త్రన్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో పెరీరా 27 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా న్యూయార్క్ స్ట్రయికర్స్ 9 వికెట్ల తేడాతో నార్త్రన్ వారియర్స్ను చిత్తు చేసింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ 15 బంతుల్లో 30, కొలిన్ మున్రో 15 బంతుల్లో 10, జాన్సన్ ఛార్లెస్ 11 బంతుల్లో 20 పరుగులు చేసి ఔట్ కాగా.. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (17 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), అజ్మతుల్లా (2 బంతుల్లో 2) అజేయంగా నిలిచారు. స్ట్రయికర్స్ బౌలర్లలో సునీల్ నరైన్కు రెండు వికెట్లు లభించాయి.అనంతరం 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్ట్రయికర్స్.. కుసాల్ పెరీరా ఊచకోత ధాటికి కేవలం 8 ఓవర్లలోనే (వికెట్ కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఆసిఫ్ అలీ (12 బంతుల్లో 21 నాటౌట్; 4 ఫోర్లు) పెరీరాకు అండగా నిలిచాడు. డెవాల్డ్ బ్రెవిస్ 10 బంతుల్లో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. వారియర్స్ బౌలర్లలో అజ్మతుల్లాకు ఓ వికెట్ దక్కింది. ఈ గెలుపుతో స్ట్రయికర్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. -
SA Vs SL 1st Test: చరిత్ర సృష్టించిన లంక బౌలర్
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో టోనీ డి జోర్జి వికెట్ తీసిన జయసూర్య.. టెస్ట్ల్లో వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. జయసూర్యకు టెస్ట్ల్లో 100 వికెట్ల మార్కును తాకేందుకు 17 టెస్ట్లు అవసరమయ్యాయి. జయసూర్యతో పాటు టర్నర్, బార్నెస్, గ్రిమ్మెట్, యాసిర్ షా కూడా 17 టెస్ట్ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకారు. టెస్ట్ల్లో వేగంగా 100 వికెట్లు తీసిన ఘనత ఇంగ్లండ్కు చెందిన జార్జ్ లోమన్కు దక్కుతుంది. లోమన్ కేవలం 16 టెస్ట్ల్లో 100 వికెట్ల మార్కును తాకాడు.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్లో 42 పరుగులకే కుప్పకూలింది. మార్కో జన్సెన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించగా.. కొయెట్జీ 2, రబాడ ఓ వికెట్ తీశారు. లంక ఇన్నింగ్స్లో కమిందు మెండిస్ (13), లహీరు కుమార (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఐదుగురు ఆటగాళ్లు డకౌట్లు అయ్యారు.అంతకుముందు లంక బౌలర్లు సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకే కట్టడి చేశారు. అశిత ఫెర్నాండో, లహీరు కుమార తలో 3 వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో కెప్టెన్ బవుమా (70) టాప్ స్కోరర్గా నిలిచాడు.149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. టోనీ డి జోర్జి (17), మార్క్రమ్ (47), వియాన్ ముల్దర్ (15) ఔట్ కాగా.. ట్రిస్టన్ స్టబ్స్ (17), బవుమా (24) క్రీజ్లో ఉన్నారు. జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 281 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
3 బంతుల్లో 30 పరుగులు సమర్పించుకున్న శ్రీలంక బౌలర్
అబుదాబీ టీ10 లీగ్లో శ్రీలంక ఆల్రౌండర్ దసున్ షనక చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఈ లీగ్లో బంగ్లా టైగర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షనక.. ఢిల్లీ బుల్స్తో జరిగిన మ్యాచ్లో 3 బంతుల్లో 30 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో తొమ్మిదో ఓవర్ వేసిన షనక తొలి నాలుగు బంతులకు బౌండరీలు సమర్పించుకున్నాడు. ఇందులో రెండో నో బాల్స్ ఉన్నాయి. అనంతరం ఐదో బంతి సిక్సర్ కాగా.. ఆరో బంతి నో బాల్ అయ్యింది. తిరిగి ఏడో బంతి కూడా నో బాల్ కాగా.. ఈ బంతి బౌండరీకి తరలివెళ్లింది.మొత్తంగా షనక ఓవర్ తొలి మూడు బంతుల్లో 4 నో బాల్స్ వేశాడు. దీంతో మూడు బంతులు ఏడు బంతులయ్యాయి. ఏడు బంతుల్లో బ్యాటర్ నిఖిల్ చౌదరీ ఐదు బౌండరీలు, ఓ సిక్సర్ బాదాడు. ఓ బాల్ డాట్ బాల్గా మారింది. ఓవర్ చివరి మూడు బంతులకు సింగిల్స్ రావడంతో ఈ ఓవర్లో మొత్తంగా 33 పరుగులు వచ్చాయి.ఢిల్లీ బుల్స్, బంగ్లా టైగర్స్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. బుల్స్ ఇన్నింగ్స్లో ఆడమ్ లిథ్ 1, టామ్ బాంటన్ 8, జేమ్స్ విన్స్ 27, రోవ్మన్ పావెల్ 17, టిమ్ డేవిడ్ 1, షాదాబ్ ఖాన్ 10 (నాటౌట్), ఫేబియన్ అలెన్ 6 పరుగులు చేశారు. ఆఖర్లో నిఖిల్ చౌదరీ మెరుపు వేగంతో 16 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టైగర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, జాషువ లిటిల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. లియామ్ లివింగ్స్టోన్ (15 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), దసున్ షనక (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్) రాణించడంతో 9.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షాహిద్ ఇక్బాల్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. -
సౌతాఫ్రికా-శ్రీలంక మ్యాచ్కు వర్షం అడ్డంకి
సౌతాఫ్రికా, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. తొలి రోజు ఆటలో కేవలం 20.4 ఓవర్లు మాత్రమే సాధ్యపడ్డాయి. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ ఓడి శ్రీలంక ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోర్ 4 వికెట్ల నష్టానికి 80 పరుగులుగా ఉంది. ఎయిడెన్ మార్క్రమ్ (9), టోనీ డి జోర్జి (4), ట్రిస్టన్ స్టబ్స్ (16), డేవిడ్ బెడింగ్హమ్ (4) ఔట్ కాగా.. టెంబా బవుమా (28), కైల్ వెర్రిన్ (9) క్రీజ్లో ఉన్నారు. లంక బౌలర్లలో లహీరు కుమార రెండు వికెట్లు పడగొట్టగా.. ఆశిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో తలో వికెట తీశారు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. డబ్ల్యూటీసీలో భాగంగా ఇరు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకం. ఈ సిరీస్లో గెలిచిన జట్టుకు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరే అవకాశాలు మెరుగవుతాయి. ఈ సిరీస్కు ముందు లంక స్వదేశంలో న్యూజిలాండ్ను టెస్ట్, వన్డే సిరీస్ల్లో ఓడించింది. సౌతాఫ్రికా.. ఇటీవలే భారత్ చేతిలో 1-3 తేడాతో టీ20 సిరీస్ను కోల్పోయింది. -
డేంజర్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంక
వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ఇరకాటంలో పడింది. భద్రతా కారణాల చేత భారత్ ఇప్పటికే పాక్లో పర్యటించబోదని తేల్చి చెప్పగా.. తాజాగా పాక్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు టోర్నీ నిర్వహణను మరింత అడ్డుగా మారాయి. పాక్లో ప్రస్తుతం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా పలువురు ఆందోళనకారులు హింసకు పాల్పడుతున్నారు. ఇమ్రాన్ జైలులో ఉండి ప్రభుత్వంపై ఆందోళనకారులను రెచ్చగొడుతున్నాడు. అల్లర్లలో పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఆర్మీ రంగంలో దిగింది. ఆందోళనలు ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంకపాక్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ జట్టు పాక్ నుంచి వైదొలిగింది. రెండు అనధికారిక టెస్ట్లు, మూడు వన్డేల కోసం శ్రీలంక ఏ జట్టు పాక్లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్ట్లు, ఓ వన్డే ముగిశాయి. ఈలోపు పాక్లో ఆల్లర్లు చెలరేగడంతో శ్రీలంక ఏ జట్టు పాక్ పర్యటన నుంచి అర్దంతరంగా వైదొలిగింది. శ్రీలంక ఏ జట్టు పాక్-ఏ టీమ్తో మరో రెండు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ రెండు వన్డేలకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా, శ్రీలంక-ఏతో ఆడిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను పాక్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. లంక-ఏతో జరిగిన తొలి వన్డేలో కూడా పాకిస్తానే గెలిచింది. -
దిస్సనాయకే విజయం సంపూర్ణం
సెప్టెంబర్లో శ్రీలంక అధ్యక్షునిగా అనూహ్య విజయం సాధించిన అనూర కుమార దిస్సనాయకే, తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మూడింట రెండొంతుల సీట్లు గెలుచుకున్నారు. శ్రీలంక 77 సంవత్సరాల చరిత్రలోనే ఎవరికీ లేని ఘన విజయం ఇది. మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ అయినప్పటికీ, వాళ్ల పార్టీ సింహళ జాతివాదం విషయంలో తీవ్ర వైఖరి తీసుకుంది. అదే కారణంగా ఇండియా పట్ల వ్యతిరేకత చూపింది. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు అన్ని వర్గాల ఆదరణ లభించడం, ఆయన కూడా ఇండియాతో సత్సంబంధాలకు ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. చైనా, ఇండియాలలో దేనికీ ప్రత్యేకంగా అనుకూలమో, వ్యతిరేకమో కాదనీ, ఇరువురి మధ్య సమతుల్యత పాటించగలమనీ ప్రకటించటం గమనించదగ్గది.శ్రీలంక అధ్యక్షునిగా గత సెప్టెంబర్లో అనూహ్య విజయం సాధించిన అనూర కుమార దిస్సనాయకే, ఈనెల 15న వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో మూడింట రెండొంతుల సీట్లు గెలిచారు. ఇది శ్రీలంక 77 ఏళ్ల చరిత్రలోనే ఎవరికీ లేని ఘన విజయం. అధ్యక్ష ఎన్నికలలో దిస్సనాయకేకు పోలైన ఓట్లు 55.89 శాతం కాగా, ఇపుడు మరొక సుమారు 10 శాతం పెరిగాయి. పార్లమెంట్ మొత్తం స్థానాలు 225 కాగా, ఆయన పార్టీ జనతా విముక్తి పెరమున (జేవీపీ) నాయకత్వాన గల నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) కూటమి గెలుచుకున్నవి 159. ఇందులో ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 196 సీట్లు, శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతి కిందకు వచ్చే 29 సీట్లు ఉన్నాయి. ఆ విధంగా మొత్తం 225లో ఎన్పీపీ బలం 160 అవు తున్నది. అయితే, అధ్యక్ష ఎన్నికలలో దిస్సనాయకేకు తమిళుల స్థావరం అనదగ్గ శ్రీలంక ఉత్తర భాగమైన జాఫ్నా, తమిళులతో పాటు ముస్లింలు గణనీయంగాగల తూర్పు ప్రాంతాలలో, రాజధాని కొలంబో నగరంలో ఎక్కువ ఆదరణ లభించలేదు. సజిత్ ప్రేమదాస నాయకత్వంలోని సామగి జన బలవేగాయ (ఎస్జేబీ) వంటి ప్రతి పక్షాలు, ఇల్లంకి తమిళ అరసు కచ్చి (ఐటీఏకే) వంటి తమిళ పార్టీలు అక్కడి ఓట్లను తెచ్చుకున్నాయి. ప్రేమదాస పార్టీ సుమారు 33 శాతం ఓట్లు, మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్ఎల్ఎఫ్ఫీ) 17 శాతం ఓట్లు సంపాదించగలిగాయి. ఇపుడు పార్లమెంట్లో ప్రేమదాస పార్టీ 40 సీట్ల స్థాయిలో నిలదొక్కుకుని ప్రతిపక్ష హోదా పొందనుండగా, తమిళుల పార్టీ ఆరుకు, రణిల్ పార్టీ ఫ్రంట్ నాలుగుకు, మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్ష పార్టీ రెండుకు పరిమితమయ్యాయి.తమిళ ఈలమ్కు వ్యతిరేకంవాస్తవానికి జేవీపీ లోగడ రెండుమార్లు ప్రభుత్వంపై భారీ ఎత్తున సాయుధ తిరుగుబాట్లు జరిపిన మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ అయి నప్పటికీ, సింహళ జాతివాదం విషయంలో తీవ్ర వైఖరి తీసుకుంది. తమిళ ఈలంను వ్యతిరేకించటమే గాక, రాజీవ్గాంధీ – జయవర్ధనే మధ్య 1987లో జరిగిన ఒప్పందం ప్రకారం తమిళ ప్రాంతాలకు ఇండియాలోవలె కనీసం ఒక మేర ఫెడరల్ అధికారాలకు సైతం ససేమిరా అన్నది. ఇండియాపట్ల జేవీపీ వ్యతిరేకతకు కారణాలలో ఈ 1987 ఒప్పందంతో పాటు, రాజీవ్గాంధీ అక్కడకు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపీకేఎఫ్) పేరిట సైన్యాన్ని పంపటం వంటివి ప్రధాన మైనవి. నేను శ్రీలంక వెళ్లినపుడు జేవీపీ నాయకులు కొలంబో శివార్లలోని తమ ప్రధాన కార్యాలయంలో ఈ మాటలు స్వయంగా చెప్పారు. ఈలం పోరాటంతో నిమిత్తం లేకుండా కూడా, తమిళులకు ఇండియా సానుభూతి ఎల్లప్పుడూ ఉండటం, శ్రీలంక మధ్య ప్రాంతా లలోని తమిళ తేయాకు తోటల కూలీలకు శ్రీలంక పౌరసత్వం కోసం ఇండియా పట్టుబట్టడం వంటివి ఇతర కారణాలు. నిజానికి తేయాకు తోటల తమిళులు ఎల్టీటీఈ, ఈలం లక్ష్యానికి పెద్ద మద్దతుదారులు కారు. వారి సమస్యలు వేరే. ఈ విషయాలు జేవీపీకి కూడా తెలుసు. అయినప్పటికీ అనుమానాలు తొలగిపోలేదు. ఇదే తరహా అను మానాలు తూర్పున బట్టికలోవా, పశ్చిమాన రాజధాని కొలంబో ప్రాంతాలలో తగినంత సంఖ్యలోగల ముస్లిముల పట్ల కూడా ఉన్నాయి. తమిళులకు ఇండియా వలె, ముస్లిములకు పాకిస్తాన్ మద్దతు ఉందనేది వారి మరొక ఆరోపణ.సాహసించి పార్లమెంటు రద్దుఎన్నికల సందర్భంలో ఈ చర్చ అంతా ఎందుకంటే, ఈ విధమైన దీర్ఘకాలపు విభేదాలు ఉండినప్పటికీ తమిళులు, ముస్లిములు పార్ల మెంట్ ఎన్నికలలో తమ సంప్రదాయిక పార్టీలను, ఇతర జాతీయ పార్టీలను తిరస్కరించి దిస్సనాయకే కూటమిని బలపరచటం. ఈ మార్పులోని రహస్యమేమిటి? ఒకటి, ఉన్నత వర్గాలను మినహాయిస్తే అన్ని తరగతుల, అన్ని ప్రాంతాల సామాన్య ప్రజలు సంప్రదాయిక, పెద్ద పార్టీలతో విసిగిపోయారు. రెండు, తాము దేశాన్ని బాగుపరచ గలమన్న దిస్సనాయకే మాటను నమ్మారు. శ్రీలంకలో రాజ్యాంగం ప్రకారం ఎగ్జిక్యూటివ్ అధ్యక్ష విధానం ఉంది. అయినప్పటికీ పూర్తి స్థాయి క్యాబినెట్ నియామకానికి, కొన్ని విధాన నిర్ణయాలకు పార్లమెంట్ ఆమోదం అవసరం. అందుకు పార్లమెంట్లో ఆధిక్యత, వీలైతే మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. లేనిదే దిస్సనాయకే అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రజల కిచ్చిన హామీలను సరిగా అమలు పరచలేరు. పాత పార్లమెంట్లో 225 స్థానాలలో గల మూడంటే మూడు స్థానాలతో చేయగలిగింది శూన్యమైనందున, వెంటనే సాహసించి పార్లమెంట్ను రద్దు చేశారు. దేశంలో మార్పులు తెచ్చేందుకు మూడింట రెండు వంతుల ఆధిక్యత నివ్వవలసిందిగా ప్రజలను కోరారు. చివరకు ఆ విధంగానే తీర్పు చెప్పారు ప్రజలు. శ్రీలంకలో పదవీ కాలం ఇండియాలో వలెనే అయిదేళ్ళు. మార్పులు తెచ్చేందుకు దిస్సనాయకేకు తగినంత సమయం ఉందన్నమాట. ఏదెంత జరుగుతుందన్నది అట్లుంచితే, 55 సంవత్సరాల వయసుగల ఆయనను విద్యార్థి దశ నుంచి గమనిస్తున్న వారికి, ఆయన ఆలోచనలు, ఆచరణ పట్ల మాత్రం ఎటువంటి సందే హాలు ఉన్నట్లు కనిపించదు.ఇండియాతో సత్సంబంధాలు?దిస్సనాయకే ప్రభుత్వం చేయవలసింది చాలా ఉంది. 2022లో ప్రజల నుంచి విస్తృతమైన నిరసనలకు కారణమైన ఆర్థికరంగ దివాళాను సరిదిద్దటం, ధరల నియంత్రణ, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం అందులో ప్రధానమైనవి. దానితోపాటు ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తామనీ, స్థానిక వ్యాపారులను ఆదుకోగలమనీ, అవినీతిపై కఠిన చర్యలుండగలవనీ, ప్రభుత్వంలో వృథా ఖర్చులు లేకుండా చూడగలమనీ కూడా అన్నారాయన. కానీ రుణభారం తక్కువ కాక పోగా, అధ్యక్షుడైనప్పుడు తక్షణ అవసరాల కోసం ఐఎంఎఫ్ నుంచి 2.9 బిలియన్ డాలర్ల కొత్త అప్పు తీసుకున్నారు. చైనాతో సత్సంబంధాలు గతం నుంచే ఏ పార్టీ పాలించినా ఉండగా, ఇండియా విమర్శ కుడైన దిస్సనాయకే ఈ పరిస్థితుల దృష్ట్యా ఇండియాతోనూ సత్సంబంధాలకు, ఆర్థిక సహకారానికి ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారు. తన ఎన్నికకు ముందే భారతదేశాన్ని సందర్శించి ఆయన, ఆ తర్వాత విదేశాంగ మంత్రి విజిత హెరాత్ను కూడా పంపారు. భారత ప్రభుత్వం అవసరమైన హామీలనిచ్చింది కూడా. తాము చైనా, ఇండి యాలలో దేనికీ ప్రత్యేకంగా అనుకూలమో, వ్యతిరేకమో కాదనీ, ఇరు వురి మధ్య సమతుల్యత పాటించగలమని దిస్సనాయకే మొదట్లోనే ప్రకటించటం గమనించదగ్గది. ఇప్పటికే విదేశాంగ మంత్రితోపాటు, ప్రజాసేవలో సుదీర్ఘ అనుభవంగల హరిణి అమరసూరియను ప్రధానిగా నియమించిన ఆయన, కేబినెట్ను కూడా ఏర్పాటు చేశారు. విధాన ప్రకటనలు, బడ్జెట్ను తెచ్చినపుడు పూర్తి స్పష్టత వస్తుంది.ఇవన్నీ చేసినా తమిళులు, ముస్లిముల సమస్యలు ప్రత్యేకమైనవి గనుక అందుకు పరిష్కారాలను కనుగొనటం ఒక సవాలు. ప్రభాకరన్ మరణం తర్వాత ఈలం నినాదం లేకుండా పోయిందిగానీ, వారికి భూములు, భాష, సమానావకాశాలు, వివక్షల తొలగింపు, పౌర హక్కులు వంటి సమస్యలు నేటికీ కొనసాగుతున్నాయి. ముస్లిములకు కూడా తమపట్ల వివక్ష వంటి సమస్యలున్నాయి. తేయాకు తోటలలో పనిచేసే తమిళుల సమస్యలు వేరే. వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఇవి క్రమంగానైనా పరిష్కార మార్గంలో సాగని పక్షంలో ఏదో ఒక రోజున తిరిగి సమస్యల రూపంలో ముందుకొస్తాయి. వీటన్నింటినీ గమనిస్తూ కొత్త ప్రభుత్వం శ్రీలంక చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలదని ఆశించాలి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
శ్రీలంక, న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు
పల్లెకెలె వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య ఇవాళ (నవంబర్ 19) జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 21 ఓవర్ల పాటు మ్యాచ్ సజావుగా సాగింది. ఆతర్వాత వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ 9 పరుగులు చేసి ఔట్ కాగా.. విల్ యంగ్ 56, హెన్రీ నికోల్స 46 పరుగులతో అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్కు ఓ వికెట్ దక్కింది.కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో శ్రీలంక తొలి రెండు మ్యాచ్ల్లో నెగ్గింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్కు ముందు జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. రెండు మ్యాచ్ల టీ20, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటించింది. -
దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు..!
స్వదేశంలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (నవంబర్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా ఎంపికయ్యాడు. బవుమా మోచేతి గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అక్టోబర్ 4 ఐర్లాండ్తో జరిగిన వన్డే సందర్భంగా బవుమా గాయపడ్డాడు.రబాడ రీఎంట్రీలంకతో సిరీస్తో కగిసో రబాడ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రబాడ భారత్తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్కు దూరంగా ఉన్నాడు. భారత్తో టీ20 సిరీస్లో సత్తా చాటిన మార్కో జన్సెన్, గెరాల్ట్ కొయెట్జీ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరిద్దరు ఈ ఏడాది ఆరంభంలో భారత్తో జరిగిన టెస్ట్ సిరీస్లో చివరిసారిగా దర్శనమిచ్చారు. గాయాల కారణంగా ఈ సిరీస్కు లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్ దూరమయ్యారు. ర్యాన్ రికెల్టన్, డేన్ పీటర్సన్, సెనూరన్ ముత్తుస్వామి 14 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నారు.సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరాలంటే..?సౌతాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు చేరాలంటే శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్లతో పాటు తదుపరి (డిసెంబర్, జనవరి) స్వదేశంలో పాకిస్తాన్తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది.శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, గెరాల్డ్ కొయెట్జీ, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, సెనూరన్ ముత్తుస్వామి, డేన్ పీటర్సన్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రిన్సౌతాఫ్రికా-శ్రీలంక సిరీస్ షెడ్యూల్తొలి టెస్ట్- నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 (డర్బన్)రెండో టెస్ట్- డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 9 (గెబెర్హా)కాగా, సౌతాఫ్రికాతో సిరీస్కు శ్రీలంక జట్టును కూడా ఇవాళ్లే ప్రకటించారు. లంక జట్టుకు సారధిగా ధనంజయ డిసిల్వ వ్యవహరించనున్నాడు.దక్షిణాఫ్రికా సిరీస్కు శ్రీలంక జట్టు..ధనంజయ డిసిల్వ (కెప్టెన్), పతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కుసాల్ మెండిస్, కమిందు మెండిస్, ఒషాద ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, ప్రబాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, లసిత్ ఎంబుల్దెనయ, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, కసున్ రజిత -
శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో NPP విక్టరీ
కొలంబో: ద్వీపదేశం శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో.. అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే నేతృత్వంలోని ‘నేషనల్ పీపుల్స్ పవర్’ పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతున్న ఫలితాల్లో ఎన్పీపీ కూటమి.. ఇప్పటికే మూడింట రెండో వంతు సీట్లను దక్కించుకుని మెజారిటీని చేరుకుంది.225 మంది సభ్యులున్న లంక పార్లమెంట్లో.. ఇప్పటిదాకా 123 సీట్లను ఎన్పీపీ కైవసం చేసుకుంది. సుమారు 62 శాతం ఓట్ల లెక్కింపు పూర్తైందని ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత శ్రీలంకలో ఇది తొలి పార్లమెంట్ ఎన్నిక. సెప్టెంబరు 21న జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో 50శాతం ఓట్లు సాధించలేకపోయారు అనుర కుమార దిస్సనాయకే. దీంతో.. ‘నేషనల్ పీపుల్స్ పవర్’ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన పరీక్షగా నిలిచాయి.దేశాభివృద్ధి కోసం తాను ప్రతిపాదించిన విధానాల అమలుకు 113 సీట్లైనా(సాధారణ ఆధిక్యం) సాధించేందుకు ప్రయత్నిస్తానని ఆయన ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఎన్పీపీ కూటమికి ఎంతో దోహదపడింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన విక్రమసింఘె ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోగా.. రాజపక్సే సోదరులు.. మహింద, గొటబాయ, చమల్, బసిల్ ఎవరూ కూడా బరిలో దిగలేదు.శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో.. మొత్తం 1.70కోట్లకు పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్య ఓట్ల ఆధారంగా ఎంపీలను ఎన్నుకొంటారు. ప్రతి ఓటరు ముగ్గురు అభ్యర్థులకు తమ ప్రాధాన్యాలను కేటాయించవచ్చు. అయితే.. మొత్తం 225 పార్లమెంట్ సీట్లలో 196 స్థానాలకు మాత్రమే ఎంపీలను ఇలా ఎన్నుకొంటారు. 196 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 8,821 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మిగతా 29 సీట్లను నేషనల్ లిస్ట్ సీట్లుగా పిలుస్తారు. వీటిని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల గ్రూప్లకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా ఆయా పార్టీలు/గ్రూప్లకు దక్కిన ఓట్ల శాతం ఆధారంగా వీటిని కేటాయిస్తారు. -
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు.. సౌతాఫ్రికాకు ఊహించని షాక్
డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్పై అడపాదడపా ఆశలు పెట్టుకున్న సౌతాఫ్రికాకు ఊహించిన షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా త్వరలో జరుగబోయే నాలుగు టెస్ట్ మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఎంగిడి తిరిగి వచ్చే ఏడాది జనవరిలో యాక్టివ్ క్రికెట్లోకి వస్తాడు. డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా జరిగే తదుపరి మ్యాచ్లకు ఎంగిడి దూరం కావడం సౌతాఫ్రికా విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది. సౌతాఫ్రికా ఈ నెల 27 నుంచి శ్రీలంకతో.. ఆతర్వాత డిసెంబర్ 26 నుంచి పాకిస్తాన్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్ల్లో సౌతాఫ్రికా గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడం ఖాయం. ఇలా జరగాలంటే ఎంగిడి లాంటి బౌలర్ సేవలు సౌతాఫ్రికాకు ఎంతో ముఖ్యం. ఎంగిడికి స్వదేశంలో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఎంగిడి సొంతగడ్డపై ఆడిన 9 మ్యాచ్ల్లో 17.30 సగటున 39 వికెట్లు పడగొట్టాడు.ఎంగిడి గాయంతో పాటు సౌతాఫ్రికాను మరో పేసర్ నండ్రే బర్గర్ గాయం కూడా వేధిస్తుంది. బర్గర్ కూడా గాయం కారణంగా త్వరలో జరుగబోయే టెస్ట్ మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ సరైన్ ఫిట్నెస్ కలిగి అందుబాటులో ఉండటం సౌతాఫ్రికాకు ఊరట కలిగించే అంశం. వీరిద్దరు ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాల్గొంటున్నారు. మరోవైపు భారత్తో టీ20 సిరీస్కు కగిసో రబాడకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. రబాడ.. శ్రీలంకతో జరుగబోయే టెస్ట్ సిరీస్ సమయానికి అందుబాటులో ఉంటాడని సమాచారం.సౌతాఫ్రికా పర్యటనలో శ్రీలంక ఆడబోయే రెండు టెస్ట్ల వివరాలు..నవంబర్ 27-డిసెంబర్ 1- తొలి టెస్ట్ (డర్బన్)డిసెంబర్ 5-9- రెండో టెస్ట్ (గెబెర్హా)సౌతాఫ్రికా పర్యటనలో పాకిస్తాన్ ఆడబోయే రెండు టెస్ట్ల వివరాలు..డిసెంబర్ 26-30- తొలి టెస్ట్ (సెంచూరియన్)జనవరి 3-7- రెండో టెస్ట్ (కేప్టౌన్)ఈ నాలుగు టెస్ట్లు డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా జరుగనున్నాయి. -
న్యూజిలాండ్తో తొలి వన్డే.. కుసాల్, అవిష్క శతకాలు.. శ్రీలంక భారీ స్కోర్
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో ఇవాళ (నవంబర్ 13) జరుగుతున్న తొలి మ్యాచ్లో శ్రీలంక జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (115 బంతుల్లో 100; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్డౌన్ బ్యాటర్ కుసాల్ మెండిస్ (128 బంతుల్లో 143; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కారు. శ్రీలంక స్కోర్ 324/5 (49.2 ఓవర్లు) వద్ద నుండగా వర్షం అంతరాయం కలిగించింది. లంక ఇన్నింగ్స్లో మరో నాలుగు బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి.శ్రీలంక వన్డేల్లో న్యూజిలాండ్పై 300 ప్లస్ స్కోర్ సాధించడం ఇది రెండో సారి మాత్రమే. 2019లో ఆ జట్టు 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో లంక బ్యాటర్లు కుసాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో రెండో వికెట్కు 206 పరుగులు జోడించారు. వన్డేల్లో న్యూజిలాండ్పై ఏ వికెట్కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. న్యూజిలాండ్తో ఒకే వన్డేలో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది రెండోసారి. 2001లో షార్జాలో జరిగిన మ్యాచ్లో సనత్ జయసూర్య (107), మహేళ జయవర్దనే (116) సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 17 పరుగులకే ఆ జట్టు ఓపెనర్ పథుమ్ నిస్సంక (12) వికెట్ కోల్పోయింది. ఆతర్వాత కుసాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో రెండో వికెట్కు 206 పరుగులు జోడించారు. సెంచరీ పూర్తైన వెంటనే అవిష్క ఔటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన సదీర సమరవిక్రమ 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆతర్వాత బరిలోకి దిగిన కెప్టెన్ అసలంక వేగంగా 40 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. జనిత్ లియనాగే క్రీజ్లో ఉన్నాడు.కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ మూడు వికెట్లు పడగొట్టగా.. మైఖేల్ బ్రేస్వెల్, ఐష్ సోధి తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ సిరీస్కు ముందు శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ జరిగింది. ఈ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. తొలి మ్యాచ్లో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించగా.. చివరి బంతి వరకు రసవత్తరంగా సాగిన రెండో టీ20లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుంది. -
శ్రీలంక కన్సల్టెంట్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్
శ్రీలంక కన్సల్టెంట్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ నీల్ మెక్కెంజీ నియమితుడయ్యాడు. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నిమిత్తం శ్రీలంక క్రికెట్ బోర్డు మెక్కెంజీని అపాయింట్ చేసింది. మెక్కెంజీ నవంబర్ 13-21 మధ్యలో శ్రీలంక జట్టుతో జాయిన్ అవుతాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ నవంబర్ 27న డర్బన్ వేదికగా మొదలవుతుంది. రెండో మ్యాచ్ డిసెంబర్ 5-9 వరకు గెబెర్హా వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరుగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే శ్రీలంకకు ఈ సిరీస్ చాలా కీలకం. అందుకే ఆ జట్టు స్థానికుడైన మెక్కెంజీ కన్సల్టెంట్ కోచ్గా నియమించుకుంది. మెక్కెంజీ దక్షిణాఫ్రికాలోని పిచ్ల పరిస్థితులపై లంక ఆటగాళ్లకు అవగాహణ కల్పిస్తాడు. సౌతాఫ్రికాలో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే విషయంలో మెక్కెంజీ లంక ప్లేయర్లకు శిక్షణ ఇస్తాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్గా మెక్కెంజీ అనుభవం లంక ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈఓ ఆష్లే డిసిల్వ తెలిపారు.48 ఏళ్ల మెక్కెంజీ గతేడాది వెస్టిండీస్తో జరిగిన సిరీస్కు సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్గా పని చేశాడు. మెక్కెంజీ ఈ ఏడాది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్గా సేవలందించాడు. మెక్కెంజీ 2000-2009 మధ్యలో సౌతాఫ్రికా తరఫున 124 మ్యాచ్లు ఆడి (మూడు ఫార్మాట్లలో) దాదాపు 5000 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మెక్కెంజీకి ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. దేశవాలీ క్రికెట్లో మెక్కెంజీ దాదాపు 20000 పరుగులు చేశాడు.దక్షిణాఫ్రికాతో ప్రీ సిరీస్ క్యాంప్కు శ్రీలంక జట్టు..ధనంజయ డి సిల్వా, దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమల్, లహిరు కుమార, ప్రభాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, మిలన్ రత్నాయకే, కసున్ రజిత, లసిత్ ఎంబుల్దెనియా. -
న్యూజిలాండ్కు భారీ షాక్.. హ్యాట్రిక్ వీరుడు దూరం
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా తొడ కండరాల గాయం కారంణంగా వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దంబుల్లా వేదికగా కివీస్తో జరిగిన రెండో టీ20లో హసరంగా తొడ కండరాలు పట్టేశాయి.గాయంతో బాధపడుతూనే తన బౌలింగ్ కోటాను హసరంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో కూడా వికెట్ల మధ్య కుంటుతూ కన్పించాడు. దీంతో అతడికి లంక మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానాన్ని దుషాన్ హేమంతతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది. దుషాన్ హేమంత శ్రీలంక తరపున ఇప్పటివరకు ఐదు వన్డేలు ఆడాడు. ఇటీవల ఎమర్జింగ్ ఆసియాకప్లో కూడా హేమంత అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. బుధవారం దంబుల్లా వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.ఫెర్గూసన్కు గాయం..మరోవైపు న్యూజిలాండ్కు కూడా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దంబుల్లా వేదికగా లంకతో జరిగిన రెండో టీ20లో ఫెర్గూసన్ గాయ పడ్డాడు.ఈ మ్యాచ్లో హ్యాట్రిక్ వికెట్లు తీసి ఫెర్గూసన్ తన జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. కానీ అంతలోనే గాయపడడంతో సిరీస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని ఆడమ్ మిల్నేతో సెలక్టర్లు భర్తీ చేశారు.చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్పై వేటు! అతడికి ఛాన్స్? -
తొమ్మిది వికెట్లు తీసిన పాక్ పేసర్లు
స్వదేశంలో శ్రీలంక-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్-ఏ పేసర్లు చెలరేగిపోయారు. కషిఫ్ అలీ, ఖుర్రమ్ షెహజాద్ ఇద్దరు కలిసి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 115 పరుగులకే ఆలౌటైంది.కషిఫ్ అలీ నాలుగో ఓవర్లో తొలి వికెట్ (ఒషాడో ఫెర్నాండో) పడగొట్టాడు. అనంతరం ఖుర్రమ్ షెహజాద్ అహాన్ విక్రమసింఘేను పెవిలియన్కు పంపాడు. కొత్త బంతితో చెలరేగిపోయిన కషిఫ్ 8వ ఓవర్లో ఉగ్రరూపం దాల్చాడు. ఈ ఓవర్లో అతను రెండు వికెట్లు (నిపున్ ధనంజయ, పవన్ రత్నాయకే) పడగొట్టాడు. దీంతో శ్రీలంక జట్టు 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఆతర్వాత బరిలోకి దిగిన సోనల్ దినుష (110 బంతుల్లో 30), పసిందు సూరియబండార (84 బంతుల్లో 28) కొద్ది సేపు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరి పుణ్యమా అని శ్రీలంక 100 పరుగుల మార్కును దాటింది. నిప్పులు చెరిగే బంతులతో బెంబేలెత్తించిన కషిఫ్ ఈ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఖుర్రమ్ షెహజాద్ నాలుగు వికెట్లు నేలకూల్చాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. పాక్ ఆదిలోనే కెప్టెన్ మొహమ్మద్ హురైరా వికెట్ కోల్పోయింది. ఆతర్వాత కొద్ది సేపటికే అబ్దుల్ ఫసీ కూడా ఔటయ్యాడు. అలీ జర్యాబ్ 18 పరుగులతో.. మొహమ్మద్ సులేమాన్ 11 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు పాక్ ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. వాతావరణం అనూకూలించని కారణంగా తొలి రోజు కేవలం 57.1 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది.కాగా, పాక్-ఏ, శ్రీలంక-ఏ జట్లు చివరి సారిగా ఎమర్జింగ్ ఆసియా కప్లో ఎదురెదురుపడ్డాయి. ఆ టోర్నీ సెమీఫైనల్లో శ్రీలంక పాక్ను మట్టికరిపించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 135 పరుగులు చేయగా.. శ్రీలంక కేవలం 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అహాన్ విక్రమసింఘే (52), లహీరు ఉదారా (20 బంతుల్లో 43) శ్రీలంకను గెలిపించారు. -
సూర్యకుమార్ యాదవ్ రికార్డును సమం చేసిన హసరంగ
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ల ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్లతో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం హసరంగ ఖాతాలో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. అలాగే సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్ పేరిట కూడా ఐదు ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. హసరంగ 23 టీ20 సిరీస్ల్లో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకుంటే.. స్కై 22 సిరీస్ల్లో, బాబర్ ఆజమ్ 35, వార్నర్ 42, షకీబ్ 45 సిరీస్ల్లో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నారు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న రికార్డు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 46 సిరీస్ల్లో ఏడు సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. కాగా, తాజాగా న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో హసరంగ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఇది అతనికి ఐదో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు.ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో నిన్న (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో శ్రీలంక జట్టు 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. హసరంగ (4-1-17-4), మతీశ పతిరణ (4-1-11-3, నువాన్ తుషార (4-0-22-2), తీక్షణ (3.3-0-16-1) దెబ్బకు 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ కాగా.. శ్రీలంక ఈ మాత్రం స్కోర్ను కూడా ఛేదించలేక 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా న్యూజిలాండ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపులో న్యూజిలాండ్ రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-1 సమం చేసుకుంది. ఈ మ్యాచ్లో హ్యాట్రిక్ వికెట్లు తీసి శ్రీలంక పతనానికి బీజం వేసిన లోకీ ఫెర్గూసన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో ఆరు వికెట్లు తీసిన హసరంగకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. -
