గుండ్రాంపల్లిలో చోరీ | theft in Gundrampalli | Sakshi
Sakshi News home page

గుండ్రాంపల్లిలో చోరీ

Published Wed, Aug 31 2016 12:02 AM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

theft in Gundrampalli

గుండ్రాంపల్లి(చిట్యాల): మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి దుండగులు రెండిళ్లలో చోరీకి పాల్పడ్డారు.  క్రై ం ఎస్‌ఐ దేవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాలిగ యాదయ్య తన అత్తవారింటికి వెళ్లగా  దుండగులు ఆయన ఇంటికి వేసిన తాళాన్ని పగులగొట్టి  చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉంచిన తులం విలువ గల బంగారు చెవి కమ్మలు, మాటీలను ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా గ్రామంలో తాళం వేసి ఉన్న మరో ఇంట్లోకి వెళ్లి కొంత నగదును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement