pratyusha
-
ఐపీఎస్కు ఎంపికైన ఏలూరు ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన గణేశ్న భాను శ్రీలక్ష్మి అన్నపూర్ణ ప్రత్యూష ఐపీఎస్కు ఎంపికయ్యారు. ప్రత్యూష గత ఏప్రిల్లో విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 198 ర్యాంకు సాధించగా.. తాజాగా ఐపీఎస్ శిక్షణకు రావాలంటూ ఉత్తర్వులు అందాయి. గతంలో గ్రూప్–1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఐపీఎస్కు ఎంపికవడంతో ఆగస్టు 26 నుంచి ముస్సోరీలో జరగనున్న శిక్షణకు హాజరుకావాల్సి ఉంది. సిసలికి చెందిన గణేశ్న వెంకట రామాంజనేయులు, ఉషా దంపతుల కుమార్తె ప్రత్యూష మొదట నుంచి చదువుపై ఆసక్తితో ఉన్నత శిఖరాలు అందుకోవాలని కష్టపడి చదివింది. ఏడాది ఆగస్టులో విడుదలైన గ్రూప్–1 పరీక్షా ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. అనంతరం ఏలూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్గా ట్రైనింగ్లో ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. -
బయట కాపుకాసి.. కాళ్లు, చేతులు కట్టేసి..
సంచలనం సృష్టించిన పిల్లల విక్రయం కేసు వెనుక ముగ్గురు ధీర వనితల పోరాటం దాగి ఉంది. అక్షర జ్యోతి ఫౌండేషన్ను నిర్వహించే అక్కాచెల్లెళ్లు ధైర్య సాహసాలతో ఈ మానవ అక్రమ రవాణా బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. పీర్జాదిగూడలో ఆర్ఎంపీ శోభారాణితో పాటు స్వప్న, షేక్ సలీంలను పట్టుకున్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన తీరును అక్కాచెల్లెళ్లు అనూష, శ్రీవైష్ణవి, ప్రత్యూషలు ‘సాక్షి’తో పంచుకున్నారు. మహిళ ఇచ్చిన సమాచారంతో.. అక్షర జ్యోతి ఫౌండేషన్ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ మహిళ అనూషను సంప్రదించింది. తనకు పిల్లల్లేరని, శోభారాణి పిల్లలను విక్రయిస్తున్నట్టుగా తెలిసిందని, ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ శోభారాణి ఫోన్ నంబర్ ఇచ్చింది. షాక్కు గురైన అక్కాచెల్లెళ్లు శోభారాణి కార్యకలాపాలపై స్టింగ్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరికి యూట్యూబ్ చానల్ విలేకరి సాయికుమార్ సహకరించారు. సీక్రెట్ కెమెరాలతో క్లినిక్లోకి..: ఈనెల 21న శ్రీవైష్ణవి పిల్లల్లేని తల్లిగా నటిస్తూ తనకో బిడ్డ కావాలని శోభారాణిని కలిసింది. దీంతో ఆమె వాట్సాప్లో అబ్బాయి, అమ్మాయి ఫొటోలను పంపించింది. బాబును కొనేందుకంటూ రూ.4.50 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్గా కొంత మొత్తాన్ని చెల్లించారు. ఆ మరుసటి రోజు ఉదయమే పీర్జాదిగూడలోని క్లినిక్కు వచ్చి బాబును తీసుకెళ్లాలని శోభ సూచించింది.దీంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, సాయికుమార్తో శివ, శ్రీనివాస్ అనేవారు బృందంగా ఏర్పడి, సీక్రెట్ కెమెరాలను ధరించి క్లినిక్ లోపలికి వెళ్లారు. ఒకవేళ నిందితులు అనుమానంతో తమపై దాడి చేసినా, పారిపోయేందుకు ప్రయత్నించినా పట్టుకునేందుకు వీలుగా క్లినిక్కు వెళ్లే రెండు మార్గాలలో మరో 10 మందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. క్లినిక్ లోపల నిందితులు శోభారాణి, స్వప్నలతో జరిగే సంభాషణలు, వారి కదలికలను ఎప్పటికప్పుడు బయట ఉన్న బృందానికి వాట్సాప్ మెసేజ్లలో చేరవేస్తూ ఏమాత్రం తేడా వచి్చనా వారు సహాయపడేలా రంగం సిద్ధం చేసుకున్నారు. ఆల్టో కారులో బాబును తెచ్చి.. వారు క్లినిక్లోకి వెళ్లిన అరగంటలో మరో నిందితుడు షేక్ సలీం తెలుపు రంగు ఆల్టో కారులో బాబును తీసుకొచ్చాడు. క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే భవనం యజమాని ఇంట్లోకి వెళ్లాడు. కాసేపటి తర్వాత శోభరాణి వెళ్లి బాబును తీసుకుని క్లినిక్ లోపలికి వచ్చింది. రెండు నకిలీ ఆధార్ కార్డులను ఇస్తూ వీళ్లే బాబు తల్లిదండ్రులు అని చెప్పింది. ఇంకో రూ.20 వేలు అదనంగా ఇస్తే బాబు బర్త్ సరి్టఫికెట్ కూడా ఇస్తానని, దీంతో మీరే సొంత తల్లి అయిపోతారని శ్రీవైష్ణవికి శోభ సూచించింది. ఒప్పందం మేరకు మిగతా డబ్బును అందించాలని కోరింది. దీంతో బయటికెళ్లి తీసుకొస్తానని శ్రీవైష్ణవి తలుపులు తెరవడంతో అప్పటికే బయట ఉన్న వారిని చూసిన శోభ, ఇతర నిందితులు ఇదంతా ట్రాప్ అని గ్రహించారు. చున్నీతో కాళ్లు, చేతులు కట్టేసి.. శోభారాణి, స్వప్న, సలీంలు క్లినిక్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ బయట ఉన్న బృందం కాపు కాస్తుండటంతో వారికి చాన్స్ లేకుండా పోయింది. సలీం గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా.. ప్రత్యూష బలంగా అతన్ని పట్టుకొని, చున్నీతో అతని కాళ్లు, చేతులు కట్టేసింది. అతన్ని పక్కన ఉన్న పిల్లర్కు కట్టిపడేసింది. ఇదంతా స్టింగ్ ఆపరేషన్ తెలిసిపోవడంతో శోభారాణి ఏడుపు మొదలుపెట్టింది.పోలీసులకు ఫోన్ చేయవద్దని సెటిల్మెంట్ చేసుకుందామంటూ ఆఫర్ ఇచ్చింది. ఈలోగా డయల్ 100కు ఫోన్ చేయడంతో మేడిపల్లి పోలీసులు వచ్చారు. నిందితులను ఠాణాకు తరలించి, బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులకు అప్పగించారు. నిందితులను పోలీసులు విచారించగా.. ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యల నుంచి పసికందులను కొనుగోలు చేసి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న అంశం వెలుగులోకి వచ్చింది. లింగ నిర్ధారణ, గర్భస్రావాలు కూడా.. శోభారాణి 20 ఏళ్లుగా పీర్జాదిగూడలో ఫస్ట్ ఎయిర్ సెంటర్ పేరుతో క్లినిక్ను నిర్వహిస్తోంది. ఇందులో ముందు గదిలో క్లినిక్ ఉండగా.. వెనుక గది అంతా చీకటిగా ఉంది. ఇందులో శస్త్ర చికిత్సల కత్తెర్లు, క్లాంప్స్, బోన్ కట్టర్స్, సూదులు వంటి సర్జికల్ పరికరాలున్నాయి. డస్ట్ బిన్లో కనిపించకుండా దాచిపెట్టారు. శోభారాణి అక్రమంగా గర్భస్రావాలు, లింగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు అక్షర ఫౌండేషన్ విచారణలో తేలింది. (ఆడెపు శ్రీనాథ్) -
మార్ఫింగ్ ఫొటోలతో అత్యాచార బెదిరింపులు: నటి
బెంగాలీ బుల్లితెర నటి ప్రత్యూష పాల్కు సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. తనను అత్యాచారం చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. గత కొంతకాలంగా ఈ వేధింపులు తీవ్రతరం కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కోల్కతా సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గురించి ప్రత్యూష మాట్లాడుతూ.. "గతేడాది జూలై నుంచి ఈ వేధింపులు మొదలయ్యాయి. ఒక అనామక అకౌంట్ నుంచి నాకు అదే పనిగా అసభ్య సందేశాలు వచ్చాయి. అయితే ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదని మొదట్లో లైట్ తీసుకున్నా. కానీ రానురానూ ఆ ఖాతా నుంచి మితిమీరిన మెసేజ్లు వచ్చాయి. నాపై అత్యాచారం చేస్తానంటూ ఏకంగా నా మార్ఫింగ్ ఫొటోలు పంపాడు. అతడిని 30 సార్లు బ్లాక్ చేశాను. కానీ ఎప్పటిలాగే ఇన్స్టాగ్రామ్లో మరో కొత్త అకౌంట్ తెరిచి మళ్లీ ఇలా నీచమైన బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నాడు. దీంతో ఈసారి పోలీసులను ఆశ్రయించాను" అని నటి చెప్పుకొచ్చింది. -
28న సీఎం దత్త పుత్రిక ప్రత్యూష వివాహం
సాక్షి, రంగారెడ్డి (కేశంపేట): ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం ఈ నెల 28న రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామం లూర్దు మాత దేవాలయంలో జరగనుంది. ఉడుముల జైన్ మేరీ, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్రెడ్డితో ప్రత్యూష వివాహం జరగనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పినతల్లి చేతుల్లో వేధింపులకు గురై వార్తల్లో నిలిచిన ప్రత్యూషను కేసీఆర్ గతంలో దత్తత తీసుకున్నారు. -
ప్రత్యూష అంత పిరికిది కాదు: కిషన్రావు
సాక్షి, హైదరాబాద్ : తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అల్వాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ వివాహిత ప్రత్యుష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన అల్లుడు శశికాంత్రావే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం కూకట్పల్లికి చెందిన కిషన్రావు కుమార్తె ప్రత్యుషకు అల్వాల్ న్యూ రెడ్డి ఎన్క్లేవ్కు చెందిన శశికాంత్రావు అలియాస్ రాముతో 2013లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.20 లక్షల నగదు, కిలో బంగారం కట్న కానుకలుగా ఇచ్చారు. వీరికి ఓ కుమార్తె. రెండేళ్ల క్రితం శశికాంత్ అదనపు కట్నం కోసం వేధించడంతో కిషన్రావు స్థలాన్ని అమ్మి రూ.50 లక్షలు ముట్టచెప్పాడు. అయితే మళ్లీ కొద్దిరోజులుగా భర్త నుంచి వేధింపులు అధికం కావడంతో ప్రత్యుష బుధవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తన కుమార్తెది హత్యేనని, ఆత్మహత్య కాదని చెబుతున్నారు. ఆరేళ్ల నుంచి తన కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. శశికాంత్రావు గతంలో బినామీలు పేరుతో భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని, ఎక్స్ సర్వీస్మెన్ కృష్ణారెడ్డి భూమిని లాక్కొని బెదిరింపులకు పాల్పడ్డాడని కిషన్రావు తెలిపాడు. ప్రత్యుష అనుమానాస్పద మృతితో పాటు, శశికాంత్రావు కబ్జాలపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
శభాష్ ప్రత్యూష
గాజువాకకు చెందిన మహంతి చంద్ర ప్రత్యూష క్రియేటివ్ రైటింగ్, టాలెంట్ టెస్ట్ తదితర పోటీలలో ఇప్పటి వరకు స్కూల్, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పదేళ్లుగా 138 బహుమతులు సాధించింది. ఇందులో ఇండియా బుక్, ఆసియా బుక్, లిమ్కా బుక్ తదితర స్థాయి బహుమతులు, అవార్డులు ఉన్నాయి. ఈ సందర్భంగా తన విజయాలకు చెందినా ఆల్బమ్తో శనివారం దర్జీపేటలో ప్రత్యూష తన తండ్రి చంద్రశేఖర్తో కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన బహుమతులను చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసి మరింతగా రాణించాలని అభినందించారు. -
ఆడపిల్లల్ని కాపాడుకోండి: నటి ప్రత్యూష తల్లి
సమ్మర్ వెకేషన్ పూర్తయింది... పిల్లలు కొంచెం పెద్దయ్యారు.కొంచెమే పెద్దయ్యి ఉంటారు... కానీ చాలా పెద్దయ్యామని అనుకుంటుంటారు.కొత్త పుస్తకాలు... కొత్త కాలేజీలు... కొత్త స్నేహాలు... కొత్త దుస్తులు.. స్కూలు వదిలిన మొగ్గలు కాలేజ్లో విచ్చుకునే టైమ్ ఇది.‘కొత్త’ ప్రపంచం వాళ్లను ఎటు నడిపిస్తుందో? అమ్మాయిల అమ్మానాన్నలకు రోజూ ఆందోళనలే. ఆ ప్రపంచంలో ప్రమాదాలు ఎలా ఉంటాయో పిల్లలకు చెప్తే.. జాగ్రత్త పడటం ఎలాగో వాళ్లకే అర్థమవుతుంది. ప్రమాదాన్ని అడ్డుకోవడమూ తెలిసి వస్తుంది. సినీ నటి ప్రత్యూష తల్లి సరోజినీదేవి అదే మాట చెప్తోంది.‘తెలుసుకోండి... ఆడపిల్లలను కాపాడుకోండి’ జాబిల్లి కాంతులను నట్టింట్లో పూయించిన ఓ చందమామ, వెండి తెరమీద నవ్వుల్ని పండించింది. టెలివిజన్ కాంటెస్ట్లో లవ్లీ స్మైల్ అవార్డు అందుకున్న ఈ స్మైలీ... తల్లికి మాత్రం అందని చందమామే అయింది. ఆ నవ్వుల కిరీటాన్ని మరో ఏడాది మరో అమ్మాయి అందుకునే ఉంటుంది. వెండితెర మీద మరో తార నవ్వుల్ని రువ్వే ఉంటుంది. ఇవేవీ బిడ్డను పోగొట్టుకుని కడుపుకోత అనుభవిస్తున్న ఆ కన్నతల్లి శోకాన్ని తీర్చలేవు. సరోజినీదేవికి కూతురు దూరమై పదహారేళ్లు దాటింది. ‘న్యాయం కోసం పోరాటం చేస్తున్నా, డబ్బు, అధికారం లేని సామాన్య మహిళను, కేవలం తల్లిని. నా పోరాటంలో తీర్పు రావడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో’ అంటోందామె నిర్వేదంగా. ‘‘మాది భువనగిరి. అత్యంత సామాన్యమైన కుటుంబం. లవ్మ్యారేజ్ కావడంతో మాకు అత్తింటి నుంచి ఆస్తులు, పుట్టింటి నుంచి కానుకలు ఏమీ రాలేదు. మా వారు (లక్ష్మీ నారాయణ) సిండికేట్ బ్యాంకు ఉద్యోగి, నేను స్కూల్ టీచర్ని. ఇద్దరికీ ఉద్యోగాలున్నాయి చాలు... అనుకున్నాం. మేమిద్దరం, మాకిద్దరు. పిల్లలే లోకం అన్నట్లు జీవించాం. పింకీ (ప్రత్యూష) సిక్త్స్ క్లాసుకొచ్చేటప్పటికి మా వారికి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయింది. తార్నాకలో ఉంటూ నేను బొమ్మలరామారంలో స్కూలుకి వెళ్లేదాన్ని. మా చిన్న ప్రపంచంలో తొలి ఉపద్రవం మా వారికి హార్ట్ఎటాక్ రూపంలో వచ్చింది. లైఫ్ క్రాస్రోడ్స్లో నిలబెట్టింది నన్ను. నా ఒక్క జీతంతో పిల్లల్ని పెంచాలి. ఇప్పటిలాగ అప్పట్లో టీచర్ల జీతాలు నలభై– యాభై వేలు లేవు. ఆయన పోయేనాటికి నా జీతం ఆరు వేల డెబ్భయ్ ఐదురూపాయలు. ఇన్సూరెన్స్ డబ్బు ఆసరాతో నెట్టుకొచ్చాను. నవ్వుల కిరీటం ఉదయం ఏడింటికి ఇంట్లో బయలుదేరితే తిరిగి వచ్చేటప్పటికి రాత్రి తొమ్మిదయ్యేది. ఆ కండిషన్లో ప్రత్యూషని ఇంటర్కి ఎస్ఆర్ నగర్లో హాస్టల్లో చేర్చాను. ఆ నిర్ణయమే నా బిడ్డ జీవితాన్ని కాల రాస్తుందని అప్పుడు ఏ మాత్రం ఊహించలేదు. ప్రత్యూషకి క్లాస్మేట్ సిద్ధార్థ. ఇంటర్ పూర్తయ్యేలోపు చాలా మార్పులు వచ్చేశాయి. జెమినీ కాంటెస్ట్కి నాకు తెలియకుండానే ఫొటో పంపించింది ప్రత్యూష. పంపించాక చెప్పింది. ఇక చేసేదేముంటుంది? ఆ తర్వాత వారానికి ‘మిస్ లవ్లీ స్మైల్’గా ఎంపికైందని ఫోన్ చేసి చెప్పింది. సిద్ధార్థతో స్నేహం బలపడింది. మరో రోజు ప్రత్యూషకి జెమినీ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్, రాయుడు సినిమాలో పాత్ర కోసం. మాకు సినిమా ఫీల్డుతో అస్సలు పరిచయమే లేదు. ఆడపిల్లను పంపించడానికి భయమేసింది. ప్రత్యూష చూపించిన ఆసక్తిని తుంచేయలేక తీసుకెళ్లాను. ఎయిర్ హోస్టెస్ కల ప్రత్యూషకి ఎయిర్ హోస్టెస్ కావాలని ఉండేది. అందుకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు తప్పనిసరి. అందుకే ఇంటర్ తర్వాత సినిమాల్లో గ్యాప్ తీసుకుని హోటల్ మేనేజ్మెంట్లో చేరింది. కాలేజ్ వెతికిపెట్టడంలో సిద్ధార్థ చాలా సాయం చేశాడు. తీరా పరీక్షల టైమ్లో భారతీరాజా నుంచి సినిమా ఆఫర్, ముందు అనుకున్న హీరోయిన్ చేయడం లేదు, వెంటనే వచ్చి షూటింగ్ చేయాలన్నారు. పరీక్షలు సెప్టెంబర్లో రాయవచ్చని ప్రత్యూషని చెన్నై తీసుకెళ్లిపోయాను. ఆ తరవాత తమిళ్లో చాలా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళంలో 22 సినిమాలు చేసింది. తొలి సినిమాకి 75 వేలు రాయుడు సినిమాకి రెమ్యూనరేషన్ అందుకున్నప్పుడు పింకీ ఆనందాన్ని చెప్పడానికి మాటలు చాలవు. ఇంటికి ఫర్నిచర్ కొన్నది. నన్ను ఒక్క రూపాయి కూడా తీయవద్దంది. సోఫా సెట్, టీవీ, టేప్రికార్డర్ తీసుకుంది. ‘నాన్న ఉండి ఉంటే ఇవన్నీ ఎప్పుడో కొనేవాడు. నాన్న లేకపోవడంతోనే కదా మనకు ఇప్పటి వరకు ఇవేవీ లేవు. నాన్న ఉంటే మన లైఫ్ ఎలా ఉండేదో అలా మార్చేస్తా మమ్మీ’ అన్నది. అప్పటి వరకు సముద్రంలో నీటిబొట్టులా ఉన్న మా కుటుంబానికి ఒక గుర్తింపు వచ్చింది పింకీతోనే. ఆర్థికంగా నిలదొక్కుకున్నదీ పింకీ వల్లనే. చివరికి తన మరణంతో అప్పటి వరకు తెలియని ప్రతి ఒక్కరి దృష్టిలోనూ పడ్డాం. ఇదంతా నాలుగేళ్లలోనే. అంతా కలలాగ జరిగిపోయింది. కల కాదని చెప్పడానికి పింకీ కొన్న వస్తువులు మా కళ్ల ముందున్నాయి. అక్క జ్ఞాపకాలమ్మా అవి, వీటిని మార్చవద్దు అన్నాడు మా అబ్బాయి. తన జ్ఞాపకాలను అలా పదిలంగా చూసుకుంటున్నాం. ఆ రోజు ఏం జరిగిందో! అది 2002, ఫిబ్రవరి 23 సాయంత్రం. తెల్లవారి బెంగళూరుకి బయలుదేరాలి. అది కన్నడ సినిమాలో తొలి అవకాశం. ఫేషియల్, వ్యాక్సింగ్ చేయించుకోవడానికి కజిన్ శిరితో కలసి బ్యూటీపార్లర్కెళ్లింది. తనకిష్టమైన కెనెటిక్ హోండా మీదనే వెళ్లారిద్దరూ. పింకీ పార్లర్లో ఉన్నప్పుడు సిద్ధార్థ వచ్చాట్ట. ఫేషియల్ పూర్తయ్యే వరకు వెయిట్ చేశాట్ట. ఆ తర్వాత సిద్ధార్థతో ఓ పదిహేను నిమిషాలు రైడ్కెళ్లి వస్తానని శిరిని వెయిట్ చేయమని చెప్పింది. సిద్ధార్థ తన కారులో తీసుకెళ్లాడు. కొంత సేపటికి నాకు ఫోన్... ‘జయం సినిమాలో హీరోయిన్గా కన్ఫర్మ్ చేసినట్లు తేజ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, జయం ఆఫీస్కెళ్లి వస్తాను’ అని చెప్పింది. అదే చివరి మాట. కానీ వాళ్లు మాత్రం జయం ఆఫీస్కు వెళ్లనే లేదు. బ్యూటీపార్లర్లో ఉన్న శిరి ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వస్తానన్నదట. ఆ తర్వాత ఫోన్ తియ్యలేదట. అప్పటి వరకు ప్రతి వివరమూ సరిగ్గా సరిపోలుతూనే ఉంది. ఆ తర్వాత అంతా మిస్టరీనే. పిరికి అమ్మాయి కాదు! రాత్రి ఏడు గంటలకు ఎవరో ఫోన్ చేసి ‘మీ అమ్మాయిని కేర్ హాస్పిటల్లో స్ట్రెచర్ మీద చూశాం’ అని చెప్పారు. నేను నమ్మనేలేదామాటని. మరో గంటలోపు కేర్ హాస్పిటల్ వాళ్లే ఫోన్ చేశారు ‘సూసైడ్ అటెంప్ట్ చేసింది’ అని. మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదు. నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. మా అబ్బాయితోపాటు హాస్పిటల్కి పరుగెత్తాను. అప్పటికే ప్రత్యూష ఐసీయూలో ఉంది. మమ్మల్ని వెళ్లనివ్వలేదు. సిద్ధార్థ బంధువులు మాత్రం లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు. వాళ్ల ఫ్రెండ్స్ కూడా ప్రత్యూష ఎలా ఉందో చెప్పలేదు. రాత్రి పదకొండు గంటలకు మమ్మల్ని లోపలికి పంపించారు, కానీ బెడ్కి ఐదడుగుల దూరంలో ఉంచి ఒక్క నిమిషానికే బయటకు పంపించేశారు. తెల్లవారి ఉదయం తొమ్మిది దాటాక ఒక డాక్టర్ వచ్చి ‘ప్రత్యూష మోషన్కెళ్లింది, డ్రస్ తెస్తే మారుస్తాం’ అన్నారు. ఎక్కడ లేని సంతోషంతో ఇంటికి వెళ్లి గంటలోపే డ్రస్తో వచ్చాం. డ్రస్ ఇచ్చిన తర్వాత పదిహేను నిమిషాలకు ‘చనిపోయింది’ అని చెప్పారు. మేము ఇచ్చిన కుర్తా మాత్రమే వేశారు, పైజామా వేయలేదు. విడిచిన దుస్తులను అడిగితే ‘రాత్రి మోషన్కెళ్లినప్పుడు తీసి డస్ట్బిన్లో వేశారు, ఉదయాన్నే అన్నీ కాల్చేస్తారు. అవి ఉండవు’ అన్నారు. మెడికో లీగల్ కేసులో ఆధారాలను అలా ఎలా కాల్చేస్తారని అడగడం కూడా నాకు తెలియదప్పుడు. పోలీసులు వచ్చారు, హిమాయత్ నగర్లో దొరికిందని ఒక పాయిజన్ డబ్బా చూపించారు. ‘ఇద్దరూ పాయిజన్ తీసుకున్నారు, మీ అమ్మాయి వీక్గా ఉండడంతో చనిపోయింది’ అన్నారు. కేర్ నుంచి నిమ్స్కి పోస్ట్మార్టమ్ నిమ్స్లో. సాయంత్రం ఐదు దాటిందని అప్పుడు పోస్ట్మార్టమ్ చేయలేదు. మర్నాడు ఉదయం పదకొండుకి అమ్మాయినిచ్చారు. గొంతు నొక్కినట్లు కమిలిన గుర్తులున్నాయి. ఒక వైపు నాలుగు, ఒక వైపు ఒక వేలి గుర్తు స్పష్టంగా తెలుస్తున్నాయి. బలవంతంగా గొంతు నొక్కి నోరు తెరిపించి పాయిజన్ పోశారని నాకనిపించింది. హాస్పిటల్ వాళ్లు మాత్రం ‘ట్రీట్మెంట్ సమయంలో పాయిజన్ వామిట్ చేయించేటప్పుడు పడిన గుర్తులవి’ అన్నారు. అది పొరపాటే! ప్రత్యూషను మా సంప్రదాయం ప్రకారం దహనం చేశాం. కానీ ఖననం చేసి ఉంటే బావుండేదని ఇప్పటికీ బాధపడుతున్నాను. రీ పోస్ట్మార్టమ్ చేస్తే నిజాలు బయటపడేవి. మా అమ్మాయి పాయిజన్ ఎందుకు తీసుకుంది... అనే ప్రశ్న నన్ను తొలిచింది తప్ప, అత్యాచారం అనే ఊహే రాలేదు నాకు. మా ఊరికి తీసుకెళ్లి దహనం అయిన తర్వాత టీవీల్లో వార్తలు చూసే వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. అప్పట్లో ఇప్పటిలా మీడియా విస్తృతంగా లేదు. ఇన్ని చానళ్లు ఉండి ఉంటే వెంటనే విషయం బయటకు పొక్కి ఉండేది. వార్తలు చూసిన వెంటనే, కర్మకాండలు కూడా జరగకముందే హైదరాబాద్ వచ్చేశాను. అప్పటి నుంచి మొదలైన నా న్యాయపోరాటం ఇంకా సాగుతూనే ఉంది. నీకే న్యాయం కావాలన్నారు! పుణ్యవతి, సంధ్య ఇంకా చాలామంది నాకు అండగా నిలిచారు. సీఎం చంద్రబాబు గారికి మెమోరాండం ఇచ్చాను. వైఎస్ఆర్ (అప్పుడు ప్రతిపక్షనాయకులు), కేసీఆర్, గీతారెడ్డి... ఇలా ఎక్కిన గడప ఎక్కకుండా ఎందరికి మొరపెట్టుకున్నానో ఆ భగవంతుడికే తెలుసు. సినీనటులు మురళీమోహన్ గారి నుంచి ఫోన్ వచ్చింది. చంద్రబాబు ఎదురుగా కూర్చోబెట్టారు నన్ను. రెండు గంటల సేపు ఆయన నన్ను ఒకే మాట ’నీకే న్యాయం కావాలి’ అని పదే పదే అడిగారు. సహాయం ఏదైనా కావాలా అన్నారు. నాకు ఉద్యోగం ఉంది, నా కొడుకును చదివించుకోవడానికి అది చాలు. నా బిడ్డ ఎలా చనిపోయింది, ఎవరు చంపేశారు, ఎందుకు చంపేశారో నాకు తెలియాలి... అనే మాట మీదనే ఉన్నాను. ఇదే మాటను అసెంబ్లీలో వైఎస్ఆర్ గారు, కేసీఆర్గారు కూడా లేవనెత్తారు. అప్పటి నుంచి నాకు ఫోన్లో బెదిరింపులు మొదలయ్యాయి. కేసు విచారించిన తర్వాత సిద్ధార్థకు ఏడేళ్లు శిక్ష పడింది. అది చాలదు లైఫ్ పడాలని నేను హైకోర్టుకెళ్లాను. అక్కడ విచారణ అనంతరం ఆ శిక్ష పెరగకపోగా రెండున్నరేళ్లకు తగ్గిపోయింది. మళ్లీ సుప్రీం కోర్టులో కేసు వేశాను. అదింకా టేబుల్ మీదకు రాలేదు. ప్రత్యూష ఓ నమ్మకం! కేసీఆర్గారు... ఇలాగే కుమిలిపోవద్దు. మోసపోయిన అమ్మాయిలు, ఆసరా కోసం ఎదురు చూసే వాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్లకు ఆలంబనగా నిలవమని చెప్పారు. చారిటీ పెట్టడానికి టోకెన్ అమౌంట్గా ఐదువందల నోటు ఇచ్చారు. ఆ డబ్బుతో ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్ చేయించాను. భువనగిరిలో పెంకుటిల్లు అద్దెకు తీసుకుని మూడు మెషీన్లతో పదిహేను మంది అమ్మాయిలకు టైలరింగ్ నేర్పించాను. స్పోకెన్ ఇంగ్లిష్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, కంప్యూటర్ ట్రైనింగ్, హ్యాండ్వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా చేర్చాను. ఈ పదహారేళ్లలో 16 వేల మంది పని నేర్చుకున్నారు. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలసి ఫ్యామిలీ కౌన్సెలింగ్ చేస్తున్నాను. హార్ట్ ప్రాబ్లమ్తో ప్రత్యూష పోయిన రెండేళ్లకే ఉద్యోగం మానేశాను. ఇప్పుడు పూర్తి టైమ్ ట్రస్ట్ పనులే. ప్రత్యూష పేరు మీద పెట్టిన ట్రస్ట్ జనంలో నమ్మకాన్ని కోల్పోకూడదనేదే నా ముందున్న లక్ష్యం. ఇరవై ఏళ్లకే నూరేళ్లు జ్ఞాపకాలను మిగిల్చింది పింకీ. ఏ తల్లికీ నాలాంటి కడుపుకోత రాకూడదు’’. రెండు సందేశాలు! ప్రతి ఆడపిల్లకూ నేను చెప్పేది రెండే రెండు మాటలు. ఒకటి ... ఎవరి మీదా ఆధారపడకూడదు. ఒక రూపాయి కావాలంటే తండ్రి, అన్న, భర్తని అడిగే పరిస్థితిలో జీవించకూడదు. మీ కాళ్ల మీద మీరు నిలబడాలి. అప్పుడే కష్టం వస్తే తట్టుకునే ధైర్యం వస్తుంది. ఇక రెండోది... మీ సెక్యూరిటీ బాధ్యత మీదే. ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరితో వెళ్తున్నాం అనే స్పృహ ఉండాలి. కరాటే వంటి సెల్ఫ్ డిఫెన్స్ మెథడ్స్ తెలిసి ఉండాలి. ఎవరు ఎంత ప్రేమగా మాట్లాడినా సరే... వాళ్ల వెంట కళ్లు మూసుకుని వెళ్లకూడదు. చేతులారా ప్రమాదాలలో తల దూర్చవద్దు. రక్షణగా ఉండాలంటే... ఆడపిల్లలు నాలుగ్గోడల మధ్య ఉండిపోవాలని కాదు, ధైర్యంగా అన్ని రంగాల్లోకి వెళ్లాలి. ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడ మనకు రక్షణ ఉందా అనే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతాను. నాకు డబ్బు వస్తే ప్రత్యూషలాగ నష్టపోయి ప్రాణాలతో బయటపడిన వాళ్ల కోసం ఒక రెస్క్యూ హోమ్ పెట్టాలని ఉంది. – పాదరాజు సరోజినీ దేవి, నటి ప్రత్యూష తల్లి – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
నా బిడ్డ హత్య కేసును బాబు ప్రోద్బలంతోనే నీరుగార్చారు
-
నర్సు కోర్సులో ప్రత్యూష
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన హైదరాబాద్కు చెందిన ప్రత్యూష నర్సు కోర్సులో చేరింది. గతేడాది ఆగస్ట్లో సవతి తల్లి చిత్రహింసలకు గురై ఆసుపత్రి పాలైన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఆమెను పరామర్శించి, అక్కున చేర్చుకున్నారు. ప్రత్యూషకు ప్రభుత్వం తరఫున విద్య, వసతి కల్పిస్తామని హామీనిచ్చారు. దాని ప్రకారమే వ్యక్తిగతంగా కొంత ఆర్థికసాయం చేయడంతో పాటు ప్రత్యూష కోరుకున్న విధంగా చదివిస్తున్నారు. -
జాతీయ చాంపియన్ పద్మిని రౌత్
ప్రత్యూషకు 12వ స్థానం న్యూఢిల్లీ: అంతర్జాతీయ మాస్టర్ పద్మిని రౌత్ వరుసగా మూడోసారి భారత మహిళల ప్రీమియర్ జాతీయ చెస్ చాంపియన్గా నిలిచింది. సోమవారం జరిగిన టోర్నీ చివరి, 11వ రౌండ్లో ఆమె... ఇషా కరవాడే(7)తో గేమ్ను డ్రా చేసుకుంది. దీంతో పద్మిని (పీఎస్పీబీ) 8 పారుుం ట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఎరుురిండియా క్రీడాకారిణి ఎస్.విజయలక్ష్మి (7.5) రెండో స్థానంలో నిలవగా, ఇషా కరవాడే కాంస్య పతకం గెలుచుకుంది. ఆఖరి రౌండ్లో విజయలక్ష్మి... వైశాలి (తమిళనాడు, 3.5)పై గెలిచింది. తెలుగమ్మారుు బొడ్డ ప్రత్యూష 12వ స్థానంలో నిలి చింది. తమిళనాడుకు చెందిన కన్నమ్మ (5)తో జరిగిన పోరులో ప్రత్యూష (3.5) పరాజయం చవిచూసింది. జాతీయ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా పద్మిని భారత జట్టులోకి ఎంపికై ం ది. గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సభ్యులుగా ఉన్న ఈ జట్టు ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్షిప్లో తలపడనుంది. -
ప్రత్యూషకు రెండో గెలుపు
న్యూఢిల్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బొడ్డ ప్రత్యూష రెండో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్లో తెల్ల పావులతో ఆడిన ప్రత్యూష 82 ఎత్తుల్లో నిషా మొహతాపై గెలిచింది. ఎనిమిదో రౌండ్ తర్వాత ప్రత్యూష 2.5 పారుుంట్లతో చివరిదైన 12వ స్థానంలో కొనసాగుతోంది. పద్మిని రౌత్ 6.5 పారుుంట్లతో అగ్రస్థానంలో ఉండగా... 5.5 పారుుంట్లతో సౌమ్య స్వామినాథన్, ఇషా కరవాడే సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఈ టోర్నీలో మరో మూడు రౌండ్లు మిగిలి ఉన్నారుు. -
మళ్లీ ఓడిన ప్రత్యూష
న్యూఢిల్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ అమ్మారుు బొడ్డ ప్రత్యూష నాలుగో పరాజయాన్ని చవిచూసింది. కిరణ్ మనీషా మొహంతితో సోమవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్లో నల్లపావులతో ఆడిన ప్రత్యూష 48 ఎత్తుల్లో ఓడిపోరుుంది. ఐదో రౌండ్ తర్వాత ప్రత్యూష అర పారుుంట్తో 12వ స్థానంలో కొనసాగుతోంది. పద్మిని రౌత్ నాలుగు పారుుంట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. 3.5 పారుుంట్లతో విజయలక్ష్మి సుబ్బరామన్, సౌమ్య స్వామినాథన్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. -
సూర్యలంక బీచ్లో విషాదం
బాపట్ల: విహారయాత్రలో విషాదం అలముకున్న సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో జరిగింది. విహారయాత్ర కోసం వచ్చిన తొమ్మిదిమంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఇద్దరు మరణించారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో బయోటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న పగడాల కావ్య, గుంటి ప్రత్యూష, గోనాల సుష్మప్రియ, కొలిమర్ల సత్యసాయిప్రసాద్, ఇందుజ, జరీనాతోపాటు కె.ఎల్. యూనివర్సిటీలో బీటెక్ (ప్రథమ) చదువుతున్న వారి ఇంటర్ క్లాస్మేట్స్ శివాని, వివేక్, ఉదయ్ మొత్తం తొమ్మిదిమంది మంగళవారం ఉదయం విజ్ఞాన్ కళాశాల నుంచి ఆటోలో సూర్యలంక తీరానికి చేరుకున్నారు. వీరిలో కావ్య, ప్రత్యూష, సుష్మప్రియ, సత్యసాయిప్రసాద్ స్నానాలు చేసేందుకు ఉదయం 11గంటల సమయంలో సముద్రంలోకి దిగారు. అప్పటికే అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో సుష్మప్రియ నీటిలో లోతుకు వెళ్లింది. ఆమెను కాపాడేందుకు ప్రత్యూష(18), కావ్య, సత్యసాయిప్రసాద్(19)లు కూడా లోపలికి దిగారు. వీరంతా అలల ఉధృతికి కొట్టుకుపోవడాన్ని గమనించిన సందర్శకులు కేకలు వేయడంతో తీరంలో పహారా కాస్తున్న మెరైన్ హోంగార్డు నాయుడు శ్రీనివాసరావు మత్స్యకారుల సహాయంతో నీటిలోకి దిగి కావ్య, ప్రత్యూష, సుష్మప్రియలను ఒడ్డుకు చేర్చారు. ప్రత్యూష నీరు ఎక్కువగా తాగడంతో మృత్యువాత పడింది. సత్యసాయిప్రసాద్ గల్లంతైన రెండు గంటల తర్వాత మృతదేహమై ఒడ్డుకు కొట్టుకువచ్చాడు. సుష్మప్రియ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతుండగా, కావ్య ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ రంగంలో ఏం జరుగుతోంది?
సగటు మనిషికి విద్యుత్ గురించిన సూక్షా్మంశాలు తెలిసేది తక్కువే. స్విచ్ ఆన్ చేయడం, కరెంట్ వాడుకోవడం, అవసరం తీరాక స్విచ్ ఆఫ్ చేయడం. ఏ నెల్లో అయినా కరెంటు బిల్లు వంద రూపాయలు ఎక్కువ వస్తే గుండెలు బాదుకోవటం. మానవ జీవితానికి, ఆర్థిక వ్యవస్థలోని సకల రంగాలకు జీవధాతువుగా నిలుస్తున్న విద్యుత్ గురించి సగటు మనిషి అవగాహన అత్యంత పరిమితమే. కానీ ఒక రాష్ట్రం రెండుగా ముక్కలవడానికి దారి తీసిన ప్రధాన కారణాల్లో విద్యుత్ కూడా ఒకటి అని తెలిసినప్పుడు దాని చుట్టూ అల్లుకున్న విపరిణామాలను అర్థం చేసుకోకుండా పక్కన పెట్టడం నిపుణులకు సాధ్యం కాని పని. అందుకే విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కె. రఘు గత రెండు దశాబ్దాలుగా విద్యుత్కి సంబంధించిన పలు అంశాలపై అధ్యయనం చేస్తూనే ఉన్నారు. కరెంట్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగానికి సంబంధించిన కీలక అంశాలను, వాటిలోని లాభనష్టాలను ప్రజా వేదికలపై విస్తృతంగా వివరించడంతోపాటు పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ క్రమంలో ఈయన ఇటీవల తీసుకొచ్చిన పుస్తకమే ‘తెలంగాణ విద్యుత్రంగంలో ఏం జరుగు తున్నది?’ ఇది తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో వెలు వడిన తొలి పుస్తకం కావడం విశేషం. పుస్తక రచయిత కె. రఘు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) అధికార ప్రతినిధి. తెలం గాణ ఉద్యమ సమయంలో విద్యుత్కు సంబంధించిన ఏ సందేహం వచ్చినా నివృ త్తికోసం ఈయన వైపే అందరూ చూసేవారంటే ఆశ్చర్యపడవలసింది లేదు. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల కాలంలో విద్యుత్ రంగంలో జరిగిన పరిణామాలు, వాటి మంచి చెడులపై అత్యంత సమతూ కంతో ఆయన రాసిన ఈ పుస్తకం ఆలోచనలు రేకెత్తిస్తోంది. తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి విద్యుత్ రంగంలో చేపట్టిన ప్రాజెక్టుల గురించి ఈ పుస్తకం కూలంకషంగా వివరించింది. రాష్ట్ర విభజన సమ యంలో ఉన్న కరెంటు కష్టాల నుంచి గట్టెక్కడానికి ఆగ మేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలుపై తీసుకున్న తక్షణ నిర్ణయాలు దీర్ఘకాలంలో తెలంగాణ మెడకు ఎలా చుట్టుకోబోతున్నాయో రచ యిత సోదాహరణంగా తెలిపారు. ఛత్తీస్గఢ్తో ఆకస్మి కంగా చేసుకున్న విద్యుత్ ఒప్పందం కొన్నేళ్లలోనే రాష్ట్రం మొత్తానికి గుదిబండగా మారనుందని గణాంక సహి తంగా వివరించారు. ప్రపంచమంతా విద్యుత్ ప్రాజె క్టులు ప్రస్తుతం అధునాతనమైన సూపర్ క్రిటికల్ (500 నుంచి 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం) టెక్నాలజీతో నడుస్తుండగా, ప్రాజెక్టు నిర్మాణ కాలాన్ని ఏడాదిపాటు తగ్గించవచ్చనే ఏకైక కారణంతో ప్రభుత్వం సబ్ క్రిటికల్ (270 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం) టెక్నాలజీతో భద్రాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్టును తలపెట్టడం అసం బద్ధ చర్య అని, దీంతో ఉత్పత్తి ఖర్చు పెద్దఎత్తున పెరగ డమే కాకుండా ఆ భారం మొత్తం వినియోగదారులపైనే మోపుతారని రఘు పేర్కొన్నారు. స్వల్ప కాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విష యంలో కూడా ఏపీ కంటే అధిక ధరకు తెలంగాణ కోట్ చేయడం ఎవరి ప్రయోజ నాల కోసమని రచయిత నిలదీశారు. రాష్ట్ర విద్యుత్ తీరుతెన్నులపై అత్యంత విలువైన ఈ పుస్తకంలో రచయిత మొత్తం 26 వ్యాసాలు పొందుపర్చారు. వీటిలో కొట్టొచ్చేటట్టు కనిపించే అంశం ఏమిటంటే, ప్రభుత్వాన్ని కానీ, అధికారులను కానీ పల్లెత్తుమాట అనకుండా విషయానికి మాత్రమే కట్టు బడుతూ రచయిత పాటించిన అసాధారణ సమ తుల్యమే. అత్యంత సంక్లిష్ట అంశంపై పాటించిన ఇంతటి సౌమ్య వర్తనను కూడా ప్రభుత్వాధికారులు జీర్ణించుకోలేకపోవడం విచారకరం. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం ఏమిటి అంటూ నేరుగా విమర్శించారు కూడా. ప్రజాభి ప్రాయాన్ని ఖాతరు చేయకుండా స్వంత నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటే వచ్చే ఫలితాలు ఎవరికి నష్టకరంగా మారతాయో రచయిత సుస్పష్టం చేసిన నేపథ్యంలో కావలసింది పాలనతో సహా అన్ని రంగాల్లో పారదర్శకతే. ఈలోగా విద్యుత్రంగ కరదీపికగా రూపొందిన ఈ చిన్ని, విలువైన పుస్తకాన్ని అక్కున చేర్చుకోవలసిన బాధ్యత తెలుగు ప్రజలందరిదీ. -ప్రత్యూష -
హరికృష్ణ గేమ్ ‘డ్రా’
న్యూఢిల్లీ: షామ్కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. హు ఇఫాన్ (చైనా)తో బుధవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్ను హరికృష్ణ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రత్యూష గెలుపు: తాష్కెంట్లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్షిప్ మహిళల విభాగంలో బొడ్డ ప్రత్యూష మూడో విజయాన్ని సాధించింది. అనస్తాసియా (ఇండోనేసియా)తో బుధవారం జరిగిన ఏడో రౌండ్లో ప్రత్యూష 46 ఎత్తుల్లో గెలిచింది. ప్రత్యూష మూడు పాయింట్లతో 20వ ర్యాంక్లో ఉంది. -
లలిత్, ప్రత్యూష ఓటమి
తాష్కెంట్: ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్షిప్ ఆరో రౌండ్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎం.ఆర్.లలిత్ బాబు, బొడ్డ ప్రత్యూషలకు పరాజయాలు ఎదురయ్యాయి. ఓపెన్ విభాగంలో అలీకులోవ్ ఎల్బెక్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో లలిత్ బాబు... మహిళల విభాగంలో హోంగ్ థి బావో ట్రామ్ (వియత్నాం) చేతిలో ప్రత్యూష ఓడిపోయారు. ఆరో రౌండ్ తర్వాత లలిత్ 2.5 పాయింట్లతో 59వ స్థానంలో, ప్రత్యూష మూడు పాయింట్లతో 17వ స్థానంలో ఉన్నారు. -
లలిత్ గేమ్ డ్రా
తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): ఆసియా కాంటినెంటల్ ఓపెన్ చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు తొలి ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. బిల్గున్ సుమియా (మంగోలియా)తో శుక్రవారం జరిగిన రెండో గేమ్ను లలిత్బాబు ‘డ్రా’గా ముగించాడు. ఇదే టోర్నమెంట్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష రెండో పరాజయాన్ని చవిచూసింది. ఎన్గుయెన్ థి మాయ్ హంగ్ (వియత్నాం)తో జరిగిన రెండో రౌండ్లో ప్రత్యూష 44 ఎత్తుల్లో ఓడిపోయింది. -
ప్రత్యూష ఆస్తి నాకేం అవసరం లేదు...
హైదరాబాద్: 'ప్రత్యూష పేరు మీద ఉన్న ఆస్తి ఒక్క రూపాయి కూడా నాకు వద్దు. తనపై జాలితోనే నాకు ప్రేమ పుట్టింది. ప్రత్యూషకు ఉన్న ఆస్తి రూ.2 కోట్లు అనాథాశ్రమానికి రాసి కట్టుబట్టలతో వచ్చినా ఆమెను మంచిగా చూసుకుంటాను' అని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన బాల మద్దులేటి రెడ్డి, తులసమ్మల కుమారుడు వెంకట మద్దులేటి రెడ్డి చెప్పాడు. బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావును నిన్న మద్దులేటి రెడ్డి కలసి ప్రత్యూషతో తన ప్రేమ వ్యవహారాన్ని వివరించారు. నారాయణగూడలోని కుబేరా టవర్స్లో అచ్యుతరావుతో కలసి మద్దులేటి రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్రత్యూష చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నా స్నేహితుడి బంధువులు అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని చూసేందుకు వెళ్లినప్పుడే నేను ప్రత్యూషను కలిశాను. అలా మా పరిచయం పెరిగింది. నేను రిజిష్టర్ బుక్లో రాసిన వివరాల ఆధారంగా ప్రత్యూష నాకు ఫోన్ చేసింది. ‘నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని అడిగింది. నాక్కూడా తనపై ఇష్టం ఉన్నందున వెంటనే ఒప్పుకున్నాను’’ అని చెప్పాడు. ఇప్పటికే తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడించానని, ఆమె ప్రేమ విషయాన్ని, మాటలు అన్నీ రికార్డ్ చేశానని, అవన్నీ భద్రంగా ఉంచానని తెలిపాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకుని ప్రత్యూషతో తన వివాహం జరిపించాలని కోరారు. ఆపదలో ఉన్న ప్రత్యూషను అక్కున చేర్చుకుని తన రెండో కుమార్తెగా భావిస్తున్న సీఎం కేసీఆర్ అందరి హృదయాలను గెలుచుకున్నారని, ప్రత్యూష కోరుకున్న వ్యక్తితో వివాహాన్ని జరిపించి మనవతా దృక్పథాన్ని చాటుకోవాలని అచ్యుతరావు కోరారు. కేసీఆర్ మాదిరిగానే ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించి మద్దులేటిరెడ్డిని ఏపీ రాష్ట్రం తరఫున దత్తత తీసుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు వియ్యంకులవుతారన్నారు. -
‘సీఎం సమక్షంలోనే మా పెళ్లి జరగాలి’
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే తమ వివాహం జరగాలని కోరుకుంటున్నట్లు ప్రత్యూష ప్రియుడు మద్దిలేటిరెడ్డి తెలిపాడు. అతడు మంగళవారం విలేకరులతో మాట్లాడాడు. కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూషను తాను ప్రేమించానని, తమ పెళ్లి సాక్షాత్తు కేసీఆర్ సమక్షంలోనే జరగాలని కోరుకుంటున్నామని అతడు చెప్పాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన మద్దిలేటిరెడ్డిని ప్రేమిస్తున్నానని, అతడిని పెళ్లి చేసుకుంటానని ప్రత్యూష ఇటీవల వెల్లడించిన విషయం విదితమే. కాగా ప్రత్యూష మంగళవారం బాలల హక్కుల సంఘం కార్యదర్శి అచ్యుతరావును కలిసింది. తన ప్రియుడు మద్దిలేటితో తనకు వివాహం జరిపించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ప్రత్యూష మేజర్ కాబట్టి పెళ్లి చేసుకునే హక్కు ఆమెకు చట్టపరంగా ఉంటుందని అచ్యుతరావు తెలిపారు. -
పెళ్లికి పట్టుబడుతున్న.. కేసీఆర్ దత్తపుత్రిక
సాక్షి, హైదరాబాద్: సొంత తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన ప్రత్యూష త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందా..? తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చిన యువకుడితో చిగురించిన ప్రేమ, పెళ్లి వరకు వెళ్లబోతోందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కన్నతల్లి మరణంతో, సవతి తల్లి పెంపకంలో నిత్యం నరకాన్ని అనుభవిస్తున్న సమయంలో ప్రత్యూషను మీడియా, బాలల హక్కుల సంఘాలు చొరవతో ఆస్పత్రిలో చేర్పించటం, ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్, హై కోర్టుల స్పందనతో ప్రభుత్వ ఆధీనంలోని సంరక్షణ కేంద్రంలో నివసిస్తున్నఆమె యోగక్షేమాలను అధికారుల ప్రత్యేకంగా చూస్తూవస్తున్నారు. ప్రత్యూష ఇటీవలే ఇంటర్ వోకేషనల్ పరీక్ష సైతం పాసైయ్యారు. అయితే, బీఎస్సీ నర్సింగ్ చేయటమే లక్ష్యంగా చెబుతూ వచ్చిన ప్రత్యూష.. తాజాగా తాను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకట మద్దిలేటి రెడ్డిని ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకున్నాకే చదువుకుంటానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించారు. ఈ విషయాన్ని మహిళ సంక్షేమ శాఖ డెరైక్టర్ విజయేంద్రకు కూడా ప్రత్యూష తెలిపారు. ఈ విషయమై ఆమె న్యాయవాది ప్రత్యూషకు పలు మార్లు కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నపటికీ.. ప్రస్తుతం తనకు ఇరవై ఏళ్లని, మేజర్నంటూ.. నా ఇష్టప్రకారం నేను కోరుకున్నది చేయాలంటూ ప్రత్యూష పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఎవరీ మద్దిలేటి రెడ్డి.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆచారీకాలనీకి చెందిన మద్దిలేటి రెడ్డి(27) బీఎస్సీ చదివి ఓ ఆటోమొబైల్ షాపులో స్టోర్ కీపర్గా పనిచేస్తున్నారు. గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుని పరామర్శకు హైదరాబాద్కు వచ్చి అక్కడే చికిత్స పొందుతున్న ప్రత్యూషను పలకరించాడు. ఏ ఇబ్బంది ఉన్నా తనకు ఫోన్ చేయాలంటూ నంబర్ ఇచ్చాడు. నగరంలో ఉన్న రెండు రోజుల ప్రత్యూష వద్దకు వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకుని ఆళ్లగడ్డకు వెళ్లిపోయాడు. తర్వాత ప్రత్యూష ప్రభుత్వ సంరక్షణ గృహంలో చేరింది. అప్పటినుంచి మద్దిలేటికి ఫోన్లు చేస్తుండటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. హాస్టల్లో ఉండలేను.. పెళ్లి చేసుకుంటా ప్రత్యూష ప్రస్తుతం తాను హాస్టల్లో ఉండలేకపోతున్నానని, హాస్టల్ భోజనంలో సోడా ఉప్పు వేస్తున్నారని, ఉడకని బియ్యంతో అన్నం తినడం వల్ల ఆరోగ్యం ఇబ్బంది పెడుతోందని బాలల హక్కుల కమిషన్ సభ్యులు అచ్యుతరావుకు ఆమె ఫోన్ చేసి చెప్పారు. మద్దిలేటిని పెళ్లి చేసుకున్నాకే తాను బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తానని వివరించారు. తాను ప్రేమించిన మద్దిలేటితోనే వివాహం జరిపించాలని కోరారు. ఆమెనే పెళ్లి చేసుకుంటా: మద్దులేటిరెడ్డి అవును.. ప్రత్యూషను ప్రేమించాను. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పి అమ్మ తులసమ్మను ఒప్పించాను. నేను పేదవాడినైనా, మాట తప్పే వాడిని కాదు. ఆమే తొలుత నాకు ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అందుకు మేమంతా అంగీకరించాం. కోర్టు, ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తే అందరి సమక్షంలో ప్రత్యూషను పెళ్లి చేసుకుంటానని మద్దిలేటి తెలిపారు. ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలి : అచ్యుతరావు, బాలల హక్కుల కమిషన్సభ్యులు ప్రత్యూషను ఆస్పత్రి నుండి తీసుకెళ్లి సంరక్షణ కేంద్రంలో పెట్టిన తర్వాత, ఆమెకు మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించ లేదు. పరిసరాలు, చుట్టూ ఉన్న వాతావరణం కారణంగా ఆమె వాటన్నింటి నుంచి ఇప్పటికిప్పుడు బయటపడాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆమెకు నిపుణులైన మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ అవసరమని అభిప్రాయపడ్డారు. -
తప్పులో కాలేసిన ఇంటర్ బోర్డ్
ప్రత్యూష ప్రాక్టికల్స్ మార్కులను పరిగణించని అధికారులు సాక్షి, హైదరాబాద్: తండ్రి, సవతి తల్లి చేతి లో చిత్రహింసలకు గురై పలువురి సహకారంతో పునర్జన్మ పొందిన ప్రత్యూష(పావని) ఇంటర్ ఫెయిల్ వెనక ఆయా ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యం వెల్లడైంది. ప్రాక్టికల్స్తోపాటు అన్ని పరీక్షలను ప్రత్యూష బాగానే రాసినా శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో ఆమె ఫెయిలైనట్లుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే, మొదటి సంవత్సరం పరీక్షలను సెయింట్ డేనియల్ కళాశాల, రెండో సంవత్సరం పరీక్షలను నారాయణ కళాశాల ద్వారా ప్రత్యూష రాసింది. ఈ రెండు పరీక్షలకు వేర్వేరు హాల్టికెట్లు ఉండడంతో సమన్వయంలేమి కారణంగా ప్రాక్టికల్ పరీక్షల మార్కులను ఇంటర్ బోర్డు అధికారులు పట్టిం చుకోలేదు. శాఖల మధ్య సమన్వయ లోపాన్ని ‘సాక్షి’ ప్రచురించటంతో డేనియల్ కళాశాల యాజ మాన్యం శనివారం మరోసారి ప్రత్యూష ప్రాక్టికల్ మార్కులను ఇంటర్ బోర్డుకు పంపింది. ఇంటర్ అధికారులు సైతం దొర్లిన తప్పులను సరిదిద్దే ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై డేనియల్ కళాశాల ప్రిన్సిపాల్ బసవపున్నయ్య ‘సాక్షి’ తో మాట్లాడుతూ ప్రత్యూష రాత పరీక్షలతోపాటు, ప్రాక్టికల్స్లోనూ ఉత్తీర్ణత సాధిం చినట్లు చెప్పారు. త్వరలో ఆమెకు పాస్ మెమో వస్తుందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. అధికారులపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ప్రత్యూషను మరోసారి మానసికంగా హింసించిన సం బంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు డిమాండ్ చేశారు. -
దూకి చస్తానన్న నటి బాయ్ ఫ్రెండ్
ముంబయి: ఇటీవల మృతిచెందిన నటి ప్రత్యూష బెనర్జీ బాయ్ ఫ్రెండ్, ఆమె మృతికి పరోక్షంగా కారణమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న రాహుల్ రాజ్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చికిత్స పొందుతున్న ఆస్పత్రి భవనం బాత్ రూంలోకి చొరబడి అందులోని కిటికీలో నుంచి దూకి చనిపోతానని బెదిరించాడు. ప్రత్యూష మరణం తర్వాత రాహుల్ పై ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో అతడు ఈ నెల 3 నుంచి శ్రీ సాయి ఆస్పత్రిలో చేరి మానసిక ఒత్తిడికి చికిత్స పొందుతున్నాడు. అయితే, శుక్రవారం అతడిని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి కనీసం రెండు గంటలపాటు విచారించారు. అనంతరం ఆస్పత్రికి వచ్చిన రాహుల్ .. బాత్ రూంలోకి చొరబడి బయటకు వచ్చేందుకు నిరాకరించాడు. తాను కిందికి దూకి చనిపోతానని బెదిరించడంతో చివరకు వైద్యులు అతడితో ఏదో ఒకలా మాట్లాడి బయటకు రప్పించారు. ఆ తర్వాత కొంత కౌన్సెలింగ్ ఇచ్చారు. -
నేను ప్రత్యూషను కొట్టాను...
టీవీనటి ప్రత్యూష బెనర్జీ అనుమానాస్పద మరణంపై ఆమె బాయ్ఫ్రెండు రాహుల్ రాజ్ సింగ్ మాజీ ప్రియురాలు సలోని శర్మ తొలిసారి మౌనం వీడారు. మీడియాతో మాట్లాడిన ఆమె కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. దీంతో ఈ ఉదంతంలో రాహుల్ ప్రమేయంపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఫిబ్రవరి 11 తాను ప్రత్యూష బెనర్జీని కొట్టినట్లు సలోని అంగీకరించారు. అయితే తాను కావాలని కొట్టలేదని, ప్రతీకారంగానే అలా చేశానని చెప్పుకొచ్చారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని, వాట్సాప్ లో ఆమె కాంటాక్ట్ ను బ్లాక్ చేశానన్నారు. రాహుల్ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ కోసం పెట్టుబడి పెట్టిన డబ్బులు అడగడానికే ఫిబ్రవరి 11న ఆమె ఫ్లాట్కు వెళ్లినపుడు ముగ్గురి మధ్య వివాదం జరిగిందని తెలిపింది. ఈ క్రమంలో రాహుల్, ప్రత్యూష ఇద్దరూ తనపై దాడిచేసినపుడు తాను తిరగబడ్డానని తెలిపింది. తనను తాను రక్షించుకోడానికే ఆమెను కొట్టాల్సి వచ్చిందని తెలిపింది. అప్పు తీర్చమన్నందుకు తనపై అమానుషంగా ప్రవర్తించి దాడికి పాల్పడడంతో వారిపై స్థానిక బంగర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. వాళ్లిద్దరి విజ్ఞప్తితోనే ఆ తర్వాత ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్టు తెలిపారు. ఇపుడు ప్రత్యూష ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈ విషయాలన్నీ తెలుసని వివరించారు. శనివారం తన తండ్రితో కలిసి బంగర్ నగర్ పోలీస్ స్టేషన్లో సలోని తన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. సలోని చెప్పిన వివరాలు ఇవీ.. 2011లో మోడలింగ్, యాక్టింగ్ కెరీర్ కోసం కోల్కతా నుంచి ముంబైకి వచ్చినపుడు రాహుల్తో పరిచయం ప్రేమకు దారితీసింది. ఈక్రమంలో ఇద్దరు కలిసి ఒక కంపెనీని ప్రారంభించారు. దీనికోసం సలోని రూ. 30 లక్షల పెట్టుబడి పెట్టింది. ఇంతలో తమ కామన్ స్నేహితుల ద్వారా రాహుల్, ప్రత్యూషల మధ్య సంబంధాన్ని తెలుసుకున్న ఆమె రాహుల్ ని నిలదీసింది. అవన్నీ అబద్ధాలని, వాటిని పట్టించుకోవద్దంటూ నమ్మబలికాడు. ఈ గందరగోళం ఇలా కొనసాగుతుండగానే హఠాత్తుగా ఆగస్టు 10 న ప్రత్యూష పుట్టినరోజు సందర్భంగా టెలివిజన్లో వారి వివాహ ప్రకటన విని నివ్వెరపోయి మర్నాడు రాహుల్ ని నిలదీయగా, ఆమెకు సమాధానం చెప్పాల్సిన రాహుల్ దీనికి బదులుగా సలోని తండ్రికి ఫోన్ చేసి కూతుర్ని తీసుకుపొమ్మని చెప్పాడు. ఆయన వచ్చి రాహుల్ తోనూ, ప్రత్యూష తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. తన కూతురు రాహుల్కు లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయిందని, ఇలాంటి పరిస్థితే ప్రత్యూషకు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు తనను ఎపుడూ కలవని వారు, రాహుల్ - ప్రత్యూష తనకు మధ్య ఏం జరిగిందేంటో తెలియనివారు కూడా.. తన గురించి మాట్లాడుతున్నారని సలోని విమర్శించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన అందరిపై పరువునష్టం దావా దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రాహుల్ వ్యవహారం తనకుముందే తెలిస్తే అతనితో సన్నిహితంగా ఉండేదాన్ని కాదని వాపోయారు. ప్రస్తుతం తాను పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయానని తెలిపారు. -
ప్రత్యూష పిలుస్తోంది..
టీవీ నటి, బాలికా వధు ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఒకవైపు ఆమెది హత్యా ఆత్మహత్యా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ గందరగోళం ఇలా కొనసాగుతుండగానే మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రత్యూష మరణం తర్వాత అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాహుల్ తండ్రి వ్యాఖ్యలు సంచలనానికి దారితీశాయి. ప్రత్యూష తనను పిలుస్తోందంటూ తన కొడుకు రాహుల్ ఐసీయూలో కలవరిస్తున్నాడని చెప్పడం కలకలం రేపింది. రాహుల్ ఆరోగ్యం పట్ల అతని తండ్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యూష చనిపోయిన తర్వాత తన కొడుకు ఇంకా షాక్ లోనే ఉన్నాడని, అతని మానసిక స్థితి బాగోలేదని తండ్రి మీడియాకు వివరించారు. రాహుల్ మానసిక స్థితి ఏ మాత్రం బాగోలేదన్నారు. రాహుల్ను చూసేందుకు ఐసీయూకు వెళ్లిన తనతో వింతగా ప్రవర్తించాడని, ప్రత్యూష తనను పిలుస్తోందని.. తాను వెళ్తానని ఐసీయూలో ఉన్న రాహుల్ చెబుతున్నట్లు అతడి తండ్రి పేర్కొన్నారు. దీంతో తమ కొడుకు ఏమైపోతాడోనన్న భయం తమను వెంటాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యూషను కోల్పోవడం ఆమె తల్లిదండ్రులకు బాధాకరమని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడంతో పాటు తన కొడుకు తొందరగా కోలుకోవాలని ప్రార్థించాలని వేడుకున్నారు. మరోవైపు ప్రత్యూష ఆత్మహత్యకు రాహుల్ బాధ్యుడంటూ వస్తున్న ఆరోపణలను అతడి బంధువులు తోసిపుచ్చారు. ముంబైలోని నివాసంలో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఆమె మృతదేహంపై గాయాలు ఉండటం మరిన్ని సందేహాలకు తావిచ్చింది. దీంతోపాటు ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిపంద కాదని, ఆమెకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రత్యూష అనుమానాస్పద మరణంలో ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ను విచారించారు. అయితే ప్రత్యూషది హత్యా లేక ఆత్మహత్యా అనే విషయం మాత్రం ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది. -
అసలు ప్రేమికులే లేకపోతే..
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య ఉదంతంపై విభిన్న కథనాలు వివాదాన్ని సృష్టిస్తోంటే, బాలీవుడ్ నటి, ఐటం గర్ల్ రాఖీ సావంత్ తనదైన శైలిలో స్పందించింది. ప్రత్యూష బెనర్జీ , ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ప్రేమ వ్యవహారంలోనే ఎక్కువ కలత చెందేదని ఆమె తెలిపింది. ఆమె ఆత్మహత్య చేసుకుందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని రాఖీ పేర్కొంది. ప్రేమలు ప్రాణాలు తీస్తున్నాయని, ప్రేమికులు లేనిదే బతకలేరా అని ఆమె వ్యాఖ్యానించింది. అసలు ప్రేమికులే లేకపోతే ఈ ఆత్మహత్యలే ఉండవని రాఖీ చెప్పుకొచ్చింది. ఇటీవల తాను ప్రత్యుషను కలిసినపుడు చాలా ఆందోళనలో ఉన్నట్టు కనిపించిందని రాఖీ సావంత్ తెలిపింది. ప్రత్యూష చాలా ఎమోషనల్ గర్ల్ అని, అందుకే ఏమైంది తను అడగ్గానే కన్నీళ్లు పెట్టుకుందని, ఆమెకు జీవితంలో ఎన్నో కలలు ఉన్నాయని పేర్కొంది. రాహుల్ మాజీ ప్రియురాలు సలోని విషయంలో కలత చెందేదని చెప్పింది. రాహుల్ ...సలోనితో రిలేషన్ కొనసాగిస్తున్నాడని ప్రత్యుష బాధపడిందని, ఆమెకు పని విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని, కేవలం ప్రేమ వ్యవహారమే ఆమెను తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని అభిప్రాయపడింది. రాహుల్ ని పిచ్చిగా ప్రేమించింది.. అతను లేకపోతే బతకలేనని కన్నీళ్లతో చెప్పిందని తెలిపింది. ముంబై పోలీసులు ఈ కేసును ఎలా విచారిస్తారో చూద్దాం అని మీడియాకు తెలిపింది. మరోవైపు ప్రత్యూష సన్నిహితుడు, ప్రముఖ డిజైనర్ రోహిత్ వర్మ మరో సంచలన విషయాన్ని వెల్లడించాడు. గత నెలలో పెళ్లి దుస్తులు తయారు చేయాల్సిందిగా ప్రత్యూష తనను కోరిందని తెలిపాడు. తనను హోలీ పార్టీకి ఆహ్వానించిందని, అయితే ఆ సమయంలో తాను లండన్ లో ఉండడం రాలేకపోయానని రోహిత్ పేర్కొన్నాడు. -
ఈ ఎరుపేంటి?
క్రైమ్ కామెడీ కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎరుపు’. వెంకట్కృష్ణ దర్శకత్వంలో సుధీర్, ప్రత్యూష జంటగా ‘ఓయ్’ చిత్ర దర్శకుడు ఆనంద్ రంగ, శేషారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘వైవిధ్యమైన కథాంశంతో అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, హీరో సిద్ధార్థ్లు ట్విటర్ ద్వారా టీజర్ను, పాటలను విడుదల చేయనున్నారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్ కార్తీక్, సమర్పణ: అనిల్ - భాను, సహ నిర్మాతలు: తంబరి క్రియేషన్స్. -
ఆస్తులన్నీ ప్రత్యూషకు బదలాయించాలి
-
శ్యామల, రమేశ్లకు హైకోర్టులో చుక్కెదురు
ప్రత్యూషపై చిత్రహింస కేసులో బెయిల్ పిటిషన్ తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: ప్రత్యూషను చిత్రహింసలకు గురి చేసిన ఆమె సవతి తల్లి చిప్పా చాముండేశ్వరి అలియాస్ శ్యామల, తండ్రి రమేశ్లకు హైకోర్టులో చుక్కెదురైంది. ప్రత్యూషను తీవ్ర హింసకు గురిచేసిన కేసులో వారికి బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చంచల్గూడ జైలులో ఉన్న వారు బెయిల్ కోసం చేసుకున్న పిటిషన్ను కిందిస్థాయి కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్యామల, రమేశ్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. వీటిని న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం విచారించారు. -
అనంతపురంలో మరో ప్రత్యూష
-
బొబ్బిలిలో మరో ప్రత్యూష
మానసిక వికలాంగురాలికి సవతి తల్లి వేధింపులు మరుగుదొడ్డి వద్ద ఉంచుతూ నిత్యం చిత్రవధ స్థానికులు ఫిర్యాదుతో కదిలిన ఐసీడీఎస్ అధికారులు బొబ్బిలి: తెలంగాణలో సవతి తల్లి వేధింపుల నుంచి బయటపడిన ప్రత్యూష పరిస్థితి ఇంకా కళ్ల ముందు కదలాడుతుండగానే ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో అలాంటి సంఘటన వెలుగుచూసింది. బొబ్బిలి మున్సిపాలిటీలో బిల్ కలె క్టరుగా పనిచేస్తున్న కాంతారావుకు ముగ్గురు పిల్లలు. భార్య చారుమతిదేవి 2008లో మృతి చెందింది. తల్లితో రెండో కూతురు విజయలక్ష్మికి మంచి అనుబంధం ఉంది. అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తి చేసిన ఆమె, తల్లిలేని జీవితాన్ని ఊహించుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించడంతో మెడ నరాలు దెబ్బతిని మానసిక వికలాంగురాలైంది. భర్తలేని దేవి అనే మహిళను కాంతారావు మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. వీరి వద్దే విజయలక్ష్మి ఉంటోంది. సవతి తల్లి దేవి విజయలక్ష్మిని సరిగా చూడకపోవడమే కాకు ండా, మరుగుదొడ్డి వద్ద ఉంచి, అక్కడే తిండి పెట్టడం, నిత్యం కొడుతూ వేధిస్తుండడంతో స్థానికులు ఎప్పటికప్పుడు నిలదీసేవారు. ఇటీవల ప్రత్యూష ఘ టన వెలుగులోకి రావడంతో స్పందించిన స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారమివ్వడంతో వారు చర్యలకు ఉపక్రమించారు. -
ప్రత్యూష లాంటి వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యూషలాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంక్షేమం కోసం తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇప్పటికే రూపొందించిన పథకాలు, ప్రతిపాదనల వివరాలను తమ ముందుంచాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి తీవ్రంగా హింసించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై సుమోటోగా హైకోర్టు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాజ్యాన్ని పలుమార్లు విచారించిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఏఎస్జీ) ఎస్.శరత్కుమార్ వాదనలు విని పించారు. ప్రత్యూష సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలియజేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... ప్రత్యూష గురించి కోర్టు పట్టించుకుంది కాబట్టి, ఆమె ప్రస్తుతం సురక్షిత స్థితిలో ఉన్నట్లు తెలిపింది. ప్రతి ఒక్కరి విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి అలాంటి వారి సంరక్షణ కోసం తగిన చర్యలు చేపట్టాలని సూచిం చింది. ప్రత్యూషలాగే ఏపీలో ఓ బాలిక ఉదంతం గురించి ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొంది. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి ఏమిటో చెప్పాలని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. -
ప్రత్యూషకు రూ. 5 లక్షల చెక్కు సిద్ధం
- హైకోర్టుకు నివేదించిన తెలంగాణ ప్రభుత్వం - ఆమె పేరిట ఫిక్స్డ్ చేయాలని సూచించిన ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి చేతుల్లో తీవ్ర హింసకు గురైన ప్రత్యూషకు ఇవ్వాలని నిర్ణయించిన రూ.5 లక్షలను ఆమె పేర బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని హైకోర్టు గురువారం టీ సర్కార్ను ఆదేశించింది. ప్రత్యూష తల్లికి చెందిన ఇంటి అద్దె కూడా ఇకపై ఆమెకే దక్కేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. తండ్రికి వచ్చే జీతం నుంచి కొంత మొత్తాన్ని అందించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, ఈ విషయాలన్నింటిపై ఓ అఫిడవిట్ను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూషను సవతి తల్లి తీవ్రంగా హింసించి, ఆమె చేత యాసిడ్ తదితర ప్రమాదకర రసాయనాలు తాగించినట్టు పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన పిటిషన్ను ధర్మాసనం గురువారం మళ్లీ విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) ఎస్.శరత్కుమార్ స్పందిస్తూ, ప్రత్యూషకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. ఐదు లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు సంబంధించిన చెక్కు సిద్ధంగా ఉందని, కోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు తగిన విధంగా వ్యవహరిస్తామన్నారు. రూ. ఐదు లక్షలను ప్రత్యూష పేర ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలన్న ధర్మాసనం, బాలికల రక్షణ కోసం ఇప్పుడున్న చట్టాలను సమర్ధవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించింది. ప్రత్యూష కోసం ఏం చేయాలనుకుంటున్నారో వివరిస్తూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. -
నీకు నేనున్నా!
ప్రత్యూషతో సీఎం కేసీఆర్ * కష్టపడి చదివి పైకి రావాలమ్మా * ధైర్యంగా ఉండు.. ఇకపై నీ జోలికి ఎవరూ రారు సాక్షి, హైదరాబాద్: ‘‘జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి సపోర్టు దొరికింది. దీన్ని ఉపయోగించుకోవాలి. బాగా చదవాలి. పైకి రావాలి. నిన్ను బాధపెట్టిన వారికి నువ్వు వేసే శిక్ష అదే. ఇకపై నీ తెరువుకెవరూ రారు. ధైర్యంగా ఉండు. అన్నింటికీ నేనున్నా. ఎప్పుడైనా నా ఇంటికి రావొచ్చు.. పోవచ్చు. నాకు ఫోన్ చేయవచ్చు...’’ అని కన్నతండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసకు గురైన ప్రత్యూషకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భరోసా ఇచ్చారు. తీవ్ర గాయాలపాలై హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ప్రత్యూషను ఇటీవలే సీఎం దంపతులు పరామర్శించిన సంగతి తెలిసిందే. కోలుకున్న తర్వాత తమ ఇంటికి రావాలని సీఎం ఆహ్వానించారు. దీంతో బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ప్రత్యూషను హైకోర్టులో హాజరుపరిచిన అధికారులు అక్కడ్నుంచి నేరుగా సీఎం ఇంటికి తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ ఆమెను సాదరంగా ఆహ్వానించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యూషను సీఎం తనతో పాటు కూర్చోబెట్టుకొని భోజనం చేశారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, పార్టీ నేత పెద్ది సుదర్శన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యూషతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రత్యూష చదువు బాధ్యతంతా ప్రభుత్వమే భరించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కడియం శ్రీహరిని ఆదేశించారు. ప్రత్యూష చదువు, వసతి, ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు తెలుసుకొని అండగా ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రత్యూషకు రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకులో ఆమె పేరుతో అకౌంట్ తీసి ఆ డబ్బులు జమ చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత ఫోన్ నంబర్లు ప్రత్యూషకు ఇచ్చిన సీఎం.. తాను అండగా ఉన్నానన్న సంగతి మరవొద్దని చెప్పారు. అనంతరం ప్రత్యూషను కీసర మండలంలోని ఓ వసతి గృహానికి తరలించినట్లు తెలిసింది. -
భవిష్యత్తుపై ఆందోళన వద్దు
ప్రత్యూషతో హైకోర్టు ధర్మాసనం * ఆరోగ్య స్థితి, యోగ క్షేమాలపై ధర్మాసనం ఆరా * చదువుపై దృష్టి పెట్టి ఇష్టమైన నర్సింగ్ కోర్సు పూర్తి చేయాలని సూచన * తండ్రి జీతం నుంచి కొంత మొత్తం ప్రత్యూషకు అందేలా చూడాలి * ఇంటి అద్దె కూడా ఆమెకే అందాలి.. ఆ మేరకు ఏర్పాట్లు చేయండి * స్పెషల్ జీపీకి కోర్టు స్పష్టీకరణ * సీఎం కేసీఆర్ స్పందించిన తీరుపై ప్రశంస సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి శ్యామల, కన్నతండ్రి రమేశ్ కుమార్ చేతుల్లో తీవ్ర హింసకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయిన ప్రత్యూషను తెలంగాణ ప్రభుత్వం బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకొచ్చింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే తన చాం బర్లో మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్తో కలిసి ఆమెతో మాట్లాడారు. ప్రత్యూషకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ధర్మాసనం తమ ఛాంబర్లో రహస్య విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్కుమార్, ఏపీ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్ను మాత్రమే విచారణకు అనుమతించింది. ఈ సందర్భంగా ధర్మాసనం ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సవతి తల్లి, తండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురైన తీరును ఆమె కోర్టుకు వివరించింది. సవతి తల్లి, తండ్రికి శిక్ష పడాలని కోరుకుంటున్నానని గట్టిగా చెప్పింది. ఈ విషయాన్ని కోర్టులు చూసుకుంటాయని, చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్నతస్థాయిలో స్థిరపడాలని ధర్మాసనం ఆమెకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తదుపరి ఏం చేస్తావని కూడా ధర్మాసనం ఆరా తీసింది. అందుకు నర్సింగ్ కోర్స్ పూర్తి చేసి, సేవ చేస్తానని ప్రత్యూష బులిచ్చింది. భవిష్యత్తు గురించి ఏ మాత్రం ఆందోళన చెందొద్దని, ముందు ఇం టర్ పూర్తి చేసి, ఆ తర్వాత ఇష్టమైన నర్సింగ్ కోర్సును పూర్తి చేసి జీవితంలో స్థిరపడాలని ధర్మాసనం ఆకాంక్షించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న తండ్రి రమేశ్కు వస్తున్న జీతం నుంచి కొంత మొత్తం ప్రత్యూషకు అందేలా చూడాలని స్పెషల్ జీపీ శరత్కుమార్కు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆమె పేరుతో డబుల్ బెడ్రూం ద్వారా వచ్చే అద్దె మొత్తం కూడా అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆమె పేరుపై ఓ బ్యాంకు ఖాతా తెరచి, ఆ మొత్తాలు అందులో జమయ్యేలా చూడాలంది. ఈ వ్యా జ్యంలో ప్రతివాదిగా ఉన్న రమేశ్తో మాట్లాడి ఎవరైనా న్యాయవాదిని పెట్టుకుంటారా.. లేక హైకోర్టే న్యాయవాదిని ఏర్పాటు చేయాలా..? అన్న విషయాన్ని ఎల్బీ నగర్ పోలీసుల ద్వారా తెలుసుకుని చెప్పాలని శరత్కుమార్కు తెలి పింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి తీవ్రంగా హింసించి, యాసిడ్లాంటి ప్రమాదకర రసాయనాలు తాగించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి చలించిపోయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఈ ఘటనపై తాత్కాలిక సీజేకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. కథనాల ఆధారంగా ఈ ఘటనను సుమోటో పిటిషన్గా పరిగణించి విచారణ జరపాలని కోరారు. అందుకు అంగీకరించిన జస్టిస్ బొసాలే.. జస్టిస్ ఎస్.వి.భట్తో కలిసి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ముందుకొచ్చిన ఫెర్నాండెజ్ ఆసుపత్రి! ప్రత్యూష బాగోగులను చూసుకునేందుకు ఫెర్నాండెజ్ ఆసుపత్రి యాజమాన్యం ముందుకొచ్చినట్లు తెలిసింది. ప్రత్యూషను తమ సంరక్షణలో ఉంచుకుని ఆమె చేత ఇంటర్ పూర్తి చేయించి, తమకు అనుబంధంగా ఉన్న నర్సింగ్ కాలేజీలోనే తదుపరి చదువులు చెప్పిస్తామని ఫెర్నాండెజ్ ఆసుపత్రి తెలిపింది. క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటామని, అందుకు అనుగుణంగా నడుచుకునేందుకు ప్రత్యూష సిద్ధమైతే.. తమ సంరక్షణలోకి తీసుకోవడానికి అభ్యంతరం లేదని హైకోర్టుకు నివేదించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ప్రత్యూషకు తెలిపిన ధర్మాసనం.. ఫెర్నాండెజ్ ఆసుపత్రి సంరక్షణలో ఉండటం మేలని సూచిం చింది. అందుకు ప్రత్యూష అంగీకరించినట్లు సమాచారం. మీడియాతో ఎలాంటి విషయాలను చర్చించవద్దని ప్రత్యూషకు ధర్మాసనం ఈ సందర్భంగా సూచించినట్లు సమాచారం. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి పూర్తిగా కోలుకోవడంతో 21 రోజుల చికిత్స అనంతరం అవేర్ గ్లోబల్ ఆసుపత్రి బుధవారం ప్రత్యూషను డిశ్చార్జి చేసింది. కాగా, ప్రత్యూషకు భవిష్యత్తులో కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది తలెత్తినా ఉచితంగా వైద్యం అందిస్తామని ఆసుపత్రి సీఓఓ వేమూరి విజయ్ తెలిపారు. ఈనెల 8న బాలల హక్కుల సంఘం, ఎల్బీనగర్ పోలీసుల సహకారంతో ప్రత్యూష.. సవతి తల్లి చెర నుంచి బయట పడి న సంగతి తెలిసిందే. బాలల హక్కుల సంఘం హర్షం ప్రత్యూషకు ప్రభుత్వం అండగా నిలవడంపై బాలల హక్కుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ప్రత్యూష లాంటి విధి వంచితులు సమాజంలో ఎందరో ఉన్నారని, వారందరికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆ సంఘం అధ్యక్షురాలు అనురాధారావు అన్నారు. కేసీఆర్కు అభినందన ప్రత్యూష విషయంలో కేసీఆర్ స్పందించిన తీరును ధర్మాసనం అభినందించింది. సీఎంగా బిజీగా ఉండి కూడా కుటుం బసమేతంగా ఆసుపత్రికి వెళ్లి ప్రత్యూషను పరామర్శించి, భవిష్యత్తు గురించి భరోసా ఇచ్చిన తీరు ఎంతో గొప్పగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న యువతులకే కాక మొత్తం ప్రజలకు.. సమస్య వస్తే తాను ఉన్నానన్న సందేశాన్ని ఇచ్చినట్లయిందని వ్యాఖ్యానించింది. ఈ ఘటన ద్వారా సీఎం మానవతావాది అన్న విషయం రుజువైందని అన్నట్లు సమాచారం. కేసు తదుపరి విచారణపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. నా దుస్థితికి కారణమైన వారిని శిక్షించాలి అనాథగా అర్ధాంతరంగా తనువు ముగించాల్సి వస్తుందని మానసిక వేదనకు గురయ్యా. ఆ నరకం నుంచి బయటపడ్డందుకు సంతోషంగా ఉంది. ఎంతో మంది నాకు అండగా నిలిచారు. నా ఈ దుస్థితికి కారణమైన సవతి తల్లి, కన్నతండ్రిని కఠినంగా శిక్షించాలి. - ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ప్రత్యూష -
ధర్మాసనం ముందు ప్రత్యూష ఏం మాట్లాడింది?
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి శ్యామల, కన్నతండ్రి రమేష్ కుమార్ చేతుల్లో తీవ్ర హింసకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయిన ప్రత్యూషను తెలంగాణ ప్రభుత్వం బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే తన ఛాంబర్లో మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్తో కలిసి ప్రత్యూషతో మాట్లాడింది. ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ధర్మాసనం తమ ఛాంబర్లో రహస్య విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్ కుమార్, ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ను మాత్రమే విచారణకు అనుమతించింది. ఈ సందర్భంగా ధర్మాసనం ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సవతి తల్లి, తండ్రి చేతుల్లో తను ఏ విధంగా చిత్రహింసలకు గురైందీ ఆమె కోర్టుకు వివరించింది. సవతి తల్లి, తండ్రికి శిక్ష పడాలని కోరుకుంటున్నానని ఆమె గట్టిగా చెప్పింది. ఈ విషయాన్ని న్యాయస్థానాలు చూసుకుంటాయని, చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్నతస్థాయిలో స్థిరపడాలని ధర్మాసనం ఆమెకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తదుపరి ఏం చేయాలన్న విషయంపై కూడా ధర్మాసనం ఆరా తీసింది. నర్సింగ్ కోర్స్ పూర్తి సేవ చేస్తానని ప్రత్యూష చెప్పింది. భవిష్యత్తు గురించి ఏ మాత్రం ఆందోళన చెందొద్దని, ముందు ఇంటర్ పూర్తి చేసి, ఆ తరువాత ఇష్టమైన నర్సింగ్ కోర్సును పూర్తి చేసి జీవితంలో స్థిరపడాలని ధర్మాసనం ఆకాంక్షించింది. ప్రత్యూషను హింసించిన వ్యవహారంలో ప్రస్తుతం జైలులో ఉన్న ఆమె తండ్రి రమేష్కు వస్తున్న జీతం నుంచి కొంత మొత్తాన్ని ప్రత్యూషకు అందేలా చూడాలని స్పెషల్ జీపీ శరత్కుమార్కు ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే ఆమె పేరుపై ఉన్న డబుల్ బెడ్రూం ద్వారా వచ్చే అద్దె మొత్తాన్ని కూడా ఆమెకు అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన పక్షంలో ఆమె పేరు మీద ఓ బ్యాంకు ఖాతాను తెరచి, ఆ మొత్తాలు అందులో జమయ్యేలా చూడాలంది. సీఎం కేసీఆర్ కు అభినందన ప్రత్యూష విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పందించిన తీరును ధర్మాసనం అభినందించింది. ముఖ్యమంత్రిగా బిజీగా ఉండి కూడా కుటుంబ సమేతంగా ఆసుపత్రికి వెళ్లి మరీ ప్రత్యూషను పరామర్శించి, భవిష్యత్తు గురించి ఆమెకు భరోసా ఇచ్చిన తీరును ఎంతో గొప్పగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇలా చేయడం ద్వారా ఇటువంటి సమస్యలే ఎదుర్కొంటున్న యువతులకే కాక మొత్తం ప్రజలకు సమస్య వస్తే తాను ఉన్నానన్న సందేశాన్ని ఇచ్చినట్లయిందని వ్యాఖ్యానించింది. ఈ ఘటన ద్వారా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంచి మానవతావాదన్న విషయం రుజువైందని కూడా ధర్మాసనం చెప్పినట్లు తెలిపింది. ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా ఆసుపత్రికి వెళతారని తాము అసలు ఊహించలేదంది. ఏదేమైనా అంతిమంగా ప్రత్యూషకు మంచి జరగాలనే అందరూ ఆశించారని, అదే ఇప్పుడు జరుగుతోన్నందుకు తమకు ఆనందంగా ఉందని ధర్మాసనం తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది. -
ప్రత్యూషకు ఫోన్ నంబర్ ఇచ్చిన కేసీఆర్
హైదరాబాద్: పినతల్లి, తండ్రి చేతిలో చిత్రహింసలపాలై కోలుకున్న ప్రత్యూష బాగా చదువుకుని పైకి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. బుధవారం తన ఇంటికి వచ్చిన ప్రత్యూషతో కేసీఆర్ మాట్లాడారు. 'నువ్వు కష్టపడి చదివి పైకి రావడమే, నిన్ను బాధ పెట్టిన వారికి నువ్వు వేసే శిక్ష' అని కేసీఆర్ అన్నారు. అన్నింటికి తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. ఎప్పుడైనా రావొచ్చంటూ ప్రత్యూషకు ఫోన్ నంబర్ ఇచ్చారు. ప్రత్యూష చదువు, వసతి, ఇతర విషయాలు ప్రభుత్వమే చూసుకుంటుందని హామీయిచ్చారు. ఆమె కోసం రూ. 5 లక్షలు మంజూరు చేశారు. -
ప్రత్యూషతో కలిసి భోజనంచేసిన కేసీఆర్
-
హాస్టల్ లో ఉండి చదువుకుంటా: ప్రత్యూష
-
హాస్టల్ లో ఉండి చదువుకుంటా: ప్రత్యూష
హైదరాబాద్: సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో తీవ్ర హింసకు గురై కోలుకున్న ప్రత్యూషను బుధవారం గ్లోబల్ అవేర్ ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు బీఎస్సీ నర్సింగ్ చదవాలని ఉందని, బంధువులెవరి దగ్గర ఉండటం ఇష్టం లేదని, నాన్న, పిన్నిని కఠినంగా శిక్షించాలని కోర్టును కోరతానని తెలిపింది. హాస్టల్ లో ఉండి చదువుకుంటానని ప్రత్యూష తెలిపింది. కాగా ప్రత్యూషను బుధవారం మధ్యాహ్నం 1 గంటకు తమ చాంబర్కు తీసుకురావాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏ రకమైన ఇబ్బంది కలగకుండా, మీడియా ద్వారా కూడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆమెను నేరుగా తమ వద్దకు తీసుకురావాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి, కన్నతండ్రి తీవ్రంగా హింసించిన వార్తలపై చలించిపోయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఈ ఘటనపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జస్టిస్ బొసాలే.. పత్రిక కథనాలను సుమోటోగా రిట్ పిటిషన్గా పరిగణించేందుకు అంగీకరించి, ఆ మేరకు జస్టిస్ ఎస్.వి.భట్తో కలిసి విచారణ చేపట్టింది. -
వెలుగులోకి మరో 'ప్రత్యూష'
హైదరాబాద్: రాజధాని నగరంలో మరో ప్రత్యూష ఉదంతం వెలుగులోకి వచ్చింది. సవతి తల్లి చేతిలో చిత్రహింసలపాలైన మరో యువతికి అధికారులు విముక్తి కల్పించారు. కుషాయిగూడలో గృహనిర్బంధం ఉన్న స్వప్న అనే యువతిని పోలీసులతో సాయంలో బాలల హక్కుల సంఘం నాయకులు విడిపించారు. స్వప్న తండ్రి బెనర్జీ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. స్వప్న తల్లి శకుంతల ఏడేళ్ల క్రితం మృతి చెందింది. దీంతో ఆమె తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచే సవతి తల్లి స్వప్నను హించించడం మొదలు పెట్టింది. కొన్నేళ్లుగా ఆమెను గృహనిర్బంధంలో ఉంచింది. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆమెను విడిపించి ఆస్పత్రికి తరలించారు. -
29న ప్రత్యూష డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో తీవ్ర హింసకు గురై, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష బుధవారం డిశ్చార్జ్ అవుతారని, అందువల్ల ఆమెను సోమవారం కోర్టు ముందు హాజరుపరచలేకపోయామని ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. కోర్టుకు వచ్చేందుకు ప్రత్యూష సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్కుమార్ కోర్టుకు నివేదించారు. అయితే ఆమెను బుధవారం మధ్యాహ్నం 1 గంటకు తమ చాంబర్కు తీసుకురావాలని ధర్మాసనం సూచించింది. ఏ రకమైన ఇబ్బంది కలగకుండా, మీడియా ద్వారా కూడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆమెను నేరుగా తమ వద్దకు తీసుకురావాలని ఆదేశిస్తూ విచారణను 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి, కన్నతండ్రి తీవ్రంగా హింసించిన వార్తలపై చలించిపోయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఈ ఘటనపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జస్టిస్ బొసాలే.. పత్రిక కథనాలను సుమోటోగా రిట్ పిటిషన్గా పరిగణించేందుకు అంగీకరించి, ఆ మేర జస్టిస్ ఎస్.వి.భట్తో కలిసి విచారణ ప్రారంభించారు. -
'ప్రత్యూషను ఎల్లుండి మా ఎదుట ప్రవేశపెట్టండి'
హైదరాబాద్ : తండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రత్యూష కేసు విచారణ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రత్యూష ఆరోగ్యంపై న్యాయస్థానం ఆరా తీసింది. అయితే ఆమెకు మరో రెండు రోజులు చికిత్స అవసరం ఉందని పోలీసులు కోర్టుకు విన్నించారు. బుధవారం మధ్యాహ్నం ప్రత్యూషను తమ ఛాంబర్లో ప్రవేశపెట్టాల్సిందిగా కోర్టు ...పోలీసులకు ఆదేశించింది. అలాగే ఇటువంటి కేసులు తమ దృష్టికి తీసుకు రావాలని పోలీసులకు సూచించింది. అనంతరం కేసు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. -
చిట్టితల్లికి ఎన్ని చిత్రహింసలో!
మొదటి ఫొటోలో మీరు చూస్తున్నది ఎవరినో తెలుసా? కన్న తండ్రి, సవతి తల్లి చేతుల్లో కనీ వినీ ఎరుగని చిత్రహింసలకు గురై.. జీవచ్ఛవంలా ఆస్పత్రిలో పడి ఉన్న ప్రత్యూషనే! అవును.. ఒకవైపు మొహం అంతా కాలిపోయినట్లు ఉండి, ఎముకల గూడులా మారిపోయిన ప్రత్యూష ఒకప్పుడు కుందనపు బొమ్మలా ఇలా చక్కగా ఉండేది. ఈ ఫొటోను, ఇప్పటి ఫొటోను చూస్తే.. అసలు ఆ అమ్మాయేనా ఇలా ఉన్నది అనే అనుమానం రాక తప్పదు. ప్రత్యూష అసలు తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో.. తర్వాత చాముండేశ్వరి అనే మహిళను ఆమె తండ్రి రమేష్ కుమార్ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి ప్రత్యూషతో బలవంతంగా యాసిడ్ తాగించడం, సిగరెట్లతో కాల్చడం లాంటి వికృత చర్యలకు పాల్పడ్డారు. దాంతో దాదాపు జీవచ్ఛవంలా మారిన ఆమె.. ఎలాగోలా బయటపడింది. ప్రస్తుతం ఆమె సవతి తల్లి, కన్న తండ్రి ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను హాస్టల్లో చేర్చి, మంచి చదువు చెప్పిస్తామని.. మంచి అబ్బాయిని చూసి తన సొంత ఖర్చుతో పెళ్లి చేయిస్తామని కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఈమే బతికుంటే.. ఈ ఫొటోలో కనిపిస్తున్నమహిళే ప్రత్యూష అసలు తల్లి. ఈమె ఆత్మహత్య చేసుకోవడం వల్లే రమేష్ కుమార్ రెండో పెళ్లి చేసుకున్నాడు. చాముండేశ్వరి అనే ఆ మహిళ.. ప్రత్యూషను కన్న కూతురిలా చూడకుండా, ఇంట్లో ఆమెను భారంగా భావించింది. దాంతో చిత్రహింసల పాలు చేసింది. - వాసుదేవరెడ్డి, సాక్షి టీవీ -
ప్రత్యూష కేసు విచారణ వాయిదా
-
ప్రత్యూష కేసు విచారణ వాయిదా
హైదరాబాద్: కన్నతండ్రి, పిన్ని చేతిలో చిత్రహింసలు భరించి కోలుకున్న ప్రత్యూష ఆరోగ్యంపై డాక్టర్లు ఇచ్చిన నివేదికను హైకోర్టుకు ఎల్బీ నగర్ పోలీసులు సమర్పించారు. ప్రత్యూష ఆరోగ్య కారణాలను దృష్టిలో విచారణను వచ్చే సోమవారంకు కోర్టు వాయిదా వేసింది. చదువు మధ్యలో ఆపేసి గృహహింసకు గురౌవుతున్నవారి సంఖ్య తెలపాలని రెండు రాష్ట్రాల అడ్వేకేట్ జనరల్స్ ను హైకోర్టు ఆదేశించింది. ఏపీ సర్కారును సైతం ఈ కేసులో ప్రతివాదిగా చేర్చింది. ప్రభుత్వ నిధులు బాధితులకు అందకుండా దుర్వినియోగం అవుతున్నాయని, ఆర్టికల్ 14 ఉల్లంఘన జరుగుతోందని హైకోర్టు పేర్కొంది. కాగా ప్రత్యూష రక్షణ బాధ్యత తీసుకుంటామని హైకోర్టును అవేర్ ఫౌండేషన్ ఆశ్రయించింది. ప్రత్యూష లాంటి 14 మంది బాలికలు తమ సంరక్షణలో ఉన్నారని న్యాయస్థానానికి తెలిపింది. -
'ప్రత్యూష కోలుకునేందుకు మరోవారం'
-
'ప్రత్యూషకు మరోవారం విశ్రాంతి అవసరం'
హైదరాబాద్ : ప్రత్యూష కోర్టుకు హజరయ్యే స్థితిలో లేదని, మరో వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమంటూ ఆమెకు చికిత్స చేస్తున్న అవేర్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వైద్యులు ఈ మేరకు ఆమె ఆరోగ్యంపై సోమవారం ఎల్బీనగర్ పోలీసులకు నివేదిక ఇచ్చారు. వైద్యుల నివేదికను పోలీసులు ఇవాళ హైకోర్టుకు సమర్పించనున్నారు. కాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాతే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎదుట ప్రత్యూషను హాజరు పరచనున్నారు. మరోవైపు నేడు హైకోర్టులో ప్రత్యూష కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రత్యూష తండ్రి రమేష్తో పాటు ఆమెను కూడా న్యాయస్థానం ఎదుట హాజరు పరచాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ప్రత్యూష ఆరోగ్యం కుదుటపడాల్సి ఉందని, ఆమెకు మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో హైకోర్టు ఆదేశాల తర్వాత ప్రత్యూష విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక రమేష్ ను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. -
ప్రత్యూషను నిమ్స్కు తరలించాలి
బాలల హక్కుల సంఘం డిమాండ్ హైదరాబాద్: సవతితల్లి చేతిలో తీవ్రంగా గాయపడి గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను నిమ్స్కు తరలించాలని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రత్యూషను ఆదుకునేందుకు చాలా మంది దాతలు ముందుకు వచ్చారని, ఇప్పటి వరకు రూ.1.75 లక్షలు విరాళంగా వచ్చాయని వెల్లడించింది. అయితే, ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యూషకు ఉచితంగా వైద్యం చేస్తున్నట్లు ప్రకటిస్తూనే.. దాతల ద్వారా వచ్చిన ఆర్థిక సహాయాన్ని వైద్య ఖర్చుల కింద సొంత ఎకౌంట్లో జమ చేసుకుంటోందని ఆరోపించింది. రూ.1.22 లక్షలు వైద్య ఖర్చుల కింద చూపుతూ, రూ.55 వేలు మాత్రమే బ్యాలెన్స్ చూపిస్తోందని ఆరోపించింది. దాతల నుంచి అందిన ఆర్థిక సహాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది. కాగా, ఆస్పత్రిలో ప్రత్యూషకు రక్షణగా ఉన్న కానిస్టేబుల్ స్థానంలో తల్లిలా ఆదరించే మహిళా పోలీసులను రక్షణగా ఏర్పాటు చేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు పోలీసు యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు పేరు చెప్పి బాలల హక్కుల సంఘం ప్రతినిధులు.. ప్రత్యూషను కలవకుండా అడ్డుకుంటున్న ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. డిశ్చార్జ్ సమయంలో తిరిగి ఇస్తాం: డాక్టర్ రవీంద్రనాథ్, గ్లోబల్ ఆస్పత్రి సీఎండీ ప్రత్యూష వైద్యానికి దాతలు అందించిన డబ్బులను ఆస్పత్రి యాజమాన్యం వైద్య ఖర్చులకు వాడుకుంటున్నట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని గ్లోబల్ ఆస్పత్రి సీఎండీ రవీంద్రనాథ్ వివరణ ఇచ్చారు. ఆమెకు ఉచితంగా వైద్యం చేస్తున్నామని, ఇప్పటికే ఆ విషయాన్ని కోర్టుకు కూడా తెలిపామన్నారు. ప్రత్యూష డిశ్చార్జైన సమయంలో అధికారుల సమక్షంలో డబ్బులను తిరిగి ఇచ్చివేస్తామని తెలిపారు. -
అభినందనీయమే కానీ...?
'సొంత బిడ్డలా చూసుకుంటా. ఎంత ఖర్చయినా నీ ఆరోగ్యం బాగయ్యే వరకు ప్రభుత్వమే చూసుకుంటుంది. భవిష్యత్తులో నీ చదువుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. నీకు ఇల్లు కట్టించి ఇస్తా. మంచి అబ్బాయిని చూసి నా సొంత ఖర్చులతో నీ పెళ్లి జరిపిస్తా'... అంటూ ప్రత్యూషకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భరోసా ఇచ్చారు. కన్నతండ్రి, సవతి తల్లి పెట్టిన చిత్రహింసలతో ఆస్పత్రిపాలైన ప్రత్యూషను కేసీఆర్ శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యూషపై సీఎం చూపిన ఔదార్యం అభినందనీయం. అయితే ముఖ్యమంత్రిగా ప్రత్యూష లాంటి వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. బాల్యంలో చిత్రహంసలు పాలవుతున్నవారి సంఖ్య నానాటికి పెరుగుతోందని సర్కారీ గణంకాలే వెల్లడిస్తున్నాయి. అయినవారితో పాటు అసాంఘిక శక్తుల బారిన పడి ఎంతో మంది అభాగ్య బాలలు చిత్రహింసల పాలవుతున్నారు. ఇలాంటి కేసులో పోలీసులు సీరియస్ గా స్పందించిన దాఖలాలు బహుస్వల్పం. ప్రత్యూషపై అమానుష కాండను మీడియా హైలెట్ చేయడంతో పాటు హైకోర్టు సీరియస్ గా స్పందించడంతో ఆమెకు న్యాయం జరిగింది. వెలుగులోకి రాని దయనీయ బాలల పరిస్థితి ఏంటి? అదృష్టవశాత్తు నరకకూపం నుంచి బయపడినా అభాగ్యుల సంరక్షణకు సరైన వ్యవస్థ లేకపోవడంతో సమస్య మళ్లీ మొదటికే వస్తోంది. పునరావాస కేంద్రాలు జైళ్లను తలపిస్తుడడంతో ఇక్కడ ఉండలేక బాలలు పారిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని ఓ పునరావాస కేంద్రం నుంచి 13 మంది బాలలు పరాయ్యారు. ప్రత్యూష విషయంలో స్పందించినట్టుగానే అధికార యంత్రాంగం.. అభాగ్యులను ఆదుకునేందుకు తగిన వ్యవస్థ ఉంటే దీనబాలలకు స్వాంతన లభిస్తుంది. బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు చక్కదిద్దే వ్యవస్థ లేకపోవడం పెద్ద లోటు. బాలలకు ఎలాంటి హక్కులు ఉంటాయి, వాటిని ఎలా కాపాడాలన్నదానిపై అటు అధికారులకు, ఇటు పాలకులకు పెద్దగా అవగాహన ఉండడం లేదు. పాఠశాల స్థాయిలోనూ బాలల హక్కుల ఊసే లేదు. బాలల హక్కుల సంఘం ఉన్నా దాని పరిధి పరిమితం. చిన్నారుల సంరక్షణకు సర్కారు ఇకనైనా నడుంబిగించాలి. ఈ దిశగా చర్యలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టాలి. చిన్నారులు రాక్షసుల బారిన పడకుండా కట్టుదిట్టమైన వ్యూహం రూపొందించాలి. రాక్షసుల బారి నుంచి కాపాడిన బాలలను అన్నిరకాలుగా ఆదుకుని వారి భవితకు బంగారు బాటలు పరిచేలా వ్యవస్థ రూపుదాల్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రత్యూష లాంటి వారందరినీ సీఎం వ్యక్తిగతంగా పరామర్శించడం సాధ్యం కాదు కానీ ఆమెలా మరొకరు చిత్రహింసల పాలవకుండా చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంది. -
మ.3 గంటలకు ప్రత్యూషను కలవనున్నకేసీఆర్
హైదరాబాద్: సవతి తల్లి, కన్న తండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న ప్రత్యూషను సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సతీసమేతంగా కలవనున్నారు. కాగా మీడియాలో ప్రత్యూషపై వచ్చిన కథనాలు చూసి కేసీఆర్ చలించిపోయారు. అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. తల్లిని కోల్పోయిన ప్రత్యూషను ఎవరూ చేరదీయకపోవడం పట్ల సీఎం కేసీఆర్ ఆవేదన చెందారు. సవతి తల్లి, కన్నతండ్రి పెట్టిన చిత్రహింసలు భరిస్తూ ఆమె నరకం చూసిందంటూ శుక్రవారం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ప్రత్యూష పరిస్థితి తనకు తరచూ గుర్తుకొస్తోందన్నారు. దీంతో ప్రత్యూష కు సంబంధించిన అన్ని విషయాలను ఇకపై ప్రభుత్వం తరపున తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సరూర్ నగర్ లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్ లో చికిత్ప పొందుతున్న ప్రత్యూషను ఆయన కలవనున్నారు. కాగా ఉదయం 10 గంటలకు ప్రత్యూషను కేసీఆర్ దంపతులు కలవాల్సి ఉన్నా నగరంలో పుష్కరాల వాహనాల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ తో ఆయన ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసుకున్నారు. కాగా నగర శివార్లలో ఏర్పడిన ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వారాంతంతో పుష్కరాలకు భక్తుల రద్దీ పెరగడంతో పుష్కర ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. టోల్ గేట్ల వద్ద ఆలస్యం జరగకుండా చూడాలన్నారు. ఘాట్ల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 24 గంటల పాటు ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లు , పడవలు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. -
ప్రత్యూష బాధ్యతలు నావే: సీఎం
-
ప్రత్యూష బాధ్యతలు నావే: సీఎం
నేడు సతీసమేతంగా పరామర్శించనున్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడిన ప్రత్యూష బాధ్యతలను పూర్తిగా స్వీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆమె ఆలనాపాలనా చూడటంతో పాటు చదువుకు అయ్యే ఖర్చునూ భరించాలని నిర్ణయించారు. మీడియాలో వచ్చిన ప్రత్యూష కథనాలు చూసి ఆయన చలించిపోయారు. అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. తల్లిని కోల్పోయిన ప్రత్యూషను బంధువులు ఎవరూ చేరదీయకపోవడం పట్ల సీఎం ఆవేదన చెందారు. సవతి తల్లి, కన్నతండ్రి పెట్టిన చిత్రహింసలు భరిస్తూ ఆమె నరకం చూసిందంటూ శుక్రవారం ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రెండు రోజులుగా ప్రత్యూష దైన్యం తనకు తరచూ గుర్తుకొస్తోందన్నారు. ప్రత్యూషకు సంబంధించిన అన్ని విషయాలను ఇకపై ప్రభుత్వం తరపున తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. సరూర్నగర్లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను శనివారం సీఎం కేసీఆర్ సతీసమేతంగా కలవనున్నారు. నేను అండగా ఉంటా: పోసాని ప్రత్యూష పరిస్థితి చూసి తన హృద్రయం ద్రవించిపోయిందని సినీనటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆమె సంరక్షణ బాధ్యతను చూసేందుకు ప్రభుత్వం, బంధువులెవరూ ముందుకు రాకపోతే...ఆ బాధ్యతను తాను తీసుకుంటానని శుక్రవారం ‘సాక్షి’కి చెప్పారు. కాగా, ప్రత్యూషను అక్కున చేర్చుకునేందుకు దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రి, ఆంధ్రమహిళా సభ సంస్థలు ముందుకు వచ్చాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రత్యూషకు హాస్టల్ వసతితో పాటు చదువుకునే అవకాశం కల్పిస్తామని ప్రకటించాయి. -
ప్రత్యూషతో స్వయంగా మాట్లాడతాం
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి శ్యామల, కన్నతండ్రి రమేశ్ కుమార్ చేతుల్లో తీవ్ర హింసకు గురై, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషతో స్వయంగా తాము మాట్లాడదలచామని, ఆమెను సోమవారం తమ ముందు హాజరుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆమె మేనమామను కూడా కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలంది. ప్రత్యూష భవిష్యత్తు గురించి ఆమెతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి తీవ్రంగా హింసించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై చలించిపోయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఈ ఘటనపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు లేఖ రాశారు. పత్రిక కథనాల ఆధారంగా ఈ ఘటనను సుమోటో పిటిషన్గా పరిగణించి విచారణ జరపాలని కోరారు. దీనికి అంగీకరించిన జస్టిస్ బొసాలే.. పత్రిక కథనాలను సుమోటో రిట్ పిటిషన్గా పరిగణించేందుకు అంగీకరించి, ఆ మేరకు జస్టిస్ ఎస్.వి.భట్తో కలిసి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. గురువారం నాడు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు తాను స్వయంగా ఆసుపత్రికి వెళ్లి ప్రత్యూషతో మాట్లాడానని, ఆమె శారీరకంగా, మానసికంగా బాగానే ఉన్నారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్కుమార్ తెలిపారు. అంతేకాక ప్రత్యూష పెద్దమ్మ, పెదనాన్న కోర్టు ముందు హాజరయ్యారని వివరించారు. దీంతో ధర్మాసనం వారిద్దరినీ తమ వద్దకు పిలిపించుకుని పలు విషయాల గురించి మాట్లాడింది. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ, ప్రత్యూష తండ్రి జీతం ఎంత..? ఆయనకు ఇతర ఆదాయ మార్గాలు ఏవైనా ఉన్నాయా..? ప్రత్యూష పేరు మీద ఉన్న ఇంటి వివరాలను సేకరించి వాటిని తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ‘బేటీ బచావో-బేటీ పడావో’ పథకం గురించి అధ్యయనం చేసి, అది ప్రత్యూషకు ఏ రకంగా ఉపయోగపడగలదో చెప్పాలంది. ప్రత్యూషను తాత్కాలికంగా ప్రైవేటు వసతి గృహాల్లో ఉంచే విషయంపై పరిశీలన చేయాలని శరత్కుమార్కు ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
ప్రత్యూషను కలవనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్: సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పరామర్శించనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి ఎల్బీనగర్లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లి ప్రత్యూషతో మాట్లాడనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సీఎం ఒక ప్రకటనలో చెప్పారు. ప్రత్యూష బాధ్యతలను ప్రభుత్వమే స్వకరిస్తుందని సీఎం చెప్పారు. అయితే ఆమెతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు హైకోర్టు కూడా ప్రత్యూష కేసును సీరియస్ గా తీసుకుంది. బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటామని పలువురు ప్రముఖులు ముందుకువస్తున్నారు. ఈ కేసులో సవతితల్లి ఇప్పటికే జైలులో ఉండగా, తండ్రి రమేష్ ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అందరూ ఉన్నా అనాథలా...
హైదరాబాద్: పెదనాన్న డిప్యూటీ కలెక్టర్, మేనమామ అడ్వకేట్ అయినా ఆమెను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. సవతి తల్లి చేతిలో చిత్రహింసలు అను భవిస్తున్నా ఆమెను ఆదుకున్నవారే లేరు. నరక కూపం నుంచి బయటిపడినా ఆమెను అక్కున చేర్చకునే వారు లేక ఆ అభాగ్యురాలు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతం. ఆమె విషాదగాధ ఉన్నత న్యాయస్థానాన్ని సైతం కదిలించింది. సవతి తల్లి చేతిలో చిత్రహింసలు అనుభవించి కోలుకున్న ప్రత్యూష భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఆమె సంరక్షణకు ఎవరూ ముందుకు రాకపోవడం బాధ కలిగిస్తోందని హైకోర్టు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పథకం 'బేటీ బచావో బేటీ పడావో' ఆమెకు వర్తించేలా చూడాలని అధికారులను కోర్టు ఆదేశించింది. పిన్ని చాముండేశ్వరి ముఖం చేసేందుకు ప్రత్యూష ఏమాత్రం ఇష్టపపడడం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇంతజరిగినా పశ్చాత్తాపం లేకపోవడంతో చాముండేశ్వరి తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిశ్చార్జి అనంతరం ప్రత్యూషను చీఫ్ జస్టిస్ ఛాంబర్ లో హాజరుపరచాలని సూచించింది. ప్రత్యూష తండ్రి రమేశ్, మేనమామ అయిన న్యాయవాది సాయిప్రతాప్ ను సోమవారం తమ ఎదుట హాజరుపరచాలని అధికారులను కోర్టు ఆదేశించింది. కాగా, కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యూష పెదనాన్న సతీశ్ చంద్ర శుక్రవారం హైకోర్టులో హాజరయ్యారు. ప్రత్యూష కుటుంబ సభ్యులు, ఆస్తుల వివరాలను ఆయనను అడిగి న్యాయస్థానం తెలుసుకుంది. -
మేం చెప్పే వరకు ఆసుపత్రిలోనే ప్రత్యూష
సాక్షి, హైదరాబాద్: ‘మేం చెప్పే వరకు ప్రత్యూషను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయకుండా చర్యలు తీసుకోవాలి.’ అని హైకోర్టు గురువారం రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రత్యూషకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్న అవేర్ గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లను, సిబ్బందిని హైకోర్టు అభినందించింది. ఆమె సంరక్షణ విషయాలను చర్చించేందుకు ఆమె పెద్దనాన్న కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్కుమార్కు సూచించింది. అన్ని కోణాల్లో పూర్తి వివరాలను తెలుసుకున్న తరువాతే ఆ యువతి భవిష్యత్తు గురించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి తీవ్రంగా హింసించి ఆమె చేత యాసిడ్ తదితర ప్రమాదకర రసాయనాలు తాగించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై చలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు లేఖ రాశారు. దీనిని సుమోటో పిటిషన్గా పరిగణించి విచారించాలని కోరారు. దీనికి అంగీకరించిన జస్టిస్ బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్తో కలిసి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై నివేదికను స్పెషల్ జీపీ శరత్కుమార్ ధర్మాసనం ముందుంచారు. ప్రత్యూష తండ్రి రమేష్ను పోలీసులు అరెస్ట్ చేశారని, ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, శరీరంపై ఉన్న గాయాలు మానుతున్నాయని తెలిపారు. అవేర్ ఆసుపత్రి ఉచితంగా చికిత్సను అందిస్తోందని, రెండు, మూడు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేయవచ్చని డాక్టర్లు తెలిపారని ఆయన వివరించారు. ప్రత్యూష వద్దకు ఆమె పెద్దమ్మ, పెద్దనాన్న వచ్చి వెళ్లారని శరత్కుమార్ చెప్పడంతో, అయితే ఆమె పెద్దనాన్నను శుక్రవారం కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని ధర్మాసనం ఆదేశించింది. -
అన్నివిధాలా ఆదుకుంటాం: పొంగులేటి
హైదరాబాద్: అవేర్గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రత్యూష నర్సింగ్ కోర్సు పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నదని ఆమెకు వైఎస్ఆర్సీపీ అండగా ఉండి చేయూత నంది స్తుందన్నారు. గతంలో ఆమె గర్ల్స్ స్టేట్ హోంలో ఆశ్రయం పొందిందని అక్కడ కూడా సరైన వసతులు లేవన్న సంగతి బాధితురాలి ఆవేదన ఆధారంగా తనకు తెలిసిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పం దించి తగిన వసతులు కల్పించాలని కోరా రు. ప్రత్యూషకు ఉచిత వైద్య సేవలందిం చిన ఆసుపత్రి యాజమాన్యంతో పాటు అండగా నిలబడిన బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు, బాలల హక్కు ల సంఘం అధ్యక్షురాలు అనూరాధలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. -
ప్రత్యుషకు పొంగులేటి పరామర్శ!
-
పోలీసుల అదుపులో ప్రత్యూష తండ్రి!
-
కటకటాల్లో కసాయి తండ్రి
-
ప్రత్యూషపై ఆస్తి కోసమే దాడి జరిగిందా?
హైదరాబాద్: నగరంలోని నాగోల్ లో కన్నతండ్రి, పినతల్లి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రత్యూష కేసును సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రత్యూష మానసిక, శారీరక స్థితిపై నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఆస్తుల కోసమే ప్రత్యూషపై దాడి జరిగిందా అని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. కేసుపై తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. సవతితల్లి పైశాచికత్వానికి తీవ్రగాయాలపాలైన ప్రత్యూష ప్రస్తుతం సాగర్ హైవేలోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ కేసులో పోలీసులు చాముండేశ్వరిని అరెస్టు చేయగా, ప్రత్యూష తండ్రి రమేష్ ఇంకా పరారీలో ఉన్నాడు. -
అయ్యో పాపం!.
-
యాసిడ్ తాగించి, సిగరెట్లతో కాల్చి...
-
యాసిడ్ తాగించి, సిగరెట్లతో కాల్చి...
హైదరాబాద్ : సవతి తల్లి చేతిలో చిత్ర హింసలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష ఆరోగ్యంపై అవేర్ ఆస్పత్రి వైద్యులు శుక్రవారం హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ప్రత్యూష ఆరోగ్యం నిలకడగానే ఉందని, వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఆమె శరీరంపై బలమైన గాయాలు ఉన్నాయని, అన్నింటికీ చికిత్స చేసినట్లు చెప్పారు. ఆమె అంతర్గత (ప్రయివేట్ పార్ట్స్)అవయవాలపై యాసిడ్తో దాడి చేశారని, సిగరెట్లతో కాల్చి, యాసిడ్ కూడా తాగించినట్లు అవేర్ వైద్యులు వెల్లడించారు. సకాలంలో ప్రత్యూషను పోలీసులు ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని చెప్పారు. సవతి తల్లి చాముండేశ్వరి ఏడాది కాలంగా ప్రత్యూష గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న మానవ హక్కుల కమిషన్, పోలీసులు బాధితురాలి ఇంటిపై దాడిచేసి ఆమెను బుధవారం గృహనిర్బంధం నుంచి విముక్తి కలిగించిన సంగతీ విదితమే. ప్రస్తుతం ప్రత్యూషకు రీనల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి, గ్యాస్ట్రో, గైనకాలజీ, పల్మనాలజీ విభాగాల వైద్యులతో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను బంధువులు కూడా పట్టించుకోవటం లేదు. -
ప్రత్యూషకు సాయమందించండి
హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్ర హింసలకు గురైన ప్రత్యూషకు ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనూరాధరావు డిమాండ్ చేశారు. టెలిఫోన్ శాఖలో జూనియర్ ఇంజినీర్గా పనిచేస్తున్న రమేష్, అతని రెండో భార్య చాముండేశ్వరి అలియాస్ శ్యామలలు ప్రత్యూషను క్రూరంగా హింసించారని... ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రత్యూష తండ్రి రమేష్ను వెంటనే అరెస్ట్ చేసి, ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో ప్రత్యూషకు చికిత్స పినతల్లి, తండ్రి వేధింపులు, నిర్బంధం కారణంగా తీవ్రంగా గాయపడిన ప్రత్యూషను చికిత్స నిమిత్తం ఎల్బీనగర్లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. గురువారం హాస్పిటల్లో అడ్మిట్ అయిన ప్రత్యూషను రీనల్ ఇంటెన్సివ్ కేర్లో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యూషను బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు అచ్యుతరావు పరామర్శించి ఆమె ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
హెచ్సీయూ విద్యార్థులకు భారీ వేతనాలు
క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 47 మందికి ఉద్యోగాలు ఇద్దరికి 7.20 లక్షల వార్షిక వేతనం సెంట్రల్ యూనివర్సిటీ: క్యాంపస్ ప్లేస్మెంట్లలో హెచ్సీయూ విద్యార్థులు సత్తా చాటారు. వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబర్చి రూ.7.20 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యారు. 12 ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించగా వివిధ విభాగాలకు చెందిన 490 మంది విద్యార్థులు హాజరయ్యారు. హెచ్సీయూ క్యాంపస్ ప్లేస్మెంట్ సెల్ సహకారం అందించింది. రూ.3.50 లక్షల వార్షిక వేతనం నుండి మొదలుకుని గరిష్టంగా రూ.7.20 లక్షల వార్షిక వేతనాలిచ్చే ఉద్యోగాలను విద్యార్థులు సాధించారు. సత్తా చాటిన భావన, ప్రత్యూష క్యావియం సంస్థ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఎంటెక్ విద్యార్థినిలు ఏ.భావన, జి.ప్రత్యూషలు రూ.7.20 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యారు. ఎంటెక్, ఎంసీఏ విభాగంలో టెరేడాటా, క్యావియం నెట్వర్క్స్, మ్యూ సిగ్నా, వన్ కన్వర్వజెన్స్, టీసీఎస్, ఐబీఎం సంస్థలు 25 మంది హెచ్సీయూ విద్యార్థులకు ఉద్యోగాల ఆఫర్ను ఇచ్చాయి. ఎంబీఏ విభాగంలో లావా మొబైల్స్, టీసీఎస్, డెలాయిట్, ప్రొకర్నా సంస్థలు 13 మందిని ఎంపిక చేశాయి. ఎంటెక్, ఎకనామిక్స్, మ్యాథమ్యాటిక్స్ విభాగంలో హెచ్ఎస్బీసీ 81 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించి 8 మందిని ఎంపిక చేసింది. ఎంసీఏ విభాగంలో వర్చుసా కంపెనీ ఒకరిని ఎంపిక చేసింది. -
‘నిర్భయ’లు చిగురించాలి
ఆ ఘటనకు నేటితో రెండేళ్లు. పచ్చగా ఎదుగుతున్న ఒక లేలేత చిగురుటాకును ఢిల్లీ నడివీధుల్లో కొందరు ముష్కరులు నడి రాత్రి చిదిమేసిన ఆ కాళరాత్రికి నేటితో రెండేళ్లు. పేదరికంతో మగ్గుతున్న కుటుంబానికి ఆసరాగా ఉండాలని, సోదరుడి చదువుకు సాయపడాలని ఆ చిన్ని జీవితం కన్న కలల్ని, క్షణంలో కల్లలుగా చేసిన ఘటనకు దేశరాజధానే సజీవ సాక్ష్యమై నిలి చింది. మన గొప్ప దేశంలో పసిపిల్లలకు, బాలిక లకు, వివాహితులకు, చివరకు కాటికి కాచుకున్న పండు ముదుసళ్లకు కూడా రక్షణలేదు. ఈ భయా నక సామాజిక దౌష్ట్యానికి మారుపేరు అత్యాచా రం. ఈ దేశ స్త్రీ పొందిన జాతీయ అవమానానికి సంకేతం నిర్భయ. బతుకుపై గంపెడాశలు పెట్టుకుని కనుమ రుగైన జ్యోతిసింగ్ పాండే నేడు భారతీయ మహిళల చైతన్యం లో, తిరుగుబాటులో సజీవమైనిలుస్తోంది. తమకు జరిగిన అవ మానాన్ని దిగమింగి ఊరు కోకుండా వందలాది మంది భారత స్త్రీలు ఇవ్వాళ గొంతెత్తి నినదిస్తున్నారంటే ఆ జ్యోతి వెలిగించిన చైతన్యమే కారణం. ఆ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన నిర్భయను జీవితంలో ప్రతిక్షణంలోనూ గుర్తుంచుకోవడమే నివాళి. ప్రత్యూష హైదరాబాద్ -
ప్రత్యూష ఆరో గేమ్ డ్రా
సాంగ్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష మరో డ్రాను నమోదు చేసింది. గురువారం నిమ్మి ఏజీతో జరిగిన ఆరో రౌండ్ గేమ్ను ప్రత్యూష 32 ఎత్తుల వద్ద డ్రా చేసుకుంది. తెల్ల పావులతో ఆడినా ప్రత్యూషకు విజయం మాత్రం దక్కలేదు. ఇవానా మరియా ఫుర్టాడోతో జరిగిన మరో గేమ్లో తెల్లపావులతోనే ఆడిన ఏపీ అమ్మాయి కె.లక్ష్మీ ప్రణీత 56 ఎత్తుల్లో ఓడింది. ఇంటర్నేషనల్ మాస్టర్ మోహిత నిషాతో జరిగిన గేమ్లో తెలంగాణ క్రీడాకారిణి హిందుజా రెడ్డి 47 ఎత్తుల తర్వాత ఓటమిపాలైంది. -
సేవకు ఆకాసమంత..
సమాజానికి ఉపయోగపడే ఏ కార్యక్రమానికైనా చేయూతనిస్తానని సినీనటి, ప్రత్యూష సపోర్ట్ వ్యవస్థాపకురాలు సమంత అన్నారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో బుధవారం హెపటైటిస్ బీపై అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రత్యూష సపోర్ట్ ఆధ్వర్యంలోని చిన్నారుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ సందర్భంగా సమంత మాట్లాడుతూ ప్రధాని మోదీకి తన మద్దతును తెలిపారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని, ముఖ్యంగా ఇటీవల ప్రారంభించిన ‘స్వచ్ఛభారత్’ తననెంతో ఆకట్టుకుందన్నారు. అందులో పాల్గొనాలని తననెవరూ ఆహ్వానించలేదని, పిలిస్తే తప్పకుండా పార్టిసిపేట్ చేస్తానని చెప్పారు. - సిటీప్లస్ -
బేబీ షవర్!
సృష్టిలో ప్రాణికి మూలం అమ్మ. ఆ అమ్మతనానికి పండుగ.. సీమంతం. చేతి నిండా గోరింట పూసి.. గాజులు వేసి.. కడుపులో ఉన్న బిడ్డకు సంగీతాన్ని పరిచయం చేసి.. పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటూ అతిథులు మనసారా దీవించే వేడుక. ఆ సంప్రదాయ సీమంతం కాస్తా నగరంలో ‘బేబీ షవర్’ అయ్యింది. ప్రపంచంలోకి అడుగిడబోయే బేబీకి ముందుగానే ఆహ్వానం పలుకుతూ ఆత్మీయులు మోడరన్గా చేస్తున్న సెలబ్రేషన్.. బేబీ షవర్! సాధారణంగా అమ్మాయి తల్లిదండ్రులు ఆడంబరంగా జరిపే ఈ వేడుకను గ్రాండ్గా కాబోయే తల్లి ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేస్తున్నారిప్పుడు. సీమంతానికయితే బొట్టు పెట్టి పిలుస్తారు. కానీ ఇన్విటేషన్ కార్డ్తోనే ఈ ఈవెంట్ కొత్తదనం మొదలవుతుంది. ఓ పెళ్లి పత్రికలా ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేయిస్తున్నారు. తొలిసారి అమ్మతనంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్నవారు మాత్రం ఆత్మీయులతో తమ ఆనందాన్ని పంచుకోవడానికి చాలా ప్లాన్లు వేసుకుంటున్నారు. డిఫరెంట్ థీమ్స్ ఇప్పుడు బేబీ షవర్ కోసం రకరకాల థీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన థీమ్ను ఎంచుకుని చెబితే సరి.. పెళ్లికి పందిరి డెకరేట్ చేసినట్టుగా ఇంటిని లేదా బంకిట్ హాల్ను పూర్తిగా డెకరేట్ చే సేవాళ్లున్నారు. వేడుకలో టేస్ట్ను బట్టి థీమ్ ఉంటుండగా.. ఆ డెకరేషన్స్లో అధికశాతం రంగులు మాత్రం రెండే ఉంటున్నాయి. అవి నీలం... గులాబీ! అవును ప్లజెంట్గా కనిపించే బ్లూ, పింక్కే ఓటేస్తున్నారు కాబోయే తల్లిదండ్రులు. ఇక కాబోయే తల్లిని ఊహల్లో తేలియాడించే బెలూన్స్ అయితే కంపల్సరీ. అట్రాక్టివ్ కేక్స్ ఈ బేబీ షవర్స్లో మరో ప్రత్యేక ఆకర్షణ కేక్స్. మీకు అభిరుచి ఉండాలే కానీ, ఐడియా చెబితే చాలు.. మీ ఆలోచనలకు తగ్గ కేక్ అందంగాతయారవుతుంది. ప్రెగ్నెంట్ లేడీ బొమ్మతో ఉన్న కేక్ ఒకటయితే..పుట్టబోయేది అమ్మాయో? అబ్బాయో? అని ఊహిస్తూ ఉండే కేక్ మరొకటి. ఇక ట్విన్స్ కోసం ప్రత్యేక కేక్. బేబీ బోయ్, బేబీ గర్ల్ కోసం డిఫరెంట్ కేక్స్. ఇలా అన్నీ ఇన్నోవేటివ్. ఈ బేబీ షవర్లో ఫుడ్ అయితే ఉంటుంది కానీ.. ఇది పూర్తి స్థాయి విందులా ఉండదు. స్పెషల్ గేమ్స్ కాబోయే తల్లిని బిడ్డతో ఆడేందుకు సంసిద్ధం చేసేందుకు గేమ్స్ కూడా ఉంటాయి బేబీ షవర్లో. అయితే అవి బేబీ పుట్టుకకు సంబంధించినవి మాత్రమే. ఉదాహరణకు పుట్టబోయేది ఆడబిడ్డా, మగబిడ్డా? టమ్మీ సైజ్ ఎంత? డైపర్ చేతికిచ్చి బేబీ అని పలకకుండా ఆ డైపర్ను ఎలా ఉపయోగిస్తారో చెప్పడం. ఒక నోట్ బుక్ తీసుకుని వచ్చిన అతిథులందరూ డెలివరీ తరువాత పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు రాయమని అడగడం. వేడుకకు వచ్చిన అతిథులందరూ కూర్చుని మధ్యలో బాల్తో మ్యూజిక్ అండ్ డ్యాన్స్, మ్యూజికల్ చైర్, పుట్టబోయే బిడ్డకు పది సెకన్లలో పేరు సూచించడంలాంటి ఆటలన్నమాట. ఇన్నోవేటివ్ గిఫ్ట్స్ బేబీ షవర్కు వెళ్లేవాళ్లు ఏ కానుక తీసుకెళ్లాలా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లో రకరకాల గిఫ్ట్స్ అందుబాటులో ఉన్నాయి. బేబీకి ఉపయోగపడే డైపర్స్ నుంచి బ్లాంకెట్స్, బేబీ బాటిల్స్, క్లాత్స్, బొమ్మలు, బుక్స్, మొక్కలు, డెలివరీ కిట్, బేబీ బాత్కి అవసరమయ్యే రకరకాల వస్తువులు.. ఇలా కానుకలకు కొదవే లేదు. అయితే ఆయా వస్తువులు పార్టీలోనే ఓపెన్ చేయాలన్న రూల్ ఉంది. ఆహ్వానం మహిళలకు మాత్రమే అనే రూల్ ఉన్నా.. ఇంతమందితో, ఇలాంటి చోట, ఈ సమయంలోనే చేయాలన్న నిబంధన మాత్రం లేదు. ..:: ప్రత్యూష -
ప్రత్యూష్కు చెస్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: వన్డే ర్యాపిడ్ చెస్ టోర్నీలో ప్రత్యూష్ శ్రీవాస్తవ విజేతగా నిలిచాడు. శుక్రవారం దీప్తాంశ్ రెడ్డితో జరిగిన ఆఖరిదైన ఐదో రౌండ్ గేమ్ను ప్రత్యూష్ డ్రా చేసుకున్నాడు. దీంతో ఈ రౌండ్ అనంతరం వీరిద్దరి ఖాతాలో చెరో నాలుగున్నర పాయింట్లు చేరాయి. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ప్రత్యూష్ను విజేతగా ప్రకటించారు. ఇతర గేమ్లలో వరుణ్ (3)పై ఎం.వై. రాజు (4.5) నెగ్గగా... చక్రవర్తి రెడ్డి (4) చేతిలో బిపిన్రాజ్ (3) ఓడాడు. ప్రతీక్ శ్రీవాస్తవ (3.5)-కండి రవి (4); ఫయాజ్ (3.5)-రితేశ్ (3.5)ల మధ్య జరిగిన గేమ్లు డ్రా అయ్యాయి. ఏజ్ గ్రూప్ అండర్-14 బాలుర విభాగంలో తరుణ్ గోపాల్, కృష్ణసాయిలు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బాలికల్లో మనస్విని, కేవీఎన్ శ్రేయ ఒకటి, రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. అండర్-12లో సాయి కౌస్తుభ, యశ్వంత్, సాహిత్య; అండర్-10లో రోహిత్, శ్రీచక్ర, త్రిష; అండర్-8లో సహర్ష్ పట్నాయక్లు విజేతగా నిలిచారు. విజేతలతో ముఖ్య అతిథి ఏపీ చెస్ సంఘం కార్యదర్శి కె. కన్నారెడ్డి -
నోరు మంచిదైతే... మెదడుకూ మంచిదే! రోజూ వాడే బ్రష్తో పక్షవాతాన్నీ తరిమేయండి!
ఇటీవల తమ వద్దకు వచ్చే కేసులతో ఒక కొత్త పరిణామాన్ని గమనించారు దంతవైద్యులు డాక్టర్ ప్రత్యూష, న్యూరాలజిస్ట్ డాక్టర్ పద్మ వీరపనేని. పక్షవాతంతో తన వద్దకు వచ్చిన కేసులను పరిశీలిస్తే... వారికి గతంలో దంత సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చిన కేస్ హిస్టరీని గమనించినట్లు పేర్కొంటున్నారు పద్మ వీరపనేని. అలాగే దంత సంబంధమైన వ్యాధులు జింజివైటిస్, పెరియోడాంటైటిస్ వచ్చి ఉన్న వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువే అంటున్నారు డాక్టర్ ప్రత్యూష. ఈ సంయుక్త పరిశీలన ఫలితాలను బేరీజు వేసి చూస్తే... దంతసంబంధమైన వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదనేది ఆ ఇద్దరు డాక్టర్ల మాట. నోటి శుభ్రతతో పక్షవాతానికి వాత పెట్టవచ్చని వారి సలహా. దంతాలకు వచ్చే జింజివైటిస్, పెరియోడాంటైటిస్ వ్యాధులు దీర్ఘకాలంలో పక్షవాతానికి దారితీసే వైనాన్ని వివరిస్తున్నారు వీరు. చాలామందిలో చిగుర్ల భాగం కాస్తంత ఉబ్బి, ఎర్రగా మారుతుంది. నిజానికి చిగుర్లకు వచ్చే వ్యాధులు నొప్పి లేనివిగా ఉంటాయి. దాంతో చిగుర్లకు వచ్చే వ్యాధుల్ని గుర్తించడం కష్టం. చిగుర్లను ‘జింజివా’ అంటారు. వీటికి వచ్చే ఇన్ఫెక్షనే ‘జింజివైటిస్’. చిగుర్లలోపలి భాగంలో పంటికి గట్టిగా అతుక్కుపోయే గార, బ్యాక్టీరియా వల్ల చిగుర్లవాపు లక్షణంతో కనిపించే జింజివైటిస్ వస్తుంది. ప్రతిరోజూ సరిగా బ్రష్ చేయకపోవడం అనే చిన్న కారణం మొదలుకొని, చాలామందిలో ఉండే పొగాకు నమిలే దురలవాటు వరకు ఈ గార, బ్యాక్టీరియాల పెరుగుదలకు కారణం. మనం రోజూ సరిగా బ్రష్ చేయకపోతే కనీసం 400 రకాల హానికర బ్యాక్టీరియా పళ్ల మధ్య పెరగడానికి ఆస్కారం ఉంది. అలా హానికరమైన బ్యాక్టీరియా కారణంగా పంటిపై గార పెరుగుతుంది. తొలిదశలో గారను సులభంగా తొలగించవచ్చు. కానీ అదే దీర్ఘకాలికంగా ఉంటే తొలగించలేనంత గట్టిగా మారి కాలక్రమంలో పెరియోడాంటైటిస్కు దారితీస్తుంది. ఇది ప్రధానంగా పొగతాగేవారిలో, పొగాకును గుట్కా, ఖైనీ, పాన్పరాగ్ల రూపంలో నమిలేవారిలో మరింతగా ఉంటుంది. నోటి ఆరోగ్యానికీ... పక్షవాతానికీ సంబంధమేమిటి? నోటిజబ్బులకూ, చిగుర్ల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా కొన్ని రకాల విషపదార్థాల (టాక్సిన్స్)ను వెలువరిస్తుంటాయి. ఆ టాక్సిన్స్ రక్తంలో ప్రవేశించి, రక్తప్రవాహానికి అడ్డుపడటానికి కారణమయ్యే కొన్ని రక్తపుగడ్డలు (క్లాట్స్)నూ, కొవ్వు పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ క్లాట్స్, ప్లాక్స్ ఒకవేళ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలకు అడ్డుపడితే గుండెపోటు రావచ్చు. ఇది ఒక థియరీ. ఇక పక్షవాతానికి దారితీసే మరో థియరీ కూడా ఉంది. దీని ప్రకారం... నోటిలో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందినప్పుడు మన కాలేయంలో కొన్ని రకాల ప్రోటీన్లు తయారవుతాయి. అవి రక్తప్రవాహంలోకి తద్వారా మెదడులోని రక్తనాళాల్లోకి ప్రవేశించి రక్తప్రవాహానికి అడ్డుపడటం వల్ల ‘ఇస్కిమిక్ స్ట్రోక్’ (ఒక రకం పక్షవాతం)కు దారితీయవచ్చు. మెదడులో ఏ అవయవాన్ని నియంత్రించే సెంటర్కు రక్తసరఫరా నిలిచిపోతే ఆ భాగం చచ్చుబడి... అలా అది పక్షవాతం రూపంలో వ్యక్తమవుతుంది. ఇదీ నోటిఆరోగ్యానికీ, చిగుళ్ల ఆరోగ్యానికీ... మెదడుకూ ఉన్న సంబంధం. అలాగే కోరపన్నుకు వచ్చే ఇన్ఫెక్షన్ నేరుగా మెదడుకి వెళ్లి కేవర్నస్ సైనస్ థ్రాంబోసిస్ అనే కండిషన్ వస్తుంది. అది నేరుగా పక్షవాతానికి దారితీస్తుంది. ఇక కొందరిలో అసలు పళ్లే ఉండవు. దాంతో చిగుర్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశమే ఉండదు. ఇలా చిగుర్ల ఇన్ఫెక్షన్ లేనివాళ్లలో పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా తక్కువ అన్న దృష్టాంతం కూడా పళ్లకూ, పక్షవాతానికి ఉన్న సంబంధాన్ని స్పష్టం చేస్తోంది. చిగుర్లు ఆరోగ్యంగానే ఉన్నాయని గుర్తించడం ఎలా? చిగుర్లు గులాబి రంగులో ఆరోగ్యంగా కనిపిస్తుంటాయి. ఈ గులాబి రంగు చిగుర్లు కాస్తా ఎర్రగా వాచి కనిపించడం, బ్రష్ చేసుకుంటుంటే చిగుర్ల నుంచి రక్తం రావడం జరిగితే అది చిగుర్ల వ్యాధి (జింజివైటిస్)కి లక్షణంగా భావించాలి. జింజివైటిస్ను నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది దీర్ఘకాలంలో పెరియోడాంటైటిస్కు దారి తీస్తుంది. పెరియోడాంటైటిస్ను గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి... చిగుర్లలో పుండ్లు పడటం, దంతాల మధ్య గ్యాప్ పెరగడం, దంతాలు వదులు కావడం వంటి లక్షణాలతో తెలుసుకోవచ్చు. పక్షవాతానికి బ్రష్తోనూ నివారణ... మనం రోజూ పళ్లు తోముకునే ఒక చిన్న బ్రష్ గుండెజబ్బులతో పాటు పక్షవాతాన్నీ నివారిస్తుందని తెలుసుకోండి. ఒకవేళ ఇప్పుడు మీరు బ్రషింగ్ కోసం చేతిని కదిలించడానికి బద్దకిస్తే... అసలు భవిష్యత్తులో చెయ్యే కదలకుండా చచ్చుబడిపోయే ప్రమాదం ఉందని గుర్తించండి. పంటి పక్కవైపున ఉండే ప్లాక్ను ఫ్లాసింగ్తో (దారం సహాయంతో) తొలగించుకోండి. ఒకవేళ ఇప్పటికే ప్లాక్ చేరి ఉన్నట్లు గుర్తిస్తే డెంటిస్ట్ను కలిసి దాన్ని స్కేలింగ్ వంటి ప్రక్రియలతో తొలగించుకోవాలి. ఒకసారి ఆ పని చేసి ఇక ఆ తర్వాత ఎప్పటికప్పుడు నోటి శుభ్రత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఇది పళ్లను శుభ్రపరచడమే గాక... రక్తనాళాలనూ శుభ్రం చేసి అటు గుండెపోటూ, ఇటు బ్రెయిన్స్ట్రోక్లను నివారిస్తుంది. -నిర్వహణ: యాసీన్ పక్షవాతం రిస్క్ తగ్గించే షార్ట్కట్స్ ఇవి... ఊ రోజూ బ్రషింగ్, ఫ్లాసింగ్ ద్వారా దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారపదార్థాలను తొలగించాలి దంతాలకు బలం చేకూర్చే సమతుల పోషకాహారం తీసుకోవాలి. దంతాలకు తగినంత క్యాల్షియం లభించేలా పాలు, పాల ఉత్పాదనలు తీసుకోండి సిగరెట్, పొగాకుకు సంబంధించిన ఇతర ఉత్పాదనలైన గుట్కా, ఖైనీ, పాన్మసాలా వంటి అలవాట్లను తక్షణం మానేయండి. అవి తీసుకునే సమయంలో భవిష్యత్తులో అదే పక్షవాతానికి కారణం కావచ్చనే మాటను గుర్తుచేసుకోండి. డాక్టర్ ప్రత్యూష దంత వైద్య నిపుణులు, ప్రొఫెసర్, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. డాక్టర్ పద్మ ఎస్. వీరపనేని సీనియర్ న్యూరాలజిస్ట్, అండ్ స్ట్రోక్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్ , సికింద్రాబాద్.