కివీస్తో రెండో టీ20.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడ్డ శ్రీలంక
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఇవాళ (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక శ్రీలంక జట్టు బొక్కబోర్లా పడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), నువాన్ తుషార (4-0-22-2), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) ధాటికి 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక.. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శ్రీలంకను తొలుత లోకీ ఫెర్గూసన్ (2-0-7-3) హ్యాట్రిక్తో దెబ్బకొట్టగా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ మూడు వికెట్లు తీసి శ్రీలంక చేతి నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడిన పథుమ్ నిస్సంకను (52) ఫిలిప్స్ ఆఖరి ఓవర్ రెండో బంతికి ఔట్ చేశాడు. ఆతర్వాత మూడు, ఐదు బంతులకు పతిరణ (0), తీక్షణ (14) వికెట్లు తీశాడు. లంక ఇన్నింగ్స్లో నిస్సంకతో పాటు భానుక రాజపక్స్(15), తీక్షణ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫిలిప్స్, ఫెర్గూసన్ తలో 3 వికెట్లు.. బ్రేస్వెల్ 2, సాంట్నర్, ఫోల్క్స్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లోని తొలి టీ20లో శ్రీలంక విజయం సాధించిన విషయం తెలిసిందే. -
శ్రీలంకతో రెండో టీ20.. హ్యాట్రిక్ తీసిన న్యూజిలాండ్ బౌలర్
డంబుల్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ పేసర్ లోకీ ఫెర్గూసన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునేందుకు బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఫెర్గూసన్ తన స్పెల్ మొదటి ఓవర్ చివరి బంతికి ఓ వికెట్ (కుసాల్ పెరీరా).. ఆతర్వాత రెండో ఓవర్ తొలి రెండు బంతులకు రెండు వికెట్లు (కమిందు మెండిస్, అసలంక) తీశాడు. ఫెర్గూసన్.. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన ఐదో బౌలర్గా (జేకబ్ ఓరమ్, టిమ్ సౌథీ (2), మైఖేల్ బ్రేస్వెల్, మ్యాట్ హెన్రీ).. ఓవరాల్గా టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన 64వ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు.The Lockie Ferguson hat-trick. 🌟pic.twitter.com/dhtmS1tLlp— Mufaddal Vohra (@mufaddal_vohra) November 10, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), నువాన్ తుషార (4-0-22-2), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) ధాటికి 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక..ఫెర్గూసన్ (2-0-7-3), మిచెల్ సాంట్నర్ (3-0-10-1) ధాటికి 34 పరుగులకే (7.2 ఓవర్లలో) నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుసాల్ మెండిస్ 2, కుసాల్ పెరీరా 3, కమిందు మెండిస్ 1, అసలంక డకౌట్ కాగా.. పథుమ్ నిస్సంక (33), భానుక రాజపక్స్ (15) శ్రీలంకను విజయతీరాలు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 11.2 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 63/4గా ఉంది. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలవాలంటే మరో 52 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. కాగా, రెండు మ్యాచ్ల ఈ టీ20 సిరీస్లో శ్రీలంక తొలి మ్యాచ్లో గెలిచి ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
లంక స్పిన్నర్ల మాయాజాలం.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్
డంబుల్లా వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక స్పిన్నర్లు రెచ్చిపోయారు. వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) మాయాజాలం ధాటికి న్యూజిలాండ్ 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. తొలి బంతికే వికెట్ తీసిన పేసర్ నువాన్ తుషార రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి బంతికే ఓపెనర్ టిమ్ రాబిన్సన్ తుషార బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్క్ చాప్మన్ 2, గ్లెన్ ఫిలిప్స్ 4, మైఖేల్ బ్రేస్వెల్ 0, మిచ్ హే 3, జాకరీ ఫోల్క్స్ 6, ఐష్ సోధి ఒక్క పరుగు చేశారు. ఈ మ్యాచ్లో లంక బౌలర్లు ఏ దశలోనూ న్యూజిలాండ్ బ్యాటర్లను మెరుగైన స్కోర్ దిశగా సాగనీయలేదు. కాగా, రెండు మ్యాచ్ల ఈ టీ20 సిరీస్లో శ్రీలంక తొలి మ్యాచ్లో గెలిచిన విషయం తెలిసిందే. -
అసలంక కెప్టెన్ ఇన్నింగ్స్.. న్యూజిలాండ్పై శ్రీలంక ఘన విజయం
న్యూజిలాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ను శ్రీలంక విజయంతో ఆరంభించింది. దంబుల్లా వేదికగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది.బ్రాస్వెల్ (27), జాకరీ ఫోల్క్స్ (27 నాటౌట్) మినహా తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. టిమ్ రాబిన్సన్ (3), గ్లెన్ ఫిలిప్స్ (1), మిషెల్ హై (0), జోష్ క్లార్క్సన్ (3) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలగే 3, పతిరన, హసరంగ, నువాన్ తుషారా తలా రెండు వికెట్లు పడగొట్టారు.అసలంక కెప్టెన్ ఇన్నింగ్స్..అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చరిత్ అసలంక (28 బంతుల్లో 35; ఒక ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... కుశాల్ పెరీరా (23), కమిందు మెండిస్ (23), వనిందు హసరంగ (22) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకరీ ఫోల్క్స్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య నేడు దంబుల్లాలోనే రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.చదవండి: BGT 2024: టీమిండియా టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్లకు చోటు -
హాంగ్కాంగ్ సూపర్ సిక్సస్ విజేత శ్రీలంక
హాంగ్కాంగ్ సూపర్ సిక్సస్ విజేతగా శ్రీలంక అవతరించింది. ఇవాళ (నవంబర్ 3) జరిగిన ఫైనల్లో శ్రీలంక పాకిస్తాన్ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 5.2 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌటైంది (6 వికెట్లు). పాక్ ఇన్నింగ్స్లో ముహమ్మద్ అఖ్లక్ (20 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. కెప్టెన్ ఫహీమ్ అష్రాఫ్ 13, ఆసిఫ్ అలీ 0, హుసేన్ తలాత్ 1, ఆమెర్ యామిన్ 6, షహాబ్ ఖాన్ 1 పరుగు చేశారు. లంక బౌలర్లలో ధనంజయ లక్షన్, థరిందు రత్నాయకే తలో రెండు వికెట్లు.. నిమేశ్ విముక్తి, లిహీరు మధుషంక చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం 73 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. సందున్ వీరక్కొడి 13 బంతుల్లో బౌండరీ, నాలుగు సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేయగా.. లిహీరు మధుషంక 5 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేశాడు. ఆఖర్లో థరిందు రత్నాయకే 4 బంతుల్లో బౌండరీ, 2 సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. లంక ఇన్నింగ్స్లో ధనంజయ లక్షన్ 2, లహీరు సమరకూన్ ఒక్క పరుగు చేశారు. పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్, హుసేన్ తలత్ తలో వికెట్ పడగొట్టారు. శ్రీలంకకు ఇది రెండో హాంగ్కాంగ్ సూపర్ సిక్సస్ టైటిల్. -
ఆసియా కప్ 2024 విజేతగా ఆఫ్ఘనిస్తాన్
ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 టోర్నీ విజేతగా ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టు అవతరించింది. నిన్న (అక్టోబర్ 27) జరిగిన ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్-ఏ శ్రీలంక-ఏపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. బిలాల్ సమీ (4-0-22-3), అల్లా ఘజన్ఫర్ (4-0-14-2) అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంకను కట్టడి చేశారు.THE HISTORIC MOMENT. - Afghanistan wins the Emerging Asia Cup. 🥶pic.twitter.com/vwiX4xaE6o— Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2024శ్రీలంక ఇన్నింగ్స్లో సహన్ అరచ్చిగే (64 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. పవన్ రత్నాయకే (20), నిమేశ్ విముక్తి (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. యశోధ లంక (1), లహీరు ఉదార (5), నువనిదు ఫెర్నాండో (4), అహన్ విక్రమసింఘే (4), రమేశ్ మెండిస్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. దుషన్ హేమంత 6 పరుగులతో అజేయంగా నిలిచాడు. పవన్ రత్నాయకే, నిమేశ్ విముక్తి రనౌటయ్యారు. THE CELEBRATIONS OF AFGHANISTAN TEAM WITH EMERGING ASIA CUP TROPHY..!!! 🏆- A Historic Moments for Afghanistan Cricket History. 🇦🇫 pic.twitter.com/NctY2q9yvO— Tanuj Singh (@ImTanujSingh) October 27, 2024అనంతరం 134 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీయాలకు చేరింది. సెదికుల్లా అటల్ (55 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో ఆఫ్ఘనిస్తాన్ను గెలిపించాడు. అతనికి కరీం జనత్ (33), కెప్టెన్ దర్విష్ రసూలీ (24), మహ్మద్ ఇషాక్ (16 నాటౌట్) సహకరించారు. Happy team, Happy moments to cherish 👏pic.twitter.com/Cmhas0L9zY— CricTracker (@Cricketracker) October 27, 2024లంక బౌలర్లలో సహన్ అరచ్చిగే, దుషన్ హేమంత, ఎషాన్ మలింగ తలో వికెట్ పడగొట్టారు. ఫైనల్లో అద్భుతమైన స్పెల్తో (4-0-14-2) శ్రీలంకను కట్టడి చేసిన అల్లా ఘజన్ఫర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీ ఆధ్యంతం అద్భుతంగా రాణించిన సెదికుల్లా అటల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యాడు. -
Asia Cup 2024 Final: ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ 134 రన్స్
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 టోర్నీ ఫైనల్లో ఇవాళ (అక్టోబర్ 27) శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు బిలాల్ సమీ (4-0-22-3), అల్లా ఘజన్ఫర్ (4-0-14-2) సత్తా చాటడంతో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది.శ్రీలంక ఇన్నింగ్స్లో సహన్ అరచ్చిగే (64 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. పవన్ రత్నాయకే (20), నిమేశ్ విముక్తి (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. యశోధ లంక (1), లహీరు ఉదార (5), నువనిదు ఫెర్నాండో (4), అహన్ విక్రమసింఘే (4), రమేశ్ మెండిస్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. దుషన్ హేమంత 6 పరుగులతో అజేయంగా నిలిచాడు. పవన్ రత్నాయకే, నిమేశ్ విముక్తి రనౌటయ్యారు. అనంతరం 134 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. జుబైద్ అక్బరీ (0), కెప్టెన్ దర్విష్ రసూలీ (24) ఔట్ కాగా.. సెదికుల్లా అటల్ (19), కరీం జనత్ (2) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలవాంటే మరో 72 బంతుల్లో 87 పరుగులు చేయాలి. -
మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ..! కట్ చేస్తే.. విధ్వంసకర సెంచరీ
పల్లెకలె వేదికగా శ్రీలంకతో జరిగిన మూడు వన్డేలో 8 వికెట్ల తేడాతో(డక్వర్త్ లూయిస్ పద్దతి) వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్డిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్హనించాడు. అయితే శ్రీలంక స్కోర్ 17.2 ఓవర్లలో 81-1 వద్ద వర్షం మ్యాచ్కు అంతరాయం కలిగించింది.ఆ తర్వాత దాదాపు రెండు గంటల తర్వాత మ్యాచ్ మళ్లీ తిరిగి ప్రారంభమైంది. మ్యాచ్కు 23 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(22 బంతుల్లో 56, 9 ఫోర్లు, ఒక సిక్సర్), నిస్సాంక(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు.అనంతరం డక్వర్త్లూయిస్ పద్దతి ప్రకారం విండీస్ టార్గెట్ను 23 ఓవర్లలో 195 పరుగులగా నిర్ణయించారు. ఈ భారీ లక్ష్యాన్ని విండీస్ సునాయసంగా ఛేదించేసింది. 22 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కరేబియన్లు ఊదిపడేశారు.లూయిస్ విధ్వంసకర సెంచరీ..కాగా మూడేళ్ల తర్వాత విండీస్ వన్డే జట్టులోకి వచ్చిన ఓపెనర్ ఎవిన్ లూయిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 61 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్లతో లూయిస్ 102 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు సర్ఫెన్ రూథర్ ఫర్డ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 50) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక ఈ ఓటమితో విండీస్ వైట్వాష్ నుంచి తప్పించుకుంది. అదేవిధంగా తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన శ్రీలంక 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. Back like he never left! 💪🏻 In an emphatic win for the West Indies, Evin Lewis smashed an unbeaten 102 off 61 balls against Sri Lanka in his first ODI since 2021! 😍#SLvWIonFanCode pic.twitter.com/0nr2rTs01j— FanCode (@FanCode) October 27, 2024 -
SL Vs WI: శ్రీలంక జోరు.. విండీస్ బేజారు
స్వదేశంలో విండీస్తో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్లలో శ్రీలంక జోరు కొనసాగుతోంది. 2-1 తేడాతో ఇప్పటికే టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న లంకేయులు.. తాజాగా వన్డే సిరీస్ను కూడా సొంతం చేసుకున్నారు. నిన్న (అక్టోబర్ 23) జరిగిన రెండో వన్డేలో అసలంక సేన 5 వికెట్ల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.వర్షం కారణంగా 44 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 36 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (80), గుడకేశ్ మోటీ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేయడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 58 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన విండీస్ను వీరిద్దరూ ఆదుకున్నారు. తీక్షణ (3/25), అషిత ఫెర్నాండో (3/35), హసరంగ (4/40) విండీస్ను దెబ్బకొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. అసలంక (62 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించడంతో 38.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. శ్రీలంక ఇన్నింగ్స్లో నిషన్ మధుష్క (38), సమరవిక్రమ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ రెండు, మోటీ, ఛేజ్ తలో వికెట్ పడగొట్టారు. నామమాత్రమైన మూడో వన్డే అక్టోబర్ 26న జరుగనుంది. చదవండి: విరాట్ కోహ్లిని వెనక్కినెట్టిన రిషభ్ పంత్ -
రెచ్చిపోయిన లంక బ్యాటర్లు.. విండీస్ ఖాతాలో మరో పరాజయం
శ్రీలంక పర్యటనలో వెస్టిండీస్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. పల్లెకెలె వేదికగా నిన్న (అక్టోబర్ 20) జరిగిన వన్డే మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. వర్షం అంతరాయల నడము సాగిన ఈ మ్యాచ్లో శ్రీలంక డక్వర్త్ లూయిస్ పద్దతిన విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్కు ముందు జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను కూడా శ్రీలంక 2-1 తేడాతో గెలుచుకుంది.నిన్న జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 38.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన లంక లక్ష్యాన్ని 37 ఓవర్లలో 232 పరుగులుగా నిర్దారించారు. విండీస్ ఇన్నింగ్స్లో షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ 74 (నాటౌట్), రోస్టన్ ఛేజ్ 33 (నాటౌట్), కీసీ కార్తీ 37 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ 2, వాండర్సే, అసలంక తలో వికెట్ పడగొట్టారు.ఛేదనలో శ్రీలంక 31.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక బ్యాటర్లు నిషన్ మధుష్క (69), చరిత్ అసలంక (77) రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. ఆఖర్లో కమిందు మెండిస్ (30 నాటౌట్) ధాటిగా ఆడాడు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ 3, అల్జరీ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో శ్రీలంక ఘనంగా బోణీ కొట్టింది. రెండో వన్డే అక్టోబర్ 23 పల్లెకెలె వేదికగానే జరుగనుంది. చదవండి: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ -
శ్రీలంకకు బెంగళూరు ఎలక్ట్రిక్ స్కూటర్లు
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీదారు ఏథర్ ఎనర్జీ.. తన ఎలక్ట్రిక్ స్కూటర్లను శ్రీలంకకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపించించినట్లు సమాచారం. ఈ పండుగ సీజన్ ముగిసే నాటికి శ్రీలంకలో తమ మోడల్ల డెలివరీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.శ్రీలంకకు ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిస్తున్న ఫోటోలను కంపెనీ సీఈఓ 'తరుణ్ మెహతా' తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. గత ఏడాది నేపాల్లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన తరువాత ఏథర్ స్కూటర్లను దిగుమతి చేసుకుంటున్న విదేశీ మార్కెట్ శ్రీలంక.ఏథర్ 450ఎస్భారతదేశంలో ఏథర్ 450ఎస్ ధర రూ.1.55 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే శ్రీలంకలో ఈ స్కూటర్ ధర ఎలా ఉంటుందనే విషయం తెలియాల్సి ఉంది. ఇండియాలో ఏథర్ ఎనర్జీ 450ఎక్స్, 450 అపెక్స్, రిజ్టా స్కూటర్లను కూడా విక్రయిస్తోంది.శ్రీలంకలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించాలనే ప్రణాళిక ఆగస్ట్లోనే మొదలైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ పండుగ సీజన్ ముగిసే నాటికి శ్రీలంకలో తన మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. దీనికోసం కంపెనీ అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్ వంటి వాటితో జతకట్టింది. శ్రీలంకలో ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ను కూడా మెరుగుపరచాలని కంపెనీ యోచిస్తోంది.ఇండియన్ మార్కెట్లో ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. స్టాండర్డ్, ప్రో ప్యాక్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 2.9 కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఒకే బ్యాటరీ పొందుతుంది. ఈ స్కూటర్ ఒక చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంది.Ather’s second international market is set to go live by this festive!First shipment of 450s have left for Sri Lanka 🇱🇰 from our warehouses in 🇮🇳❤️ pic.twitter.com/EyfYCHPuIf— Tarun Mehta (@tarunsmehta) October 17, 2024 -
SL Vs WI: మెండిస్, పెరీరా విధ్వంసం.. మూడో టీ20లో విండీస్ చిత్తు
దంబుల్లా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో 9 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2–1తో లంక సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన స్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ రావ్మన్ పావెల్(27 బంతుల్లో 37; ఒక ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. గుడకేశ్ మోతీ (15 బంతుల్లో 32; ఒక ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగిలిన ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ, హసరంగ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.అదరగొట్టిన మెండీస్, పెరీరా..అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 18 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదిపడేసింది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (50 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కుశాల్ పెరీరా (36 బంతుల్లో 55 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకాలతో చెలరేగారు. వీరిద్దరితో నిసాంక (22 బంతుల్లో 39; 7 ఫోర్లు, ఒక సిక్సర్) కూడా మెరుపులు మెరిపించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆక్టోబర్ 20 నుంచి ప్రారంభం కానుంది.చదవండి:IND Vs NZ ODI Series: న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన -
SL Vs WI: విండీస్తో రెండో టీ20.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన శ్రీలంక
డంబుల్లా వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక జట్టు నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక అర్ద సెంచరీతో (54) రాణించగా.. కుసాల్ మెండిస్ 26, కుసాల్ పెరీరా 24, కమిందు మెండిస్ 19, చరిత్ అసలంక 9, భానుక రాజపక్స 5, వనిందు హసరంగ 5 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, షమార్ స్ప్రింగర్ తలో వికెట్ దక్కించుకున్నారు.కాగా, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కమిందు మెండిస్ (51), చరిత్ అసలంక (59) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రాండన్ కింగ్ (63), ఎవిన్ లెవిస్ (50) అర్ద సెంచరీలు చేసి విండీస్ను గెలిపించారు. చదవండి: న్యూజిలాండ్తో తొలి టెస్ట్.. భారీ రికార్డుపై కన్నేసిన విరాట్ -
శ్రీలంకలో పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
చరిత్రపుటల్లోకెక్కిన కమిందు మెండిస్
శ్రీలంక రైజింగ్ స్టార్ కమిందు మెండిస్ చరిత్రపుటల్లోకెక్కాడు. సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అందుకున్న కమిందు.. ఒకే క్యాలెండర్ ఇయర్లో రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కమిందు ఈ ఏడాది మార్చిలో తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అందుకున్నాడు.మహిళల విభాగానికి వస్తే సెప్టెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇంగ్లండ్కు చెందిన ట్యామీ బేమౌంట్ దక్కించుకుంది. బేమౌంట్కు కూడా ఇది రెండో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు. 2021 ఫిబ్రవరి ఆమె తొలిసారి ఈ అవార్డు దక్కించుకుంది. సెప్టెంబర్ నెలలో కమిందు టెస్ట్ల్లో సత్తా చాటగా.. బేమౌంట్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇరగదీసింది.కమిందు ఈ అవార్డు కోసం సహచరుడు ప్రభాత్ జయసూర్య, ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ నుంచి పోటీ ఎదుర్కొనగా.. బేమౌంట్.. ఐర్లాండ్కు చెందిన ఏమీ మగూర్, యూఏఈకి చెందిన ఎషా ఓజా నుంచి పోటీ ఎదుర్కొంది. కమిందు సెప్టెంబర్ నెలలో ఇంగ్లండ్, న్యూజిలాండ్లపై నాలుగు టెస్ట్లు ఆడి 90.20 సగటున 451 పరుగులు చేయగా.. బేమౌంట్ ఐర్లాండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లో 279 పరుగులు చేసింది. ఇందులో ఓ భారీ సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. చదవండి: పాక్తో రెండో టెస్ట్.. ఇంగ్లండ్ కెప్టెన్ రీఎంట్రీ -
T20 World Cup 2024: శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం
మహిళల టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేసి లంకేయులను కట్టడి చేశారు. అమేలియా కెర్, లీగ్ క్యాస్పెరెక్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఏడెన్ కార్సన్ ఓ వికెట్ దక్కించుకుంది. లంక బ్యాటర్లలో చమారీ ఆటపట్టు (35) టాప్ స్కోరర్గా నిలువగా.. విష్మి గౌతమ్ 8, హర్షిత మాధవి 18, కవిష దిల్హరి 10, అనుష్క సంజీవని 5, నిలాక్షి డిసిల్వ 14, అమా కాంచన 10 పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. జార్జియా స్లిమ్మర్ (53), అమేలియా కెర్ (34) చెలరేగడంతో 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో సుజీ బేట్స్ 17, సోఫీ డివైన్ 13 పరుగులు చేశారు. లంక బౌలర్లలో సచిని నిసంసల, చమారీ ఆటపట్టు తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఆడిన నాలుగో మ్యాచ్ల్లో ఓటమిపాలైన శ్రీలంక గెలుపు రుచి చూడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: రంజీ ట్రోఫీ చరిత్రలో అరుదైన ఘట్టం -
కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు
ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక నూతన అధ్యక్షునిగా ఎన్నికైన అనుర కుమార దిస్సనాయకే ముందు అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. కోవిడ్ అనంతర పరిణామాల వల్ల ఇప్పటికే మొత్తం జనాభాలో సుమారు 27 శాతం దారిద్య్ర రేఖకు దిగువకు జారిపోయారు. వ్యాపారస్తులకు, పెట్టుబడి దారులకు, ఉత్పత్తిదారులకు అధిక వడ్డీ రేట్ల మూలంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందువల్ల ఉత్పత్తి తగ్గి, ఉద్యోగావకాశాలపై వ్యతిరేక ప్రభావం పడుతోంది. గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం 60 శాతం నుండి ఆరు శాతానికి తగ్గించగలిగినప్పటికీ, సున్నితంగా ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితుల్లో ఈ 6 శాతం ద్రవ్యోల్బణం కూడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడం, స్థిరీకరించడం, గాడినపెట్టడం లాంటి వ్యవహారాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న శ్రీలంకకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన అనుర కుమార దిస్సనాయకే ముందు అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. మార్క్సిస్ట్–లెనినిస్ట్ భావజాలంతో నడిచే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు గల జనతా విముక్తి పెరుమున పార్టీ నుండి ఎన్నికయిన అనుర పట్ల కొన్ని సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలోపెడతారు, పొరు గున ఉన్న భారత్తో ఎలాంటి సంబంధాలు నెరుపుతారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు వెలువరించిన కొన్ని అంచనాల ప్రకారం ఈ సంవత్సరంతో పాటు వచ్చే 2025 సంవత్సరంలో కూడా శ్రీలంక 2.4 శాతానికి కొంచెం అటు ఇటుగా వృద్ధి రేటు నమోదు చేయబోతోంది. గత కొన్ని సంవత్సరాల నుండి తిరోగమన స్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధి పథం అందుకోవడం కొంత సంతోషకరమైన విషయమే. అయినప్పటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒకవైపు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం మరోవైపు అనుర కుమారముందున్న ముఖ్యమైన సవాళ్లు. కోవిడ్ తదనంతర పరిణామాల వల్ల ఇప్పటికే మొత్తం జనాభాలో సుమారు 27 శాతం దారిద్య్ర రేఖకు దిగువకు జారిపోయారు. ఎక్కువగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు మూతపడడం వల్ల మహిళల్లో నిరుద్యోగిత విపరీతంగా పెరిగిపోయింది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో చిన్న, మధ్య తరహా సంస్థలు సుమారు 75 శాతం భాగం కలిగి ఉండడమే కాకుండా సుమారు 45 శాతం ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. వీటిలో చాలావరకు ఎగుమతులు, దిగుమ తులపైన ఆధారపడిన సంస్థలు. అధిక ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, సరఫరాల్లో అంతరాయాలు తదితర కారణాల వల్ల పెరిగిన నిర్వ హణ, ఉత్పత్తి ఖర్చుల వల్ల, వస్తువుల ధరలు పెరగడం వల్ల, తగ్గిన డిమాండ్ తదితర కారణాల వల్ల ఇవి మూతపడ్డాయి. గత రెండుసంవత్సరాల కాలంలో రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల నిరుద్యోగిత శాతం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం అంతానికి 4.5 శాతం వరకు తగ్గించగలిగినప్పటికీ పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా జీతాలు పెరగక ప్రజలు ఇబ్బందు లకు గురవుతున్నారు.2022 జూలైలో రాజపక్సే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విదేశీ మారకద్రవ్యం నిల్వలు అత్యంత కనిష్ఠ స్థాయిలో అంటే 1.8 బిలియన్ డాలర్లు ఉండి నిత్యావసర వస్తువుల దిగుమతులకు ఇబ్బందిగా మారిన పరిస్థితులు ధరల పెరుగుదలకు దారి తీశాయి. తత్ఫ లితంగా ప్రజల అసంతృప్తికి, తిరుగుబాటుకు కారణ మయ్యాయి. ఆ నిల్వలు తర్వాత ఏర్పడిన రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా జూలై 2024 నాటికి 5.58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే కాలంలో విదేశీ అప్పులు కూడా శ్రీలంక ఆర్థిక మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 34.8 బిలియన్ డాలర్ల నుండి 37.40 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అవి ప్రస్తుత ధరల ప్రకారం 2022 జూన్లో 51.2 బిలియన్ డాలర్లు ఉంటే... ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం ముగిసేనాటికి 55.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విక్రమసింఘే ప్రభుత్వం తన సన్నిహిత దేశాలయిన చైనా, భారత్, జపాన్లతో జరిపిన చర్చల ఫలితంగా... సుమారు 10 బిలియన్ డాలర్ల వరకు తిరిగి చెల్లించే కాలపరి«ధులు, వడ్డీ రేట్లు తగ్గించడంవంటి వెసులుబాట్లు లభించాయి. ఇందువల్ల ఐఎంఎఫ్ నుండి ఉద్దీపన ప్యాకేజీలు లభించడానికీ, అనేక మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయడానికి వెసులుబాటు లభించినట్లయింది. ఈ చర్యలు 2023 డిసెంబర్ నాటికి సుమారు 237 మిలియన్ డాలర్ల మిగులు బడ్జెట్కు దారితీశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు కూడా పెరిగి 2024 మార్చి నాటికి 96.3 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగి 44.9 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇవన్నీ కూడా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పడింది అనడానికి సంకేతాలే.గత రెండు సంవత్సరాలలో ద్రవ్యోల్బణం 60 శాతం నుండి ఆరు శాతానికి తగ్గించగలిగినప్పటికీ, సున్నితంగా ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితుల్లో ఈ ఆరు శాతం ద్రవ్యోల్బణం కూడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడం, స్థిరీకరించడం, గాడినపెట్టడం లాంటి వ్యవహారా లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా, అప్పులు పెరిగిన నేపథ్యంలో, విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత ఉన్న సమయంలో ఈ ద్రవ్యోల్బణం ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దానివల్లే ఇప్పటికి ఆహారవస్తువుల, పెట్రోల్, డీజిల్, మందుల ధరలు ఇంకా దిగి రాలేదు. వీటివల్ల సామాన్య ప్రజల జీవన వ్యయంపై ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉంది. అనుర కుమార దిస్సనాయకే అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన మూడు రోజులకు అంటే 26 సెప్టెంబర్ నాడు జరిగిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక సమావేశంలో డిపాజిట్లపై, రుణాలపై వరుసగా ప్రస్తుతం ఉన్న 8.25, 9.25 శాతం వడ్డీ రేట్లను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ వడ్డీ రేట్లు బ్యాంకుల్లో పొదుపుచేసే వారిని ప్రోత్సహించడానికీ, రుణాలు తీసుకోవాలనుకునే వారిని నిరుత్సాహపరచడానికీ, ద్రవ్యోల్బణం స్థిరీకరించడానికి ఉప యోగపడ్డాయి. అయితే అదే సమయంలో వ్యాపారస్తులకు, పెట్టు బడిదారులకు, ఉత్పత్తిదారులకు అధిక వడ్డీ రేట్ల మూలంగా ప్రతి కూల పరిస్థితులను కల్పించి, ఉత్పత్తి వ్యయాలు, ధరలు పెరిగేలా చేసి వినియోగదారులను దూరం చేస్తాయి. వీటి వల్ల ఉత్పత్తి తగ్గి, ఉద్యో గావకాశాలపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. మరోవైపు బ్యాంకుల లాభాల్లో మార్జిన్ తక్కువగా ఉండడం వలన అవి ఇచ్చే రుణాలు తగ్గిపోతాయి. ఇన్ని ప్రతికూలతలు ఎదుర్కోవడం అనుర కుమార దిస్సనాయకే అయన ప్రభుత్వానికి పెద్ద సవాలు.అనుర దిస్సనాయకే పార్టీ గతంలో భారత్ పట్ల వ్యతిరేక భావనతో రగిలిపోయినప్పటికీ, కొత్త ప్రభుత్వం అదే ధోరణి ఇంకా కొనసాగించడం సాధ్యం కాకపోవచ్చు. భారత్ ఇప్పటికే శ్రీలంకను అనేక సందర్భాల్లో ఆదుకుంది. గత రెండు సంవత్సరాల్లో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో భారత్ 4 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించింది. ఇది ఐఎంఎఫ్, చైనా అందించిన సహాయం కన్నా అధికం. వాణిజ్య సంబంధాలు పెంపొందించుకు నేందుకు రెండు దేశాలు ‘భారత – శ్రీలంక స్వేచ్ఛా వాణిజ్యఒప్పందం’ చేసుకొన్నాయి. గత రెండు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య 4 నుండి 6 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతున్నప్పటికీ ఇందులో అధిక భాగం భారత్ శ్రీలంకకు చేస్తున్న ఎగుమతులు ఎక్కువ. భారత్తో ఉన్న సన్నిహిత, నిర్మాణాత్మక సంబంధాల రీత్యా కొత్త ప్రభుత్వానికి భారత్తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం అనివార్యమవుతుంది.అనుర దిస్సనాయకే నాయకత్వంలో శ్రీలంక కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్న తరుణంలో, ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటు చర్యలు కొనసాగించడం ఒకవైపు; విదేశాలతో మంచి సంబంధాలు కొన సాగించడం మరోవైపు అత్యంత అవసరం. ఎన్నికల సమయంలో ఐఎంఎఫ్తో 2.9 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ పైన చర్చలు తిరిగి ప్రారంభిస్తామని వాగ్దానం చేసినప్పటికీ, అది అంత సులభం కాదు. భారత్ ఆ దేశానికి ఇచ్చిన ఆర్థిక సహాయం, వాణిజ్య సంబంధాలు కొనసాగించడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. కొత్త ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు, రాజకీయంగానే కాకుండా ఆర్థిక వ్యవస్థలు గాడినపెట్టడం పైన కూడా ప్రభావం చూపిస్తాయి.- వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం, జేఎన్యూ ‘ 79089 33741- డా‘‘ గద్దె ఓంప్రసాద్ -
SL vs WI: శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లపై వేటు!
వెస్టిండీస్తో స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్కు లంక స్టార్ ప్లేయర్లు దాసున్ షనక, దుష్మంత చమీరా దూరమయ్యారు. ఈ ఏడాది జూలైలో భారత్తో జరిగిన టీ20 సిరీస్లో వీరిద్దరూ భాగమయ్యారు. గత సిరీస్లో ఈ సీనియర్ ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ క్రమంలోనే వారిని సెలక్టర్లు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏడాది తర్వాత మిడిలార్డర్ బ్యాటర్ భనుక రాజపాక్సకు లంక సెలక్టర్లు పిలుపునిచ్చారు.ఈ జట్టుకు స్టార్ ఆల్రౌండర్ అసలంక సారథ్యం వహించనున్నాడు. ఆక్టోబర్ 13 నుంచి దంబుల్లా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ మూడు మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం విండీస్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది.శ్రీలంక టీ20 జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసాల్ మెండిస్, కుసల్ పెరీరా, కమిందు మెండిస్, దినేష్ చండిమాల్, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే, జెఫ్రీ వాండర్స్, చైమీ వాండర్సే మతీషా పతిరానా, బినూర ఫెర్నాండో, అసిత ఫెర్నాండో. -
శ్రీలంకపై భారత్ ఘన విజయం..
దుబాయ్: మహిళల టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం ఆసియా చాంపియన్ శ్రీలంక జట్టుతో జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 82 పరుగుల తేడాతో గెలిచింది. వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం. వరుసగా మూడో ఓటమితో శ్రీలంక సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 52 నాటౌట్; 8 ఫోర్లు, ఒక సిక్స్), ఓపెనర్ స్మృతి మంధాన (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (40 బంతుల్లో 43; 4 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడింది. అనంతరం ఛేదనలో శ్రీలంక మహిళల జట్టు 19.5 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. కవిషా దిల్హారి (21), అనుష్క సంజీవని (20), కాంచన (19) తలా కొన్ని పరుగులు చేశారు. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి, కేరళ స్పిన్నర్ ఆశ శోభన చెరో మూడు వికెట్లు పడగొట్టారు. తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్... ఆ తర్వాత వరుసగా రెండో మ్యాచ్లో నెగ్గి 4 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. లీగ్ దశలో ఆదివారం జరిగే తమ తదుపరి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో భారత జట్టు తలపడనుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) విష్మి గుణరత్నె (బి) చమరి ఆటపట్టు 43; స్మృతి మంధాన (రనౌట్) 50; హర్మన్ప్రీత్ (నాటౌట్) 52; జెమీమా (సి) ప్రబోధిని (బి) కాంచన 16; రిచా ఘోష్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు)172. వికెట్ల పతనం: 1–98, 2–98, 3–128, బౌలింగ్: ప్రియదర్శిని 2–0–11–0; సుగంధిక 3–0–29–0; ప్రబోధిని 3–0–32–0; కవిషా దిల్హారి 2–0–11–0; ఇనోక 3–0–26–0; చమరి ఆటపట్టు 4–0–34–1; కాంచన 3–0–29–1. శ్రీలంక ఇన్నింగ్స్: విష్మి గుణరత్నె (సి) (సబ్) రాధ (బి) రేణుక 0; చమరి ఆటపట్టు (సి) దీప్తి శర్మ (బి) శ్రేయాంక 1; హర్షిత (సి) రిచా ఘోష్ (బి) రేణుక 3; కవిషా దిల్హారి (సి) రేణుక (బి) అరుంధతి 21; అనుష్క (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) శోభన 20; నిలాక్షిక సిల్వా (సి) షఫాలీ (బి) అరుంధతి 8; కాంచన (సి) (సబ్) రాధ (బి) అరుంధతి 19; సుగంధిక (సి) రిచా ఘోష్ (బి) శోభన 1; ప్రియదర్శిని (సి) (సబ్) రాధ (బి) శోభన 1; ప్రబోధిని (సి) స్మృతి (బి) దీప్తి శర్మ 9; ఇనోక (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 5; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 90. వికెట్ల పతనం: 1–0, 2–4, 3–6, 4–43, 5–57, 6–58, 7–61, 8–65, 9–86, 10–90, బౌలింగ్: రేణుక 4–0–16–2; శ్రేయాంక 4–0–15–1; దీప్తి 3.5–0–16–1; అరుంధతి రెడ్డి 4–0–19–3; ఆశ శోభన 4–0–19–3. -
బ్యాటింగ్లో సత్తా చాటితేనే...
దుబాయ్: అంతర్జాతీయ మహిళల టి20ల్లో శ్రీలంకపై భారత విజయాల రికార్డు 19–5తో ఎంతో ఘనంగా ఉంది. అయితే ఈ ఐదు పరాజయాల్లో చివరిది ఇటీవల ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లో వచ్చి0ది. అప్పటి వరకు అద్భుత ఫామ్లో చెలరేగిన హర్మన్ప్రీత్ కౌర్ బృందం తుది పోరులో అనూహ్యంగా పరాజయం పాలైంది. కాబట్టి శ్రీలంకే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఈ వరల్డ్ కప్లో ముందంజ వేయాలంటే కచ్చితంగా గెలవడంతో పాటు రన్రేట్ మెరుగుపర్చుకోవడం కూడా భారత్కు ముఖ్యం. ఈ నేపథ్యంలో నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్... తర్వాతి మ్యాచ్లో పాకిస్తాన్ను ఓడించింది. మరోవైపు శ్రీలంక వరుసగా పాకిస్తాన్, ఆ్రస్టేలియాల చేతిలో చిత్తయింది. ఈ మ్యాచ్లో ఓడితే లంక నిష్క్రమణ ఖాయమవుతుంది. హర్మన్ సిద్ధం... కివీస్తో మ్యాచ్లో భారత బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. టాప్–5 స్మృతి, షఫాలీ, హర్మన్, జెమీమా, రిచా విఫలం కావడంతో భారీ ఓటమి తప్పలేదు. దాని నుంచి కోలుకొని పాక్ను ఓడించినా... ఇక్కడా బ్యాటింగ్ గొప్పగా సాగలేదు. బౌలర్ల ప్రదర్శనతో పాక్ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా జట్టు 18.5 ఓవర్లు తీసుకోవడంతో రన్రేట్ కూడా పెంచుకునే అవకాశం లేకపోయింది. ఇలాంటి స్థితిలో లంకపై బ్యాటర్లు చెలరేగి భారీ స్కోరు సాధిస్తేనే జట్టుకు మేలు కలుగుతుంది. రెండు మ్యాచ్లలోనూ విఫలమైన స్మృతికి లంకపై కూడా పేలవ రికార్డు ఉంది. మెడ నొప్పితో పాక్తో మ్యాచ్లో చివరి క్షణాల్లో నిష్క్రమించిన కెపె్టన్ హర్మన్ కోలుకొని ఈ పోరుకు అందుబాటులోకి రావడం టీమ్కు సానుకూలాంశం. షఫాలీ దూకుడుగా ఆడి శుభారంభం అందిస్తే మిగతా బ్యాటర్లు దానిని కొనసాగించగలరు. పాక్తో ఆడిన టీమ్నే ఇక్కడా కొనసాగించే అవకాశం ఉంది. పేసర్ పూజ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆల్రౌండర్ సజనకు చోటు ఖాయం. అటపట్టు ఆడితేనే... వరుసగా రెండు ఓటముల తర్వాత శ్రీలంక పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న కెపె్టన్, స్టార్ ప్లేయర్ చమరి అటపట్టు రెండు మ్యాచ్లలోనూ ఓపెనర్గా విఫలం కావడంతో దాని ప్రభావం టీమ్పై కూడా పడింది. ఆ్రస్టేలియాతో పోరులో 93 పరుగులకే పరిమితం అయిన లంక... అంతకుముందు తమకంటే బలహీన జట్టు అయిన పాకిస్తాన్తో కూడా పేలవంగా ఆడి 85 పరుగులే చేయగలిగింది. రెండు మ్యాచ్లలో కూడా ఒక్క బ్యాటర్ కనీసం 30 పరుగుల స్కోరు చేయలేదు. బౌలింగ్లో అనుభవరాహిత్యం కూడా లంకను బలహీనంగా మార్చింది. ఇలాంటి టీమ్ భారత్కు పోటీనివ్వగలదా లేక ఆసియా కప్ ఫైనల్ స్ఫూర్తితో మళ్లీ ఇబ్బంది పెట్టగలదా అనేది చూడాలి. -
లంక కామ్రేడ్ల నుంచి స్ఫూర్తి పొందాలి!
భారత్ పొరుగు దేశమైన శ్రీలంకలో మార్క్సిస్టు నాయకులైన అనూర కుమార దిస్సనాయకే దేశ అధ్యక్షుడుగానూ, హరిణి అమరసూర్య ప్రధానమంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆసియా రాజకీయాల్లో పెను ఆసక్తికర, ఆహ్వానించదగిన పరిణామాలకు ఆస్కారం ఏర్పడింది. భారత దేశంలోని ఎన్డీయే– ఆరెస్సెస్ వినాశకర కూటమి ప్రభుత్వం శ్రీలంకలోని మితవాద పక్ష పాలకులతో ‘జోడీ’ కట్టి చిరకాలంగా వర్ధిల్లుతున్న భారత్–శ్రీలంక స్నేహ పూర్వక సంబంధాలలో ‘చిచ్చు’ పెట్టింది. ఈ విషమ పరిణామానికి సకాలంలో విరుగుడుగా వచ్చిందే సింహళంలో వామపక్ష పరిపాలన.శ్రీలంక సమగ్రాభివృద్ధిని కాంక్షించి, పాక్షిక ధోరణుల్లో గాక శ్రీలంక ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారాన్ని చేపట్టారు మార్క్సిస్టు నాయకులు. అలాంటి పరిణామాన్నే భారతదేశంలోనూ ఆవిష్కరించగల అవకాశం ఉన్నా... చీలికలు పీలికలుగా ఉన్న వామపక్షాలు ఒకే తాటిపైకి రాలేకపోతున్నాయి. నాయకులు తమ పదవులను త్యజించి విస్తృత ప్రాతిపదికన ఒకే ఒక పార్టీగా ఆవిర్భవించడానికి కృషి చేయడంలేదు. ఎన్టీయే కూటమి దుష్ట ఇజ్రాయెల్తో కలిసి దేశంలోని ప్రగతివాద శక్తులపై నిఘాపెట్టి నానా ఇబ్బంది పెట్టిన చరిత్ర తెలియంది కాదు. ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే దేశంలోని వామ పక్షాలన్నీ ‘చిల్లర తగాదాలు’ మానుకుని ఐక్య వామపక్ష ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. ఇందుకు శ్రీలంక చూపిన ‘ఐక్య ఉద్యమ స్ఫూర్తి’ని భారత వామపక్షాలన్నీ తక్షణం పొందాల్సిన అవసరం ఉంది.ఇదే సందర్భంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేశంలో ఆచరణలో నిజమైన ఫెడరల్ వ్యవస్థను పాదుకొల్పడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమతులమైన అధికారాల పంపిణీ నొక్కి వక్కాణించారు. ఫెడరల్ వ్యవస్థ సూత్రాల ప్రకారం, కేంద్రం ఇప్పుడు రాష్ట్రాలనుంచి వసూలు చేస్తున్న సెస్లు, ఇతర పన్నులను అదే దామాషా ప్రకారం రాష్ట్రాలకు పంచి తీరాల్సిందేనని భట్టి కోరారు. దీన్నిబట్టి చూస్తే, ఇరుగు–పొరుగైన శ్రీలంకలో అంతటి భారీ స్థాయిలో వామపక్ష నేతల ఆధ్వ ర్యంలో క్రమానుగతంగా సాగక తప్పని పరిస్థితులు ఎందుకు వచ్చాయో భారత వామపక్షాల నేతలు కేవలం గుర్తించడమేగాదు, ఆచరణలో దేశంలో ఐక్య ఉద్యమ నిర్మాణానికి పునాదుల్ని పటిష్టం చేసుకొనక తప్పదు. ఇటాలియన్ మాఫియా నుంచి, ఇజ్రాయెల్ గూఢచారుల నుంచి భారతదేశ తక్షణ రక్షణకు దేశంలోని వామపక్షాలన్నీ సిద్ధం కావాలి. నిరుపేదలైన షెడ్యూల్డ్ తరగతులకు చెందిన అట్టడుగు వర్గాల ప్రజలపైనే 13 రాష్ట్రాలలో దారుణమైన అత్యాచారాలు నమోదయ్యా యని తాజా నివేదికలు సాధికారికంగా ప్రకటించాయి. వీటన్నింటికి ముగింపు ఎప్పుడు? ఫెడరల్ వ్యవస్థ పునరుద్ధరణ ద్వారానేనని ఆ నివేదికలు తెలియజేస్తున్నాయి.చదవండి: ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?ఎన్డీయే – ఆరెస్సెస్ కూటమి ప్రభుత్వ నాయకులు ఈ దశలో, ముఖ్యంగా చైతన్యశీలి అయిన ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి 2025 నాటికి గానీ పదవీ విరమణ చేసే అవకాశం లేదు కాబట్టి, ఆ లోగా ‘ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒకే ప్రధాని’ అన్న నినాదంతో ప్రస్తుత కేంద్ర పాలకులు ఏ అఘాయిత్యం చేసే అవకాశం లేదు. ఈలోపు దేశీయ వామపక్షాలు, సంబంధిత వర్గాలన్నీ ఒక్క తాటిపై కదిలి రాగల కార్యాచరణ వ్యూహానికి శ్రీకారం చుట్టాలి.శ్రీలంకలో కమ్యూనిస్టు – మార్క్సిస్టుల అను భవం సుదీర్ఘ కాలంలో నేటి అమూల్యమైన దీర్ఘకాలిక ఫలితాన్ని శ్రీలంక ప్రజలకు ప్రసాదించగల్గింది. లంక పరిణామం ఆసియాలోని చుట్టు పట్ల దేశాల ప్రజాబాహుళ్యానికి సహితం ఆదర్శంగా పరిణమించింది. భారత వామపక్షాలు ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుని ఏకం కావాలి. శ్రీలంక వామపక్షాలు సాధించి ఆదర్శనీయమైన విజయం నుంచి భారత ప్రజల భవిష్యత్తుకు అనువైన ఉమ్మడి వ్యూహ రచనకు నడుం బిగించాలి. ఇందుకు మొదటి షరతుగా నాయకత్వం రూపకల్పనకు అవసరమైన వ్యూహాన్ని సమష్టిగా రూపొందించుకోవాలి. ఇది తప్ప మరో మార్గం లేదు. ఈ సందర్భంగా శ్రీలంకలో భారత మాజీ హైకమిషనర్గా పనిచేసిన గోపాలకృష్ణ గాంధీ శ్రీలంక పరిణామాల్ని సమీక్షిస్తూ... విప్లవాత్మక భావాలు మార్చుకోకుండానే ప్రజాస్వామిక ధోరణులు కూడా బలపడటానికి అనువుగా రాజకీయ పక్షాల సిద్ధాంత ధోరణులు కూడా ఉండాలనీ, ఈ ధోరణుల్ని శ్రీలంక వామపక్షాలు పెంచుకుంటూ మార్పునకు అనుగుణమైన వ్యూహరచనను ఆశ్రయించాయనీ అన్నారు. భారత్–శ్రీలంక సంబంధాలలో కూడా పెను మార్పులకు అవకాశం ఉందని గోఖలే ఆశాభావం వెలిబుచ్చారు.- ఏబీకే ప్రసాద్సీనియర్ సందకులు abkprasad2006@yahoo.co.in -
సూపర్ క్యాచ్.. వైరల్ వీడియో
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2024లో ఓ సూపర్ క్యాచ్ నమోదైంది. తోయమ్ హైదరాబాద్, మణిపాల్ టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ సూపర్ క్యాచ్కు వేదికైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు షాన్ మార్ష్ ఆడిన భారీ షాట్ను టైగర్స్ ఆటగాడు ఏంజెలో పెరీరా అద్భుతమైన క్యాచ్గా మలిచాడు. గుణరత్నే బౌలింగ్లో పెరీరా ఈ క్యాచ్ను అందుకున్నాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది.A great juggling catch by Angelo Perera in the LLC. 😄 pic.twitter.com/t5GyFNJ4hb— Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2024మ్యాచ్ విషయానికొస్తే.. మణిపాల్ టైగర్స్, తోయమ్ హైదరాబాద్ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ 'టై'గా (ఇరు జట్ల స్కోర్లు సమం) ముగియడంతో సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో హైదరాబాద్పై మణిపాల్ టైగర్స్ విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తిసార పెరీరా మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి టైగర్స్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఏంజెలో పెరీరా (18), పియెనార్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో గురుకీరత్ సింగ్, బిపుల్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. ఉడాన, నువాన్ ప్రదీప్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి టైగర్స్ చేసినన్ని పరుగులే (144) చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్కు దారి తీసింది. హైదరాబాద్ను గెలిపించేందుకు స్టువర్ట్ బిన్నీ (20 నాటౌట్), గురుకీరత్ సింగ్ మాన్ (37 నాటౌట్), షాన్ మార్ష్ (38) విఫలయత్నం చేశారు.సూపర్ ఓవర్ సాగిందిలా..సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన తోయమ్ హైదరాబాద్ వికెట్ నష్టానికి కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఐదు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మణిపాల్ టైగర్స్ మూడు బంతుల్లోనే విజయతీరాలకు చేరింది. బిపుల్ శర్మ బౌలింగ్లో డేనియల్ క్రిస్టియన్ సిక్సర్ బాది టైగర్స్ను గెలిపించాడు.చదవండి: డబుల్ సెంచరీ చేజార్చుకున్న అభిమన్యు ఈశ్వరన్ -
ఫాతిమా ఆల్రౌండ్ షో
షార్జా: కెప్టెన్ ఫాతిమా సనా ఖాన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో మహిళల టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్ జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో మ్యాచ్లో పాకిస్తాన్ 31 పరుగుల తేడాతో ఆసియా చాంపియన్ శ్రీలంక జట్టును ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది.ఫాతిమా (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... నిదా దర్ (23; 1 సిక్స్), ఉమైమా సోహైల్ (18; 1 ఫోర్) రాణించారు. శ్రీలంక బౌలర్లలో చమరి ఆటపట్టు, ప్రబోధిని, సుగంధిక తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసి ఓడిపోయింది.విష్మి గుణరత్నె (20), నీలాక్షిక సిల్వా (22) రెండంకెల స్కోరు చేయగా... కెపె్టన్ చమరి ఆటపట్టు (6) విఫలమైంది. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా 3... ఫాతిమా, ఉమైమా, నష్ర తలా రెండు వికెట్లు తీశారు. ఫాతిమా సనాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. -
లంక బౌలర్ల విజృంభణ.. 116 పరుగులకే కుప్పకూలిన పాక్
మహిళల టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (అక్టోబర్ 3) జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. లంక బౌలర్లు మూకుమ్మడిగా రాణించిన పాక్ను నామమాత్రపు స్కోర్కే పరిమితం చేశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. లంక బౌలర్ల ధాటికి 116 పరుగులకు ఆలౌటైంది. సుగంధిక కుమారి, ఉదేషిక ప్రభోదని, చమారీ ఆటపట్టు తలో మూడు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. కవిష దిల్హరి ఓ వికెట్ తీసింది. పాక్ ఇన్నింగ్స్లో కెప్టెన్ ఫాతిమా సనా 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. నిదా దార్ (23), మునీబా అలీ (11), సిద్రా అమిన్ (12), ఒమైమా సొహైల్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. గుల్ ఫెరోజా (2), తుబా హసన్ (5), అలియా రియాజ్ (0), డయానా బేగ్ (2), సదియా ఇక్బాల్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో స్కాట్లాండ్పై బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.చదవండి: బంగ్లాదేశ్తో తొలి టీ20.. తెలుగు కుర్రాడికి అవకాశం లేనట్లే..! -
మూడో స్థానానికి ఎగబాకిన శ్రీలంక.. టాప్లోనే భారత్
న్యూజిలాండ్పై రెండో టెస్ట్లో విజయానంతరం శ్రీలంక జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ (2023-25)లో శ్రీలంక తొమ్మిది మ్యాచ్ల్లో ఐదు విజయాలు నమోదు చేసి నాలుగింట ఓడింది. న్యూజిలాండ్పై తాజా విక్టరీతో శ్రీలంక పాయింట్ల పర్సంటేజీ 55.56 శాతంగా ఉంది. మరోవైపు శ్రీలంక చేతిలో ఓడిన న్యూజిలాండ్ మూడో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో ఎనిమది మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించి, ఐదింట పరాజయాలు ఎదుర్కొంది. ఆ జట్టు పాయింట్ల పర్సంటేజీ 37.50 శాతంగా ఉంది.టాప్లోనే భారత్స్వదేశంలో బంగ్లాదేశ్ను తొలి టెస్ట్లో చిత్తుగా ఓడించిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో 10 మ్యాచ్ల్లో 7 విజయాలు సొంతం చేసుకుని, 2 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ పాయింట్ల పర్సంటేజీ 71.67 శాతంగా ఉంది. బంగ్లాదేశ్ విషయానికొస్తే.. భారత్ చేతిలో తొలి టెస్ట్లో ఓటమి అనంతరం ఈ జట్టు ఐదో స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించి, నాలుగింట ఓడింది.భారత్ వెనకాలే ఆస్ట్రేలియాడబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా భారత్ వెనకాలే ఉంది. ఆ జట్టు 12 మ్యాచ్ల్లో ఎనిమిదింట గెలిచి మూడు మ్యాచ్ల్లో ఓడింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సైకిల్లో ఆడిన 16 మ్యాచ్ల్లో ఎనిమిది గెలిచి, ఏడింట ఓడింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది.మిగతా జట్ల విషయానికొస్తే..తాజా స్టాండింగ్స్లో సౌతాఫ్రికా ఆరో స్థానంలో.. పాకిస్తాన్ ఎనిమిదో స్థానంలో.. వెస్టిండీస్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. సౌతాఫ్రికా ఆరు మ్యాచ్ల్లో రెండు విజయాలు (3 పరాజయాలు, ఓ డ్రా), పాకిస్తాన్ ఏడు మ్యాచ్ల్లో రెండు విజయాలు (5 పరాజయాలు), వెస్టిండీస్ తొమ్మిది మ్యాచ్ల్లో ఒక్క విజయం (6 పరాజయాలు, 2 డ్రాలు) సాధించాయి.చదవండి: NZ Vs SL 2nd Test: న్యూజిలాండ్ను చిత్తు చేసిన శ్రీలంక.. -
శ్రీలంక హెడ్కోచ్గా జయసూర్య.. మరో ఏడాది పాటు!
శ్రీలంక హెడ్కోచ్గా దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య పదవీకాలాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ఏడాది పాటు పొడిగించింది. ఈ ఏడాది జూలైలో భారత్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లో శ్రీలంక తాత్కాలిక ప్రధాన కోచ్గా జయసూర్య బాధ్యతలు చేపట్టాడు.అయితే టీమిండియాతో టీ20 సిరీస్ కోల్పోయినప్పటకి వన్డేల్లో మాత్రం లంక అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. వన్డే సిరీస్ను 2-0 తేడాతో లంకేయులు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్కు వెళ్లిన శ్రీలంక టీమ్ అక్కడ కూడా మెరుగైన ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను కోల్పోయినప్పటకి.. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో గెలిచి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తమ సొంత గడ్డపై న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో కూడా శ్రీలంక అదరగొడుతుంది. ఇప్పటికే తొలి టెస్టులో కివీస్ను చిత్తు చేసిన లంక.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా విజయానికి చేరువైంది. గత మూడు నెలలగా జయసూర్య నేతృత్వంలోని లంక జట్టు తమ పూర్వ వైభవంగా దిశగా అడుగులు వేస్తోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో శ్రీలంక ప్రస్తుతం మూడో స్ధానంలో ఉంది. ఇప్పుడు కివీస్తో రెండో టెస్టులో విజయం సాధిస్తే శ్రీలంక స్ధానం మరింత మెరుగుపడే అవకాశముంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడమే లక్ష్యంగా శ్రీలంక ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే జయసూర్య సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోవాలని లంక క్రికెట్ బోర్డు నిర్ణయించుకుంది.చదవండి: IND vs BAN: 'అతడేం తప్పు చేశాడు.. నిజంగా సిగ్గు చేటు'.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్ -
శ్రీలంకలో విండీస్ పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే..!
శ్రీలంకలో వెస్టిండీస్ పర్యటన ఖరారైంది. పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 13, 15, 17 తేదీల్లో డంబుల్లా వేదికగా జరుగనుంది. అనంతరం అక్టోబర్ 20 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్ అక్టోబర్ 20, 23, 26 తేదీల్లో క్యాండీ వేదికగా జరుగనుంది.కాగా, ఇటీవలికాలంలో శ్రీలంక ఫార్మాట్లకతీతంగా రాణిస్తుంది. స్వదేశంలో భారత్ను వన్డే సిరీస్లో 2-0 తేడాతో ఓడించిన శ్రీలంక.. ఆతర్వాత ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపై ఓ టెస్ట్ మ్యాచ్లో ఓడించింది. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లోనూ శ్రీలంక సత్తా చాటుతుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో శ్రీలంక 63 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్లోనూ శ్రీలంక పైచేయి సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో లంకేయులు భారీ స్కోర్ సాధించారు.వెస్టిండీస్ విషయానికొస్తే.. ఈ కరీబియన్ జట్టు ఇటీవల సౌతాఫ్రికాను మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. దానికి ముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను విండీస్ 0-1 తేడాతో కోల్పోయింది. అంతకుముందు ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను కూడా వెస్టిండీస్ 0-3 తేడాతో కోల్పోయింది. ప్రస్తుతం వెస్టిండీస్లో కరీబియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుండటంతో ఆటగాళ్లంతా ఆ లీగ్లో బిజీగా ఉన్నారు. చదవండి: కన్నీటిపర్యంతమైన బ్రావో -
బ్రాడ్మన్ రికార్డు సమం చేసిన కమిందు మెండిస్
శ్రీలంక యువ సంచలనం కమిందు మెండిస్ క్రికెట్ దిగ్గజాల రికార్డును సమం చేశాడు. టెస్ట్ల్లో తొలి 13 ఇన్నింగ్స్ల్లోనే ఐదు సెంచరీలు చేసిన ఆటగాడిగా బ్రాడ్మన్, జార్జ్ హెడ్లీ సరసన నిలిచాడు. బ్రాడ్మన్, కమిందు, హెడ్లీ.. తమ తొలి 13 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో ఐదు సెంచరీలు చేశారు. ఇన్నింగ్స్ల పరంగా టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ ఐదు సెంచరీల రికార్డు ఎవర్టన్ వీక్స్ పేరిట ఉంది. వీక్స్ కేవలం 10 ఇన్నింగ్స్ల్లోనే ఐదు సెంచరీలు పూర్తి చేశాడు. ఆతర్వాత హెర్బర్ట్ సచ్క్లిఫ్, నీల్ హార్వే తొలి 12 ఇన్నింగ్స్ల్లో ఐదు సెంచరీలు చేశారు. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేయడం ద్వారా కమిందు బ్రాడ్మన్ రికార్డు సమం చేశాడు. కమిందు తన కెరీర్లో తొలి 13 ఇన్నింగ్స్ల్లో తొమ్మిది సార్లు ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. అలాగే తానాడిన తొలి ఎనిమిది టెస్ట్ల్లో కనీసం అర్ద సెంచరీ చేశాడు.న్యూజిలాండ్తో టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో కమిందు మెండిస్తో (182 నాటౌట్) పాటు దినేశ్ చండీమల్ (116), కుసాల్ మెండిస్ (106 నాటౌట్) సెంచరీలతో కదంతక్కొడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 602 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. లంక ఇన్నింగ్స్లో ఏంజెలో మాథ్యూస్ (88), కరుణరత్నే (46), ధనంజయ డిసిల్వ (44) కూడా రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. టిమ్ సౌథీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.ఫాస్టెస్ట్ 1000 రన్స్న్యూజిలాండ్తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 182 పరుగులతో అజేయంగా నిలిచిన కమిందు మెండిస్ టెస్ట్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కమిందు ఈ మార్కును కేవలం 13 ఇన్నింగ్స్లోనే తాకాడు. తద్వారా డాన్ బ్రాడ్మన్ సరసన నిలిచాడు. బ్రాడ్మన్ కూడా టెస్ట్ల్లో తన తొలి వెయ్యి పరుగులను 13 ఇన్నింగ్స్ల్లోనే రీచ్ అయ్యాడు. టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ 1000 పరుగుల రికార్డు హెర్బర్ట్ సచ్క్లిఫ్, ఎవర్టన్ వీక్స్ పేరిట ఉంది. వీరిద్దరు 12 ఇన్నింగ్స్ల్లోనే ఈ మార్కును తాకారు.చదవండి: భారత్తో టెస్ట్ మ్యాచ్.. బంగ్లాదేశ్ వీరాభిమానిపై దాడి.. ఆసుపత్రికి తరలింపు -
కమిందు మెండిస్.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు..!
శ్రీలంక యువ బ్యాటర్ కమిందు మెండిస్ టెస్ట్ క్రికెట్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. కమిందు టెస్ట్ల్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో వరుసగా ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. తద్వారా 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు ఏ బ్యాటర్ అరంగేట్రం నుంచి ఇన్ని మ్యాచ్ల్లో వరుసగా 50 ప్లస్ స్కోర్లు చేయలేదు. పాక్ ఆటగాడు సౌద్ షకీల్ అరంగేట్రం నుంచి వరుసగా ఏడు మ్యాచ్ల్లో ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఆతర్వాత న్యూజిలాండ్ ఆటగాడు బెర్ట్ సచ్క్లిఫ్, పాక్కు చెందిన సయీద్ అహ్మద్, భారత్కు చెందిన సునీల్ గవాస్కర్ అరంగేట్రం నుంచి వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశారు.శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 306 పరుగులు (తొలి ఇన్నింగ్స్లో) చేసింది.దినేశ్ చండీమల్ (116) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ (78 నాటౌట్), కమిందు మెండిస్ (51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. దిముత్ కరుణరత్నే 46 పరుగులతో పర్వాలేదనిపించగా.. పథుమ్ నిస్సంక కేవలం ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో కమిందు మెండిస్ సెంచరీతో.. ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు.టెస్ట్ అరంగేట్రం నుంచి ఎనిమిది మ్యాచ్ల్లో కమిందు చేసిన స్కోర్లు.. - 61 vs AUS.- 102 & 164 vs BAN.- 92* vs BAN.- 113 vs ENG.- 74 vs ENG.- 64 vs ENG.- 114 vs NZ.- 51* vs NZ. చదవండి: 21వ శతాబ్దపు అత్యుత్తమ జట్టు.. ధోని, రోహిత్లకు నో ప్లేస్..! -
చండీమల్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక
గాలే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. ఆ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తూ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 306 పరుగులు (తొలి ఇన్నింగ్స్లో) చేసింది.దినేశ్ చండీమల్ (116) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ (78 నాటౌట్), కమిందు మెండిస్ (51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. దిముత్ కరుణరత్నే 46 పరుగులతో పర్వాలేదనిపించగా.. పథుమ్ నిస్సంక కేవలం ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో కమిందు మెండిస్ సెంచరీతో.. ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు.తుది జట్లు..శ్రీలంక: పథుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నే, దినేశ్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (వికెట్కీపర్), మిలన్ రత్నాయక్, ప్రభాత్ జయసూర్య, నిషాన్ పెరిస్, అసిత ఫెర్నాండోన్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ (కెప్టెన్), అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీచదవండి: 21వ శతాబ్దపు అత్యుత్తమ జట్టు.. ధోని, రోహిత్లకు నో ప్లేస్..! -
న్యూజిలాండ్తో రెండో టెస్ట్.. రెండేళ్ల కరువును తీర్చుకున్న చండీమల్
శ్రీలంక వెటరన్ బ్యాటర్ దినేశ్ చండీమల్ టెస్ట్ క్రికెట్లో రెండేళ్ల సెంచరీ కరువును తీర్చుకున్నాడు. గాలే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో చండీమల్ ఎట్టకేలకు సెంచరీ మార్కు తాకాడు. చండీమల్ 2022, మేలో చివరిసారిగా (బంగ్లాదేశ్పై) టెస్ట్ల్లో మూడంకెల స్కోర్ చేశాడు. చండీమల్కు ఈ సెంచరీ చాలా ప్రత్యేకం. చండీమల్ సెంచరీ చేసిన తొమ్మిదో దేశం న్యూజిలాండ్. చండీమల్ తన కెరీర్లో ఇప్పటివరకు తొమ్మిది వేర్వేరు దేశాలపై (బంగ్లాదేశ్పై 5, భారత్పై 2, ఆస్ట్రేలియాపై 2, వెస్టిండీస్పై 2, ఇంగ్లండ్పై 1, ఆఫ్ఘనిస్తాన్పై 1, ఐర్లాండ్పై 1, పాకిస్తాన్పై 1, న్యూజిలాండ్పై 1) 16 సెంచరీలు చేశాడు. కాగా, న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (1), దిముత్ కరుణరత్నే (46) ఔట్ కాగా.. చండీమల్ (106), ఏంజెలో మాథ్యూస్ (35) క్రీజ్లో ఉన్నారు. నిస్సంక వికెట్ సౌథీకి దక్కగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో కమిందు మెండిస్ సెంచరీతో.. ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు. చదవండి: మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడిన హోప్, హెట్మైర్ -
న్యూజిలాండ్తో రెండో టెస్ట్.. శ్రీలంక తుది జట్టు ప్రకటన
సెప్టెంబర్ 26 నుంచి గాలే వేదికగా న్యూజిలాండ్తో జరుగబోయే రెండో టెస్ట్ కోసం శ్రీలంక తుది జట్టును ఇవాళ (సెప్టెంబర్ 25) ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక మేనేజ్మెంట్ రెండు మార్పులు చేసింది. తొలి టెస్ట్ ఆడిన రమేశ్ మెండిస్, లహీరు కుమార స్థానాల్లో అన్ క్యాప్డ్ ప్లేయర్ నిషాన్ పెరిస్, మిలన్ రత్నాయకే తుది జట్టులోకి వచ్చారు. స్పిన్నర్ రమేశ్ మెండిస్ తొలి టెస్ట్లో ఆరు వికెట్లు తీసినప్పటికీ అతన్ని తుది జట్టు నుంచి తప్పించడం ఆసక్తికరం. రమేశ్ తొలి టెస్ట్లో వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ కారణంగా అతన్ని రెండో టెస్ట్ నుంచి తప్పించి ఉండవచ్చు. పేసర్ లహీరు కుమార విషయానికొస్తే.. ఇతను తొలి టెస్ట్లో ఆశించినంత ప్రభావం చూపించ లేకపోయాడు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అందుకే రెండో టెస్ట్లో ఇతని స్థానాన్ని మరో పేసర్ మిలన్ రత్నాయకేతో భర్తీ చేసింది శ్రీలంక మేనేజ్మెంట్.న్యూజిలాండ్తో రెండో టెస్ట్కు శ్రీలంక తుది జట్టు..దిముత్ కరుణరత్నే, పథుమ్ నిస్సంక, దినేశ్ చండీమల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వ (కెప్టెన్), కుసాల్ మెండిస్, నిషాన్ పెరిస్, ప్రభాత్ జయసూర్య, మిలన్ రత్నాయకే, అశిత ఫెర్నాండోకాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య జట్టు 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కమిందు మెండిస్ సెంచరీతో ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక విజయంలో కీలకపాత్ర పోషించారు. చదవండి: ENG VS AUS 3rd ODI: కుక్ రికార్డు బ్రేక్ చేసిన బ్రూక్ -
శ్రీలంక చరిత్రలోనే కొత్తమలుపు
శ్రీలంక చరిత్ర, వారు బ్రిటిష్ వలస పాలన నుండి 1948లో స్వతంత్రులైన 74 సంవత్సరాల తర్వాత ఈ నెల 22న కొత్త మలుపు తిరిగింది. ఆ దేశాన్ని ఇంతకాలం మధ్యే మార్గానికి చెందిన, లేదా భారతదేశపు కాంగ్రెస్ వలె కొద్దిగా వామపక్షపు మొగ్గు గల పార్టీలు పాలించగా, ఈ ఆదివారం నాటి ఎన్నికలలో స్పష్టంగా మార్క్సిస్టు సిద్ధాంతాలు గల జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీ విజయం సాధించింది. ఆ మరునాడే జేవీపీ నాయకుడు అనూర కుమార దిస్సనాయకే దేశాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. జేవీపీ ఇండియా వ్యతిరేకి. చైనాకు అనుకూలం. తమిళ టైగర్లపై ఊచకోతను బలపరిచింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంతో సంబంధాలకు గట్టి ప్రయత్నం అవసరం.శ్రీలంకలో జనతా విముక్తి పెరమున (జేవీపీ) విజయంలో గమనించవలసిన ముఖ్యమైన అంశాలు కొన్నున్నాయి. ఓటింగ్ శాతం అసాధారణంగా 75 శాతానికి చేరింది. జేవీపీకి లభించిన ఓట్లు 42.3 శాతం. వారి ప్రధాన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు ప్రేమదాస వారసుడైన సజిత్ ప్రేమదాస రెండవ స్థానంలో నిలవగా ఆయనకు వచ్చినవి 32.71 శాతం. అధ్యక్షునిగా ఇపుడు పదవీ విరమణ చేసిన రణిల్ విక్రమసింఘే తెచ్చుకున్నవి 17.27 శాతం కాగా, రాజపక్షే వారసుడు నమల్ రాజపక్షే కేవలం 3 శాతానికి పరిమితమయ్యాడు. అనూర దిస్స నాయకే పేరు మనకిక్కడ తెలియదుగానీ, తక్కిన వంశాలన్నీ సుపరిచి తమే. ఎన్నికల ఫలితాలకు సంబంధించి గమనించవలసిన మరో విషయం, జేవీపీ మొదటిసారిగా దేశంలోని అన్ని ప్రాంతాలలో బలం సంపాదించటం. అక్కడ ఆ పార్టీకి మొదటినుంచి పునాది ఉన్నది దక్షిణ, మధ్య ప్రాంతాలలో మాత్రమే. తూర్పు, పడమరలలోగానీ, ఉత్తరానగానీ బలహీనం. ఇది నేను శ్రీలంకలో పర్యటించినపుడు స్వయంగా గమనించాను. దక్షిణాన, మధ్య ప్రాంతాలలో గ్రామాలు, పట్టణాలు అన్నీ జేవీపీ కంచుకోటలు. అదే ప్రాంతాన గల పెరెదీనియా అనే అతి సుందరమైన యూనివర్సిటీకి వెళ్లగా, సీలింగ్ నుంచి కింది వరకు వేలాడే మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ చిత్రాలు! ఆ యూనివర్సిటీ పూర్తిగా జేవీపీ విద్యార్థి సంఘపు స్థావరం. అది చూసి నాకు ఆ కాలపు కాకతీయ యూనివర్సిటీ గుర్తుకు వచ్చింది. అటువంటి దశ నుంచి జేవీపీ ఇపుడు అన్ని ప్రాంతాలకు పాకిపోయింది.అయితే, అదే సమయంలో గుర్తించవలసిన వాస్తవం ఒకటున్నది. జేవీపీ ఈ విధమైన బలాన్ని మొదటిసారిగా సాధించటానికి కొన్ని కారణాలున్నాయి. ఒకటి, దేశాన్ని మొదటి నుంచి పాలించిన అన్ని పార్టీలు వరుసగా విఫలమవుతూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవటం; ఆర్థిక స్థితి తీవ్రంగా దెబ్బ తిని, భారీగా అప్పులపాలై, కొంత కాలం క్రితం దివాళా పరిస్థితికి చేరిన సంక్షోభం గురించి, ఫలితంగా పెద్ద ఎత్తున ప్రజాందోళనలు, హింస, సైన్యం ద్వారా అణచివేత, దేశం నుంచి అధ్యక్షుడు రాజపక్షే పరారీల వార్తలు చూశాం. ఆ పరిస్థితుల్లో సైన్యం సహా అన్ని పార్టీల రాజీతో మరొక మాజీ అధ్యక్షుడైన రణిల్ విక్రమసింఘేకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఐఎంఎఫ్ భారీ రుణంతో ఆయన ఆర్థిక స్థితిని చక్కబెట్టజూశారు గానీ ఆయన వల్ల కాలేదు. ప్రజల పరిస్థితులు క్షీణించటం, ధరలు ఆకాశానికి చేరటం, తీవ్ర నిరుద్యోగం వంటి కారణాలతో ఇతర పార్టీలన్నీ ప్రజల విశ్వా సాన్ని కోల్పోయాయి. ఒక శూన్యం ఏర్పడింది. రెండు, తాము ఆర్థిక స్థితిని చక్కబెట్టడంపై దృష్టిని కేంద్రీకరించగలమనీ, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించగలమనీ జేవీపీ నమ్మబలికిన మాటలను ప్రజలు నమ్మటం. మూడు, తమది మార్క్సిస్టు సిద్ధాంతం కాగా, డెమోక్రటిక్ సోషలిజం (మన దగ్గర సోషలిస్టు పార్టీల వలె), సామాజిక న్యాయం, అవినీతి నిర్మూలన అజెండాతో మార్పు, సంస్క రణ అనే లక్ష్యాలతో పనిచేయగలమని ప్రకటించటం.జేవీపీ సిద్ధాంతాలు మొదటి నుంచి ప్రజానుకూలమైనవి. నిరాడంబరులు, నీతిపరులు, కష్టించి పనిచేసేవారు, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటారన్న పేరున్నది. పార్టీ వ్యవస్థాపకుడైన రోహణ విజెవీర యువకులకు రహస్యంగా సాయుధ శిక్షణలు ఇచ్చి ఒకసారి 1971లో, తర్వాత అంతకన్నా భీకరంగా 1987–89లో రెండవసారి ఆకస్మిక గెరిల్లా దాడులతో దేశాన్ని స్తంభింపజేశాడు. ఆయన గెరిల్లా బలాన్ని శ్రీలంక సైన్యం సైతం ఆపలేక పోవటంతో ఇతర దేశాలు సైన్యాలను పంపవలసి వచ్చింది. ఆ సైన్యాలన్నీ కలిసి దాదాపు 70 వేల మంది గెరిల్లాలను కాల్చివేసినట్లు అంచనా. ఆ కాలంలో ఇదంతా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత జేవీపీ సాయుధ పోరాటాన్ని వదలివేసింది. మార్క్సిస్టు–లెనినిస్టు సిద్ధాంతంతోనే పార్లమెంటరీ రాజకీయాలలోకి మళ్లింది.ఇటువంటి నేపథ్యం నుంచి వచ్చిన అనూర ఒక మారుమూల గ్రామానికి, అతి సాధారణ కుటుంబానికి చెందినవాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో పాల్గొంటూ క్రమంగా పార్టీలో గుర్తింపు పొంది ఎదుగుతూ వచ్చాడు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలడనే పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడు ఏ విషయంలోనూ చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఈ విధమైన వ్యక్తిగత ప్రతిష్ఠ కూడా ఉన్నవాడు గనుకనే ఆదివారం నాటి ఎన్నికలలో అన్ని ప్రాంతాల ప్రజలు తనకు, తన పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. ఆధిపత్యవాదపు సింహళ జాతీయులు, తమిళులు, ముస్లిములు, దక్షిణ–మధ్య ప్రాంతాల వాసులుగా విడిపోయి ఉండే అక్కడి దేశీ యులు ఈ విధంగా మూకుమ్మడిగా ఒక పార్టీని బలపరచటం ఒక మేరకు దేశ స్వాతంత్య్రానంతరం బండారనాయకే కుటుంబ కాలంలో మినహా ఎపుడూ జరగలేదు. ఇపుడు జేవీపీ తన చిన్న మిత్ర పక్షాలతో కలిసి నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పేరిట ఒక ఏకీభావం గల కూటమితో ఆ ఘనతను సాధించింది. ‘ఇది దేశాభ్యుదయం, పునర్నవీకరణల సరికొత్త శకం దిశగా ఒక ముందడుగు’ అని, ‘సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు ద్వారా దేశాన్ని కొత్త మలుపు తిప్పగలమనే నమ్మకం మాకున్న’దని ఈ సందర్భంగా అనూర ప్రకటించారు.అయితే, శ్రీలంకను 1948లో దేశ స్వాతంత్య్రానికి ముందు నుంచే సమస్యలకు గురిచేస్తూ, 1976లో వేలుపిళ్ళై ప్రభాకరన్ నాయకత్వాన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీటీఈ) స్థాపన తర్వాత మహా తీవ్ర దశకు చేరిన తమిళుల సమస్యపై జేవీపీ పరిష్కార మార్గం ఏమిటన్నది ఒక ముఖ్యమైన ప్రశ్న. నేను కొలంబో శివార్లలోని జేవీపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి అక్కడి నాయకులతో మాట్లాడినపుడు, వారు తమిళులకు ప్రత్యేక రాజ్యం కాదు గదా కనీసం వారి ప్రాంతాలకు ఫెడరల్ హక్కులు ఇచ్చేందుకు కూడా వ్యతిరేకులని అర్థమైంది. అది మార్క్సిజం అవగాహనకు భిన్నం కదా అని నేను గుర్తు చేసినా వారు అంగీకరించలేదు. నాకు అర్థమైన దానిని బట్టి ఇతర సింహళీయులు, బౌద్ధ గురువుల వలెనే జేవీపీ పూర్తిగా జాతీయవాద పార్టీ. తమ దేశ ఐక్యతకు, భౌగోళికతకు చిన్నమెత్తు భంగపాటు అయినా కలగరాదన్నది వారి వైఖరి. అందు కోసం బౌద్ధ గురువులు బుద్ధుని బోధనలనైనా పక్కకు పెట్టినట్లు, జేవీపీ వారు మార్క్సిస్టు సూత్రాలనైనా విస్మరిస్తారు. అందుకే వీరు ఇరువురూ, తమిళ ప్రాంతాలకు ఫెడరల్ అధికారం కోసం రాజీవ్ గాంధీ, జయవర్ధనేల మధ్య ఒప్పందంతో శ్రీలంక రాజ్యాంగానికి జరిగిన 13వ సవరణను తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళ టైగర్లపై ఊచకోతను పూర్తిగా బలపరిచారు. అప్పటితో పోల్చితే ప్రభాకరన్ గానీ, ఈలం పోరాటంగానీ లేనందున ఈ మారిన పరిస్థితులలో అనూర ప్రభుత్వ విధానం ఏమి కాగలదో వేచి చూడాలి.శ్రీలంక పొరుగు దేశమైన ఇండియాకు వారి విదేశాంగ విధానం ముఖ్యమైనది. యథాతథంగా జేవీపీ మొదటినుంచి ఇండియా వ్యతిరేకి. చైనాకు అనుకూలం. అందుకు కారణాలను వారి కార్యా లయాన్ని సందర్శించినపుడు నాకు చెప్పారు. అదట్లా ఉంచితే, నిజా నికి ఇంతకు ముందటి అధ్యక్షులు కూడా చైనా పట్ల ఎంతో కొంత మొగ్గు చూపిన వారే తప్ప ఇండియా పట్ల కాదు. ఆ విధంగా ఇండి యాకు నాలుగు వైపుల గల దేశాలన్నింటిలో భూటాన్ తప్ప మనకు నిజంగా అనుకూలమన్నది ఒక్కటైనా లేదు. బంగ్లాదేశ్ కొంతమేర అట్లా ఉండగా షేక్ హసీనా పదవీచ్యుతితో పరిస్థితి మారింది. అటు వంటప్పుడు శ్రీలంక కొత్త ప్రభుత్వంతో సంబంధాల అభివృద్ధికి గట్టి ప్రయత్నమే చేయవలసి ఉంటుంది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య
కొలంబో: శ్రీలకం నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె మంగళశారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొలంబోలో జరిగిన ఈ వేడుకలో శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే.. నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ)కి చెందిన 54 ఏళ్ల హరిణితో చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ఎన్పీపీకి చెందిన మరో ఇద్దరు పార్లమెంట్ ఎంపీలు విజితా హెరాత్, లక్ష్మణ్ నిపునరాచ్చిని కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో శ్రీలంకలో దిసనాయకే, హరిణితోసహా మొత్తం నలుగురి సభ్యులతో శ్రీలంక మంత్రివర్గం కొలువుదీరింది. ప్రధానితోపాటు ఆమెకు న్యాయం, విద్య, కార్మిక, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలకమైన మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు. ఇదిలా ఉండగా ఎన్నికల తర్వాత అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన ప్రధాని పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలను ప్రస్తుతం హరిణి చేపట్టారు. కాగా సిరిమావో బండారు నాయకే తర్వాత(2020 తర్వాత) ప్రధాని పదవి చేపట్టిన మొదటి మహిళా నేతగా హరిణి నిలిచారు.హక్కుల కార్యకర్తగా, యూనివర్సిటీ లెక్చరర్గా పనిచేసిన అమరసూర్య శ్రీలంకలో సామాజిక న్యాయం, విద్యకు గణనీయమైన కృషి చేశారు. ఆమె నియామకం రాజకీయాల్లో మహిళలకు పురోగతిని సూచించడమే కాకుండా ప్రగతిశీల నాయకత్వం, సంస్కరణపై ఎన్పీపీ దృష్టిని నొక్కి చెబుతుంది. ఇక శ్రీలంకకు మూడో మహిళా ప్రధానిగా హరిణి చరిత్ర సృష్టించారు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన బండారునాయకే తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం మూడుసార్లు(1960–65, 1970–77, 1994–2000) ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలో ఆ పదవిని అధిరోహించిన మొదటి మహిళగా ఖ్యాతికెక్కారు. ఆమె తర్వాత చంద్రికా కుమారతుంగ(1994) ప్రధాని పదవిలో రెండు నెలలు కొనసాగారు.ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే సంచలన విజయంతో శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పార్లమెంట్ను రెండు రోజుల్లో రద్దు చేస్తామని దిసనాయకే సోమవారం చెప్పడంతో శ్రీలంకలో ముందస్తు పార్లమెంటు ఎన్నికలు నవంబర్లో జరిగే అవకాశం ఉంది. -
భారత్, చైనాల మధ్య నలిగిపోము: శ్రీలంక అధ్యక్షుడు
కొలంబో: భారత్, చైనా దేశాలతో విదేశాంగ విధానంలో శ్రీలంక సమానమైన వైఖరిని పాటిస్తుందని ఆ దేశ కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే అన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భారత్, చైనా విదేశాంగ విధానంపై స్పందించారు. భారత్, చైనాల మధ్య నలిగిపోయే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యులో పొరుగుదేశాలతో విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మా నాయకత్వంలో దేశం భౌగోళిక, రాజకీయ ప్రత్యర్థుల జోలికి వెళ్లకుండా చూస్తాం. నేషనల్ పీపుల్స్ పవర్( ఎన్పీపీ) ప్రభుత్వం ఏ దేశంతోను జతకట్టదని, పొరుగు దేశాలైన భారత్, చైనా రెండు దేశాలతో సమతుల్య సంబంధాలను పెంపొందించుకోవాలని భావిస్తోంది.మేము భౌగోళిక, రాజకీయ పోరాటంలో ఎవరితో పోటీదారులం కాదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య నలిగిపోవాలనే ఉద్దేశం మాకు లేదు. రెండు దేశాలు విలువైన స్నేహితులుగా మా ప్రభుత్వ సన్నిహిత భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాం. యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో కూడా సంబంధాలను కొనసాగించుతాం” అని అన్నారు.పొరుగు దేశాల ఆధిపత్య పోరులో శ్రీలంక నలిగిపోవద్దని ఇరుదేశాలతో పరస్పర ప్రయోజనకరమైన దౌత్య భాగస్వామ్యం నిర్మించడంపై దృష్టి సారిస్తోందని అన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తటస్థ విదేశాంగ విధాన విధానమే కీలకమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: సంక్షోభ లంకపై నెలవంక! -
సంక్షోభ లంకపై నెలవంక!
దాదాపు రెండున్నరేళ్లక్రితం విదేశీ రుణాల చెల్లింపులు అసాధ్యమై దివాలా తీసింది మొదలు వరస సంక్షోభాలను చవిచూస్తున్న శ్రీలంకలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నూతన అధ్యక్షుడిగా సోమవారం పదవీబాధ్యతలు స్వీకరించిన అనూర కుమార దిస్సనాయకే వర్తమాన సంక్షోభ పరంపర నుంచి దేశాన్ని గట్టెక్కిస్తారన్న ఆశలు జనంలో దండిగానే ఉన్నాయి. కనుకనే వారసులవైపే మొగ్గే అలవాటున్న ప్రజానీకం ఈసారి మార్క్సిస్టు అయిన దిస్సనాయకేను ఎంపిక చేసుకున్నారు. 2022లో నిత్యావసరాల కొరత, అధిక ధరలు, పన్నుల మోతతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిపై ఆగ్రహోదగ్రులైన ప్రజలు అధ్యక్ష భవనంపై, పార్లమెంటుపై దాడిచేయటం, నాటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన పరివారం దేశం విడిచి పరారుకావటం ప్రపంచాన్ని దిగ్భ్రమపరి చాయి. అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మూడేళ్లలోపే రాజపక్సకు ఈ దుర్గతి పట్టింది. అందుకే దిస్సనాయకే అత్యంత జాగరూకతతో పాలన సాగించి దేశాన్ని ఒడ్డున పడేయాల్సి వుంటుంది. గతంలో ఎంపీగా, మంత్రిగా పనిచేసి ఉండొచ్చుగానీ సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న దేశానికి సారథ్యం స్వీకరించటం సామాన్యం కాదు. రనిల్ విక్రమసింఘే ప్రభుత్వం పెను ఆర్థిక విపత్తు నుంచి గట్టెక్కడానికి ఐఎంఎఫ్ను ఆశ్రయించినప్పుడు 290 కోట్ల డాలర్ల రుణం మంజూరుచేస్తూ కఠినమైన షరతులు పెట్టింది. పర్యవసానంగా పొదుపు చర్యల పేరుతో జీతాలు, పెన్షన్లు కోత పడ్డాయి. సంక్షేమ పథకాలు అటకెక్కాయి. ప్రజలు అర్ధాకలితో వెళ్లదీస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో వామపక్ష జనతా విముక్తి పెరమున (జేవీపీ) నాయకుడిగా భావసారూప్య పార్టీలతో నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పేరిట కూటమి ఏర్పరిచి ఘనవిజయం సాధించటం దిస్సనాయకే ఘనత. గత ఎన్నికల్లో కేవలం నాలుగు శాతం ఓట్లతో, పార్లమెంటులో మూడంటే మూడే స్థానాలు గెల్చుకున్న పార్టీ ఈ స్థాయిలో దూసుకురావటం అసాధారణం. కోతలను సరళం చేస్తామన్న ఎన్పీపీ హామీ వోటర్లను విశేషంగా ఆకట్టుకుంది. దానికి తోడు సంప్రదాయపక్షాలు, అవి ఇచ్చే అబద్ధపు హామీలతో జనం విసిగిపోయారు. అందుకే కావొచ్చు... ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని దిస్సనాయకే అన్నారు. 2022 నాటి ‘అరగల్య’ (పోరాటం) ఉద్యమంలో జనం సమీకృతులు కావటం వెనక వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తితో పాటు జేవీపీ తెర వెనక కృషి కూడా ఉంది. జనాగ్రహాన్ని నిర్మాణాత్మకంగా మలచటంలో, అరాచకం ప్రబలకుండా చూడటంలో ఆ పార్టీ విజయం సాధించింది. అందుకే ఇటీవల బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న పరిణామాల వంటివి అక్కడ జరగలేదు. బంగ్లాలో ఇస్లామిక్ తీవ్రవాదుల ఆధిపత్యం పెరగటం, బురఖా ధరించని మహిళలను బహిరంగ ప్రదేశాల్లో కొట్టి హింసించటం పరిపాటైంది. అంతేగాదు... దేశావిర్భావానికి మూల కారణమైన భాష, ప్రాంతం వంటి అస్తిత్వ అంశాలు సైతం బుట్టదాఖలా అవుతున్నాయి. ఆ పరిస్థితి లంకలో తలెత్తకపోవటం, సంక్షోభంలో సైతం రనిల్ ప్రభుత్వం సజావుగా సాగటంలో జేవీపీ పాత్ర కాదనలేనిది.అయితే జేవీపీ చరిత్రలో నెత్తుటి అధ్యాయాలు తక్కువేం కాదు. దాదాపు అరవైయ్యేళ్ల క్రితం ఆవిర్భవించి 70, 80 దశకాల్లో దేశంలో హింసాకాండను ప్రేరేపించిన జేవీపీని తుడిచిపెట్టడానికి ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. మార్క్సిజాన్ని అనుసరిస్తున్నామని మావో, హోచి మిన్, చేగువేరా తమకు ఆదర్శమంటూనే సింహళ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి వేలాదిమంది లంక తమిళులను ఊచకోత కోయటం, వారికి అనుకూలంగా మాట్లాడే వందలాదిమందిని హత మార్చటం జేవీపీ చరిత్రలో మాయని మచ్చ. తమ వైఖరిని వ్యతిరేకించే పాత్రికేయులను సైతం ఆ పార్టీ కాల్చి చంపింది. ప్రేమదాస హయాంలో ఉత్తర తూర్పు ప్రాంతంలో తమిళ టైగర్లనూ, ఉత్తరాన జేవీపీ మిలిటెంట్లనూ ఆయన ప్రభుత్వం అణిచేసింది. పొలిట్ బ్యూరోలో ఒక సభ్యుడు మినహా జేవీపీ నాయకత్వం మొత్తాన్ని అంతం చేసింది. అయితే కనుమరుగైందనుకున్న జేవీపీ క్రమేపీ మళ్లీ బలం పుంజుకున్నా ఎప్పటిలాగే దాన్ని అంతర్గత సంక్షోభాలు చుట్టుముట్టాయి. చివరకు పార్లమెంటరీ పంథాకు మెజారిటీ వర్గం మొగ్గుచూపి భారత–శ్రీలంక సైనిక ఒప్పందాన్ని వ్యతిరేకించిన చంద్రికా కుమారతుంగకు మద్దతునిచ్చింది. ఆమె ప్రభుత్వంలో భాగస్వామి అయింది.చుట్టూతా ఒక్కో దేశమే చైనా ప్రభావంలో పడి భారత వ్యతిరేక రాగం అందుకుంటున్న వర్త మానంలో దిస్సనాయకే గెలుపు మన ప్రభుత్వానికి ఒక రకంగా సమస్యాత్మకమే. మైనారిటీలుగా ఉన్న లంక తమిళులకు స్వయంపాలన ఇచ్చే 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని మన దేశం చాన్నాళ్లుగా కోరుతోంది. కానీ రాజపక్స దాన్ని బేఖాతరు చేశారు. దిస్సనాయకే వైఖరి సైతం అదే. అదానీల 450 మెగావాట్ల పవన విద్యుత్ కాంట్రాక్టును రద్దు చేస్తామని ఎన్నికల సభల్లో ఆయన చెప్పాడు. దానికితోడు భావజాలం రీత్యా చైనాకు సన్నిహితుడు. ఆ దేశం ఇచ్చిన అప్పులే దేశాన్ని సంక్షోభంలోకి నెట్టాయని దిస్సనాయకేకు తెలియంది కాదు. 2022 సంక్షోభం అనంతరం మన దేశం లంకకు 400 కోట్ల డాలర్ల అత్యవసర రుణం మంజూరు చేయటంతోపాటు ఐఎంఎఫ్ రుణం రావటంలో కీలకపాత్ర పోషించింది. పదునైన దౌత్యం పరమ శత్రువులను సైతం గెల్చుకోగలదు. మొదట్లో తీవ్ర స్థాయి భారత వ్యతిరేక వైఖరి తీసుకున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమద్ మియిజూ ఇందుకు ఉదాహరణ. అందువల్ల అసాధ్యం కానిదేదీ లేదు. ఇంతవరకూ దిస్సనాయకే ఎత్తుగడలు గమనిస్తే ఆయన సవ్యంగా అడుగులు వేస్తారని అంచనా వేయొచ్చు. -
ప్రభాత్ స్పిన్... శ్రీలంక విన్
గాలే: లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (4/136; 5/68) స్పిన్ మాయాజాలంతో శ్రీలంకను గెలిపించాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టడంతో తొలి టెస్టులో ఆతిథ్య జట్టు 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై గెలిచింది. ఆఖరి రోజు లాంఛనం ముగిసేందుకు 3.4 ఓవర్లే సరిపోయాయి. ప్రభాత్ తన వరుస ఓవర్లలోనే మిగతా రెండు వికెట్లను పడేయడంతో కివీస్ ఐదోరోజు ఆటలో కేవలం 4 పరుగులే చేయగలిగింది. దీంతో ఓవర్నైట్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు సోమవారం 207/8 ఓవర్నైట్ స్కోరుతో చివరిరోజు ఆటకొనసాగించిన కివీస్ ఆలౌట్ అయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. 70వ ఓవర్ వేసిన ప్రభాత్ జయసూర్య స్పిన్ను ఎదుర్కోలేక రచిన్ రవీంద్ర (168 బంతుల్లో 92; 9 ఫోర్లు, 1 సిక్స్) తన క్రితం రోజు స్కోరుకు కేవలం పరుగు మాత్రమే జోడించి వికెట్ల ముందు దొరికిపోయాడు. మళ్లీ తన తదుపరి ఓవర్లో ప్రభాత్... ఆఖరి వరుస బ్యాటర్ విలియమ్ ఓ రూర్కే (0)ను బౌల్డ్ చేయడంతో 71.4 ఓవర్లలో 211 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్కు తెరపడింది. తొలి ఇన్నింగ్స్లో లంక 305 పరుగులు చేయగా, కివీస్ 340 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యం సంపాదించింది. కానీ రెండో ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు (309) మూడొందల పైచిలుకు పరుగులు చేయడంతో ఉపఖండపు స్పిన్ పిచ్లపై 275 పరుగుల లక్ష్యం న్యూజిలాండ్కు అసాధ్యమైంది. ఇదే వేదికపై చివరి రెండో టెస్టు ఈ నెల 26 నుంచి 30 వరకు జరుగుతుంది. -
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిస్సనాయకే ప్రమాణ స్వీకారం
కొలంబో: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత అనూర కుమార దిస్సనాయకే (56) సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి సచివాలంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య దస్సనాయకేతో ప్రమాణం చేయించారు .కాగా శ్రీలంకకు అనూర కుమార దిస్సనాయకే తొమ్మిదో అధ్యక్షుడు కాగా.. తొలి వామపక్ష అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.ప్రమాణ స్వీకారం అనంతరం దిస్సనాయకే మాట్లాడుతూ.. రాజకీయ నాయకులపై ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. ‘నేనేం మాంత్రికుడిని కాదు, నాకు తెలిసినవి, తెలియని విషయాలు ఉన్నాయి. ఉత్తమ సలహాలు తీసుకొని మంచి నేతగా పనిచేసేందుకు కృష్టి చేస్తాను, అందుకు నాకు అందరి సహాకారం అవసరం’ అని పేర్కొన్నారు.కాగా అదివారం వెలువడిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జనతా విముక్తి పెరమున అధినేత అయిన దిస్సనాయ తన సమీప ప్రత్యర్థి, ఎస్జేబీ నేత సజిత్ ప్రేమదాసపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (75) తొలి రౌండ్లోనే వైదొలిగారు. చదవండి: ఇజ్రాయెల్ విధ్వంసం.. హమాస్ చీఫ్ మృతిశ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం జరగ్గా.. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో దిస్సనాయకే 42.31% ఓట్లతో తొలి స్థానంలో, ప్రేమదాస 32.8 శాతంతో రెండో స్థానంలో నిలవగా విక్రమసింఘే 17.27 శాతంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఏ ఒక్కరికీ విజయానికి కావాల్సిన 50 శాతం రాకపోవడంతో ద్వితీయ ప్రాధమ్య ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను తేల్చారు. శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిస్సనాయకే సోమవారం ప్రమాణం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) ప్రకటించింది. దిస్సనాయకేకు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. -
ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..!
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఆసియా దేశాలైన భారత్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇరగదీస్తున్నాయి. టెస్ట్ హోదా కలిగిన ఐదు దేశాల్లో ఒక్క పాక్ మినహా మిగతా నాలుగు దేశాలు అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. వీటిలో భారత్ తిరుగులేని శక్తిగా దూసుకుపోతుండగా.. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారాయి. భారత్ ప్రత్యర్ధి ఎవరైనా చీల్చిచెండాడుతుండగా.. మిగతా మూడు దేశాలు తమకంటే మెరుగైన ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి.భారత్ విషయానికొస్తే.. శ్రీలంక చేతిలో ఇటీవల వన్డే సిరీస్లో పరాజయం మినహా టీమిండియా అపజయమనేదే ఎరుగదు. టీ20 వరల్డ్కప్లో జగజ్జేతగా అవతరించిన అనంతరం భారత్ ఎదుర్కొన్న తొలి సిరీస్ పరాజయం అది.శ్రీలంక విషయానికొస్తే.. ఈ ద్వీప దేశం ఇటీవలికాలంలో మెరుగైన క్రికెట్ ఆడుతుంది. కొత్త కోచ్ సనత్ జయసూర్య ఆథ్వర్యంలో ఈ జట్టు సంచలన విజయాలు సాధిస్తుంది. భారత్పై మూడు మ్యాచ్ సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అనంతరం ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయినప్పటికీ.. చివరి టెస్ట్లో అబ్బురపడే విజయాన్ని సాధించింది. తాజాగా శ్రీలంక స్వదేశంలో న్యూజిలాండ్కు తొలి టెస్ట్లో షాకిచ్చింది. ఇవాళ (సెప్టెంబర్ 23) ముగిసిన మ్యాచ్లో శ్రీలంక 63 పరుగుల తేడాతో కివీస్ను చిత్తు చేసింది.ఆఫ్ఘనిస్తాన్ విషయానికొస్తే.. ఒకప్పటి క్రికెట్ పసికూన ఇప్పుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఈ జట్టు 2023 వన్డే వరల్డ్కప్ నుంచి హేమీహేమీ జట్లన్నిటికీ షాకిస్తూ లెజెండ్ కిల్లర్గా మారింది. టీ20 వరల్డ్కప్లో సెమీఫైనల్ వరకు చేరిన ఆఫ్ఘన్లు.. అక్కడ సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవానికి తాజాగా ప్రతీకారం తీర్చుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది.బంగ్లాదేశ్ విషయానికొస్తే.. తమదైన రోజున ఈ జట్టు ఆటగాళ్లను ఎంత మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. బంగ్లాదేశ్ ఇటీవల పాక్లో పర్యటించి ఆతిథ్య దేశాన్నే 2-0 తేడాతో (టెస్ట్ సిరీస్లో) మట్టికరిపించింది. తాజాగా బంగ్లాదేశ్ పటిష్టమైన టీమిండియా చేతిలో ఓడింది కాని, ప్రదర్శన ప్రకారం పర్వాలేదనిపించింది. చదవండి: ఐదేసిన జయసూర్య.. న్యూజిలాండ్ను ఖంగుతినిపించిన శ్రీలంక -
ఐదేసిన జయసూర్య.. న్యూజిలాండ్ను ఖంగుతినిపించిన శ్రీలంక
గాలే వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంక 63 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ చివరి రోజు న్యూజిలాండ్ గెలవాలంటే 68 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక గెలుపుకు కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. ఈ దశలో ఐదో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఓవర్నైట్ స్కోర్కు (207/8) మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి, మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. ఆఖరి రోజు తొలి నాలుగు ఓవర్లలో న్యూజిలాండ్ చేతులెత్తేయడం నిరాశ కలిగించింది.ఓవర్నైట్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (91) పోరాడతాడని అంతా అనుకున్నారు. అయితే అది జరగలేదు. అతను ఓవర్నైట్ స్కోర్కు మరో పరుగు మాత్రమే జోడించి తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. ప్రభాత జయసూర్య రచిన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. చివరి వికెట్ విలియమ్ ఓరూర్కీను కూడా జయసూర్యనే క్లీన్ బౌల్డ్ చేశాడు. 344 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 211 పరుగుల వద్ద ముగిసింది.ప్రభాత జయసూర్య ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. రమేశ్ మెండిస్ 3, అశిత ఫెర్నాండో, ధనంజయ డిసిల్వ తలో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో రచిన్తో పాటు టామ లాథమ్ (28), కేన్ విలియమ్సన్ (30), టామ్ బ్లండెల్ (30) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.రాణించిన కరుణరత్నే, చండీమల్, మాథ్యూస్అంతకుముందు శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే (83), చండీమల్ (61), ఏంజెలో మాథ్యూస్ (50) అర్ద సెంచరీలతో రాణించారు. అజాజ్ పటేల్ ఆరు వికెట్లు తీసి శ్రీలంక ఇన్నింగ్స్ను దెబ్బకొట్టాడు. విలియమ్ ఓరూర్కీ 3, సాంట్నర్ ఓ వికెట్ పడగొట్టారు.లాథమ్, విలియమ్సన్, మిచెల్ ఫిఫ్టీలున్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో టామ్ లాథమ్ (70), కేన్ విలియమ్సన్ (55), డారిల్ మిచెల్ (57) అర్ద సెంచరీలతో రాణించారు. ఫలితంగా ఆ జట్టు 340 పరుగులకు ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్), రచిన్ రవీంద్ర (39), టామ్ బ్లండెల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4, రమేశ్ మెండిస్ 3, ధనంజయ డిసిల్వ 2 వికెట్లు పడగొట్టారు.కమిందు సెంచరీఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 305 పరుగులు చేసి ఆలౌటైంది. కమిందు మెండిస్ (114) సెంచరీ.. కుసాల్ మెండిస్ (50) అర్ద సెంచరీ చేసి శ్రీలంకకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కివీస్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 5 వికెట్లతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్, అజాజ్ పటేల్ తలో 2, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు.చదవండి: క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా -
శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకే
కొలంబో: శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనూర కుమార దిస్సనాయకే (56) విజయం సాధించారు. దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా రెండో రౌండ్ ఓట్ల లెక్కింపులో ఫలితం తేలడం విశేషం. జనతా విముక్తి పెరమున అధినేత అయిన దిస్సనాయకే తన సమీప ప్రత్యరి్థ, ఎస్జేబీ నేత సజిత్ ప్రేమదాసపై విజయం సాధించారు. అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (75) తొలి రౌండ్లోనే వైదొలి గారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో దిస్సనాయకే 42.31% ఓట్లతో తొలి స్థానంలో, ప్రేమదాస 32.8 శాతంతో రెండో స్థానంలో నిలవగా విక్రమసింఘే 17.27 శాతంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఏ ఒక్కరికీ విజయానికి కావాల్సిన 50 శాతం రాకపోవడంతో ద్వితీయ ప్రాధమ్య ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను తేల్చారు. శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిస్సనాయకే సోమవారం ప్రమాణం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) ప్రకటించింది. దిస్సనాయకేకు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.ఏకేడీ.. ఎట్టకేలకు! ఏకేడీగా పిలుచుకునే అనూర దిస్సనాయకే నార్త్ సెంట్రల్ ప్రావిన్స్ లోని థంబుట్టెగామలో జన్మించారు. కొలంబో సమీపంలోని కెలనియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుకున్నారు. 1987లో జేవీపీలో చేరారు. 1971, 1987, 1990ల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకు జేవీపీ హింసా మార్గం తొక్కింది. ఇది భారత వ్యతిరేకి కూడా. అప్పట్లో రాజీవ్ గాం«దీ–జయవర్థనే ప్రభుత్వాల ఒప్పందం శ్రీలంక సార్వ¿ౌమత్వానికి భంగకరమని భావించేది. గత ఫిబ్రవరిలో దిస్సనాయకే భారత్లో పర్యటించాక పార్టీ వైఖరిలో మార్పువచి్చంది. 90ల్లో జేవీపీ ప్రజాస్వామ్య విధానాల పట్ల మొగ్గాక పారీ్టలో దిస్సనాయకేకు ప్రాధాన్యం పెరిగింది. 2000 ఎన్నికల్లో మొదటిసారి ఎంపీ అయ్యారు. 2014లో పార్టీ అధ్యక్షుడయ్యారు. 2019 ఎన్నికల్లో జేవీపీకి దక్కిన ఓట్లు కేవలం మూడు శాతమే. -
రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్
న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య గాలే వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రసవత్తకరంగా సాగుతోంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే మరో 68 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక గెలుపుకు కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. మరో రోజు ఆట మిగిలి ఉంది. ప్రస్తుతమున్న అవకాశాల ప్రకారం.. శ్రీలంకకే విజయావకాశాలు అధికంగా ఉన్నా.. కివీస్ను కూడా విస్మరించడానికి వీలు లేని పరిస్థితి ఉంది. కివీస్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర (91 నాటౌట్) క్రీజ్లో పాతుకుపోయి ఉన్నాడు. అజాజ్ పటేల్ (0 నాటౌట్), విలియమ్ ఓరూర్కీ సాయంతో అతను న్యూజిలాండ్ను గెలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రచిన్కు లోయర్ ఆర్డర్లో ఏ ఒక్కరి నుంచి సహకారం లభించినా పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు. బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న గ్లెన్ ఫిలిప్స్ (4), మిచెల్ సాంట్నర్ (2), టిమ్ సౌథీ (2) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. టాపార్డార్లో డెవాన్ కాన్వే (4), డారిల్ మిచెల్ (8) సైతం తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. టామ లాథమ్ (28), కేన్ విలియమ్సన్ (30), టామ్ బ్లండెల్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. అశిత ఫెర్నాండో, ధనంజయ డిసిల్వ చెరో వికెట్ దక్కించుకున్నారు.రాణించిన కరుణరత్నే, చండీమల్, మాథ్యూస్అంతకుముందు శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే (83), చండీమల్ (61), ఏంజెలో మాథ్యూస్ (50) అర్ద సెంచరీలతో రాణించారు. అజాజ్ పటేల్ ఆరు వికెట్లు తీసి శ్రీలంక ఇన్నింగ్స్ను దెబ్బకొట్టాడు. విలియమ్ ఓరూర్కీ 3, సాంట్నర్ ఓ వికెట్ పడగొట్టారు.లాథమ్, విలియమ్సన్, మిచెల్ ఫిఫ్టీలున్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో టామ్ లాథమ్ (70), కేన్ విలియమ్సన్ (55), డారిల్ మిచెల్ (57) అర్ద సెంచరీలతో రాణించారు. ఫలితంగా ఆ జట్టు 340 పరుగులకు ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్), రచిన్ రవీంద్ర (39), టామ్ బ్లండెల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4, రమేశ్ మెండిస్ 3, ధనంజయ డిసిల్వ 2 వికెట్లు పడగొట్టారు.కమిందు సెంచరీఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 305 పరుగులు చేసి ఆలౌటైంది. కమిందు మెండిస్ (114) సెంచరీ.. కుసాల్ మెండిస్ (50) అర్ద సెంచరీ చేసి శ్రీలంకకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కివీస్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 5 వికెట్లతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్, అజాజ్ పటేల్ తలో 2, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: సాయి సుదర్శన్ పోరాటం వృధా.. దులీప్ ట్రోఫీ 2024 విజేత ఇండియా-ఏ -
శ్రీలంకలో పోలింగ్ ప్రశాంతం
కొలంబో: శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి హింసాత్మక ఘటనలూ నమోదు కాలేదు. చివరి సమాచారం అందేసరికి 75 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియను ఈయూ, కామన్వెల్త్ తదితర దేశాల నుంచి 100 మందికి పైగా అంతర్జాతీయ పరిశీలకులు పర్యవేక్షిస్తున్నారు. 38 మంది బరిలో దిగినా ప్రధాన పోటీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, విపక్ష నేత సజిత్ ప్రేమదాసతో పాటు జనాదరణతో దూసుకుపోతున్న జనతా విముక్తి పెరమున (జేవీపీ) చీఫ్ అనూర కుమార దిస్సనాయకె మధ్యే నెలకొనడం తెలిసిందే. రేసులో దిస్సనాయకె ముందున్నట్టు ముందస్తు సర్వేలన్నీ తేల్చాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓటర్లు ముగ్గురు అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమంలో ఓటేస్తారు. పూర్తి మెజారిటీ సాధించే అభ్యర్థి విజేత అవుతాడు. -
శ్రీలంకవైపు ఇండియన్ సినిమా చూపు
శ్రీలంక అడవుల్లో రిస్కీ ఫైట్స్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విజయ్ దేవరకొండ ఇటీవల శ్రీలంక వెళ్లొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య శ్రీలంకలో జరిగింది. అక్కడ ఓ భారీ రిస్కీ ఫైట్ని చిత్రీకరించారని సమాచారం. అటు బాలీవుడ్ వైపు వెళితే... అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో రానున్న హారర్ కామెడీ చిత్రంలోని కీలక సన్నివేశాలను శ్రీలంకలో చిత్రీకరిస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దక్షిణాసియా చిత్రాలు కూడా లంకలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.లంకలో ప్యారడైజ్మద్రాస్ టాకీస్ బ్యానర్పై ప్రముఖ దర్శకుడు మణిరత్నం సమర్పణలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ప్యారడైజ్’ను పూర్తిగా శ్రీలంకలోనే చిత్రీకరించారు. మలయాళ నటుడు రోషన్ మ్యాథ్యూ ఇందులో హీరోగా నటిస్తే ప్రముఖ శ్రీలంక దర్శకుడు ప్రసన్న వితనకే డైరెక్ట్ చేశారు. ఇక మమ్ముట్టి, మోహన్ లాల్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్పైకి వెళ్లనున్న మలయాళం మూవీని 30 రోజుల పాటు శ్రీలంకలోనే షూట్ చేయనున్నురు. ఈ చిత్రానికి లంక ప్రభుత్వం ఎంతటిప్రాధాన్యత ఇచ్చిందంటే నిర్మాత, దర్శకుడితో ఆ దేశ ప్రధానమంత్రి నినేష్ గుణవర్దెన నేరుగా చర్చలు జరిపారు. ఇక ఫ్యూచర్ప్రాజెక్ట్స్కు షూటింగ్ లొకేషన్ గా శ్రీలంకను ఎంచుకోవాలని మలయాళ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ భావిస్తోంది.ఇండియన్ సినిమాకి రెడ్ కార్పెట్ఒకప్పుడు శ్రీలంకలో సినిమా షూటింగ్స్ వ్యవహారం ఓ ప్రహసనంలా సాగేది. దేశ, విదేశీ సినిమాల షూటింగ్స్ అనుమతుల కోసం 41 ప్రభుత్వ విభాగాలను సంప్రదించాల్సి వచ్చేది. దీంతో భారత్తో పాటు ఇతర దేశాల చిత్ర నిర్మాతలు లంక లొకేషన్స్ కు దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు 2022 నాటి ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని రోడ్డున పడేసింది. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పునర్నిర్మించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. అప్పటివరకు టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉన్న శ్రీలంకకు పర్యాటకులు రావడం కూడా తగ్గిపోయింది.దేశాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నో మార్గాలు అన్వేషించిన లంక పాలకులకు భారతీయ సినీ రంగుల ప్రపంచం జీవనాడిలా కనిపించింది. మళ్లీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు సినిమా షూటింగ్స్తో దేశాన్ని కళకళలాడేలా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సినిమా షూటింగ్స్ కోసం తమ దేశంలో అడుగుపెట్టే ఎవరికైనా సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్నిప్రారంభించింది. ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ కోసం అనుమతులను వేగవంతం చేసింది. భారతీయ సినీ ప్రముఖులకు అక్కడి టూరిజం ప్రమోషన్ బ్యూరో రెడ్ కార్పెట్ పరిచింది. దీంతో ఇండియన్ మూవీ షూటింగ్స్కు శ్రీలంక కేరాఫ్ అడ్రెస్గా మారిపోయిందిఆర్థిక అస్త్రంగా...ఫిల్మ్ టూరిజాన్ని లంక ప్రభుత్వం ఆర్థిక అస్త్రంగా ఎంచుకోవడం వెనక మరో కారణం కూడా ఉంది. ఇండియన్ మూవీస్ అంటే సింహళీయుల్లో విపరీతమైన క్రేజ్. బాలీవుడ్తో పాటు ఇతర భారతీయ చిత్రాలు లంక థియేటర్స్లో నిత్యం స్క్రీనింగ్ అవుతాయి. షూటింగ్స్ కోసం భారతీయ సినీ ప్రముఖులు లంక బాటపడితే దేశ పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపు వస్తుంది. విదేశీ మారక ద్రవ్యం కూడా పెరుగుతుంది. లంక ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికకు తగ్గట్టుగానే షూటింగ్స్ కోసం ఇండియన్ డైరెక్టర్స్,ప్రోడ్యూసర్స్ లంక వైపు చూస్తున్నారు. ఆ దేశం కల్పించే ప్రత్యేక సదుపాయాలను ఉపయోగించుకుంటూ అందమైన లంక లొకేషన్స్ ను షూటింగ్ స్పాట్స్గా మార్చేశారు. ఒక రకంగా లంక ఎకానమీకి భారతీయ చిత్ర పరిశ్రమ వెన్నెముకగా మారిపోయింది. – ఫణికుమార్ అనంతోజు శ్రీలంక పిలుస్తోంది.... రారమ్మంటోంది.... అందుకే ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫిల్మ్స్ శ్రీలంకకు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్... ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీలంక వైపు చూస్తోంది. సినిమా షూటింగ్స్ కోసం ఏకంగా శ్రీలంక ప్రధానమంత్రితో కూడా భారతీయ సినీ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఒకప్పుడు విదేశాల్లో షూటింగ్స్ అంటే అమెరికాతో పాటు యూరప్ దేశాల పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా రూటు మార్చింది. ఆ విశేషాల్లోకి...పచ్చందనమే... పచ్చందమనే పచ్చదనమే అన్నట్లు... శ్రీలంక గ్రీనరీతో అందంగా ఉంటుంది. పాటల చిత్రీకరణకు బెస్ట్ ప్లేస్. ఫైట్లు తీయడానికి దట్టమైన అడవులు ఉండనే ఉన్నాయి. అలాగే అబ్బురపరిచే చారిత్రక కట్టడాలూ, కనువిందు చేసే సముద్ర తీరం ఉన్నాయి. వీటికి తోడు భారతీయులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉండటంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ను తమ దేశంవైపు తిప్పుకుంటోంది లంక సర్కార్. శ్రీలంకలో గతంలోనూ షూటింగ్స్ జరిగాయి. అక్కడ షూట్ చేయడం కొత్త కాకపోయినా ఆ దేశం భారతీయ చిత్ర నిర్మాణాలకు ఇప్పుడు సింగిల్ డెస్టినేషన్ గా మారిపోయిందని అనొచ్చు. 2022 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతున్న శ్రీలంక గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫిల్మ్ టూరిజాన్ని ్రపోత్సహిస్తూ తమ దేశ ఎకానమీకి ఊతమిచ్చే ప్రయత్నాలు చేస్తోంది. -
#SriLankaElections: లంకలో ముక్కోణపు పోరు!
