పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే పైచేయి | warangal by poll counting: congress get 4postal ballot votes | Sakshi
Sakshi News home page

పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే పైచేయి

Published Tue, Nov 24 2015 8:22 AM | Last Updated on Tue, Sep 18 2018 8:23 PM

పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే పైచేయి - Sakshi

పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే పైచేయి

వరంగల్: పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. వరంగల్ లోక్‌ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా కేవలం 4 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నాలుగు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడడం గమనార్హం. మొత్తం 500 మందికి పోస్టల్ బ్యాలెట్స్ పంపించారు.

మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి ఫలితం వచ్చే అవకాశముంది. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement