నేడు కైరుప్పలలో పిడకల సమరం
ఆస్పరి: వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కైరుప్పల గ్రామంలో గురువారం సాయంత్రం పిడకల(నుగ్గులు) సమరం జరగనుంది. ఇందు కోసం పిడకలను సిద్ధం చేశారు. ఆలయ ఆవరణలో వీటిని రాశులుగా పోసి ఉంచారు. సమరాన్ని చూడడానికి మండలంలోని ఆస్పరి, కారుమంచి, బిల్లేకల్, చెన్నపల్లి, పుప్పాలదొడ్డి, యాటకల్, కలపరి, దొడగొండ, తురువగల్, అలారుదిన్నె, ముత్తుకూరు తదితర గ్రామాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరుకానున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. కోరిన కోర్కెలు నెరవేరిన భక్తులు..వీరభద్రస్వామికి పిడకలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.