ప్రత్యూషపై ఆస్తి కోసమే దాడి జరిగిందా? | hearing on pratysha case today | Sakshi
Sakshi News home page

ప్రత్యూషపై ఆస్తి కోసమే దాడి జరిగిందా?

Published Mon, Jul 13 2015 2:18 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

hearing on pratysha case today

హైదరాబాద్: నగరంలోని నాగోల్ లో కన్నతండ్రి, పినతల్లి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రత్యూష కేసును సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రత్యూష మానసిక, శారీరక స్థితిపై నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఆస్తుల కోసమే ప్రత్యూషపై దాడి జరిగిందా అని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. కేసుపై తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

సవతితల్లి పైశాచికత్వానికి తీవ్రగాయాలపాలైన ప్రత్యూష ప్రస్తుతం సాగర్ హైవేలోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ కేసులో పోలీసులు చాముండేశ్వరిని అరెస్టు చేయగా, ప్రత్యూష తండ్రి రమేష్ ఇంకా పరారీలో ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement