వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా రైళ్ల పునరుద్ధరణ | Trains stranded in ysr district | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా రైళ్ల పునరుద్ధరణ

Published Tue, Nov 17 2015 11:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

Trains stranded in ysr district

రాజంపేట: భారీ వర్షాలతో రాయలసీమలోని పలు జంక్షన్ లలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్లను అధికారులు పునరుద్ధరించారు. నందలూరు-ఒంటిమిట్ల మధ్యలో దెబ్బతిన్న రైల్వేట్రాక్‌కు మరమ్మతులు పూర్తి కావడంతో వివిధ స్టేషన్లలో ఆగిపోయిన రైళ్లు బయలు దేరాయి. మంగళవారం ఉదయం మంటపం పల్లి వద్ద గౌహతి- చెన్నై ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన విషయం విదితమే.

ఫలితంగా ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఐదు గంటల అనంతరం కోరమాండల్, హరిప్రియ, ఎగ్మూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు బయలుదేరాయి. తిరుపతి - గుంతకల్లు మార్గంలోని సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడటంతో కూడా పలు రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే శాఖ మరమ్మత్తులు చేపట్టి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement