ysr district
-
అపార నష్టం.. ప్రభుత్వం ప్రతీ రైతును ఆదుకోవాలి: వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం: ఏపీలో రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. పంట నష్టం కారణంగా వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు. అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్యూరెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది. వర్షాలు, గాలులతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడింది. నెల కింద రూ.26వేలు ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదు.వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేది. మన వైఎస్సార్సీపీ పాలనలో ప్రతీ రైతుకు న్యాయం చేశాం. అరటి సాగులో రాష్ట్రంలోనే పులివెందుల నంబర్ వన్ స్థానంలో ఉంది. మా ప్రభుత్వంలో రూ.25కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్లు కూడా వాడుకోలేకపోతున్నారు. యూజర్ ఏజెన్సీకి అప్పగించి ఉంటే నష్టం జరిగేది కాదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. మళ్లీ ప్రతీ రైతు కళ్లలో ఆనందం కనిపించేలా చేస్తాం. అధికారంలోకి వచ్చాక ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం’ అని రైతులకు హామీ ఇచ్చారు. అకాల వర్షానికి భారీ నష్టం..శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. -
అరటి రైతుల ఆత్మహత్యాయత్నం
యల్లనూరు/పులివెందుల రూరల్: వారం రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట అకాల వర్షానికి దెబ్బతినడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక ఇద్దరు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నంచిన ఘటన అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జాంపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.బాధిత కుటుంబాల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న వెంగప్ప 9 ఎకరాలు, లక్ష్మీనారాయణ మరో 10.5 ఎకరాల్లో అరటి తోటలు సాగు చేశారు. అప్పులు తెచ్చి ఒక్కొక్కరూ రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వారం రోజుల్లో పంట కోత కోయాల్సి ఉంది. ఒక్కో రైతుకు కనీసం రూ.20 లక్షల వరకు వస్తుందని ఆశపడ్డారు. కానీ.. శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి పంట దెబ్బతింది.వడగళ్లు అరటి గెలలపై పడటంతో కాయలకు మచ్చలు వస్తాయని, దీనివల్ల పంటను ఎవరూ కొనరని బాధిత రైతులు ఆవేదన చెందారు. పంట నష్టాన్ని పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆదివారం ఉదయం ఉద్యాన శాఖ అధికారులను ఫోన్లో కోరారు. సెలవు రోజు కావడంతో అధికారులు సరైన రీతిలో స్పందించలేదు. దీంతో రైతులిద్దరూ తాము తీవ్రంగా నష్టపోవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు. అప్పులు తీర్చే దారిలేక... చివరకు ఆత్మహత్యలే గతి అని భావించి తోటలోనే పురుగు మందు తాగారు.చిన్నవెంగప్ప భార్య రాజమ్మ ఈ విషయాన్ని గమనించి గ్రామస్తులకు చెప్పగా.. ఇద్దరినీ పులివెందుల ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి రెఫర్ చేశారు. పంట నష్టం జరిగిన తోటలను ఆదివారం మధ్యాహ్నం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఉద్యాన అధికారి ఉమాదేవి, తహసీల్దార్ రాజా పరిశీలించారు. కాగా.. రైతులు ఫోన్ చేసినా తాము స్పందించలేదనడంలో వాస్తవం లేదని, వెంటనే పొలాల వద్దకు వెళ్లి బాధిత రైతులను ఆస్పత్రికి తరలించడంలో సహాయపడ్డామని ఉద్యాన అధికారి ఉమాదేవి చెప్పారు. ఎవరూ పట్టించుకోవడం లేదుమొత్తం పదిన్నర ఎకరాల్లో అరటి పంట వేశాను. 15 వేల మొక్కలు నాటాను. ప్రస్తుతం ఐదు వేల చెట్లలో పంట కోతకు వచ్చింది. రెండు, మూడు రోజుల్లో కోసి విక్రయించేవాళ్లం. మా ఖర్మ ఏమైందో గానీ వడగళ్ల వాన వచ్చింది. పంట మొత్తం దెబ్బతింది. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి?. ఒక్క అధికారి కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. – లక్ష్మీనారాయణ, ఆత్మహత్యాయత్నం చేసిన రైతుతీవ్రంగా నష్టపోయాంతొమ్మిది ఎకరాల్లో అరటి పంట వేశా. రూ.లక్షలు అప్పు చేసి పంట పెట్టా. 11 నెలలు పడ్డ కష్టానికి రెండు రోజుల్లో ఫలితమిచ్చేది. గెలలు విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతో కాస్తయినా అప్పులు తీర్చుకునేవాళ్లం. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. మా ఆశలపై నీళ్లు పడ్డాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే ఆత్మహత్యే శరణ్యం. – చిన్నవెంగప్ప, ఆత్మహత్యాయత్నం చేసిన రైతు -
అకాల వర్షం.. అపార నష్టం.. నేడు పరిశీలించనున్న వైఎస్ జగన్
ఇది నిన్నటి దృశ్యం.పచ్చటి అరటి తోటలు.. బారెడు గెలలతో కోతకు సిద్ధమయ్యాయి.. తమ ఆశలు పండించేలా ఉన్న తోటల్ని చూసి రైతు కళ్లల్లో ఆనందం తాండవించింది. ఇక అప్పులన్నీ తీరతాయని ధైర్యం వచ్చింది. ఇది నేటి పరిస్థితి.ఎటు చూసినా విరిగిన అరటి చెట్లు.. నేలవాలిన తోటలు. చేతికందే దశలో పంట నేలపాలై కంట నీరు పెట్టుకుంటున్న రైతులు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని దీనస్థితి. అమరావతి/లింగాల/అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షాలకు వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. పెద్దకుడాల గ్రామానికి చెందిన రామాంజనేయరెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. 3 ఎకరాల్లో యాలకి (సుగంధాలు) అరటి సాగు చేయగా.. పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. గోరుచుట్టుపై రోకలి పోటులా.. గోరుచుట్టుపై రోకలి పోటులా అకాల వర్షం వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లోని అరటి రైతులను దెబ్బతీసింది. గత నెలలో టన్ను అరటి ధర రూ.23 వేల నుంచి రూ.25 వేలు ఉండేది. ఇప్పుడు ధరలు పడిపోవడంతో పెట్టుబడులు దక్కుతాయో లేదోనని అరటి రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పులు చేసి పంటల్ని సాగుచేస్తే చేతికందాల్సిన పంట నేలనంటిందని వాపోతున్నారు. పురుగు మందులు, ఎరువుల ధరలు ఏటా పెరుగుతుంటే.. పంట సాగుచేసిన తమకు గిట్టుబాటు ధరలేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటల్ని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. రైతుల్ని ఆదుకుంటాం: సీఎం అకాల వర్షాలు ఈదురు గాలులకు పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పంటలు దెబ్బతిన్న జిల్లాల కలెక్టర్లతో సీఎం ఫోన్లో మాట్లాడారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయి అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లికి చెందిన ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై సీఎం ఆరా తీశారు. ఆ ఇద్దరు రైతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.ప్రభుత్వం ఆదుకోవాలికోటి ఆశలతో అప్పులు చేసి అరటి పంటను సాగు చేస్తే అకాల వర్షం, ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ వర్షానికి తీవ్రంగా నష్టపోయాం. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. – శ్రీనివాసులరెడ్డి, అరటి రైతు, ఎగువపల్లెఈ స్థితి వస్తుందనుకోలేదుఏటా ఏప్రిల్, మే నెలల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసేవి. ఆలోగా రైతులు అరటి పంట దిగుబడి చేతికందేది. ఈ ఏడాది ముందుగానే భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో తీవ్రంగా నష్టపోయాం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. – రామాంజనేయరెడ్డి, అరటి రైతు, పెద్దకుడాలనేడు వైఎస్ జగన్ పర్యటన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ మండల కన్వినర్ బాబురెడ్డి తెలిపారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిన అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారన్నారు. -
రేపు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) పులివెందులలో పర్యటించనున్నారు. లింగాలలో పడిపోయిన అరటి తోటలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. భారీవర్షాలు, ఈదురు గాలులకు అరటి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. బాధిత రైతులను ఆయన పరామర్శించనున్నారు.వైఎస్సార్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానకు భారీగా అరటి పంటలు నేలకూలాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో భారీ పంట నష్టం ఏర్పడింది. చేతి కందిన పంట నేలకూలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పులివెందుల: చవ్వా విజయశేఖర్రెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖర్రెడ్డి భౌతికకాయానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు.అనంతరం విజయశేఖర్రెడ్డి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు.పులివెందుల ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖర్రెడ్డి అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ప్రజల సందర్శనార్ధం ఆయన పార్థివదేహాన్ని పాల్రెడ్డి ఫంక్షన్ హాలులో ఉంచారు. విజయశేఖర్రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్కి దగ్గరి బంధువు. -
AP: ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం.. 1000 ఎకరాల్లో..!
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్, అనంతపురం జిల్లాలల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం అర్థరాత్రి ఈదురు గాలులతో కూడా వడగళ్ల వానకు భారీ ఎత్తున అరటి పంటలు నేలకూలాయి. శనివారం అర్ధరాత్రి పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాలతో పాటు అనేక గ్రామాలలో నేలకొరిగిన అరటి చెట్లు నేలకూలాయి. సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో భారీ పంట నష్టం ఏర్పడింది. చేతి కందిన పంట నేలకూలడంతో లబోదిబోమని అంటున్నారు రైతులు.రెండు జిల్లాలో పరిధిలో సుమారు 1000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆకస్మికంగా వచ్చిన ఈదురుగాలులతో కూడా వడగాళ్ల వానకు తన పంట పూర్తిగా నేలకొరికిందని అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పురుగుల మందుల తాగి లక్ష్మీ నారాయణ, వెంగప్ప అనే రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుత వీరికి పులివెందుల మెడికల్ కాలేజ్ లో చికిత్స అందిస్తున్నారు. పంట నష్టపోయిందని బాధతో అధికారులకు ఫోన్ చేస్తే ఈ రోజు సెలవు అన్నారని , దాంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు..పులివెందుల నియోజకవర్గంలో భారీ పంట నష్టంపులివెందుల నియోజకవర్గంలో భారీ అరటి పంట నష్టం జరిగిందని హార్టికల్చర్ అధికారి రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని లింగాలలో భారీగా అరటి చెట్లు నేలకూలయాన్నారు. నిన్న రాత్రి ఆకస్మాత్తుగా వచ్చిన వర్షం, ఈదురుగాలులతో తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపామని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. మొత్తం రూ. 20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామన్నారు. -
వర్రా రవీంద్రారెడ్డికి బెయిల్.. జైలు నుంచి విడుదల
అమరావతి: సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టైన వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు వర్రా రవీంద్రారెడ్డి శనివారం బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. మడకశిరలో వర్రా రవీంద్రా రెడ్డిపై నమోదైన కేసులో బెయిల్ వచ్చింది. దీంతో వర్రాపై నమోదైన 26 కేసుల్లోనూ వర్రాకు బెయిల్ మంజూరైనట్లయ్యింది. దీంతో వర్రా రవీంద్రా రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అభియోగాలు మోపుతూ కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం. వైఎస్సార్సీపీ మద్దతుదారు వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసింది. వర్రా రవీంద్రారెడ్డిని గత నవంబర్ లో అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. ఇలా రవీంద్రారెడ్డిపై 26 కేసులు నమోదు చేశారు. మొత్తం అన్ని కేసుల్లో ఇప్పటికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు వర్రా రవీంద్రారెడ్డి -
డ్రోన్ లేడీ!
ఆసక్తి ఉంటే అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగవచ్చని... ప్రత్యేక గుర్తింపు పొందవచ్చని నిరూపించారు వైఎస్సార్ జిల్లా కమలాపురం మున్సిపాలిటీలోని కె.అప్పాయపల్లె గడ్డ వీధికి చెందిన నామాల జ్యోత్స్న. పొదుపు సంఘంలో క్రియాశీలకంగా ఉన్న ఆమె డ్రోన్ పైలట్గా ఎదిగారు. తొమ్మిది మండలాల్లోని పొలాలకు డ్రోన్ ద్వారా పురుగుమందులు పిచికారి చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. స్థానికంగా డ్రోన్ మహిళగా గుర్తింపు పొందారు. –కమలాపురంరూ.3లక్షల వరకు వచ్చాయినేను కలలో కూడా డ్రోన్ పైలట్ అవుతానని అనుకోలేదు. ఇప్పటి వరకు కమలాపురం, చెన్నూరు, వల్లూరు, సీకే దిన్నె, కడప, వేముల, సిద్ధవటం, మైదుకూరు, ఖాజీపేట మండలాల్లో డ్రోన్ ద్వారా పురుగుమందులు పిచికారి చేశాను. ఎకరాకు రూ.400 తీసుకుంటున్నా. తొమ్మిది మండలాల్లో 58 రోజుల్లో దాదాపు 700 ఎకరాల్లో పురుగుమందులు పిచికారి చేశా. రూ.3లక్షల వరకు ఆదాయం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. – నామాల జ్యోత్స్న, కె.అప్పాయపల్లె, కమలాపురం, వైఎస్సార్ జిల్లాపొదుపు సంఘం నుంచి ఢిల్లీ వరకుదేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని పంట పొలాల్లో డ్రోన్ల ద్వారా పురుగుమందులు పిచికారి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో వైఎస్సార్ జిల్లా ఒకటి. వైఎస్సార్ జిల్లా నుంచి కమలాపురానికి చెందిన జ్యోత్స్నను డ్రోన్ పైలట్గా ఎంపిక చేశారు. ఆమె కమలాపురంలోని ‘నికితా’ పొదుపు సంఘం లీడర్గా ఉన్నారు. గ్రూప్ లీడర్గా బాగా పనిచేస్తున్న జ్యోత్స్నను డీఆర్డీఏ అధికారులు గుర్తించి కరోనా కాలంలో క్రిషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ద్వారా కమలాపురంలో మినీ నర్సరీని ఏర్పాటు చేయించారు. ఆమె బంతి, నిమ్మ, గుమ్మడి, వంగ, మిర్చి, వరి నారు పెంచి రైతులకు విక్రయిస్తున్నారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా తన పొలంలో పంటలు పండించి ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహిళలను డ్రోన్ పైలట్లుగా తయారు చేసేందుకు ప్రవేశ పెట్టిన ‘లక్పతి దీదీ’ పథకానికి కూడా జ్యోత్స్నను అధికారులు ఎంపిక చేశారు. ఆమె 2023 డిసెంబర్ 11 నుంచి 22 వరకు హైదరాబాద్లో శిక్షణ పొందారు. లక్పతి దీదీ పథకాన్ని 2024 మార్చిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. గుంటూరులో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆమెకు సర్టిఫికెట్తోపాటు డ్రోన్ అందజేశారు. మార్చి 27న అధికారికంగా ఆమె ఇంటికి డ్రోన్ వచ్చింది. ఇప్పటి వరకు ఆమె 58 రోజులపాటు డ్రోన్ ఉపయోగించి పురుగుమందులు పిచికారి చేసి రూ.3లక్షల వరకు ఆదాయం పొందారు.స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరు..ఢిల్లీలో 2024 ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకలను తిలకించేందుకు డ్రోన్ పైలట్లకు కేంద్రం ప్రత్యేక ఆహ్వానం పంపింది. వైఎస్సార్ జిల్లా నుంచి జ్యోత్స్న వెళ్లి స్వాతంత్య్ర దిన వేడుకలను తిలకించారు. ఇది తన జీవితంలో మరపురాని ఘట్టమని ఆమె తెలిపారు. కడపలో 2024, జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో డీఆర్డీఏ తరఫున ఆమె డ్రోన్ ఎగురవేసి రూ.25వేలు నగదు బహుమతి పొందారు. -
పోసానిపై సీఐ స్టేట్మెంట్ ఇవ్వడమేంటి?.. ప్రకటనపై అనుమానాలు!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళిపై పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న పోసానిపై నాటకాలాడుతున్నారంటూ రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు చేసిన ప్రకటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్లు ప్రకటన విడుదల చేయకుండా ముందుగానే సీఐ మాట్లాడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పోసాని భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోసాని ఆరోగ్యంపై పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం మానవత్వం లేకుండా పోలీసులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు.గత రాత్రి నుంచి ఛాతి నొప్పితో బాధపడుతున్న పోసాని.. కొంతకాలంగా కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఎడమ భుజం నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. తీవ్రమైన గొంతునొప్పితో కూడా బాధపడుతున్న పోసాని.. మాట్లాడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు. పోసాని తీవ్రమైన గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్నారు. అబ్డామిన్ హెర్నియా సర్జరీలో ఇన్ఫెక్షన్ వల్ల పోసానికి తీవ్రమైన సమస్య ఉంది.హెర్నియా సర్జరీ తర్వాత నెలరోజులు ఆస్పత్రిలోనే పోసాని చికిత్స తీసుకున్నారు తీవ్రమైన వెన్నునొప్పితో మూడుసార్లు వోకల్ కార్డు సర్జరీ జరిగింది. కొద్ది రోజుల క్రితం పోసానికి గుండెకు సంబంధించిన చికిత్స జరగగా, హార్ట్ సర్జరీ చేసిన స్టంట్ వేశారు వైద్యులు. హార్ట్ సర్జరీ తర్వాత ఛాతిలో నొప్పితో పోసాని బాధపడుతున్నారు. -
‘పవన్, బాబు.. ఉచిత బస్సుకు నిధులేవీ?’
సాక్షి, వైఎస్సార్: ఏపీ బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలకు కేటాయింపులకు పొంతన లేదన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి. నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి అయినా కేటాయించావా చంద్రబాబు?. ఉచిత బస్సుకు నిధులేవీ? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు సంపద సృష్టించే సత్తా ఉంటే ఎందుకు వ్యాపారాలు తగ్గిపోతున్నాయి? అని వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీల అమలుకు మాత్రం బడ్జెట్లో కేటాయింపులు లేవు. సూపర్ సిక్స్ అందించే ఉద్దేశ్యం ఉందా? లేదా?. నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి అయినా కేటాయించావా చంద్రబాబు?. స్త్రీ నిధి పేరుతో ప్రతీ మహిళకు నెలకు 1500 అన్నావు.. బడ్జెట్లో ఎక్కడ?. ఉచిత బస్సు ఎక్కడ?. తల్లికి వందనం 12వేల కోట్లు అవసరమైతే 9వేల కోట్లు ఇచ్చారు. దీపం పథకం 60 శాతం మందికి అందడం లేదు. మీరు గ్రామాలకు వచ్చి వాకబు చేసే ధైర్యం ఉందా?. అన్నదాత సుఖీభవకి కూడా అరకొర నిధులు కేటాయించావు. హామీలు నెరవేర్చకపోతే చొక్కా పట్టుకుని అడగమన్నాడు లోకేష్.. ఇప్పుడు ఏం చేయాలి?అదేమంటే సంపద సృష్టిస్తాను అన్నావు.. ఆ సంపద సృష్టి ఎక్కడ?. ఇప్పటి వరకు లక్ష కోట్ల అప్పులు తెచ్చావు. ఆ నిధులన్నీ ఎక్కడికి వెళ్లాయి?. గతంలో పెట్రోల్ రేట్లు పెరిగాయి.. అధిక పన్నులు వేస్తున్నారని అన్నావ్. మరి మీరేం తగ్గించారు?. అభివృద్ధి ఎక్కడ జరిగింది?. వైఎస్సార్సీపీ హయాంలో ప్రతీ కుటుంబానికి లక్ష వరకూ డీబీటీ ఇచ్చాం. కడప ఉక్కు కోసం జిందాల్ సంస్టను తెచ్చాం.. ఈరోజు ఎందుకు ముందుకు పోవడం లేదు?. వైద్య విద్యలో మాకు సీట్లు కావాలని రాష్ట్రాలు పోటీ పడతాయి. వైఎస్ జగన్ తెచ్చిన సీట్లు వెనక్కు పంపిన ఘనత చంద్రబాబుదే.మీపై మాట్లాడారని పోసానిని అరెస్ట్ చేశారు. లోకేష్, పవన్లు వైఎస్ జగన్ను ఎన్నెన్ని మాటలు అన్నారు. చంద్రబాబుపై కేసు పెట్టేందుకు నేను సిద్ధం. పోలీసులు మీ లిమిట్స్ దాటకండి. తప్పు చేస్తే ఇరు పక్షాల వారిపై చర్యలు తీసుకోండి. చంద్రబాబు మాటలపై విశ్వసనీయత లేదని పవన్తో అబద్ధాలు చెప్పించాడు. పవన్.. ఇచ్చిన ప్రతీ హామీకి నువ్వే బాధ్యత తీసుకుని నెరవేర్చు. రెడ్బుక్లో మా హక్కులు కాలరాస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఈ రాష్ట్రం చంద్రబాబు, లోకేష్ జాగీరు ఏమీ కాదు. మాకు కూడా రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. సీజ్ ద షిప్ ఏమైంది?.. తిరుపతి లడ్డూ ఏమైంది?. అబద్దాలు చెప్పడం కాదు.. కొన్ని పనులు చేసైనా నిరూపించుకోండి’ అని హితవు పలికారు. -
అరుదైన శంఖులిపి శాసనాలు
బి.కొత్తకోట : వైఎస్సార్ జిల్లా సిద్దవటం అటవీ రేంజ్ పరిధిలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో భారతీయ పురావస్తుశాఖ బృందం రెండో రోజు శుక్రవారం జరిపిన పరిశీలనల్లో 15 లేబుల్ శాసనాలు (పేర్లతో చెక్కిన శాసనాలు) లభ్యమయ్యాయి. ఇవి అరుదైన శంఖులిపి శాసనాలుగా గుర్తించగా అందులో ఒకటి మాత్రం బ్రాహ్మిలిపిలో ఉంది. ఈ శంఖు లిపి శాసనాలు రాయలసీమలో వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కావడం పురావస్తుశాఖ బృందానికి ఆశ్చర్యం కలిగించింది. లభ్యమైన శాసనాలు చెక్కిన చోటును పరిశీలిస్తే రెండు ప్రముఖ శైవ క్షేత్రాల మధ్య అప్పటి తీర్థ యాత్రికుల ప్రాచీన యాత్రా మార్గంగా కనిపిస్తోందని నిర్ధారించారు. అన్నీ శంఖులిపి శాసనాలే.. సిద్దవటం నుంచి నిత్యపూజకోన ఆలయానికి సమీపంలో అక్కదేవతల ఆలయం ఉంది. రెండు వాగుల ప్రవాహం కలిసే చోటు ఉన్న కొండ నిటారుగా ఉంది. పురావస్తుశాఖ బృందానికి చెందిన డైరెక్టర్ మునిరత్నంరెడ్డి, యేసుబాబు, రాఘవేంద్రవర్మ, ఎఫ్ఆర్ఓ కళావతితో పాటు అటవీ, పురావస్తుశాఖ సిబ్బంది అతికష్టం మీద కొండపైకి చేరుకున్నారు. కొండపైనుంచి గోపాలస్వామి కోన ఆలయానికి వెళ్లే మార్గంగా గుర్తించిన ఈ కొండపై దారి వెంబడి 15 శాసనాలను గుర్తించారు. బండలపై చెక్కిన వీటిలో వ్యక్తుల పేర్లు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.నడుచుకుంటూ వెళ్లే మార్గంలో ఈ శాసనాలు చెక్కి ఉన్నాయి. నిత్యపూజకోన ఆలయం నుంచి గోపాలస్వామి కోన ఆలయానికి వెళ్లే ఈ మార్గం 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. లభ్యమైన శాసనాల్లో ఒక రాతి బండపై 4వ శతాబ్దానికి చెందిన బ్రహ్మిలిపిలో చంద్రహాస అని ఒక పేరు, దాని పక్కనే ఆరో శతాబ్దానికి చెందిన శంఖులిపిలో మరో పేరు చెక్కి ఉంది. 6వ శతాబ్దం నుంచి సిద్దమాతృ లిపి పరిణామ క్రమంలో ఈ శంఖు లిపి మొదలైంది. దెబ్బతిన్న అక్షరాలు శంఖులిపితో లభ్యమైన 14 శాసనాల్లో కొన్నింటి విశ్లేషణ పురావస్తుశాఖ అధికారులకు కొంత క్లిష్టంగా మారింది. కళాత్మక రీతిలో చెక్కిన ఈ పేర్లకు సంబంధించి మధ్యలో ఒక్కో చోట ఒక్కో అక్షరం దెబ్బతింది. దీన్ని విశ్లేషించాలంటే అర్థాలు మారిపోయే అవకాశం ఉంది. దీనితో పూర్తిగా అ«ధ్యయనం చేశాక విశ్లేషించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. మార్గంలో ఎన్నో శాసనాలు ఉత్తర భారతానికి చెందిన తీర్థ యాత్రికులు నిత్యపూజకోన–గోపాలస్వామి కోన మధ్య దట్టమైన రిజర్వు ఫారెస్టు అయిన శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో రాకపోకలు సాగించినట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. అక్కదేవతల కొండపై లభించిన 15 శాసనాలతోపాటు అదే మార్గంలో ఊహించని విధంగా ఎన్నో శాసనాలు వెలుగుచూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 4–6వ శతాబ్దాలకు చెందిన రెండు శాసనాలు ఒకే బండపై చెక్కి ఉన్నాయి. లోతైన అధ్యయనానికి ఆధారం శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో 4 నుంచి 16వ శతాబ్దం వరకు మానవ మనుగడ, లిపి పరిణామ క్రమానికి సంబంధించి లోతైన అధ్యయనానికి ఆధారాలు లభ్యమయ్యాయి. రెండు రోజుల పరిశోధనలో 27 లేబుల్ శాసనాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని చెక్కిన మార్గం వెంబడి ఇంకా అన్వేషణ కొనసాగిస్తే చాలా శాసనాలు వెలుగులోకి వస్తాయని అంచనా. అతి కష్టంతో సేకరణ పురావస్తుశాఖ, అటవీశాఖ సంయుక్తంగా శుక్రవారం చేపట్టిన శాసనాల సేకరణ అతికష్టంతో జరిగింది. అక్కదేవతల ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కొండపైకి 600 మీటర్లు ఎక్కాల్సి వచ్చింది. ఇది నిటారుగా ఉండటం, దారిలేకపోవడంతో ఎక్కే సమయంలో చిన్న పొరపాటు జరిగినా ప్రమాదం చోటుచేసుకునేది. అక్కడ సెల్ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే సమాచారం ఇచ్చేందుకు కూడా వీలు లేదు. ఎంతో సాహసంతో మొత్తంగా 12 కిలోమీటర్ల నడక, కొండ ఎక్కడం ద్వారా ఈ శాసనాలను సేకరించారు. -
పీ4 సర్వేపై ప్రజల్లో ఆందోళన.. ఎన్నో సందేహాలు!
కడప సెవెన్రోడ్స్: పీ4 పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేపై జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాల ఎత్తివేతకే ఈ సర్వే చేస్తున్నారన్న అనుమానం బలపడుతోంది. ఇప్పటికే ఎన్నికల ముందు ఎడతెరిపి లేని హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని అమలు పరచకపోగా ఏదో ఒక నెపంతో నీరుగార్చే యత్నాలు చేపట్టిన విషయం ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. తాజాగా పైలెట్ ప్రాజెక్టు (pilot project) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఈనెల 20వ తేది నుంచి వైఎస్ఆర్ జిల్లాలో పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్టిసిపేషన్ (పీపీపీ) పేరిట సర్వే నిర్వహిస్తున్నారు. మార్చి 3వ తేది నాటికి పీ4 సర్వే (P4 Survey) పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 4,70,365 కుటుంబాలు ఉండగా, ఇప్పటికి 1,88,893 కుటుంబాలను అంటే 40.16 శాతం సర్వే పూర్తి చేశారు. ఇందులో 157213 కుటుంబాల (83.23 శాతం) ఆమోదం తీసుకున్నారు. ఇక 2,81,472 కుటుంబాల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 645 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 20 శాతం నిరుపేద కుటుంబాలు గుర్తించి గ్రామ సభల ద్వారా నిర్దారిస్తామంటున్నారు. పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, దాతల సహకారంతో గుర్తించిన నిరుపేదల జీవన పరిస్థితులు మెరుగు పరచడమే సర్వే ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు అంటున్నారు.ఎన్నో సందేహాలు! సర్వేలో కుటుంబ సభ్యుల పేరిట వ్యవసాయభూమి ఎంత ఉంది? మున్సిపల్ ప్రాంతాల్లో ఎన్ని సొంత గృహాలు ఉన్నాయి? నాలుగు చక్రాల వాహనాలు ఏమైనా ఉన్నాయా? కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా? ఇన్కం ట్యాక్స్ (Income Tax) ఏమైనా చెల్లిస్తున్నారా? నెలకు విద్యుత్ వినియోగం ఎంతమంది అనే అంశాలపై సచివాలయ సిబ్బంది ఆరా తీస్తున్నారు. సర్వే సిబ్బంది సేకరిస్తున్న వివరాల్లో ఎక్కువభాగం ఆదాయానికి సంబంధించిన ప్రశ్నలే ఉండడం పలు సందేహాలకు తావిస్తోంది. నాడు సంక్షేమ జాతర.. నేడు పాతరవైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో నవరత్నాల పేరిట అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. సచివాలయ సిబ్బంది ద్వారా సంక్షేమం అర్హత కలిగిన ప్రతి ఇంటి గడపను తాకింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సంక్షేమం పూర్తిగా అటకెక్కింది. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి నాయకులు ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చారు. గెలుపే లక్ష్యంగా ఎన్డీయే నేతలు హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతు సవరించారు.చదవండి: బడ్జెట్తో చంద్రబాబు దగా ఇలా..పెన్షన్ రూ. 1000లు పెంచామని గొప్పలు చెప్పకుంటున్న ప్రభుత్వం విచారణ పేరుతో వేలాది పెన్షన్లను తొలగించే చర్యలు ఇప్పటికే చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా పీ4 సర్వే చేపట్టడం ఇందులోభాగమనే సందేహాలు ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి. సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించిన వారి పేర్లు సైతం నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం, అలాంటి వివరాలు నమోదు చేసినపుడు బయో మెట్రిక్ ద్వారా ధృవీకరించాలని కూడా చెప్పడం అనుమానాలు బలపడేందుకు కారణాలుగా ఉన్నాయి. సంపాదన పరుల జాబితాలో వ్యవసాయ కూలీలు, పెన్షనర్ల పేర్లు కూడా చోటుచేసుకున్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ సర్వేపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వేగుట్టు బాబుకే ఎరుకని పరిశీలకులు వివరిస్తున్నారు. -
సిద్ధవటం.. అప్పట్లో ప్రఖ్యాత శైవక్షేత్రం
బి.కొత్తకోట: వైఎస్సార్ జిల్లా సిద్ధవటం అటవీ రేంజిలోని లంకమల అభయారణ్యం ఒకప్పుడు దేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలతో వర్ధిల్లిందని భారత పురావస్తు శాఖ గుర్తించింది. బెంగళూరు, చెన్నై పురావస్తు కేంద్రాల నుంచి వచ్చిన పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ కె.మునిరత్నంరెడ్డి, వివిధ విభాగాల్లో నిష్ణాతులైన యేసుబాబు, మేకా వి.రాఘవేంద్రవర్మ, సిద్ధవటం అటవీ రేంజి ఆఫీసర్ బి.కళావతితో కూడిన బృందం లంకమల అభయారణ్యం పరిధిలోని శాసనాలను అధ్యయనం చేసేందుకు గురువారం పర్యటించింది.బృందం ఇక్కడ పరిశీలన జరిపి లేబుల్ శాసనాల (బండరాయిపై చెక్కబడిన పేర్లు)ను సేకరించింది. అట్లూరు మండల పరిధిలోకి వచ్చే సుమారు 3,200 అడుగుల ఎత్తులోని లంక మలలోని గోపాలస్వామి కొండ, పరిసరాల్లో రెండు బండలపై సిద్ధమాతృక, శంఖులిపి, దేవనాగరి లిపిలలో ఉత్తర భారతీయ యాత్రికుల పేర్లు చెక్కబడ్డాయి. వీటిని ప్రత్యేక యాత్రికులకు చెందిన శాసనాలుగా నిర్ధారించారు. వీటిపై చెక్కబడిన 12 లేబుల్ శాసనాలను పరిశీలించిన బృందం వాటి కాపీలను తీసుకుంది. కుషానుల కాలం నాటి కళాత్మకతలేబుల్ శాసనాల్లో పేర్లు చెక్కిన తీరు పురావస్తు శాఖ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. అత్యంత కళాత్మకంగా చెక్కబడిన ఈ పేర్లను పరిశీలించాక 6వ శతాబ్దంలో అప్పటి కుషాను రాజుల కాలం నాటి కళాత్మకత కనిపిస్తోందని అధికారులు వెల్లడించారు. కుషానుల కాలం నాటి బొటనవేలి మొన శైలిలో తలకట్టును ఉపయోగించి పేర్లను చెక్కినట్టు గుర్తించారు. ఇది 5–6 శతాబ్దాల నాటి ఉత్తర భారత సిద్ధమాతృక లిపి అని నిర్ధారించారు.క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 4–5 శతాబ్దాల వరకు బ్రాహ్మి లిపిని వాడినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. కశ్మీర్, పంజాబ్లో శారద లిపి, ఒడిశాలో గౌడ, బెంగాల్లో ప్రోటోబెంగాలి లిపిగా ఉండేవి. తర్వాత ఉత్తర భారతంలో 8–9 శతాబ్దాల్లో మనుగడలో ఉన్న సిద్ధ మాతృక లిపి దేవ నాగరిలిపిగా పరిణామం చెందినట్టు భావిస్తున్నారు. లంకమలలో వెలుగుచూసిన లేబుల్ శాసనాల్లో ఈ విషయాలు స్పష్టమయ్యాయి.నేడు గుహలు, శాసనాల పరిశీలనసిద్ధవటం అటవీ రేంజి పరిధిలోని లంకమల అభయారణ్యంలో వెలుగు చూసిన ప్రాచీన కాలపు శాసనాలపై భారతీయ పురావస్తు శాఖ పరిశోధన, అధ్యయన బృందం శుక్రవారం సిద్ధవటం మండలంలోని నిత్యపూజలకోన కొండపై శాసనాలు, గుహలు, రాతి విగ్రహాలను పరిశీలించనుంది. ఈ బృందం సిద్ధవటం నుంచి పంచలింగాలకోనకు చేరుకుని అక్కడి నుంచి సుమారు 4 కిలోమీటర్లు కాలినడకన నిత్యపూజల కోనకు చేరుకుంటుంది. అక్కడ ప్రాచీన మానవులు నడయాడిన జాడలు, వెలుగులోకి వచ్చిన ఆధారాలను పురావస్తుశాఖ అధికారులు కాపీ చేసుకోనున్నారు. అనంతరం చరిత్రను పరిశోధించి అధ్యయనం చేస్తారు.వెలుగులోకి ఆశ్చర్యకర విషయాలుపురావస్తు శాఖ బృందం పరిశీలనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు పవిత్ర శైవక్షేత్రంగా, దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించిన ప్రాంతంగా బృంద సభ్యులు గుర్తించారు. ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైన దేవనాగరి లిపిని బండరాయిపై కళాత్మకంగా చెక్కిన తీరును బట్టి ఇది దక్షిణ భారతదేశంలో వెలుగు చూసిన తొలి లేబుల్ శాసనంగా బృందం తేల్చింది. ఇక్కడి ఆధారాలు ఆశ్చర్యకరమైన, లంకమల ప్రాంత గొప్పతనాన్ని చెబుతున్నాయి.లంకమలలోని గోపాలస్వామి కోన, నిత్యపూజల కోన ప్రాంతాలు ఇప్పటికీ ప్రసిద్ధి చెందినవే. గోపాలస్వామికొండపై ఆలయానికి పశ్చిమాన ఎత్తైన కొండపై రెండు బండరాళ్లు ఉన్నాయి. వాటిలో శ్రీ విశిష్ఠ కంకణధారి, యె ధర్మజ, చంద్రహాస తదితర పేర్లు కలిగిన లేబుల్ శాసనాలు ఉన్నాయి. ఇవి దేవనాగరి లిపికి చెందినవి కాగా.. క్రీ.శ. 4–16 శతాబ్దాల మధ్య ఇక్కడికి వచ్చిన యాత్రికుల పేర్లను బండపై చెక్కినట్టు లభ్యమైన లిపి ఆధారంగా నిర్ధారించారు. ఈ పేర్లు ఉత్తర భారతం నుంచి లంకమల ఆలయాల దర్శనం కోసం వచ్చిన యాత్రికులవై ఉంటాయని భావిస్తున్నారు. ఇందులో 4వ శతాబ్దానికి చెందిన బ్రాహ్మిలిపి పరిణామ క్రమాన్ని గుర్తించడం విశేషం. తొలి శాసనం ఇదేఉత్తర భారతానికి చెందిన యాత్రికులు లంకమలకు వచ్చినట్టు వెల్లడిస్తున్న తొలి చారిత్రక ఆధారం ఈ శాసనాలే అని పురావస్తు బృందం నిర్ధారించింది. దక్షిణ భారతంలో ఏకైక ఉత్తర భారత యాత్రికుల పేర్లు సిద్ధమాతృకలో రాసి ఉన్న ఇవి ఏకైక శాసన ఆధారమని పేర్కొంటున్నారు. ఈ శాసన అధ్యయనం దక్షిణ భారత చరిత్రలో మొదటిసారి కాబోతోందని వెల్లడించారు. శాసనాల అధ్యయనం నిపుణుడు యేసుబాబు మాట్లాడుతూ వీటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తే మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. -
ప్రజాదర్బార్లో వైఎస్ జగన్.. పులివెందులలో కోలాహలం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. భాకరాపురంలోని తన నివాసంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలతో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ.. వాళ్ల విజ్ఞప్తులను స్వీకరిస్తున్నారు. వైఎస్ జగన్(YS Jagan) రాకతో నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది. ఆయన్ని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జగనన్నతో కరచలనం, సెల్ఫీలు..ఫొటోల కోసం ఎగబడ్డారు. మరో వైపు ఇటీవల కొత్తగా పార్టీ పదవులు పొందిన నేతలు పార్టీ అధినేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీపీ బలోపేతానికి ప్రజల తరపున అనునిత్యం పోరాటం చేయాలని వారికి ఆయన సూచించారు. తన రెండ్రోజుల పులివెందుల పర్యటన(Pulivendula Visit)లో భాగంగా.. ఇవాళ, రేపు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. సాయంత్రం ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరు కానున్న ఆయన.. రేపు(ఫిబ్రవరి 26) ఎల్వీ ప్రసాద్ సంస్థ ద్వారా ఆధునికీకరణ చేసిన రాజారెడ్డి ఐ ఇనిస్టిట్యూట్ను ప్రారంభిస్తారు. -
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశీర్వాదం
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నేడు వైఎస్సార్ జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ వివాహా రిసెప్షన్ హాజరయ్యారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కడప చేరుకున్నారు. అనంతరం, వైఎస్ జగన్.. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ వివాహా రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. నూతన దంపతులు సుధీర్ కుమార్ రెడ్డి, లక్ష్మి మౌనికలను ఆయన ఆశీర్వదించారు. అక్కడి నుంచి కాసేపట్లో వైఎస్ జగన్ బెంగళూరుకు వెళ్లనున్నారు. -
రేపు వైఎస్ జగన్ కడప పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శుక్రవారం) కడపలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడ 11 గంటలకు మేడా రఘునాధ్ రెడ్డి కన్వెన్షన్లో ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయన బెంగళూరు బయలుదేరి వెళతారు. -
కడపలో కూటమి నేతల ‘కూల్చివేత’ రాజకీయాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో చిరు వ్యాపారులపై మున్సిపల్ అధికారులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రోడ్డు ఆక్రమణ పేరుతో రెండో గాంధీ బొమ్మ వద్ద షాపులను తొలగించారు. కడపలో కూల్చివేత రాజకీయాలను కూటమి నేతలు కొనసాగిస్తున్నారు.నిన్నటి వరకు వైఎస్సార్సీపీ నేతల వెంచర్లు, వాటర్ ప్లాంట్లపై ప్రతాపం చూపించగా, తాజాగా చిరు వ్యాపారులపై ఉక్కు పాదం మోపారు. ఎటువంటి అడ్డు, ఇబ్బందీ లేకపోయినా ఆక్రమణలు అంటూ తొలగింపు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రోద్బలంతోనే కూల్చివేత కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. -
వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై మళ్లీ కక్ష సాధింపు చర్యలు
వైఎస్సార్జిల్లా: వైఎస్సార్సీపీ కార్పొరేటర్లే లక్ష్యంగా కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అన్నీ అనుమతులతో వైఎస్సార్సీపీ కార్పోరేటర్ నడుపుతున్న వాటర్ప్లాంట్ను కూలగొట్టేందుకు ఎమ్మెల్యే మాధవీరెడ్డి సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా 26వ డివిజన్ కార్పోరేటర్ త్యాగరాజు వాటర్ ప్లాంట్ను కూలగొట్టాలని అధికారల్ని పురమాయించారు ఎమ్మెల్యే మాదవీ రెడ్డి.తాము వాటర్ ప్లాంట్ నడపడానికి అన్ని అనుమతులు ఉన్నాయని చూపినా అధికారులు మాత్రం కూలగొట్టేందుకే యత్నిస్తున్నారు. తమకు ఎమ్మెల్యే, కమిషనర్ ఆదేశాలున్నాయంటూ కూలగొట్టేందుకు యత్నిస్తున్నారు. ఇందుకు మున్సిపల్ ిసిబ్బంది సిద్ధమైన క్రమంలో ఆ డివిజన్లోని ్స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని కక్షసాధింపునకు దిగితే సహించేది లేదని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అన్నీ అనుమతులు ఉన్న వాటర్ ప్లాంట్ను ఎలా కూలగొడతారని కూటమి ప్రభుత్వం చర్యలను ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పోరేటర్ వాటర్ ప్లాంట్ కూలుస్తున్నారన్న సమాచారం అందుకున్న మేయర్ సురేష్ బాబు అక్కడకు చేరుకున్నారు. ఏ అధికారంతో వాటర్ ప్లాంట్, ఇళ్లను కూలుస్తారని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో దీనికి అన్ని పట్టాలు మంజూరు అయ్యాయని మేయర్ స్పష్టం చేశారు. ఇది రాజకీయ కక్ష పూరిత చర్య అని. నోటీసులు కూడా లేకుండా తొలగింపునకు ఎలా వచ్చారని అక్కడ ఉన్న అధికారుల్ని ప్రశ్నించారు. దీనికి అధికారులు నీళ్లు నమలగా, ఇక్కడ నుంచి అధికారులు వెళ్లే వరకూ కదిలేది లేదని మేయర్ సురేష్ బాబు తేల్చిచెప్పారు. -
ఎమ్మెల్యే ఆది వర్సెస్ ఎంపీ సీఎం రమేష్.. బీజేపీ నేతల మధ్య వార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో బీజేపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ల మధ్య పొసగడం లేదు. ఆదినారాయణరెడ్డి బంధువు పేకాట శిబిరాలు నడుపుతున్నాడంటూ కలెక్టర్, ఎస్పీకి సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు పంపిన సీఎం రమేష్.. ఆది బంధువు దేవగుడి నాగేశ్వరరెడ్డిపై కంప్లెంట్ చేశారు.ఆదినారాయణరెడ్డి వ్యవహారాలన్నీ చక్కబెట్టే నాగేశ్వరరెడ్డిపై సీఎం రమేష్ ఫిర్యాదుతో ఆదినారాయణ రెడ్డి అరాచకాలు బట్టబయలయ్యాయి. ఇప్పుడు పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు కలిసి ఉన్న ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ల మధ్య డైరెక్ట్ వార్ సాగుతోంది.ఇదీ చదవండి: ‘చంద్రబాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం’ -
‘చంద్రబాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం’
సాక్షి, అన్నమయ్య జిల్లా: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని మాజీ చీఫ్ విప్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాయచోటి ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్ట్ ల నుంచి విద్యాసంస్థల ఏర్పాటు వరకు చంద్రబాబు ఏనాడు ఈ ప్రాంత అభివృద్దిపైన చిత్తశుద్దితో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. తాజాగా రాయచోటి పర్యటన సందర్భంగా సీఎం హోదాలో కొత్త విద్యాసంస్థలు, రాయచోటి నీటికష్టాలకు పరిష్కారంను ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు చంద్రబాబు తీవ్ర నిరాశను మిగిల్చారని అన్నారు.శ్రీకాంత్రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:చంద్రబాబు నిస్సిగ్గు అబద్ధాలు:చంద్రబాబు అంటేనే చేయాల్సింది చేయడు.. ఇతరులు చేసిందంతా తానే చేసినట్లు ప్రచారం చేసుకోవడం అని అందరికీ తెలుసు. ఈ దేశంలో ఐటీకి తానే మూల పురుషుడుగా, హైదరాబాద్కు ఐటీని పరిచయం చేసిన విజనరీగా తనను తాను సిగ్గు లేకుండా పరిచయం చేసుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుంది. వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ది చెందింది. గణనీయమైన ఆదాయాన్ని సాధించింది. కానీ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేలా తానే ఐటీని కనిపెట్టినట్లు చెప్పుకుంటున్నాడు. చివరికి హైదరాబాద్ను సైతం తానే అభివృద్ధి చేసినట్లు చెప్పాడు. నిన్న (శనివారం) ఐటీ ఉద్యోగులను పక్కన పెట్టుకుని రాయచోటిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారని అందరూ ఆశించారు.కానీ చంద్రబాబు చెంత ఉన్న ఐటీ ఉద్యోగులు ‘‘మేం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డాం, మేం సంపాదించినది పార్టీ కోసం ఖర్చు చేశాం, ఎన్నికల్లో పార్టీ ఏజెంట్లుగా కూర్చున్నాం. గ్రామాల్లో మేమే పార్టీ బాధ్యత తీసుకున్నాం’’ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఈ ప్రాంతానికి సీఎం వచ్చినప్పుడు ఆయన సమక్షంలో ఒక ఐటీ ఉద్యోగి మాట్లాడే అవకాశం లభించినప్పుడు యువతకు స్పూర్తిదాయకమైన మాటలు చెబుతారని అందరూ భావించారు. కానీ దానిని కూడా పార్టీ ప్రచారానికి వాడుకోవడం విడ్డూరంగా ఉంది. దానికి తగినట్లుగా చంద్రబాబు మండల స్థాయిలోనే ఐటీ టవర్స్ నిర్మిస్తాను, వర్క్ ఫ్రం హోంను కూడా తానే కనిపెట్టినట్లు చంద్రబాబు చెప్పే మాటలు వింటే మరింత ఆశ్చర్యం కలిగించింది.స్థానిక సమస్యలపైన ఎందుకు మాట్లాడలేదు?:వైఎస్ జగన్ హయాంలో రాయచోటి ప్రజలకు నీటి కష్టాలు తప్పించేందుకు శ్రీశైలం రిజర్వాయర్ లో నీరు తగ్గిపోయినా కూడా ప్రత్యామ్నాయంగా గండికోటలో నిల్వ చేసిన నీటిని వాడుకునేందుకు ప్రణాళిక సిద్దం చేశాం. కాలేటివాగును ఒక టీఎంసీకి అభివధ్ధి చేసి, అక్కడి నుంచి వెలిగల్లుకు నీటిని పంపించేందుకు వీలుగా పనులకు శ్రీకారం చుట్టాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే డెబ్బై శాతం పనులు కూడా పూర్తి చేశాం. దాని మిగిలిన పనులను పూర్తి చేస్తామని చంద్రబాబు తన పర్యటనలో ఒక్క మాట కూడా చెప్పలేదు.రాయచోటి ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఒక్క విద్యాసంస్థను కూడా ప్రకటించలేదు. మహిళా జూనియర్ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీ, రెండో ఇంజనీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలను వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో సాధించుకున్నాం. రాయచోటిలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం ఇప్పటికే 80 ఎకరాలు భూమిని కూడా సేకరించి సిద్దంగా ఉంచాం. ఈ కాలేజీని ప్రైవేటీకరించ వద్దంటూ విద్యార్ధులు ప్రశ్నిస్తే, వారిని సంఘ విద్రోహశక్తులు అంటూ నిందిస్తారా? యూనివర్సిటీకి నిధులు, కొత్త కలెక్టరేట్ భవనాలు, గండికోట నుంచి నీటని అందించే ప్రాజెక్ట్ వంటి వాటిపై చంద్రబాబు మాట్లాడతారని అందరూ అనుకున్నారు.కానీ ఎప్పటిలాగానే చంద్రబాబు తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు. ఈ ప్రాంత ప్రజలను మోసగించారు. మభ్యపెట్టే మాటలతో ప్రజలను వంచించారు. కర్నూలులో శాశ్వత హైకోర్ట్ కావాలంటే, దానికి బదులుగా బెంచ్ తో సరిపెట్టారు. కొప్పర్తి పారిశ్రామికవాడను ఆనాడు వైయస్ఆర్, ఆ తరువాత వైఎస్ జగన్ ప్రత్యేక సెచ్గా అభివద్ధి చేశారు. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు చంద్రబాబు చొరవ చూపాలి. చేసింది చెప్పాలే కానీ.. జరిగిందంతా తానే చేసినట్లు చెప్పుకోవడం సరికాదు.గ్రామాల్లోనూ నాడు ఐటీకి ప్రాధాన్యం:సీఎంగా వైఎస్ జగన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనులు చేసుకోవాలనే ఆలోచనతో గ్రామ స్థాయిలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దానిని కొనసాగించకుండా చంద్రబాబు ఆ నిర్మాణాలను అర్థాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు మండల స్థాయిలో ఐటీ టవర్స్ నిర్మిస్తానని చెప్పడం చంద్రబాబు రెండు నాలుకల ధోరణికి, ద్వంద వైఖరికి నిదర్శనం.సంపద సృష్టించడం గురించి ప్రజలకు చెప్పడం కాదు, వారు సంపద సృష్టించుకునేలా ప్రభుత్వం పని చేయాలి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. కరోనా సమయంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ముఖ్యమంత్రిగా ఆదుకున్నది వైఎస్ జగన్. ఈ రోజు అన్ని అవకాశాలు ఉన్నా, కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. ఈ ఎనిమిది నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కోటిన్నర మందికి పైగా అర్హులైన మహిళలు చంద్రబాబు ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తున్నారు. యాబై ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెన్షన్ ఇస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. ఈ ఏడాది రైతుభరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు.సాగునీటి ప్రాజెక్ట్లపై అడుగడుగునా నిర్లక్ష్యం:చంద్రబాబు ఏనాడూ తన హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్నా, ఆయన ఏ ప్రాజెక్టూ చేపట్టలేదు. హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శంకుస్థాపన చేస్తే, తరువాత దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఆ ప్రాజెక్టులు వృథా అని మాట్లాడారు. హంద్రీనీవా నుంచి 40 టీఎంసీలు రావు. కేవలం 5 టీఎంసీల నీరే వస్తాయని ఏకంగా జీఓ ఇచ్చారు. అలాగే గండికోటను 20 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు కుదించి జీఓ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత జలయజ్ఞంలో హంద్రీనీవా ప్రాజెక్ట్ను ఐదేళ్లలో అడివిపల్లి వరకు 90 శాతం కాలువ పనులు పూర్తి చేశారు. 27 టీఎంసీల సామర్థ్యంతో కూడిన గండికోట ప్రాజెక్ట్, దానిలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసిన ఘనత వైఎస్ జగన్ది. చంద్రబాబు పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కృష్ణా బ్యారేజీ వద్ద టీడీపీ వారితో ధర్నాలు చేయించారు.ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యం వల్లే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీరు అందుతోంది. ఏడు నెలలు ఇన్ ఫ్లో ఉన్న కష్ణానదిలో ఈ రోజు డెడ్ స్టోరేజీ స్థాయికి నీటిని తోడేశారు. రాయలసమీకు ఎలా నీరు ఇస్తారో చంద్రబాబు చెప్పాలి. గతంలో పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఇస్తానంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఎలా ఇస్తారో చెప్పండి అంటే దానిపై మాట్లాడరు.ఇదీ చదవండి: నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం?ఇప్పుడు కొత్తగా బనకచర్ల అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. బనకచర్ల క్రాస్ నుంచి సరైన అవగాహన చంద్రబాబుకు లేదు. దీనిని ఎలా పూర్తి చేస్తారో చంద్రబాబు చెప్పగలరా? రాష్ట్ర ప్రజలకు కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు కుదిస్తున్నా చంద్రబాబు మాట్లడటం లేదు. పోలవరం నుంచి కష్ణా బ్యారేజీకి, అక్కడి నుంచి ప్రకాశం జిల్లాకు, అక్కడి నుంచి వెలుగొండ ద్వారా బనకచర్ల క్రాస్ కు నీటిని తరలిస్తారో సరైన ప్రణాళిక ఉందా?ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరణ:మీడియా సమావేశం అనంతరం ఈనెల 5న పార్టీ తలపెట్టిన ఫీజు పోరు పోస్టర్ను పార్టీ సీనియర్ నేత ఆకెపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆకెపాటి అమర్నాధ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఎనిమిది నెలల పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారు. రైతుసమస్యలు, పెంచిన విద్యుత్ చార్జీలపై వైఎస్సార్సీపీ ఇప్పటికే ఆందోళనలు చేసింది.తాజాగా విద్యార్ధులకు సకాలంలో చెల్లించాల్సిన ఫీజు, స్కాలర్ షిప్ బకాయిలను కూడా చెల్లించకుండా విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రతి పేద విద్యార్ధి చదువుకోవాలని ఆనాడు స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి గారు ఫీజు రీయింబర్స్ మెంట్ ను ప్రవేశపెట్టారు. దీనితో ఎందరో ఐటీ నిపుణులుగా, ప్రోఫెషనల్ కోర్స్ లతో తమ జీవితాలను మెరుగుపరుచుకున్నారు. నేడు చంద్రబాబు పేద, మధ్యతరగతి విద్యార్ధుల ఆశలపై నీళ్ళు చల్లుతున్నారు. విద్యార్ధులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల పక్షాన ఈ నెల అయిదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళలను చేపడుతున్నాం. -
వైఎస్సార్ జిల్లా: టీడీపీలో మైనింగ్ ఆధిపత్య పోరు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీలో మైనింగ్ ఆధిపత్య పోరు సాగుతోంది. వేముల మండలంలో చింతల జూటూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మైనింగ్ నిర్వహిస్తుండగా.. ఈ మైనింగ్లో తనకు 50 శాతం వాటా ఇవ్వాలంటూ మరో టీడీపీ నేత తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల టిఫిన్ బైరటీస్ కంపెనీకి చెందిన దాదాపు 15 కోట్ల ముగ్గురాయిని ఆ నేత తరలించినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి.పోలీసులు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మరింత రెచ్చిపోతున్న సదరు నేత.. తాజాగా సొంత పార్టీ నేతలు నిర్వహిస్తున్న మైనింగ్లోను వాటా ఇవ్వాలని బెదిరింపులకు దిగుతున్నాడు. తమ మైనింగ్లో వాటా ఇచ్చేందుకు మరో వర్గం నాయకులు ఒప్పుకోవడం లేదు. దీంతో ఆ నాయకుల మైనింగ్ పనులు తన అనుచరుల ద్వారా సదరు నేత నిలిపివేయించాడు. దీంతో ఆ నేతపై చింతల్ జూటూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ముందస్తు సమాచారంతో పోలీసులు చింతల్ జూటూరు గ్రామానికి చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు. -
ఫ్లైయాష్ దందా.. ఆదినారాయణరెడ్డి వర్గీయులు కొట్లాట
సాక్షి వైఎస్సార్: వైఎస్సార్ జిల్లాలో ఉద్రికత్త నెలకొంది. ఏపీలో ఫ్లైయాష్ కోసం కొట్లాట కొనసాగుతోంది. తాజాగా ఆర్టీపీపీ ఫ్లైయాష్ కోసం ఆదినారాయణరెడ్డి వర్గీయులు వారిలో వారే దాడులకు దిగారు. ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డినట్టు సమాచారం. దీంతో, ఫ్లైయాష్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. ఆర్టీపీపీ ఫ్లైయాష్ కోసం ఆదినారాయణరెడ్డి వర్గీయులు ఒకరినొకరు తన్నుకున్నారు. తాజాగా ఉచితంగా వచ్చే ఫ్లైయాష్ను అమ్ముకునేందుకు ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్యే రగడ చోటుచేసుకుంది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రామ్మోహన్రెడ్డి అనే స్థానిక నాయకుడికి ఫ్లైయాష్ అందకుండా మరో వర్గం అడ్డుకుంది. దీంతో రామ్మోహన్రెడ్డి, సంజీవరెడ్డి వర్గీయుల మధ్య తీవ్రమైన వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మద్దతుదారులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. కర్రలతో దాడులకు తెగబడటంతో పలువురు గాయపడినట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. గతంలో జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులను ఫ్లైయాష్ వద్దకు రానివ్వకుండా ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో రెండు జిల్లాల నేతల మధ్య పెద్ద ఎత్తున రగడ జరిగింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది. అనంతరం, పలు పరిణామాల మధ్య జేసీ సైలెంట్ అయ్యారు. కానీ, తాజాగా ఆదినారాయణ రెడ్డి వర్గం మాత్రం ఫ్లైయాష్ విషయంలో మరోసారి దాడులకు దిగింది. -
అందరికీ అమ్మ.. వైఎస్ జయమ్మ
పులివెందుల రూరల్ : అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు.. కానీ ఏమీ అడగకుండానే పేదలకు సాయం అందించిన అమ్మ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాతృమూర్తి వైఎస్.జయమ్మ. వైఎస్.జయమ్మ జీవించి ఉన్నంతకాలం పులివెందులకు సంబంధించిన ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ అను నిత్యం దాన,ధర్మాలలో మునిగిపోయేది. మహా నేత వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎం కావాలన్న ఆమె చిరకాల వాంఛ నెరవేరిన తర్వాత 2006 జనవరి, 25న జయమ్మ తుదిశ్వాస వదిలారు. అంతకుమునుపు 2003లో వైఎస్సార్ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొనేందుకు పాదయాత్ర చేసిన సందర్భంలో తల్లిగా వైఎస్.జయమ్మ కుమిలిపోతూనే.. ఇంట్లో పాదయాత్ర చేస్తూ బిడ్డకు మంచి జరగాలని రోజూ ప్రారి్థంచేది. అంతేకాదు 1999లో విపరీతమైన కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు పది మందికి పట్టెడన్నం పెట్టాలని భావించిన మాతృమూర్తి వైఎస్.జయమ్మ. అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రతి రోజూ ఐదారు వందల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించి ప్రశంసలందుకున్నారు. అంతేకాకుండా 1995 నుంచి 2000 వరకు పులివెందుల సర్పంచ్గా పనిచేసిన వైఎస్.జయమ్మ అప్పటి ప్రభుత్వం నుంచి ఉత్తమ సర్పంచ్ అవార్డుతోపాటు పంచాయతీని ఆదర్శంగా నిలిపి ఉత్తమ పంచాయతీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే వైఎస్.జయమ్మ జీవించినంత కాలం ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ పులివెందుల అమ్మగా గుర్తింపు పొందారు. ఆమె మరణించి నేటికి సరిగ్గా 18ఏళ్లు అవుతోంది. నేడు వైఎస్ జయమ్మ వర్ధంతి వేడుకలు దివంగత వైఎస్.రాజారెడ్డి సతీమణి వైఎస్.జయమ్మ 19వ వర్ధంతి వేడుకను శనివారం పులివెందులలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు పాలు పంచుకుంటారు. వైఎస్.జయమ్మ సమాధి వద్ద ప్రార్థనలతోపాటు.. స్థానిక పార్క్ వద్ద ఉన్న జయమ్మ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి, ఆయన తల్లి, మాజీ ఎమ్మెల్యే వైఎస్.విజయమ్మ, దివంగత వైఎస్.జార్జిరెడ్డి సతీమణి వైఎస్. భారతమ్మలతోపాటు వైఎస్సార్ సోదరుడు వైఎస్.సు«దీకర్రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులరి్పంచనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్ కుటుంబ సభ్యులతోపాటు పలువురు వైఎస్ఆర్ అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. -
‘సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే.. ప్రభుత్వానికి నష్టం’
వైఎస్సార్ జిల్లా: కడప ఎమ్మెల్యే ామాధవిరెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ీసీఎం రిలీఫ్ పండ్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యానించారు. కడపంలో పరిశుభ్రత లేక ప్రజల్లో కిడ్నీ, శ్వాసకోస వ్యాధుల ెపెరిగిపోతున్నాయని సంచలనవ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆస్పత్రి ఖర్చులకు రోగులు సీఎం రిలీఫ్ ఫండ్ఆశ్రయించక తప్పడం లేదన్నారు. అయితే ఇలా పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టం ావాటిల్లుతోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కూటమికి తలనొప్పిగా బీటెక్ రవి తీరు
-
టీడీపీ ఎమ్మెల్సీ వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ!
పులివెందుల రూరల్: వైఎస్పార్ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ఇసుక టెండర్లలో బీటెక్ రవి అనుచరులు హంగామా సృష్టించిన విషయం సద్దుమణగక ముందే శుక్రవారం రాంగోపాల్ రెడ్డి వర్గీయుడు ప్రకాష్ను చితకబాది కిడ్నాప్ చేయడం కలకలం రేపింది.నియోజకవర్గంలో చౌక దుకాణాలకు డీలర్లను నియమించేందుకు శుక్రవారం పులివెందులలోని అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాత పరీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వర్గీయుడైన వేంపల్లెకు చెందిన ప్రకాష్ స్థానికంగా దుకాణం కోసం ఈ పరీక్ష రాయడానికి వచ్చాడు. అంతలో వేంపల్లెలోని అదే వార్డుకు చెందిన టీడీపీ నాయకులు, బీటెక్ రవి అనుచరుడు రామమునిరెడ్డి, మరికొంత మంది అక్కడికి చేరుకుని.. ప్రకాష్ను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.చితక బాది కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాంగోపాల్ రెడ్డి సతీమణి భూమిరెడ్డి ఉమాదేవి అనుచరులతో కలిసి పరీక్ష కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. ప్రకాష్ను విడిచి పెట్టే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని అక్కడికి వచ్చిన పోలీసులకు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో కొద్దిసేపటికి బీటెక్ రవి అనుచరులు ప్రకాష్ను వదిలేశారు. అనంతరం ఉమాదేవి మాట్లాడుతూ.. ఒకే పార్టీలో ఉంటూ బీటెక్ రవి వర్గీయులు ఇలా చేయడం తగదని మండిపడ్డారు. టీడీపీకి చెడ్డపేరు వచ్చేలా చేస్తున్న వారిని ఉపేక్షించమని చెప్పారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని అర్బన్ పోలీస్స్టేషన్లో ప్రకాష్తో కలిసి ఫిర్యాదు చేశారు. -
వైఎస్ అభిషేక్రెడ్డి కన్నుమూత
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ నేత వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాసేపటి క్రితం మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.అభిషేక్రెడ్డి పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలిస్తున్నారు. రేపు(శనివారం) ఉదయం అభిషేక్రెడ్డికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. -
పూలగుచ్ఛం అడ్డుపెట్టి.. కూటమి సర్కార్ నీచ రాజకీయం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు అవమానం జరిగింది. ఫ్లెక్సీపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫోటోలు వేశారు. అయితే వారి ఫొటోలు కనిపించకుండా ముఖాలపై కూటమి నేతలు పూల గుచ్చం అడ్డుగా పెట్టారు. టీడీపి, బీజేపీ నేతల ఫోటోలు మాత్రమే కనిపించేలా డెకరేషన్లో ఎత్తుగడ వేశారు.జమ్మలమడుగులో మహిళా సంఘాలతో కేంద్రమంత్రి భేటీకాగా, కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్సీలను ప్రభుత్వ అధికారులు అవమానించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక కార్యక్రమం కావడంతో ఫ్లెక్సీలపై ఎంపీ, ఎమ్మెల్సీ ఫొటోలు వేయక తప్పని పరిస్థితి. పూలగుచ్ఛం అడ్డుపెట్టి పట్టి కూటమి ప్రభుత్వం నీచ రాజకీయానికి ఒడిగట్టింది. జిల్లా అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు -
కమీషన్ ఇవ్వకపోతే పింఛన్ తీసేస్తాం.. వృద్ధుల పింఛన్లపై కక్కుర్తి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వృద్దుల పెన్షన్లపై కూడా కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. ఒక్కో పెన్షన్ నుంచి రూ.300 వసూళ్లు చేస్తున్నారు. జమ్మలమడుగు 16వ వార్డులో సచివాలయం సిబ్బంది చేతివాటం బయటపడింది. కమీషన్ ఇవ్వకపోతే పెన్షన్ తీసేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. లంచం ఎందుకివ్వాలంటూ పింఛన్దారులు ప్రశ్నించినా కూడా సిబ్బంది బలవంతంగా వసూలు చేస్తున్నారు. వ్యవస్థను దారుణంగా దెబ్బ తీసి లంచాలంటూ పెన్షన్ దారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో అర్హతున్న వారందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. కూటమి మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. అయితే కూటమి అధికారం చేపట్టి ఆరునెలలైనా ఇప్పటివరకు ఒక్క పింఛన్ను కూడా చంద్రబాబు సర్కారు మంజూరు చేయలేదు. పైగా అనర్హత పేరుతో ఉన్న పింఛన్లకు కోత విధిస్తోంది. ఫలితంగా పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ పడి భంగపడ్డామని విలపిస్తున్నారు.ఇదీ చదవండి: రెండెకరాల బాబూ.. వెయ్యి కోట్లు ఎలా సంపాదించావు?అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లకు కూటమి సర్కారు మంగళం పాడుతోంది. అనర్హుల ఏరివేత పేరిట టీడీపీకి ఓటేయని వారందరినీ నాయకులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏకంగా గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన సామాజిక పెన్షన్లకూ నోటీసులు జారీ చేసి అర్హత నిరూపించుకోవాలని, లేకపోతే అనర్హులుగా ప్రకటిస్తామని రీవెరిఫికేషన్ పేరిట ఎంపీడీఓలతో నోటీసులిప్పిస్తున్నారు. -
ఆ రైతు కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం ఇవ్వాలి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో కుటుంబంతో సహా కొమ్మర నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ రైతు సంఘం(సీపీఎం) అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఇదే రోజున నంద్యాల జిల్లా ఎం.లింగాపురానికి చెందిన చిమ్మె నడిపి మారెన్న ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. వీరి కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ రైతు సంఘం(సీపీఐ) రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య మరో ప్రకటనలో విమర్శించారు. -
అప్పుల బాధ తాళలేక.. రైతు కుటుంబం బలవన్మరణం
సాక్షి ప్రతినిధి, కడప/సింహాద్రిపురం (పులివెందుల రూరల్)/కడప కోటిరెడ్డి సర్కిల్: వైఎస్సార్ జిల్లాలో అప్పుల బాధతో ఓ రైతు కుటుంబం శుక్రవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. ఆశించిన స్థాయిలో దిగుబడులులేక ఆదాయం రాకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయింది. దీంతో అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు అధికమవడం.. కౌలుకిచ్చిన భూ యజమానులకు ముఖం చూపించలేక రాత్రి భార్యాపిల్లలను తన పొలానికి విడివిడిగా తీసుకెళ్లి రైతు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దేకుంట్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కలిసిరాని వ్యవసాయం..వ్యవసాయం చేసుకుంటూ సాఫీగా జీవనం సాగిస్తున్న నాగేంద్ర (45)కు భార్య వాణి (38), కుమారుడు భార్గవ్ (13), కుమార్తె గాయత్రి (11) ఉన్నారు. అతనికి భార్య వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉంటోంది. నాగేంద్ర తనకున్న 1.50 ఎకరాల సొంత పొలంతోపాటు ఆరేళ్ల క్రితం ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగుచేశాడు. కౌలు భూమిలో ఆశించిన దిగుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. రెండేళ్ల క్రితం సుంకేసుల గ్రామానికి చెందిన మరో ఇద్దరి నుంచి 13 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్లో సోయా చిక్కుడు పంట సాగుచేశాడు. ఎకరాకు రూ.20వేల చొప్పున మొత్తం రూ.2.50 లక్షల పెట్టుబడి ఖర్చయింది. ఈసారీ ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.మళ్లీ రబీలో కొర్ర పంటను సాగుచేసేందుకు ఎకరాకు రూ.20వేల చొప్పున మొత్తం రూ.2.60 లక్షలు ఖర్చుచేసి పంటను సాగుచేశాడు. తెగుళ్ల నివారణకు పెద్ద మొత్తంలో మందులు కొన్నాడు. అయినా, ఈ పంట కూడా దిగుబడి రాకపోవడంతో తీవ్రనష్టం చవిచూశాడు. అప్పటికే అప్పులు ఉండడంతో సొంత భూమి ఒకటిన్నర్ర ఎకరాల్లో సాగుచేసిన చీనీ పంట పొలాన్ని నాగేంద్ర కుదవపెట్టాడు. దీనికితోడు.. సేద్యం కోసం కొన్న ట్రాక్టర్ను కంతులు చెల్లించలేదని స్వాధీనం చేసుకున్నారు. అవమానభారంతో ఉన్న నాగేంద్రకు కౌలుకు ఇచ్చిన యజమానులకు మోహం ఎలా చూపించాలి.. అప్పులెలా తీర్చాలన్న ఆవేదన వేధిస్తోంది.క్రమం తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు..వ్యవసాయానికి అనుబంధంగా పాడి ఉంటే వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లుగా ఉంటుందని నాగేంద్ర సుమారు రూ.4లక్షలతో నాలుగు పాడి గేదెలు కొని పోషించేవాడు. కానీ, రెండేళ్ల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు దూడలతో సహా వీటిని అపహరించారు. వరుసగా ఇలా ఆటుపోట్లతో నాగేంద్ర ఆర్థికంగా బాగా చితికిపోయాడు. రూ.15 లక్షల వరకు అప్పులు పెరిగిపోయాయి. అప్పులిచ్చిన వారు సైతం పదేపదే అడగడం ప్రారంభించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తన పొలంలో భార్య వాణి, ఇద్దరు పిల్లలకు ఉరివేసి నాగేంద్ర సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటినుంచి వెళ్లిన వీరు ఎంతకు రాకపోయేసరికి తల్లి సిద్దమ్మ ఆందోళన చెందింది. ఇరుగు పొరుగు వారిని విచారించగా.. పొలం వైపు వెళ్లారని తెలుసుకుని అదే గ్రామంలో ఉన్న పెద్ద కొడుకు నాగరాజుకు తెలిపింది. గ్రామస్తులతో కలిసి అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే నలుగురూ విగతజీవులుగా మారారు.భార్య, పిల్లలు తనలాగ కష్టపడకూడదనే..విగతజీవులుగా పడిపోయి ఉన్న నాగేంద్ర కుటుంబాన్ని చూసిన బంధువులు, గ్రామస్తులు పోలీసు లకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ మురళీనాయక్, ఎస్ఐ ఓబన్న ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తానుపడ్డ కష్టాలు తన భార్యకు, పిల్లలకు రాకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రైతు నాగేంద్ర తల్లి సిద్ధమ్మ కన్నీరుమున్నీరవుతోంది. మృతుడు ఉపయోగించిన తాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో దిద్దేకుంట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.అప్పుల బాధతోనే ఆత్మహత్య : డీఎస్పీఅప్పుల బాధతోనే రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు డీఎస్పీ మురళీ నాయక్ శనివారం మీడియాకు తెలిపారు. ముందు భార్యను.. ఆ తర్వాత కుమార్తెను, అనంతరం కుమారుడికి ఉరివేసి చివరికి రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రాత్రి 10గంటలకు మృతుడి బావమరిది రాజేష్, బంధువులు సంఘటనాస్థలికి వెళ్లి పోలీసులకు సమాచారమిచ్చారని చెప్పారు. మృతదేహాలను పులివెందుల సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మార్చురీలోని మృతదేహాలను డీఎస్పీతో కలిసి పరిశీలించారు. రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే, రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని, ఈ విషయమై కలెక్టర్, ఇన్చార్జి ఎస్పీతో మాట్లాడామని, విచారించాలని ఆదేశించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరూ అధైర్యపడొద్దు.. మంచిరోజులొస్తాయి : ఎంపీ అవినాష్రైతు నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అప్పుల బాధ తాళలేక రైతన్న తనతోపాటు భార్య, ముక్కుపచ్చలారని పిల్లలకు కూడా ఉరివేయడం బాధాకరమన్నారు. రైతన్నలు ఎవరూ అధైర్యపడొద్దని, దేవుడి దయతో మంచిరోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని తెలిపారు.నంద్యాల జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకొత్తపల్లి : అప్పుల బాధ తాళలేక నంద్యాల జిల్లాకు చెందిన మరో రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్తపల్లి మండలం ఎం. లింగాపురం గ్రామానికి చెందిన చిమ్మె నడిపి మారెన్న (68) తనకున్న ఐదెకరాలతో పాటు మరో 17 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వివిధ రకాల పంటలను సాగుచేసుకుంటున్నాడు. ఇందుకు నాలుగేళ్ల నుంచి సుమారు రూ.10 లక్షల వరకు అప్పుచేశాడు. దీంతోపాటు కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఇంటి నిర్మాణానికీ మరికొంత అప్పుచేశాడు. వీటిని తీర్చేందుకు తన ఐదెకరాల్లో మూడెకరాలను అమ్మి కొంతమేర అప్పులు కట్టాడు.ఇక ఈ ఏడాది సాగుచేసిన పొగాకు, మినుము, మొక్కజొన్న పంటలు అధిక వర్షాలతో దిగుబడిలేక నష్టపోయాడు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలీక మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు మారెన్నను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని కుమారుడు అల్లెన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఏఎస్ఐ బాబా ఫకృద్దీన్ తెలిపారు. తహసీల్దార్ ఉమారాణి, మండల వ్యవసాయాధికారి కె. మహేష్లు శనివారం లింగాపురం చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తింపజేస్తామన్నారు. -
‘పవన్.. మీ గొంతు మూగబోయిందా?’
వైఎస్సార్ జిల్లా: ఏపీలో రైతులు కష్టాలు పడుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి. విద్యుత్ చార్జీలు పెంచను అని హామీ ఇచ్చి పెంచుతుంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నించవచ్చుగా..?, ప్రశ్నించే గొంతు మూగబోయిందా..? మీరు అధికారంలో ఉన్నా జగన్ను మాత్రమే ప్రశ్నిస్తావా’ అంటూ ధ్వజమెత్తారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీడీవో జవహర్బాబును పరామర్శించడానికి పవన్ ఆగమేఘాలపై వచ్చారు. ఎవర్ని పరామర్శించినా ఆహ్వానించదగినదే. అయితే జరిగిన సంఘటన ఎంత తీవ్రమైంది అనేది కూడా చూడాలి. ఎంపీపీ కుమారుడు మండల ఆఫీసు సిబ్బంది పిలిస్తే వెళ్లారు. అక్కడ ఎంపీపీ(MPP) ఛాంబర్ కు తాళాలు వేశారు..ఓపెన్ చేయండి అని అడిగారు. ముందుగా పథకం ప్రకారం ఎంపీడీవోపై దాడి అంటూ వందల మంది టిడిపి వారు వచ్చేసారు. టీడీపీ వారు రావడంతో అక్కడే తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఎంపీడీవోపై కుర్చీ పడి దెబ్బ తగిలింది. దాన్ని డిప్యూటీ సీఎం పవన్ డైవర్ట్ చేసే కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ చార్జీలపై మేం చేసే పోరుబాటను డైవర్ట్ చెయ్యడానికి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. చంద్రబాబు తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం పవన్ కళ్యాణ్ను పంపుతున్నారు. గాలివీడు సంఘటనను కూడా అలాగే ఉపయోగించుకున్నారు. ముందుగానే ఎవరిపై కేసు పెట్టాలో కూడా నిర్ణయించుకున్నారు. ఎంపీడీవోకి ఏమీ కాకపోయినా ఆయన్ను రిమ్స్కి తెచ్చి హడావుడి చేశారు. సింహాద్రిపురం మండలం దుద్దెకుంటలో ఒక రైతు కుటుంబం చనిపోయింది. రైతులకు మద్దతు ధర లేకపోవడం వల్ల, పంట నష్టం ఇవ్వని కారణంగా ఆ రైతు కుటుంబం ఆత్మహత్యకు ఒడిగట్టారు అదే జగన్(YS Jagan) ఉంటే ఆ రైతు కుటుంబం చనిపోయేది కాదు. ప్రశ్నిస్తాను అనే పవన్ కళ్యాణ్ రైతు కష్టాలపై ఎందుకు ప్రశ్నించరు...?, ఇంత దూరం వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ రైతు కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు..?, చంద్రబాబు అడే డ్రామాలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు వద్దకు ఎందుకు వెళ్ళడం లేదు...?, ఉక్కు ఉద్యోగుల తరఫున పవన్(Pawan Kalyan) ప్రశ్నించవచ్చుగా..?, పిఠాపురంలో జాన్ అనే జనసేన నాయకుడు ఓ మైనర్ బాలికను రేప్ చేస్తే ఎందుకు పరామర్షించలేదు..?, మీ ఎమ్మెల్యే నానాజీ ఒక సీనియర్ ప్రొఫెసర్ పై దాడి చేస్తే నువ్వు ఎందుకు కట్టడి చేయలేదు..?, కానీ డైవర్ట్ చెయ్యడానికి గాలివీడు వచ్చి చంద్రబాబు చెప్పినట్లు నటిస్తున్నాడు. మీ నాటకాలన్నీ ప్రజలు చూస్తున్నారు..ప్రజలే బుద్ధి చెప్తారు’ అని మండిపడ్డారు రవీంద్రనాథ్రెడ్డి. -
దారి పొడవునా బ్రహ్మరథం
సాక్షి ప్రతినిధి, కడప/ సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ జిల్లాలో నాలుగు రోజుల పర్యటన ముగించుకుని రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారిపొడవునా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం పులివెందుల– బెంగళూరు మార్గంలోని పల్లెల జనమంతా రోడ్డుపైకి వచ్చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. తమ అభిమాన నాయకుడు ఆ రహదారిలో వెళ్తున్నారని తెలుసుకుని ఆయా గ్రామాల వద్ద రోడ్డుపై తిష్ట వేశారు. దారి పొడువునా జననేతకు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ సైతం ఏ ఒక్కరినీ నిరాశ పరచకుండా అందరినీ పలకరిస్తూ, సెల్ఫీలు దిగుతూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మార్గం మధ్యలో ఆయా గ్రామాల్లో నేతలందరినీ పేరు పేరునా పలకరిస్తూ ముందుకు సాగారు. అంబకపల్లి క్రాస్, దొరిగల్లు మీదుగా ముదిగుబ్బ బైపాస్ రోడ్డుకు చేరుకున్న జగన్కు.. కాకతీయ దాబా వద్ద కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారందరికీ జగన్ అభివాదం చేశారు. తర్వాత కట్టకిందిపల్లె మీదుగా బత్తలపల్లి మండలం రామాపురం చేరుకున్న జగన్ కాన్వాయ్ని ప్రజలు ఆపి, జై జగన్ అంటూ నినదించారు. బత్తలపల్లి టోల్ప్లాజా వద్దకు కాన్వాయ్ చేరుకునే సరికే భారీ సంఖ్యలో జనం, పార్టీ శ్రేణులు వేచి ఉన్నారు. ఇక్కడ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు కాన్వాయ్కు అడ్డుపడుతూ తమతో మాట్లాడాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో జననేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి వాహనంలో నుంచి బయటకు వచ్చి అభివాదం చేశారు. టోల్ప్లాజా వద్దనే అడుగడుగునా వాహనానికి అడ్డుపడడంతో జగన్ వాహనంలో నుంచి మూడు సార్లు బయటకు వచ్చి అభివాదం చేయాల్సి వచ్చింది.కరచాలనానికి పోటాపోటీరాప్తాడులోని నాలుగు రోడ్ల కూడలికి జగన్ కాన్వాయ్ చేరుకోగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మీ శ్రీనివాస్, భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.జగన్తో మాట్లాడటానికి, కరచాలనం చేయడానికి ప్రజలు పోటీ పడ్డారు. మార్గం మధ్యలోని బొమ్మేపర్తి, లింగనపల్లి, హంపాపురం, గొల్లపల్లి, మరూరు, ఎం.చెర్లోపల్లి, చెన్నేకొత్తపల్లి సమీపంలో పార్టీ శ్రేణులు, ప్రజలు, మహిళలు ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలికారు. సోమందేపల్లి వై.జంక్షన్ వద్ద శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్, వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, చిలమత్తూరు మండలానికి సమీపంలోని బాగేపల్లి టోల్ప్లాజా వద్ద హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఇక్కడ జగన్తో కరచాలనం చేసేందుకు యువతీ యువకులు పోటీపడ్డారు. టోల్ ప్లాజా దాటేందుకు సుమారు గంట సమయం పట్టడం గమనార్హం. జగన్ను చూసేందుకు వచ్చిన జనాన్ని, పార్టీ శ్రేణుల్ని నిలువరించడానికి ఏపీ, కర్ణాటక పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.అక్రమ కేసులకు భయపడొద్దురాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బాధితులకు భరోసా ఇచ్చారు. ఇటీవల చిలమత్తూరు మండల టీడీపీ కన్వీనర్ రంగారెడ్డి చేసిన దాడిలో శివప్ప, అతని సోదరుడు వెంకట్తో పాటు మత్సేంద్ర, నారాయణప్ప, పవన్ గాయపడ్డారు. అయితే.. పోలీసులు బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వారంతా పెద్దనపల్లి వద్ద వైఎస్ జగన్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేయించారని వాపోయారు. వారి కష్టాన్ని ఓపికగా విన్న జగన్.. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులకు భయపడొద్దని వారికి ధైర్యం చెప్పారు. -
‘వైఎస్ జగన్కు ఉన్న చరిష్మా దేశంలో ఎవరికీ లేదు’
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి (YS Jagan Mohan Reddy) ఉన్న చరిష్మా దేశంలో ఎవరికీ లేదన్నారు ఆ పార్టీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి. స్వయంకృషితో పార్టీ స్థాపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని రవీంద్రనాథ్రెడ్డి గుర్తుచేశారు. నాలుగురోజుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ జిల్లాకు వచ్చారని, ఆయనను చూసేందుకు ప్రతిరోజూ తెల్లవారు జాము నుంచే ప్రజలు(Huge Crowd) పెద్ద ఎత్తున తరలివస్తున్నారన్నారు. వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదారణ చూసి జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారని రవీంద్రనాథ్రెడ్డి(Ravindranath Reddy) మండిపడ్డారు. వైఎస్ జగన్ ఇంటిపై రాళ్ల దాడి అని ప్రసారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ను చూసేందుకు తండోపతండాలుగా జనం తరలివస్తుంటే, దానిపై కూడా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాయడం నిజంగా సిగ్గుచేటన్రారు. ప్రస్తుతం రాష్ట్రంలో దరిద్రమైన పాలన కొనసాగుతోందని రవీంద్రనాథ్రెడ్డి ధ్వజమెత్తారు. -
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్కు హాజరైన ప్రజలు, కార్యకర్తలు (ఫొటోలు)
-
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్.. వినతులు స్వీకరణ
సాక్షి, వైఎస్సార్: పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు.కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు శ్రీ వైయస్ జగన్ సూచించారు.ఆపన్నులకు అండగావివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్, వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ ఛార్జీలపై ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని ఆయన అన్నారు. -
లేని ప్రొటోకాల్ కోసం టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి రచ్చ
సాక్షి ప్రతినిధి, కడప: కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి తీరు ఏ మాత్రం మారలేదు. ప్రజా సమస్యలను గాలికొదిలి నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో తనకు మేయర్ పక్కనే కుర్చీ వేయలేదని రచ్చ చేశారు. అజెండా పేపర్లను చించేసి నిరసన తెలిపారు. మేయర్ సురే‹Ùబాబు కార్పొరేటర్లను సస్పెండ్ చేసినా బయటకు వెళ్లకుండా రచ్చ చేస్తూనే, దూషణలు, కవ్వింపుపు చర్యలకు దిగారు. లేని ప్రోటోకాల్ కోసం ఎమ్మెల్యే పంతానికి దిగారు. మేయర్ స్థాయిలో సీటు వేయాలని.. అంతవరకూ సమావేశం జరగనిచ్చేది లేదంటా రభస కొనసాగించారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలను వెంటేసుకుని నగరపాలక సంస్థ కార్యాలయం లోపల, బయట యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమావేశాన్ని రెండోసారి కూడా కొనసాగనివ్వకుండా అడ్డుకున్నారు. అధికార దర్పంతోనే.. వాస్తవానికి కార్పొరేషన్ నిబంధనల ప్రకారం.. ఎమ్మెల్యే నగరపాలక సంస్థకు ఎక్స్అఫిíÙయో సభ్యులు మాత్రమే. ఎక్స్అఫిíÙయో సభ్యులు కూడా కార్పొరేటర్ల చెంతన కూర్చోవాలి. మంత్రులు సైతం మిగతా సభ్యులతో కలిసి కూర్చోవాల్సిందే. సభకు అధ్యక్షత వహించే మేయర్కు మాత్రమే పోడియంపై ఆశీనులయ్యే అధికారం ఉంటుంది. కాగా కడప కార్పొరేషన్లో మాత్రం మేయర్ స్థాయిలో తన సీటు ఉండాలని ఎమ్మెల్యే మాధవీరెడ్డి పట్టుబడుతున్నారు. నిబంధనలన్నిటినీ గాలికొదిలేసి తనకు కుర్చీ వేయాల్సిందేనని ఇష్టారీతిన వ్యవహరించారు. దీంతో పాలకవర్గ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన 8మంది కార్పొరేటర్లను అడ్డుపెట్టుకొని దౌర్జన్యానికి దిగారు. అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేకుండా..కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో రచ్చ చేయడమే ఏకైక అజెండాతో ఎమ్మెల్యే, ఫిరాయింపు సభ్యులు వచి్చనట్టు స్పష్టంగా కని్పంచింది. సమావేశంలోకి రావడంతోనే నేరుగా పోడియం వద్దకు వెళ్లి ఎమ్మెల్యేకు కుర్చీ వేయాలంటూ సభను కొనసానివ్వకుండా అడ్డుకోవడంపై నగరపాలక సంస్థ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 15వ ఆర్థికసంఘం పనులను ఆమోదిస్తేనే కార్పొరేషన్కు కేంద్రం నుంచి నిధులు వస్తాయి. కాగా, గత రెండు సమావేశాలనూ ఎమ్మెల్యే అడ్డుకుంటూ నగరాభివృద్ధికి రావాల్సిన నిధులను రాకుండా చేస్తున్నారని మహిళా కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యేకు తాము గౌరవం ఇచ్చినా .. ఆమె నిలుపుకోలేకపోయారని, మేయర్ ఇంటిపై చెత్త వేయించి చెత్త రాజకీయం చేశారని మహిళా కార్పొరేటర్లు వాపోయారు. అలాంటప్పుడు ఆమెకు తామెందుకు లేని గౌరవం ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు.144 సెక్షన్ ఉన్నా.. దూసుకొచ్చిన టీడీపీ శ్రేణులుకార్పొరేషన్ సర్వసభ్య సమావేశం సందర్భంగా పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు పోలీసు బారికేడ్లను తోసుకొని ర్యాలీగా నగరపాలక సంస్థ కార్యాలయానికి దూసుకొచ్చారు. ప్రధాన గేటు వద్ద నినాదాలు చేశారు. వారిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. 144 సెక్షన్ ఉల్లంఘించినా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయారు. -
పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్
YS Jagan Pulivendula Tour Day 1 Updatesపులివెందుల చేరుకున్న వైఎస్ జగన్పులివెందుల నివాసానికి చేరుకున్న జగన్ 08.20PMనూతన జంటకు వైఎస్ జగన్ ఆశీర్వాదంవైఎస్సార్సీపీ నేత ఇంట వివాహ వేడుకవేముల కొత్తపల్లిలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్ వెన్నపూస వెంకట్రామిరెడ్డి ఇంట వివాహ వేడుకవెంకట్రామిరెడ్డి కుమారుడు పురుషోత్తం రెడ్డి, సాహితీ రెడ్డిల వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్జననేతను చూసేందుకు ఎగబడ్డ జనంకరచలనం, ఫొటోల కోసం ప్రయత్నం 03.52PMకడప ముఖ్యనేతలతో వైఎస్ జగన్కష్టాలు అనేవి శాశ్వతం కావుమనమందరం కలిసికట్టుగా పని చేయాలికష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదుదేశ చరిత్రలో ఏ ఒక్కరూ చేయని మంచి పనులు చేశాంఅబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాంకడప ముఖ్యనేతలు, కార్పొరేటర్లతో వైఎస్ జగన్పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం ఆంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబుఇదీ చదవండి: అందుకే మనం ప్రతిపక్షంలో ఉన్నాం!02.24PMవైఎస్జగన్ను కలిసిన కీలక నేతలుపులివెందుల పర్యటనలో భాగంగా.. ముందుగా ఇడుపులపాయలో వైఎస్ జగన్జగన్ను మర్యాదపూర్వకంగా కీలక నేతలు జగన్ను కలిసిన వాళ్లలో..పార్టీ అధికార ప్రతినిధి.. మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ద్వాజారెడ్డి 12.08PMఇడుపులపాయ ఎస్టేట్లోని చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు, ఎంపీ అవినాష్ రెడ్డి11.25AMఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించిన వైఎస్ జగన్ అభిమానులకు అభివాదం చేసిన వైఎస్సార్సీపీ అధినేత 11.08AMఇడుపులపాయకు చేరుకున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వైఎస్సార్ ఘాట్లో తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించనున్న వైఎస్ జగన్ నేటి నుంచి నాలుగు రోజుల పాటు పులివెందులలో పర్యటనఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్వద్ద నివాళులర్పిస్తారుఅనంతరం ప్రేయర్ హాల్లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారుఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారుమధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల వెళ్లి రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారుఈ నెల 25న ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారుమధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించిన అనంతరం పులివెందుల చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు26వ తేదీన పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు27వ తేదీన ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్లో జరిగే వివాహానికి హాజరవుతారుఅనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళతారు. -
నేడు వైఎస్సార్ జిల్లాకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ప్రేయర్ హాల్లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల వెళ్లి రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు.ఈ నెల 25న ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించిన అనంతరం పులివెందుల చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 26వ తేదీన పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 27వ తేదీన ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్లో జరిగే వివాహానికి హాజరవుతారు. అనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళతారు. -
నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగం
వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగం మరోసారి బయటపడింది. నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిని ఘటన బట్టబయలైంది. నీటి సంఘం అధ్యక్షుడిగా గెలిచిన బీటెక్ రవి తమ్ముడు జోగిరెడ్డిని పులివెందుల పోలీసులు ప్రత్యేకంగా అభినందించడంతో ఈ ఎన్నికలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనడానికి నిదర్శనంగా నిలిచింది. డీఎస్పీ మురళినాయక్, రూరల్ సీఐ వెంకట రమణలతో పాటు డీఎస్పీ స్థాయి అధికారి టీడీపీ నేతలకు అభినందనలు తెలియజేయడం అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోంది. ఇక పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ పసుపు చొక్కా వేసుకుని మరీ ఎన్నికలు జరిగే చోటుకి వెళ్లడం ఇక్కడ గమనార్హం. దీనిపై వైఎస్సార్సీపీ మండిపడింది. నీటి సంఘం ఎన్నికలు ఎలా జరిగాయో అనేది ఈ అభినందనలతోనే స్పష్టమవుతుందని వైఎస్సార్సీపీ విమర్శించింది. పులివెందులలో పోలీసులు ఏకపక్షంగా పని చేస్తున్నారనడానికి ఇదే నిదర్శమని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. మరొకవైపు అధికారుల తీరుపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. -
ఇదే మీ చేతగానితనానికి నిదర్శనం: అవినాష్రెడ్డి
వైఎస్ఆర్ జిల్లా: సాగునీటి సంఘాల ఎన్నికలను పోలీసుల్ని అడ్డుపెట్టుకుని నిర్వహించడం కూటమి ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శమని కడప ఎంపీ అవినాష్రెడ్డి విమర్శించారు. సాగునీటి సంఘాల ఎన్నికల సందర్భంగా బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలపై అవినాష్రెడ్డి మండిపడ్డారు.‘బీటెక్ రవి మాటలు సినిమాను తలపిస్తున్నాయి. సినిమా డైరెక్టర్ నిర్మాత, ప్రేక్షకుడు అన్నీ ఆయనే, ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. అప్రజాస్వామికంగా సాగునీటి ఎన్నికలు జరిగాయి. పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్నికలు చేయడం చేతకానితనం. ఎన్నికల్లో రైతులు పోటీ చేయాలంటే, నో డ్యూస్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఎన్నికలు కోరుకునే వారైతే.. ప్రతి రైతుకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉండేది. వీఆర్ఓలను అందుబాటులో పెట్టకుండా అందరిని ఎమ్మార్వో కార్యాలయంలో దాచారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే బీటెక్ రవి చొక్కా విప్పేవారు రైతులు. ఖైదీలను బంధించినట్లు వీఆర్ఓలను ఎమ్మార్వో కార్యాలయంలో ఎందుకు బంధించారు. రైతులు మీకు ఎందుకు ఓటేస్తారు?, ఈ క్రాఫ్ విధానం రద్దు చేస్తామన్నారు మరి ఎందుకు రద్దు చేయలేదు?, రైతులకు నో డ్యూస్ ఇవ్వకుండా అడ్డుకున్న దద్దమ్మవి నీవు. జమ్మలమడుగులో వీఆర్ఓలను దేవగుడిలో బంధించినది వాస్తవం కాదా?.’అని విమర్శల వర్షం కురిపించారు. -
కడపలో పోలీసుల ఓవరాక్షన్.. అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, వైఎస్సార్: కూటమి సర్కార్ పాలనలో వైఎస్సార్సీపీ నేతల టార్గెట్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు తాము ఎన్నికలను బహిష్కరించామని చెప్పినా అరెస్ట్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. శనివారం తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.వైఎస్సార్ జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద టీడీపీ శ్రేణులు మోహరించాయి. ఎక్కడికక్కడ వీఆర్వోల నుంచి వైఎస్సార్సీపీ మద్దతుదారులైన రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చారు. చక్రాయపేట, వేముల, వేంపల్లెల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వేంపల్లెలో నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సిద్దమైన వీఆర్వోలను మండల టీడీపీ నాయకుడి కుమారుడు బూతు పురాణం అందుకున్నారు.జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియంలో వీఆర్వోలందరినీ ప్రత్యేక వాహనంలో ఎక్కించుకుని టీడీపీ నేతలు సమయం ముగిసేంతవరకు తమ ఆధీనంలో పెట్టుకున్నారు. అలా చేయడంపై ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు.నీటి తీరువా బకాయిలు ఉంటే పోటీకి నో..సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయాలంటే నీటి తీరువా బకాయిలు ఉండకూడదు. ఎన్నికల్లో పోటీ చేసే వారు నీటి తీరువా బకాయిలు లేవని వీఆర్వోల నుంచి నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకోవాలి. సాధారణంగా నో డ్యూ సర్టిఫికెట్లను ఆ సాగునీటి సంఘాల పరిధిలోని గ్రామ సచివాలయాల్లో వీఆర్వోలు జారీ చేస్తారు.అయితే ఇప్పుడు సాగు నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో నో డ్యూ సర్టిఫికెట్లు జారీ చేయవద్దని వీఆర్వోలకు కూటమి ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేశారు. దాంతో నో డ్యూ సర్టిఫికెట్ల కోసం ఆ మండల తహసిల్దార్ కార్యాలయాలకు వెళ్లిన ఇతర పార్టీల మద్దతుదారులపై పోలీసుల సమక్షంలోనే కూటమి శ్రేణులు దాడులు చేసి.. భయోత్పాతానికి గురిచేస్తున్నాయి.ఇక, రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. సాగు నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను తమ మద్దతుదారులకే కట్టబెట్టి, దోచుకోవాలనే దురాలోచనతో అరాచకాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే ‘చేతులెత్తి ఎన్నుకునే విధానం’ ద్వారా వాటికి ఎన్నికలు నిర్వహించేలా చట్టాన్ని సవరించింది. దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ఏకాభిప్రాయం వ్యక్తం కాని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.ఇతర పార్టీల మద్దతుదారులు పోటీకి సిద్ధమైతే రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అలా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్నది గుర్తెరిగిన కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెరతీసింది. ఇతర పార్టీల మద్దతుదారులు సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా గ్రామ సచివాలయాల్లో నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుని కుట్ర చేస్తోంది. -
బీటెక్ రవి హల్చల్.. అధికారుల అండతో ఓవరాక్షన్
సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి అరాచక పాలన కొనసాగుతోంది. టీడీపీ నేతలు కొందరు అధికారులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. తాజాగా నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో బీటెక్ రవి హల్ చల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా బీటెక్ రవి రాజకీయం చేస్తుండటంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోంది. పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో టీడీపీ, కూటమి నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. పులివెందులలో నీటి పన్ను నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారు. గిడ్డంగివారిపల్లిలో బీటెక్ రవి తన అనుచరులతో కలిసి నో డ్యూ సర్టిఫికెట్లను చింపివేశారు. అలాగే, ఇనగలూరులో అధికారాలను అడ్డుపెట్టుకుని నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు. నియోజకవర్గంలో తన అనుచరులను అడ్డుపెట్టుకుని బీటెక్ రవి హల్ చల్ చేస్తున్నాడు.ఇక, నో డ్యూ సర్టిఫికెట్ ఉంటేనే నామినేషన్ వేసేందుకు అర్హత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ నేతలకు నో డ్యూ సర్టిఫికెట్లు రాకుండా కూటమి నేతలు ఎత్తుగడ వేస్తున్నారు. మరోవైపు.. పలుచోట్ల వీఆర్వోలు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరపాలని లేఖలో కోరారు. అధికారులు సహకరించడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నామినేషన్లు వేస్తే కేసులు పెడతామంటూ వైఎస్సార్సీపీ నేతలను కొందరు అధికారులు బెదిరిస్తున్నారని తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకుని చేతకాని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో అధికారుల తీరుపై ఆర్డీవో, డీఎస్పీకి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఇలా అయితే శాంతిభద్రతల సమస్య వస్తుందని అధికారులకు తెలిపారు. -
టీడీపీ నేత భూ కబ్జా.. జేసీబీలతో గుట్టను తవ్వి పది ఎకరాలు..
సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములపై కన్నేసిన కొందరు టీడీపీ నేతలు దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. టీడీపీ నేత ఏకంగా గుట్ట పక్కనే ఉన్న పది ఎకరాలు భూమిని కబ్జా చేయడం చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లాలోని వేంపల్లి పాములూరు గుట్టలో పది ఎకరాల భూమిని టీడీపీ నాయకుడు శేషారెడ్డి కబ్జా చేశాడు. అనంతరం, తన భూమి అన్నట్టుగా జేసీబీలు, ట్రాక్టర్లు పెట్టి గుట్ట వద్ద భూమిని చదును చేయించాడు. ఈ క్రమంలో 40 ఏళ్లుగా తాను ఆ భూమిని వాడుకుంటున్నట్టు చెప్పాడు.ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎంఆర్వో హరినాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఆ భూమి వాడకం ఉన్నట్టు రికార్డుల్లో లేదన్నారు. తర్వాత.. పాములూరు గుట్ట వద్దకు వెళ్లి జేసీబీ ట్రాక్టర్లను వెనక్కి పంపించారు. దీంతో, భూమి కబ్జా విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
AP: ప్రేమోన్మాది దాడి.. యువతి పరిస్థితి విషమం
సాక్షి, తిరుపతి: ఏపీలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై దాడికి పాల్పడ్డాడు. యువతిపై దాదాపు 15 సార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమోన్మాది చేతిలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.వివరాల ప్రకారం..‘వేముల మండలం కొత్తపల్లికి చెందిన షర్మిలపై శనివారం సాయంత్రం ప్రేమోన్మాది కులాయప్ప దాడికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదని షర్మిలపై 15 సార్లు కత్తితో దాడి చేశాడు. దీంతో, బాధితురాలు.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెను శనివారం రాత్రి పులివెందుల నుంచి కడప రిమ్స్కు తరలించారు.అయితే, షర్మిల.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కడప నుండి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి విషమంగానే ఉండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలో దాడికి పాల్పడిన కులాయప్ప కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడి తర్వాత కులాయప్ప పరారీలో ఉన్నాడు. -
వైఎస్సార్ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదని ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. వేముల మండలం కొత్తపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఇంట్లో వారు రావడంతో ఆ యువకుడు పరారయ్యారు.పరిస్థితి విషమించడంతో పులివెందులలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉండడంతో పాటు రక్తస్రావం ఎక్కువగా అవుతుండడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్సార్, అల్లూరి జిల్లాల్లో పులుల సంచారం
లింగాల/రాజవొమ్మంగి/అడ్డతీగల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని పొలాల్లో పులి, పులి పిల్లలు సంచరిస్తున్న దృశ్యాలను రైతులు చంద్రశేఖర్, తన చెల్లెలు తమ సెల్ఫోన్ల్లో సోమవారం వీడియో రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు తాతిరెడ్డిపల్లె గ్రామానికి చేరుకుని పులులు సంచరిస్తోన్న ప్రదేశాలను తనిఖీలు చేశారు. అయితే సోమవారం రాత్రి వర్షం కురవడంవల్ల వాటి జాడలు కనిపించలేదు. గ్రామస్తులకు తహశీల్దార్ ఈశ్వరయ్య తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు పొలం పనులు పూర్తి చేసుకుని రావాలని రైతులకు, చీకటి పడేలోపు ఇళ్లకు చేరుకోవాలని గొర్రెల కాపరులకు సూచించారు. పులుల సంచారంపై నిఘా ఏర్పాటు చేస్తామని డీఆర్వో శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం, కడప జిల్లాల సరిహద్దుల్లో ఈ పులులు సంచరిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాటి సంచారాన్ని పసిగట్టి వాటిని అక్కడ నుంచి తరిమివేసేలా చర్యలు తీసుకుంటామని డీఎఫ్వో దివాకర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం డీఆర్వో శ్రీనివాసులు, ఎఫ్బీవోలు మహబూబ్ బాషా, గోపాల్ పులులు సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు.అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి నుంచి గొబ్బిలమడుగు వెళ్లే ఘాట్రోడ్/అటవీప్రాంతంలో పులి సంచారంపై మంగళవారం సాక్షిలో ‘అమ్మో పులి’ శీర్షికన ప్రచురితమైన కథనం ఆధారంగా రాజవొమ్మంగి అటవీక్షేత్రాధికారి జి.ఉషారాణి ఘటనాస్థలికి వెళ్లి పులి పాదముద్రలు పరిశీలించారు. పాద ముద్ర 14 సెం.మీ. పొడవు, వెడల్పు ఉన్నట్లు రికార్డు చేశారు. లోతట్టు అటవీ ప్రాంతంలోకి వెళ్లి సెలయేరు వద్ద పులి సంచరించిన చోట పరిశీలించగా అక్కడ పులి అడుగు జాడలు కనిపించడంతో ఫోటోలు తీశారు. ఇది పులా? చిరుత పులా? అనే సమాచారాన్ని అధికారులతో సంప్రదించి వెల్లడిస్తామన్నారు.పులి దాడిలో మేకలు చనిపోయిన ఘటనపై విచారణ కోసం మేకల కాపరి ఉండే అడ్డతీగల అటవీ సబ్ డివిజన్ పాపంపేట సెక్షన్ పరిధి కినపర్తికి అడ్డతీగల సబ్ డీఎఫ్వో సుబ్బారెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది వెళ్లారు. పులిని చూసిన మేకల కాపర్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. మేకలపై దాడి సమయంలో చెట్లెక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నట్లు వారు తెలిపారు. -
ఘన చరితకు సాక్ష్యం గండికోట
తెలుగువారి శౌర్యప్రతాపాలకు నిలువెత్తు సాక్ష్యం. విజయనగర సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలిచి, దండయాత్రకు వచ్చిన శత్రువులను చీల్చిచెండాడి విజయభేరి మోగించిన శత్రుదుర్భేద్యమైన దుర్గం. చుట్టూ ఎత్తయిన ఎర్రని కొండలు, మధ్యలో నిలువులోతున హొయలుపోతూ వడివడిగా ప్రవహించే పెన్నమ్మ, నలుచెరగులా పచ్చదనాన్ని కప్పుకున్న ప్రకృతికాంత అందాలు. కొండపైన నిలువెత్తు బురుజులతో అబ్బురపరచే గండికోటను చరిత్రకారులు అమెరికాలోని గ్రాండ్క్యానియన్తో పోలుస్తారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన గండికోట అందాలు పర్యాటకుల్ని అలరిస్తున్నాయి.సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట గిరి, జల, వన దుర్గంగా పేరుపొందింది. ఈ కోటను శత్రుదుర్భేద్యమైనదిగా చెబుతారు. పెన్నానది ఇక్కడ రెండు కొండలను ఐదు కిలోమీటర్ల పొడవునా గండికొట్టి వెళ్తుంది కనుక ఆ ప్రాంతంలో కట్టిన ఈ కోటకు గండికోటగా పేరొచ్చింది. 11వ శతాబ్దం నుంచి దాదాపు 800 సంవత్సరాలపాటు ఈ కోట పలు వంశాల రాజుల పాలనలో ఉంది. కైఫీయత్ ప్రకారం 1123లో కాకరాజు ఈ కోటను నిరి్మంచాడు. ఈ ప్రాంతాన్ని అంతకుముందు రేనాడుగా వ్యవహరించే వారు. చాళుక్య ప్రభువు త్రైలోక మల్లుడి ప్రతినిధిగా ములికినాడు సీమ పాలకుడు కాకరాజుకు ఈ కోటతో విశేషమైన గుర్తింపు లభించింది. కల్యాణి చాళుక్యుల ఆ«దీనం నుంచి ఆ తర్వాత ఈ కోట కాకతీయుల పరమైంది. » కాకతీయ ప్రభువు గణపతిదేవ చక్రవర్తి కాయస్థ వంశీకుడు గంగయ సాహిణిని ఈ కోట పాలకుడిగా నియమించారు. అనంతరం జమ్మిగ దేవుడు, త్రిపురారి దేవుడు, అంబదేవుడు, రెండవ త్రిపురారి దేవుడు కాకతీయుల ప్రతినిధిగా కోటను పాలించారు. మొత్తంపై వంద సంవత్సరాలకు పైబడి 1304 దాక ఈ కోట కాయస్థ వంశీకుల ఆధీనంలో ఉంది. » కాయస్థ వంశీకుల తర్వాత ఈ కోట సుల్తానుల పరమైంది. కిల్జీ వంశీయులు దీన్ని పాలించారు. తర్వాత మూడు శతాబ్దాలపాటు శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయులు, సదాశివ రాయుల ప్రతినిధులు గండికోటను పాలించారు. తర్వాత కొద్దికాలం మహమ్మద్ కులీకుతుబ్షా ఆజ్ఞ మేరకు మీర్జుమ్లా ఈ కోటను పాలించాడు. » 1687లో ఔరంగజేబు గోల్కొండను జయించాక ఈ కోట మొగళుల పరమైంది. 1717 నుంచి 1779 వరకు మొగల్ సుబేదారులు, కొన్నాళ్లు కడప నవాబులు ఈ కోటను పాలించారు. 1799 వరకు గండికోట మైసూర్ సుల్తానుల పాలనలో ఉంది. హైదరాబాదు నిజాం పాలనా కాలంలో ఆంగ్లేయులు బలపడుతున్న సమయంలో నిజాం నవాబు గండికోటతోసహా బళ్లారి, అనంతపురం, కర్నూలు, కడపజిల్లాలను ఆంగ్లేయులకు దారాదత్తం చేశారు. వీటిని దత్త మండలాలు అనే వారు.కోటలో చూడదగ్గ ప్రాంతాలు » కోటలో చూడదగ్గ ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కోటలో అడుగు పెట్టగానే మూడంతస్తుల కావలి మండపం కనిపిస్తుంది. ఈ మండపం పై అంతస్తులో సైనికులు కాపలాకాస్తూ బయటి నుంచి వచ్చే శత్రువులను గమనించేవారు. » గండికోటలో మరో ఆకర్షణీయ కట్టడం జామియా మసీదు. మూడు ప్రవేశ ద్వారాలతో ఇస్లామిక్ భారతీయ శిల్పకళా నైపుణ్యాల మేళవింపుతో నిర్మించిన ఈ మసీదులో ఒకేసారి 300 మంది ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది. మసీదు ఎదుట వజూ ఖానా కూడా ఉంది. కోట ఎదుటగల ఎర్ర కోనేరు నుంచి దీనికి భూగర్బ గొట్టాల ద్వారా నీరు వచ్చేదని చరిత్రలో పేర్కొన్నారు. మసీదు లోపల 64, వెలుపల 32 గదులు ఉన్నాయి. బయట గుర్రాలను కట్టేసేవారని, లోపల యాత్రికులు విశ్రాంతి తీసుకునే వారని తెలుస్తోంది. » కోటలో జామియా మసీదు ప్రక్కనే ఎత్తయిన ధాన్యాగారం కనిపిస్తుంది. కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ఇందులో ధాన్యాన్ని నిల్వ చేసే వారని సమాచారం. దీనిలో పైకి వచ్చేందుకు మెట్ల సౌకర్యం కూడా ఉంది. » జామియా మసీదు ఎదుట విశాలమైన కోనేరు ఉంది. దీన్ని ఎర్ర కోనేరు అని, కత్తుల కోనేరు అని కూడా పిలుస్తారు. సైనికులు యుద్దం అనంతరం కత్తులను ఇందులో కడిగేవారని, అందుకే నీరు ఎర్రబారిందని ప్రచారంలో ఉంది. » దాన్యాగారం పక్కనే శిథిలస్థితిలో ఉన్న శ్రీ రఘునాథస్వామి ఆలయం ఉంది. అద్బుతమైన శిల్పకళకు ఆలవాలంగా నిలిచి ఉన్న ఈ ఆలయంలో ప్రాకారాలపై రేఖా చిత్రాలు అందరినీ ఆకర్షిస్తాయి. ఈ ఆలయానికి కొద్దిదూరంలోనే పెన్నా లోయ ప్రవాహం ఉంటుంది.గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా గండికోటలోని పెన్నా ప్రవాహంగల లోయకు గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని పేరు. ప్రపంచంలోని 40 ప్రసిద్ద భౌగోళిక విశేషాల్లో గండికోట ఒకటిగా పేరు గాంచింది. పెన్నా నది ఎర్రమల కొండను రెండుగా చీల్చుతూ కోట వెనుక వైపు నుంచి తూర్పు దిశగా వెళ్లి మైలవరం డ్యాంలో కలుస్తుంది. రెండు కొండల మధ్య దాదాపు 300 మీటర్లకు పైగా వెడల్పు ఉంది. అందులో నీరు పారుతూ ఉన్న దృశ్యాన్ని పైనుంచి చూడడం గొప్ప అనుభూతి ఇస్తుంది. సుప్రసిద్ద పర్యాటక ప్రాంతంగా చారిత్రకంగా దేశంలోనే రెండవ స్థానాన్ని ఆక్రమించిన పెన్నాలోయ అందం చూసి తీరాల్సిందే. ఇక్కడి చారిత్రక నిర్మాణాలు, సహజ సిద్దమైన అందాల కారణంగా పలు సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయి.గండికోట లోయ సాహస కృత్యాలకు అనువుగా ఉండటంతో 2000 సంవత్సరంలో ఇక్కడ అడ్వెంచర్స్ స్పోర్ట్స్ క్లబ్ను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్–2లో భాగంగా గండికోట అభివృద్దికి రూ.78 కోట్లు కేటాయించింది. కోట విశిష్టత... పెన్నానది ఐదు కిలోమీటర్లు కొండను గండికొట్టి ప్రవహిస్తుండడంతో దీని గట్టుపై కట్టిన కోటను గండికోట అని వ్యవహారిస్తున్నారు. కోట చుట్టూ మూడు రాతి ప్రాకారాలు ఉన్నాయి. కోట గోడలను ఒక్కొక్కటి టన్ను బరువు ఉండే ఎర్రటి శానపురాళ్లతో నిర్మించారు. పునాదులు లేకుండా కేవలం కొండ బండలపై కోటను నిర్మించడం కష్టం. కోట తూర్పు నుంచి పడమరకు 1200 మీటర్ల పొడవు, వెడల్పు 800 మీటర్లుగా ఉంది. కోట చుట్టూ 101 బరుజులు ఉన్నాయి. కోట తూర్పు ప్రధాన ప్రవేశ ద్వారం 20 అడుగుల ఎత్తు ఉంది. ద్వారం తలుపులకు సూది మొన గల ఇనుప గుబ్బలు బిగించారు. వీటిని మూసి తెరిచేందుకు ఎనుగులను ఉపయోగించే వారని తెలుస్తోంది. కోట చుట్టూ సైనికులు గస్తీ తిరిగేందుకు ఐదు మీటర్ల వెడల్పుగల బాటను నిర్మించారు. శత్రువుల రాకను గమనించేందుకు, కోట గోడలపైనుంచి ఫిరంగులు ఉపయోగించేందుకు ప్రత్యేకంగా రంద్రాలు ఉన్నాయి. పలుచోట్ల భారీ కొండరాళ్లే కోట గోడలుగా కనిపిస్తాయి. ఇంకొన్ని చోట్ల భారీ బండలపైనే కోట గోడల నిర్మాణం సాగింది. -
బూడిద పంచాయతీ కూడా సీఎంవోలో చర్చించే దుస్థితి: రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు,ఏడు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయకుండా చవట ప్రభుత్వంలా మారిందని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పీ రవీంద్రనాథ్ రెడ్డి. ఈ చేతగానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీని టార్గెట్ చేసి వేధింపులకు గురిచేస్తుందని మండిపడ్డారు. సోషల్ మీడియా, వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ ప్రభుత్వంలో బూడిద పంచాయతీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో పంచాయితీ చేయాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. సీఎం స్ధాయిలో సీఎంవోలో బూడిద పంచాయితీలు చేస్తున్నారని, ఇంతకంటే దారుణం ఉంటుందా అని ప్రశ్నించారు.వైఎస్సార్ జిల్లా ఆర్టీపీపీ బూడిదను కూడా కూటమి నాయకులు దోచుకుంటున్నారని, దీని పంచాయితీని సీఎం చంద్రబాబు సెటిల్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఐదారు రోజులుగా బూడిద పంచాయతీ కోసం పోలీసులంతా ఆర్టీపీపీ వద్ద కాపలా కాస్తున్నారని.. వేరే జిల్లా నుంచి దండయాత్రకు వస్తుంటే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయలేకపోతున్నారని ఆరోపించారు. స్థానిక నాయకులను కూడా అదుపు చేయలేకపోతున్నారని అన్నారు.ఇదే కాదు మట్టి, ఇసుక, లిక్కర్ ఇలా ప్రతీది దోచుకోవడమే, దోచుకోవడంలో పోటీ లేకుండా ఉండేందుకు సెటిల్మెంట్లు చేస్తున్నారు, జిల్లాలోని పోలీస్ యంత్రాంగం అంతా బూడిద కాపలాకు వినియోగిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది, ప్రజా సమస్యలు గాలికొదిలేసి ఇలా వీటిపై దృష్టిపెట్టడం ఎంతవరకు సమంజసం?. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒక్క పనీ జరగడం లేదు. ఇంత దారుణమైన పాలన ఉంటుందని ఏ ఒక్కరూ అనుకుని ఉండరు. పాలన మొత్తం నిర్వీర్యమైంది. అసలు రాష్ట్రంలో పాలన వ్యవస్థ అనేది ఉందా.రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. విత్తనాలు, ఎరువులు లేక అవస్ధలు పడుతున్నారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని అంతా దిగువకు వదిలేస్తున్నారు. 215 టీఎంసీలకు గాను శ్రీశైలంలో 124 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. రబీకి అవసరమైన నీటిని నిల్వ చేస్తున్నారా అంటే అదీ లేదు. రిజర్వాయర్లు ఖాళీ అవుతున్నాయి.కేఆర్ఎంబీ వారు గుర్తించి చెబితే కానీ ఏపీ ప్రభుత్వానికి చలనం లేదు. ఏపీ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానకురిసిన చందంగా మారింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగుతోంది. దీనిని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇది చేతగాని ప్రభుత్వంగా మారింది, ప్రజలే బుద్దిచెప్పే రోజు త్వరలో వస్తుంది’ అని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. -
జేసీ, ఆది వర్గాల మధ్య వార్.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి వైఎస్సార్ జిల్లా: జేసీ ప్రభాకర్రెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వార్ కొనసాగుతోంది. ఆర్టీపీపీ వద్దకు జేసీ వాహనాలను ఆది వర్గం అనుమతించడం లేదు. దీంతో తాడిపత్రి సిమెంట్ కంపెనీల వద్ద జమ్మలమడుగు వాహనాలను అడ్డగించారు. జమ్మలమడుగు వాహనాలకు లోడింగ్ చేయొద్దని జేసీ వర్గం హుకుం జారీ చేసింది. ఆర్టీపీపీ వద్ద జేసీ వాహనాలకు లోడింగ్ చేయొద్దని ఆది వర్గం చెబుతోంది. ఇరువురి నేతల మధ్యలో ట్రాన్స్పోర్ట్ యాజమానులు నలిగిపోతున్నారు. జిల్లా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీపీపీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.కాగా, అధికారం కోసం పరస్పరం సహకరించుకున్నా ఆదాయార్జనపై మాత్రం కూటమి పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. మొన్న ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన నిర్మాణ పనులపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డికి సవాల్ విసిరింది. ఫ్లైయాష్ రవాణా తమ కనుసన్నల్లోనే జరగాలంటూ ఇరు వర్గాలు ఆధిపత్య పోరుకు దిగాయి.తమ వాహనాలను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డు కోవడంపై రగిలిపోయిన జేసీ ప్రభాకర్రెడ్డి ఈసారి సహించేది లేదని.. తాను అదానీలా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కండ కలవాడిదే రాజ్యమన్నట్లుగా భూపేష్రెడ్డి వర్గీయులు అదానీ కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈమేరకు జిల్లా ఎస్పీకి జేసీ లేఖ రాయడంతోపాటు స్వయంగా రంగంలోకి దిగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం కూడా తాడిపత్రి నుంచి ఆర్టీపీపీ వరకు మూడు చోట్ల చెక్ పోస్టుల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. -
AP: బాలికపై గ్యాంగ్ రేప్
సాక్షి టాస్క్ఫోర్స్: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలో చింతకొమ్మదిన్నె మండలం సుగాలిబిడికి ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్నకు గురైంది. బాలిక ఇంటికి సమీపంలో ఓ యువకుడితో ఒంటరిగా మాట్లాడుతుండగా నిందితుల్లో ఒకరు సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియో బాలికకు చూపి ఉదయ్కిరణ్, మరో ఇద్దరు మైనర్లు కలిసి బాలికను లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులవుతోంది. నిందితులంతా కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల పిల్లలు కావడంతో ఈ దారుణం వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి మొదట బేరసారాలు మొదలెట్టారు. ఆ తర్వాత వారిని భయపెట్టే యత్నం చేశారు. ఎట్టకేలకు గురువారం బాధితురాలి తండ్రి కడపలోని ‘దిశ’ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, దిశ పోలీస్స్టేషన్ డీఎస్పీ రమాకాంత్లు సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. వెంటనే నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితులపై చింతకొమ్మదిన్నె సీఐ శంకర్నాయక్ పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం రావడంతో ఆఘమేఘాల మీద టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసు అధికారులతో మాట్లాడేందుకు, నిందితుల తరఫున బాధితులతో రాజీ కుదిర్చేందుకు రోజంతా విఫలయత్నం చేశారు.మహిళపై హత్యాచారం» తల నుజ్జునుజ్జు » వైఎస్సార్ జిల్లా, కాశినాయన మండలంలో దారుణం » చెన్నవరం–పాపిరెడ్డిపల్లె మధ్య ఘటన » కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులుకాశినాయన (కలసపాడు): ఓ మహిళపై హత్యాచారం ఘటన వైఎస్సార్ జిల్లా, కాశినాయన మండలం, కత్తెరగండ్ల గ్రామ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చాపాడు మండలం, ఖాదర్పల్లెకు చెందిన కరీమున్నీసా(32)–నజీర్ దంపతులు. కరీమున్నీసా ఎర్రచందనం వ్యవహారాల్లో సెటిల్మెంట్లు చేస్తుంటుంది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ తిరుగుతూ ఉంటుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. నజీర్ ఎర్రచందనం కేసులో జైలులో ఉన్నాడు. బుధవారం రాత్రి కరీమున్నీసా చెన్నవరం–పాపిరెడ్డిపల్లె మధ్య అనూహ్యంగా దారుణహత్యకు గురైంది. ఆమెను గుర్తు పట్టకుండా ఎవరో ముఖంపై బండరాళ్లతో దారుణంగా మోది హత్య చేశారు. మహిళ మృతదేహం ఉన్నట్లు మేకలకాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆమెపై సామూహిక లైంగికదాడి జరిగినట్టు గుర్తించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు, కాశినాయన, పోరుమామిళ్ల ఎస్ఐలు హనుమంతు, కొండారెడ్డి, క్లూస్టీం అధికారులు గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. మహిళ తన స్వగ్రామం నుంచి ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఘటనా స్థలానికి వచి్చనట్లు తెలిసిందని, ఈ దాషీ్టకాన్ని ఒకరు చేశారా లేక మరికొందరు కలిసి చేశారా అనేది విచారణలో తేలాల్సి ఉందని పేర్కొన్నారు. -
YSR జిల్లా సీకే దిన్నె పీఎస్ లో వర్రా రవీంద్రారెడ్డి
-
పక్కా ప్లానేనా?.. అరెస్ట్ల వెనుక అసలు మర్మమేంటి? రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రజా సమస్యలు వదిలేసి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ల వెనుక అసలు మర్మమేంటి? అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన ప్రొద్దుటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసలు ప్రభుత్వానికి ప్రజల సమస్యలు కనిపించడం లేదా? అని నిలదీశారు.‘‘వైఎస్సార్సీపీ కార్యకర్తలను బద్నాం చేయడానికి పథకం రచించారు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దుర్మార్గమైన పాలన నడుస్తోంది. ప్రజల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.’’ అని రాచమల్లు హితవు పలికారు.‘‘వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియా యాక్టివిస్టా..? అంతర్జాతీయ తీవ్రవాదా?. అతనిపై పచ్చ పత్రికలు ఇష్టారీతిన చిలువలు పలువలు చేసి రాస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించాడు. ఎక్కడైనా హద్దులు దాటి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఒక్క రవీంద్రారెడ్డిపైనే కాదు.. టీడీపీ వారు చేసిన వాటికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం దాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటోంది...91 మంది ఆడపిల్లలపై లైంగిక దాడి చేసి, 7 మందిని హత్య చేస్తే శవాలు కూడా దొరకలేదు. వారి కుటుంబ సభ్యుల కన్నీళ్లు కూడా పట్టించుకోలేదు. కానీ వారి ఇంట్లో ఆడపిల్లలు బాధ పడ్డారని తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా కేసుల్లో ప్రభుత్వం స్పందించినట్లు ఆడపిల్లలపై అత్యాచారాలపై 10 శాతమైనా స్పందించాల్సింది. ఇతని కోసం డీజీపీ, కర్నూలు డీఐజీ నాలుగు బృందాలతో గాలింపు చేపట్టామని చెప్తున్నారు. ఇతని కోసం ఒక ఎస్పీని బదిలీ చేశారు.. ఓ సీఐని సస్పెండ్ చేశారు...ఒక చిన్న సోషల్ మీడియా వర్కర్ కోసం ఇంతగా బదిలీలు, సస్పెండ్లా..?. సోషల్ మీడియా కేసంటే 41ఏ నోటీసులివ్వాల్సిన కేసు. ఏడేళ్ల లోపు శిక్షపడే ఏ కేసుకైనా స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలి. అన్నీ తెలిసినా.. అతని కోసం తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వర్కర్లను ఇబ్బంది పెట్టి అరెస్టులు చేసే పరిస్థితి. నిన్న వర్రా అరెస్ట్ అంటూ ఏబీఎన్ వార్తలు వేసింది.. తెల్లారే సరికి ఆంధ్రజ్యోతి పత్రికలో వర్రా ఎక్కడ అంటూ రాస్తారు. దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడంటూ ఈ రోజు తాటికాయంత అక్షరాలతో రాశారు. ఆ తర్వాత బీటెక్ రవి వర్రాను వైఎస్సార్సీపీ వాళ్లే హత్య చేసే అవకాశం ఉందంటూ వీడియో విడుదల చేస్తాడు. ఆ తర్వాత ఏం జరగబోతోందో..? దీని మర్మమేంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోంది.. ఈ సంఘటనలు ఒకదాని వెంట ఒకటిగా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. వీరి ప్రకటనలు, రాతల వెనుక మర్మమేంటి అని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే వర్రా రవీంద్రారెడ్డికి ప్రాణహాని ఉంటుందేమో అనే అనుమానం కలుగుతోంది. రవీంద్రారెడ్డిని వీళ్లే హతమార్చి దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీపై వేసే ఎత్తుగడలో ఉన్నట్లున్నారు...కేవలం సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడనే నెపంతో ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదు. అలా జరిగితే అతని కుటుంబం ఎంత బాధపడుతుందో చెప్పనవసరం లేదు. మీరు అతన్ని హత్య చేసే వ్యూహ రచన చేసి ఉంటే దయచేసి వెనక్కు తీసుకోండి. ఈ రోజు అధికారం ఉందని ఏదైనా దుర్మార్గపు ఆలోచన చేస్తే భగవంతుడు, చట్టం, ప్రజల వద్ద దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఎంతటి పోలీసు అధికారులైనా, ఎంత ఉన్నత పదవుల్లో ఉన్న వారైనా సరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర అత్యంత ప్రమాదకర స్థితిలోకి వెళ్తోంది...ఈ కేసులు తప్ప రాష్ట్రంలో సమస్యలే లేవా? చర్చించాల్సి అంశాలే లేవా?. ఈ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది.. ఎవరికీ స్వేచ్ఛలేదు. ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటే భయం.. సోషల్ మీడియాలో ప్రశ్నించాలంటే భయం. మీరిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చండి అంటే మానవ హక్కులకు ఉల్లంఘన చేస్తున్నారు. న్యాయమూర్తులకు చేతులెత్తి నమస్కరించి కోరుతున్నా.. రాష్ట్రంలో మానవ హక్కులను కాపాడండి. నిన్న కూడా హైకోర్టు ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఉందని స్పష్టంగా చెప్పింది. కోర్టు వారికి పోలీసులపై నమ్మకం లేదనేది స్పష్టంగా వారి మాటల్లో తెలుస్తోంది. సోషల్ మీడియా పోస్టులను వ్యక్తిగతంగా తీసుకుని ప్రాణాలకే ఇబ్బంది కలిగించవద్దు. వర్రా రవీంద్రారెడ్డిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు మీడియా ముందు ప్రవేశపెట్టి.. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టండి’’ అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి కోరారు. -
'నా భర్తకు ఏదైనా జరిగితే అనితదే బాధ్యత: కల్యాణి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సీకే దిన్నె పోలీసు స్టేషన్కు వైఎస్సార్సీపీ నేతలు వస్తున్నారని తెలియడంతో వర్రా రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు విడుదల చేశారు. రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులను జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు పరామర్శించారు.అక్రమంగా తమను నిర్బంధించారని రవీంద్రారెడ్డి భార్య కల్యాణి ఆరోపించారు. తన భర్త ఆచూకీ తెలుపమంటే పోలీసులు నోటికొచ్చినట్లు మాట్లాడారన్న కల్యాణి.. తన ఆరోగ్యం బాగా లేక పడిపోతే కనీసం డాక్టర్ను కూడా పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ఏదైనా అయితే హోం మంత్రి అనితదే బాధ్యత అని కల్యాణి అన్నారు.వైఎస్సార్ జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయన కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు(బుధవారం) ఉదయం రవీంద్రారెడ్డి భార్య కల్యాణి, సోదరుడు మల్లికార్జున రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులను తీసుకెళ్లిన పోలీసులు.. వారిని తొలుత వేముల పోలీస్ స్టేషన్కి తరలించగా, అనంతరం చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఎస్పీ మాట్లాడాలి.. తీసుకురమ్మని చెప్తే తెచ్చామంటూ పోలీసులు తెలిపారు. చివరికి స్టేషన్కు వైఎస్సార్సీపీ నేతలు వస్తున్నారని తెలియడంతో వారిని వదిలేశారు. -
ఏపీలో రాత్రిళ్లు అక్రమ అరెస్ట్.. సర్పంచ్, రవీంద్రారెడ్డి ఎక్కడ?
సాక్షి, వైఎస్సార్: ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది. కూటమి పాలనలో కక్షసాధింపు చర్యలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే నెపంలో వర్రా రవీంద్రారెడ్డి అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడిని ఏ పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారనే వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఈరోజు తెల్లవారుజామున రవీంద్రారెడ్డి ఇంటిలో డీఎస్పీ సోదాలు నిర్వహించడంతో ఆయన కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు.వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడనే నెపంతో వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుంచి పోలీసు వాహనంలో అతడి వేరే చోటకు తరలించారు. అయితే, నిన్న రాత్రి రవీంద్రారెడ్డిని ఎక్కడ ఉంచారనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఇక, రవీంద్రారెడ్డిని పోలీసులు తీసుకెళ్లిన వెంటనే గుర్తు తెలియని ఓ ముఠా రంగంలోకి దిగింది. రవీంద్రారెడ్డి గురించి ప్రశ్నిస్తున్న వారిపై సదరు ముఠా దాడులు చేస్తోంది.పోలీసులు అక్రమంగా రవీంద్రారెడ్డి తీసుకెళ్లడంతో అతడికి జామీను ఇచ్చేందుకు వేముల మండలం పెండ్లూరు సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి పోలీసులు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పీఎస్ వద్ద గుర్తు తెలియని ముఠా.. మహేశ్వర్ రెడ్డిపై దాడి చేసింది. ఆయనపై చేయి చేసుకున్నారు. రాత్రి నుంచి మహేశ్వర్ రెడ్డి ఆచూకీ కూడా తెలియడం లేదు. అయితే, వారు పోలీసులా? లేక ప్రైవేటు వ్యక్తులా? అనేది అర్థం కాకుండా ఉంది.ఇక, మంగళవారం రాత్రి నుంచి రవీంద్రారెడ్డిని ఏ పోలీసు స్టేషన్కు తరలించారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతున్నాయి. కాగా, సోషల్ మీడియా పోస్టుల్లో 41ఏ నోటీసు ఇచ్చి వదిలేయాలని నిబంధన ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం నోటీసులను ఖాతరు చేయడం లేదు. మరోవైపు.. బుధవారం తెల్లవారుజామున రవీంద్రారెడ్డి ఇంటిలో డీఎస్పీ సోదాలు నిర్వహించారు. దీంతో, రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. రవీంద్రారెడ్డి, సర్పంచ్ మహేశ్వరరెడ్డి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
చంద్రబాబూ.. మరి అవన్నీ కుట్రలేనా?: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎన్నికల హామీలు అమలు చేయడం చేతకాక, వైఎస్ జగన్ కుటుంబం మీద, ఆయన వ్యక్తిగత జీవితం గురించి నిత్యం ఏదో రకమైన అబద్ధపు ప్రచారం చేసి పబ్బం గడుపుకొంటున్న సీఎం చంద్రబాబు, ఇకనైనా విషప్రచారం ఆపకపోతే తాము కూడా ఘాటుగానే బదులివ్వాల్సి ఉంటుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి హెచ్చరించారు.బాబు కుటిల రాజకీయాలు.. ఎన్నికలకు రెండేళ్ల ముందు విజయమ్మ కారు టైరు పగిలిపోతే, ఆమె హత్యకు వైఎస్ జగన్ కుట్ర చేశాడంటూ టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాల్లో చంద్రబాబు, లోకేష్ ప్రచారం చేయిస్తున్నారని, దీన్ని పట్టుకుని ఎల్లో మీడియాలు కథనాలు రాయడం, వాటిపై టీవీల్లో డిబేట్లు పెట్టించడం అత్యంత హేయమని ఆయన ఆక్షేపించారు. ఇంకా దిగజారి తల్లిని ఎలా చూసుకోవాలో టీడీపీ నాయకులను చూసి నేర్చుకోవాలంటూ వారితో చిలకపలుకులు పలికిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ తరహాలో చంద్రబాబు కుటిల రాజకీయాలు దశాబ్దాలుగా చూస్తున్నామని చెప్పారు.చంద్రబాబుకు వార్నింగ్..ప్రజలను కుటుంబ సభ్యుల్లా, మహిళలను తోబుట్టువుల్లా చూసుకున్న మాజీ సీఎం జగన్, తల్లి హత్యకు కుట్ర చేశాడంటూ వస్తున్న అసత్య కథనాలపై రాచమల్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మామ ఎన్టీఆర్ మరణం, ఆయన బావమరిది హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం, ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడం, చంద్రబాబు ఇంట్లో మహిళ ఆత్మహత్య, బాలకృష్ణ ఇంట్లో హత్యాయత్నం, సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి.. ఇవన్నీ కూడా కుట్రలేనా? అని సూటిగా ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే.. వాటన్నింటికీ తామూ లింక్ పెట్టి రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు.తన బాబాయ్ పవన్కళ్యాణ్ నుంచి ప్రాణహాని ఉందని గతంలో చిరంజీవి కూతురు మీడియాతో మాట్లాడిన విషయాన్ని కూడా లింక్ పెట్టేలా చేసుకోవద్దని ఆయనకు సూచించారు. అందుకే వ్యక్తిగత, కుటుంబ వివాదాల విషయాలను రాజకీయాల్లోకి లాగకుండా సంయమనం పాటించాలని హితవు చెప్పారు. వైఎస్ కుటుంబ ఆస్తులకు సంబంధించి వివాదానికి ముగింపు పలకాలని కోరుతూ.. తన బిడ్డలిద్దరూ పరిష్కరించుకుంటారని, కాబట్టి ఎవరూ జోక్యం చేసుకోవద్దని విజయమ్మ బహిరంగ లేఖ రాయడంతో తాము కూడా పార్టీ ఆదేశాలతో మౌనంగా ఉన్నామని రాచమల్లు వివరించారు. షర్మిలకు మీ రక్షణ అవసరమా?షర్మిలమ్మకు రక్షణ కల్పిస్తామని పవన్కళ్యాణ్ హామీ ఇవ్వడంపై రాచమల్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. షర్మిలమ్మకు భద్రత కల్పిస్తామంటూ ఎందుకు కొత్త డ్రామా? అన్న ఆయన, రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే కదా? అని ప్రశ్నించారు. 5 నెలల కూటమి పాలనలో 78 మంది అమాయక ఆడబిడ్డలు, మహిళలు అత్యాచారాలకు గురై చనిపోతే వారికెందుకు రక్షణ కల్పించలేదని నిలదీశారు. అత్యంత కిరాతకంగా నాలుగేళ్ల చిన్నారులను కూడా వదలకుండా అత్యాచారాలు చేసి చంపేస్తుంటే ఒక్క నిందితుడినీ పట్టుకోలేదని ఆరోపించారు. పిఠాపురంలో 16 ఏళ్ల యువతికి మత్తుమందిచి టీడీపీ నాయకుడు అత్యాచారం చేస్తే ఎందుకు కాపాడలేదని ప్రశ్నించిన రాచమల్లు, తిరుపతి సమీపంలో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన సమాజానికి మాయని మచ్చగా మిగిలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తోబుట్టువులకు చంద్రబాబు ఇచ్చిన ఆస్తులెన్ని?:వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంపై మాట్లాడుతున్న చంద్రబాబు, తన సోదరి హైమవతి, తమ్ముడు రామ్మూర్తినాయుడుకు ఎన్ని కోట్ల ఆస్తులు పంచాడు? హెరిటేజ్లో ఎన్ని వేల షేర్లు రాసిచ్చాడో? చెప్పాలని రాచమల్లు డిమాండ్ చేశారు. చివరకు కన్నతండ్రికి కూడా చంద్రబాబు అంత్యక్రియలు నిర్వహించలేదని గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్యే, అందుకు చంద్రబాబు సమాధానం చెబుతారా? అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: రాష్ట్రావతరణ వేడుకలకు బాబు మంగళం -
పులివెందులలో రెండో రోజు.. బిజీబిజీగా వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైఎస్ జగన్ను కలిసిన ఉల్లి రైతులు.. అన్నదాతల ఆవేదన
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. పులివెందులో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉల్లి రైతులు.. వైఎస్ జగన్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. మూడోరోజు పర్యటనలో భాగంగా క్యాంపు ఆఫీసులో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఉల్లి రైతులు.. వైఎస జగన్ను కలిశారు. ఈ సందర్బంగా వారి కష్టాలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.రైతులు మాట్లాడుతూ..‘ఎకరాకు లక్ష పెట్టుబడి పెట్టినా కనీసం రవాణా చార్జీలు కూడా రాలేదన్నారు. తినడానికి తిండి కూడా లేక మార్కెట్ నుంచి వెనక్కి వచ్చేశామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, మద్దతు ధర లేదా అని వైఎస్ జగన్ వాకబు చేశారు. ఇంతవరకూ రైతుకు ఒక్క మేలు కూడా చేయలేదని చెప్పిన రైతులు. ఈ నేపథ్యంలో అధికారులతో మాట్లాడతానని, అవసరమైతే పోరాటం చేద్దామని వైఎస్ జగన్ వారి హామీ ఇచ్చారు. -
పులివెందులలో వైఎస్ జగన్.. కష్టాలు వింటూ.. నేనున్నానంటూ..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించారు. భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో ఆయన మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో కూడా చర్చించారు.కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు. అంతకుముందు పులివెందులలో దారిపొడవునా తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ, ఆగి పలకరిస్తూ, వారి వినతులు స్వీకరిస్తూ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.ఇవాళ ఉదయం ఆయన ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేంపల్లిలో వైఎస్సార్సీపీ నేత రుద్ర భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్ షబ్బీర్ వలి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు.ఇదీ చదవండి: గురి తప్పిన బాణం వెనుక..! -
పులివెందుల మెడికల్ కాలేజీ దగ్గర వైఎస్ జగన్ సెల్ఫీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సెల్ఫీ తీసుకున్నారు. మెడికల్ కాలేజీకి వచ్చిన సీట్లను కూటమి సర్కార్ వెనక్కి పంపగా, కాలేజీని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆయన సెల్ఫీ తీసుకున్నారు.రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి.. అవసరం లేదంటూ ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల కలలను చిదిమేసే విధంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేయాలని చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం పెనుశాపంగా మారింది. పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడమేమిటి?. పులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేస్తే వద్దనడం ఏంటి? తక్షణమే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలి’’ అంటూ సీఎం చంద్రబాబును గతంలో వైఎస్ జగన్ హెచ్చరించారు కూడా.కాగా, వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేంపల్లిలో వైఎస్సార్సీపీ నేత రుద్ర భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్ షబ్బీర్ వలి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు. -
రేపు ఇడుపులపాయకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు(మంగళవారం) వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి వైఎస్ జగన్.. మొదట ఇడుపులపాయ చేరుకుంటారు. అనంతరం పులివెందులకు వెళ్తారు.వైఎస్ జగన్ రేపు వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 10.45 గంటల ప్రాంతంలో ఇడుపులపాయ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందులకు వెళ్తారు. మూడు రోజుల పాటు పులివెందులలో ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు. -
వాళ్ళను చూసి సంస్కారం నేర్చుకో: షర్మిలకు కౌంటర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్ర చేస్తున్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ ఆస్తిలో కొడుకు కన్నా కూతురుకి ఎక్కువగా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఆస్తిలో కూడా షర్మిల వాటా కోరడం సమంజసమేనా అని ప్రశ్నించారు. జగన్ వ్యాపారాల్లో ఎక్కడైనా షర్మిల డైరెక్ట్గా ఉన్నారా అని నిలదీశారు.అందరి ఇళ్ళలో అక్క చెల్లెమ్మలు ఉన్నారని, వివాహ సమయంలో ఏదైతే ఆస్తులు ఉంటాయో అవి చెల్లెలికి ఇస్తారని తెలిపారు. వైఎస్సార్ ఆనాడు జగన్ కంటే షర్మిలకు ఎక్కువే ఇచ్చారని గుర్తు చేశారు. ఆన్న సంపాదించుకున్నాడని ఈర్ష పడి ఆమె జనంలోకి రావడం దారుణమన్నారు. బాలకృష్ణ ఇంట్లో గతంలో కాల్పులు జరిగాయని. అప్పుడు వైఎస్సార్ కక్షపూరితంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. ‘ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఎవరి కుటుంబం వారిది. నీ వివాహం జరిగినప్పుడు నీకు ఆస్తులు ఇవ్వలేదా? వైఎస్సార్ సీఎం అయ్యాక కూడా నువ్వే పక్కనున్నావు. జగన్ ఎక్కడో బెంగుళూరులో ఉండేవాడు. ఆ రోజు నువ్వు వ్యాపారాలు చేసుకోవాలి అనుకుంటే ఆయన సాయం చేసేవారు. జగన్ బెంగుళూరులో ఉంటూ సాక్షి, భారతి సిమెంట్స్ పెట్టారు. ఆ తర్వాత ఆయన ఆస్తుల విలువ పెరిగి ఉండొచ్చు. నీకున్న ఆస్తుల్లో ఆయన వాటా అడిగాడా?చెల్లెల్ని పైకి తేవాలని జగన్ తాను కట్టుకున్న ఇంట్లో ఆమెకు భాగం ఇచ్చారు. నాకు సమానంగా రావాలి అంటోంది. జగన్ వ్యాపారాల్లో ఎక్కడైనా నువ్వు డైరెక్ట్గా ఉన్నావా? వైఎస్సార్ చనిపోయినా ఏ అవసరం లేకున్నా ప్రేమతో ఆయన దాన విక్రయం చేశారు. వైఎస్సార్ బతికుండగానే ఆస్తులు పంపకం జరిగింది. పులివెందుల, ఇడుపులపాయ భూములు ఆమెకు ఇచ్చారు.జగన్ చేసిన MOUలో క్లియర్గా కేసులు తేలిన తర్వాత బదిలీ చేస్తామని చెప్పారు. ఇది తప్పు, మీరు అలా బదిలీ చేసుకోకూడదని జగన్ చెప్పారు. అయినా ఆమె పెడ చెవిన పెట్టారు. విధిలేని పరిస్థితిలో ఆయన నోటీసు ఇచ్చారు. మీ చర్యల వల్ల రేపు ఆయన ఇబ్బందీ పడకూడదని ఆ నోటీసు ఇచ్చారు. వాస్తవాలు ఇలా ఉంటే పచ్చ పత్రికలు వక్రీకరిస్తున్నారు.. కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మక్కై జగన్పై కేసులు పెట్టారు. గతంలో చంద్రబాబు కుట్రల వల్లే జగన్ జైలుకు వెళ్లారు. ఆయన్ను18 నెలలు జైలో పెట్టించింది మీరు కాదా..? వారికి అంత మేలు చేసిన వ్యక్తి కుమారుడిపై అవినీతి కేసులు పెట్టింది మీరు కాదా? మీరు 53 రోజులు లోపలికి వెళితే ప్రపంచం అల్లకల్లోలం అయినట్లు మాట్లాడారు. షర్మిల వ్యాపారాలు సరిగ్గా చేసుకోకపోతే జగన్ బాధ్యుడా? తెలంగాణలో పార్టీ పెట్టి డబ్బులు పోగోట్టుకుంటే జగన్ బాధ్యుడా? తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇంతక ముందు నేను చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నా. ఏ రోజూ వారి తల్లి, చెల్లిని నేను వారింట్లో చూడలేదు. ఈ రోజు దాన విక్రయం ఇచ్చిన వ్యక్తిపై ఆరోపణలు చేసే అర్హత మీకుందా? ఆయన సంపాదించుకున్న ఆస్తిలో ప్రేమతో వాటా ఇచ్చిన వ్యక్తిపై ఎలా ఆరోపణలు చేస్తారు? షర్మిలకు నా విన్నపం. నువ్వు చేసే పనిని మరోసారి ఆలోచించుకో. చంద్రబాబు అక్క చెల్లెలకు ఈ రోజు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వాళ్ళు రోడ్డు మీదకు రాలేదే. వాళ్ళని చూసి సంస్కారం నేర్చుకో?ఏడాది నుంచి చూస్తున్నా. అన్నను ఇబ్బందీ పెట్టాలని చూస్తున్నావు. ఆమెనే నాకు 200 కోట్లు ఇచ్చారని చెప్తుంది. అది మీ నాన్న సంపాదించింది కాదు. ఇబ్బందిలో ఉంటే అడగడంలో తప్పు లేదు. కుటుంబాన్ని రోడ్డుకీడ్చడం ఏమిటి? చంద్రబాబు ముందు హామీలు అమలు చెయ్. అది వదిలేసి ఇలాంటి నీచ సంస్కృతికి దిగుతున్నావు. జగన్ పాపులారిటీ తట్టుకోలేక, ప్రజలకు ఏమీ చేయలేక ఇలాంటి నీచానికి దిగుతున్నావు.’ అని మండిపడ్డారు. -
షర్మిల చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్పై షర్మిల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఉదయం పొద్దుటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ తన చెల్లిపై ప్రేమతో ఆస్తిలో షర్మిలకు వాటా ఇచ్చారన్నారు. చంద్రబాబుతో కలిసి కుట్రలు చేయడం సమంజసమేనా? అంటూ ప్రశ్నించారు.‘‘షర్మిల చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే. షర్మిలకు ఎలాంటి హక్కు లేకపోయినా ఆస్తిలో వాటా ఇచ్చారు. న్యాయపరమైన చిక్కులు వస్తాయనే బదాలాయింపు నిలిపేస్తామన్నారు. అహంకారం, అత్యాశ కలిస్తే షర్మిల. వైఎస్ జగన్ను పతనం చేయాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారు.’’ అని రాచమల్లు దుయ్యబట్టారు. ‘‘ఇంటింటికీ ఒక రామాయణం ఉండనే ఉంటుంది. మా ఇంటి రామాయణం షర్మిల పుణ్యమాని బజార్లోకి వచ్చింది. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యను షర్మిల బజారుకీడ్చిన తర్వాత వాస్తవాలేంటో చెప్పాల్సిన బాధ్యత మాకుంది. చంద్రబాబును ఆసరాగా చేసుకుని ఆమె చేస్తున్నది సవివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. షర్మిలమ్మ ప్రేమలు, అప్యాయతల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. నిజంగా అలా ప్రేమలకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే అన్నను జజారు కీడుస్తుందా? జైలుకు పంపే ప్రయత్నం చేస్తుందా?. చంద్రబాబుతో చేతులు కలిపి కుట్రకు తెరలేపుతుందా?జగన్ ఆస్తుల కోసం కోర్టుకు వెళ్లాడనడం పచ్చి అబద్ధం. ఎవరి ఆస్తులు ఎవరికిస్తున్నారో తెలియజెప్పాల్సిన అవసరం మాకుంది. షర్మిలకు పెళ్లై 30 ఏళ్లు కావొస్తుంది.. నీ తండ్రి మరణించిన 14 ఏళ్ల తర్వాత అమ్మగారి ఇంటి నుంచి ఏం ఆస్తి వస్తుంది?. వైఎస్సార్ బతికుండగానే ఇద్దరికీ సమానంగా ఆస్తులను పంచారు. వైఎస్సార్ ఆడపిల్లను వేరుగా చూడకుండా ఇద్దరికీ సమానంగా ఆస్తులు పంచారు. తన స్వార్జితం సంపాదించుకున్న ఆస్తిలో చెల్లెలుపై ప్రేమతో ఆయన వ్యాపారాల్లో రూ.200 కోట్లు వైఎస్ జగన్ ఇచ్చారు. డబ్బే కాదు.. ఆస్తులు కూడా ఇస్తానని పిలిచి ముందుకు వచ్చాడు. షర్మిలకు హక్కు లేకపోయినా.. రక్త సంబంధంతో ఎంవోయూ చేశారు.జగన్ ఇవ్వడం గొప్పైతే.. దానికి ఒప్పుకోవడం జగన్ సతీమణి భారతి చాలా గొప్పతనం. ఏ ఆడబిడ్డకు ఇచ్చేదానికి ఏ భార్య ఒప్పుకోదు. ఆమెను ప్రశంసించాలి. ఆ ఎంవోయూలో ఈడీ చేతిలో ఆస్తులు అటాచ్ అయ్యాయి. వెంటనే బదలాయింపు చేయలేనని చెప్తూ అగ్రిమెంట్ చేశారు. ఆమెకు దానిలో హక్కు లేదు. తండ్రి గారి సొమ్ము కూడా కాదు. కేసులు పరిష్కారం అయిన తర్వాత నీకు బదలాయింపు జరుగుతుందని కూడా ఎంవోయూలో ఉంది. ఏదో నీ తండ్రి సంపాదించిన ఆస్తిలో హక్కు అడిగినట్లు షర్మిలమ్మ మాట్లాడుతోంది. జగన్ నీకిచ్చిన ఆస్తి కోసం ట్రిబ్యునల్కు వెళ్లలేదు.. ఆయన కోర్టుకు వెళ్లలేదు.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్లారు.నాకు తెలియకుండా మోసం చేసి, నా తల్లికి అబద్ధాలు చెప్పి బదలాయింపు చేసుకునేందుకు ప్రయత్నించారని, దాన్ని ఆపాలని జగన్ కోరారు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడకుండా, ప్రమాదం జరగకుండా ఆయన తీసుకున్న జాగ్రత్త ఇది. నీది కాని ఆస్తి కోసం ఎవరితో చేతులు కలిపావు తల్లీ. ఎవరిని జైలుకు పంపాలనుకున్నావు తల్లీ..?. చంద్రబాబు, రేవంత్రెడ్డి, సునీతమ్మ, మీరు నలుగురు కలిసి కుట్ర చేసి జగన్ను చిక్కుల్లోకి పంపాలని కుట్ర చేశారు. మరోక రెండేళ్లు జగన్ను జైలుకు పంపాలని ప్రయత్నం చేస్తావా..?చంద్రబాబు, రేవంత్ చేశారంటే ఒక అర్ధం ఉంది.. తోడబుట్టిన, రక్తం పంచుకుని పుట్టిన దానివి.. ఎందుకింత నీచానికి ఒడికడుతున్నావు. తల జగన్ గారిదైతే.. కత్తి షర్మిలమ్మది.. చేయి చంద్రబాబుది. ఇంత చేస్తూ అనుబంధాలు, ప్రేమలు, అప్యాయతలంటూ మాట్లాడతావా.. షర్మిల మాట్లాడే మాటలన్నీ పచ్చి అబద్దం. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్లో భూములపైనే ఎటాచ్మెంట్ ఉంది. కంపెనీ అటాచ్ కాలేదు అంటూ అబద్దాలు మాట్లాడుతోంది.2019లో సరస్వతి ఇండస్ట్రీస్లో పూర్తిగా వంద శాతం ఆమెకే ఇచ్చాడు. ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకోడానికి కోట్లు ఖర్చు అవుతుందని కాలయాపన చేసింది. 2019 డిసెంబర్లో ఆ ఆస్తి కూడా అటాచ్మెంట్లోకి పోయింది. ఆమె ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మాట్లాడుతుంది తప్ప...హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో గురించి మాట్లాడటం లేదు. హైకోర్టు తీర్పులో ఎటువంటి క్రయవిక్రయాలు చేయకూడదని స్పష్టంగా ఉంది. అహంకారం+అత్యాశ= షర్మిల. చంద్రబాబు, సోనియాతో కలిసి ఎప్పటికైనా ఏలాలనే పదవులపై అత్యాశ. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు తెలంగాణాలో పార్టీని మూసేసి ఇక్కడకు వచ్చి అన్నను బజారుకీడుస్తున్నావు.మీ అన్నపై రాయితో దాడి చేస్తే ఆనాడు నువ్వేం మాట్లాడావు..?. జగన్ అంతమే నీ లక్ష్యంగా కనిపిస్తోంది. అప్పుడే నీకు సంతోషంగా ఉండేట్లుంది. జగన్ సంపాదించిన ఆస్తిని తన చెల్లెలుపై ప్రేమతో ఉచితంగా ఇస్తున్న ఆస్తి ఇది. అమ్మకు అబద్ధం చెప్పి.. ఆమెకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను లాగేసుకోవాలని ప్రయత్నం చేశారు. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు.. ఎంత అహంకారంగా మాట్లాడుతున్నావు...? విజయమ్మ గారిని కూడా ఒక మాట అడుగుతున్నా.. నా బిడ్డ జగన్ను రాష్ట్రానికి ఇస్తున్నాను.. నా బిడ్డ కాదు.. మీ బిడ్డ అన్నారు.. ఇప్పుడు జగన్ మా బిడ్డ, మా అన్న అయినప్పుడు ఆయనకు ప్రమాదం వస్తే మా అందరితో ముడిపడి ఉంది. ఆయన ప్రమాదం, ఆయన ప్రాణం, గౌరవం మా అందరి కోటిమంది కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉంది. మా అందరి జీవితాలతో ముడిపడి ఉన్న పెద్దన్న లాంటి జగన్ గారిని మీరందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు?. శతాబ్ది జోక్ కాదు.. వందేళ్లు వెనక్కి పోయినా నీలాంటి చెల్లెలు ఏ ఇంట్లోనూ ఉండదు.ఆ అన్న నీ ఒక్కడికే అన్న కాదు.. మా అందరికీ అన్న.. నీది రక్త బంధమైతే.. మాది హృదయానికి సంబంధించిన బంధం. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మేం జగన్తో ఉండే వాళ్లం..నువ్వు ఆయన్ని జైళ్లోకి పంపిస్తే మా జీవితాలు ఏం కావాలి..?. చెల్లెల్లు రక్షాబందన్ కట్టి అన్న చల్లాగా ఉండాలనుకుంటారు..నువ్వు అన్నను జైలుకు పంపాలనుకుంటున్నావు. భర్త సంపాదించిన ఆస్తిలో చెల్లెలకు వాటా ఇస్తున్నా సహకరించి సంతకం పెట్టిన భారతమ్మను గౌరవించాలి. జగన్ తల్లి, చెల్లిపై కోర్టులో కేసు వేశాడా..? ఇది కోర్టులో ఆస్తుల కోసం వేసిన కేసా.. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆస్తుల కోసం తల్లి,చెల్లిపై కేసు వేశాడని రాస్తారా?. కుట్రపూరితంగా మీరు ఆయన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే..కళ్లు తెరిచి ఆయన జాగ్రత్త పడ్డాడు. ఆ ఆస్తి మీది కాదు..జగన్మోహన్రెడ్డి కష్టార్జితం. ఈ కుటుంబ సమస్యను బజారుకీడ్చింది మీరు.. చంద్రబాబుతో చేతులు కలిపింది షర్మిల.మీ ఇంట్లో రామాయణం లేదా చంద్రబాబు..? మీ తమ్ముడు రామ్మూర్తిని గొలుసులేసి కట్టేశారు..రూపాయి అస్తులు ఇవ్వలేదు. మీ అమ్మ కు హైదరాబాద్లో ఉన్న వందల కోట్ల భూమిని మీ చెల్లెల్లకు ఇచ్చినావా?. లక్ష్మీ పార్వతికి చెందాల్సిన ఆస్తులు, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి వంశానికి సమస్యలు లేవా?. పవన్ కల్యాణ్ పెళ్లాలకు ఉండే సమస్యలు సంగతేంటి?. మీ రామాయణాలు ఏ రోజూ మేం ప్రస్తావించలేదు.. ఇళ్లన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఇలా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పేజీ పేజీ వండి వార్చలేదు. కుటుంబ వ్యవస్థలో ఉండాల్సిన అనుబంధాలు చంద్రబాబుకు లేవు.. అది ఒక్క వైఎస్సార్ కుటుంబంలోనే ఉన్నాయి. మా దరిద్రానికి ఇప్పుడు ఈ షర్మిల మాకు తోడైంది.. లేదంటే ఇంతవరకూ మచ్చలేని కుటుంబం వైఎస్సార్ది. విజయమ్మకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా..మీ బిడ్డ మీ బిడ్డ కాదు..మా ఆస్తి... వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల ఆస్తి..మీ ఇష్టానుసారం ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉండటానికి సిద్ధంగా లేము. ఇంత దూరం వచ్చిన తర్వాత దాచిపెట్టుకుని మెల్లిగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది..?’’ అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి పాలనలో మహిళకు రక్షణ లేదు.. ప్రజలకు భరోసా లేదంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. బద్వేల్లో యువకుడి దుర్మార్గానికి బాలిక బలికాగా, బాధిత కుటుంబాన్ని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. వారిని ఓదార్చి.. ధైర్యం చెప్పారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘బద్వేలు ఘటన శనివారం జరిగితే ప్రభుత్వంలో ఎవ్వరూ స్పందించలేదు. కనీసం పట్టించుకోలేదు. ఇవాళ జగన్ ఇక్కడకు వస్తున్నాడని తెలిసిన తర్వాత మాత్రమే కాసేపటి కిందటే వీళ్లకు సహాయం అందింది. రాష్ట్రంలో దారుణమైన అఘాయిత్యాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ లేని అధ్వాన్న పరిస్థితుల్లో చంద్రబాబు పాలన ఉంది.ఇదీ చదవండి: లోకేష్ను పప్పు అనడంలో తప్పే లేదు: వైఎస్ జగన్చంద్రబాబుకు ఒక్కటే చెబుతున్నాను. ఘటన జరిగిన వెంటనే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. తమ పార్టీ వారు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే మాట పక్కనపెట్టి ప్రజలకు తోడుగా ఉంటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేయమని చంద్రబాబుకు చెబుతున్నాను. బద్వేలు జడ్పీ స్కూల్లో టాపర్గా నిలబడిన పాప పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై ఇప్పటికైనా మేల్కొనాలని, రాక్షస పాలనకు అంతం పలకాలని చంద్రబాబును హెచ్చరిస్తున్నాను. ఇదే మాదిరిగా చంద్రబాబు పాలన కొనసాగిస్తే ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు రావడం ఖాయం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
నేడు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
-
నేడు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు గుంటూరు జీజీహెచ్కు జగన్ చేరుకుంటారు. టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చేరుకుంటారు. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించి మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బసచేస్తారు. -
తలకాయలు తీస్తాం..!
సాక్షి టాస్క్ ఫోర్స్: ‘అధికారం మాదే. మా ఇష్టమొచ్చినట్లు మైనింగ్ చేస్తాం. సీసీ కెమెరాలు బిగిస్తే ఊరుకోం.. చెప్పినట్లు వినకుంటే తలకాయలు తీస్తాం. ప్రభుత్వం మాదే, మాకేమీ కాదు’.. అంటూ ఓ గ్యాంగ్ సోమవారం వైఎస్సార్ జిల్లా వేముల మండలంలో హల్చల్ చేసింది. అక్రమ మైనింగ్ నుంచి స్వీయ రక్షణ కోసం సంస్థ సూపర్వైజర్లు సీసీ కెమెరాలు బిగిస్తుంటే వారొచ్చి రెచి్చపోయారు. ‘చరిత్ర తెలుసుకుని మసలుకోండి. మీరేమన్నా పెద్ద మొనగాళ్లా’.. అంటూ మండల తెలుగు తమ్ముళ్లు పేర్ల శేషారెడ్డి, రామిరెడ్డి, ధనుంజయ, శివ అండ్ గ్యాంగ్ చెలరేగిపోయారు. బాధితుల కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లా వేముల మండల కేంద్రంలో టిఫెన్ బెరైటీస్ కంపెనీ లీజుకింద మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత ఆ పార్టీ నేతలు ఆ కంపెనీ పరిధిలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.దీంతో.. లీజు ప్రాంతంలో నిరంతరం కాపాలా ఉండేలా టిఫెన్ బెరైటీస్ కంపెనీ ఐదుగురు సూపర్వైజర్లను నియమించుకుంది. అక్రమ కార్యకలాపాల నుంచి స్వీయ రక్షణ కోసం సోమవారం సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుంటున్నారు. ఇది తెలుసుకున్న స్థానిక టీడీపీ నేత పేర్ల పార్థసారథిరెడ్డి సోదరుడు శేషారెడ్డి రెండు వాహనాల్లో తన అనుచరులతో వెళ్లి నానాయాగీ చేశారు. సీసీ కెమెరాలు బిగించవద్దని హెచ్చరించారు. మా ప్రాంగణంలో బిగించుకుంటున్నామని సూపర్వైజర్లు వివరిస్తుండగా.. ‘తలకాయలు తీసుకెళ్తాం, మాకేమి కాదు, ప్రభుత్వం మాదే, అటు వెళ్తాం, ఇటు వస్తాం’.. అంటూ కత్తులతో బెదిరించారు.‘మాకు కేసులు కొత్త కాదు. జైలు జీవితం గడిపే వచ్చాం. మా ప్రభుత్వంలో ఎలాంటి అనుమతులు లేకపోయినా సరే, మేం మైనింగ్ చేసుకుంటాం. మీరెవరు అడ్డుచెప్పడానికి’.. అంటూ తెలుగు తమ్ముళ్లు రెచి్చపోయారు. చివరికి.. సీసీ కెమెరాలు అమర్చనీయకుండా అడ్డుకుని వెనక్కి పంపేశారు. పైగా.. ఇక్కడ కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో.. యాజమాన్య ప్రతినిధుల సూచనల మేరకు సూపర్వైజర్లు వేముల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.పనులు అడ్డుకున్నారు.. టిఫెన్ బెరైటీస్ కంపెనీ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు వెళ్లాం. అక్కడికి శేషా రెడ్డితో పాటు మరి కొందరు టీడీపీ కార్యకర్తలు వచ్చి దౌర్జన్యం చేశారు. సీసీ కెమెరాల పనులను అడ్డుకున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటుచెయ్యొద్దని హెచ్చరిస్తూ మమ్మల్ని వెనక్కి పంపేశారు. – రామాంజనేయరెడ్డి (కంపెనీ సూపర్వైజర్), వేల్పుల దాడి చేసేందుకు యత్నం.. అక్రమ మైనింగ్ను అరికట్టేందుకు మా కంపెనీ ప్రాంగణంలో సీసీ కెమెరాలు బిగించేందుకు వెళ్లాం. కత్తులతో వచ్చిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేయబోయారు. ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తే సహించేదిలేదు.. ఇకపై మీరిక్కడ కనిపించకూడదు.. కనిపిస్తే తీవ్ర పరిణమాలుంటాయని హెచ్చరించారు. – నాగేంద్రారెడ్డి (కంపెనీ సూపర్వైజర్), చింతలజూటూరు -
జవాన్ రాజేష్ కుటుంబాన్ని ఆదుకోండి.. సీఎంకు అవినాష్ రెడ్డి లేఖ
సాక్షి, వైఎస్సార్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. చత్తీస్గఢ్లో ల్యాండ్ మైన్ పేలడంతో చనిపోయిన జవాన్ రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని లేఖలో సీఎంను అవినాష్ రెడ్డి కోరారు.ఇటీవల చత్తీస్గఢ్ అంబుజ్మడ్లో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్మైన్ పేలడంతో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి.. సోమవారం రాజేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేష్ కుటుంబ సభ్యులు సాయం కోసం విన్నవించుకున్నారు. దీంతో, వెంటనే స్పందించిన అవినాష్ రెడ్డి.. సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.ఈ లేఖలో రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. రాజేష్ కుటుంబానికి తక్షణమే ఎక్స్గ్రేషియా అందించాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే, కుటుంబ పోషణ కోసం రాజేష్ భార్య స్వాతికి మానవతా దృక్పథంతో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, వీర మరణం పొందిన రాజేష్కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
బద్వేల్ బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
సాక్షి, వైఎస్సార్: ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అఘాయిత్యాల కారణంగా ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులు బాధపడుతున్నారని అన్నారు.బద్వేల్లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపీ అనినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటన మాటల్లో చెప్పలేని అమానుషం. ఈ దారుణంపై ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. 2021లో ఇలాంటి ఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశారు. ఈ నాలుగు మాసాల్లో ఇలాంటి 74 ఘటనలు జరిగితే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది?.ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా?. రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నీ చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేం కదా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఈ విద్యార్థిని 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్.. అలాంటి అమ్మాయి చనిపోవడం బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కోవాలి. దిశా చట్టం, యాప్ అమలు చేసి ఉంటే పది నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేవారు. ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది. సమాజం భయపడేలా కఠిన శిక్ష ఉండాలని ఆ తల్లి కోరుతోంది’ అని చెప్పారు. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ..‘మన రాష్ట్రంలో మహిళలపై ఇంత దారుణాలు జరుగుతుంటే మహిళా హోం మంత్రి ఏం చేస్తున్నారు?. దీంట్లో రాజకీయాలకు తావు లేదు.. గట్టి చర్యలు తీసుకోవాలి. నా బిడ్డ చనిపోయినట్లు మరొకరు చనిపోరని నమ్మకం ఏంటి అని ఆ తల్లి ప్రశ్నిస్తోంది. ఆమెకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం’ అని కామెంట్స్ చేశారు. -
ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ బాలిక మృతి
బద్వేలు అర్బన్/కడప కార్పొరేషన్/కడప రూరల్ : వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలో ప్రేమోన్మాది లైంగిక దాడికి పాల్పడి పెట్రోల్ పోసి నిప్పంటించిన హత్యాయత్నం ఘటనలో తీవ్రగాయాలపాలై కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రొద్దుటూరు దస్తగిరమ్మ (16) ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా సాయంత్రం బద్వేలులో అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు దస్తగిరమ్మ మృతదేహాన్ని కడసారి చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఒక్కగానొక్క కుమార్తె ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. అడ్డుతొలగించుకోవాలనే హత్య: ఎస్పీఇక దస్తగిరమ్మ తనను పెళ్లి చేసుకోవాలని తరచూ కోరుతున్నందున, ఆమెను అడ్డుతొలగించుకోడానికే విఘ్నేష్ ఈ హత్యచేశాడని, అతను విచారణలో కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడని ఎస్పీ హర్షవర్థన్రాజు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాకు కేసు పూర్వాపరాలు వివరించారు. ఈ కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టుకు సిఫారసు చేస్తామని తెలిపారు.నా బిడ్డను తగలబెట్టిన వాణ్ణి నాకు అప్పగించండి..‘నా బిడ్డ లేకలేక పుట్టింది. నిష్కారణంగా ఆమెను తగలబెట్టిన వాడిని నాకు అప్పగించండి’.. అని మృతురాలు దస్తగిరమ్మ తల్లి హుసేనమ్మ డిమాండ్ చేశారు. రిమ్స్ మార్చురీ వద్ద ఆమె మీడియా ఎదుట విలపిస్తూ.. తన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నానని.. ఉన్నత చదువులు చదివి పైకి ఎదగాల్సిన ఆమెను అన్యాయంగా చంపేసిన వాడిని అలాగే తాను మట్టుబెడతానన్నారు. సీఎం చంద్రబాబుతోపాటు పోలీసులంతా నాకు న్యాయం చేయాలన్నారు. రేపు మీ బిడ్డలకు ఇదే పరిస్థితి ఎదురైతే చూస్తూ ఊరుకుంటారా?.. అమ్మాయిలను ఏడిపించే వారు బతకకూడదని ఆమె మండిపడ్డారు. -
ఇదేమి రాజ్యం బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించి ప్రాణాలు తీసిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని, అరాచక శక్తుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఆదివారం కడిగిపారేశారు.ఈ దుర్యోధన దుశ్శాసన.. దుర్వినీతి లోకంలోరాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడలేకపోతున్నారు. మహిళలు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ? రోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పు అంటించి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉంది. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిపోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ మీద కక్షకొద్దీ మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రం, ప్రజలమీద చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు.ఇది అన్యాయం కాదా? వైఎస్సార్సీపీ హయాంలో మహిళలు, బాలికల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక ‘దిశ’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం కాదా? తద్వారా మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? ‘దిశ’ యాప్లో ఎస్వోఎస్ బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్ను ఐదుసార్లు అటూ ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కు, అక్కడ నుంచి దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు.ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్లు ఫోన్లో చెప్పినా ఘటనాస్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు (చంద్రబాబు) ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? ‘దిశ’ ప్రారంభం నుంచి 31,607 మంది మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబూ? 1.56 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న ‘దిశ’పై రాజకీయ కక్ష ఎందుకు? దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్లు, 163 బొలేరో వాహనాలను ‘దిశ’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్ను పటిష్ట పరిచాం. 18 ‘దిశ’ పోలీస్స్టేషన్లను నెలకొల్పి 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్రూమ్కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతి భద్రతలపై నేను నిర్వహించిన సమీక్షల్లో ‘దిశ’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు. వీటన్నింటినీ నిర్వీర్యంచేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబూ? ఇవాళ మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారత కోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీమ్లను ఎత్తివేయడం! ఇసుక, లిక్కర్ లాంటి స్కామ్లకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం! పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది. మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను విస్మరించింది. ఇదేమి రాజ్యం చంద్రబాబూ? -
దారుణం: యువతిపై అత్యాచారం.. ఆపై పెట్రోల్ పోసి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా గోపవరం అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. అడవిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నం చేశారు. అయితే మంటల్లో కాలుతూ యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. ఆమెను కాపాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని కడప రిమ్స్కు తరలించారు.యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా తనకు మాయ మాటలు చెప్పి తన ఇంటి సమీపంలో ఉన్న విగ్నేష్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. మూడు నెలల క్రితమే విఘ్నేష్కు వివాహం జరిగిందని, అతని భార్య గర్భిణీగా పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడు విఘ్నేష్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ఎడతెరిపిలేని వాన
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామునుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో విద్యాసంస్థలకు అత్యవసరంగా సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సగటున 54.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి జిల్లాలో సగటున 25.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.ఒంగోలు బస్టాండ్ సెంటర్ సహా నగరంలోని కాలనీలన్నీ జలమయం అయ్యాయి. జల వనరుల శాఖ ఎస్ఈ కార్యాలయ భవనంలోకి వర్షం నీరు చేరింది. వైఎస్సార్ జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. సిద్ధవటంలో అత్యధికంగా 29.6 మి.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు, వాకాడు, తడ మండలాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం నుంచి భీకర శబ్దాలు వెలువడుతున్నాయి. సముద్రాన్ని చూసేందుకు వెళ్లే వారిని స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు.తిరుమలలో హై అలర్ట్ తిరుమల: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 48 గంటల్లో తిరుమలలో విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులంతా సంసిద్ధంగా ఉండాలని కోరారు.కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్య శాఖ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం సిద్ధంగా ఉండాలన్నారు. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ దృష్ట్యా 15న మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.రైళ్ల రాకపోకలకు అంతరాయం తెనాలి రూరల్: భారీ వర్షాల కారణంగా చెన్నై–విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు పొన్నూరు–బాపట్ల స్టేషన్ల మధ్య డౌన్ లైన్ వద్ద భూమి కుంగుతోంది. దీని కారణంగా పట్టాలు దెబ్బతిని రైళ్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడంతో ఈ డౌన్ లైన్లో మాచవరం స్టేషన్ వద్ద నుంచి రైళ్ల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపడుతున్నారు. ఈ కారణంగా పలు రైళ్లను బాపట్ల, చీరాల, ఒంగోలులో నిలిపివేశారు. చెన్నైలో ఐటీ ఉద్యోగులకు వర్క్ఫ్రం హోం సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై, కోయంబత్తూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం, శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు అతి భారీ వర్ష సూచనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ఈ నాలుగు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నెల 18 వరకు వర్క్›ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. -
జిలెటిన్ స్టిక్స్ పేల్చి వీఆర్ఏ దారుణ హత్య
వేముల : వైఎస్సార్ జిల్లా వి.కొత్తపల్లెలో వీఆర్ఏ యలంకూరి నరసింహులు(49)ను జిలెటిన్ స్టిక్స్తో పేల్చి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. మృతుడి భార్య సుబ్బలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు.. గ్రామంలో నరసింహులు వీఆర్ఏగా విధులు నిర్వహిస్తూ ముగ్గురాయి మైనింగ్లో కూలీ పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో నరసింహులు భార్య సుబ్బలక్ష్మితో అదే గ్రామానికి చెందిన బాబు సన్నిహితంగా ఉండేవాడు.ఈ విషయంపై నరసింహులు, బాబు తరచూ గొడవపడేవారు. ఆదివారం రాత్రి ఎప్పటిలాగే భోజనం చేసి ఇంటి ముందు రేకుల షెడ్డులో చెరో మంచంలో నరసింహులు, భార్య సుబ్బలక్ష్మి పడుకున్నారు. నరసింహులుపై కక్ష పెంచుకున్న బాబు.. ఎలాగైనా హత్య చేయాలని పథకం రచించాడు. ఆదివారం రాత్రి జెలిటిన్ స్టిక్స్కు వైరు అమర్చి నరసింహులు ఇంటి ముందు ఉన్న పాడుబడ్డ ఇంట్లోంచి పేల్చి వేశాడు. పేలుడు ధాటికి నరసింహులు పైకి ఎగిరి రేకులకు తగిలి కిందపడ్డాడు.పేలుడుకు సుబ్బలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వేంపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరసింహులు మృతి చెందాడు. సుబ్బలక్ష్మిని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, ఆర్కే వ్యాలీ సీఐ నాగరాజు, రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ ప్రవీణ్కుమార్, వేంపల్లె ఎస్ఐ తిరుపాల్ నాయక్లతో కలిసి ఆదివారం రాత్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రప్పించారు. మృతుడి కుమారుడు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, వైఎస్సార్: అధికారం చేతిలో ఉందని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ నేతలు. ఇదే సమయంలో వందేళ్ల క్రితమే కనుమరుగైన వాగు పేరుతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.అయితే, వైఎస్సార్ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రోద్బలంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడులు జరుగుతున్నాయి. అన్నీ అనుమతులు ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ భాగస్వామిగా ఉన్న లే అవుట్పైకి ఇరిగేషన్ శాఖ అధికారులను ఎమ్మెల్యే పంపించారు. లే అవుట్ నుండి వాగు వెళ్తోందంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. వందేళ్ల క్రితం కనుమరుగైన వాగు పేరుతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయం మొదలుపట్టారు. ఈ అంశంపై హై కోర్టులో స్టే ఉన్నా ఇబ్బంది పెట్టేందుకు కుటిల ప్రయత్నం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో లే అవుట్ వద్దకు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఇతర కార్పొరేటర్లు బుధవారం చేరుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..‘కోర్టులో స్టే ఉన్నా రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైన పద్దతి కాదు. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు ఇప్పటికైనా మానుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఇక చంద్రబాబు కోరినట్టే సిట్ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి -
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు టీడీపీ నాయకుల దాడి
సాక్షి టాస్క్ఫోర్స్: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడులోని వంకలో ఇసుకను టిప్పర్లతో తరలిస్తున్నారు. శనివారం రాత్రి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇసుకను బయటి ప్రాంతాలకు తరలిస్తుండటంతో వైఎస్సార్సీపీకి చెందిన భూమిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రమణారెడ్డి మరికొందరు అడ్డుకున్నారు. పొలాల అవసరాలకు ఇసుకను ట్రాక్టర్లతో తీసుకెళ్లొచ్చు కానీ.. టిప్పర్లతో బయటకు తరలించడం ఏమిటని నిలదీశారు. తామే అధికారంలో ఉన్నాం కాబట్టి తమ ఇష్టం వచి్చనట్టి చేసుకుంటామని టీడీపీకి చెందిన నారప్పరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, నారప్పరెడ్డి రమే‹Ùరెడ్డి ఘర్షణకు దిగారు.అనంతరం టీడీపీ నేతలు దాడికి తెగబడటంతో వైఎస్సార్సీపీ నేత భూమిరెడ్డి వెంకటరమణరెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయతి్నంచగా.. టీడీపీకి చెందిన వెంకటసుబ్బారెడ్డి, రమే‹Ùరెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. రెండువర్గాల ఫిర్యాదు మేరకు వైఎస్సార్సీపీకి చెందిన బి.వెంకటరమణారెడ్డి, మరికొందరితోపాటు టీడీపీకి చెందిన ఎన్.వెంకటరమణ సుబ్బారెడ్డి, రమే‹Ùరెడ్డి, మరికొందరిపై కేసులు నమోదు చేసినట్టు ఎర్రగుంట్ల సీఐ నరే‹Ùబాబు తెలిపారు. యంత్రాంగం ప్రేక్షక పాత్ర పెద్దనపాడు వంక నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. ఇసుక అక్రమంగా రవాణా చేస్తే సహించేది లేదని కలెక్టర్, ఎస్పీ పదేపదే చెబుతున్నా ఎర్రగుంట్ల మండలంలో యథేచ్ఛగా ఇసుక తరలిపోతోంది. నిత్యం గ్రామంలో రెవెన్యూ అ«ధికారులు తిరుగుతుంటారు. గ్రామస్తులు అడ్డుకునే వరకు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. -
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
సాక్షి కడప/వేంపల్లె: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 15వ వర్థంతిని పురస్కరించుకుని వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులరి్పంచారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డితోపాటు ఇతర కుటుంబ సభ్యులు సోమవారం ఉదయాన్నే ఘాట్ వద్ద పూలమాలలు వేసి ఘన నివాళి అరి్పంచారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ఇడుపులపాయకు కదిలివచ్చారు. ముందుగా వైఎస్ జగన్ కుటుంబమంతా ఘాట్ ప్రాంగణంలో దివంగత నేతను స్మరించుకున్నారు. వైఎస్ జగన్తోపాటు తల్లి విజయమ్మ నివాళులరి్పంచే క్షణంలో భావోద్వేగానికి గురయ్యారు. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్తోపాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి పాస్టర్లు దేవుని వాక్యంతోపాటు వైఎస్సార్ హయాంలో జరిగిన మంచి పనులను వివరించారు. వైఎస్సార్ సువర్ణ పాలనలో ప్రజలంతా సంక్షేమంలో మునిగిపోయారని కొనియాడారు.అంతేకాక.. 108, ఆరోగ్యశ్రీ, 104, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల కోసం రుణమాఫీ అమలుచేసి ప్రజల కష్టాల నుంచి మహానేత రక్షించారని స్మరించుకున్నారు. మహానేత సేవలు చిరస్మరణీయమన్నారు. వైఎస్సార్ అడుగుజాడల్లోనే వైఎస్ జగన్ ధైర్యంగా ముందుకెళ్తున్నారని పాస్టర్లు కొనియాడారు. కష్టకాలంలో దేవునితోపాటు నాన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్కు తోడుగా నిలబడాలని వారు ఆకాంక్షించారు. ఇక ప్రత్యేక ప్రార్థనల్లో చిన్నాన్న వైఎస్ సు«దీకర్రెడ్డి, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి, మేనమామ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప నగర మేయర్ కె. సురేష్బాబు, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, టి. చంద్రశేఖర్, విరూపాక్షి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, గోవిందరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, ఆర్. రమే‹Ùకుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచి్చన వైఎస్సార్ అభిమానులు, పార్టీ శ్రేణులు, నేతలు అందరికీ వైఎస్ జగన్ అభివాదం చేశారు. ఒక్కొక్కరిని పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. -
కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం.. మళ్లీ మంచిరోజులు వస్తాయి: వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎవరూ అధైర్యపడొద్దు.. రాబోవు కాలం మనదే.. ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది.. మనపట్ల ప్రజలకు విశ్వాసం ఉంది.. భవిష్యత్ మనదేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్.. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దు.. పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.మనం చెప్పిన మంచి పనులన్నీ చేశాం. మనం చేసిన మంచి ప్రతీ కుటుంబంలో ఉంది. అందుకే ప్రజలకు మనపైనే విశ్వాసం ఉందని వైఎస్ జగన్ అన్నారు. నిరంతరం ప్రజాశ్రేయస్సుకు అనుగుణంగా అడుగులు వేయాలని శ్రేణులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు. -
నేడు వైఎస్సార్ జిల్లాకు జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. 31వ తేదీ ఉదయం 9.30 గంటలకు బెంగళూరు యలహంకలోని తన నివాసం నుంచి బయలుదేరి 9.50 గంటలకు జక్కూరు ఏరోడ్రమ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 11.10 గంటలకు కడప ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి పెండ్లిమర్రి మండంలోని మాచునూరు గ్రామానికి చేరుకొని అక్కడ ఇటీవల మృతిచెందిన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మాచునూరు చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యా హ్నం పార్టీ నేతలను కలుసుకుంటారు. 12.30 గంటలకు మాచునూరు గ్రామం నుంచి బయలుదేరి ఒంటిగంటకు గొందిపల్లె గ్రామానికి చేరుకుంటారు. ఇటీవల కడప మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాచవరం చంద్రహాసరెడ్డి కుమార్తె వివాహం జరిగిన నేపథ్యంలో వారి స్వగృహానికి వెళ్లి వధూవరులను ఆశీర్వదిస్తారు. 1.30 గంటలకు గొందిపల్లె నుంచి బయలుదేరి 2.15 గంటలకు పులివెందులలోని తన నివాసానికి చేరు కుంటారు. 1వతేదీ ఉదయం 9 గంటల నుంచి పులివెందుల క్యాంప్ ఆఫీసులో ప్రజలకు, పార్టీ నేతలకు అందుబాటులో ఉంటారు. 2వ తేదీ తెల్లవారుజామున 6.20 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి బయలుదేరి 7 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్కు చేరుకుంటారు. వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ప్రార్థనంలు నిర్వహించి, 7.30 గంటలకు అక్కడి నుంచి బయలు దేరి 7.35 గంటలకు ఇడుపులపాయ లోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 9.25గంటలకు తాడేపల్లి హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. -
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి మృతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతకొమ్మదిన్నె పరిధిలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్లో కంటైనర్కు వెనకనుంచి ఓ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురితోపాటు, కంటైనర్ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. కారులోని వారంతా బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను చక్రాయపేట మండలం కొన్నేపల్లికి చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వైఎస్ఆర్ సీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
ఈ బంధం.. ఎన్నటికీ విడిపోదు!
కడప కల్చరల్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని ఓ కుగ్రామంలో ప్రతి రాఖీ పండుగ సందర్భంగా అన్నయ్య యుగంధర్ విగ్రహానికి రాఖీ కడుతున్నారు ఓ చెల్లి. అన్నయ్య మరణానంతరం ఆమె క్రమం తప్పకుండా ఆయన విగ్రహానికి రాఖీ కట్టి అన్నతో తనకు గల అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. విగ్రహానికి రాఖీనా? అంటూ కొందరు విచిత్రంగా చూసినా.. ఎగతాళిగా మాట్లాడినా ఆమె మాత్రం ఈ పద్ధతిని వదలడం లేదు. భౌతికంగా లేకపోయినా అన్నయ్య తన హృదయంలో ఎప్పటికీ సజీవంగానే ఉన్నారని సోదరి గాయత్రి పేర్కొంటారు.ఒంటిమిట్ట మండలం రాచపల్లె గ్రామానికి చెందిన సరోజనమ్మ, కొండూరు జయరామరాజు కుమారుడు లాన్స్ నాయక్ కె.యుగంధర్ ఆర్మీలో ఉంటూ వీరమరణం పొందారు. గ్రామస్తులు యుగంధర్ స్మారకార్థం స్వగ్రామం రాచపల్లెలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచి చెల్లెలు గాయత్రి, తమ్ముడు విశ్వనాథ్ అన్న విగ్రహం వద్ద ఏటా రాఖీ పండుగ నాడు చిన్న సందడి చేస్తుంటారు. ఉదయాన్నే సోదరి గాయత్రి అన్నయ్య విగ్రహానికి రాఖీ కడుతుంటారు. దీన్ని అందరూ విచిత్రంగా భావిస్తున్నా తనకు ఎంతో ఆత్మ తృప్తి లభిస్తుందని అంటారు గాయత్రి. నేటి పరిస్థితుల్లో ఇది ఆదర్శంగానే నిలుస్తోంది. -
నితీష్ కుటుంబంలో విషాదం
ప్రొద్దుటూరు: తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నితీష్ మరణించడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రొద్దుటూరు మండలంలోని దారా అపార్ట్మెంట్లో నివాసముంటున్న గిద్దలూరు శ్రీనివాసులు వస్త్ర భారతి క్లాత్ మార్కెట్లో వ్యాపారం చేస్తున్నాడు. శ్రీనివాసులుకు ఇద్దరు కుమారులున్నారు. పెద్దకుమారుడు జ్ఞానేష్ వేలూరు విట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు నితీశ్ (21) చైన్నె ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం బీటెక్ చదువుతున్నాడు. నితీష్ సోమవారం తన మిత్రులతో కలిసి అరుణాచలానికి వెళ్లి తిరిగి వస్తుండగా తిరువళ్లూరు జిల్లా కనకమ్మ సత్రం సమీపంలో వీరు ప్రయాణిస్నుత్న కారు–ఎదురుగవా వస్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నితీశ్తోపాటు మరో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషాదకర సంఘటన గురించి తెలుసుకున్న నితీశ్ తల్లిదండ్రులు సుజాత, శ్రీనివాసులు ఆదివారం రాత్రి సంఘటనా స్థలానికి వెళ్లారు. సోమవారం తిరువళ్లూరులో పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం నితీష్ మృతదేహాన్ని తీసుకుని ఇంటికి చేర్చారు. ధారా అపార్ట్మెంట్లో నివసిస్తున్న వేంపల్లి అరుణ్కుమార్రెడ్డితోపాటు మరికొందరు ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లి బాధితులకు అండగా నిలిచారు. -
ఆగని అరాచకం.. పులివెందులలో ‘పచ్చ’మూకల బరితెగింపు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. అర్థరాత్రి వైఎస్సార్ కాలనీలో దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్త అబ్దుల్ ఇంట్లోకి చొరబడి టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. అబ్ధుల్ ఇంట్లో వస్తువులు, బైక్ ధ్వంసం చేశారు. అడ్డుకున్న అబ్దుల్ మామను తలపై కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నామనే దాడి చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చిత్తూరు జిల్లాలో టీడీపీ అరాచకాలుచిత్తూరు జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. రామకుప్పం మండలం సింగసముద్రం గ్రామంలో టీడీపీ నేతలు దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో రాత్రి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్త విఘ్నేష్ కనిపించకుండా పోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని విఘ్నేష్ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెట్రేగిపోతున్న టీడీపీ నేతలుఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెట్రేగిపోతున్నారు. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా హింసకు పాల్పడుతున్నారు. దాడులు, దౌర్జన్యాలను అరికట్టాల్సిన పోలీసులు.. ప్రేక్షక పాత్ర పోషించటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో హింసా రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికల దాకా ప్రశాంతంగా ఉన్న అనంతలో టీడీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హతమారుస్తున్నారు. శింగనమల నియోజకవర్గం పుట్లూరు లో ఎరికలయ్య (50), హిందూపురం నియోజకవర్గంలో సతీష్ (40) లపై టీడీపీ దాడులు చేసింది. ఈ ఇద్దరు నేతలు బెంగళూరు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించారు.తాజాగా కళ్యాణదుర్గం నియోజకవర్గం మల్లికార్జున పల్లిలో టీడీపీ వేధింపులకు ఇద్దరు బలయ్యారు. మల్లికార్జునపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త శాంతకుమార్పై టీడీపీ నేతలు తప్పుడు కేసులు పెట్టారు. పోలీసులు కూడా విచారణ పేరుతో శాంతకుమార్ను వేధించారు. ఈ మనస్తాపంతో శాంతకుమార్ భార్య మమత (30) ఆరుమాసాల కూతురిని చంపి తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టీడీపీ నేతల దాష్టీకానికి ఇదే ఉదాహరణ అని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరం, ఉరవకొండ కదిరి, తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. టీడీపీ నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. -
నాన్న మీ మార్గం శిరోధార్యం.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత మహానేత వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఎక్స్ (ట్విటర్) వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.‘‘నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు.ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా.. చివరివరకూ మా కృషి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2024 -
ఇడుపులపాయ: మహానేత వైఎస్సార్కు వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వైఎస్సార్కు ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమం అనంతరం అరకు ఎంపీ తనూజ రాణి మీడియాతో మాట్లాడుతూ, పేద ప్రజల గుండెల్లో దివంగత మహానేత వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోతారని.. ముఖ్యంగా మా గిరిజన ప్రాంత ప్రజల్లో గుండెల్లో వైఎస్ ఎప్పటికీ ఉంటారని ఆమె అన్నారు. పోడు భూములు విషయం లో గిరిజనులకు చేసిన మేలు మరిచి పోలేము. గిరిజనుల ఆరాధ్య దైవం మోద కొండమ్మ చిత్ర పటంతో పాటు , మా గిరిజనుల ప్రతి ఇంటిలో వైఎస్సార్ చిత్ర పటం ఉంది.. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన మా గిరిజన గ్రామాల్లో, ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తనూజ రాణి అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దివంగత ముఖ్యమంత్రి, రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. -
రేపు ఇడుపులపాయకు వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) ఇడుపులపాయలో పర్యటించనున్నారు. దివంగత మహానేత వైఎస్సార్ 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం తాడేపల్లికి రానున్నారు.కాగా, వైఎస్సార్ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు(ఆదివారం) పార్టీ నేతలను, కార్యకర్తలను క్యాంపు కార్యాలయంలో కలిశారు. వారి నుంచి వినతులను స్వీకరించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో వైఎస్ జగన్ మమేకమయ్యారు. ఈ సందర్భంగా అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. పులివెందులలో పాముకాటుకు గురై మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్. చిన్నారికి నివాళులర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది: వైఎస్ జగన్
Updates..రేపు ఇడుపులపాయకు వైఎస్ జగన్వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్న జగన్వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్న మాజీ సీఎం జగన్పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్ జగన్కు గ్రామగ్రామానా అభిమానాన్ని చాటుకున్న జనం,ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన వైఎస్ జగన్లింగాల మండలం పెద్దకుడాలకు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డివైఎస్ జగన్ను చూసేందుకు గ్రామంలో రహదారి వెంట బారులు తీరిన జనంగ్రామంలో మాజీ మండల అద్యక్షడు వెంకటసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ పరామర్శఇటీవల వెంకటసుబ్బారెడ్డి సతీమణీ లక్ష్మీనరసమ్మ అనారోగ్యంతో మృతికార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి స్థానిక నాయకులు 👉పులివెందులలో పాముకాటుకు గురై మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్. చిన్నారికి నివాళులర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ👉పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో వైఎస్ జగన్ మమేకమయ్యారు. ఈ సందర్భంగా అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.👉వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు. పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. 👉 వైఎస్ జగన్ పులివెందులలోకి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్ జగన్ రాకతో ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. 👉 క్యాంపు కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పులివెందుల నియోజకవర్గం ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. 👉 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ నేతలను, కార్యకర్తలను క్యాంపు కార్యాలయంలో కలవనున్నారు. వారి నుంచి వినతులను స్వీకరించనున్నారు.👉 ఆదివారం ఉదయం వైఎస్ జగన్ను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి కలిశారు.👉 వైఎస్సార్ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు(ఆదివారం) లింగాల మండలం పెద్దకూడాలలో వైఎస్సార్సీపీ నేత కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.👉 ఇక, రేపు ఇడుపులపాయలో దివంగత వైఎస్సార్ జయంతి వేడుకులకు వైఎస్ జగన్ హాజరుకానున్నారు. -
ఏపీలో ఆగని టీడీపీ నేతల విధ్వంసం
-
AP: చెలరేగిపోతున్న పచ్చ మూకలు.. లారీలు ధ్వంసం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో పచ్చమూకలు చెలరేగిపోతున్నారు. టీడీపీ నేతల విధ్వంసాలు ఆగడం లేదు. తాజాగా, వైఎస్సార్ జిల్లా మైలవరం మండలంలో టీడీపీ నేతలు దాడులకు దిగారు. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద 18 లారీలను ధ్వంసం చేశారు. కప్పం కట్టలేదని లారీలను టీడీపీ నేతలు ధ్వసం చేశారు. కప్పం కట్టకుంటే లారీలను తిరగనివ్వమని బెదిరింపులకు దిగారు.కాగా, పలుచోట్ల టీడీపీ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహాలను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. మంగళవారం రాత్రి, బుధవారం ఈ విధ్వంసకాండ కొనసాగింది. పల్నా డు జిల్లా దుర్గిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దుర్గి బస్టాండ్ సెంటర్లోని ఈ విగ్రహాన్ని టీడీపీ కార్యకర్త ఇనుపరాడ్డుతో కొట్టి ధ్వంసం చేశాడు. స్థానికులు అతడిని అడ్డుకున్నారు. మార్కెట్యార్డు మాజీ చైర్మన్ వెలి దండి గోపాల్ నేతృత్వంలో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.వెలిదండి గోపాల్ మాట్లాడుతూ ఇటువంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఆవేశాలకు లోనుకాకుండా శాంతి యుతంగా నిరసన తెలుపుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సర్పంచ్ రాయపాటి మాణిక్యం, వైఎస్సార్సీపీ మండల యూత్ కన్వీనర్ యకటీల బుచ్చిబాబు, నాయకులు తోటకూర వెంకటేశ్వర్లు, చెన్నుపాటి సీతారామయ్య, జంగా కొండలు, వెలిదండి జ్యోతి, శెట్టిపల్లి కోటేశ్వరరావు, చింతా రామకృష్ణ, చింతా నరసింహారావు, తోట మూర్తి, బత్తుల శ్రీనివాసరావు, యకటీల శ్రీను, తురక శ్రీను తదితరులున్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని ద్రోణాదుల గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేతిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇంతకుముందు గ్రామంలోని రెండు సచివాలయాల్లో శిలాఫలకాలను పగులగొట్టారు. గ్రామంలో విధ్వంసాలను అధికారులు అడ్డుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు కోరుతున్నారు. బాపట్ల జిల్లా జువ్వలపాలెం పాత ఎస్సీ కాలనీలోని డాక్టరు బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద గతంలో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా అప్పటి మంత్రి మేరుగ నాగార్జున ఆవిష్కరించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. జువ్వలపాలెం సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకానికి పసుపు రంగులు పూశారు. సచివాలయ భవనంపై టీడీపీ నాయకుల చిత్రాలతో ప్లెక్సీలు ఉంచారు. ఈ ఘటనల్ని స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
వైఎస్సార్ జిల్లా: రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య
వైఎస్సార్ జిల్లా: వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలు పట్టాలపై పడి ఏఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కమలాపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా పని చేస్తున్న నాగార్జునరెడ్డిగా గుర్తించారు. నైట్ డ్యూటీ ముగించుకొని తెల్లవారుజామున వెళ్లి రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. కుటుంబకలహాలతో ఏఎస్సై నాగార్జున రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అధైర్య పడొద్దు.. మంచి రోజులొస్తాయి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తమ బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డినీ గుండెలకు హత్తుకుంది పుట్టిన గడ్డ పులివెందుల. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చి తాను చేయగలిగేది మాత్రమే చెప్పిన జగన్ ఎప్పటికి తమ నాయకుడే అని చేతల్లో చూపించారు పులివెందుల వాసులు. రాజన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ, సవాళ్లను ఎదుర్కొంటూ... ముందుకు సాగుతున్న జగన్కు అండగా ఉంటామని నిరూపించింది. కష్టాలు తాత్కాలికమేనని.. మళ్లీ జగన్ పట్టం కడతారని అంటున్నారు పులివెందుల వాసులు. అందుకే సొంతూరికి వచ్చిన తమ బిడ్డకు అపూర్వ స్వాగతం పలికారు.కడప జిల్లాలో జరుగుతున్న తన రెండో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పలువురిని కలుసుకున్నారు. రాయలసీమ లోని నాలుగు ఉమ్మడి జిల్లాలైన అనంతపురం చిత్తూరు కర్నూలు కడప ప్రాంతాల నుంచి దాదాపు 5,000 మంది అభిమానులు.. వైఎస్ జగన్ కలిసారు.ఎన్నికల అనంతరం తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ ప్రోత్సహిస్తున్న రౌడీ ముఖలు చేస్తున్న దాడుల గురించి వైఎస్ జగన్కు వివరించారు. పార్టీ నేతలకు అభిమానులకు తాను అండగా ఉంటానని ఎవరు ఎలాంటి ఆందోళన గురి కావద్దని వైఎస్ జగన్ తెలిపారు. రేపు మధ్యాహ్నం వరకు పులివెందులో వైఎస్ జగన్ వివిధ వర్గాలను కలుసుకుంటున్నారు. -
అమెరికాలో ఏపీ యువకుడు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అమెరికాలోని సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల ఘటనలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం మజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ మరణించారన్న వార్తపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా నిలవాలని, వారిని అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. గోపికృష్ణ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. గోపికృష్ణ కుటుంబానికి వైఎస్ జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. -
‘ఎల్లో’ విష ప్రచారం.. పులివెందులలో ఎలాంటి రాళ్ల దాడి జరగలేదు: డీఎస్పీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై ఎల్లో మీడియా విష ప్రచారానికి ఒడిగట్టింది. ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని పోలీస్ అధికారులు ఖండించారు. పులివెందులలో వైఎస్ జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తుండగా, కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయని.. ఎటువంటి రాళ్లదాడి జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదని.. కేవలం వైఎస్ జగన్ను చూడడానికి ప్రజలు తరలిరావడంతో తోపులాట జరిగిందని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. -
నేడు పులివెందుల పర్యటనకు వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 22న వైఎస్సార్ జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళతారు. 3 రోజుల పాటు పులివెందులలో జగన్ అందుబాటులో ఉంటారు. -
వైఎస్ఆర్ జిల్లాలో మొదలైన ఈవీఎంల పంపిణీ
-
ఈత సరదా ప్రాణం తీసింది
వైఎస్సార్: లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో ఈత నేర్చుకోవాలని చిన్నారి సరదా పడగా... ప్రమాదవశాత్తూ ఆమె ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తోట రవీంద్రారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె మహిత(12) బుధవారం గ్రామంలోని చెరువులో ఈత నేర్చుకునేందుకు తోటి పిల్లలతో కలిసి వెళ్లింది.నడుముకు ఖాళీ క్యాన్ కట్టుకుని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో నడుముకు ఉన్న క్యాన్ ఊడిపోయింది. అక్కడున్న పిల్లలు, పెద్దలు చూస్తుండగానే భయానికి గురైన మహిత నీటిలో మునగగానే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు షాక్ తగిలింది. పెండ్లిమర్రి బెనీటమైన్స్ బాధితులు షర్మిలను నిలదీశారు. తమ వాహనాలకు రూ.6 లక్షల అద్దె చెల్లించలేదని నిలదీశారు. మహేశ్వర్రెడ్డి, గౌరీశంకర్రెడ్డి షర్మిల ప్రచారాన్ని అడ్డుకున్నారు. డబ్బులు చెల్లించాలని బాధితులు నిలదీయగా.. బెనీటమైన్స్కు, తనకు సంబంధం లేదని చెప్పి షర్మిల వెళ్లిపోయారు.మరో వైపు, పీసీసీ చీఫ్ షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయగా, కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. సునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాను ర్టు విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది. -
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
వైవీయూ: ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన ‘సిద్ధం’ పాటల సీడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ ఆవిష్కరించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీడీని రూపొందించిన సూర్య చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు, ఎన్ఆర్ఐ సూర్యనారాయణ, పాటల రూపకర్త, ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ ఎం.ప్రభాకర్లను భారతమ్మ అభినందించారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘జనహృదయాల్లోకి చొచ్చుకెళ్లే శక్తి పాటకు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని పాటల రూపంలో గ్రామస్థాయికి తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. సోషల్ మీడియా ద్వారా కోట్లాది మంది అభిమానులకు ఈ పాటలను అందుబాటులోకి తెస్తాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ‘సిద్ధం’ పాటల సీడీ రూపకల్పనకు సహకారం అందించిన బి.రామతులసి, డా.వి.ఉష, ఎన్.సుదీప్రెడ్డి పాల్గొన్నారు. -
అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
చక్రాయపేట: ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిన మీ అందరివాడు సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతమ్మ ప్రజలను కోరారు. ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డితో కలసి సురభి గ్రామం బీటీపల్లెలో ఇంటింటి ప్రచారం, రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా భారతమ్మ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘వైఎస్ జగన్ ప్రభుత్వం ఎలాంటి బేధాలు లేకుండా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టనన్ని పథకాలను అమలు చేసి.. అందరినీ ఆ రి్థకంగా బలోపేతం చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. అమ్మ ఒడి, చేయూత, పింఛన్లు, ఆసరా, సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన.. ఇలా దేశంలో ఎక్కడా లేని పథకాలను మన రాష్ట్రంలో అందించి ఆదర్శంగా నిలిచారు.పేదల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఇంతటి గొప్ప పాలన మళ్లీ కావాలన్నా.. సంక్షేమాభివృద్ధి కొనసాగాలన్నా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వైఎస్ జగన్ను, అవి నాష్ రెడ్డిని గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించండి’ అని ప్రజలకు భారతమ్మ విజ్ఞప్తి చేశారు. గడప గడపకూ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ.. ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీటీపల్లెలో గడప గడపకూ వెళ్లారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరిస్తూ మళ్లీ ప్యాన్ గుర్తుకు ఓట్లేయాలని కోరారు. లక్షుమమ్మ అనే వృద్ధురాలు తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పడంతో భారతమ్మ ధైర్యం చెప్పారు. పులివెందులలోని ఆస్పత్రిలో చూపించుకోవాలని సూచిస్తూ.. అక్కడి వైద్యుడికి లేఖ రాసి ఇచ్చారు.అలాగే శారదమ్మ అనే మహిళ తన సమస్య చెప్పుకోగా.. న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రీ, కొడుకులు ఓబుళశెట్టి శ్రీరాములు, అయ్యప్ప ప్రసాద్ను భారతమ్మ ఆప్యాయంగా పలకరించారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. చెన్నకేశవులు అనే వృద్ధుడిని ‘ఆరోగ్యంగా ఉన్నావా తాతా’ అంటూ పలకరించారు. మందులు సకాలంలో వేసుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు.అలాగే చిన్నారులను, విద్యార్థులను పలకరించిన భారతమ్మ.. బాగా చదువుకోవాలని చెప్పారు. మీ కోసం అమ్మ ఒడి, గోరుముద్ద, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని వివరించారు. కాగా, భారతమ్మతో సెల్ఫీలు దిగేందుకు యువతీయువకులు పోటీ పడగా.. మహిళలు హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో చక్రాయపేట, తొండూరు మండల ఇన్చార్జ్లు వైఎస్ కొండారెడ్డి, వైఎస్ మధురెడ్డిల సతీమణులు ధనలక్ష్మి, మాధవీలత, కొండారెడ్డి, సతీ‹Ùరెడ్డిల తనయులు రాహుల్రెడ్డి, రోహన్ నాగిరెడ్డి, ఎంపీపీ మాధవీ బాలకృష్ణ, జెడ్పీటీసీ శివప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామాంజనేయరెడ్డి, ప్రసాదరావు, సభాపతి నాయుడు, వెంకట సుబ్బయ్య, వేదమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
బెడిసికొట్టిన జడ్జి రామకృష్ణ దాడి నాటకం
సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోటకు చెందిన సస్పెన్షన్లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి ఎస్. రామకృష్ణ ఇంటిపై దాడి ఘటన ఓ నాటకంగా తేలిపోయింది. దాడిచేసి ఇంటి కిటికీ అద్దాలను పగులగొట్టింది స్వయానా జడ్జి తమ్ముడు రామచంద్ర అని విచారణలో నిర్ధారించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో నాటకానికి తెరపడింది. సోదరుల మధ్య కుటుంబ ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన విభేదాలను కూడా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి ఆపాదించే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లెలో గురువారం మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై జడ్జి రామకృష్ణ చేసిన ఆరోపణలు నిరాధారమని అర్థమైంది.గతంలోనూ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధం లేని వివాదంలోకి లాగడం కూడా ఇలాంటిదేనని స్పష్టమైంది. రామకృష్ణ చేసిన ఫిర్యాదులో నిందితుడు అతని తమ్ముడేనని తేల్చి ఈ మేరకు అరెస్ట్ చేసి 41 నోటీసు జారీ చేశామని బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. గతనెల 30న రాత్రి బి.కొత్తకోట కరెంట్ కాలనీలో ఉంటున్న రామకృష్ణ ఇంటివద్దకు వచ్చిన తమ్ముడు రామచంద్ర ఆస్తి పంపకాల గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించాడు, ఇంటిలో నుంచి రామకృష్ణ వెలుపలికి రాకపోవడంతో అక్కడే ఉన్న కట్టెను తీసుకుని గేటుకు కొట్టడంతో రామకృష్ణ బయటకు రాగా ఇద్దరి మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి వివాదం జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న గొడవతో రామచంద్ర కిటికీ అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై గుర్తు తెలియని వ్యక్తులు తనను హతమార్చేందుకు దాడిచేశారని ఈనెల ఒకటిన రామకృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, పరిసరాల్లో జరిపిన విచారణలో రామచంద్రే ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేసినట్టు తేలింది. ఈ కేసులో నిందితుడైన రామచంద్రను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. రామచంద్రపై బి.కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఏడు కేసులు నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు. -
వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు
-
సకుటుంబ సపరివార సమేతంగా
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట అయిన వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఘనవిజయానికి ఆయన కుటుంబమంతా కదిలింది. పులివెందుల అసెంబ్లీ స్థానంలో సీఎం వైఎస్ జగన్కు, కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాశ్రెడ్డి, పార్టీ ఇతర అభ్యర్థులకు గత ఎన్నికల్లోకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించే బాధ్యతలను కుటుంబ సభ్యులు భుజాన వేసుకున్నారు. అందరూ కలిసి ప్రణాళిక ప్రకారం జిల్లా ప్రజల ముందుకు వెళ్తున్నారు. వైఎస్సార్ సోదరులు, సమీప బంధువులు నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ సహా మరికొందరు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన సంక్షేమం, సాధించిన అభివృద్ధి, సుపరిపాలనను వివరిస్తూ గత ఎన్నికలకంటే మరింత ఎక్కువ మెజార్టీతో ఘనవిజయాన్ని అందించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సామాన్యుల ఉన్నతే లక్ష్యంగా, విశేష పారిశ్రామిక ప్రగతి సాధించిన సీఎం వైఎస్ జగన్ను, వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించారని, మరోమారు ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీగా వైఎస్ అవినాశ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు బాధ్యతలిలా.. వైఎస్సార్ సోదరులు వైఎస్ రవీంద్రనాథరెడ్డి, వైఎస్ సు«దీకర్రెడ్డి, వైఎస్ మధుకర్రెడ్డి కడప నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల మున్సిపాలిటీకి వైఎస్ మనోహర్రెడ్డి, లింగాలకు వైఎస్ అభిõÙక్రెడ్డి, తొండూరుకు వైఎస్ మదన్మోహన్రెడ్డి ఇన్చార్జిలుగా ఉన్నారు. పులివెందుల రూరల్, కొండాపురం మండలాలకు చవ్వా దుష్యంత్రెడ్డి, జమ్మలమడుగుకు చవ్వా జగదీష్రెడ్డి ప్రచార బాధ్యతలు చేపట్టారు. వేముల మండల ఇన్చార్జిగా డాక్టర్ ఈసీ దినేష్రెడ్డి, సింహాద్రిపురానికి గండ్లూరు వీరశివారెడ్డి, చక్రాయపేటకు వైఎస్ కొండారెడ్డి, వేంపల్లెకు వైఎస్సార్ మేనల్లుడు యువరాజ్రెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ విజయం కోసం సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ, ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి సతీమణి వైఎస్ సమతారెడ్డి, సోదరి వైఎస్ శ్వేతారెడ్డి, చవ్వా సునీతారెడ్డి, వైఎస్ తేజారెడ్డి, దివ్య (వైఎస్సార్ మేనకోడలు) విస్తృతంగా పర్యటిస్తున్నారు. వీరంతా ఇప్పటికే పులివెందుల, కడప, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో పర్యటించారు. జగన్ చెబితే చేస్తారు.. చంద్రబాబు చెప్పినా చేయరు: వైఎస్ భారతమ్మ పులివెందుల/తొండూరు: సీఎం వైఎస్ జగన్ చెబితే చేస్తారని, చంద్రబాబు చెప్పినా చేయరని సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ చెప్పారు. రాష్ట్ర ప్రజలందరిదీ కూడా ఇదే అభిప్రాయమన్నారు. ఆమె ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం ఇనగలూరులో ప్రజలతో మమేకమయ్యారు. పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ప్రజలతో మాట్లాడారు.తమకు సీఎం జగన్ వల్ల అన్ని పథకాలూ అందుతున్నాయని అక్కడున్న వారంతా చెప్పారు. తమ కుటుంబాలన్నీ ఎంతో సంతోషంగా ఉన్నాయని, తమ ఓట్లు వైఎస్సార్సీపీకే అని బదులిచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు భారతమ్మ స్పందించారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి గత ఎన్నికల్లోకంటే మరింత ఎక్కువ మెజార్టీని ఇస్తారని చెప్పారు. ఇందుకు వారే నిదర్శనమంటూ ప్రజలను చూపించారు. అక్కడున్న ప్రజలంతా జగన్మోహన్రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీని అందిస్తామంటూ నినదించారు. మేనిఫెస్టో గురించి భారతమ్మ మాట్లాడుతూ ఇప్పుడున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆ పథకాలకు సీఎం జగన్ మరింత మెరుగులు దిద్ది అందిస్తారని చెప్పారు. పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి బలమని, 40 ఏళ్లుగా ప్రజలు ఆదరిస్తున్నారని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. ఆమెతో పాటు వైఎస్ సమత, వైఎస్ మధురెడ్డి కోడలు చైతన్య, డాక్టర్ చందన ఉన్నారు.ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎదురు లేని వైఎస్సార్ కుటుంబంఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ కుటుంబానికి ఇప్పటివరకు ఎదురే లేదు. కడప పార్లమెంటు నుంచి 1989లో తొలిసారి వైఎస్సార్ ఎంపీగా ఎన్నికయ్యారు. వరసగా నాలుగు పర్యాయాలు ఆయనదే విజయం. 1989 నుంచి 2019 వరకు 10 సార్లు కడప పార్లమెంటుకు ఎన్నికలు జరగ్గా, అన్ని ఎన్నికల్లో జిల్లా ప్రజానీకం వైఎస్ కుటుంబానికే పట్టం కట్టారు. నాటి నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
పులివెందులలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రతి గ్రామంలో వైఎస్ భారతికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వన్స్మోర్ సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు.వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వైఎస్ భారతి అన్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు ఆమె వివరిస్తున్నారు. -
వివేకా భార్య సౌభాగ్యమ్మకు వైఎస్ భాస్కరరెడ్డి సతీమణి బహిరంగ లేఖ
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్ భాస్కరరెడ్డి సతీమణి వైఎస్ లక్ష్మీ గురువారం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. దీనిని వివేకా భార్య సౌభాగ్యమ్మకు రాశారు లక్ష్మీ. ‘2009లో తండ్రిని కోల్పోయినప్పుడు జగన్ ఎంతో మనోవేదన అనుభవించాడని ఇప్పుడు గుర్తొస్తోందా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను చిన్నచూపు చూసినపుడు జగన్కు అండగా నిలచి పెద్ద దిక్కుగా ఉండవలసిన మీరందరూ కలిసి ఒంటరివాడిని చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నపుడు జగన్ మనోవేదన గుర్తుకురాలేదా’.. అన్నారు వైఎస్ లక్ష్మీ.2011లో నీ భర్తను నువ్వు, నీ కుమార్తె, అల్లుడు విజయమ్మపై పోటీచేయించినప్పుడు వాళ్ల మనోవేదన ఎలా ఉందో మీకు తెలీదా? నీ కుమార్తె, అల్లుడు పూలంగళ్ల వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారెంత మనోవేదన అనుభవించారో కూడా తెలీదా? వివేకానందరెడ్డి వైఎస్ జగన్ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట ఎంతో వాస్తవమో, 2019 మార్చి 14 రాత్రి కూడా అవినాష్ను ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా అంతే వాస్తవం. ఈ విషయం స్వయంగా మీ కూతురు సునీతే మీడియాకు వెల్లడించింది. ఇప్పుడు మళ్లీ మీరే అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం.. సంబంధంలేని వారిని ఈ కేసులో ఇరికించడం మీకు తప్పనిపించడంలేదా?ఎవరిని కాపాడుకునేందుకు మీరిలా చేస్తున్నారు? మీ కుమార్తె న్యాయం కోసం పోరాటం చేస్తుంటే జగన్ సంపూర్ణ మద్దతు తప్పక ఉంటుంది. అలా కాకుండా.. మీ కుమార్తె వైఎస్సార్, జగన్ శత్రువులతో చేతులు కలిపి, వారి చేతిలో పావుగా మారి సంబంధంలేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి వారి జీవితాలు నాశనం చేయాలని చూస్తే జగన్ మీకెలా మద్దతివ్వగలడు? హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారు.. మీలోనే ఉన్నారు. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ. ఇక మాటిమాటికి హంతకులని మీరు మాట్లాడుతున్నారు.. పైగా చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్ను తిడుతున్నారు."న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరంతట మీరే హంతకుడని ఎలా మాట్లాడగలరు? అలా మాట్లాడటం మీకు తప్పనిపించడంలేదా? నీ కుమార్తెను, షర్మిలమ్మను ఎవరు టార్గెట్ చేయలేదు. వారి మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం. ఇప్పటికైనా వైఎస్సార్, జగన్ శత్రువుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలు, కుతంత్రాల నుంచి బయటకొచ్చి చేసిన తప్పు తెలుసుకుని నిజమైన న్యాయ పోరాటం చేయండి. అన్యాయంగా మీవల్ల బాధపడుతున్న వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థంచేసుకునే ప్రయత్నం చేయండి. నిజం ఎంత లోతులో దాచినా దాగదు.. తప్పకుండా బయటపడుతుంది" అని లేఖలో పేర్కొన్నారు లక్ష్మీ. -
‘ఎంతమంది కలిసొచ్చినా వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేరు’
సాక్షి, పులివెందుల: గత ఎన్నికలప్పుడు ఏవైతే హామీలిచ్చారో సంక్షేమ పథకాలు చెప్పారో చెప్పినవి చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా.. కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు కోల్పోయినా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి సీఎం జగన్ చూపించారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా పులివెందులోని సీఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగించారు.‘‘ఐదు సంవత్సరాల జగనన్న పాలనలో ఈ నియోజకవర్గం అన్నిరకాలుగా అభివృద్ధి చెందింది. మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు టౌన్లో జరిగింది మీరంతా చూశారు. సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు ముఖ్యంగా సాగునీటి రంగం గురించి ఒకసారి ఆలోచించండి. 2019 నుంచి 2024 వరకు ఈ ఐదేళ్లలో నాలుగుసార్లు సీబీఆర్ను ఫుల్ కెపాసిటీ 10 టీఎంసీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా పైడిపాలెం 6 టీఎంసీలు నాలుగుసార్లు నింపడం జరిగింది. మరి అలా నింపాం కాబట్టే ఈ ఐదేళ్లపాటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనం సాగునీరు అందించాం....మీరు ఒక్కసారి ఆలోచించండి, 16 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాయలసీమ ప్రాంతానికి అందులో భాగంగా పులివెందుల కూడా రావడం జరిగింది. ఆయన పులివెందుల వచ్చి వెళ్లాక ఈ 16 నెలల్లో వర్షమే లేదు. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన తర్వాత వర్షమనేది దూరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ 16 నెలల కరువు కాలంలో కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా మనం లింగాల బ్రాంచ్ కెనాల్ క్రింద చెరువులు కావొచ్చు, పీబీసీ క్రింద చెరువులు కావొచ్చు, జీకేఎల్ఐ క్రింద చెరువులకు కావొచ్చు సమృద్ధిగా అరటి, చీని రైతులకు సమృద్ధిగా మనం నీళ్లు అందించామంటే జగనన్న ముందుచూపుతో సీబీఆర్లో 10 టీఎంసీలు పెట్టడం, పైడిపాలెంలో 6 టీఎంసీలు పెట్టడం వల్లనే సాధ్యమైందనే విషయాన్ని ప్రతి రైతు సోదరుడికి తెలియజేస్తున్నా...ముఖ్యంగా పంటల బీమా గురించి ఒకసారి ఆలోచించండి. 2014 నుంచి 2019 వరకు మన జిల్లా రైతాంగానికి రూ.750 కోట్లు పంటల బీమా వస్తే, జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు రూ.1,100 కోట్లు పంటల బీమా రైతులకు అందింది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ.. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో కేవలం రూ.40 కోట్లు మాత్రమే అందింది. జగనన్న హయాంలో 2019 నుంచి 2024 వరకు దాదాపు రూ.278 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ జిల్లాలోని రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. 2023 ఖరీఫ్ లో వర్షాభావ పరిస్థితుల వలన మనం ఏదైతే నష్టపోయామో దానికి సంబంధించి పంటల బీమా వచ్చే జూన్ మాసంలో రైతుల ఖాతాల్లో తప్పకుండా జమ అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా...ఒకవైపు మొగమేరు మీరు చూస్తే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉందో ఒక్కసారి చూడండి. రైతులకు ప్రయోజనకరంగా మొగమేరు కట్టలు పటిష్టం చేయడం జరిగింది, చెక్ డ్యామ్ లు నిర్మించడం జరిగింది. మరోవైపు చక్రాయపేట మండలం చూడండి. గాలేరు నగరి హంద్రీనీవా సుజల స్రవంతి అనుసంధానంలో భాగంగా ఇప్పటికే అక్కడ కాలేటివాగు డ్యామ్ ను 0.1 నుంచి 1.2 టీఎంసీల స్టోరేజీ డ్యామ్ గా దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇవాళ వర్షం నీళ్లు వస్తే మనం అక్కడ పంప్ హౌస్ల నిర్మాణం పూర్తి చేస్తే మరి చక్రాయపేట మండలంలో దాదాపు 40 చెరువులకు నీళ్లిచ్చే అవకాశం ఉందనే విషయాన్ని అందరికీ మనవి చేస్తున్నా. తప్పకుండా సంవత్సరం రోజుల్లో ఆ పంప్ హౌస్ ను కూడా పూర్తి చేసి చక్రాయపేట మండలాన్ని కూడా మిగిలిన 6 మండలాల మాదిరి సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రతి రైతన్నకు తెలియజేస్తున్నా....మరి ఇవాళ మన ప్రతిపక్షాలు మనం ఇంత పెద్దఎత్తున సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే మన తప్పులను చూపలేక, మనల్ని తప్పుబట్టలేక చేసేదేమీలేక, మనల్ని ఎదుర్కొనే బలం లేక గుంపుగా మన మీదకు వస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా మన మీదకు వస్తున్నారు. ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారాలు చేస్తున్నారు. లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు విష ప్రచారాలు చేస్తున్నారు ఇవంతా కూడా మీరు గమనించండి. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే అది నిజమవుతుందనేది చంద్రబాబు, ఎల్లోమీడియా సిద్ధాంతం. వాళ్ల ట్రాప్లో ఎవరూ పడొద్దని చెప్పి మనవి చేసుకుంటూ ఎంతమంది కలిసొచ్చినా, ప్యాకేజీ స్టార్ కావొచ్చు, బీజేపీ కావొచ్చు, పరోక్షంగా కాంగ్రెస్ కావొచ్చు, ఎల్లోమీడియా కావొచ్చు మీరు ఎన్ని తప్పుడు హామీలిచ్చినా జగన్ మోహన్ రెడ్డిని టచ్ చేయలేరని తెలియజేస్తున్నా చంద్రబాబు అండ్ కోకు....మీకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, కానీ జగన్ మోహన్ రెడ్డి ఒక్కడు ఆయనకు అండగా రాష్ట్రంలో లక్షలమంది యువకులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులు జగన్ మోహన్ రెడ్డి గార్కి స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి గార్కి అండగా నిలబడేందుకు మేమంతా సిద్ధమంటున్నారు. కాబట్టి ఎంతమంది కలిసొచ్చినా సరే జగన్మోహన్రెడ్డి గారి విజయాన్ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ ఒక్కరూ కూడా ఆపలేరు....2019 లో మీరు ఎలా ఆదరించారో, ఆశీర్వదించారో మరి 2024 ఈ ఎన్నికల్లో కూడా మే 13న జరిగే ఎన్నికల్లో మీ ఆదరణ, ఆశీస్సులు సంపూర్ణంగా ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మనందరి అన్న జగనన్నపైనా, అదేవిధంగా ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నాపైనా మెండుగా ఉంచాలని, 2019కి మించిన ఘన విజయాన్ని అందించాలని మళ్లీ ప్రజాసేవను, ఈ అభివృద్ధి యజ్ఞాన్ని, సంక్షేమ రాజ్యాన్ని ముందుకు కొనసాగించే విధంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని పేరుపేరున ప్రతి అన్న, తమ్ముడ్ని, ప్రతి అక్కచెల్లెమ్మకు మనవి చేస్తున్నా’’ అని అవినాష్రెడ్డి తెలిపారు. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
సాక్షి ప్రతినిధి, కడప: ఎంతటి సమావేశమైనా సరే, ఆయన వచ్చేంతవరకూ వేచి ఉండాల్సిందే. కుటుంబ సభ్యులకైనా, అనుచరులకైనా, సన్నిహితులైనా ఎవరికైనా సరే, ఆయన చెప్పిందే వేదం, సూచించిందే ఫైనల్. మరీ ముఖ్యంగా బాబాయ్ మాట కోసం అబ్బాయ్కి ఎదురుచూపులు ఉండేవి. ఇదంతా గతం. ప్రస్తుతం కథ అడ్డం తిరిగింది. అబ్బాయ్ లేనిదే బాబాయ్ బయటికెళ్లలేని దుస్థితి ఎదురవు తోంది. ‘అహం బ్రహ్మస్మీ’ అన్నట్లుగా వ్యవహారం తల్లకిందులయ్యింది. నా అనుకున్న వారంతా ఛీదరించుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. అబ్బాయ్ కోసం బాబాయ్ వెయిట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈమొత్తం వ్యవహారం జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డికి వర్తించనుంది. ‘ఆది మాట తప్పడు, మడమ తిప్పడు’ అనే నినాదంతో ఆదినారాయణరెడ్డి రాజకీయ ఆరంగ్రేటం చేశారు. అనతికాలంలోనే అవకాశవాదికి నిదర్శనం ‘ఆది’ అని ఆయన చర్యలు రుజువు చేశాయి. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ నీడలో ఎదిగిన ఆది తక్కువ కాలంలోనే సహజ సిద్ధమైన ప్రవర్తన బహిర్గతమవుతూ వచ్చింది. అప్పట్లో జిల్లాలోని నాయకులంతా వైఎస్ కుటుంబానికి అండగా పదవులు త్యజించేందుకు సిద్ధం అయ్యారు. అప్పటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా నిలిచారు. ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులుపై అనర్హత వేటు పడింది. కానీ అప్పట్లో ‘అసెంబ్లీలో కిరణ్...బయట జగన్’ అంటూ ఆదినారాయణరెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. అధికారాన్ని కోల్పోయేందుకు ఇష్టపడని ఆయన వైఎస్ కుటుంబానికి అండగా నిలువలేకపోయారు. కానీ వైఎస్ కుటుంబం అండ లేకపోతే, గెలిచే పరిస్థితి లేదని 2014లో మళ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థిత్వం స్వీకరించి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పారీ్టలో చేరి ..మంత్రి పదవి దక్కించుకున్నారు. అంతటితో ఆగకుండా వైఎస్ కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారు. తొమ్మిదిన్నర్ర చెప్పుతో కొట్టాలన్నారు. ఫలితంగా తర్వాత జరిగిన ప్రజాతీర్పులో ఆదినారాయణరెడ్డి కొట్టుకుపోయారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కుటుంబంలోనూ ఏకాకిగా... కుటుంబంలో ఎప్పుడూ పైచేయిగా నిలిచే ఆదినారాయణరెడ్డి తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఏకాకిగా మిగిలారు. విభజించు, పాలించు అన్న ధోరణిని వంటబట్టించుకున్న ఆయన దేవగుడి కుటుంబంలో అన్న కుమారుడు భూపేష్రెడ్డి రాజకీయ వారసత్వానికి బ్రేకులు వేశారు. మరో సోదరుల తనయులు గోవర్ధన్రెడ్డి, రాజే‹Ùరెడ్డిలను చేరదీశారు. ఒక్కమాటలో చెప్పాలంటే భూపేష్ రెడ్డికు ప్రత్యామ్నాయంగా తయారు చేశారు. ‘టీడీపీ ఇన్ఛార్జిగా తీసుకోవడం కాదు, టికెట్ తెచ్చుకోవడం గొప్ప. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుంది, బీజేపీ టికెట్ తనకే ఇస్తుందని’ ఏడాదికి ముందు నుంచే ఆదినారాయణరెడ్డి సన్నిహితులతో చెప్పుకుంటూ వచ్చారు. అచ్చం అదే తీరులో పొత్తు పొడవడం, ఆదికి బీజేపీ టికెట్ దక్కడం క్రమంగా తెరపైకి వచ్చాయి. అప్పటి వరకూ రాజకీయంగా బలోపేత చర్యలు చేపట్టిన భూపేష్ నిర్ఘాంతపోయారు. జమ్మలమడుగులో సీన్ రివర్స్ఆదికి బీజేపీ టికెట్ ప్రకటించిన తర్వాత నాలుగు రోజులైనా స్వగ్రామంలో అడుగు పెట్టని పరిస్థితి తలెత్తింది. కుటుంబం యావత్తు భూపేష్కు అండగా నిలిచింది. స్వతంత్ర అభ్యరి్థగా రంగప్రవేశం చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఈ పరిస్థితిని పసిగట్టిన ఆది కొంత ఓపిక పట్టారు. భూపే‹Ùకు టీడీపీ పార్లమెంటు టికెట్ అప్పగించేంత వరకూ వేచి ఉండి తర్వాత అడుగుపెట్టారు. ఇక తామంతా ఒక్కటేనంటూ చెప్పుకోవాల్సిన దుస్థితి ఆదినారాయణరెడ్డి వచ్చి చేరింది.జమ్మలమడుగు పర్యటనల్లో భూపేష్ కోసం ఆదినారాయణరెడ్డి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకు మనకు అండగా ఉంటున్నాడా? లేదా? అని సన్నిహితులతో క్రాస్ చెక్ చేసుకోవాల్సిన దౌర్భాగ్యం నెలకొంది. మరోవైపు గ్రామస్థాయి నాయకులు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని విశ్వసించే పరిస్థితి లేదు. సన్నిహితులే కాదు, సమీప బంధువులు సైతం దూరమవుతున్నారు. ఈక్రమంలోనే జమ్మలమడుగుకు మాజీ మున్సిపల్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సైతం వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆది పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అడుగడుగునా అవకాశవాదం తెరపైకి వస్తుండడమే ఇలాంటి దుస్థితికి కారణమని పలువురు చెప్పుకుంటున్నారు. -
‘దస్తగిరిని అడ్డంపెట్టుకుని సునీత నాటకమాడుతోంది’
సాక్షి, వైఎస్సార్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత చెప్పేవన్నీ అబద్ధాలేనని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘దస్తగిరి వాంగ్మూలాన్ని నిజం చేసే ప్రయత్నం జరుగుతుంది. సీబీఐ వద్ద దస్తగిరి స్టేట్మెంట్ తప్ప ఏ ఒక్క ఆధారం లేదు. సునీత దస్తగిరిని అడ్డంపెట్టుకుని ఓ బూటకం ఆడుతుంది. ఇంటి తలుపులు బద్దలైతే అన్నీ బాగున్నాయని సీబీఐకి చెప్పింది. ఇంటి తలుపులు బద్దలు కొట్టారనేది విడిచిపెట్టి ఇంట్లో వాళ్లే చంపారని సునీత ప్రస్తావిస్తోంది. చంపినప్పుడు లెటర్ రాశాడన్నారు, చేతి వేళ్లు నరికితే రక్తపు మరకలు ఉండవా.. అసలు ఎలా రాయగలడు?. దస్తగిరి, రంగన్న చెప్పిన సమాచారం పూర్తి విరుద్ధంగా ఉంది. రెండో భార్య సమీమ్కు ఆస్తి గొడవలున్నాయి. ఆస్తి పత్రాలు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంది?. దీన్ని కూడా సీబీఐ పట్టుకోలేకపోయింది’ అని డాక్టర్ చైతన్యరెడ్డి తెలిపారు. -
‘తప్పు చేస్తున్నావ్ షర్మిలా’
వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబాన్ని రోడ్డుమీదకు గుంజడానికే వైఎస్ అని పేరుపెట్టుకుని ప్రజల ముందుకు వస్తే తమలాంటి అభిమానులు వదిలిపెట్టరని, తస్మాత్ జాగ్రత్త అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను హెచ్చరించారు వైఎస్సార్టీపీ మాజీ నేత కొండా రాఘవరెడ్డి. వైఎస్సార్జిల్లాలో పర్యటిస్తున్న కొండా రాఘవరెడ్డి.. షర్మిలపై మండిపడ్డారు. వైఎస్సార్ కుటుంబాన్ని చీల్చే కుట్రలను ఆయన తప్పుబట్టారు. వైఎస్సార్ అభిమానిగా షర్మిల చర్యలు తమనెంతో బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘మురుసుపల్లి షర్మిలగా నువ్వు ఏ ఫుట్పాత్పై తిరిగినా మాకు అభ్యంతరం లేదు. మేము రాజశేఖర్రెడ్డి గారి వీరాభిమానులము. రాజశేఖర్రెడ్డిగారంటే మాకు ప్రాణం. రాజశేఖర్రెడ్డిగారు చనిపోయిన తర్వాత రెండు పుష్కరాలు వస్తే.. కృష్ణా, గోదావరి పుష్కరాల్లో పిండాలు పెట్టినటువంటి బిడ్డలం మేము. మాలాంటి వారు లక్షలమంది తెలుగు ప్రజల్లో ఉన్నారు. ఇవాళ నువ్వు మోసం చేసి రాజశేఖర్రెడ్డి కుటుంబాన్ని రోడ్డుమీదకు గుంజడానికి వైఎస్ అని పేరు పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నావ్ చూడు. మా లాంటి వీరాభిమానులు నిన్ను వదిలిపెట్టరు తస్మాత్ జాగ్రత్త అని చెప్పడానికే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి కడప ప్రజలను జాగృతం చేస్తున్నాం. అక్కడ ఉన్నప్పుడు(తెలంగాణలో) ఆడ(అక్కడ) బిడ్డ అని అంటివి. ఇక్కడకొచ్చి(ఏపీ) ఈడ బిడ్డ అంటివి. దానికోసం సామెతలు. రక్తసంబంధం ఉన్నటువంటి రక్షాబంధన్ కట్టాల్సిన అన్నకు నువ్వు రాక్షస రూపంలో ఆయన స్వప్నంలోకి వస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గురాలివో మాకు అర్థమైతాంది.నేను ఇవాళ జగన్మోహన్రెడ్డిగారిని కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడుకోవాలి. ఏం తప్పు చేసిండు జగన్మోహన్రెడ్డిగారు. నీకు ఏమి ఎరుక. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదవడానికి నువ్వు ఇక్కడికి వచ్చినావా? నీకు తెలుసా నాడు-నేడు, తెలుసా నీకు అమ్మ ఒడి, తెలుసా నీకు గోరుముద్ద. ఏం తెలుసు నీకు. రాజశేఖర్రెడ్డిగారు ఉన్నప్పుడు 850 రుగ్మతలు ఆరోగ్య శ్రీలో ఉంటే, ఈరోజు రెండు వేల ఐదువందల రుగ్మతలను ఆరోగ్య శ్రీలో పెట్టిన మహానాయకుడు జగన్మోహన్రెడ్డిగారు. నీది నాలుకనా.. తాటిమట్టనా? అని అడగదల్చుకున్నాం. ఏ కోశాన కూడా వైఎస్ రాజశేఖరరెడ్డిగారి కూతురిగా అంగీకరించడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా లేరనే విషయం తెలుసుకో షర్మిలా. నువ్వు మురుసుపల్లి షర్మిలవు. నువ్వు మురుసుపల్లి అనిల్కుమార్ భార్యవు. అసలు నీకు ఏం కావాలి. నీకు ఆశ ఎక్కువ. ఆశయం మాత్రం లేదు. ఓర్వలేని తనం ఎక్కువ. నువ్వు రాజకీయాలకు పనికొస్తావా? అని ధ్వజమెత్తారు కొండా రాఘవరెడ్డి. -
జమ్మలమడుగులో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డిని ప్రకటించగా, బీజేపీ ఒప్పుకుంటే జమ్మలమడుగులో పోటీకి సిద్ధమని భూపేష్రెడ్డి అంటున్నారు. బీజేపీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పేరును బీజేపీ అధిష్టానం పరిశీలన చేస్తోంది. పార్టీ అధిష్టానంతో ఇప్పటికే ఆదినారాయణ చర్చలు జరిపారు. జమ్మలమడుగు సీటును వదులుకుంటే టీడీపీకి మరో సీటు పెరగనుంది. ఇదీ జరిగింది.. కాగా, కడప పార్లమెంట్ బలిపీఠం ఎక్కించేందుకు టీడీపీ నానా హైరానా పడింది. అభ్యర్థి ఎంపికకు పలు రకాలుగా కసరత్తు చేసింది. క్రమం తప్పకుండా ఐవీఆర్ఎస్ ఫోన్ సర్వేలు నిర్వహిస్తూ రోజుకొక పేరు తెరపైకి తెచ్చింది. ఎట్టకేలకు జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జి భూపేష్రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అసెంబ్లీ టికెట్ ఆశించిన భూపేష్ను ఏకంగా ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక కుయుక్తుల మంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైనా సరే, ఓటమి ఎదుర్కోవాల్సిన సీటుకు భూపేష్ను ఎంపిక చేయడం వెనుక ఆదినారాయణరెడ్డి తెరవెనుక వ్యూహం పన్నినట్లు సమాచారం. ఇదీ చదవండి: నాడు తండ్రి.. నేడు తనయుడికి ‘ఆది’పోటు -
#MemanthaSiddham : జైత్రయాత్ర ఆరంభం
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మండుటెండనూ లెక్క చేయకుండా కి.మీ. కొద్దీ రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం.. నిప్పులు చిమ్ముతున్న సూరీడుతో పోటీపడుతూ చంటిబిడ్డలను చంకనేసుకుని బస్సు వెనుక పరుగులు తీసిన ఆడబిడ్డలు.. రోడ్డుకు ఇరువైపులా గ్రామాల్లో టెంట్లు వేసి వంటలు వండుకుని, సామూహికంగా భోజనాలు చేసి గంటల తరబడి నిరీక్షించిన ప్రజానీకం..! వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో తొలిరోజు కనిపించిన దృశ్యాలు ఇవి. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకానికి ఈ దృశ్యాలు ప్రతీకగా నిలిచాయి. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార భేరిని సీఎం జగన్ బుధవారం మోగించారు. తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 11.50 గంటలకు బయలుదేరిన సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు. తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మతో కలిసి వైఎస్సార్కు నివాళులు అర్పించారు. అనంతరం తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నినాదాల నడుమ బస్సు యాత్రను సీఎం జగన్ ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి వద్దకు బస్సు యాత్ర చేరుకునే సరికి రోడ్డుకు ఇరువైపులా భారీ ఎత్తున జనం బారులు తీరారు. భారీ క్రేన్తో గజమాల వేసి సీఎం జగన్కు ఆత్మీయ స్వాగతం పలికారు. జనసంద్రమైన వేంపల్లి.. ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో వేంపల్లి జనసంద్రంగా మారింది. వేంపల్లి అడ్డ రోడ్డు నుంచి హనుమాన్ సర్కిల్ వరకూ సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు. సీఎం జగన్ను చూడగానే అవ్వాతాతల నుంచి చిన్న పిల్లల వరకూ హర్షద్వానాలతో ఘనస్వాగతం పలికారు. హనుమాన్ సర్కిల్ వరకూ కి.మీ. కొద్దీ ఇసుకేస్తే రాలనంత స్థాయిలో రోడ్డుపై కిక్కిరిసిన జనం సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు పలికారు. మండటెండను కూడా లెక్క చేయకుండా చంటిబిడ్డలను ఎత్తుకుని బస్సు వెంట నడుస్తూ సీఎం జగన్ను చూసేందుకు పోటీపడ్డారు. బస్సు యాత్ర సాగుతున్న రహదారికి ఇరువైపులా మారుమూల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున రోడ్డుపైకి తరలివచ్చి టెంట్లు వేసుకుని, వంటలు వండుకుని, సామూహికంగా భోజనాలు చేస్తూ సీఎం జగన్ రాక కోసం గంటల కొద్దీ నిరీక్షించారు. బస్సు యాత్ర తమ వద్దకు చేరుకోగానే సీఎం జగన్పై బంతిపూల వర్షం కురిపిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలకడంతో యాత్ర ఆలస్యంగా ముందుకు సాగింది. అమ్మ భావోద్వేగం... పులివెందుల: ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థన నిర్వహించిన వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా బిడ్డను నీకే అప్పజెబుతున్నా దేవుడా..! నా బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నావు..! ప్రతి బాధలోనూ తోడుగా ఉన్నావు..! నా బిడ్డ తలపెట్టిన కార్యక్రమాలను జయప్రదం చేయాలి..! నా బిడ్డను మళ్లీ సీఎంగా చేయాలని కోరుకుంటున్నా..!’ అంటూ ప్రార్థన చేసిన అనంతరం సీఎం జగన్ను ఆప్యాయంగా ముద్దాడగా.. ఆయన భావోద్వేగంతో తన తల్లిని ఆలింగనం చేసుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వారిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్రెడ్డి, మిథున్రెడ్డి, చింతా అనూరాధ, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్రెడ్డి, సుధాకర్బాబు, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్యాదవ్, రామచంద్రారెడ్డి, ప్రభాకర్, తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, జడ్పీ ఛైర్మన్ అమర్నాథరెడ్డి, చల్లా మధుసూదన్రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, సీఎం కార్యాలయ కోఆర్డినేటర్ జనార్దన్రెడ్డి, ఎన్ఆర్ఐ రత్నాకర్ తదితరులున్నారు. జిల్లా చరిత్రలో అతి పెద్ద ప్రజాసభ.. ప్రొద్దుటూరులో బహిరంగ సభ షెడ్యూలు ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కావాలి. కానీ.. రహదారి పొడవునా జనం బారులు తీరి స్వాగతం పలకడంతో బైపాస్ రోడ్డు సమీపంలోని సభా ప్రాంగణానికి సాయంత్రం 6.30 గంటలకు సీఎం చేరుకున్నారు. అప్పటికే 30 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ వేదికపైకి చేరుకుని ర్యాంప్ వాక్ చేస్తూ అభివాదం చేస్తున్నంత సేపు ప్రాంగణం ప్రజల హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేసిన మంచిని వివరిస్తూ.. టీడీపీ– జనసేన–బీజేపీ కూటమి సర్కార్ 2014–19 మధ్య చేసిన మోసాలను ఎండగడుతూ సీఎం జగన్ చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది. ప్రొద్దుటూరులో సీఎం జగన్ నిర్వహించిన సభ వైఎస్సార్ కడప జిల్లా చరిత్రలో అతి పెద్ద ప్రజాసభగా నిలిచింది. ప్రచండ భానుడితో పోటీపడుతూ.. నిప్పులు గక్కుతున్న సూరీడుతో పోటీపడుతూ సీఎం జగన్ కోసం రహదారిపై భారీ ఎత్తున జనం గంటల కొద్దీ నిలబడ్డారు. కమలాపురం నియోజకవర్గంలో వీరపునాయునిపల్లె, గంగిరెడ్డిపల్లి, సంగాలపల్లిలో బస్సు యాత్రకు నీరాజనాలు పలికారు. మండల కేంద్రమైన వీరపునాయునిపల్లిలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలోని మెయిన్ రోడ్డు జనసంద్రంగా మారింది. ఎర్రగుంట్లలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షో సూపర్ హిట్ అయ్యింది. రాత్రి పూట జన నీరాజనం.. ప్రొద్దుటూరు సభ రాత్రి 8 గంటలకు ముగిసింది. అనంతరం బస్సు యాత్ర మైదుకూరు నియోజకవర్గం దువ్వూరుకు చేరుకునే సమయంలో దారిలో రాత్రి పూట కూడా జనం భారీ ఎత్తున రహదారిపై గంటల తరబడి నిరీక్షించారు. సీఎం జగన్పై బంతి పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో బస్సు యాత్ర ముగిసి బుధవారం రాత్రి 9.20 గంటలకు నంద్యాల జిల్లా చాగలమర్రిలో ప్రవేశించింది. చాగలమర్రిలో జనం సీఎం జగన్కు నీరాజనాలు పలికారు. దారి పొడవునా ఘనస్వాగతాల నడుమ ఆళ్లగడ్డ క్రాస్లో బస చేసేందుకు ఏర్పాటు చేసిన శిబిరానికి రాత్రి 10 గంటలకు చేరుకున్నారు. బస్సు యాత్ర తొలి రోజు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. నేడు నంద్యాలలో సీఎం జగన్ సభ ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజైన గురువారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్మోహన్రెడ్డి నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి ప్రారంభంకానుంది. యాత్ర గురు వారం షెడ్యూల్ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామ స్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురంలో ప్రజలతో మమేకమవుతూ పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
ఆత్మలనూ వాడుకుంటున్న రామోజీ
ఎల్లోమీడియా అధినేత రామోజీరావు తన జీవితపు అంతిమ ఘడియల్లోనూ తన తన క్షుద్ర బుద్ధినిపోనిచ్చుకోవడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా దాన్ని ఏపీ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అంటగట్టేందుకు ఎంతగానో తాపత్రయపడిపోతున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో సుబ్బారావు అనే చేనేత కార్మికుడు కుటుంబం విషాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టే ప్రయత్నం చేసిన ఈనాడు. వాస్తవానికి ఎక్కడో కొండల్లో ఉన్న ప్రభుత్వ భూమిని టీడీపీ హయాంలో రికార్డులను తారుమారు చేసే అధికారులను పట్టుకుని 2015 లో తన తండ్రిపేరు రికార్డ్ చేయించారు. తరువాత ప్రభుత్వం రికార్డులనుంచి ఆయన పేరును తొలగించింది. అంతేకాకుండా ఆ భూమి గతంలో ఎన్నడూ. ఎవరికీ ఎసైన్ చేయలేదు. రాళ్ళూ, రప్పలతో ఉన్న ఆ భూమి కనీసం సాగుకు కూడా పనికిరాదు.. గతంలో ఎన్నడూ ఎవరూ అధికారికంగా అనధికారికంగా కూడా అక్కడ సాగు చేయలేదు. ఆ భూమి తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి సుబ్బారావు కూడా ఎన్నడూ అర్జీ కూడా పెట్టుకోలేదు.. ఏ అధికారిని కలవలేదు. జూదం.. క్రికెట్ బెట్టింగులు.. ఇతర వ్యసనాలతో ఇరవై లక్షల వరకు అప్పులు చేసి.. ఇటు కులవృత్తిని సైతం వదిలేసి ఇబ్బందులు పాలయ్యాడు.. దీంతో భార్యకుమార్తెను అయన హత్య చేసి తరువాత తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక వివరాలను బట్టి తెలుస్తోంది. ఇలాంటి ఘటనలను సైతం ప్రభుత్వానికి అంటగట్టే కుట్రలకు ఎల్లో మీడియా తెగబడుతోంది. -
నాలుగు కాళ్ల కోడిపిల్ల
ఏపీలోని వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీ పరిధిలోని మల్లికార్జునపురంలో నాలుగు కాళ్లతో జన్మించిన ఓ కోడి పిల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామానికి చెందిన దామోదర్.. తన ఇంట్లో మూడు రోజుల కిందట ఓ కోడి పెట్టిన గుడ్లను పొదిగేశారు. అందులో ఒక కోడి పిల్ల నాలుగు కాళ్లతో పుట్టింది. ఆరోగ్యంగా ఉన్న ఈ కోడి పిల్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. – పులివెందుల రూరల్ -
YSRCP వైఎస్సార్ జిల్లా అభ్యర్థులు వీళ్లే
వైఎస్సార్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
రూ.266 కోట్లతో కడప విమానాశ్రయం అభివృద్ధి
కడప కోటిరెడ్డిసర్కిల్/కడప కార్పొరేషన్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని విమానాశ్రయంలో రూ.266 కోట్లతో నిర్మించనున్న నూతన టెర్మినల్ భవనానికి ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ విమానాశ్రయం 25 లక్షల మంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యం మేరకు ఆధునిక సొబగులద్దుకుంటోంది. ఇక్కడి రన్వేని 45 మీటర్ల వెడల్పున 2,515 మీటర్ల పొడవున విస్తరించనున్నారు. పనులు పూర్తయిన తరువాత ఈ విమానాశ్రయం పీక్ అవర్ సరి్వంగ్ కెపాసిటీ 1,800 మంది ప్రయాణికులుగా ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో విమానాశ్రయం విస్తరణకు రూ.75 కోట్లతో స్థలం సేకరించారు. దీంతో రన్వే పొడిగిస్తున్న నేపథ్యంలో విమానాల నైట్ ల్యాండింగ్కు కూడా అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఇక్కడి నుంచి నిరంతరాయ సర్విసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కూడా భరించింది. 2015లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం నుంచి 2017లో ట్రూ జెట్ సంస్థ ఉడాన్ స్కీమ్ కింద ఆర్సీఎస్ (రీజినల్ కనెక్టివిటీ స్కీమ్) అమలు చేసింది. 2021లో ఆ సంస్థ తన విమానాలను ఉపసంహరించుకుంది. 2022 మార్చి నుంచి ఇండిగోసంస్థ విమానాలను ప్రారంభించింది. ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయంలో అభివృద్ధి పనులతోపాటు టెర్మినల్ నిర్మాణంతో రూపురేఖలు మారిపోయి మహర్దశ పట్టనుందని చెప్పారు. ఈ విమానాశ్రయం ఏర్పాటుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృషిచేయగా, ఎయిర్పోర్టు అభివృద్ధికి ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎయిర్పోర్టు సుందరీకరణలోను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. ఎయిర్పోర్టుకు అతి సమీపంలో అటవీప్రాంతం ఉండడంతో అటవీశాఖ అనుమతులు తీసుకుని భూసేకరణ చేసినట్లు తెలిపారు. ఎయిర్పోర్టు అభివృద్ధి పనులు చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరావు సిందియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, ఎయిర్పోర్టు డైరెక్టర్ సుజిత్కుమార్ పోదార్, ›ప్రొటోకాల్ ఆఫీసర్ సురేష్బాబు, టెర్మినల్ మేనేజర్ జోసెఫ్ పాల్గొన్నారు. ముసుగు తొలగించారంతే: ఎంపీ అవినాశ్రెడ్డి అనంతరం ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎప్పటినుంచో పొత్తులో ఉన్న టీడీపీ, పవన్కళ్యాణ్, బీజేపీ ఇప్పుడు ముసుగు తొలగించారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదని, ఎన్నికలు వచ్చాయంటే ఆయనకు పొత్తులు గుర్తొస్తాయని చెప్పారు. 2019లో టీడీపీ ఓటమి పాలుకాగానే చంద్రబాబు తన అనుచరులైన సుజనాచౌదరి, సీఎం రమేశ్లను బీజేపీలోకి పంపారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ప్రత్యక్షంగా పొత్తులో ఉన్న టీడీపీ, వవన్కళ్యాణ్, బీజేపీ.. పరోక్షంగా కాంగ్రెస్, ఇతర పార్టీలతో కూడా కలిసే ఉన్నట్లు చెప్పారు. ఎంతమంది కలిసొచి్చనా, ఎల్లో మీడియా వారికి ఎంత మద్దతు ఇచ్చినా గెలిచేది వైఎస్సార్సీపీయేనని ఆయన తెలిపారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ బీజేపీతో పొత్తుకోసం టీడీపీ వెంపర్లాడిందని ఎద్దేవా చేశారు. సింహం సింగిల్గానే వస్తుందని, జగన్ సింగిల్గా పోటీచేసి మళ్లీ సీఎం కావడం తథ్యమని చెప్పారు. -
కడప ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్కు ప్రధాని మోదీ శంకుస్థాపన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్కు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.265 కోట్ల రూపాయల వ్యయంతో నూతన టర్మీనల్ భవన నిర్మాణం చేపట్టారు. ఢిల్లీ నుండి వర్చువల్ విధానంలో ప్రధాని పాల్గొన్నారు. కడప నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్రెడ్డి మాట్లాడుతూ, కడప ప్రజల కల నెరవేరుతున్న వేళ సంతోషంగా ఉందన్నారు. కడప విమానాశ్రయ అభివృద్ధి కోసం దివంగత మహానేత వైఎస్సార్ చేసిన కృషి అందరికి తెలిసిందే.. రూ. 75 కోట్ల రూపాయలతో స్థల సేకరణ పూర్తి చేశామని తెలిపారు. ఉడాన్ పథకం ద్వారా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, చెన్నైకు తక్కువ ధరకు విమాన సర్వీసులు నడపడం జరిగిందన్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో నైట్ ల్యాండింగ్, రన్ వే పొడిగింపు, పెద్ద విమానాలు ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరావు సిందియా, ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదీ చదవండి: స్నేహం కాదు, దాసోహం! -
రేపు వైఎస్సార్ జిల్లాలో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11వ తేదీన వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. సీఎం జగన్ 11వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. ముందుగా డాక్టర్ వైఎస్సార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్కు చేరుకుని ప్రారంభిస్తారు. అనంతరం డాక్టర్ వైఎస్సార్ జంక్షన్కు వెళ్లి ప్రారంభిస్తారు. అక్కడే సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్కు చేరుకుని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గాంధీ జంక్షన్కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్ వైఎస్సార్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకుని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్కు చేరుకుని ఫేజ్–1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సంయూ గ్లాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ మెమోరియల్ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్ ఎస్టేట్లోని గెస్ట్హౌస్కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు. -
‘దస్తగిరి వెనుక సునీత, ఆమె భర్త ఉన్నారు’
వైఎస్సార్ జిల్లా: మాజీ మంత్రి వైఎస్ వివేకాను హత్య చేశానని దస్తగిరి ఒప్పుకున్నాడని భరత్ యాదవ్ తెలిపారు. వివేకా కేసులో జైలులో ఉంటున్న గంగిరెడ్డి నోరు విప్పితే కేసు చిక్కుముడి వీడుతుంది అని భరత్ యాదవ్ స్పష్టం చేశారు. కాగా, భరత్ యాదవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పుడు దస్తగిరి వైఎస్ కుటుంబంపై బురదజల్లుతున్నాడు. దస్తగిరి వెనుక ఎవరుండి మాట్లాడిస్తున్నారు?. ఇది వరకు.. ఇప్పుడు దస్తగిరి ఆర్థిక పరిస్దితి ఎంటీ?. సునీత ఇంట్లో పని మనిషి బీబీ అనే మహిళ ద్వారా దస్తగిరితో సునీత మాట్లాడుతుంది. డబ్బు కూడా అమె ద్వారానే దస్తగిరికి అందుతోంది. అందుకే సునీత మాట్లాడమన్నట్లు దస్తగిరి మాట్లాడుతున్నాడు. దస్తగిరికి ప్రాణహానీ ఉన్నప్పుడు.. వంట మనిషి బీబీ ద్వారా ప్రాణహానీ ఎందుకు ఉండదు. ఎన్నికల్లో పోటీ చేస్తాను అనేంత డబ్బు ఎలా వస్తుంది?. ఐస్ బండి నడిపే దస్తగిరికి ఇంత డబ్బు ఎలా వచ్చింది?. ఖచ్చితంగా దస్తగిరి వెనక సునీత, అమె భర్త రాజశేఖర్ ఉండి మాట్లాడిస్తున్నారు. వైఎస్ వివేకా రెండవ భార్యకు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఆయన చంపించారు. వైఎస్ వివేకాను హత్య చేసింది దస్తగిరి, సునీల్ యాదవ్, గంగిరెడ్డి. వైఎస్ వివేకా హత్య తర్వాత దస్తగిరి, సునీల్, ఎర్ర గంగిరెడ్డి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి నుంచి డబ్బు రావాలి అని ఎర్ర గంగిరెడ్డి చెప్పేవారు. జైలులో ఉంటున్న గంగిరెడ్డి నోరు విప్పితే కేసు చిక్కుముడి వీడుతుంది’ కీలక వ్యాఖ్యలు చేశారు. -
YSR District: రమేష్రెడ్డికి సీటు పోటు!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ అధికారిక పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అధినేత చంద్రబాబు యూజ్ అండ్ త్రో పాలసీ అమలు చేయడంలో దిట్టగా పేరు గడించారు. అవసరాలకు అనుగుణంగా నాయకులను వాడుకోవడంలో ఆయనకు మరెవ్వరు సాటిరారని విశ్లేషకులు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అలాంటి పరిస్థితి తాజాగా మాజీ ఎమ్మెల్యే రమేష్కుమార్రెడ్డికి ఎదురైంది. రెడ్డెప్పగారి కుటుంబం రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చిన ఆయనకు అటు ఇంటి నుంచి ఇటు పార్టీ నుంచి సీటు పోటు తప్పలేదు. 25 ఏళ్లుగా పార్టీ విధేయునిగా ఉన్నా, అసెంబ్లీ సీటు దక్కకపోవడానికి సోదరుడి సారథ్యమే ప్రధాన కారణమని సమాచారం. దివంగత మాజీ మంత్రి రెడ్డెప్పగారి రాజగోపాల్రెడ్డి రాజకీయ వారసుడిగా రమేష్కుమార్రెడ్డి అరంగ్రేటం చేశారు. 1999లో లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో లక్కిరెడ్డిపల్లె రద్దు అయింది. రాయచోటి నియోజవకర్గంలో లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు మూడు మండలాలు కలిసిపోయాయి. 2009 ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి సాయిప్రతాప్ చేతిలో ఓడిపోయారు. 2014, 19లలో రాయచోటి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రమేష్రెడ్డి 1999 నుంచి ఇప్పటివరకు టీడీపీ నాయకుడుగా చెలామణీ అవుతున్నారు. కాంట్రాక్టర్గా స్థిరపడిన సోదరుడు శ్రీనివాసులరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014లో తొలిసారి అరంగ్రేటం చేసిన వెంటనే కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. క్రమంగా టీడీపీ సారధ్య బాధ్యతలకు దగ్గరయ్యారు. అధినేత చంద్రబాబు మనుసెరిగి మసులుకోవడంలో దిట్టగా మారడంతో టీడీపీలో పొలిట్బ్యూరో సభ్యుడుగా ఎదిగారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. దీనికి తోడు శ్రీనివాసులరెడ్డి ధనవంతుడు కావడంతో అధినేత చంద్రబాబు మరింత ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. కుటుంబానికి ఒక్కటే సీటు నిబంధన.... తెలుగుదేశం పార్టీలో ఇటీవల అనధికారికంగా కుటుంబానికి ఒక్కటే సీటు అనే నిబంధన పెట్టుకున్నారు. ఈక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న శ్రీనివాసులరెడ్డి ఆ ఒక్క సీటు మా సోదరుడు రమేష్కుమార్రెడ్డికి ఇవ్వాలని అభ్యర్థించి ఉంటే తప్పకుండా వచ్చేదని పలువురు వివరిస్తున్నారు. అలా కాకుండా తన సతీమణీ మాధవీరెడ్డికి కడపలో అవకాశం కల్పించాలని శ్రీనివాసులరెడ్డి కోరడంతోనే రమేష్రెడ్డి సీటు ప్రశ్నార్థమైనట్లు సమాచారం. 1999 నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ బాధ్యతగా, విధేయుతతో పనిచేస్తున్న తనను కాదని, నిబంధనలు ముడిపెట్టి తనకు ఎగనామం పెడతారా? అన్న ఆక్రోశం రమేష్రెడ్డి వెళ్లగక్కుతున్నారు. ఆరు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇటు ఇంటిలోని వారు, అటు పార్టీకి చెందిన వారు వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమేరకు అనుచరగణం తీవ్రస్థాయిలో రగిలిపోతున్నట్లు సమాచారం. అవకాశవాద రాజకీయాలతోనే.. నిబద్ధతతో రాజకీయాలు చేసేవారు కొందరైతే, అందివచ్చిన అవకాశాలతో ఎదిగే నేతలు మరికొందరు. చేయి అందించిన వారినే తొక్కుకుంటూ ఎదిగే నేతలు మరికొందరు. చంద్రబాబు తెరపైకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి అవకాశవాదులు అధికమయ్యారు. తన..మన భేదం లేకుండా రాజకీయ ఉన్నతి కోసం సొంత మనుషులను, రక్త సంబంధీకులను తొక్కేయడంలో వీరు దిట్టలు. ఇలాంటి పరిస్థితితోనే రాయచోటి సీటు చేజార్చుకోవాల్సి వచ్చిందని రమేష్రెడ్డి సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తుదకు తనకు కాకపోయినా రాయచోటి సెగ్మెంట్లో మాధవీరెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేసినా ఇంతటి క్షోభ ఉండేది కాదని, సొంత నియోజకవర్గం రెడ్డెప్పగారి కుటుంబం నుంచి చేజార్చుకునే పరిస్థితి లేకుండా ఉండేదని పలువురితో వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రాజకీయ భవిష్యత్ కోసం సన్నిహితులతో ప్రత్యేకంగా చర్చిస్తూ, రాయచోటి నుంచి పోటీ చేయాలనే దిశగా అడుగులు వేస్తూ, తదనుగుణంగా సమీకరణలు చేస్తున్నట్లు సమాచారం. -
యువతకు ఉపాధి.. రైతులకు లాభం
సాక్షి, అమరావతి: ఓవైపు యువతకు ఉపాధి.. మరోవైపు రైతులకు ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరంలో పారిశ్రామిక పార్క్ను అందుబాటులోకి తెచ్చింది. కలప ఆధారిత పరిశ్రమల కోసమే ప్రత్యేకంగా ఈ పారిశ్రామిక పార్క్ను అభివృద్ధి చేసింది. ఈ వుడ్ పార్క్లో ప్రధాన (యాంకర్) కంపెనీగా అగ్రగామి సంస్థ సెంచురీ ప్యానల్స్ భారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో నెలకొల్పిన సెంచురీ ప్యానల్స్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల రోజుల క్రితం లాంఛనంగా ఉత్పత్తిని ప్రారంభించారు. సెంచురీ ప్యానల్స్కు డిసెంబర్ 23, 2021లో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేవలం రెండేళ్లలోనే వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. ఈ యూనిట్ ద్వారా 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి లభించనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రెండో దశ విస్తరణ పనులను ప్రారంభించడానికి సెంచురీ ప్యానల్స్ ప్రణాళికలు సిద్ధం చేసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు.. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో సుబాబుల్, జామాయిల్ సాగు చేసే రైతులు గిట్టుబాటు ధరలు లేక గుట్టలుగా పేరుకుపోయిన కలప లాట్లను చూపించి ఆయనకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చాక 2021 జూలైలో బద్వేలు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గోపవరం పారిశ్రామిక పార్క్ను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వేగంగా భూసేకరణ పూర్తి చేసిన ఏపీఐఐసీ గోపవరం వద్ద 490.36 ఎకరాల్లో కలప ఆధారిత పరిశ్రమల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్ను అభివృద్ధి చేసింది. రైతులకు సబ్సిడీ ధరలకే 50 లక్షల విత్తన మొక్కలు.. సెంచురీ ప్యానల్స్లో హై ప్రెజర్ లామినేట్స్ (హెచ్పీఎల్), మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్ (ఎండీఎఫ్) తయారవుతాయి. రోజుకు 950 టన్నుల సామర్థ్యం గల ఎండీఎఫ్లను తయారుచేస్తారు. ఇందుకోసం భారీ సంఖ్యలో కలప అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో 150 కి.మీ పరిధిలో వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల నుంచి సెంచురీ ప్యానల్స్ జామాయిల్ను సేకరించనుంది. ఇందుకోసం సుమారు 80,000 ఎకరాల్లో జామాయిల్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు సెంచురీ ప్యానల్స్ జనరల్ మేనేజర్ రమేష్కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా జామాయిల్ను కొనుగోలు చేస్తామన్నారు. దీనివల్ల సుమారు 25,000 రైతు కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇప్పటికే రైతులకు 50 లక్షల విత్తన మొక్కలను సబ్సిడీ ధరలకు అందించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో 80% మంది స్థానిక యువతనే తీసుకుంటున్నామన్నారు. తొలుత గోపవరం, బద్వేలు మండలాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వీటి తర్వాత వైఎస్సార్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే ఈ యూనిట్కు అవసరమైన ముడి సరుకును అందించే రీసిన్ తయారీ యూనిట్ను నాయుడుపేట వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ యూనిట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. యాంకర్ యూనిట్ ఏర్పడటంతో దీనికి అనుబంధంగా అనేక కలప ఆధారిత పరిశ్రమలు ఇక్కడకు రానున్నాయని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఉద్యోగం రాదనుకున్నా.. ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఐదేళ్లపాటు ఎదురుచూశాను. ఇక ఉద్యోగం రాదనుకున్నా. సెంచురీ ప్యానెల్స్ ఏర్పాటుతో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడంతో నన్ను ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. దీంతో మా కుటుంబం ఆనందానికి అవధులు లేవు. – గుడి మెగురయ్య కలసపాడు, వైఎస్సార్ జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగాలు.. రైతులకు మేలు.. సెంచురీ ప్యానెల్స్కు అవసరమయ్యే రా మెటీరియల్ కోసం జామాయిల్ సాగు చేసుకునేందుకు పరిశ్రమ వారు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా మొక్కలను సబ్సిడీ ద్వారా నేరుగా రైతు పొలాల వద్దకే తెచ్చిస్తామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా కనీస మద్దతు ధరకు వారే కొనుగోలు చేస్తామన్నారు. జామాయిల్ సాగుపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు, కూలీలకు ఉపాధితో పాటు రైతులకు మేలు జరుగుతుంది. – రూకల దేవదాసు గోపవరం ప్రాజెక్టు కాలనీ, వైఎస్సార్ జిల్లా వెనుకబడిన ప్రాంతంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ బాగా వెనుకబడిన ప్రాంతమైన బద్వేలులో యూనిట్ ఏర్పాటు చేయడానికి సెంచురీ ప్యానల్స్ ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి 0.07 టీఎంసీల నీటిని కేటాయించడంతోపాటు 132 కేవీ విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతులను కల్పించాం. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలతోపాటు సబ్సిడీ ధరపై విద్యుత్ అందించాం. స్థానిక యువతకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ అందిస్తున్నాం. – ఎన్.యువరాజ్, కార్యదర్శిరాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ -
నాయకులు పొత్తులు అంటుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం మంటలు
అధికారం కోసం ఎవరితో అయినా కలిసేందుకు సిద్ధపడుతున్నారు చంద్రబాబు ఆయన దత్త పుత్రుడు పవన్కల్యాణ్లు. అయితే అన్ని జిల్లాల్లోనూ టీడీపీ, జనసేన పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. పెద్ద నాయకులు పొత్తులు అంటుంటే..క్షేత్ర స్థాయిలో మాత్రం మంటలు రేగుతున్నాయి. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో కూడా రెండు పార్టీల మధ్య ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ జిల్లాలో ఐదు సీట్లలో పోటీకి రెడీ అంటున్నారు జనసేన నేతలు. అసలు వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య ఏం జరుగుతోందో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఉమ్మడి కడప జిల్లాలో విపక్షాల పోటీ నామమాత్రంగానే ఉండబోతోంది. కాని జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీకి టీడీపీ నేతలు ఉవ్విళ్ళూరుతున్నారు. వీరికి తోడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కూడా కనీసం ఐదు సీట్లు తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తోందనే టాక్ నడుస్తోంది. ఇటు పార్టీలో పోటీ..అటు జనసేన నుంచి వస్తున్న డిమాండ్లతో పచ్చ పార్టీ బాస్ చంద్రబాబుకు దిక్కు తోచడంలేదట. అసలు పోటీయే నామమాత్రం అయితే..ఇంతమంది సీట్ల కోసం పోటీ పడుతున్నారేంటని చంద్రబాబు అనుకుంటున్నారట. కాని వారి లెక్కలు వేరే ఉన్నాయంటున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు మాటలకే పరిమితం అవుతుందని క్షేత్రస్థాయిలో కత్తులు దూసుకోవడం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జిల్లాలో జనసేన అభ్యర్ధులు కడప, రాజంపేట, రైల్వేకోడూరు, మైదుకూరు, బద్వేలు నియోజవర్గాల్లో పోటీ చేసేందకు ఉత్సాహం చూపుతున్నారు. ఇందులో భాగంగా పలుమార్లు పార్టీ నాయకులతో సమావేశమై తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కడప నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన సుంకర శ్రీనివాస్ మరోమారు పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. కానీ కడపలో టిడిపి తరుపునే ముగ్గురు పోటీ పడుతున్నారు. అందరు కలిసి పని చెయ్యాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడే పలుమార్లు అదేశించినా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో ఒకరికి టిక్కెట్ ఇస్తే మిగిలిన ఇద్దరూ కలిసి పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు జనసేన నేత సుంకర శ్రీనివాస్ సైతం కడపలో బలిజుల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నందున తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మొదట్లో అందరు కలిసి ష్యూరిటీ... బాబు గ్యారెంటీ పేరుతో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కానీ టిడిపి వ్యూహం తెలుసుకున్న జనసేన నేతలు ఆ పార్టీకి ప్రచారం చేయడం మానేశారు. ఇప్పుడు జనసేన నేత సుంకర శ్రీనివాస్ కూడా ప్రత్యేకంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక అన్నమయ్య జిల్లా పరిధిలోని రాజంపేటలోను ఇలాంటి పోరే నడుస్తొంది. ఇక్కడా టిడిపిలో ఇద్దరు నేతల మధ్య టికెట్ వార్ నడుస్తోంది. వీరిద్ధరి మధ్యలోకి జనసేన అభ్యర్ధిగా మాజీ టిడ్కో అధికారి యల్లటూరి శ్రీనివాసరాజు తెరపైకి వచ్చారు. ఈయన రాష్ర్ట స్థాయి అధికారిగా పనిచేస్తూ టిడిపి పెద్దలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజంపేటలో స్వంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తు వస్తున్నారు. ఇప్పుడు శ్రీనివాసరాజు పరిస్థితి కూడా అయోమయంగా మారింది. టికెట్ ఖాయమని చెప్పడంతో ఉద్యోగం వదులుకుని జనసేనలో చేరితే ఇంతవరకు టికెట్ ఖరారు చెయ్యలేదు. ఏదేమైనా రాజం పేట టిక్కెట్ తనకే కావాలని మాజీ ప్రభుత్వ అధికారి గట్టిగా తన గళం వినిపిస్తున్నా..టీడీపీలోని పోటీ దారులు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్తితే కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయిలో అధికారం కోసం చంద్రబాబు, పవన్లు నానాగడ్డి కరుస్తుంటూ..క్షేత్ర స్థాయిలో మాత్రం టిక్కెట్ల కోసం ఫైట్ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఎదుర్కొని ఒక్క సీటు కూడా టీడీపీ, జనసేన గెలిచే పరిస్తితి లేదని..కాని పోటీ ఎక్కువైందంటే వారి లెక్కలు వేరేగా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
YSR: ఆ కంటైనర్లలో అసలు ఏముందంటే..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కంటైనర్లలో రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని.. వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎం.డి షరీఫ్ హెచ్చరించారు. దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో రూ.వేలకోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదని కడప డీఎస్పీ అన్నారు. దేశ రక్షణకు సంబంధించి సామాగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, సామాగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు, రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల ఎస్కార్ట్తో పాటు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చామని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. -
‘కడప’టికి సైకిల్కు శూన్యమే!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న శ్రేణులు పరేషాన్ అవుతున్నాయి. సీనియారిటీకి విలువ ఇవ్వకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటివి టీడీపీకి మైనస్ అవుతున్నాయని పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. బద్వేల్, మైదుకూరు, కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఇన్చార్జుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి వైఖరి ఇలాగే ఉంటే జిల్లాలో గత ఎన్నికల్లోలాగానే తెలుగుదేశానికి మిగిలేది శూన్యమేననే వాదన ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. రీతి లేని రితీష్ బద్వేల్లో ఎప్పటి నుంచో టీడీపీకి విధేయతగా ఉన్న దివంగత కర్నాటి శివారెడ్డి (కర్నాటి వెంకటరెడ్డి), బద్వేల్ మాజీ జెడ్పీటీసీ శిరీష కుటుంబాలతోపాటు, కలశపాడు బాలిరెడ్డి వంటి వారు ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జి కొనిరెడ్డి రితీష్కుమార్రెడ్డి తీరు తమకు అవమానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివంగత మంత్రి వీరారెడ్డి హయాం నుంచి టీడీపీలో ఉన్న సీనియర్ నేతలు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను చవిచూస్తున్నారు. పుట్టెడుజిత్తుల.. ‘పుట్టా’ మైదుకూరు నియోజకవర్గం ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఏకపక్ష వైఖరి వల్ల టీడీపీలో తొలి నుంచి ఉన్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డికి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. దువ్వూరు మండల నేత వెంకట కొండారెడ్డిదీ అదే దుస్థితి. డీఎల్ రవీంద్రారెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో కూడా రెడ్యం సోదరులు టీడీపీ జెండా కోసం పనిచేశారు. అలాంటి వారినీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆ పార్టీ నుంచి సాగనంపేందుకు సిద్ధమయ్యారని శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సెల్ఫ్ ఫోకస్లో ప్రవీణ్రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి కూడా ఒంటెత్తు పోకడలు పోతున్నారు. సీనియర్ నేతలు నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డిలను విస్మరిస్తూ తను మాత్రమే ఫోకస్ కావాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిల వైఖరికి విస్తుపోతున్న సీనియర్ నేతలు పార్టీలో కొనసాగాలా లేదా? ప్రత్యామ్నాయమార్గం ఏమిటీ? అనే సందిగ్ధంలో ఉన్నారు. మాధవీరెడ్డి దుందుడుకు చర్యలతో విస్తు తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ ఇన్చార్జి మాధవీరెడ్డి దుందుడుకు చర్యలతో తెలుగుతమ్ముళ్లు విస్తుపోతున్నారు. ప్రశాంతతకు కేంద్ర బిందువుగా ఉన్న జిల్లా కేంద్రంలో రెచ్చగొట్టే చర్యలకు ఆమె పాల్పడుతున్నారనే ఆవేదన ఆ పార్టీ సీనియర్ల నుంచి వ్యక్తమవుతోంది. నాయకురాలిగా ఫోకస్ కావాలనే తపన ఉండొచ్చు కానీ, బహిరంగంగా అధికార పార్టీ క్యాడర్తో వాదనకు దిగడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్బాషాలాంటి స్థాయి ఉన్న వారినీ ఆమె ఏకవచనంతో సంబోధిస్తున్నారని పలువురు ఎత్తిచూపుతున్నారు. సొంత క్యాడర్తో కూడా ఆమె దురుసుగా వ్యవహరిస్తున్నారనే వాదన ఉంది. పార్టీ ఇన్చార్జిగా ఇప్పుడే ఇలా ఉంటే, అధికారిక హోదా దక్కితే ఆమెను నియంత్రించడం సాధ్యం కాదనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
కమలాపురం: చంద్రబాబు ‘రా..కదలిరా’ సభ అట్టర్ఫ్లాప్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కమలాపురంలో చంద్రబాబు రా..కదలిరా సభ అట్టర్ప్లాప్ అయ్యింది. అబద్ధాలు, అవాస్తవాలతో చంద్రబాబు ప్రసంగం ఆకట్టుకోలేకపోయింది. చంద్రబాబు తన ప్రసంగంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు సభకు జన సమీకరణలో టీడీపీ నేతలు విఫలమయ్యారు. చంద్రబాబు ప్రసంగం పూర్తికాక ముందే కుర్చీలు ఖాళీ అయ్యాయి. మద్యం ధరలపై చంద్రబాబు మాట్లాడుతుండగా సభలో మందుబాబులు క్వాటర్ బాటిళ్లు చూపించారు. టికెట్లపై స్పష్టమైన హామీ ఇస్తారనుకున్న ఆశావహులు.. బాబు నుంచి క్లారిటీ రాకపోవడంతో వెనుదిరిగారు. -
బద్వేల్లో బడుగుల సాధికార పండుగ
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా బద్వేల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలు సాధికార ఉత్సవం నిర్వహించాయి. సీఎం వైఎస్ జగన్ అందించిన చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధించిన అభివృద్ధిని తెలియజేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వైఎస్సార్సీపీ సోమవారం ఇక్కడ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాదిగా పాల్గొన్నారు. యువత కేరింతలు, బాణసంచా, వాయిద్యాలు, జానపద నృత్యాలతో యాత్ర పండుగలా సాగింది. ఆర్థికంగా చేయూతనిచ్చి, రాజకీయ, సామాజిక ప్రాధాన్యతనిచ్చి, ఉద్యోగావకాశాలు కల్పించిన సీఎం వైఎస్ జగన్కు అండగా ఉంటామని బడుగు, బలహీన వర్గాలు నినదించాయి. ర్యాలీకి స్థానిక ప్రజలు అడుగడుగునా హారతులు పట్టారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభకు ర్యాలీలో పాల్గొన్న వారితో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభలో నాయకులు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ఇతర వర్గాలకు చేస్తున్న మేలును వివరించారు. ప్రజలు పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో హర్షధ్వానాలు చేశారు. ‘జగనే రావాలి.. మళ్లీ జగనే కావాలి’ అంటూ సభ ఆద్యంతం నినాదాలు చేస్తూనే ఉన్నారు. బద్వేల్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎం వైఎస్ జగన్తోనే నడుస్తామని నేతలు, ప్రజలు మూకుమ్మడిగా ప్రకటించారు. పేదలకు మరింత సంక్షేమం : డిప్యూటీ సీఎం నారాయణస్వామి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థాయిని పెంచిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. సీఎం జగన్ చేసిన మేలుతో మన కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చాలా చులకనగా చూశారని, హేళన చేసే వారని అన్నారు. కూలివాడి కొడుకు కూలీగానే ఉండాలని ఆలోచించేవాడు చంద్రబాబు అయితే, కూలివాడి కొడుకు కలెక్టర్ కావాలని ఆలోచించి, అందుకు ఏమి చేయాలో అదంతా చేసే వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీ సీఎంలు కూడా సాహసించలేదు: కడప మేయర్ సురేష్ బాబు దేశంలో ఎంతో మంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ, ఎవరూ పాటించని సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్ జగన్ మాత్రమే చేతల్లో చూపించారని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. జగన్ సీఎం అయ్యాక బ్రహ్మంసాగర్కు రూ.600 కోట్లు మంజూరు చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని 17 టీఎంసీలకు పెంచారని తెలిపారు. కలసపాడు, పోరుమామిళ్ల, బి.మఠం మండలాల్లో వేలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారన్నారు. ఆడపడుచులకు దేవుడిచ్చిన అన్నయ్య సీఎం జగన్ : మాజీ ఎంపీ బుట్టా రేణుక సీఎం వైఎస్ జగన్ పేదింటి ఆడపడుచులకు దేవుడిచ్చిన అన్నయ్య అని మాజీ ఎంపీ బుట్టా రేణుక చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో వివిధ పథకాల ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు నగదును జమ చేస్తున్నారని తెలిపారు. బద్వేలులో రూ.1268.72 కోట్లు : ఎమ్మెల్సీ గోవిందరెడ్డి బద్వేలు నియోజకవర్గంలో సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్ 1,38,763 మందికి రూ.1268.73 కోట్లు నగదు బదిలీ చేశారని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చెప్పారు. ఇందులో 88,214 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లకు రూ.782.72 కోట్లు ఇచ్చారన్నారు. ఈ సంక్షేమం కొనసాగాలంటే జగన్ను మరోసారి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ గోపవరం వద్ద రూ.1000 కోట్లతో సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపా«ధి కలి్పస్తున్నారని ఎమ్మెల్యే సుధ చెప్పారు. ఎమ్మెల్సీలు ఇషాక్, రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, జెడ్పీ చైర్మన్ అమర్నాథరెడ్డి పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
-
పులివెందులలో సీఎం క్రిస్మస్ వేడుకలు
పులివెందుల: క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా మూడో రోజైన సోమవారం ఉదయం సీఎం ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి హెలికాప్టర్ ద్వారా భాకరాపురం హెలిప్యాడ్, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా పులివెందుల పట్టణానికి చేరుకున్నారు. ఉ.9.30 గంటలకు సీఎస్ఐ చర్చి ప్రాంగణానికి చేరుకుని అక్కడ హాజరైన వారిని ఆప్యాయంగా, చిరునవ్వుతో పలకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం తన బంధువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్.. ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏటా క్రిస్మస్ రోజున తన సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలు తనకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన ప్రార్థించారు. రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో తరిస్తున్నానని.. ఎప్పటికీ మీ హృదయాల్లో ప్రియమైన నాయకుడిగా సుస్థిర స్థానాన్ని పొందుతానన్నారు. అనంతరం.. ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. 2024 నూతన సంవత్సర చర్చి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆ తర్వాత చర్చి నుంచి రోడ్డు మార్గాన సీఎం బయల్దేరి వైఎస్సార్సీపీ నేత నల్లచెరువుపల్లె రవి ఇంటికెళ్లి నూతన దంపతులు మంజ్రేకర్రెడ్డి, రేణుకారెడ్డిలను ఆశీర్వదించారు. ఇక ఉ.11.07 గంటలకు సీఎం జగన్ అక్కడ నుంచి బయల్దేరి 11.15 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడారు. ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. మ.12.19 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి మైదుకూరులోని జిల్లా వక్ఫ్బోర్డు చైర్మన్ దస్తగిరి నివాసంలో ఆయన కుమారుడు, ఇద్దరు కుమార్తెల వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులు.. ఇక క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, కుటుంబ సభ్యులు వైఎస్ ప్రకాష్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, వైఎస్ మధురెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, ఆత్మీయులు, మిత్రులు, పుర ప్రజలు పాల్గొన్నారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ డి. సుధ, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, పాడా ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, ఆర్డీఓ వెంకటేశులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలపై ఉండాలి సీఎం వైఎస్ జగన్ సాక్షి,అమరావతి: నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలపై ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని సోమవారం ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. -
వైఎస్ఆర్ జిల్లాలో రెండో రోజు బిజీబిజీగా గడిపిన సీఎం వైఎస్ జగన్
-
క్రిస్మస్ ప్రార్థనల్లో సీఎం జగన్
సాక్షి కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇడుపులపాయలో ఉదయం 9.10 గంటల ప్రాంతంలో తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ బరువెక్కిన హృదయంతో ఘాట్ ప్రాంగణంలో అందరినీ పలుకరిస్తూ ముందుకు కదిలారు. నివాళులర్పించిన కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని దివంగత వైఎస్సార్ సమాధి వద్ద పలువురు కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. సీఎం జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ ఉదయాన్నే ఘాట్ వద్దకు చేరుకుని పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. వైఎస్సార్ సోదరులు వైఎస్ రవీంద్రనాథ్రెడ్డి, వైఎస్ సు«దీకర్రెడ్డి, సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డి, వైఎస్ జగన్ సోదరులు వైఎస్ సునీల్రెడ్డి తదితరులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, నగర మేయర్ సురేష్బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, చక్రాయపేట మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, మంగళగిరి వైఎస్సార్ సీపీ మహిళా నేత బొమ్మారెడ్డి సునీత, కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ సిద్దార్థ కౌశల్, జేసీ గణేష్కుమార్, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్య సలహాదారు రాజోలి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి ఇడుపులపాయలోని చర్చిలో జరిగిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సీఎం జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, బావమరిది ఈసీ దినేష్రెడ్డి, సోదరుడు వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ సునీల్రెడ్డి, చిన్నాన్న, పెద్దనాన్నలు వైఎస్ సుధీకర్రెడ్డి, వైఎస్ రవీంద్రనాథ్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులతోపాటు వైఎస్ కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవరెండ్ ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా ఆనవాయితీ ప్రతి క్రిస్మస్కు ముందురోజు కుటుంబ సభ్యులు, బంధువులు కలుసుకోవడం ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఇడుపులపాయలోని చర్చి వద్ద ›ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియచేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే క్రమంలో సీఎం జగన్ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను కలుసుకుని ఆప్యాయంగా పలుకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. -
CM YS Jagan Photos: సింహాద్రిపురంలో సీఎం జగన్కు ఘనస్వాగతం (ఫోటోలు)
-
పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనం: సీఎం జగన్
సింహాద్రిపురం(వైఎస్సార్జిల్లా): పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు ఆదివారం సింహాద్రిపురంలో నూతనంగా నిర్మించిన రోడ్డు వెడల్పు సుందరీకరణ పనులు, వైఎస్సార్ పార్క్, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. పాడా నిధులతో పులివెందుల నియోజకవర్గం, సింహాద్రిపురం మండల కేంద్రంలో రూ 11.6 కోట్లతో నూతనంగా సుందరీకరరించిన రోడ్లు, జంక్షన్లను సీఎం జగన్ ప్రారంభించారు. ఇందులో ఫోర్ లైన్ సీసీ రోడ్, బీటీ రోడ్ జంక్షన్లు ఉన్నాయి. . అనంతరం రూ 5.5 కోట్ల నిధులతో 1.5 ఎకరాల్లో సుందరంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పార్కును ఆయన ప్రారంభించారు. ఇందులో ఎంట్రీలో ప్లాజా వాటర్ ఫౌండేషన్, చిన్నపిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ , వైఎస్సార్ విగ్రహాలను అందంగా ఏర్పాటు చేశారు. అనంతరం రూ 3.19కోట్ల పాడానిధులతో నిర్మించిన న్యూ తహశీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ ను, రూ 2 కోట్ల నిధులతో నిర్మించిన న్యూ పోలీస్ స్టేషన్ ను,రూ 3.16 నిధులతో నిర్మించిన ఎంపీడీవో ఆఫీసును ఆయన ప్రారంభించారు. సింహాద్రిపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం జగన్కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట జిల్లా ఇంఛార్జి, మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు, జెసి గణేష్ కుమార్, పాడ ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పులివెందుల ఆర్డీవో వెంకటేశం, నాయకులు, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సింహాద్రిపురం తహశీల్దార్ డి. మహబూబ్బాషా, ఎంపీడీవో జి కృష్ణమూర్తి, పోలీస్ అధికారులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు ప్రార్థన మందిరంలోని క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్ అంతకుముందు ఉదయం ఇడుపులపాయ నివాసం నుంచి వైఎస్సార్ ఘాట్కు చేరుకున్న సీఎం జగన్.. మహానేత వైఎస్సార్కు నివాళులర్పించారు. అనంతరం ఘాట్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇడుపులపాయలో పులివెందుల మండల నాయకులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన
Updates 2:54PM,. Dec 24. 2023 వైఎస్సార్జిల్లాలో సీఎం వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన సింహాద్రిపురంలో రోడ్డు వెడల్పు, సుందరీకరణ పనులు వైఎస్సార్ పార్క్, తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం ప్రారంభోత్సవంతో సీఎం జగన్ ►ఇడుపులపాయ నుంచి సింహాద్రిపురం పర్యటనకు సీఎం జగన్ ►ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం ►సింహాద్రిపురంలో పోలీసు స్టేషన్, తాహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు సింహాద్రిపురం జంక్షన్, పార్కులను ప్రారంభించనున్న సీఎం ►అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్న సీఎం జగన్ ►పులివెందుల మండల నాయకులతో సీఎం జగన్ సమావేశం ►సమావేశానికి హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి, జడ్పీ ఛైర్మన్ అమర్నాథ్రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, స్థానిక నాయకులు ఇడుపులపాయలో సీఎం జగన్ ►వైఎస్సార్ ఘాట్కు చేరుకున్న సీఎం జగన్ ►మహానేత వైఎస్సార్కు నివాళులర్పించిన సీఎం జగన్ ►అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం. ►ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రా రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య సలహాదారు రాజోలి వీరారెడ్డి, తదితరులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్కు నివాళులు అర్పించారు వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా నేడు సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం ఇడుపులపాయ నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్కు చేరుకుంటారు. ఘాట్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని 11.30 వరకు ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు సింహాద్రిపురం జూనియర్ కళాశాల సమీపాన ఉన్న హెలిప్యాడ్కు చేరుకుంటారు. 12.40 గంటల వరకు సింహాద్రిపురం మండల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతారు. అనంతరం సింహాద్రిపురంలోని రోడ్డు వెడల్పు, సుందరీకరణ, వైఎస్సార్ పార్క్, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్లో దిగుతారు. ఎకో పార్క్ మీటింగ్ ప్రదేశానికి చేరుకుంటారు. పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 4.45 గంటలకు గెస్ట్హౌస్కు చేరుకుని, ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. -
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన. పలు అభివృద్ధి పనుల ప్రారంభం..ఇంకా ఇతర అప్డేట్స్
-
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
కాసేపట్లో వైఎస్ఆర్ జిల్లాకు సీఎం జగన్
-
వైఎస్సార్ జిల్లా: పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శ్రీకారం
Updates: ►మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కడప నుండి రోడ్డు మార్గాన ఇడుపులపాయ చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ►రాత్రికి ఇడుపులపాయలో బస ►రేపు ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న సీఎం జగన్►అనంతరం ఇడుపులపాయలోని ప్రార్థన మందిరంలో కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్ ►కడప కోటిరెడ్డి సర్కిల్లో గాంధీజీ దండి మార్చ్ విగ్రహాలు ఆవిష్కరణ చేసిన సీఎం జగన్ ►కడప కోటిరెడ్డి సర్కిల్ చేరుకున్న సీఎం జగన్ ►అంబేద్కర్ సర్కిల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ ►అంబేద్కర్ చౌరస్తా చేరుకున్న సీఎం జగన్ ►ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ►దివ్యాంగులను ట్రై స్కూటర్లను పంపిణీ చేసిన సీఎం జగన్ ►రిమ్స్లో వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్ ►వైఎస్సార్ కేర్ బ్లాక్, వైఎస్సార్ మానసిక వైద్యశాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ ►కడపలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్ ►సెంచురీ ప్లై ఇండస్ట్రీస్ ప్రారంభించిన సీఎం జగన్ ►రూ.1000 కోట్లతో యూనిట్ ఏర్పాటు ►2,266 మందికి ప్రత్యక్షంగా లభించనున్న ఉపాధి ►కడప ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►ప్రత్యేక హెలికాఫ్టర్లో గోపవరం పయనం ►ఘన స్వాగతం పలికిన జిల్లా నాయకులు, అధికారులు ►మరికాసేపట్లో సెంచూరీ పరిశ్రమ వద్దకు చేరుకోనున్న సీఎం ►వైఎస్సార్ కడప జిల్లాకు బయలేర్దిన సీఎం జగన్ ►మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం ►బద్వేలు, కడప, పులివెందుల, మైదుకూరులలో సీఎం జగన్ పర్యటన సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 23, 24, 25 తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అలాగే, క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటారు. ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన షెడ్యూల్ ఇలా.. ♦ 23వ తేదీ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కడప చేరుకుంటారు. అక్కడి నుంచి గోపవరం చేరుకుని సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్పీఎల్ ప్లాంట్లను ప్రారంభించి చైర్మన్, సిబ్బందితో మాట్లాడతారు. ♦ ఆ తర్వాత కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. దీంతో పాటు డాక్టర్ వైఎస్సార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ను ప్రారంభించిన అనంతరం అదే రిమ్స్ ప్రాంగణంలో డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ బ్లాక్ను ప్రారంభిస్తారు. ♦ అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభిస్తారు. ♦ అలాగే, వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లడ్లైట్లను ప్రారంభిస్తారు. ♦ ఆ తర్వాత ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని, నవీకరించిన అంబేద్కర్ సర్కిల్, వై.జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ ప్రారంభిస్తారు. ♦అంతేకాక.. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఎస్టేట్లోని గెస్ట్హౌస్లో రాత్రికి బసచేస్తారు. ♦ఇక 24న ఇడుపులపాయ గెస్ట్హౌస్ నుంచి బయల్దేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం.. మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్కులో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడి గెస్ట్హౌస్లో బసచేస్తారు. ♦ 25వ తేదీ ఉదయం ఇడుపులపాయ గెస్ట్హౌస్ నుంచి బయల్దేరి పులివెందుల చేరుకుంటారు, అక్కడ సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు, మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. -
వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ 3 రోజుల పర్యటన
-
23, 24, 25 తేదీల్లో.. సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23, 24, 25 తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అలాగే, క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటారు. ముఖ్యమంత్రి మూడ్రోజుల పర్యటన షెడ్యూల్ ఇలా.. ♦ 23వ తేదీ ఉ.9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కడప చేరుకుంటారు. అక్కడి నుంచి గోపవరం చేరుకుని సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్పీఎల్ ప్లాంట్లను ప్రారంభించి చైర్మన్, సిబ్బందితో మాట్లాడతారు. ♦ ఆ తర్వాత కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. దీంతో పాటు డాక్టర్ వైఎస్సార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ను ప్రారంభించిన అనంతరం అదే రిమ్స్ ప్రాంగణంలో డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ బ్లాక్ను ప్రారంభిస్తారు. ♦ అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభిస్తారు. ♦ అలాగే, వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లడ్లైట్లను ప్రారంభిస్తారు. ♦ ఆ తర్వాత ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని, నవీకరించిన అంబేద్కర్ సర్కిల్, వై.జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ ప్రారంభిస్తారు. ♦అంతేకాక.. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఎస్టేట్లోని గెస్ట్హౌస్లో రాత్రికి బసచేస్తారు. ♦ఇక 24న ఇడుపులపాయ గెస్ట్హౌస్ నుంచి బయల్దేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం.. మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్కులో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడి గెస్ట్హౌస్లో బసచేస్తారు. ♦ 25వ తేదీ ఉదయం ఇడుపులపాయ గెస్ట్హౌస్ నుంచి బయల్దేరి పులివెందుల చేరుకుంటారు, అక్కడ సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు, మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. -
కాఫీ.. రైతులు హ్యాపీ
(చింతపల్లి నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు) : దేశంలోనే గర్వించదగ్గ స్థాయిలో నిర్మించిన ఏఎస్ఆర్ జిల్లా చింతపల్లిలోని కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్ లాభాల పంట పండిస్తోంది. కాఫీ రైతులకు మద్దతు ధర దక్కేలా చేయడంతోపాటు అంతకు మించి బోనస్ రూపంలో ఆదాయాన్ని రుచి చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2020లో రూ.4.56 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్గా దీనిని నిర్మించింది. 3 ఎకరాల విస్తీర్ణంలో ఎకో పల్పింగ్ యూనిట్ను నెలకొల్పింది. దీనికి అనుబంధంగా మరో రెండు ఎకరాల్లో రూ.1.68 కోట్లతో వెయ్యి మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో గోడౌన్లు నిర్మించింది. ప్రాసెస్ అయిన పార్చ్మెంట్ కాఫీ గింజల్ని త్వరగా ఆరబెట్టుకునేలా గతేడాది మరో రూ.45 లక్షలతో రోటరీ డ్రయ్యర్ను ఐటీడీఏ ఏర్పాటు చేసింది. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పల్పింగ్ యూనిట్ నిర్వహించేలా ఎకో ఫ్రెండ్లీగా నిర్మించడం విశేషం. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ), గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నేతృత్వంలో ఏజెన్సీలోని 11 మండలాలకు చెందిన కాఫీ పండ్ల (ఫ్రూట్స్)ను సేకరిస్తున్నారు. ఏటా అపెక్స్ కమిటీ నిర్ణయించిన మద్దతు ధరకు కాఫీ పండ్లను సేకరించడంతో బయటి డీలర్లు సైతం అంతకు మించిన ధర చెల్లించి కొనుగోలు చేసేలా పోటీ మార్కెట్ను ఏర్పాటు చేశారు. కాగా, చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్ సేకరించిన కాఫీ పండ్లను ప్రాసెస్ చేసి (కాయలపై తొక్క తొలగించి) పార్చ్మెంట్ (కాఫీ గింజలు)గా చేస్తారు. ఇక్కడ ప్రాసెస్ చేసిన పార్చ్మెంట్ కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో వాటిని విక్రయించి లాభాల పంట పండిస్తున్నారు. మరో రెండు యూనిట్లు చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్ మంచి ఫలితాలు సాధించడంతో ప్రభుత్వం మరో రెండు ఎకో పల్పింగ్ యూనిట్లు నిర్మిస్తోంది. జి.మాడుగుల, జీకే వీధిలో రూ.7 కోట్ల 70 లక్షల 32 వేలతో వీటిని నెలకొల్పుతోంది. గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఈ రెండు యూనిట్లు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 మెట్రిక్ టన్నుల కాఫీ గింజల ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగిన యంత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. 2024 సీజన్ నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేలా కార్యాచరణ చేపట్టారు. – ఎన్.అశోక్, అసిస్టెంట్ డైరెక్టర్, పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్ట్ లాభాలు సాధిస్తోంది దళారుల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా గిరిజన రైతుల ఉన్నతికి ప్రాధాన్యత ఇస్తోంది. గిరిజన సంక్షేమ, ఐటీడీఏ, ఏపీ ట్రైకార్ అధికారుల పర్యవేక్షణలో చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్ను లాభాల బాటలో నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం సహకార సంఘంలో 1,500 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. మరో వెయ్యి మందిని చేర్చుకునేందుకు కార్యాచరణ చేపట్టాం. రైతులకు మద్దతు ధర అందించడంతోపాటు ఈ ప్రాంత గిరిజనులకు రోజువారీ పనులు కల్పించి ఉపాధి చూపిస్తున్నాం. పల్పింగ్ యూనిట్లో పార్చ్మెంట్ కాఫీ ప్రాసెస్కు రోజుకు కనీసం వంద మందికి పైగా పనిచేస్తారు. పగటిపూట మహిళలకు రూ.320, మగవాళ్లకు రూ.350, రాత్రి వేళ అయితే రూ.450 చొప్పున వేతనం చెల్లిస్తున్నాం. – సెగ్గే కొండలరావు, అధ్యక్షుడు, విశాఖ ఏజెన్సీ గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం గిరిజన రైతులకు ఏటా బోనస్ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్గా ఏర్పాటు చేసిన చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్ లాభాలు సాధించడంతోపాటు కాఫీ రైతులకు ఏటా బోనస్ అందిస్తోంది. కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్ హామీతో చింతపల్లి యూనిట్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైబల్ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ సంస్థ రూ.1.56 కోట్ల రుణం ఇచ్చింది. రుణ మొత్తాన్ని గత ఏడాది చెల్లించాం. రూ.2 కోట్లు లాభాలు సాధించాం. ప్లాంట్ నిర్వహణ వ్యయం పోగా మిగిలిన సొమ్ముతో కాఫీ ఫ్రూట్ సేకరణ చేపట్టాం. – పీవీవీ సత్యనారాయణ, ఇన్చార్జ్, చింతపల్లి కాఫీ పల్పింగ్ యూనిట్ -
వైఎస్సార్ జిల్లా కమలాపురం : సామాజిక స్ఫూర్తి..పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
-
సామాజిక జైత్ర యాత్ర.. హోరెత్తిన చెన్నూరు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కమలాపురం నియోజకవర్గం చెన్నూరులో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, యువనేత నరేన్ రామాంజులరెడ్డిల అధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రులు ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా, మేరుగ నాగార్జున, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ హాజరయ్యారు. నమ్మి ఓటు వేసిందుకు సీఎం జగన్ ప్రభుత్వం సామాజిక సాధికారితకు కృషి చేసిందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సీఎం జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు టీడీపీ నేతలు పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్య వద్దన్నారు.. కానీ సీఎం ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకువచ్చారన్నారు. ‘‘నేను దళితుడిని.. నేను మంత్రినయ్యా. కడప నుంచి ఓ మైనార్టీని డిప్యూటీ సీఎంను చేశారు. కులం, మతం చూడకుండా అందరిని సీఎం జగన్ అభివృద్ది చేశారు. చంద్రబాబు మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టారు. కులాలను విడగొడితే వైఎస్సార్సీపీ ఓడిపొతుందని చంద్రబాబు అనుకుంటున్నారు’’ అని మంత్రి ఆదిమూలపు దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రజలు మళ్లీ బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ కల్యాణ్ తెలంగాణలో నోటాతో పోటీ పడ్డారు. తెలుగు ప్రజలు బాబును, పవన్ కళ్యాణ్ను నమ్మడం లేదని ఆదిమూలపు అన్నారు. చంద్రబాబును నమ్మొద్దు దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు. అదే సీఎం జగన్ మాత్రం అందరిని అక్కున చేర్చుకున్నారు. చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై అధిక దాడులు జరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చాలా తగ్గుముఖం పట్టాయి. ఎట్టి పరిస్దితుల్లో చంద్రబాబును నమ్మొద్దు -మంత్రి మేరుగ నాగార్జున -
నేడు వైఎస్సార్ జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్ర
-
కొప్పర్తిలో మరో ‘టెక్నాలజీ’ పార్కు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను చేయిపట్టి నడిపించేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకేసింది. ఎంఎస్ఎంఈలకు అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేలా కొత్తగా మరో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. విశాఖలోని టెక్నాలజీ సెంటర్ లాగానే వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో మరో టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటుకానుంది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ ఆమోదం తెలిపిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ సీహెచ్ రాజేశ్వరరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్లో కేంద్ర ప్రతినిధులు పరిశీలించిన సుమారు 19.5 ఎకరాల భూమిని కేటాయించాలి్సందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి కేంద్ర అదనపు కార్యదర్శి రజనీష్ లేఖ రాశారు. విశాఖలో తయారీ రంగానికి సంబంధించిన పరిశ్రమలు అధికంగా ఉండటంతో జనరల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేశారని, అదే తరహాలో కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఉండటంతో ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు అనుగుణంగా టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ టెక్నాలజీ సెంటర్ను వినియోగించుకునేలా సంబంధిత పరిశ్రమలతో ముందస్తుగా ఒప్పందాలు కుదుర్చుకుంటారు. దీనికి సంబంధించి త్వరలోనే అధ్యయనం చేసి ఏ విభాగానికి చెందిన టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలన్నదానిపై కేంద్రానికి ప్రతిపాదనలను పంపనున్నారు. ఈ టెక్నాలజీ సెంటర్లో అధునాతనమైన ల్యాబ్లతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేలా దీర్ఘకాలిక, మధ్య కాలిక, స్వల్ప కాలిక కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్థానిక యూనిట్లలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. -
కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడపలో పర్యటించారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మజార్లకు చాదర్ సమర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా ఆయన నంద్యాల జిల్లాలో పర్యటించారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక సూఫీ పుణ్యక్షేత్రం కడప అమీన్పీర్ (పెద్ద) దర్గా ఉరుసు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగోరోజు బుధవారం దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆధ్వర్యంలో దర్గా ప్రాంగణంలో శిష్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాత్రి ముషాయిరా హాలులో ప్రముఖ గాయకులతో ఖవ్వాలీ కచేరీ నిర్వహించారు. గాయకులు ఒకరినొకరు పోటీలు పడి మహా ప్రవక్త గుణగణాల గురించి గానం చేస్తుండగా భక్తులు తన్మయులై ఆలకించారు. దర్గా ప్రాంగణం రంగురంగుల విద్యుద్దీపాలతో మెరిసిపోతోంది. స్థానికులే కాకుండా బయటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చదవండి: అవుకు రెండో టన్నెల్ను ప్రారంభించిన సీఎం జగన్ -
రేపు నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
రేపు నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలో నిర్మించిన అవుకు రెండో టన్నెల్ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి అవుకు రెండో టన్నెల్ వద్దకు చేరుకుని నీటిని విడుదల చేసి.. ఆ టన్నెల్ను జాతికి అంకితం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన అనంతరం పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారు. సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటారు. -
మైదుకూరులో సాధికార మహోత్సవం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా మైదుకూరులో సోమవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఓ మహోత్సవంలా సాగింది. వేలాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు పాదయాత్రగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి వీధివీధిలో ప్రజలు ఘనస్వాగతం పలికారు. బాణాసంచా, డప్పు వాయిద్యాల నడుమ యాత్ర పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలికి చేరుకుంది. అక్కడ అశేష జనవాహిని మధ్య బహిరంగ సభ జరిగింది. సభలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో సీఎం జగన్ సంక్షేమ పాలనను వివరించారు. సీఎం జగన్ పేరు విన్న ప్రతిసారీ ప్రజలు పెద్దపెట్టున జై జగన్ అని నినాదాలు చేస్తూ సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. సామాజిక సాధికారత నినాదం కాదు మా విధానం: ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో సామాజిక సాధికారత ఓ నినాదంగానే మిగిలిపోయిందని, ఆ కలను సాకారం చేసి బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి బాటలు వేస్తున్న తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్బాషా చెప్పారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికారతలను విధానంగా మార్చుకుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకొని, కేబినెట్ సహా అన్ని పదవుల్లో అధికభాగం ఇచ్చి, రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల్లోనూ అత్యధిక భాగం ఈ వర్గాలకే ఇస్తూ ఆర్థికంగా బలం చేకూరుస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకీ మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని, సీఎం జగన్ మంత్రి పదవితోపాటు నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా, మరో నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయని, నదులు, రిజర్వాయర్లు, చెరువులు జలకళను సంతరించుకున్నాయని తెలిపారు. ఇటీవల జిల్లాలో చంద్రబాబు, లోకేశ్ అడుగు పెట్టగానే కరువు మొదలైందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్కు బహుజనులు అండగా నిలవాలి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీఎం వైఎస్ జగన్ పాలనలో సామాజిక న్యాయం దక్కుతోందని, ఆకలితో ఉన్నవాడు రాజ్యమేలాలని ఆయన సంకల్పించారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. చంద్రబాబు ఎస్సీలను కించపరుస్తూ మాట్లాడితే, అదే ఎస్సీలు తలెత్తుకొని బ్రతకాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే అగ్రవర్ణాల పిల్లల్లానే పేదల పిల్లలూ ఉన్నత స్థితికి ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని తెలిపారు. పేదలంతా చదువుకోవాలని కాంక్షిస్తూ అమ్మ ఒడి పథకం తెచ్చారన్నారు. పేదల కోసం పెత్తందారులతో పోరాడుతున్న జగన్ : మంత్రి విడదల రజిని సీఎం పేదల కోసం పెత్తందారులతో పోరాడుతున్నారని రాష్ట్ర మంత్రి విడదల రజిని అన్నారు. రాష్ట్రానికి గొప్ప నాయకత్వాన్ని అందించిన జిల్లాగా కడపలో ప్రతి గడప గర్వపడేలా వైఎస్ జగన్ పాలన సాగుతోందన్నారు. 25 మంది మంత్రుల్లో 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీలు ఉండడం సామాజిక సాధికారతకు నిదర్శనమన్నారు. బీసీల తోలు తీస్తా, తోకలు కత్తిరిస్తా అన్న చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో ఆయన తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రణ నినాదం మోగుతోంది : ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్రావు సీఎం జగన్ ఏపీలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నారని ప్రభుత్వ సలహాదారు (సాంఘిక సంక్షేమం) జూపూడి ప్రభాకర్రావు చెప్పారు. స్వార్థం లేకుండా పేదల తరపున సీఎం జగన్ యుద్ధం చేస్తున్నారన్నారు. పేదలకు భూములందించాలని అంబేడ్కర్ సంకల్పిస్తే, సీఎం జగన్ ఆచరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్యాదవ్ ప్రసంగించారు. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, తాడేపల్లి: ఏపీ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. సామాజిక సాధికార యాత్ర నేడు 17వ రోజుకు చేరుకుంది. ఈరోజు బస్సుయాత్ర ఎలమంచిలి, నరసరావుపేట, మైదుకూరు నియోజకవర్గాలలో జరుగనుంది. బస్సుయాత్ర వివరాలు ఇవే.. ►అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►మధ్యాహ్నం 12:30 గంటలకు ఎలమంచిలిలో వైఎస్సార్సీపీ నాయకుల మీడియా సమావేశం ►మధ్యాహ్నం 2:30 గంటలకు వైఎస్సార్ విగ్రహం నుంచి అచ్యుతాపురం పోలీస్ గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ ►మధ్యాహ్నం 3:30 గంటలకు అచ్యుతాపురం పోలీస్ గ్రౌండ్లో బహిరంగ సభ ►సభకు హాజరుకానున్న మంత్రులు ధర్మాన ప్రసాద్, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ, రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, తదితరులు పల్నాడులో ఇలా.. ►పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►మధ్యాహ్నం 2:15గంటలకు A1 కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►మధ్యాహ్నం 3:15 గంటలకి పాదయాత్ర ప్రారంభం ►మల్లమ్మ సెంటర్, శివుని బొమ్మ సెంటర్ మీదుగా పల్నాడు బస్టాండు వరకు పాదయాత్ర ►సాయంత్రం 5:15 గంటలకి పల్నాడు బస్టాండు సెంటర్లో బహిరంగ సభ వైఎస్సార్ జిల్లాలో ఇలా.. ►వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►మధ్యాహ్నం 2:30 గంటలకు కేఎస్సీ కళ్యాణమండపంలో వైఎస్సార్సీపీ నేతల విలేకర్ల సమావేశం ►మధ్యాహ్నం 3 గంటలకు కేసీ కెనాల్ మీదుగా కార్ల ర్యాలీ ►మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రొద్దుటూరు రోడ్లో బహిరంగ సభ -
తుది దశకు ‘వెలిగొండ’
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు సిద్ధమైంది. ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారు. ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేయించిన సీఎం జగన్.. రెండో సొరంగంలో శనివారం సాయంత్రానికి 18.465 కి.మీ.ల పొడవున తవ్వకం పనులు పూర్తి చేయించారు. మరో 335 మీటర్ల పనులే మిగిలాయి. రోజుకు 8 మీటర్ల చొప్పున పనులు చేయిస్తున్నామని.. డిసెంబర్లోగా పూర్తవుతాయని సీఈ మురళీనాథ్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. వెలిగొండ రెండు సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్కు తరలించనున్నారు. ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం జగన్ చిత్తశుద్ధితో అడుగులేస్తున్నారు. వైఎస్సార్ హయాంలో పనుల వరద శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులు తరలించి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్లో నిల్వ చేసి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4.37,300(తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తి తీర్చాలన్న లక్ష్యంతో వైఎస్సార్ 2004, అక్టోబర్ 27న దీనికి శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చు చేసి.. నల్లమలసాగర్తో పాటు సొరంగాల్లో సింహభాగం పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్ను అనుసంధానం చేసేలా 23 కి.మీ. పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ చానల్ పనులు చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులు చేపట్టారు. ఖజానాను లూటీ చేసిన చంద్రబాబు ఎన్టీఆర్కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండం నుంచి గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే.. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్ల కోసమే ఖర్చు చేశారు. విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకూ రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఎలాంటి ప్రగతి కనిపించకపోవడమే చంద్రబాబు దోపిడీకి నిదర్శనం. జీవో–22(ధరల సర్దుబాటు), జీవో 63(çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.650 కోట్లకు పైగా దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి.. టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లు ఇచ్చి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. 2018, 2019 నాటికి పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిస్తూ వచ్చిన చంద్రబాబు.. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి, వాటిని అధిక ధరలకు సీఎం రమేష్కు కట్టబెట్టి.. కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికొదిలేశారు. శరవేగంగా పూర్తి చేయించిన సీఎం జగన్ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చిత్తశుద్ధితో అడుగులేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో దాదాపు రెండేళ్లు కరోనాతో పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే, మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీ. పనులను 2019, నవంబర్లో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులనూ అదే ఏడాది పూర్తి చేయించారు. రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వాటిని రద్దు చేసిన సీఎం జగన్.. వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించి టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్ల తక్కువకు పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ సొరంగం పనులు అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందుంచారు. రెండో సొరంగంలో టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడమే కష్టంగా మారింది. దీంతో గతేడాది మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ., 16.555 కి.మీ., 14.5 కి.మీ., 13.5 కి.మీ., 12.5 కి.మీ. వద్ద సొరంగాలు తవ్వి.. అక్కడ మనుషులతో పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే 7.363 కి.మీ. పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా పూర్తి చేయించింది. మిగిలిన 335 మీటర్ల పనులు డిసెంబర్లోగా పూర్తికానున్నాయి. ప్రాజెక్టు పనులకు ఇప్పటిదాకా రూ.700 కోట్లకు పైగా వ్యయం చేసి.. ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తి చేసేలా అధికారులకు సీఎం జగన్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. -
నేడు వైఎస్ఆర్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన