తిరుమల: కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడి ఆలయం వద్ద భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం ఉదయం శ్రీవారి దర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఏడుకొండల వాడి సర్వదర్శనానికి 4 గంటలు, కాలి నడ కన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 49,538 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.