-
తెలంగాణలో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’.. ఆ రెండు స్థానాలపై స్పెషల్ ఫోకస్!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలపై అన్ని ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ దూకుడు పెంచాయి. అన్ని పార్టీలు ప్రచారంలో ఆరాటం,ఆర్భాటం, పోరాటం ప్రదర్శిస్తున్నాయి. గతంలో ఇప్పుడు లేని విధంగా వరంగల్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ప్రచారానికి తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతున్నాయి. కాంగ్రెస్ తరపున ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహబూబాద్, వరంగల్ బహిరంగ సభలో పాల్గొనగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను, మంత్రులను, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన లీడర్లను ప్రచారంలోకి దింపుతున్నాయి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కాజీపేట వరంగల్ హనుమకొండలో రోడ్ షోలో పాల్గొనున్నారు. దీంతో వరంగల్లో టిఆర్ఎస్లో జోష్ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావులు సైతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే వరంగల్లో కేటీఆర్ పర్యటన పూర్తి కాగా, పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో, అంతకు ముందు వరంగల్ లోక్సభ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సన్నాహాక సమావేశంలో హరీశ్రావు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.వరంగల్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పర్యటన వరంగల్, హనుమకొండ పట్టణాల్లో జరిగే కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించనున్నారు. కేసీఆర్ రోడోషోకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇప్పటికే ఖరారు కాగా హన్మకొండ జిల్లా బీఆర్ ఎస్ అధ్యక్షుడు వినయ్భాస్కర్, మాజీమంత్రి దయాకర్రావు ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షించారు.మే 1న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు రోడ్ షోలో పాల్గొన్న అనంతరం మానుకోట జిల్లా కేంద్రంలోనే బస చేయనున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మానుకోట, హన్మకొండ జిల్లా కేంద్రాల్లో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభల్లో పాల్గొని పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు, శ్రేణులకు సందేశమిస్తూనే కాంగ్రెస్ పార్టీ విధానాలను, ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజలకు ముఖ్యమంత్రి వివరించారు. ఈనెల 30 భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో నిర్వహించే కాంగ్రెస్ జన జాతర సభకు హాజరుకానున్నారు. వరంగల్ పార్లమెంటరీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతున్న రెండో బహిరంగ సభ కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఒకే లోక్సభ నియోజకవర్గం పరిధిలో రెండో బహిరంగ సభ జరగలేదు. వరంగల్ లోక్సభ పరిధిలోనే నిర్వహిస్తున్న రెండో సభకు సీఎం హాజరవుతుండటం విశేషం. 30వ తేదీన రేగొండ మండల కేంద్రంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా రానున్న నేపథ్యంలో శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ గెలిపించాలని కోరుతూ.. మే 3న హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ శివారులో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. నరేంద్ర మోదీతో పాటు జాతీయ స్థాయి నేతలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. వరంగల్ లోక్సభ సీటుపై కన్నేసిన బీజేపీ ఈస్థానంలో గెలుపునకు అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వాసంతో ఉంది.ఆరూరి రమేష్ నామినేషన్కు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హాజరుకాగా, నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిశాక బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేషన్లకు ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29న ముగియనుండటంతో బరిలో ఎంతమంది అభ్యర్థులు నిలచేది..? ఎవరెవరు అభ్యర్థులుగా మిగలబోతున్నారు..? అభ్యర్థుల్లో ప్రధాన ప్రత్యర్థులు ఎవరనేది క్లారిటీ రానుంది. మే 1 నుంచి సరిగ్గా పదకొండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం జోరుగా సాగనుంది. -
వరంగల్: బైక్పై నలుగురు.. ప్రమాదంలో అక్కడికక్కడే మృతి
సాక్షి, వరంగల్: నలుగురు యువకుల ప్రాణాలను బస్సు రూపంలో మృత్యువు కబలించింది. నిర్లక్ష్యపు ప్రయాణానికి నాలుగు ప్రాణాలు గాల్లో కలిసాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకున్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ హృదయ విదారకఘటన వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది.వర్ధన్నపేట నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సును ఇల్లందు నుంచి వర్ధన్నపేట వైపు వస్తున్న ద్విచక్రవాహనం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా. మరో యువకుడు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతులు వరుణ్ తేజ(18), సిద్దు(18),గణేష్(18), రనిల్ కుమార్(18) లుగా పోలీసులు గుర్తించారు.నలుగురు యువకులు స్నేహితులు, ప్రమాద సమయంలో ఒక్క ద్విచక్ర వాహనంపై నలుగురు యువకులు ప్రయాణించారు. మృతులు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందినవారు కాగా యువకుల మృతితో వారి కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతంగా మారగా ఇల్లంద గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. -
వరంగల్ జిల్లాలో కలకలం రేపిన సబ్ రిజిస్ట్రార్ తస్లిమా వ్యవహారం
-
పెళ్లి ఇష్టం లేక వరుడి ఆత్మహత్య?
హసన్పర్తి/వర్ధన్నపేట: రెండు రోజుల క్రితం అదృశ్యమైన వరుడు కృష్ణ తేజ శవమై లభించాడు. వర్ధన్నపేట సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో పోలీసులు.. వరుడి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నగరంలోని గోకుల నగర్కు చెందిన భూక్యా కృష్ణ తేజ(29) వివాహం ఈనెల 16న నర్సంపేటకు చెందిన ఓ యువతితో జరగనుంది. బంధువులు, మిత్రులకు పెళ్లి పత్రికల పంపిణీ చేయడం ప్రారంభించారు. పెళ్లి ఇష్టం లేకనే? కృష్ణతేజకు పెళ్లి ఇష్టం లేకనే ఎస్సారెస్పీ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 10న పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన కృష్ణ తేజ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై బంధువులు, మిత్రుల ఇళ్లల్లో గాలించారు. ఆచూకీ లభ్యం కాలేదు. అయితే పలివేల్పులలోని ఎస్సారెస్పీ కాల్వ కట్టపై ఓ బైక్ పార్క్ చేసి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై రాజ్కుమార్ ఘటనా స్థలికి చేరుకుని బైక్ను పరిశీలించారు. అందులో పెళ్లి పత్రికలు లభ్యంకాగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు కృష్ణతేజ తల్లి శకుంతల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ప్రమాదవశాత్తు కాల్వలో పడ్డాడా? లేక పెళ్లి ఇష్టం లేక పారిపోయాడా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో మంగళవారం వర్ధన్నపేట మండలంలోని శ్రీ రామోజీ కుమ్మరిగూడెం శివారులోని ఎస్సీరెస్పీ కాల్వలో కృష్ణాతేజ మృతదేహం లభ్యమైంది. -
విరిగిన స్టీరింగ్ రాడ్..
చెన్నారావుపేట: వరంగల్ జిల్లాలో స్టీరింగ్ రాడ్ విరగడంతో ఆర్టీసీ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్ శివారులో ఆదివారం ఈ ఘటన జరిగింది. నర్సంపేట డిపో నుంచి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు మండల పరిధిలోని బోజేర్వు గ్రామానికి వెళ్లింది. అక్కడి నుంచి 30 మంది ప్రయాణికులతో నర్సంపేటకు వస్తున్న క్రమంలో తిమ్మరాయినిపహాడ్ శివారుకు రాగానే బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయింది. అందులో బురద ఉండటంతో బస్సు కూరుకుపోయి పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి క్షతగాత్రులను నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. -
చిత్రకళకు కొండంత చిరునామా
ఆ చిత్రాలను చూస్తే మన కనులకు ఆహ్లాదం మన మనసుకు ఆనం దం. సప్తవర్ణ సోయగాలు బొమ్మలుగా సాక్షాత్కరిస్తాయి. విశాలంగా రెక్కలార్చిన పక్షులూ, శరవేగంగా పరుగులెత్తే జింకలూ ఎలా కాన్వా స్పై రంగుల్లో నిలిచిపోతాయో, గలగల సెలయేరులూ గంగానది ప్రవా హాలు కళ్ళ ముందు నిలుస్తాయి. అభిజ్ఞాన శాకుంతల కావ్యమైనా, రామాయణ భారత భాగవతాది కథలైనా వారి కుంచె విన్యాసాల్లో ఒదిగిపోతాయి. కోతుల నాడించే మదారి అయినా, పల్లెటూరి జంట అయినా, అరకు లోయలో అందాలైనా వారి బొమ్మల్లో గమ్మున కూర్చుంటాయి. వీరనారి ఝాన్సీ రాణీ, మహా పరాక్రమశాలి మహారాణి రుద్రమదేవీ పౌరుషంగా నిలబడతారు. నన్నయ్య, పోతన, వేమన ఇదిగో మేము ఇలా ఉంటాం అంటూ చిత్రాలై వస్తారు. ప్రకృతి చిత్రాల సోయగాల నుండి, సంప్ర దాయ చిత్రాల ఆలోచనల నుండి, సామాజిక చింతన చేతనత్వం వరకు కొండపల్లి శేషగిరి రావు 40వ దశకం నుండి, 2000వ దశకం వరకు 70 ఏళ్ళు చిత్ర కళా జగత్తుకు నిలువెత్తు చిత్రమై నిలిచారు. కొండపల్లి శేషగిరిరావు 1924 జనవరి 27న వరంగల్ జిల్లా మానుకోట దగ్గర ఉన్న పెనుగొండ గ్రామంలో జన్మించారు. పుట్టింది సంపద గల ఇల్లే అయినా, పదేళ్ల బాలుడు అయ్యేసరికి అనివార్య కారణాలతో పేదరి కంలో పడిపోయింది కుటుంబం. పదవ తర గతి వరకు హనుమకొండలో వారాలబ్బా యిగా బ్రతుకు సాగించి చిత్రకళపై ఉన్న మక్కువతో హైదరాబాదుకు ధైర్యాన్ని వెంట బెట్టుకొని నడిచారు. కొందరు ప్రముఖుల సహకారంతో మెహదీ నవాజ్ జంగ్ గారికి పరిచయమై వారి సహాయంతో రెడ్డి హాస్టల్లో జాయిన్ అయి, ‘హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్’లో విద్యా ర్థిగా చేరి నూతన అధ్యాయాన్ని తెరుచుకున్నారు. ఐదేళ్ల చదువును పూర్తి చేసుకుని ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై, చిత్రకారునిగా ఎదిగి, మెహదీ ఫర్మా యిషితో కలకత్తాకు పయనమయ్యారు. రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన ’శాంతినికేతన్’లో శేషగిరిరావు విద్యార్థి అయ్యారు. ప్రముఖ చిత్రకారులు నందాలాల్ బోస్, అవనీంధ్ర నాథ్ ఛటోపాధ్యాయుల ప్రియ శిష్యుడూ అయ్యారు. తరువాత తాను చదువుకున్న ఫైనార్ట్స్ కళాశాలలోనే అధ్యాపకునిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి ప్రొఫెసర్గా, ప్రిన్సిపల్గా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. రిటైర్ అయిన తర్వాత ఎన్నో వందల చిత్రాలను వేశారు. హైదరాబాద్ పరిసరాలలో కనిపించకుండా పోయిన కొండలు, గుట్టలు శేషగిరిరావు చిత్రించిన చిత్రాల్లో వందలాదిగా దర్శనమిస్తాయి. ఆక్వాటెక్చర్లో, కలర్ గ్రాన్యూల్స్ మ్యూరల్ పెయింటింగ్స్లో ఎన్నో కొత్త కొత్త ప్రయో గాలు చేశారు. అమీర్ పేట్ దగ్గర మైత్రి భవన్ హుడా కాంప్లెక్స్ ముఖ ద్వారం రెండువైపులా గోడలపై కనిపించే విశ్వరూప సంద ర్శనం, లవకుశులు చేజిక్కించుకున్న అశ్వమేధ యాగాశ్వ పెయిం టింగ్ ఇప్పుడూ చూసి ఆనందించవచ్చు. ‘చిత్రకళా తపస్వి డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర’ అనే పుస్తకానికి ముందుమాటగా ‘కుంచె సామ్రాజ్య మహారాజు’ అంటూ ఆర్టిస్ట్ మోహన్ రాసిన వ్యాసంలో ‘రావి నారాయణ రెడ్డి పైన నీలా కాశం తేలి, మబ్బుల కాంట్రాస్టులో ఆదర్శమంత ఎత్తెగురు తున్న ఎర్రని జెండా, దానిపై హత్తిన తెల్లని సుత్తి కొడవలి. కళ్ళు నిండిపోతాయి’, ‘నుదుట నామం దిద్దుకుని పరమ సాంప్రదాయకంగా కనిపిస్తూ చిత్రాలు గీసే ఈ పవిత్ర బ్రాహ్మణ మూర్తికి ఎర్రజెండా జబ్బు ఎలా సోకిందబ్బా? అని ఓ నాయకుడిని అడిగాను, ఇలాంటి పెద్ద కమ్యూనిస్టు నాయకులు ఎందరో ఆయనకు జిగిరీ దోస్తులు అని చెప్పాడు’ అన్నారు. ఈ మాటలు శేషగిరి రావు నిండైన సామాజిక మూర్తి మత్వానికి అద్దం పట్టాయి అని చెప్ప వచ్చు. ‘కాకి పడిగెలు’ జానపద చిత్రకళను వెలుగులోకి తెస్తూ రచించిన పరిశోధనాత్మక వ్యాసమైన ‘ఆంధ్రదేశంలో చిత్రకళ’, ‘తెలంగాణాలో చిత్రకళ’, ‘కళ – కల్పనా వైచిత్రి’ వంటి ఎన్నో గొప్ప వ్యాసాలను రచిం చిన కవి, రచయిత కూడా శేషగిరిరావు. ‘చిత్ర శిల్పకళా రామణీ యకము’ వ్యాస సంపుటి వీరి పాండితి గరిమకు నిదర్శనం. మొట్ట మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ‘తెలుగు తల్లి’ విగ్రహానికి రూపకల్పన చేశారు. 2012 జూలై 26న తుది శ్వాస విడిచారు. నేడు ఆ అద్భుత చిత్రకారుడు పుట్టిన రోజు సందర్భంగా శత జయంతి వేడుకలు జరుపుతున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. – డాక్టర్ కొండపల్లి నీహారిణి ‘ రచయిత్రి, సంపాదకురాలు (నేడు కొండపల్లి శేషగిరిరావు శతజయంతి వేడుక జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాదులో ఉదయం 11 గంటలకు జరగనుంది .) -
ఎంజీఎంలో విద్యుత్ అంతరాయం.. పేషెంట్ మృతి
హన్మకొండ: వరంగల్ ఎంజీఎం అస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ అంతరాయంతో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ అంతరాయంతో వెంటిలేటర్ పనిచేయక బొజ్జ బిక్షపతి (45) అనే పేషెంట్ మృతి చెందాడు. నర్సంపేట మండలం రాజేశ్వరపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి ఆర్ఐసీలో చికిత్స పొందుతున్నాడు. ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అయితే నిన్న (శుక్రవారం) విద్యుత్ అంతరాయంతో ఆయనకు అమర్చిన వెంటిలేటర్ కాసేపటి వరకు పనిచేసి ఆగిపోయింది. అదే సమయంలో ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించి జనరేటర్ ఆన్ చేశారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ జనరేటర్ పని చేయకపోవటంతో ఒక్కసారి వెంటిలేటర్ ఆఫ్ అయి రోగి బిక్షపతి మృతి చెందాడు. చదవండి: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ దే హవా
-
ఓరుగల్లు.. పోటీ ఫుల్లు!
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల తీర్పుపై తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓరుగల్లు జనంనాడిపై అందరి దృష్టి ఉంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ ఇక్కడ బలంగా ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ బలపడి నువ్వానేనా అన్నట్టు పోటీలో ఉంది. తొమ్మిదిన్నరేళ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాల నినాదంతో బీఆర్ఎస్ ముందుకెళుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకత, బీఆర్ఎస్ అభ్యర్థులపై అసంతృప్తికి తోడుగా తమ గ్యారంటీల మేనిఫెస్టోకు మద్దతు ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని బీజేపీ బలంగా చెబుతోంది. 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎన్నికల పరిస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. వరంగల్ తూర్పు: ఉదయించేది ఎవరో? గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్గా రెండున్నరేళ్ల అనుభవం, ఆ తర్వాత ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నన్నపునేని నరేందర్ బీఆర్ఎస్ తరపున మరోమారు అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. ఈ సెగ్మెంట్నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ తరపున, మంత్రి దయాకర్రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు బీజేపీ తరపున పోటీలో ఉన్నారు. గత రెండేళ్లుగా భారీ వర్షాలు వరంగల్ నగరాన్ని కుదిపేయడంతో స్థానికంగా ప్రజల్లో ఆగ్రహం ఉంది. అయితే వరద నివారణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడం, దీనికితోడు కేడర్ను పట్టించుకోడనే ప్రచారం ఉండడం, కిందిస్థాయి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులంతా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయనే భావనలో బీఆర్ఎస్ ఉండగా, ప్రభుత్వ వ్యతిరేకత, అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడాన్ని కొండా సురేఖ అనుకూలంగా మార్చుకుని విజయం కోసం కష్టపడుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో బలమైన నేతగా పేరున్న బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్రావు సైతం ప్రచారంలో ముమ్మరంగా దూసుకెళ్తున్నారు. బీజేపీ అగ్రనేతలు సైతం ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్డడంతో పోటీ త్రిముఖంగా ఉంది. పరకాల: గెలుపుపై ’చల్లా’రని ఆశలు అధికార పార్టీ నుంచి చల్లా ధర్మారెడ్డి పోటీలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవూరి ప్రకాశ్రెడ్డి, బీజేపీ నుంచి కాళీప్రసాద్ పోటీలో ఉన్నారు. అభ్యర్థి స్థానికంగా పట్టున్న నేత కావడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ దఫా గట్టెక్కిస్తాయని బీఆర్ఎస్ పార్టీ ధీమాగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి స్థానికేతరుడు కావడంతో క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీసీ ముఖ్యమంత్రి అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం, నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉండడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. స్టేషన్ఘన్పూర్: గెలుపు కూత ఎటు? బీఆర్ఎస్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బరిలో నిలవగా, కాంగ్రెస్ నుంచి ఇందిర, బీజేపీ తరపున విజయరామారావు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్యకు బదులుగా కడియంకు టికెట్ ఇవ్వడం పట్ల కేడర్లో కొంత అసంతృప్తులు బయటపడ్డాయి. పార్టీ నాయకత్వం జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. కానీ రాజయ్య వర్గం కడియం గెలుపు కోసం ఏమేరకు సహకరిస్తుందో వేచిచూడాలి. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఇందిర మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం ఓట్లు అధిక సంఖ్యలో ఉండడంతో ఆమెకు కలిసి వస్తుందని భావిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు బీజేపీ సైతం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. డోర్నకల్: ఏ ’నాయక్’ నిలిచేనో గిరిజనుల ప్రభావమున్న ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్, కాంగ్రెస్ నుంచి జాటోత్ రామచంద్రునాయక్, బీజేపీ నుంచి భూక్యా సంగీత పోటీలో ఉన్నారు. 1989 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2009 ఎన్నిక మినహా మిగతా ఆరుసార్లు రెడ్యానాయక్ గెలుపొందారు. ఏడోసారి గెలిచేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గెలిపిస్తాయనే ధీమాతో ఆయనున్నారు. అయితే ప్రభుత్వం, ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉందని, దీంతో గెలుపు తమదేనన్న ధీమా కాంగ్రెస్లో కనిపిస్తోంది. గత ఎన్నికలో పోటీ చేసి ఓడిపోవడంతో సానుభూతి, పార్టీలో రెబల్స్ లేకుండా ఐక్యంగా పనిచేస్తున్న పరిస్థితులు గట్టెక్కిస్తాయనే భావన కాంగ్రెస్లో ఉంది. బీఆర్ఎస్లో ఉన్న సంగీత చివరి నిమిషంలో బీజేపీలో చేరి పోటీలో ఉన్నారు. పాలకుర్తి: ‘దయ’ ఉంటుందా? మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికార బీఆర్ఎస్ నుంచి బరిలో ఉండగా, అత్యంత పిన్న వయసు్కరాలైన యశస్వినిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి రామ్మోహన్రెడ్డి పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పట్టున్న వ్యక్తిగా పేరుండడం, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం దయాకర్రావుకు కలిసొచ్చే అంశం. ఏళ్లుగా ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడంతో ఉండే వ్యతిరేకత, దీనికి తోడు ప్రభుత్వంపై ఉండే అసంతృప్తి పాటు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు సైతం పలుమార్లు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండడం తనకు కలిసివస్తుందని యశస్వినిరెడ్డి భావిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న రామ్మోహన్రెడ్డి స్థానిక మంత్రాన్ని జపిస్తున్నారు. మహబూబాబాద్: త్రిముఖ పోటీ అధికార పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన శంకర్నాయక్ మూడోసారి అదృష్టాన్ని పరిశీలించుకుంటుండగా, స్థానికంగా వైద్యుడిగా మంచిపేరు పొందిన మురళీనాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి బరిలో నిలిచారు. బీజేపీ తరపున హుస్సేన్నాయక్ పోటీలో ఉన్నారు. వరుసగా ఎమ్మెల్యే కావడంతో ఉండే వ్యతిరేకత, క్షేత్రస్థాయిలో పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటుండడం, కిందిస్థాయి నాయకుల్లో అసంతృప్తి అధికార పార్టీ అభ్యర్థికి ప్రతికూలాంశాలు. మురళీనాయక్ స్థానికంగా కలుపుగోలు వ్యక్తి కావడంతో గెలుపు పట్ల ధీమా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి దాదాపు 35వేల ఓట్లు సాధించిన హుస్సేన్నాయక్ ఈసారి బీజేపీ తరపున పోటీ చేస్తుండడగా సానుభూతి కలిసివస్తుందని భావిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. నర్సంపేట: ఇద్దరి మధ్యే హోరాహోరీ బీఆర్ఎస్ నుంచి పెద్ది సుదర్శన్రెడ్డి రెండోసారి గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా విజయం సాధించిన దొంతి మాధవరెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉండగా, బీజేపీ నుంచి పుల్లారావు పోటీలో ఉన్నారు. ప్రధానంగా అధికారపార్టీ, కాంగ్రెస్ల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఉద్యమనేపథ్యం ఉండడం, ప్రతి గ్రామంలో మంచి పరిచయాలుండడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గెలిపిస్తాయనే ధీమా బీఆర్ఎస్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న దొంతి మాధవరెడ్డి సైతం క్షేత్రస్థాయిలో మంచి పరిచయాలు కలిగి ఉండి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు ముమ్మరంగా కష్టపడుతున్నారు. జనగామ: ఎవరికి జై కొడుతుందో? అధికార బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్రెడ్డి, బీజేపీ తరపున ఆరుట్ల దశమంతరెడ్డి పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి బదులుగా పల్లాను బరిలోకి దింపడంతో కలిసివస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు గతంలో పీసీసీ చీఫ్గా చేసిన మాజీ మంత్రి పొన్నాలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడంతో గెలుపు పట్ల ధీమాగా ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గం సహకారం, పొన్నాల బలం ఏమేరకు కలిసివస్తుందో చూడాలి. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కొమ్మూరి గతంలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఈసారి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మరోవైపు బీజేపీ కేడర్ సైతం గట్టిపోటీ ఇచ్చేందుకు శ్రమిస్తోంది. ములుగు: సీతక్క ముందు నిలిచేనా బీఆర్ఎస్ అభ్యర్థిగా ములుగు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పోటీలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ సీతక్క, బీజేపీ తరపున మాజీమంత్రి చందూలాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ పోటీ పడుతున్నారు. నాగజ్యోతి జెడ్పీ చైర్పర్సన్గా కొనసాగిన అనుభవం, మావోయిస్టు నేపథ్యమున్న కుటుంబం కావడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఎజెండాగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన వ్యక్తి కావడం, స్థానికంగా ప్రతి తండాలోనూ కలుపుగోలుగా ఉండడం కలిసొచ్చే అంశం. ఈసారి రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఆదివాసీ తెగకు చెందిన వారు కావడంతో ఓట్ల చీలక ఎలా ఉంటుందనేది చూడాలి. బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ లంబాడా వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ వర్గం ఓట్లను పూర్తిగా రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీలో గెలుపు ఎటువైపు ఉంటుందో చూడాలి. భూపాలపల్లి: ’బాస్’ ఎవరు? బీఆర్ఎస్ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నుంచి గండ్ర సత్యనారాయణ రావు, బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ చేరిన తర్వాత ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ బలంగా ఉన్న ఎమ్మెల్సీ మధుసూదనాచారి వర్గం అధికారపార్టీ అభ్యర్థికి ఏమేరకు అనుకూలంగా పనిచేస్తుందో చూడాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల, అభివృద్ధి కార్యక్రమాలపైనే ఆయన ఆధారపడ్డారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి స్థానికంగా ఓటర్లను ఆకట్టుకున్న సత్యనారాయణ ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు, గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కలిసివస్తుందని భావిస్తుండగా, బీజేపీ తరపున రెండోసారి పోటీలో ఉన్న కీర్తిరెడ్డి సైతం గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ: ఫలితమెటో.. వరంగల్ వెస్ట్ నుంచి వరుస విజయాలు సాధిస్తున్న దాస్యం వినయ్ భాస్కర్ ఈసారి కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి రాజేందర్రెడ్డి, బీజేపీ అభ్యర్థి రావు పద్మారెడ్డి పోటీలో ఉన్నారు. 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా గెలిచిన వినయ్ భాస్కర్ ఈసారి విజయం దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, బలమైన బీఆర్ఎస్ కేడర్తో గట్టెక్కుతాననే ధీమా బీఆర్ఎస్లో కనిపిస్తోంది. డీసీసీ అధ్యక్షుడిగా, ఎన్ఎస్యూఐ నేతగా పనిచేసిన రాజేందర్రెడ్డికి ఈసారి అధిష్టానం టికెట్ ఇవ్వడంతో విజయం కోసం ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదలు, జనజీవనం అస్తవ్యస్తం కావడంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, వరద నివారణ చర్యలు పూర్తికాకపోవడం లాంటి అంశాలు, సుదీర్ఘ కాలంగా ఒకే వ్యక్తి ఉండడంతో వచ్చే వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుండగా... బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా, ప్రతి బస్తీలో పరిచయమున్న నేతగా కేంద్ర పథకాలను ప్రచారం చేస్తూ ప్రచారంలో పద్మ దూసుకుపోతున్నారు. ముస్లిం ఓట్లు కీలకం కానున్నాయి. వర్ధ్దన్నపేట: విజయం ఎవరిని వరించేను? అత్యధిక మెజారిటీతో రెండుసార్లు విజయం సాధించిన ఆరూరి రమేశ్ మూడోసారి కూడా బీఆర్ఎస్ తరపున పోటీ పడుతుండగా, మాజీ పోలీసు అధికారి కేఆర్ నాగరాజు కాంగ్రెస్ తరపున, బీజేపీ తరపున కొండేటి శ్రీధర్ బరిలో ఉన్నారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు కిందస్థాయి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం, కేడర్ను పట్టించుకోకపోవడం, నాయకులకు అందుబాటులో ఉండకపోవడం లాంటివి ప్రతికూలాంశం. కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నతహోదా నుంచి వచ్చిన వ్యక్తి కావడం, స్థానికంగా మంచి పేరుండడం, కాంగ్రెస్ కేడర్ బలపడడం అనుకూలాంశాలు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కొండేటి శ్రీధర్ 2009 ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యం ఉండడంతో ఆయన సైతం విస్తృతంగా ప్రచారం చేస్తూ విజయం కోసం కష్టపడుతున్నారు. ఉద్యోగాలన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలను పెద్ద ఎత్తున భర్తీ చేస్తామని చెప్పి చివరకు ప్రకటనలకే పరిమితం చేయడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశ పడ్డారు. టీచర్ పోస్టులతో పాటు గ్రూప్ ఉద్యోగాలకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని సిద్ధమైనా, పరీక్షలన్నీ నిలిచిపోయాయి. ఉద్యోగాలు మానేసి పరీక్షలకు సిద్ధమైన నాలాంటి అభ్యర్థులు మానసికంగా ఆందోళనలో ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలంటూ ఊదరగొట్టడమే కాకుండా ఉపాధి కల్పనపైన దృష్టి సారించాలి. – షేక్ నాజీమ్ బాబా, నిరుద్యోగి, ఏటూరునాగారం వరదల నుంచి నగరాన్ని కాపాడాలి రెండేళ్ల క్రితం వచ్చిన వరదలతో నగరం విలవిలలాడింది. పట్టణమంతా నీటిలో మునిగింది. పేదలే తీవ్రంగా నష్టపోయారు. మునకకు ప్రధాన కారణం నాలాల ఆక్రమణలు. వరదల నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది. ఆక్రమణలు, నాల ఎఫ్టీఎల్లో నిర్మాణాల తొలగింపు చేపట్టాలి. – తిరుణహరి శేషు, వరంగల్ -
ఉమ్మడి వరంగల్లో నామినేషన్ దాఖలుకు ముమ్మర ఏర్పాట్లు
-
వరంగల్ లో వైభవోపేతంగా గణేష్ నిమజ్జనం
-
నీ మాట, పనులు బోగస్ అంటూ మండిపడుతున్న వైఎస్సార్
-
నా పెళ్లి జరగనివ్వండి.. మహా ప్రభో
సాక్షి, వరంగల్: ట్రాఫిక్ జామ్ కావడంతో పెండ్లి ముహూర్తం దాటిపోతోందని వరుడు కారు నుండి దిగి అధికారులను ట్రాఫిక్ క్లియర్ చేయాలని వేడుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారు ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి సహాయక చర్యలు చేపట్టిన అధికారులు మూడు భారీ క్రేన్లతో ఆయిల్ ట్యాంకర్ లారీని తీయడానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాలను నిలిపి లారీని తీస్తుండగా వరంగల్ నుండి తొర్రూర్కు వెళ్తున్న పెండ్లి కొడుకు కారు ట్రాఫిక్లో చిక్కుకుపోయింది ఉదయం 10 గంటలకు వివాహ ముహూర్తం ఉండటంతో పెండ్లి కుమారుడు ముహూర్తం దాటిపోతోందని ట్రాఫిక్ క్లియర్ చేయాలని కారు దిగి రోడ్డుపై నడిచాడు. భారీ క్రేన్ల వద్దకు చేరుకొని అధికారులను త్వరగా వాహనాలను పంపించాలని పెండ్లి ముహూర్తం దాటిపోతుందని వేడుకున్నాడు. దీంతో అధికారులు పెట్రోల్ ట్యాంకర్ ఉండటంతో ఇబ్బంది ఏర్పడిందని కాస్త సమయం కావాలని సూచించారు. ట్రాఫిక్ క్లియర్ కావడం లేదని భావించిన పెండ్లి కుమారుడు కారును మళ్లీ వెనక్కి తిప్పి కొంత దూరం ప్రయాణించాడు. ఇంతలోనే వాహనాలు కదిలి ముందుకు వెళ్లడంతో మళ్లీ వెనక్కి వచ్చి తొర్రూర్కు వెళ్లిపోయాడు. చదవండి: ఒంగోలు బ్యూటీపార్లర్ కేసు: మార్గదర్శి మేనేజర్ భార్య అరెస్ట్ -
ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ షాక్ ట్రీట్మెంట్..
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ సీట్లు రాని కొందరు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలం మాకు సీటివ్వరా అంటూ రోదిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు సీట్లకు రెండు రకాల ట్రీట్మెంట్స్ ఇచ్చారు గులాబీ దళపతి. ఒక సీటును సిటింగ్ను కాదని ఎమ్మెల్సీతో భర్తీ చేశారు. మరో సీటును సిటింగ్కు ప్రకటించకుండా పెండింగ్లో పెట్టారు. సీట్లు రాని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు విలపించడంతో వారి అనుచరులు కూడా కంటతడి పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలను అయోమయానికి గురిచేస్తుంది. రాజకీయంగా నాటకీయ పరిణామాలకు దారి తీస్తోంది. జనగామ, స్టేషన్ ఘనపూర్ టికెట్లు అక్కడి ఎమ్మెల్యేలను కన్నీరు మున్నీరుగా విలపించే పరిస్థితి తీసుకొచ్చాయి. అందరూ ఉహించినట్లుగానే స్టేషన్ ఘనపూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. స్వయం కృతాపరాధంతో టికెట్ కోల్పోయిన రాజయ్య భావోద్వేగంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. జరిగిన పరిణామాలను తలుచుకుంటూ కార్యకర్తలను పట్టుకుని బోరున విలపిస్తున్నారు. నేలపై పడుకుని సాష్టాంగ నమస్కారంతో పశ్చాత్తాపం చెందుతున్నారు. టికెట్ రాకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారు. కొందరు పార్టీ మారేందుకు చర్చలు జరుపుతున్నారు. అయితే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య మాత్రం అధినేతను కలిసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. కెసిఆర్ గీసిన గీతను దాటనని, తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని చెబుతున్నారు. తనకు కేసిఆర్ ఆశీస్సులున్నందున.. ఆందోళన చెందకుండా అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నారు. డాక్టరయిన తనకు స్థాయికి తగ్గ స్థానం కేసీఆర్ కల్పిస్తారనే నమ్మకం ఉందంటున్నారు. చదవండి: పల్లాపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇక జనగామ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి టికెట్ పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెరపైకి ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేర్లు రావడంతో పల్లా వద్దు.. ముత్తిరెడ్డే ముద్దు అంటూ ఆయన అనుచరులు ఆందోళనకు దిగి కన్నీటి పర్యంతమయ్యారు. మా బాపుకు అన్యాయం చెయ్యొద్దు అంటు ముత్తిరెడ్డిని పట్టుకుని బోరున విలపించారు. కార్యకర్తలు కన్నీరుమున్నీరుగా విలపించడంతో ముత్తిరెడ్డి సైతం కన్నీటి పర్యంతమై ఒక్క అవకాశం ఇవ్వండని రెండు చేతులు జోడించి దండం పెడుతూ కేసీఆర్ను వేడుకున్నారు. ప్రజాసేవకు అంకితమైన అధికారం పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెక్కి వెక్కి ఏడ్వడం ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా కలకలం రేపింది. మరి ఎమ్మెల్యేల కన్నీరు గులాబీ దళపతిని కరిగిస్తుందా? వారి అనుచరుల ఆవేదన ఫలితాన్నిస్తుందా? కొద్ది రోజుల తర్వాత గాని ఏ విషయం తెలిసే అవకాశం లేదు. -
వరంగల్ తూర్పు: త్రిముఖ పోటీ! కానీ బీఆర్ఎస్కు ఆయనే మైనస్సా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఓరుగల్లు జిల్లా రాజకీయంగా ఉద్యమాల పరంగా వ్యాపార వాణిజ్య పరంగా వరంగల్ జిల్లా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో వరంగల్ తూర్పు కేంద్ర బిందువుగా మారుతూ వస్తుంది. 2023 లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాజకీయంగా ప్రాధన్యతను సంతరించుకున్నాయి. ప్రతిసారి వరంగల్ తూర్పులో త్రిముఖపోటీ ఉన్నట్టుగానే ఈసారి కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే త్రిముఖ పోటీ ఉండబోతోంది. అయితే ఇక్కడ ఓ వాదన ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పిస్తేనే బీఆర్ఎస్కు ఫలితం దక్కుతుందని ఆపార్టీ నాయకులే భావిస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్కే టికెట్ కట్టబెట్టింది. దాంతో ఇక్కడ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పద్మశాలి, మైనారిటీ దళితులు ఎవరికి మద్దతు ఇస్తారో ఆ అభ్యర్థి గెలుపు ఖాయం. తూర్పు నియోజకవర్గం జనరల్ స్థానం. ఇక్కడ పరిశ్రమలు లేవు. ఉన్న ఆజంజాహి మిల్లు పోయింది. ఇక ఎక్కువగా దినసరి కూలీలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటే కచ్చితంగా అది అమలు అయ్యి తీరుతుంది. రాష్ట్రంలో కేంద్రంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సయోధ్య ఉందన్న నమ్మకంతో పాటు మణిపూర్ ఘటనలు దళితులను మైనారిటీ ముస్లింలను కొంత కలవరపెడుతుంది. ఈ ప్రభావం రానున్న ఎన్నికల్లో కచ్చితంగా చూపెడుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు : వరంగల్ తూర్పు నియోజకవర్గం మొదటి నుండి కాంగ్రెస్ కంచుకోట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ ఢంక మోగించారు. ఇక్కడ మైనార్టీ ఓట్లు వన్సైడ్గా పడుతాయని ఓ ప్రచారం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి రెండుసార్లు శాసనసభ్యులుగా గెలిచినప్పటికీ వరంగల్ నియోజకవర్గం మారలేదు. దీంతో ప్రజల్లో పార్టీ పట్ల కొంత అసహనం ఉంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హేమా హేమీ నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి శాసన మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, రోడ్డు భవనాల శాఖ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, మాజీ షాప్ డైరెక్టర్ రాజనాల శ్రీహరి లాంటి వారు టికెట్ కోసం ప్రయత్నం చేయగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్కే టికెట్ దక్కింది. ఇక కాంగ్రెస్ నుండి కొండ సురేఖ తోపాటు డిసిసి అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ సైతం టిక్కెట్ ఆశిస్తున్నారు. బిజెపి నుండి రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తో పాటు ఘంటా రవికుమార్ పోటీకి సిద్దమయ్యారు. వృత్తిపరంగా ఓటర్లు.. ఈ నియోజకవర్గంలో దినసరి కూలీలు, చిరు వ్యాపారులు, వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు భౌగోళిక పరిస్థితులు.. నగరంతో పాటు శివారు కాలనీలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరు ఉన్న ఖిల్లావరంగల్ కోట ఉంది. ఎంజీఎం ఆసుపత్రితో పాటు కాకతీయ మెడికల్ కళాశాల, 1100కోట్లతో 24అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నారు. నదులు అడవులు కొండలు లేవు.. కానీ వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల మద్య భద్రకాళి అమ్మవారు ఆలయంతోపాటు చెరువు ఉంటుంది. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : ప్రధానంగా డ్రైనేజ్ మంచినీటి సమస్యలు నగర ప్రజలను వేధిస్తున్నాయి. వర్షం వస్తే వణుకుపుట్టించేలా వరదలు వచ్చి నగరంతోపాటు పలుకాలనీలు జలమయం అవుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే నరేందర్ మేయర్ గా ఎమ్మెల్యేగా వరంగల్ నగరంతో పాటు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. కానీ చెప్పేవి మాత్రం కొండంతలు.నరేందర్ శాసనసభ్యులు గా గెలిచి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న ఒక్క అభివృద్ధి పని కూడా పూర్తిచేయలేదనే విమర్శలు ఉన్నాయి. -
భావోద్వేగంతో ఎమ్మెల్యే రాజయ్య కంటతడి
సాక్షి, జనగామ: అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ దక్కకపోవడంపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఢీలా పడిపోయారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీ చేయనున్నారు. దీంతో.. టికెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చుని ఆయన బోరున విలపించారు. అయితే.. టికెట్ దక్కకపోయినప్పటికీ.. అధినేత కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని రాజయ్య స్పష్టం చేశారు. ‘‘బీఆర్ఎస్లోలో చేరినప్పటి నుండి కేసీఆర్కు వీర విధేయుడిగా ఉన్నా. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి.. అందరూ సమన్వయం పాటించండి. దయచేసి ఎవరినీ బాధ పెట్టొద్దు’’ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేక్రమంలో.. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో కార్యకర్తలు సైతం ఆయన్ని పట్టుకుని విలపించారు. ‘‘ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రతి గ్రామానికి సీడీఎఫ్ కింద 3 కోట్లు మంజూరయ్యాయి. అభివృద్ధి పనులు కొనసాగుతాయి. 15 సంవత్సరాల రాజకీయ అనుభవం, అధికార కాంగ్రెస్ పార్టీకి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి తెలంగాణ కోసం రాజీనామా చేశా. స్థాయికి తగ్గకుండా ఉన్నత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.. దళిత బంధుకు 1,100 మందికి వచ్చే విధంగా సిఫారసు చేశా.. ఘనాపూర్ ప్రజల మధ్యే నా జీవితం’’ అని రాజయ్య పేర్కొన్నారు. కేసీఆర్ న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది: ఎమ్మెల్యే రాజయ్య సతీమణి ఎమ్మెల్యే రాజయ్యకు బీఆర్ఎస్ టిక్కెట్ లభించకపోవడం అన్యాయం కాదని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని ఆయన సతీమణి ఫాతిమా మేరీ అన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరాం. బీఆర్ఎస్లోనే ఉంటాం... కడియం శ్రీహరిని ఎమ్మెల్యే గా గెలిపించేందుకు కృషి చేస్తాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. -
జనగామపై వీడని పీటముడి!
సాక్షిప్రతినిధి, వరంగల్: జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేదానిపై పీటముడి ఇంకా వీడలేదు. ఉమ్మడి వరంగల్లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ ఒక్క స్థానంపై కమిటీ మరోసారి సమావేశమై 25న నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో జనగామ నుంచి బరిలో నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థిత్వం ఖరారుపై గడువు పెరిగిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలు ఎవరికి వారుగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. వాస్తవానికి ఉమ్మడి వరంగల్లో స్టేషన్ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. స్టేషన్ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి పేరు వినిపించగా.. జనగామకు ఏడాదిన్నరగా పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి పేరే వినిపించింది. అయితే హఠాత్తుగా జనగామ నుంచి పోటీ చేసేందుకు పల్లా రాజేశ్వర్రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చిందన్న ప్రచారం గందరగోళానికి దారితీసింది. ఇదే సమయంలో పల్లా రాజేశ్వర్రెడ్డి ముఖ్య అనుచరులు హైదరాబాద్లోని ఓ హోటల్లో రహస్యభేటీ నిర్వహించగా.. అక్కడికి వెళ్లిన యాదగిరిరెడ్డి ఇది కరెక్టు కాదని పార్టీ నాయకులకు నచ్చజెప్పారు. ఆ తర్వాత ముత్తిరెడ్డి హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించి బలప్రదర్శన చేశారు. కాగా, సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారన్న సమాచారం మేరకు ఉదయమే హైదరాబాద్కు వెళ్లిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ కవితలను కలసినట్లు సమాచారం. అలాగే పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల అనుచరులు సైతం హరీశ్రావును కలసి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. మరోవైపు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలు కూడా వేర్వేరుగా పార్టీ పెద్దలను కలసినట్లు సమాచారం. దీంతో కేసీఆర్ ఈ స్థానంపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. 25న ఎన్నికల కమిటీ మరోసారి భేటీ అయి అభ్యర్థి పేరును ఖరారు చేస్తుందని ప్రకటించారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఫైనల్గా తనకే ఛాన్స్ ఉంటుందని చెపుతుండగా, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు సైతం ధీమాగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా పర్యటనలో ఉన్న పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వచ్చాకే ఈ వివాదం పరిష్కారం అవుతుందన్న మరో వాదన పార్టీ ముఖ్యనేతల నుంచి వినిపిస్తోంది. 25న అభ్యర్థుల ఎంపిక కమిటీ భేటీ అయినప్పటికీ.. సెప్టెంబర్ 1న కేటీఆర్ వచ్చాకే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉందని అంటున్నారు. -
రాంగ్రూట్లో వచ్చిన మృత్యువు
సాక్షి, వరంగల్/వర్ధన్నపేట: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు..ఎప్పటిలా బుధవారం కూడా ఉపాధిని వెతుక్కుంటూ బయలుదేరారు. కానీ ఎప్పటిలా వారు క్షేమంగా ఇంటికి చేరుకోలేదు. ఉదయాన్నే వారు ప్రయాణిస్తున్న ఆటోను మృత్యు శకటంలా దూసుకొచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నా రు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం ఉదయం 7.12 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఢీకొట్టిన లారీ 30 మీటర్లకు పైగా దానిని ఈడ్చుకెళ్లడంతో ఆటో డ్రైవర్ సహా ఆరుగురు దుర్మరణం చెందారు. శరీరాలు ఛిద్రం కావడంతో ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసి భీతావహంగా మారింది. అతి వేగం, లారీ డ్రైవర్ నిర్ల క్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించామని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. ఉపాధి కోసం వెళుతుండగా.. రాజస్తాన్లోని జైపూర్కు చెందిన సురేశ్ కురేరీ కుటుంబం పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చి కర్మన్ఘాట్లో స్థిర నివాసం ఏర్పరుచుకుంది. అక్కడ డెయిరీ పరిశ్రమల్లో కూలీలుగా పనిచేసే వీరు..కొంతకాలంగా అన్ని ప్రాంతాలు తిరుగుతూ తేనె తుట్టెల నుంచి తేనెను తీసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలోనే నెలరోజుల క్రితం వరంగల్లోని ఎల్బీనగర్కు వచ్చిన సురేశ్ కురేరీ కుటుంబం అక్కడ డేరాలు వేసుకొని తేనె అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం వరంగల్ నుంచి తొ ర్రూర్ వరకు వెళ్లిన వీరు ఇల్లంద గ్రామానికి కొంతదూరంలో ఉన్న తేనె తుట్టెల నుంచి తేనెను సేకరించి ఆ హైవేపైనే అమ్మారు. బుధవారం కూడా వరంగల్ బస్టాండ్ వద్ద ఉదయం 6.30 ప్రాంతంలో ఆటో కిరాయికి మాట్లాడుకొని తొర్రూర్కు బ యలుదేరారు. సురేశ్ కురేరి (43) వెంట అతని కుమారులు అమిత్ (23), నితిన్ (11), అమీర్లు, సురేశ్ సోదరి కుమారులు జలావత్ దామి అలియాస్ జాబీర్ (19, రూప్చంద్ దామి (33)లు ఉన్నారు. వరంగల్కు చెందిన బట్టు శ్రీనివాస్ (42) ఆటో నడుపుతున్నాడు. మృత్యువులా ఎదురొచ్చి.. మధ్యప్రదేశ్ రాష్ట్రం నమీనా జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ మదన్లాల్ నాయక్ వైజాగ్ షిప్యార్డులో ఉన్న సరుకును లోడ్ చేసుకుని వరంగల్లో అన్లోడ్ చేయడానికి బయలుదేరాడు. ఈ లారీకి మదన్లాల్ సహా ఇద్దరు డ్రైవర్లు ఉండగా, కో డ్రైవర్ రాకే‹Ùమీనా ఖమ్మం వరకు డ్రైవింగ్ చేశాడు. ఖమ్మం నుంచి మదన్లాల్ న డపడం ప్రారంభించాడు. లారీ ఇల్లంద సమీపిస్తుండగా అప్పటికే నిద్ర మత్తులో ఉన్న మదన్లాల్ లారీని అతి వేగంగా నడుపుతూ రాంగ్రూట్లో ఎదురొచ్చి ఆటోను ఢీకొట్టాడు. లారీ సు మారు 30 మీటర్ల దూరం ఆటోను ఈడ్చుకుంటూ వెళ్లింది. ప్రమాద తీవ్రతకు ఆటోలో ఉన్న వారి శరీరాలు మాంసం ముద్దలుగా మారాయి. సురేశ్ కురేరి, అమిత్ కురేరి, బట్టు శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన నితిన్ కురేరి, అమీర్ కురేరి, రూప్చంద్, జాబీర్లను ఆస్పత్రికి తరలిస్తుండగా నితిన్ మార్గం మధ్యలోనే మృతి చెందాడు. రూప్చంద్, జాబీర్ వరంగల్ ఎంజీఎంలో మరణించారు. అమీర్ కురేరిని ఎంజీఎం నుంచి మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రై వేట్ ఆస్పత్రికి తరలించారు. అత ని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు ఇల్లందలోని కిరాణ దు కాణం వద్ద సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఫుటేజీలను పరిశీలించి ప్రమాదం ఉదయం 7 గంటల 12 నిమిషాలకు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఘటనాస్థలిని సందర్శించారు. సురేశ్ భా ర్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్ను అరెస్టు చేశారు. -
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
సర్వస్వం పోయింది.. ఆదుకోండి..!
వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామస్తులు వరద ఉధృతిలో సర్వం కోల్పోయారు. కట్టుబట్టలు మాత్రమే మిగిలాయి. వరదలో నిత్యావసరాలు, వాహనాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కోల్పోయారు. కట్టుకోవడానికి బట్టలు.. కప్పుకోవడానికి దుప్పటి కుడా లేని దుస్థితి నెలకొంది. వరదల నుంచి తేరుకొని మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో నష్టపరిహారం ఇస్తుందా లేదా అని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఆపన్నహస్తాల కోసం ఎదురు చుస్తున్నారు. గ్రామంలో ఏ ఒక్కరిని కదిలించినా క‘న్నీరే’ ఉబికివస్తోంది. కాగా, నిత్యావసర వస్తులు అందించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందని తక్షణ సాయం ఊరికి ఊరంత వరదలో మునగడంతో కట్టుబట్టలతో బయటికి వచ్చిన బాధితులకు ప్రభుత్వం నుంచి కనీసం తక్షణ సాయం కూడా అందలేదు. నిత్యావసర వస్తువులు, బియ్యం కూడా పంపిణీ చేయలేదు. నష్టపోయిన ఆస్తికి, పశువులకు పరిహారం కింద ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. 10 ఇళ్లు వరద తాకిడి దెబ్బతినగా చెంచుకాలనీకి చెందిన 18 గుడిసెలు వరదలో కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో బాధితులు అందోళన చెందుతున్నారు. ఒక్కొక్క ఇంటిలో రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు నష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోరంచపల్లి బస్టాండ్ సమీపంలోని సంతోషిమాత సూపర్మార్కెట్లో రూ. 20లక్షల విలువైన కిరాణా సామగ్రి తడిసి పాడైంది. ముందుకు వస్తున్న పలువురు.. మోరంచపల్లిలో జరిగిన నష్టాన్ని చూసిన పలువురు చలించిపోతున్నారు. పగవారికి కూడా ఇలాంటి కష్టం రావొద్దని వేడుకుంటున్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల నాయకులు ముందుకు వచ్చి బియ్యం, కూరగాయలు, వంట సామాను, చద్దర్లు, మ్యాట్లు, పండ్లు, పప్పులు, చీరలు, ఇతర వస్తువులు ఇంటింటికీ తిరుగుతూ బాధితులకు అందజేస్తున్నారు. రూ.20 లక్షల నష్టం జరిగింది మోరంచపల్లిలో వచ్చిన వరదతో మా సూపర్మార్కెట్లో రూ.20లక్షల విలువైన వస్తువులు తడిసి పాడయ్యాయి. చక్కెర, పప్పు, పిండి, బియ్యం ఇతర వస్తువులు పాడయ్యాయి. అప్పు తెచ్చి షాపు ఏర్పాటు చేసుకున్న. వస్తువులు కొనుగోలు చేసిన సెట్లకు ఇంకా డబ్బు ఇవ్వలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. – దొడ్డశాని సంతోష్, సూపర్ మార్కెట్ నిర్వాహకుడు ఇంటికి రూ. 4లక్షలు ఇవ్వాలి వరద ఉధృతిలో సర్వం కోల్పోయాం. ప్రతి ఇంటికీ ప్రభుత్వం రూ.4లక్షలు ఇచ్చి ఆదుకోవాలి. వరదలో 3 తులాల బంగారం, రూ.15వేల నగదు, వంట గ్యాస్, భూమి పాస్పుస్తకాలు, ఇతర వస్తువులు కొట్టుకుపోయాయి. మిగిలిన వస్తువులను కడుకుంటున్నాం. ఇప్పటికీ ఒక్క అధికారి కూడా వచ్చి నష్టం గురించి సర్వే చేయలేదు. – సూరం రాజయ్య, వరద బాధితుడు -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం...వివిధ ఘటనల్లో మొత్తం 21 మంది మృతి
-
బోరుమంటున్న మొరంచపల్లి.. సర్వం కోల్పోయిన దీనస్థితి..
భూపాలపల్లి అర్బన్: మొత్తం 285 ఇళ్లు.. అందులో నాలుగు పూర్తిగా ధ్వంసమయ్యాయి.. మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయి.. ఏ ఇంట్లో చూసినా పేరుకుపోయిన ఒండ్రుమట్టి.. చెల్లాచెదురుగా ఉన్న సామగ్రి.. బైక్లు, ఇతర వాహనాలు ఎక్కడున్నాయో తెలియదు.. తినటానికి తిండి లేదు.. తాగేందుకు నీరు లేదు.. కోళ్లు, పశువులు కొట్టుకుపోయాయి.. సర్వం కోల్పోయిన స్థితిలో జయశంకర్ జిల్లా మొరంచపల్లి గ్రామం బోరుమంటోంది. మరోవైపు గల్లంతైన నలుగురి ఆచూకీ దొరకక.. వారి కుటుంబాలు ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్నాయి. గల్లంతైన గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ దంపతులు, గడ్డ మహలక్ష్మి, గంగిడి సరోజనల ఆచూకీ కోసం గ్రామస్తులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఏ ఆధారమూ లేని పరిస్థితిలో.. గురువారం తనను చుట్టేసిన మోరంచవాగు వరద ఉధృతికి మొరంచపల్లి గ్రామం సర్వం కోల్పోయింది. ఇళ్లలో సుమారు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు వరద నీరు చేరింది. ప్రతి ఇంట్లో బియ్యం, పప్పుల వంటి నిత్యావసరాల నుంచి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషీన్లు వంటి ఎల్రక్టానిక్ పరికరాల దాకా వస్తువులన్నీ నీట మునిగిపోయాయి. కొన్ని వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. గ్రామంలో మొత్తం 285 ఇళ్లు ఉండగా 4 ఇళ్లు పూర్తిగా, 281 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒండ్రు మట్టి, ఇసుక మేట, చెత్తాచెదారంతో నిండిపోయాయి. శుక్రవారం వరద తగ్గాక గ్రామస్తులు ఇళ్లలో ఒండ్రుమట్టిని ఎత్తిపోస్తూ, తడిసిన వస్తువులను ఆరబెట్టుకుంటూ కనిపించారు. వరద తాకిడికి కొన్ని ఇళ్ల పునాదులు కూడా కదలడం, ఇంటి గోడలు, ప్రహరీలు కూలిపోవడం ఆందోళనకరంగా మారింది. Rescue operations in Moranchapally underway #TelanganaRains #Telangana #Bhupalapally #Moranchapalli #Moranchapalle #Rains #WeatherUpdate #IMD pic.twitter.com/cfsOToosN4 — Kartheek Naaga (@kartheeknaaga) July 27, 2023 అన్నీ కొట్టుకుపోయి.. మోరంచపల్లి గ్రామం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో కుటుంబ పోషణ నిమిత్తం గేదెలు, కోళ్లు పెంచుకుంటున్నారు. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయి పొలాలు, చెట్లపోదల్లో చిక్కుకున్నాయి. కొన్నింటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. మొత్తం 159 పశువులు, గేదెలు, 3 ఎద్దులు, 855 కోళ్లు, 3 బాతులు చనిపోయాయి. గ్రామ పరిసరాల్లో అక్కడక్కడా చనిపోయి ఉన్న గేదెలను అధికారులు శుక్రవారం జేసీబీల సహాయంతో గ్రామానికి దూరంగా తరలించి ఖననం చేశారు. గ్రామస్తులకు భరోసా.. తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామాన్ని మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అధికారులు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక జీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సోదరుడు గండ్ర భూపాల్రెడ్డి రూ.10 లక్షలను గ్రామ ప్రజలకు ఆర్థిక సాయంగా అందించారు. చేతుల్లోంచి జారిపోయింది.. ఈ ఫొటోలోని వ్యక్తి గడ్డం శ్రీనివాస్. ఆయన భార్య మహాలక్ష్మి గురువారం వరదలో కొట్టుకుపోయింది. ఇంకా ఆచూకీ లభించలేదు. ‘‘గురువారం తెల్లవారుజామున 4 గంటలకు వరద ఉధృతి పెరగడంతో ఇంట్లోంచి బయటికి వచ్చాం. భుజాల లోతున నీరు వేగంగా దూసుకువచ్చింది. ఇద్దరం కలసి అక్కడున్న రేకుల షెడ్డు స్తంభాన్ని పట్టుకున్నాం. కానీ నీటి వేగానికి మహాలక్ష్మి నా చేతుల్లోంచి జారిపోయింది. ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించినా వరద నన్ను మరోపక్క నెట్టేసింది. కళ్ల ముందే కొట్టుకుపోయిన భార్యను కాపాడుకోలేకపోయా’’ అంటూ శ్రీనివాస్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇది కూడా చదవండి: గోదావరి డేంజర్ లెవల్.. అందుబాటులో ఎన్డీఆర్ఎఫ్, హెలికాప్టర్ -
ట్రాక్టర్ మునిగినా.. ఈదుతూ బయటపడిన రైతు..
మహబూబాబాద్: మానుకోటి జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) శివారు బంగారుగూడెం జీపీ పరిధిలోని చౌళ్ల తండా వద్ద పొలాలు దున్నేందుకు వెళ్లిన ట్రాక్టర్ మున్నేరువాగు వరద నీటిలో గురువారం మునిగిపోయింది. బంచరాయి తండా గ్రామానికి చెందిన రైతు బానోత్ లచ్చిరాం చౌళ్ల తండాకు చెందిన పొలాలను దున్నేందుకు ట్రాక్టర్ తీసుకుని వెళ్లాడు. ఈక్రమంలో మున్నేరు వాగు ప్రవాహం పెరిగింది. రెండువైపులా నీరు వచ్చి చేరుతుండడంతో నీటిలో ట్రాక్టర్ మునిగిపోయింది. దీంతో లచ్చిరాం ట్రాక్టర్ను అక్కడే వదిలి ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. నీటిలో ట్రాక్టర్ మునిగిపోయిన విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. -
Warangal Heavy Rain Floods Pics: ఉమ్మడి వరంగల్ అతలాకుతలం (ఫొటోలు)
-
అమెరికాలో ప్రొఫెసర్గా వరంగల్ ఆదివాసీ
వరంగల్: కడు పేదరికం.. తినడానికి అన్నం కూడా దొరకని పరిస్థితి. తండ్రి పని చేస్తేనే పూటగడిచేది. లేనిపక్షంలో పస్తులుండడమే. పైగా మారుమూల గ్రామం.. అందులో పాఠశాల కూడా లేని కుగ్రామం. ఇలాంటి తరుణంలో ఎవరికైనా చదువుకోవాలనే ఆలోచనే రాదు. ఏదైనా పని చేసుకుని బతకాలని భావిస్తారు. కానీ అలాంటి వారికి ఈ యువకుడు పూర్తిగా విరుద్ధం. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. ఒక పక్క సమస్యలతో సహవాసం చేసూ్తనే.. మరో పక్క అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఆయననే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మారుమూల ఏజెన్సీ ఆదివాసీ గ్రామం దొరవారివేంపలి్లకి చెందిన ఈక ప్రభాకర్. తాను ఎంచుకున్న విద్యలో ఖండాంతరాలు దాటి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అయోవాలో ప్రొఫెసర్గా పని చేసేందుకు ఎంపికయ్యారు. ఎర్ర బస్సు కూడా ఎరగని ఈ గ్రామం నుంచి అమెరికాకు వెళ్లడంపై గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈక పాపమ్మ–సమ్మయ్య దంపతుల ప్రథమ సంతానం ప్రభాకర్. తన ఎదుగుదల గురించి ఆయన మాటల్లోనే.. ‘పోడు వ్యవసాయం ఆధారంగానే మా కుటుంబ పోషణ గడిచేది. తినడానికే ఇబ్బంది పడే పరిస్థితి. గ్రామంలో పాఠశాల కూడా లేదు. 1989లో అప్పటి ఐటీడీఎ పీఓ బెస్ట్ అవైలెబుల్ పాఠశాలలకు విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. హాస్టల్కు వెళ్తే కనీసం అన్నం అయినా సరిగా దొరుకుతుందనుకునే పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిలోనే రాజేంద్ర కాన్వెంట్ హై స్కూల్లో సీటు వచ్చింది. పాఠశాల చదువులోనే మా తల్లి పాపమ్మ 1997లో మృతి చెందింది. ఈ ఘటనను దిగమింగుకుని పదో తరగతి పూర్తి చేశా. అనంతరం ఇంటర్ ఎల్బీ కళాశాల వరంగల్లో, కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో బీజెడ్సీ గ్రూపులో డిగ్రీ పూర్తి చేశా. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో బయో టెక్నాలజీలో పీజీ పూర్తి చేశా. బెస్ట్ అవైలెబుల్ స్కీం పూర్తయిన తరువాత ఐటీడీఏ నుంచి స్కాలర్ షిప్కు ఎంపికయ్యా. ఆ స్కాలర్ షిప్తోనే డిగ్రీ, పీజి పూర్తయింది. 2006 నుంచి 2013 వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డి పూర్తి చేశా. 2013 నుంచి 2017 వరకు సీఎస్ఐఆర్ఆర్ఏలో రీసెర్చ్ అసోసియేట్గా పని చేశా. ఇదే సమయంలో మండలంలోని ఈశ్వరగూడెం గ్రామానికి చెందిన రవళితో వివాహమైంది. పీహెచ్డీ ఫెలోషిప్లో భాగంగా‘టాటా ఇన్స్టిట్యూట్ ఫండమెంటల్ రిసెర్చ్’లో సంవత్సరం పని చేశా. అనంతరం గీతం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాను. అక్కడ ప్రొఫెసర్గా పని చేసూ్తనే గత సంవత్సరం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అయోనాలో ప్రొఫెసర్గా అప్లికేషన్ చేశాను. నాలుగు దఫాలుగా జరిగిన ఇంటర్వూ్యల ఆధారంగా నన్ను ఎంపిక చే సి వీసా ఇచ్చారు. ఈనెల 28న అమెరికాకు వెళ్తు న్నా. ఖండాతరాలు దాటి ప్రొఫెసర్గా పనిచేసే అ వకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది’.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్పీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
లండన్ కు చేరుకున్న సీఎం జగన్
వవన్ కల్యాణ్ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్
తప్పక చదవండి
- ‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement