ఏసీబీ వలలో ఎక్సైజ్ ఎస్ఐ, కానిస్టేబుళ్లు
Published Mon, Dec 28 2015 10:58 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM
శ్రీకాకుళం: వ్యాపారుల నుంచి లంచం తీసుకుంటుండగా శ్రీకాకుళం జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని మాటువేసి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పలు మద్యం షాపుల నుంచి నగదు వసూలు చేసుకుని వస్తున్న ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.85 వేల నగదు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement