Published
Wed, May 17 2017 9:58 PM
| Last Updated on Sat, Aug 18 2018 8:37 PM
అపార్ట్మెంట్పై పిడుగు
నంద్యాల: స్థానిక నూనెపల్లె మున్సిపల్ హైస్కూల్ సమీపంలోని అపార్టుమెంట్పై మంగళవారం అర్ధరాత్రి దాటాక పిడుగు పడింది. దీంతో పైకప్పు స్వల్పంగా దెబ్బతినింది. ఏడాది క్రితం నిర్మించిన దీనిలో 30 కుటుంబాలు నివాసం ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతోపాటు భారీగా శబ్దం చేస్తూ పిడుగు పడింది. శబ్దానికి అపార్టుమెంట్లో ఉన్న వారు భయాందోళనకు గురై బయటకు వచ్చారు. అపార్టుమెంట్పైనే పిడుగు పడిందని తెలుసుకొని షాక్కు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.