
సమ్మక్క-సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలి
ములుగును జిల్లాగా ఏర్పాటు చేసి దానికి సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏటూరు నాగారంలో 163 వ నెంబర్ జాతీయరహదారిపై మానవహారం ఏర్పాటు చేసి రాస్తారోకో చేపట్టారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు పర్చాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీని విడదీస్తే ఊరుకోమని హెచ్చరించారు. విద్యార్థులు, స్థానిక నాయకుల ఆందోళనతో కాసేపు ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.