తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించడానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి గంట, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, కాలినడక భక్తులకు ఒక గంట సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 38,442 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.