చెన్నై: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధికార, విపక్షాల అభ్యర్థులు శనివారం చెన్నైలో ప్రచారం చేయనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి రామ్నాధ్ కోవింద్ ఉదయం 11 గంటలకు చెన్నైకి చేరుకుని సీఎం ఎడపాడి పళని స్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వంలను కలవనున్నారు. అలాగే తమిళ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ను సైతం కలుసుకుని మద్దతు కోరనున్నట్లు తెలుస్తోంది. యూపీఏ అభ్యర్థి మీరాకుమార్ సాయంత్రం 4 గంటలకు చెన్నైకు చేరుకుని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, స్టాలిన్లను కలువనున్నారు. ఒకేరోజు ఇద్దరు అభ్యర్థులు చెన్నైలో ప్రచారం నిర్వహించనుండడం గమనార్హం.
రేపు చెన్నైలో రాష్ట్రపతి అభ్యర్థులు
Published Fri, Jun 30 2017 7:30 PM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM
Advertisement
Advertisement