కల్లోల శ్రీలంకలో కీలకమైన అధ్యక్ష ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. శనివారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. పెను రాజకీయ రగడకు దారితీసి దేశాన్ని కుప్పకూలి్చన 2022 ఆర్థిక సంక్షోభం అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలివి. మాజీ ఆర్మీ చీఫ్ శరత్పోన్సెకాతో పాటు 38 మంది బరిలో ఉన్నా ప్రధాన పోరు మాత్రం ముగ్గురి మధ్యే కేంద్రీకృతమైంది. అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె, విపక్ష నేత సజిత్ ప్రేమదాస, జనాదరణతో దూసుకుపోతున్న అనూర కుమార దిస్సనాయకె అమీతుమీ తేల్చుకోనున్నారు. 1982 తర్వాత శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడం ఇదే తొలిసారి. ముగ్గుర్లో అనూరకే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఎవరు నెగ్గినా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది దేశాన్ని గాడిన పెట్టడం పెను సవాలుగానే కనిపిస్తోంది. మోయలేని భారంగా మారిన 300 కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ అప్పు భయపెడుతున్న నేపథ్యంలో ఎకానమీయే ప్రధాన అభ్యర్థులందరికీ ప్రధాన ఎన్నికల అంశంగా మారింది... ప్రచారమంతా ఐఎంఎఫ్ రుణం చుట్టే... 2022 సంక్షోభం అనంతరం లంకను ఆదుకోవడానికి ఏ దేశమూ పెద్దగా ముందుకు రాలేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 290 కోట్ల డాలర్ల రుణం సాధించడం రణిల్ సాధించిన ఘనవిజయమని ఆయన మద్దతుదారులు చెప్పుకుంటున్నారు. కానీ అందుకోసం ప్రజల బతుకులనే పణంగా పెట్టారని, సంక్షేమ పథకాలన్నింటికీ కోత పెట్టి వారిని రోడ్డు పాలు చేశారని ప్రత్యర్థులు దుయ్యబడుతున్నారు. ఈ రెండేళ్లలో ద్రవ్యోల్బణం 74 శాతం పెరగడం రణిల్ అసమర్థ పాలన ఫలితమేనని మండిపడుతున్నారు. నిజానికి 2022 నాటి ఆర్థిక సంక్షోభానికి బీజాలు అంతకు పన్నెండేళ్ల ముందే పడ్డాయి. 2009లో అంతర్యుద్ధం ముగిశాక పునరి్నర్మాణం, అభివృద్ధి పథకాలకు లంక విపరీతంగా అప్పులు చేసింది. 2020 నాటికే వాటిని తీర్చలేని పరిస్థితికి చేరుకుంది. పులిమీద పుట్రలా కరోనా వచి్చపడటంతో ప్రధాన ఆదాయ వనరైన పర్యాటకం పూర్తిగా నిలిచిపోయి గుడ్లు తేలేసింది. 2022 నాటికి చమురు ధరలు ఆకాశాన్నంటడం, అమెరికా వడ్డీ రేట్లు అమాంతంగా పెంచేయడంతో పూర్తిగా చేతులెత్తేసింది. అంతర్జాతీయ రుణ భారం 5,100 కోట్లు దాటేసింది. చమురుతో పాటు తిండి గింజలు, ఔషధాల వంటి అత్యవసరాలను కూడా దిగుమతి చేసుకోలేని దుస్థితికి దిగజారింది. ద్రవ్యోల్బణం దెబ్బకు ఒక్క గుడ్డు ధర ఏకంగా 300 రూపాయలు దాటేసింది. కడుపు కాలిన ప్రజలు రాజపక్స సర్కారుపై తిరగబడ్డారు. జనాగ్రహానికి జడిసి ఆయన దేశం వీడి పలాయనం చిత్తగించాక అన్ని పక్షాల అంగీకారంతో రణిల్ గద్దెనెక్కారు. ఐఎంఎఫ్ రుణానికి బదులుగా సంక్షేమ పథకాల్లో భారీ కోతకు ఆయన అంగీకరించడంతో కరెంటు తదితరాలపై సబ్సిడీలు అటకెక్కాయి. వ్యాట్ మోత రెండింతలైంది. పేదరికం రెట్టింపైంది. కాకపోతే ఆర్థిక సంక్షోభం నుంచి దేశం కాస్తో కూస్తో తేరుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
న్యూజిలాండ్తో తొలి టెస్ట్.. రాణించిన కరుణరత్నే, చండీమల్
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక పట్టు సాధించే దిశగా ముందుకెళ్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రీలంక 202 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.రాణించిన కరుణరత్నే, చండీమల్కరుణరత్నే (83), చండీమల్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్కు గట్టి పునాది పడింది. పథుమ్ నిస్సంక (2) ఆదిలోనే ఔటైనా వీరిద్దరు రెండో వికెట్కు 147 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఏంజెలో మాథ్యూస్ (34), ధనంజయ డిసిల్వ (34) క్రీజ్లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన కమిందు మెండిస్ తక్కువ స్కోర్కే (13) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక ఇన్నింగ్స్ను దెబ్బకొట్టిన విలియమ్ ఓరూర్కీ సెకెండ్ ఇన్నింగ్స్లోనూ తన మార్కు చూపిస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్లో అతను ఇప్పటికే మూడు వికెట్లు పడగొట్టాడు. అజాజ్ పటేల్కు ఓ వికెట్ దక్కింది.లీడ్ సాధించిన న్యూజిలాండ్అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 340 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (70), కేన్ విలియమ్సన్ (55), డారిల్ మిచెల్ (57) అర్ద సెంచరీలతో రాణించారు. గ్లెన్ ఫిలిప్స్ 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. రచిన్ రవీంద్ర (39), టామ్ బ్లండెల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4, రమేశ్ మెండిస్ 3, ధనంజయ డిసిల్వ 2 వికెట్లు పడగొట్టారు.కమిందు సెంచరీ.. ఐదేసిన రూర్కీకమిందు మెండిస్ సెంచరీతో (114) కదంతొక్కడంతో ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 305 పరుగులు చేయగలిగింది. కుసాల్ మెండిస్ (50) అర్ద సెంచరీతో రాణించాడు. నిస్సంక (27), చండీమల్ (30), మాథ్యూస్లకు (36) మంచి స్టార్ట్ లభించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. కెరీర్లో రెండో టెస్ట్ ఆడుతున్న రూర్కీ ఐదు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టాడు. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ తలో రెండు, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: బంగ్లాతో తొలి టెస్ట్.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా -
టీ20 వరల్డ్కప్ కోసం శ్రీలంక జట్టు ప్రకటన
మహిళల టీ20 వరల్డ్కప్ కోసం 15 మంది సభ్యుల శ్రీలంక క్రికెట్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 20) ప్రకటించారు. ఈ జట్టుకు చమారీ ఆటపట్టును కెప్టెన్గా ఎంపిక చేశారు. 38 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ ఇనోకా రణవీర వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకుంది. యువ ఓపెనర్ విష్మి గుణరత్నే, మిడిలార్డర్ బ్యాటర్లు కవిషా దిల్హరి, హర్షిత సమరవిక్రమ జట్టులో చోటు నిలబెట్టుకున్నారు.కాగా, టీ20 వరల్డ్కప్-2024 కోసం ఇప్పటివరకు తొమ్మిది దేశాలు (భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక) తమతమ జట్లను ప్రకటించాయి. స్కాట్లాండ్ ఒక్కటి జట్టును ప్రకటించాల్సి ఉంది. ప్రపంచకప్ గ్రూప్-ఏలో భారత్, శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పోటీపడనున్నాయి. గ్రూప్-బిలో స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి. వరల్డ్కప్ మ్యాచ్లు అక్టోబర్ 3 నుంచి మొదలవుతాయి. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తలపడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 4న (న్యూజిలాండ్తో) ఆడనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న జరునుంది. షార్జా, దుబాయ్ వేదికలుగా టీ20 వరల్డ్కప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 20న జరిగే ఫైనల్తో ముగుస్తుంది.టీ20 ప్రపంచ కప్ 2024 కోసం శ్రీలంక జట్టు: చమారీ ఆటపట్టు (కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, హాసిని పెరీరా, అనుష్క సంజీవని, సచినీ నిసంసాలా, ఉదేశిక ప్రబోధనీ, ఇనోషి ఫెర్నాండో, అచిని కులసూర్య, ఇనోకా రణవీర, శశిని గింహని, అమా కాంచన, సుగందిక కుమారి [ట్రావెలింగ్ రిజర్వ్: కౌశిని నుత్యాంగన]చదవండి: భారత బౌలర్ల విజృంభణ.. 149 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్ -
మహిళా క్రికెటర్తో ‘బంధం’.. శ్రీలంక మాజీ ప్లేయర్కు భారీ షాక్!
శ్రీలంక మాజీ క్రికెటర్ దులిప్ సమరవీరకు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాలో కోచ్గా పనిచేస్తున్న అతడిపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 20 ఏళ్ల నిషేధం విధించింది. ఫలితంగా.. రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియాలో ఏ స్థాయిలోనూ అతను పనిచేయడానికి వీలుండదు. ప్రస్తుతం విక్టోరియా రాష్ట్ర మహిళల జట్టుకు హెడ్కోచ్గా పనిచేస్తున్న సమరవీర.. ఓ మహిళా క్రికెటర్తో బలవంతంగా సంబంధం పెట్టుకోవడంపై సీఏ కన్నెర్ర చేసింది. అంతేకాదు.. సమరవీర తీవ్రమైన అతిక్రమణకు పాల్పడ్డాడని ఆగ్రహించింది. ఇది సీఏ నియమావళికి విరుద్ధమని, క్రికెట్ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను అసీస్ బోర్డు ఉపేక్షించదని ఒక ప్రకటనలో పేర్కొంది. 2008 నుంచి ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో కాగా సమరవీర 1993–1995 మధ్య కాలంలో శ్రీలంక తరఫున ఏడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడాడు. తదనంతరం 2008లో ఆస్ట్రేలియాలో కోచింగ్ బృందంలో చేరాడు. మొదట క్రికెట్ విక్టోరియా మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్గా పనిచేశాడు. సుదీర్ఘకాలం పాటు విక్టోరియా జట్టుకు సేవలందించాడు. అదే విధంగా.. మహిళల బిగ్బాష్లో మెల్బోర్న్ స్టార్స్కు కోచ్గా పనిచేశాడు. రెండు వారాల క్రితం విక్టోరియా సీనియర్ మహిళల జట్టుకు హెడ్కోచ్గా నియమించారు. కానీ ఓ మహిళా క్రికెటర్తో పెట్టుకున్న అనుచిత సంబంధం ఆస్ట్రేలియాతో బంధాన్నే తెగదెంపులు చేసింది. నిషేధం కారణంగా.. అతడు రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియాలో ఏ స్థాయి జట్టుకు, లీగ్లకు, అకాడమీకి, బోర్డుకు పనిచేయడానికి వీలుండదు. చదవండి: రూ. 45 లక్షలు ఇస్తేనే భారత్కు ఆడతా.. కారణం చెప్పిన నగాల్ -
SL vs NZ 1st TEST: ఐదేసిన రూర్కీ .. శ్రీలంక 305 ఆలౌట్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ యువ ఫాస్ట్ బౌలర్ విలియమ్ ఓరూర్కీ ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/55) చెలరేగాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 305 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోర్ 302/7 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మరో మూడు పరుగులు మాత్రమే జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఒక ఓవర్ ముగిసిన అనంతరం వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మ్యాచ్కు అంతరాయం కలిగించింది. టామ్ లాథమ్ 1, డెవాన్ కాన్వే 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.కమిందు సెంచరీతొలి ఇన్నింగ్స్లో కమిందు మెండిస్ (114) సూపర్ సెంచరీతో చెలరేగాడు. తద్వారా శ్రీలంక గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. వికెట్కీపర్ కుసాల్ మెండిస్ (50) అర్ద సెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో రూర్కీ ఐదేయగా.. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ తలో రెండు, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు.చదవండి: SL vs NZ: శతక్కొట్టిన కమిందు మెండిస్.. శ్రీలంక తొలి ప్లేయర్గా.. -
కివీస్తో తొలి టెస్టు.. శ్రీలంక తుది జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
ఓవల్ టెస్టులో ఇంగ్లండ్పై చారిత్రాత్మక విజయం సాధించిన శ్రీలంక.. ఇప్పుడు మరో సవాల్కు సిద్దమైంది. తమ స్వదేశంలో న్యూజిలాండ్తో రెండు మ్యాచ్ల టెస్టుల సిరీస్లో లంక తలపడనుంది. వరల్డ్టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 సైకిల్లో భాగంగా జరగనుంది.ఈ సిరీస్లో తొలి టెస్టు బుధవారం(సెప్టెంబర్ 18) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం తమ ప్లేయింగ్ ఎలెవన్ను శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ తుది జట్టులో స్పిన్నర్ రమేశ్ మెండిస్కు చోటు దక్కింది. అతడు లంక తరపున మళ్లీ ఏడాది తర్వాత ఆడుతున్నాడు.మెండిస్ చివరిసారిగా జూలై 2023లో టెస్టు మ్యాచ్ ఆడాడు. కాగా శ్రీలంక తొలి టెస్టులో కేవలం ఇద్దరూ పేస్ బౌలర్లతో మాత్రమే ఆడనుంది. లహిరు కుమార, అసిత ఫెర్నాండో కొత్త బంతిని పంచుకోనున్నారు. ఇంగ్లండ్ సిరీస్లో దుమ్ములేపిన కమిందు మెండిస్, పాతుమ్ నిస్సాంకలు కూడా ఈ తుది జట్టులో ఉన్నారు.తొలి టెస్టుకు శ్రీలంక ప్లేయింగ్ ఎలెవన్: దిముత్ కరుణరత్నే, పాతుమ్ నిస్సాంక, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్, రమేష్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండో.చదవండి: శ్రేయస్ అయ్యర్కు మరో బిగ్షాక్!? -
ఐసీసీ అవార్డులలో సత్తాచాటిన శ్రీలంక ప్లేయర్స్..
అంతర్జాతీయ క్రికెట్లో ప్రతీ నెలా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పురుష, మహిళ క్రికెటర్లకు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ది మంత్' అవార్డులను ఇస్తుంది. తాజాగా ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ది మంత్ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. ఈ అవార్డులలో శ్రీలంక ప్లేయర్స్ సత్తాచాటారు.పురుషుల, మహిళల విభాగాల్లో రెండు అవార్డులు కూడా శ్రీలంకకే దక్కడం గమనార్హం. మెన్స్ కేటగిరీలో లంక యువ స్పిన్ సంచలనం దునీత్ వెల్లలాగే, మహిళల క్రికెట్ విభాగంలో శ్రీలంక స్టార్ బ్యాటర్ హర్షిత సమరవిక్రమ ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు.అదరగొట్టిన దునీత్..గత నెలలో స్వదేశంలో భారత్తో జరిగిన వన్డే సిరీస్లో వెల్లలాగే కీలక పాత్ర పోషించాడు. లంక సిరీస్ను సొంతం చేసుకోవడంలో వెల్లలాగే కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో వెల్లలాగే 133 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు. అందులో ఓ ఫైవ్ వికెట్ హాల్ కూడా ఉంది. ఈ క్రమంలోనే అతడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. తద్వారా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ది మంత్ అవార్డు అందుకున్న ఐదో లంక ఆటగాడిగా దునీత్ నిలిచాడు. ఈ జాబితాలో ఏంజెలో మాథ్యూస్ (మే 2022), ప్రబాత్ జయసూర్య (జూలై 2022), వనిందు హసరంగా (జూన్ 2023), కమిందు మెండిస్ (మార్చి 2024) ఉన్నారు. మరోవైపు లంక మహిళా క్రికెటర్ హర్షిత సమరవిక్రమ ఐర్లాండ్ పర్యటనలో అదరగొట్టింది.చదవండి: కోహ్లిని చూసి నేర్చుకో బాబర్.. లేకుంటే కష్టమే: యూనిస్ ఖాన్ -
న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక జట్టు ప్రకటన
సెప్టెంబర్ 18 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (సెప్టెంబర్ 16) ప్రకటించారు. ఈ సిరీస్లో ధనంజయ డిసిల్వ శ్రీలంకను లీడ్ చేయనున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ ఒషాడా ఫెర్నాండో చాలాకాలం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండీమల్, కుసాల్ మెండిస్ వంటి సీనియర్ సభ్యులు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టు అనుభవజ్ఞులు, యువకుల కలయికగా ఉంది. సీనియర్లతో పాటు యువ సంచలనాలు పథుమ్ నిస్సంక, కమిందు మెండిస్ తిరిగి జట్టులోకి వచ్చారు. బౌలింగ్ విషయానికొస్తే.. ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ల కాంబినేషన్తో ఈ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. వీరితో పాటు పేస్ బౌలర్లు అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు.న్యూజిలాండ్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు శ్రీలంక జట్టు..ధనంజయ డిసిల్వా (కెప్టెన్), దిముత్ కరుణరత్నే, పథుమ్ నిస్సంక, కుసాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండీమల్, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఒషాడా ఫెర్నాండో, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార, ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్, జెఫ్రీ వాండర్సే, మిలన్ రత్నాయక్శ్రీలంక-న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్..సెప్టెంబర్ 18-23 వరకు తొలి టెస్ట్ (గాలే)సెప్టెంబర్ 26-30 వరకు రెండో టెస్ట్ (గాలే)ఇదిలా ఉంటే, శ్రీలంక ఇటీవలే ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్లో శ్రీలంక ఓడినా చివరి టెస్ట్లో అద్భుత విజయం సాధించింది. ఈ సిరీస్తో పథుమ్ నిస్సంక, కమిందు మెండిస్ స్టార్లుగా మారిపోయారు. న్యూజిలాండ్ సిరీస్లో శ్రీలంక వీరిద్దరి ప్రదర్శనపై ఆధారపడి ఉంది. స్వదేశంలో ఆడుతున్న సిరీస్ కావడంతో నిస్సంక, కమిందు మ్యాచ్ విన్నర్లుగా మారవచ్చు. -
నా రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు: మురళీథరన్
శ్రీలంక బౌలింగ్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తన పేరిట ఉన్న అత్యధిక టెస్టు వికెట్ల (800) రికార్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో తన రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరని ధీమా వ్యక్తం చేశాడు. టెస్ట్ల్లో తన రికార్డు శాశ్వతంగా మిగిలిపోతుందని జోస్యం చెప్పాడు. ప్రస్తుత తరం బౌలర్లలో ఎవరూ తన రికార్డు దరిదాపుల్లోకి కూడా రాలేరని అన్నాడు.తన రికార్డు చాలా కాలం పాటు పదిలంగా ఉండటానికి పొట్టి క్రికెటే ప్రధాన కారణమని తెలిపాడు. పొట్టి ఫార్మాట్ కారణంగా టెస్ట్ క్రికెట్ ప్రభ కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు, ప్రేక్షకుల్లో టెస్ట్ ఫార్మాట్పై ఆసక్తి తగ్గుతోందని ఆవేదన చెందాడు. కాగా, ప్రస్తుత తరం క్రికెటర్లలో మురళీథరన్ రికార్డు కునుచూపు మేరలో నాథన్ లియోన్ (530 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (516) మాత్రమే ఉన్నారు. వీరిలో లియోన్ వయసు 36, అశ్విన్ వయసు 37. వీరద్దరూ రిటైరయ్యేలోపు మురళీథరన్ రికార్డును అందుకునే అవకాశం లేదు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఇటీవల 704 వికెట్లతో టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. -
అరుదైన క్లబ్లో చేరిన కరుణరత్నే
శ్రీలంక వెటరన్ ఓపెనర్ దిముత్ కరుణరత్నే అరుదైన క్లబ్లో చేరాడు. ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లో ఎనిమిది పరుగులు చేసిన అతను.. టెస్ట్ల్లో 7000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. కరుణరత్నేకు ముందు సంగక్కర (12400), జయవర్దనే (11814), ఏంజెలో మాథ్యూస్ (7766) టెస్ట్ల్లో శ్రీలంక తరఫున ఏడు వేల మార్కును దాటారు. టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కరుణరత్నే 57వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ (15921) అగ్రస్థానంలో ఉన్నాడు.బ్రాడ్మన్ను అధిగమించిన కరుణరత్నేతొలి ఇన్నింగ్స్లో తొమ్మిది పరుగులు చేసిన కరుణరత్నే దిగ్గజ బ్యాటర్ డాన్ బ్రాడ్మన్ను అధిగమించాడు. టెస్ట్ల్లో బ్రాడ్మన్ 6996 పరుగులు చేశాడు. ప్రస్తుతం కరుణరత్నే ఖాతాలో 7007 పరుగులు ఉన్నాయి.కాగా, ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్ట్లో పర్యాటక శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్ల సిరీస్ను 1-2 తేడాతో ముగించింది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలిచింది.నిస్సంక సూపర్ సెంచరీ219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక సూపర్ సెంచరీతో (127 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. నిస్సంక.. ఏంజెలో మాథ్యూస్తో (32 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 325, ఓలీ పోప్ 154, బెన్ డకెట్ 86, మిలన్ రత్నాయకే 3/56శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 263, నిసాంక 64, ధనంజయ డిసిల్వ 69, కమిందు మెండిస్ 64, ఓల్లీ స్టోన్ 3/35ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 156, జేమీ స్మిత్ 67, లహీరు కుమార 4/21శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 219/2, నిసాంక 127 నాటౌట్, అట్కిన్సన్ 1/44 -
మొన్న టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్..!
హెడ్ కోచ్ సనత్ జయసూర్య ఆథ్వర్యంలో శ్రీలంక క్రికెట్ జట్టు సంచలన విజయాలతో దూసుకుపోతుంది. ఇటీవలే భారత్కు వన్డే సిరీస్లో షాకిచ్చిన (0-2 తేడాతో) శ్రీలంక.. తాజాగా ఇంగ్లండ్కు వారి సొంతగడ్డపై ఓటమి రుచి చూపించింది. జయసూర్య హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాక శ్రీలంక ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. ఆ జట్టు ఆటగాళ్లు ప్రతి ఒక్కరూ రాణిస్తున్నారు. జయసూర్య పర్యవేక్షణలో కమిందు మెండిస్, పథుమ్ నిస్సంక, మిలన్ రత్నాయకే లాంటి యువ ఆటగాళ్లు అద్భుతాలు చేస్తున్నారు. ఇంగ్లండ్తో సిరీస్లో శ్రీలంక తొలి రెండు మ్యాచ్ల్లో ఓడినప్పటికీ.. యువ ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉండింది. మూడో టెస్ట్లో నిస్సంకకు అవకాశం ఇచ్చి జయసూర్య పెద్ద సాహసమే చేశాడు. సత్ఫలితం రాబట్టాడు. మూడో టెస్ట్లో నిస్సంక తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ.. ఛేదనలో మెరుపు సెంచరీ చేసి శ్రీలంకకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మొత్తంగా జయసూర్య శ్రీలంకకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కనిపిస్తున్నాడు.కాగా, కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్ట్లో పర్యాటక శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్ల సిరీస్ను 1-2 తేడాతో ముగించింది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలిచింది.నిస్సంక సూపర్ సెంచరీ219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక సూపర్ సెంచరీతో (127 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. నిస్సంక.. ఏంజెలో మాథ్యూస్తో (32 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు.పోప్ భారీ శతకంఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. నిస్సంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్ రత్నాయకే ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జేమీ స్మిత్ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. -
నిసాంక సూపర్ సెంచరీ.. ఇంగ్లండ్కు షాకిచ్చిన శ్రీలంక
కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్కు పర్యాటక శ్రీలంక ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్ను 1-2 తేడాతో ముగించింది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలిచింది.నిసాంక సూపర్ సెంచరీ219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. పథుమ్ నిసాంక సూపర్ సెంచరీతో (127 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. నిసాంక.. ఏంజెలో మాథ్యూస్తో (32 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు. లంక ఇన్నింగ్స్లో దిముల్ కరుణరత్నే (8), కుసాల్ మెండిస్ (39) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు.పోప్ భారీ శతకంఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. నిసాంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్ రత్నాయకే ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జేమీ స్మిత్ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
శ్రీలంకకు లభించిన మరో ఆణిముత్యం
టెస్ట్ల్లో కుమార సంగక్కర, మహేళ జయవర్దనే లాంటి దిగ్గజ బ్యాటర్లు రిటైరయ్యాక శ్రీలంక బ్యాటింగ్ లైనప్ చాలా బలహీనపడింది. కొందరు ఆటగాళ్లు అడపాదడపా ప్రదర్శనలు చేస్తున్నా అవంత చెప్పుకోదగ్గవేమీ కాదు. ఇటీవలికాలంలో ఆ జట్టులోకి కమిందు మెండిస్ అనే ఓ యువ ఆటగాడు వచ్చాడు. ఇతను ఆడింది ఐదు టెస్ట్ మ్యాచ్లే అయినా దిగ్గజ బ్యాటర్లను మరిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లో సెంచరీ, రెండు అర్ద సెంచరీలు చేసిన కమిందు.. తన 10 ఇన్నింగ్స్ల స్వల్ప కెరీర్లో ఏకంగా మూడు సెంచరీలు, నాలుగు అర్ద సెంచరీలు చేసి ఔరా అనిపించాడు.ఆస్ట్రేలియాతో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్లోనే అర్ద సెంచరీతో ఆకట్టుకున్న కమిందు.. ఆతర్వాత బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి లంక దిగ్గజం కుమార సంగక్కరను గుర్తు చేశాడు. ఆ మరుసటి టెస్ట్లో తృటిలో సెంచరీ చేజార్చుకున్న ఇతను.. ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో సెంచరీతో మెరిశాడు. మళ్లీ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన కమిందు.. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో రాణించాడు.ఇలా కమిందు తన స్వల్ప కెరీర్లో ఆడిన ప్రతి టెస్ట్ మ్యాచ్లో అంచనాలకు మించి రాణించి శభాష్ అనిపించుకుంటున్నాడు. కమిందు టెస్ట్ల్లో చేసిన పరుగులు దాదాపుగా విదేశాల్లో చేసినవే కావడం విశేషం. అందులోనూ కమిందు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి చాలా కీలకమైన ఇన్నింగ్స్లు ఆడాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన కమిందు లోయర్ మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగుతాడు. కమిందు గణాంకాలు.. అతని ఆటతీరు చూసిన వారు శ్రీలంకకు మరో ఆణిముత్యం లభించిందని చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఇదివరకే (0-2) కోల్పోయిన శ్రీలంక.. మూడో టెస్ట్లో మాత్రం విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్లో ఆ జట్టు మరో 125 పరుగులు చేస్తే విజయం సొంతం చేసుకుంటుంది. ఆట మరో రెండు రోజులు మిగిలి ఉండటంతో పాటు శ్రీలంక చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉన్నాయి. నిస్సంక (53), కుసాల్ మెండిస్ (30) క్రీజ్లో ఉన్నారు. -
కివీ కర్రీ గురించి విన్నారా..!
కివీ పండ్లు రుచే వేరేలెవెల్ అన్నట్లు ఉంటాయి. ఇది ఎంత బాగుంటుందంటే..తింటుంటే పుల్లగా తియ్యగా మరోవైపు దానిలోని గింజలు క్రంచిగా తగులుతు భలే ఉంటాయి. మాములుగా కివీ పండ్లను నేరుగా తినేస్తాం. అంతే తప్ప వాటితో రెసిపీలు తయారు చేయడం గురించి వినలేదు కదా. కానీ శ్రీలంకలో ఈ కివీ పండ్లతో కర్రీ చేస్తారట. టేస్ట్ వారెవ్వా అనేలా ఉంటుదట. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ కివీ పండుని కర్రీలా చేసుకుని తినడం వల్ల ఎలాంటి పోషకాలు నష్టపోమని చెబుతున్నారు శ్రీలంక చెఫ్ మినోలి డి సిల్వా. నిక్షేపంగా కూరగా చేసుకుని తినొచ్చట. కర్రీ ఎలా చేస్తారంటే..ఒక పాన్లో కొబ్బరి నూనె వేసి, అందులో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత అందులో కారం పొడి, నల్ల మిరియాలు, గ్రౌండ్ జీలకర్ర, సొంపు పొడి, ధనియాలపొడి వేసి ఓ అరంగంట కలపుతూ ఉండాలి. అందులో టమాటాలు, జీడిపప్పు వేసి ఓ రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత కొబ్బరి నీరు సగం లేదా పూర్తిగా వేసి ఉడికించాలి. చివరగా కివీ పండ్లు వేసి మిగిలిని కొబ్బరి నీరు, కొబ్బరి పాలు జోడించాలి. ఈ రెసిపీలో కివీ పుల్లదనం తెలియాలంటే కొద్దిగా సాస్, ఉప్పుని జోడించాలి. ఈ కర్రీని అన్నం లేదా రోటీలతో తింటే టేస్ట్ అదిరిపోతుందట. అయితే ఈ రెసిపీలో కివీ పండు రుచిని కొబ్బరి పాలు మరింత టేస్టీగా ఉండేలా చేస్తుందట. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి. View this post on Instagram A post shared by Chef Minoli De Silva (@minoli.desilva) (చదవండి: మూడేళ్ల చిన్నారిని రక్షించడంలో డ్రోన్ సాయం..! ఏకంగా దట్టమైన ..) -
ఇంగ్లండ్తో మూడో టెస్ట్.. 263 పరుగులకు ఆలౌటైన శ్రీలంక
కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో పర్యాటక శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. 211/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఓవర్నైట్ స్కోర్కు మరో 52 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాటర్లు ధనంజయ డిసిల్వ 69, కమిందు మెండిస్ 64 పరుగులు చేసి ఔటయ్యారు. ఆతర్వాత వచ్చిన మిలన్రత్నాయకే 7, విశ్వ ఫెర్నాండో 0, అశిత ఫెర్నాండో 11 పరుగులు చేశారు. లంక ఇన్నింగ్స్లో ఓవరల్గా ముగ్గురు హాఫ్ సెంచరీలు చేశారు. రెండో రోజు ఆటలో పథుమ్ నిస్సంక 64 పరుగులు చేశాడు. వీరు మినహా కుసల్ మెండిస్ (14), అశిత ఫెర్నాండో మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇంగ్లండ్ బౌలర్లలో అరంగేట్రం పేసర్ జోష్ హల్, ఓల్లీ స్టోన్ తలో 3, క్రిస్ వోక్స్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం శ్రీలంక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 62 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (154) భారీ శతకంతో కదంతొక్కగా.. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరు మినహా ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జో రూట్ (13), హ్యారీ బ్రూక్ (19), జేమీ స్మిత్ (16), ఓల్లీ స్టోన్ (15 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లంక ఇన్నింగ్స్లో మిలన్ రత్నాయకే 3, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, ధనంజయ డిసిల్వ తలో 2, అశిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు.కాగా, శ్రీలంక మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇంగ్లండ్ తొలి రెండు మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించింది. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగుతుంది. -
పోప్ భారీ శతకం.. 325 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులకు ఆలౌటైంది. 221/3 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టు.. ఓవర్నైట్ స్కోర్కు మరో 104 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ చేసిన ఓలీ పోప్ 154 పరుగులు చేసి ఔట్ కాగా.. మరో ఓవర్నైట్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 19 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇంగ్లండ్ తమ చివరి ఆరు వికెట్లు కేవలం 64 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఓవర్నైట్ స్కోర్కు 40 పరుగులు జోడించాక బ్రూక్ ఐదో వికెట్గా వెనుదిరగగా.. ఓలీ పోప్ ఎనిమిదో వికెట్గా పెవిలియన్కు చేరాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ 86, డాన్ లారెన్స్ 5, జో రూట్ 13, జేమీ స్మిత్ 16, క్రిస్ వోక్స్ 2, గస్ అట్కిన్సన్ 5, ఓల్లీ స్టోన్ 15 (నాటౌట్), జోష్ హల్ 2, షోయబ్ బషీర్ ఒక్క పరుగు చేశారు. శ్రీలంక బౌలర్లలో మిలన్ రత్నాయకే 3 వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, ధనంజయ డిసిల్వ తలో 2, అశిత ఫెర్నాండో ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు లంచ్ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా ఒక్క పరుగు చేసింది. పథుమ్ నిస్సంక (1), దిముత్ కరుణరత్నే క్రీజ్లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు నెగ్గిన ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
వెల్లలగే ఆల్రౌండ్ షో.. ఉత్కంఠ పోరులో రాయల్స్ విజయం
కరీబియన్ ప్రీమియర్ లీగ్లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో జరిగిన మ్యాచ్లో బార్బడోస్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్స్ మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ర్యాన్ జాన్ బౌలింగ్లో న్యీమ్ యంగ్ సిక్సర్ బాది రాయల్స్ను గెలిపించాడు. దునిత్ వెల్లలగే ఆల్రౌండ్ షోతో (3/35, 39) అదరగొట్టి రాయల్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మిఖైల్ లూయిస్ 30, హసరంగ 40, జోష్ క్లార్క్సన్ 24, ర్యాన్ జాన్ 29 పరుగులు చేశారు. పేట్రియాట్స్ ఇన్నింగ్స్లో ఏకంగా నలుగురు డకౌట్లయ్యారు. రాయల్స్ బౌలర్లలో వెల్లలగే 3, తీక్షణ, మెక్కాయ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.వెల్లలగే ఆల్రౌండ్ షో154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. వెల్లలగే (39), కడీమ్ అలెన్ (30) రాణించడంతో 19.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. బంతితో రాణించిన వెల్లలగే బ్యాట్తో కూడా రాణించాడు. -
ఇంగ్లండ్తో మూడో టెస్ట్.. శ్రీలంక తుది జట్టు ప్రకటన
రేపటి నుంచి (సెప్టెంబర్ 6) కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగే మూడో టెస్ట్ కోసం శ్రీలంక తుది జట్టును ఇవాళ (సెప్టెంబర్ 5) ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక మేనేజ్మెంట్ రెండు మార్పులు చేసింది. రెండో టెస్ట్ ఆడిన నిషన్ మధుష్క, ప్రభాత్ జయసూర్య స్థానాల్లో కుసల్ మెండిస్, విశ్వ ఫెర్నాండో తుది జట్టులోకి వచ్చారు. మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును నిన్ననే ప్రకటించింది.కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు పూర్తి కాగా.. రెండు మ్యాచ్ల్లో ఆతిథ్య జట్టే ఘన విజయాలు సాధించింది. తొలి టెస్ట్లో 5 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్.. తాజాగా ముగిసిన రెండో టెస్ట్లో 190 పరుగుల తేడాతో విజయం సాధించింది.మూడో టెస్ట్ కోసం శ్రీలంక తుది జట్టు: దిముత్ కరుణరత్నే, పథుమ్ నిస్సంక, కుసల్ మెండిస్ (వికెట్కీపర్), ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండీమల్, ధనంజయ డిసిల్వ (కెప్టెన్), కమిందు మెండిస్, మిలన్ రత్నాయకే, లహీరు కుమార, విశ్వ ఫెర్నాండో, అశిత ఫెర్నాండోఇంగ్లండ్ తుది జట్టు: డాన్ లారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, ఓలీ స్టోన్, జోష్ హల్, షోయబ్ బషీర్ -
Pak vs Eng: పాకిస్తాన్లో కాదు శ్రీలంకలో!?
బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమిపాలైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఇంగ్లండ్తో తలపడనుంది. అక్టోబరు 7 నుంచి ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ముల్తాన్, కరాచి, రావల్పిండిలో ఈ మ్యాచ్లను నిర్వహించాల్సి ఉంది.అయితే, తాజా సమాచారం ప్రకారం పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ వేదికను విదేశానికి తరలించినట్లు సమాచారం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదా శ్రీలంకలో ఈ మ్యాచ్లను నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్లోని స్టేడియాల పునరుద్ధరణ కార్యక్రమం నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.అందుకే వేదిక మార్పుకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ టోర్నీని సమర్థవంతంగా నిర్వహించాలంటే పాక్ స్టేడియాల్లో తగిన సదుపాయాలు లేవు. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు వివిధ స్టేడియాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. అయితే ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించకపోవడంతో టెస్టుమ్యాచ్ల నిర్వహణ సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో సిరీస్ వేదికను తరలించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.కానీ.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును ఇందుకు ఒప్పించడం సహా... యూఏఈ లేదంటే శ్రీలంకలో సిరీస్ నిర్వహించడం పాక్ బోర్డుకు అంతతేలికేమీ కాదు. ఎందుకంటే.. బంగ్లాదేశ్లో అల్లర్ల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచకప్-2024 వేదికగా ఇప్పటికే యూఏఈని ఖరారు చేసింది ఐసీసీ. అక్టోబరు 3- 20 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది.లంక బెస్ట్ ఆప్షన్కాబట్టి యూఏఈలో పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చు. మరోవైపు.. శ్రీలంకలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడా మ్యాచ్లు సజావుగా నిర్వహించడం కష్టమేకానుంది. అయితే, లంక కంటే ఉత్తమ ఆప్షన్ లేదు కాబట్టి అక్కడే ఈ సిరీస్ను నిర్వహించాలని పాక్ బోర్డు భావిస్తున్నట్లు ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఇటీవల బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో 0-2తో క్లీన్స్వీప్నకు గురైన విషయం తెలిసిందే. పాకిస్తాన్ బంగ్లా చేతిలో టెస్టుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.పాకిస్తాన్లో ఇంగ్లండ్ పర్యటన 2024- ఖరారైన షెడ్యూల్మొదటి టెస్టు- అక్టోబరు 7- అక్టోబరు 11- ముల్తాన్రెండో టెస్టు- అక్టోబరు 15- అక్టోబరు 19- కరాచిమూడో టెస్టు- అక్టోబరు 24- అక్టోబరు 28- రావల్పిండి. -
శ్రీలంకతో మూడో టెస్ట్.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
సెప్టెంబర్ 6 నుంచి కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా శ్రీలంకతో జరిగే మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ (సెప్టెంబర్ 3) ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఓ మార్పు చేసింది. మాథ్యూ పాట్స్ స్థానంలో 20 ఏళ్ల యువ పేసర్ జోష్ హల్ తుది జట్టులోకి వచ్చాడు. హల్కు ఇది అరంగేట్రం మ్యాచ్.కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు పూర్తయ్యాయి. రెండు మ్యాచ్ల్లో ఆతిథ్య జట్టు ఘన విజయాలు సాధించింది. తొలి టెస్ట్లో 5 వికెట్ల తేడాతో.. తాజాగా ముగిసిన రెండో టెస్ట్లో 190 పరుగుల తేడాతో విజయం సాధించింది.మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు: డాన్ లారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, ఓలీ స్టోన్, జోష్ హల్, షోయబ్ బషీర్ -
సమస్యల నడుమ సారథ్య పోరు..
ద్వీప దేశం శ్రీలంక రెండేళ్ల క్రితం కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అన్నం ముద్దకు, నీటి చుక్కకూ దిక్కులేని పరిస్థితి దాపురించడంతో జనం కన్నెర్రజేశారు. ప్రభుత్వంపై మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఎటు చూసినా మొన్నటి బంగ్లాదేశ్ తరహా దృశ్యాలే కని్పంచాయి. దాంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స పదవి వీడి పారిపోయారు. నెలల పాటు సాగిన అనిశ్చితి తర్వాత అన్ని పారీ్టల అంగీకారంతో పగ్గాలు చేపట్టిన రణిల్ విక్రమసింఘె పలు సంస్కరణలకు తెర తీశారు. అయినా దేశం ఆర్థిక ఇక్కట్ల నుంచి ఇప్పుటికీ బయట పడలేదు. నానా సమస్యల నడుమే సెపె్టంబర్ 21న అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోంది...బరిలో 39 మంది అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. 39 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వీరిలో మాజీ ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సెకాతో పాటు ఇద్దరు బౌద్ధ సన్యాసులూ ఉండటం విశేషం! అయితే ప్రధాన పోటీ మాత్రం అధ్యక్షుడు రణిల్, శక్తిమంతమైన రాజపక్స కుటుంబ వారసుడు నమల్, విపక్ష నేత సజిత్ ప్రేమదాస మధ్యే కేంద్రీకృతమైంది. మిగతా వారిలో చాలామంది వీళ్ల డమ్మీలేనని చెబుతున్నారు. ఈ ముగ్గురిలోనూ ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టమైన మొగ్గు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో తొలి దశలో ఫలితం తేలడం అనుమానమేనని భావిస్తున్నారు.రణిల్ విక్రమ సింఘె ప్రస్తుత అధ్యక్షుడు. పూర్వాశ్రమంలో పేరుమోసిన లాయర్. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ప్రధానిగా చేసిన రాజకీయ దిగ్గజం. ఆయన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ)కి పార్లమెంటులో ఉన్నది ఒక్క స్థానమే. అయినా అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు 2022 జూలైలో అధ్యక్షుడయ్యారు. దేశాన్ని సంక్షోభం నుంచి కాస్త ఒడ్డున పడేయగలిగారు. కానీ 225 మంది ఎంపీలున్న రాజపక్సల శ్రీలంక పొడుజన పెరమున (ఎస్ఎల్పీపీ) మద్దతుకు బదులుగా ఆ పార్టీ నేతల అవినీతికి కొమ్ము కాస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగారు. ఎస్ఎల్పీపీ సొంత అభ్యర్థిని బరిలో దింపడం పెద్ద ప్రతికూలాంశం. పైగా రణిల్ పారీ్టకి క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. దీనికి తోడు విపక్ష నేత సజిత్ ప్రేమదాస నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. తాజాగా 92 మంది ఎంపీలు మద్దతు ప్రకటించడం 75 ఏళ్ల రణిల్కు ఊరటనిచ్చే అంశం.సజిత్ ప్రేమ దాస మాజీ అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస కుమారుడు. విపక్ష నేత. 2019లో రణిల్ పార్టీ నుంచి విడిపోయి సమగి జన బలవేగయ (ఎస్జేబీ) పేరిట వేరుకుంపటి పెట్టుకున్నారు. వామపక్ష భావజాలమున్న 57 ఏళ్ల సజిత్కు యువతలో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. అవినీతినే ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. దానిపై ఉక్కుపాదం మోపుతానన్న హామీతో జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. జనంపై పన్నుల భారాన్ని తక్షణం తగ్గించాల్సిందేనన్న సజిత్ డిమాండ్కు భారీ స్పందన లభిస్తోంది. దీనికితోడు శ్రీలంక ముస్లిం కాంగ్రెస్, డెమొక్రటిక్ పీపుల్స్ ఫ్రంట్ వంటి పారీ్టలతో పాటు చిన్న గ్రూపుల మద్దతుతో ఆయన నానాటికీ బలపడుతున్నారు. పలు తమిళ సంఘాల దన్ను సజిత్కు మరింతగా కలిసిరానుంది.నమల్ రాజపక్స మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు. 38 ఏళ్ల నమల్ శక్తిమంతమైన రాజపక్స రాజకీయ కుటుంబం నుంచి యువతరం వారసునిగా బరిలో దిగారు. అధ్యక్ష పోరులో తనకే మద్దతివ్వాలన్న రణిల్ విజ్ఞప్తిపై ఎస్ఎల్పీపీ రోజుల తరబడి మల్లగుల్లాలు పడింది. చివరికి సొంతగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి రణిల్ సర్కారుకు మద్దతు ఉపసంహరించింది. అనూహ్యంగా నమల్ను బరిలో దించింది. ఆయన చిన్నాన్న గొటబయ రాజపక్సపై రెండేళ్ల క్రితం వెల్లువెత్తిన జనాగ్రహం ఇంకా తాజాగానే ఉంది. ఆ వ్యతిరేకతను అధిగమించం నమల్ ముందున్న అతిపెద్ద సవాలు. దీనికి తోడు ఎస్ఎల్పీపీకి 225 మంది ఎంపీలున్నా వారిలో పలువురు క్రమంగా రణిల్ వైపు మొగ్గుతున్నారు. మిగతా వారిలోనూ చాలామంది పార్టీ ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదు.అనూర కుమార దిస్స నాయకె నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) సంకీర్ణం తరఫున బరిలో ఉన్నారు. పార్లమెంటులో కేవలం 3 సీట్లే ఉన్నా సుపరిపాలన హామీతో ఆకట్టుకుంటున్నారు. జనతా విముక్తి పెరమున (జేవీపీ) వంటి పార్టీల దన్ను కలిసొచ్చే అంశం. ఇక అంతర్యుద్ధ సమయంలో హీరోగా నిలిచిన ఫీల్డ్ మార్షల్ ఫోన్సెకా తనకు మద్దతుగా నిలిచే పారీ్టల కోసం చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంగ్లండ్తో రెండో టెస్ట్.. శ్రీలంక తుది జట్టు ప్రకటన
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 29) ప్రారంభంకాబోయే రెండో టెస్ట్ కోసం శ్రీలంక తుది జట్టును ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక రెండు మార్పులు చేసింది. తొలి టెస్ట్ ఆడిన కుసాల్ మెండిస్, విశ్వ ఫెర్నాండో స్థానాల్లో పతుమ్ నిస్సంక, లహీరు కుమార తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించింది. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన మార్క్ వుడ్ స్థానంలో ఓలీ స్టోన్ తుది జట్టులోకి వచ్చాడు. రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ ఈ ఒక్క మార్పు మాత్రమే చేసింది.కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 236 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 358 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 326 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన జేమీ స్మిత్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తుది జట్లు..శ్రీలంక: దిముత్ కరుణరత్నే, నిషన్ మదుష్క, పతుమ్ నిస్సంక, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, ప్రభాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, మిలన్ రత్నాయకేఇంగ్లండ్: బెన్ డకెట్, డేనియల్ లారెన్స్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, షోయబ్ బషీర్ -
మార్క్ వుడ్కు గాయం.. ఇంగ్లండ్ జట్టులో 6 అడుగుల 7 అంగుళాల ఫాస్ట్ బౌలర్
శ్రీలంకతో తాజాగా ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయం బారిన పడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో వుడ్ మూడో రోజు నుంచి బౌలింగ్ చేయలేదు. వుడ్ స్థానంలో ఇంగ్లండ్ సెలెక్టర్లు 20 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ జోష్ హల్ను ఎంపిక చేశాడు. హల్.. శ్రీలంకతో తదుపరి జరుగబోయే రెండు టెస్ట్లకు ఇంగ్లండ్ జట్టులో సభ్యుడిగా ఉంటాడు. Josh Hull - the 6'7 left arm pacer has been added to England's squad for Test series Sri Lanka. pic.twitter.com/FVdogR3toZ— Mufaddal Vohra (@mufaddal_vohra) August 25, 2024కౌంటీల్లో లీసెస్టర్షైర్కు ఆడే హల్కు భీకరమైన ఫాస్ట్ బౌలర్గా పేరుంది. 6 అడుగుల 7 అంగుళాలు ఉండే హల్కు అతని ఫైట్ చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇటీవల శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో హల్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో రెండో టెస్ట్ ఆగస్ట్ 29 నుంచి మొదలవుతుంది. మూడో టెస్ట్ సెప్టెంబర్ 6 నుంచి 10 వరకు కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా జరుగనుంది.కాగా, ఓల్డ్ ట్రఫర్డ్ వేదికగా తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్లో శ్రీలంకపై ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ధనంజయం డిసిల్వ (74), మిలన్ రత్నాయకే (72) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 236 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. జేమీ స్మిత్ (111) సెంచరీతో కదంతొక్కడంతో 358 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. కమిందు మెండిస్ (113) సెంచరీతో రాణించడంతో 326 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. -
NZ vs SL: అంతర్జాతీయ క్రికెట్లో 6 రోజుల టెస్టు మ్యాచ్..
అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు మ్యాచ్ అంటే ఐదు రోజుల పాటు జరుగుతుందన్న సంగతి తెలిసిందే. దేశవాళీ క్రికెట్లో, అనాధకరిక టెస్టు మ్యాచ్లు నాలుగు రోజులు పాటు కూడా జరగుతాయి. కానీ గతంలో ఆరు రోజుల టెస్టు మ్యాచ్లు కూడా జరిగేవి ఉన్న విషయం మీకు తెలుసా?1980లు, 90ల్లో 6 రోజుల టెస్టు మ్యాచ్ బాగా పాపులర్. ఇంగ్లండ్లో అనేక మ్యాచ్లు ఆరు రోజుల పాటు జరిగాయి. చివరగా అంతర్జాతీయ క్రికెట్లో ఆరు రోజుల టెస్టు మ్యాచ్ 2008లో బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరిగింది. అయితే ఇదింతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? అది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.16 ఏళ్ల తర్వాత తొలిసారి..?అంతర్జాతీయ క్రికెట్లో 16 ఏళ్ల తర్వాత తొలిసారి ఆరు రోజుల మ్యాచ్ జరగనుంది. ఈ అరుదైన ఘట్టానికి సెప్టెంబర్ 18 నుంచి శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య ప్రారంభం కానున్న తొలి టెస్టు వేదిక కానుంది. వచ్చె నెలలలో న్యూజిలాండ్ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు శ్రీలంకకు రానుంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆరు రోజుల పాటు జరగనుంది. దేశంలో అధ్యక్ష ఎన్నికల కారణంగా సెప్టెంబర్ 21 న మ్యాచ్ జరగడం లేదు. ఆ రోజును విశ్రాంతిగా ప్రకటించారు. తొలి రెండు రోజుల తర్వాత ఒక్క రోజు(సెప్టెంబర్ 21 )ను రెస్ట్ డేగా ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ 22, 23, 24 తేదీల్లో మ్యాచ్ కొనసాగుతుంది. అయితే రెండో టెస్టు మాత్రం యధావిధిగా 5 రోజుల పాటే జరగనుంది. కాగా ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను శ్రీలంక క్రికెట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.అప్పుడు బంగ్లాలో.. ఇప్పుడు శ్రీలంకలోశ్రీలంక చివరగా ఆరు రోజుల టెస్టు మ్యాచ్ 2008లో ఆడింది. ఆ ఏడాది శ్రీలంక క్రికెట్ జట్టు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. అయితే ఈ సిరీస్లో తొలి టెస్టు మ్యాచ్ ఆరు రోజుల పాటు జరిగింది. బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఆరు రోజుల పాటు టెస్టును షెడ్యూల్ చేశారు. డిసెంబర్ 26 నుంచి 31 వరకు ఆ టెస్టు మ్యాచ్ కొనసాగింది. మళ్లీ ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంక ఆరు రోజుల టెస్టు మ్యాచ్ ఆడనుంది. -
శ్రీలంకతో తొలి టెస్ట్.. స్వల్ప ఆధిక్యంలో ఇంగ్లండ్
ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు 23 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (72), గస్ అట్కిన్సన్ (4) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ 18, డేనియల్ లారెన్స్ 30, ఓలీ పోప్ 6, జో రూట్ 42, హ్యారీ బ్రూక్ 56, క్రిస్ వోక్స్ 25 పరుగులు చేశారు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో 3, ప్రభాత్ జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 236 పరుగులకు ఆలౌటైంది.నిషన్ మధుష్క 4, కరుణరత్నే 2, కుసాల్ మెండిస్ 24, ఏంజెలో మాథ్యూస్ 0, చండీమల్ 17, ధనంజయ డిసిల్వ 74, కమిందు మెండిస్ 12, ప్రభాత్ జయసూర్య 10, మిలన్ రత్నాయకే 72, విశ్వ ఫెర్నాండో 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ తలో మూడు వికెట్లు, గస్ అట్కిన్సన్ 2, మార్క్ వుడ్ ఓ వికెట్ పడగొట్టారు. -
భారత్తో సహా 34 దేశాలు.. శ్రీలంక సంచలన నిర్ణయం
సాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే వీసా తప్పనిసరి. వీసాతో అవసరం లేకుండా తమ దేశాలను సందర్శించవచ్చని గతంలో కొన్ని దేశాలు ప్రకటించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి శ్రీలంక కూడా చేరింది.శ్రీలంక ప్రభుత్వం 2024 అక్టోబర్ 1 నుంచి ఇండియా, యూకే, అమెరికా వంటి 35 దేశాల పౌరులకు వీసా అవసరం లేదని ప్రకటించింది. అంటే ఈ దేశ పౌరులు శ్రీలంకకు వీసా లేకుండానే వెళ్ళవచ్చు. ఈ విషయాన్ని శ్రీలంక టూరిజం మంత్రి హరీన్ ఫెర్నాండో వెల్లడించారు.భారతదేశం, యుకె, చైనా, యుఎస్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, పోలాండ్, కజకిస్తాన్, సౌదీ అరేబియా, యూఏఈ, నేపాల్, ఇండోనేషియా, రష్యా, థాయిలాండ్, మలేషియా, జపాన్, ఫ్రాన్స్, కెనడా, చెక్ రిపబ్లిక్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఇజ్రాయెల్, బెలారస్, ఇరాన్, స్వీడన్, దక్షిణ కొరియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, న్యూజిలాండ్ దేశాల ప్రజలు వీసాతో పనిలేకుండానే శ్రీలంకను సందర్శించవచ్చు.శ్రీలంక ప్రభుత్వం వీసా రహిత సందర్శన అవకాశాన్ని కేవలం ఆరు నెలలు మాత్రమే అందిస్తుంది. దీనికి శ్రీలంక క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. శ్రీలంక పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగానే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
శ్రీలంకకు ఇక వీసా అక్కర్లేదు
కొలంబో: భారత పౌరులకు ఆరు నెలలపాటు వీసారహిత ప్రవేశాన్ని కల్పించాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. భారత్తో పాటు మరో 35 దేశాలకు ఈ సౌకర్యాన్ని కలి్పంచడానికి శ్రీలంక మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి వీసారహిత ప్రయాణం అందుబాటులోకి వస్తుందని పర్యాటక శాఖ సలహాదారు హరిన్ ఫెర్నాండో వెల్లడించార -
ఇంగ్లండ్ బౌలర్ల విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన శ్రీలంక
ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 236 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ ధనంజయ డిసిల్వ (74), అరంగేట్రం బౌలర్ మిలన్ రత్నాయకే (72) రాణించకపోతే శ్రీలంక ఈ పాటి స్కోర్ కూడా చేయలేకపోయేది. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి శ్రీలంకను దెబ్బకొట్టారు. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ తలో మూడు వికెట్లు, గస్ అట్కిన్సన్ 2, మార్క్ వుడ్ ఓ వికెట్ పడగొట్టారు. లంక ఇన్నింగ్స్లో నిషన్ మధుష్క 4, కరుణరత్నే 2, కుసాల్ మెండిస్ 24, ఏంజెలో మాథ్యూస్ 0, చండీమల్ 17, కమిందు మెండిస్ 12, ప్రభాత్ జయసూర్య 10, విశ్వ ఫెర్నాండో 13 పరుగులు చేసి ఔటయ్యారు. లంక ఆలౌటైన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. బెన్ డకెట్ 13, డేనియల్ లారెన్స్ 9 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 214 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు శ్రీలంక ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. -
లంకలో ఎన్నికల సందడి
చాన్నాళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. వచ్చే నెల 21న జరగబోతున్న ఎన్నికల్లో 39 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. శ్రీలంక దివాలా తీసి ఎంతటి విపత్కర పరిస్థితులో చిక్కుకున్నదో అందరికీ తెలుసు. 2022లో అధ్యక్ష భవనంపై, పార్లమెంటుపై ప్రజానీకం దాడి చేయటంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబ పరివారం దేశం విడిచి పరారయ్యారు. అంతకు మూడేళ్ల ముందు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గొటబయ, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానిగా ఆయన సోదరుడు మహిందా రాజపక్స తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈమధ్య బంగ్లాదేశ్లో అచ్చం ఇలాంటి ఘటనలే జరిగి ప్రధాని షేక్ హసీనాకు పదవీభ్రష్టత్వం తప్పలేదు. రెండేళ్లనాటి శ్రీలంక పరిణామాలు చూశాకైనా ఆమె జాగ్రత్తగా అడుగులు వేసివుంటే ఇలా జరిగేది కాదు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్నవారు తమ గతాన్ని మాత్రమే కాదు... బంగ్లాదేశ్ వర్తమానాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సివుంటుంది. ఏవో సాకులు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే సంస్కృతి శ్రీలంకలో ఏనాటి నుంచో కొనసాగు తోంది. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే ప్రధానిగా ఉన్నప్పుడు 2017లో ప్రొవిన్షియల్ కౌన్సిళ్ల ఎన్నికలను వాయిదా వేశారు. అప్పటికి ఏడేళ్ల నుంచి ఇదే వరస. చిత్రమేమంటే 2022లో అంతగా జనాగ్రహం చవిచూశాక కూడా దేశంలో ఎన్నాళ్ల నుంచో మూలనపడివున్న స్థానిక సంస్థల ఎన్నికలను నిధులు లేవన్న కారణంతో విక్రమసింఘే వాయిదా వేశారు. నిజానికి అధ్యక్ష ఎన్నికలు సైతం ఈ మాదిరే ‘వాయిదా’ తోవన పోతాయని చాలామంది అనుకున్నారు. వెంటనే ఎన్నికలు జరపాలంటూ వివిధ వర్గాలనుంచి నిరుడు డిమాండ్ వచ్చింది. కానీ దేశం ఇంకా ఆర్థికంగా కోలుకోలేదన్న కారణాన్ని చూపి వాయిదా వేశారు. మొత్తానికి ఎన్నికల కోలాహలం మొదలైంది.రెండున్నర దశాబ్దాల తర్వాత మొదటిసారిగా రాజపక్స కుటుంబం హవా లేకుండా ఎన్నికలు జరగబోతున్నాయి. తన కుటుంబం కోల్పోయిన పరువు ప్రతిష్ఠలను పునరుద్ధరించటమే ధ్యేయంగా మాజీ ప్రధాని మహిందా రాజపక్స తనయుడు 38యేళ్ల నామల్ రాజపక్స శ్రీలంక పొదుజన పెరమున(ఎస్ఎల్పీపీ) తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అయిదు దశాబ్దాలు యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ) నాయకుడిగావున్నా స్వతంత్రుడిగా నిలబడ్డారు. గతంలో యూఎన్పీని చీల్చి సమగి జన బల వేగయ (ఎస్జేబీ) పార్టీని స్థాపించి ప్రస్తుతం పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సజిత్ ప్రేమదాస కూడా అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్నారు. అయితే ఇతరుల కన్నా వామపక్ష అనుకూల నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ (ఎన్పీపీ) అధినేత అనూర కుమార దిస్సానాయకే విజయావకాశాలు ఎక్కువని లంకలో ప్రధాన సర్వే సంస్థ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ పాలసీ (ఐహెచ్పీ) చెబుతోంది. అదే నిజమైతే దేశ రాజకీయాలు కొత్త మలుపు తిరగటం ఖాయం. మొదటి నుంచీ ఎస్ఎల్పీపీ, యూఎన్ పీలే ప్రధాన పక్షాలుగా పోటీపడుతున్నాయి. కానీ 2020 పార్లమెంటు ఎన్నికలకు ముందు సజిత్ ప్రేమదాస నిష్క్రమించాక ఆ పార్టీ దయనీయ స్థితిలో పడిపోయింది. ఆ ఎన్నికల్లో యూఎన్పీకి దక్కింది కేవలం ఒక్క స్థానం మాత్రమే. దశాబ్దాలుగా అనుసరించిన విధానాల వల్ల దేశం ఆర్థికంగా చాలా గడ్డు స్థితిలో పడిందన్నది వాస్తవం. ముఖ్యంగా రాజపక్స సోదరుల హయాంలో తమిళ టైగర్లను అణిచేయటానికి సాయం చేసిన దగ్గర్నుంచి చైనా పలుకుబడి విస్తరించింది. ఆ తర్వాత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించే నెపంతో అది భారీయెత్తున అప్పులిచ్చింది. క్రికెట్ స్టేడియం, విమానాశ్రయం, హంబన్తోటా నౌకాశ్రయం వంటివన్నీ చైనా నిర్మాణరంగ నిపుణుల నేతృత్వంలో కళ్లు చెదిరే రీతిలో నిర్మించారు. కానీ వీటి బకాయిలు తీర్చడానికొచ్చేసరికి అంతా తారుమారైంది. చివరకు హంబన్తోటాలో అనుకున్న రీతిలో కార్యకలాపాలు పుంజుకోకపోవటంతో దాన్ని చైనాకే 99 యేళ్ల లీజుకు ఇవ్వాల్సివచ్చింది. దేశాన్ని చైనాకు తాకట్టు పెడుతున్నారని విపక్షాలు చేసిన ఆరోపణలన్నీ రాజపక్స సోదరులు తీసుకొచ్చిన మెజారిటీవాదం, దేశభద్రత వగైరా అంశాలతో కొట్టుకు పోయాయి. కానీ మూడేళ్లకే ప్రజలకు తత్వం బోధపడి తిరుగుబాటు చేశారు. 2022లో దేశం దివాలా తీశాక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) దాదాపు 300 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. అయితే ఆర్థిక రంగంలో పెనుమార్పులు తీసుకురావాలన్న షరతు విధించింది. వ్యవస్థాగత సర్దు బాట్ల పేరుతో ఆ ప్రక్రియ ప్రస్తుతం అమలవుతోంది కూడా. కనుక ఎన్నికల అనంతరం విజేత ఎవ రైనా ఈ ప్రక్రియను కొనసాగించాల్సిందే. ప్రస్తుత అభ్యర్థుల్లో ఎన్పీపీ అధినేత అనూర కుమార దిస్సానాయకే ఒక్కరే అవినీతి మరక అంటని నేత. కావడానికి వామపక్ష అనుకూల సంస్థే అయినా సింహళ జాతీయవాదాన్ని ప్రవచించే జనతా విముక్తి పెరుమున రాజకీయ విభాగమే ఎన్పీపీ. ఒకపక్క తన పూర్వపు ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూసే చైనా... మొదటి నుంచీ లంకకు అన్ని విధాలా తోడ్పడుతున్న భారత్ ఈ ఎన్నికల సరళిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఇప్పటికే బంగ్లాలో భారత్ అనుకూల నేత హసీనా పదవి కోల్పోయారు. ఇదే అదనుగా లంకలో మళ్లీ తన హవా కొనసాగించాలని చైనా చూస్తోంది. అయితే చైనా వల్లే అప్పుల ఊబిలో కూరుకుని నిండా మునిగిన లంకలో అదంత సులభం కాదు. ఏదేమైనా జనామోదంతో ఏర్పడే ప్రభుత్వం వల్లే శ్రీలంక ప్రస్తుత కష్టాలు తీరతాయి. -
శ్రీలంకకు వరుస షాక్లు
మహిళల క్రికెట్లో శ్రీలంక జట్టుకు వరుస షాక్లు తగలుతున్నాయి. ఆ జట్టు తమకంటే చిన్న జట్టైన ఐర్లాండ్ చేతిలో వరుస మ్యాచ్ల్లో ఓటమిపాలవుతుంది. తొలుత టీ20 సిరీస్ను సమం చేసుకుని బయటపడ్డ శ్రీలంక.. తాజాగా వన్డే సిరీస్ను ఐర్లాండ్కు కోల్పోయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న జరిగిన రెండో వన్డేలో శ్రీలంకపై ఐర్లాండ్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఆమీ హంటర్ (66), లేయా పాల్ (81), రెబెకా స్టోకెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, అచిని కులసూరియ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. చమారి ఆటపట్టు ఓ వికెట్ దక్కించుకుంది.అనంతరం 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను హర్షిత సమరవిక్రమ (105) సెంచరీతో గెలిపించే ప్రయత్నం చేసింది. లంక ఇన్నింగ్స్లో హర్షితతో పాటు కవిష దిల్హరి (53) కూడా రాణించింది. వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. ఐర్లాండ్ బౌలర్లలో కెల్లీ 3, జేన్ 2, ఓర్లా, ఆమీ, ఫ్రేయా తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్ను ఐర్లాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడు వన్డే ఆగస్ట్ 20న జరుగనుంది. -
సూపర్ సెంచరీ: శ్రీలంకపై ఐర్లాండ్ తొలి గెలుపు
ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. తొలిసారి శ్రీలంక జట్టుపై గెలుపు నమోదు చేసింది. ఓపెనర్ గాబీ లూయిస్ అద్భుత శతకంతో ఇది సాధ్యమైంది. కాగా రెండు టీ20, ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు శ్రీలంక మహిళా జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది.17 ఫోర్లు, 2 సిక్సర్లుఇరు జట్ల మధ్య ఆదివారం నాటి (ఆగష్టు 11) తొలి టీ20లో శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో గెలవగా.. మంగళవారం రాత్రి నాటి రెండో మ్యాచ్లో ఐర్లాండ్ను అనూహ్య రీతిలో విజయం వరించింది. డబ్లిన్ వేదికగా జరిగిన ఈ టీ20లో టాస్ గెలిచిన ఆతిథ్య ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఆమీ హంటర్ 9 పరుగులకే అవుటైనా.. మరో ఓపెనర్ గాబీ లూయిస్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.#Champion https://t.co/RSI0agcCbl— Cricket Ireland (@cricketireland) August 13, 2024 ఏకంగా 17 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 75 బంతుల్లోనే 119 పరుగులతో సత్తా చాటింది. గాబీకి తోడుగా వన్డౌన్ బ్యాటర్ ఓర్లా ప్రెండ్రెర్గాస్ట్(38) రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి ఐరిష్ జట్టు 173 పరుగులు స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఆదిలోనే తమ ఓపెనర్ విష్మి గుణరత్నె(1) వికెట్ కోల్పోయింది.రాణించిన హర్షిత, కవిశా.. కానీ ఓటమి తప్పలేదుఅయితే, మరో ఓపెనింగ్ బ్యాటర్ హర్షిత సమరవిక్రమ 65 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దింది. నాలుగో స్థానంలో వచ్చిన కవిశా దిల్హారీ 51 పరుగులతో అజేయంగా నిలవగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం కరువైంది. ఫలితంగా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగిన శ్రీలంక ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.ఈ నేపథ్యంలో ఐర్లాండ్ మహిళా జట్టుకు శ్రీలంకపై తొలి అంతర్జాతీయ విజయం దక్కింది. ఐరిష్ బౌలర్లలో ఫ్రెయా సార్గెంట్, ఓర్లా ప్రెండ్రెర్గాస్ట్ రెండేసి వికెట్లు తీయగా.. జానే మాగ్విరే, అవా కానింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక రెండో టీ20లో విజయంతో సిరీస్ను 1-1తో సమం చేసింది ఐర్లాండ్. గాబీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.What. A. Game. https://t.co/PL5dcMepch— Cricket Ireland (@cricketireland) August 13, 2024 చదవండి: The Hundred 2024: కళ్లుచెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే(వీడియో) -
రూ.4.56 కోట్ల బంగారం బిస్కెట్లు సీజ్
సాక్షి, చెన్నై: సముద్ర మార్గంలో శ్రీలంక నుంచి తమిళనాడులోకి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని మదురై రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.4.56 కోట్ల విలువైన 6.6 కేజీల బంగారం బిస్కెట్లు స్వా«దీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం సిబ్బంది రామనాథపురం జిల్లా మండపం, రామేశ్వరం సముద్ర తీరంలో నిఘా వేశారు.శ్రీలంక నుంచి ఓ పడవలో వచి్చన ఇద్దరు వ్యక్తులు కారులో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించి, వారిని వెంబడించారు. తిరుప్పాచెట్టి టోల్గేట్ వద్ద కారును చుట్టుముట్టి అందులో ఉన్న 6.6 కేజీల బంగారం బిస్కెట్లు సీజ్ చేశారు. వీటిని తరలిస్తున్న కీలకరైకు చెందిన సాధిక్ అలీ, షేక్ సద్దార్ను అరెస్టు చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.4.56 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. -
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక బ్యాటింగ్ కోచ్గా ఇంగ్లండ్ మాజీ ప్లేయర్
ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ను నియమించుకుంది. ప్రత్యర్ధి జట్టుకు చెందిన మాజీ ఆటగాడిని శ్రీలంక జట్టు బ్యాటింగ్ కోచ్గా ఎంపిక చేసుకుంది. ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ ఇయాన్ బెల్ లంకతో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు శ్రీలంక బ్యాటింగ్ కోచ్గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని లంక బోర్డు ఇవాళ (ఆగస్ట్ 13) ప్రకటించింది.42 ఏళ్ల ఇయాన్ బెల్ 2004-15 మధ్యలో ఇంగ్లండ్ తరఫున 118 టెస్ట్లు, 161 వన్డేలు, 8 టీ20లు ఆడాడు. టెస్ట్ల్లో 22 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీల సాయంతో 7727 పరుగులు.. వన్డేల్లో 4 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 5416 పరుగులు.. టీ20ల్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 188 పరుగులు చేశాడు.బెల్ను బ్యాటింగ్ కోచ్గా నియమించుకోవడం వెనుక శ్రీలంక క్రికెట్ బోర్డుది పెద్ద వ్యూహరచనే ఉంది. బెల్కు ఇంగ్లండ్ జట్టుతో సుదీర్ఘ అనుబంధం ఉంది కాబటి, ఆ జట్టు లోటుపాట్లు తెలిసే అవకాశం ఉంది. అలాగే బ్యాటింగ్ కోచ్గా కూడా బెల్కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఈ అంశాలన్నీ ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంకకు కలిసొచ్చే అవకాశం ఉంది.ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు..ధనంజయ డిసిల్వ (కెప్టెన్), దిముత్ కరుణరత్నే, నిషన్ మధుష్క, పథుమ్ నిస్సంక, కుసాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండీమల్, కమిందు మెండిస్, సమరవిక్రమ, అశిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, కసున్ రజిత, లహీరు కుమార, నిసాల తారక, ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్, జెఫ్రీ వాండర్సే, మిలన్ రత్నాయకేఇంగ్లండ్ జట్టు..హ్యారీ బ్రూక్, డేనియల్ లారెన్స్, బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), క్రిస్ వోక్స్, జోర్డన్ కాక్స్, ఓలీ పోప్, జేమీ స్మిత్ (వికెట్కీపర్), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, మార్క్ వుడ్షెడ్యూల్..ఆగస్ట్ 21-25: తొలి టెస్ట్ (మాంచెస్టర్)ఆగస్ట్ 29-సెప్టెంబర్: రెండో టెస్ట్ (లార్డ్స్)సెప్టెంబర్ 6-10: మూడో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) -
India vs Sri Lanka: 27 ఏళ్ల తర్వాత... శ్రీలంక జట్టుకు వన్డే సిరీస్ కోల్పోయిన భారత్
కొలంబో: ఆతిథ్య స్పిన్ను ఎదుర్కోలేక బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో భారత జట్టు సిరీస్ను సమం చేసుకోలేకపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేకపోయిన టీమిండియా సిరీస్ను 0–2తో శ్రీలంకకు సమరి్పంచుకుంది. బుధవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో శ్రీలంక 110 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా టీమిండియాపై 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓపెనర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవిష్క ఫెర్నాండో (102 బంతుల్లో 96; 9 ఫోర్లు, 2 సిక్స్లు), కుశాల్ మెండిస్ (82 బంతుల్లో 59; 4 ఫోర్లు) రాణించారు. రియాన్ పరాగ్ 3 వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 26.1 ఓవర్లలో 138 పరుగుల వద్దే కుప్పకూలింది. రోహిత్ శర్మ (20 బంతుల్లో 35; 6 ఫోర్లు, 1 సిక్స్) చేసిన పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోర్! తర్వాత టెయిలెండర్ వాషింగ్టన్ సుందర్ (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుగ్గా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దునిత్ వెలలగే (5/27) చావుదెబ్బ తీయగా, వాండెర్సే, తీక్షణ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తమకు కలిసొచి్చన స్పిన్ ట్రాక్పై పది వికెట్లలో స్పిన్నర్లే 9 వికెట్లు పడగొట్టేశారు. టాపార్డర్ రాణింపుతో... టాస్ నెగ్గగానే బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఓపెనర్లు నిసాంక, అవిష్క ఫెర్నాండో శుభారంభమిచ్చారు. ఓపెనర్లిద్దరు భారత బౌలర్లపై ఆధిపత్యాన్ని కొనసాగించారు. స్పిన్నర్లను దించినా యథేచ్ఛగా పరుగులు రాబట్టారు. ఎట్టకేలకు ఓపెనింగ్ వికెట్కు 89 పరుగులు జతయ్యాక నిసాంకను అక్షర్ అవుట్ చేశాడు. కానీ తర్వాత వచి్చన కుశాల్తో అవిష్క మరో భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాడు. 65 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకొని సెంచరీ దిశగా సాగుతున్న అవిష్కను జట్టు స్కోరు 171 వద్ద పరాగ్ పెవిలియన్ చేర్చడంతో రెండో వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అసలంక (10), సమరవిక్రమ (0), జనిత్ (8), వెలలగే (2)లపై భారత బౌలర్లు ప్రభావం చూపారు. 77 బంతుల్లో ఫిఫ్టీ చేసిన కుశాల్ను కుల్దీప్ బోల్తా కొట్టించడంతో లంకను 250 పరుగుల్లోపే కట్టడి చేశారు. ఈసారి వెలలగే వలలో... ఓపెనర్, కెపె్టన్ రోహిత్ ఎప్పట్లాగే తనశైలి దూకుడుతో ఆరంభం నుంచే ధాటిగా పరుగులు రాబట్టే పనిలో పడ్డాడు. కానీ శుబ్మన్ గిల్ (6) సీమర్ అసిత ఫెర్నాండో వేసిన ఐదో ఓవర్లోనే క్లీన్»ౌల్డయ్యాడు. కోహ్లి (18 బంతుల్లో 20; 4 ఫోర్లు)తో కలిసి ‘హిట్మ్యాన్’ జట్టు స్కోరును 50 పరుగులు దాటించాడు. కానీ కాసేపటికే వెలలగే స్పిన్ మ్యాజిక్కు రోహిత్ వికెట్ సమరి్పంచుకోవడంతో గత రెండు మ్యాచ్ల వైనమే ఇందులోనూ కొనసాగింది. కెప్టెన్ వికెట్ పడగానే షరామామూలుగా రిషభ్ పంత్ (9), కోహ్లి, అక్షర్ పటేల్ (2), శ్రేయస్ అయ్యర్ (8) పెవిలియన్కు క్యూకట్టడంతో 82 పరుగులకే భారత్ 6 వికెట్లను కోల్పోయి పరాజయానికి సిద్ధమైంది. జట్టుస్కోరు 100 పరుగులకు చేరగానే వాండెర్సే... పరాగ్ (15)ను, తదుపరి ఓవర్లో శివమ్ దూబే (9)ను పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ కొట్టిన ఆ కొద్దిపాటి మెరుపులతో వంద పైచిలుకు స్కోరు చేసిందే తప్ప కనీసం 150 దగ్గరకు వెళ్లలేకపోయింది. సుందర్ను తీక్షణ, కుల్దీప్ (6)ను వెలలగే అవుట్ చేయడంతో భారత్ ఆలౌటైంది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) పంత్ (బి) అక్షర్ 45; అవిష్క (ఎల్బీడబ్ల్యూ) (బి) పరాగ్ 96; కుశాల్ (సి) గిల్ (బి) కుల్దీప్ 59; అసలంక (ఎల్బీడబ్ల్యూ) (బి) పరాగ్ 10; సమరవిక్రమ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 0; జనిత్ (బి) సుందర్ 8; వెలలగే (బి) పరాగ్ 2; కమిండు (నాటౌట్) 23; తీక్షణ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 2; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–89, 2–171, 3–183, 4–184, 5–196, 6–199, 7–235. బౌలింగ్: సిరాజ్ 9–0–78–1, శివమ్ దూబే 4–0–9–0, అక్షర్ 10–1–41–1, సుందర్ 8–1–29–1, కుల్దీప్ 10–0–36–1, రియాన్ పరాగ్ 9–0–54–3. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) కుశాల్ (బి) వెలలగే 35; గిల్ (బి) అసిత ఫెర్నాండో 6; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 20; పంత్ (స్టంప్డ్) కుశాల్ (బి) తీక్షణ 6; అయ్యర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 8; అక్షర్ (బి) వెలలగే 2; పరాగ్ (బి) వాండెర్సే 15; దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 9; సుందర్ (సి) వాండెర్సే (బి) తీక్షణ 30; కుల్దీప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 6; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 1; మొత్తం (26.1 ఓవర్లలో ఆలౌట్) 138. వికెట్ల పతనం: 1–37, 2–53, 3–63, 4–71, 5–73, 6–82, 7–100, 8–101, 9–138, 10–138. బౌలింగ్: అసిత ఫెర్నాండో 5–0–29–1, తీక్షణ 8–0–45–2, వెలలగే 5.1–0–27–5, వాండెర్సే 5–0–34–2, అసలంక 3–1–2–0. -
శ్రీలంకతో మూడో వన్డే.. చిత్తుగా ఓడిన టీమిండియా
శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటై 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో అసలంక 10, సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్లో భారత్పై విజయం సాధించడం విశేషం. -
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్.. లంక జట్టు ప్రకటన.. 'సిక్సర్' వీరుడికి చోటు
ఆగస్ట్ 21 నుంచి ఇంగ్లండ్తో జరిగే మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం 18 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (ఆగస్ట్ 7) ప్రకటించారు. ఈ జట్టుకు ధనంజయ డిసిల్వ సారథ్యం వహించనుండగా.. కుసల్ మెండిస్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇటీవల భారత్తో జరిగిన వన్డేలో ఆరు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టిన జెఫ్రీ వాండర్సే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.నిసాల తారక, మిలన్ రత్నాయకే కొత్తగా జట్టులోకి వచ్చారు. వీరిద్దరికి ఘనమైన దేశవాలీ ట్రాక్ రికార్డు ఉంది. తారక 107 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 257 వికెట్లు.. రత్నాయకే 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 79 వికెట్లు పడగొట్టాడు. తారక, రత్నాయకే.. లహీరు కుమార, విశ్వ ఫెర్నాండో, అషిత ఫెర్నాండో, కసున్ రజితలతో కలిసి పేస్ విభాగంలో ఉంటారు.స్పిన్ డిపార్ట్మెంట్లో వాండర్సేతో పాటు ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ ఉన్నారు. దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, ధనంజయ డిసిల్వ, కమిందు మెండిస్లతో లంక బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.ఇంగ్లండ్ టెస్టులకు శ్రీలంక జట్టు: ధనంజయ డిసిల్వా (కెప్టెన్), దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, పాతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్ (వైస్ కెప్టెన్), ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, అసిత ఫెర్నాండో, విశ్వా ఫెర్నాండో, విశ్వా ఫెర్నాండో, లహిరు కుమార, నిసాల తారక, ప్రభాత్ జయసూర్య, రమేష్ మెండిస్, జెఫ్రీ వాండర్సే, మిలన్ రత్నాయకేఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్..తొలి టెస్ట్- ఆగస్ట్ 21-25 (ఓల్డ్ ట్రాఫోర్డ్)రెండో టెస్ట్- ఆగస్ట్ 29-సెప్టెంబర్ 2 (లార్డ్స్)మూడో టెస్ట్- సెప్టెంబర్ 6-10 (కెన్నింగ్స్టన్ ఓవల్) -
మూడో వన్డేలోనూ ఓటమి.. సిరీస్ కోల్పోయిన భారత్
శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో అసలంక 10, సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది.తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా138 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్లో వాండర్సేకు క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (30) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా101 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్లో శివమ్ దూబే (9) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్100 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్లో రియాన్ పరాగ్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.శివమ్ దూబే (9), వాషింగ్టన్ సుందర్ క్రీజ్లో ఉన్నారు.86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా249 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 82 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. దునిత్ వెల్లలగే 4 వికెట్లు తీసి టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. రోహిత్ 35, గిల్ 6, విరాట్ 20, రిషబ్ పంత్ 6, శ్రేయస్ అయ్యర్ 8, అక్షర్ పటేల్ 2 ఔట్ కాగా.. రియాన్ పరాగ్ 10, శివమ్ దూబే 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అషిత ఫెర్నాండో, తీక్షణ తలో వికెట్ పడగొట్టారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్లో శుభ్మన్ గిల్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్లో రోహిత్ (13 బంతుల్లో 31; 5 ఫోర్లు, సిక్స్) చెలరేగి ఆడుతున్నాడు. రాణించిన రియాన్ పరాగ్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన శ్రీలంకకొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా శ్రీలంక నామమాత్రపు స్కోర్కే (248/7) పరిమితమైంది. కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న రియాన్ పరాగ్ బంతితో రాణించాడు. రియాన్ 9 ఓవర్లలో 54 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబూ నాలుగు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్ ధారళంగా పరుగులు సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు. సిరాజ్ 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు.తృటిలో సెంచరీ చేజార్చుకున్న అవిష్కటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 89 పరుగులు జోడించారు. అవిష్క నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు.రాణించిన కుసాల్ మెండిస్అవిష్క ఫెర్నాండో ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన కుసాల్ మెండిస్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన కుసాల్ ఏడో వికెట్గా వెనుదిరిగాడు. ఆఖర్లో కమిందు మెండిస్ (23 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లంక ఇన్నింగ్స్లో అసలంక 10, సధీర సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు.ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక235 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి కుసాల్ మెండిస్ (59) ఔటయ్యాడు. మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంకశ్రీలంక మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. 196 పరుగుల వద్ద లియనాగేను (8) వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. 199 పరుగుల వద్ద వెల్లలగేను (2) రియాన్ పరాగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 45 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 207/6గా ఉంది. కుసాల్ మెండిస్ (41), కమిందు మెండిస్ (3) క్రీజ్లో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్సధీర సమరవిక్రమ సిరాజ్ బౌలింగ్లో తానెదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. 39 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 184/4గా ఉంది.మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక183 పరుగుల వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. రియాన్ పరాగ్.. అసలంకను (10) ఎల్బీడబ్ల్యూ చేశాడు.తృటిలో సెంచరీని చేజార్చుకున్న అవిష్కలంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. 96 పరుగుల వద్ద రియాన్ పరాగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 36 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 173/2గా ఉంది. కుసాల్ మెండిస్ (28), అసలంక (2) క్రీజ్లో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక89 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో వికెట్కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి నిస్సంక (45) ఔటయ్యాడు. అవిష్క ఫెర్నాండో (43), కుసాల్ మెండిస్ క్రీజ్లో ఉన్నారు.14 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 65/0ఇన్నింగ్స్ ఆరంభంలో నత్త నడకలా సాగిన శ్రీలంక బ్యాటింగ్ ప్రస్తుతం మెరుగుపడింది. ఆ జట్టు 14 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో 26, నిస్సంక 38 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. నత్త నడకన సాగుతున్న శ్రీలంక బ్యాటింగ్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక నిదానంగా ఆడుతుంది. వారి ఇన్నింగ్స్ నత్త నడకు తలపిస్తుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 28/0గా ఉంది. నిస్సంక 19, అవిష్క ఫెర్నాండో 8 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకొలొంబో వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్ స్థానాల్లో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు లంక సైతం ఓ మార్పు చేసింది. అఖిల ధనంజయ స్థానంలో మహేశ్ తీక్షణ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో లంక విజయం సాధించింది.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్కీపర్), శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్శ్రీలంక: పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియానాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో -
శ్రీలంకతో మూడో వన్డే.. మళ్లీ టాస్ ఓడిన టీమిండియా..కేఎల్ రాహుల్పై వేటు
కొలొంబో వేదికగా శ్రీలంకతో ఇవాళ (ఆగస్ట్ 7) జరుగనున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేయనుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో టీమిండియా టాస్ ఓడటం ఇది వరుసగా మూడోసారి. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్ స్థానాల్లో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు లంక సైతం ఓ మార్పు చేసింది. అఖిల ధనంజయ స్థానంలో మహేశ్ తీక్షణ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో లంక విజయం సాధించింది.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్కీపర్), శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్శ్రీలంక: పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియనాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో -
సమం చేస్తారా.. సమర్పిస్తారా!
కొలంబో: టి20 సిరీస్ను సులువుగా గెలుచుకున్న టీమిండియాకు వన్డే సిరీస్ గెలుపు కూడా లాంఛనమే అనిపించింది. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో ఉన్న పూర్తిస్థాయి టీమిండియాకు వన్డేల్లో ఎవరూ ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి. తొలి వన్డేను గెలుపు మెట్టుపై ‘టై’ చేసుకున్న రోహిత్ బృందం రెండో మ్యాచ్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 97/0తో పటిష్టస్థితిలో ఉండి కూడా... లంక స్పిన్ మాయాజాలానికి అనూహ్యంగా కుప్పకూలింది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ భారత్ ఆలౌటైంది. బంతులు మాత్రం మిగిలిపోయాయి. అంటే మన బ్యాటర్లు క్రీజులో నిలువడమే కష్టమైపోతోంది. కోహ్లి, రాహుల్లాంటి సీనియర్లపై కూడా ఆతిథ్య స్పిన్ బౌలింగ్ ఆధిపత్యం చలాయిస్తోంది. ఇది జట్టును కలవరపెడుతోంది. మరోవైపు 1–0తో సిరీస్లో ఆధిక్యంలో ఉన్న శ్రీలంక ఇప్పుడు ఇదే ఉత్సాహంతో ఆఖరి పోరులో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మన బ్యాట్లకు పని చెప్పాల్సిందే! ఈ పర్యటనలో భారత్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లాడింది. మూడు టి20లు సహా, గత రెండు వన్డేల్లోనూ బౌలర్లు ప్రతాపం చూపారు. కానీ బ్యాటర్లే ఆ రేంజ్లో రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా వన్డేల్లో చక్కని శుభారంభాలు వచి్చనా... కెపె్టన్ రోహిత్ శర్మ ధాటైన బ్యాటింగ్తో లక్ష్యాన్ని సులువుగా మారుస్తున్నా... తర్వాత వచి్చ న బ్యాటర్లు మిగిలిన లక్ష్యాన్ని ఛేదించలేకపోవడమే పెద్ద సమస్యగా మారింది.దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన టీమ్ మేనేజ్మెంట్ ఆఖరి పోరులో తమ బ్యాటింగ్ దళాన్ని సన్నద్ధం చేస్తోంది. రోహిత్ ఆడినట్లే టాపార్డర్లో కోహ్లి, మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఏ కాస్తోకూస్తో ఆడినా... కొన్ని ఓవర్లు క్రీజులో పాతుకుపోయినా ఎంతటి స్పిన్నయినా తుత్తునీయలు చేయొచ్చు. జోరు మీదున్న లంక టి20 సిరీస్లో క్లీన్స్వీప్తో పల్లెకెలెలో పోగొట్టుకున్న పరువును కొలంబోలో కొల్లగొట్టాలని ఆతిథ్య శ్రీలంక పట్టుదలతో ఉంది. చక్కగా స్పిన్కు అనుకూలించే పిచ్పై బౌలర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. పటిష్టమైన ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను తేలిగ్గా కూల్చేస్తున్నారు. పైగా 1–0తో ఉన్న శ్రీలంక ఇప్పుడు సిరీస్ కోల్పోలేని స్థితిలో ఉంది. ఒత్తిడేమో భారత్పై ఉంది. దీన్ని సది్వనియోగం చేసుకొని తమ స్పిన్తో తిప్పేయాలని వాండెర్సే, అసలంక పిడికిలి బిగిస్తున్నారు. కొలంబో వేదికపై లక్ష్యఛేదన మ్యాచ్ సాగేకొద్దీ కష్టతరమవుతోంది కాబట్టి టాస్ గెలిస్తే మాత్రం మరో మాటకు తావులేకుండా ఏ జట్టయినా బ్యాటింగే ఎంచుకోవడం ఖాయం. పిచ్, వాతావరణం కొలంబో పిచ్ స్పిన్కు స్వర్గధామం. దీనివల్లే ఆతిథ్య స్పిన్నర్లు చెలరేగుతున్నారు. బ్యాటర్లు జాగ్రత్త పడాల్సిందే! వర్ష సూచన ఉన్నా... మ్యాచ్కైతే ఇబ్బంది ఉండకపోవచ్చు. -
స్పిన్ వలలో చిక్కిన భారత్.. 32 పరుగుల తేడాతో ఓటమి
కొలంబో: భారత్ ముందున్న లక్ష్యం 241. రోహిత్ శర్మ మెరుపులతో 13.2 ఓవర్లలోనే భారత్ (97/0) వందకు చేరువైంది. ఈ స్కోరు చూసిన వారెవరికైనా భారత్ గెలుపు సులువే అనిపిస్తుంది. కానీ ‘హిట్మ్యాన్’ అవుటవడంతోనే భారత్ మెడకు లంక స్పిన్ ఉచ్చు బిగించింది. అంతే 208 పరుగులకే భారత్ కుప్పకూలింది. దీంతో తొలి వన్డేను ‘టై’ చేసుకున్న ఆతిథ్య శ్రీలంక రెండో వన్డేలో 32 పరుగులతో విజయం సాధించింది. టి20ల్లో క్లీన్స్వీప్ అయిన లంక వన్డేల్లో 1–0తో ఇక సిరీస్ కోల్పోలేని స్థితిలో నిలిచింది. మొదట శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (62 బంతుల్లో 40; 5 ఫోర్లు), కమిండు మెండిస్ (44 బంతుల్లో 40; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. వాషింగ్టన్ సుందర్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం టీమిండియా 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్లు), అక్షర్ పటేల్ (44 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లెగ్ స్పిన్నర్ జెఫ్రే వాండెర్సే (6/33) ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. అసలంక 3 వికెట్లు తీశాడు. సిరీస్లోని చివరిదైన మూడో వన్డే బుధవారం జరుగుతుంది. తొలి బంతికే వికెట్... ఫామ్లో ఉన్న ఓపెనర్ నిసాంక (0)ను ఇన్నింగ్స్ తొలి బంతికే భారత బౌలర్ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (42 బంతుల్లో 30; 3 ఫోర్లు) కుదురుగా ఇన్నింగ్స్ను నడిపించారు. అయితే సుందర్ తన వరుస ఓవర్లలో ఫెర్నాండో, కుశాల్లను అవుట్ చేయడంతో 74 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. దీంతోపాటు 79 పరుగుల వద్ద మూడు వికెట్లను కోల్పోయింది. తర్వాత కెప్టెన్ చరిత్ అసలంక (42 బంతుల్లో 25; 3 ఫోర్లు), సమరవిక్రమ (14) జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. అక్షర్ ఈ జోడీని ఎక్కువసేపు నిలువనీయలేదు. సమరవిక్రమను అవుట్ చేయడంతో 111 పరుగుల వద్ద నాలుగో వికెట్ పడింది. కొద్దిసేపటి తర్వాత జనిత్ లియనగే (12)ను కుల్దీప్, అసలంకను సుందర్ అవుట్ చేయడంతో లంక ఒక దశలో 136 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఇలాంటి పరిస్థితిలో భారత బౌలర్లు పట్టుబిగించకుండా కమిండు మెండిస్ (44 బంతుల్లో 40; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. దునిత్ వెలలగే (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్స్లు)తో కలిసి కమిండు ఏడో వికెట్కు చకచకా 72 పరుగులు జోడించడం లంకను నిలబెట్టింది. దునిత్ అవుటయ్యాక కూడా స్కోరులో వేగం తగ్గకుండా కమిండు, అకిల ధనంజయ (15; 2 ఫోర్లు) పరుగులు సాధించడంతో ఆఖరి 5 ఓవర్లలో శ్రీలంక 44 పరుగులు చేసింది. సిరాజ్, అక్షర్ పటేల్లకు చెరో వికెట్ దక్కింది. రోహిత్ ఉన్నంత వరకే... ఓపెనర్లు రోహిత్, శుబ్మన్ గిల్ (44 బంతుల్లో 35; 3 ఫోర్లు) తొలి వన్డే కంటే మరింత పటిష్టమైన పునాది వేశారు. నాలుగో ఓవర్ నుంచి కెప్టెన్ రోహిత్ దూకుడు పెంచాడు. వెలలగే వేసిన ఆ ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. అసిత ఏడో ఓవర్లో ఫోర్, సిక్సర్ కొట్టాడు. దీంతో జట్టు స్కోరు 50కి చేరింది. తర్వాత ధనంజయ, కమిండు మెండిస్ ఓవర్లలో భారీ సిక్సర్లతో రోహిత్ 29 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. 10 ఓవర్లలో భారత్ స్కోరు 76/0. వెలలగే వేసిన 13వ ఓవర్లో సిక్స్ కొట్టిన రోహిత్... తర్వాతి వాండెర్సే బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడి నిసాంక చేతికి చిక్కాడు. దీంతో 97 పరుగుల ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి బౌండరీతో ఆ ఓవర్లోనే జట్టు స్కోరు వంద దాటింది. కానీ కాసేపటికే వాండెర్సే ఒకే ఓవర్లో గిల్, దూబే (0)లను అవుట్ చేశాడు. తన తదుపరి ఓవర్లలో కోహ్లి (14), శ్రేయస్ అయ్యర్ (7) వికెట్లు తీశాడు. దీంతో 133 పరుగులకే భారత్ సగం వికెట్లను కోల్పోయింది. అక్షర్ ధాటిగా ఆడుతుంటే... ఇంకోవైపు కేఎల్ రాహుల్ (0)ను వాండెర్సే డకౌట్ చేశాడు. అక్షర్, సుందర్ (15) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నప్పటికీ జట్టును ఒడ్డున పడేయలేకపోయారు. వీళ్లిద్దరితో పాటు సిరాజ్ను అసలంక పెవిలియన్ చేర్చడంతో 201 పరుగుల వద్దే భారత్ 9వ వికెట్ కోల్పోయింది. అర్‡్షదీప్ (3) రనౌట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) రాహుల్ (బి) సిరాజ్ 0; అవిష్క (సి అండ్ బి) సుందర్ 40; కుశాల్ మెండిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సుందర్ 30; సమరవిక్రమ (సి) కోహ్లి (బి) అక్షర్ 14; అసలంక (సి) అక్షర్ (బి) సుందర్ 25; జనిత్ (సి అండ్ బి) కుల్దీప్ 12; వెలలగే (సి) దూబే (బి) కుల్దీప్ 39; కమిండు (రనౌట్) 40; ధనంజయ (రనౌట్) 15; వాండెర్సే (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 240. వికెట్ల పతనం: 1–0, 2–74, 3–79, 4–111, 5–136, 6–136, 7–208, 8–239, 9–240. బౌలింగ్: సిరాజ్ 8–1–43–1, అర్‡్ష దీప్ 9–0–58–0, అక్షర్ 9–0–38–1, శివమ్ దూబే 2–0–10–0, సుందర్ 10–1–30–3, కుల్దీప్ 10–1–33–2, రోహిత్ 2–0–11–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) నిసాంక (బి) వాండెర్సే 64; గిల్ (సి) కమిండు (బి) వాండెర్సే 35; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 14; దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 0; అక్షర్ (సి అండ్ బి) అసలంక 44; అయ్యర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 7; రాహుల్ (బి) వాండెర్సే 0; సుందర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అసలంక 15; కుల్దీప్ (నాటౌట్) 7; సిరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అసలంక 4; అర్‡్షదీప్ (రనౌట్) 3; ఎక్స్ట్రాలు 15; మొత్తం (42.2 ఓవర్లలో ఆలౌట్) 208. వికెట్ల పతనం: 1–97, 2–116, 3–116, 4–123, 5–133, 6–147, 7–185, 8–190, 9–201, 10–208. బౌలింగ్: అసిత ఫెర్నాండో 7–0–31–0, వెలలగే 6–0–41–0, ధనంజయ 10–1–54–0, కమిండు మెండిస్ 3–0–19–0, వాండెర్సే 10–0–33–6, అసలంక 6.2–2–20–3. -
లంకతో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
ఈ నెల (ఆగస్ట్) 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం 14 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 4) ప్రకటించారు. ఈ జట్టుకు బెన్ స్టోక్స్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. జోర్డన్ కాక్స్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్ కొత్తగా ఎంపికయ్యారు. లంకతో సిరీస్లో తొలి టెస్ట్ ఆగస్ట్ 21న (ఓల్డ్ ట్రాఫోర్డ్).. రెండో టెస్ట్ ఆగస్ట్ 29న (లార్డ్స్).. మూడో టెస్ట్ సెప్టంబర్ 6న (కెన్నింగ్స్టన్ ఓవల్) మొదలుకానున్నాయి. ఇంగ్లండ్ ఇటీవలే స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.శ్రీలంకతో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టు..బెన్ స్టోక్స్ (కెప్టెన్), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జోర్డన్ కాక్స్, బెన్ డకెట్, డాన్ లారెన్స్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్కీపర్), ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ -
శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా లక్ష్యం ఎంతంటే..?
కొలంబో వేదికగా భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి (టాస్ గెలిచి) నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే.