campaign
-
ముగిసిన ఢిల్లీ ఎన్నికల ప్రచారం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం(ఫిబ్రవరి5) పోలింగ్ ఉండడంతో 48 గంగల ముందు ప్రచారాన్ని ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం సోమవారం సాయంత్రం నుంచి అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఆపేశాయి.చివరిరోజు ఆమ్ఆద్మీపార్టీ,బీజేపీ,కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ అయితే ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘంపైనే సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్కు రిటైర్మెంట్ తర్వాత గవర్నర్ పోస్టా లేక ఇతర ఏదైనా పెద్ద పోస్టు ఆఫర్ చేసిందా అని ప్రశ్నించారు. కాగా, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీపార్టీ, కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీ మధ్యే ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు ఉండనుంది. కాంగ్రెస్ పోటీ చేస్తున్నప్పటికీ అంతగా ప్రభావం చూపదని తెలుస్తోంది. కాంగ్రెస్ పోటీ వల్ల ఆప్కే నష్టమన్న వాదన వినిపిస్తోంది. గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇటీవల ప్రకటించిన మినహాయింపు ఢిల్లీ ఎన్నికల్లో పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని, ఇది తమను గెలుపు తీరాలకు చేరుస్తుందని బీజేపీ ఆశిస్తోంది. -
Delhi Election 2025: 14 బహిరంగ సభలకు సీఎం యోగి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఒకే దశలో ఫిబ్రవరి 5న ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ముమ్మర ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల నేతలు ప్రచారపర్వంలో మునిగితేలుతున్నారు. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తన హవా చాటనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సీఎం యోగి షెడ్యూల్ను కూడా బీజేపీ వర్గాలు కూడా వెల్లడించాయి. సీఎం యోగి పాల్గొనబోయే సమావేశాలకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి.సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో 14 బహిరంగ సభలలో ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 23న మూడు సమావేశాలు, జనవరి 28న నాలుగు సమావేశాలు, జనవరి 30న నాలుగు సమావేశాలు, ఫిబ్రవరి ఒకటిన మూడు సమావేశాల్లో సీఎం యోగి పాల్గొననున్నారు.యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలోని తూర్పు, ఈశాన్య ఢిల్లీ ప్రాంతాలలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. బీజేపీ అభ్యర్థులు అజయ్ మహాబల్, పవన్ శర్మ, ఆశిష్ సూద్, రవీంద్ర సింగ్, ఉమాంగ్ బజాజ్, ప్రద్యుమాన్ రాజ్పుత్ (ద్వారక), కర్తార్ సింగ్ తన్వర్, గజేంద్ర యాదవ్ (మెహ్రౌలి), బజరంగ్ శుక్లా, సంజయ్ గోయెల్, మోహన్ సింగ్ బిష్ట్, కైలాష్ గెహ్లాట్ మొదలైనవారు పోటీచేస్తున్న ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో యోగి పాల్గొననున్నారు.ఇది కూడా చదవండి: బీహార్ బాలికకు ప్రధాని మోదీని ప్రశ్నించే ఛాన్స్! -
సాక్షి యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కు అనూహ్య స్పందన
-
ఉద్యమంలా డ్రగ్స్ ను నిర్మూలిద్దాం
-
డ్రగ్స్ లేని సమాజం మన లక్ష్యం.. సాక్షితో అంజాద్ భాషా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
-
సాక్షి మీడియా చేపట్టిన Say No To Drugs క్యాంపెయినకి విశేష స్పందన
-
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాల్లో తెలుగు నాయకులు, హామీల వర్షం
సాక్షి, ముంబై: తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు జాతీయ పార్టీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకులను ఎన్నికల ప్రచారంలోకి దింపాయి. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో పర్యటిస్తూ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచార పర్వం ముగిసే వరకు అనేక మంది తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో రాత్రి వరకు పెద్ద ఎత్తున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రులు, నాయకులు ఎన్నికల ప్రచారం చేయడంతోపాటు సోమవారం ఎన్నికల ప్రచారపర్వం ముగిసేంత వరకు స్థానిక ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ప్రచారంలో పాల్గొన్న ప్రముఖ నేతలు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లతోపాటు అనేక మంది మంత్రులు ప్రచారాల్లో పాల్గొన్నారు. 16, 17 తేదీల్లో పదుల సంఖ్యలో నిర్వహించిన సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. ఈ సారి కాంగ్రెస్ తరఫున రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావులతోపాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడైన కేంద్రమంత్రి కిషన్రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డితోపాటు పలువురు నాయకులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శనివారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని ప్రకటించినప్పటికీ ఆయన సోదరుడు మృతి చెందడంతో ప్రచార సభను రద్దు చేసుకున్నారు. ముంబై, నాసిక్, పశ్చిమ మహారాష్ట్రలోని సోలాపూర్, పుణే మొదలగు ప్రాంతాలతోపాటు మరఠ్వాడాలో లాతూర్, జాల్నా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన నాందేడ్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, విదర్భలోని నాగ్పూర్తోపాటు తెలంగాణ సరిహద్దులోని చంద్రాపూర్, గడ్చిరోలి తదితర ప్రాంతాలపై వీరు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. దీంతో తెలుగు వారుండే పలు ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న అనుభూతి కలిగిందని చెప్పవచ్చు. ప్లకార్డుల నుంచి వేదికపై బ్యానర్లు తదితరాలతోపాటు ముఖ్యంగా ఎన్నికల ప్రచార పాటల తెలుగు పాటలే కావడంతో అనేక మంది తెలుగు ఓటర్లను ఆకట్టుకునేలా చేశాయని చెప్పవచ్చు. హామీల వర్షం.. తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగు నాయకులందరూ హామీల వర్షం కురిపించారు. స్థానిక సమస్యలను పరిష్కరించడం తోపాటు తెలుగు వారికి అండగా ఉంటామని చెబుతున్నారు. వీరి సభలకు తెలుగు ప్రజలు హాజరుకావడంతో తెలుగు నాయకులు కూడా తమ పార్టీలే గెలుస్తాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణలో అమలు చేస్తున్న గ్యారంటీలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామంటూ హామీ ఇవ్వడంతోపాటు మహారాష్ట్ర వికాస్ అఘాడీ అభ్యర్థులకు ఓటు వేస్తే తనకు ఓటు వేసినట్టేనని పేర్కొన్నారు. ‘ఇక్కడ మీ నియోజకవర్గంలో మీ అభ్యర్థి. హైదరాబాద్లో నేను..’ ఇలా ఒక్క ఓటుకు ఇద్దరు సేవలకులం అంటూ రేవంత్రెడ్డి ప్రచారం చేశారు. మరోవైపు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని కాంగ్రెస్ తెలిపే అబద్ధపు మాటలను నమ్మొద్దంటూ బీజేపీ కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రచారం చేశారు. తెలుగు ప్రజలతోపాటు అందరికీ బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలుగు వారి సమస్యలు పరిష్కారమయ్యేనా? మహారాష్ట్ర లో నివసించే తెలుగు ప్రజలకు పలు సమస్యలున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగు నాయకులు ఇచి్చన హామీలు ప్రతిసారి ఎన్నికల్లో ఇచ్చే హామీల్లాగే మిగిలిపోతాయా? లేదా తమ సమస్యలు ఈ ఎన్నికల తర్వాత పరిష్కారమవుతాయా? అనే విషయంపై తెలుగు ప్రజల్లో చర్చల్లో ప్రారంభమయ్యాయి. అయితే అనేక మంది ఈ సారి తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు భవనం, తెలుగు పీఠం గురించి పెద్ద రాజకీయ నాయకులెవరూ ప్రచారంలో మాట్లాడకపోయినప్పటికీ మీ సమస్యలేమైనా సరే అన్ని తీరుస్తామంటూ హామీలు గుప్పించారు. ఇక ముంబై వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం ప్రచారంలో మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వర్లీ అసెంబ్లీ శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే మాత్రం ముంబై కరీంనగర్ల మధ్య రైళ్లు, తెలుగు భవనం గురించి ప్రస్తావించారు. రైళ్ల సమస్యలు తీరుస్తామని తెలుగు భవనం నిర్మాణం చేస్తామన్నారు. -
మైకులు బంద్.. ముగిసిన ‘మహా’ ఎన్నికల ప్రచారం
ముంబయి:మహారాష్ట్రలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం(నవంబర్18) సాయంత్రం ముగిసింది. ప్రచారం చివరి రోజు మరింత వేడెక్కి పార్టీల మధ్య యాడ్వార్ నడిచింది. ప్రత్యర్థుల వైఫల్యాలివే అంటూ అధికార, విపక్షాలు వార్తాపత్రికల్లో భారీ ప్రకటనలిచ్చాయి.కర్ణాటక పథకాలపై మహారాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలను కన్నడ సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వ హయాంలో జరిగిన వాటిపై బీజేపీ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చింది. ముంబయి ఉగ్రదాడులు మొదలుకొని కొవిడ్ కిట్ స్కామ్ వరకు అనేక అంశాలను ప్రకటనల్లో బీజేపీ ప్రస్తావించింది.పాల్గర్లో సాధువుల హత్య, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సీబీఐ విచారణ నిలివేసిన ఉద్ధవ్ ఠాక్రే, ముంబయి రైలు పేలుళ్లు, అంబానీ ఇంటికి బెదిరింపులతో పాటు ఎంవీఏ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పత్రికల్లో బీజేపీ ప్రకటనలు ఇచ్చింది. ఇదే సమయంలో రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ఎంవీఏ కూడా ప్రకటనలు ఇచ్చింది. బుధవారం(నవంబర్20) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరుగా : కన్నెత్తి చూడని బాలీవుడ్ సెలబ్రిటీలు
సాక్షి ముంబై: ఎన్నికల ప్రచారంలో సినీతారలకు ప్రజల్లో ఉన్న క్రేజే వేరు. పంచ్ డైలాగులు, హావభావాలతో రోడ్ షోలు, ఎన్నికల సభలను రక్తికట్టించడంలో వారికి వారే సాటి. అందుకే ఓటర్లను ఆకర్షించేందుకు ఓ మాదిరి ఆర్టిస్టుల దగ్గర్నుంచి బడా నటీనటుల వరకూ రాజకీయ పార్టీలు తమ తరపున ప్రచారం చేయమంటూ ఆహ్వానించడం పరిపాటి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నప్పటికీ పలువురు సినీ, బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ఈవైపు కన్నెత్తి చూడడం లేదు. క్యాంపెయినింగ్కు దూరంగా బాలీవుడ్.. గతంలో ప్రముఖ రాజకీయ పార్టీల తరపున విస్తృతంగా ప్రచారం చేసిన అనేక మంది బాలీవుడ్ తారలు ఇప్పుడు ఊరుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. కొందరు మినహా అనేక మంది సినీ ప్రముఖులు ప్రచార సభలు, రోడ్షోలకు దూరంగా ఉంటున్నారు. సల్మాన్ ఖాన్ ఇంటిపై ఇటీవల కాల్పులు జరగటం, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని బిష్ణోయి గ్యాంగ్ హత్య చేయడం, సల్మాన్ఖాన్, షారుఖ్ ఖాన్లకు కూడా ఈ గ్యాంగ్ ద్వారా బెదిరింపు ఫోన్లు రావడం వల్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రముఖ బాలీవుడ్ తారలతోపాటు చిన్న చిన్న పాత్రలు పోషించే ఆర్టిస్టులు కూడా మనకెందుకొచ్చిన గొడవలే అన్నట్లుగా మిన్నకుంటున్నారు. ఒకవేళ ఎవరైన బడా నేతలు ప్రచారానికి రావాలని అడిగినా షూటింగుల్లో బిజీగా ఉన్నామని, విదేశాల్లో ఉన్నామని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకే... లోక్సభ, అసెంబ్లీ, కార్పొరేషన్ ఇలా ఎలాంటి ఎన్నికలు వచి్చనా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పారీ్టలు అనేక విధాలుగా ప్రయత్నిస్తాయి. అందులో ముఖ్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు బాలీవుడ్ తారలను ప్రచారంలోకి దింపడం ఒక ఫ్యాషన్గా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి సభలకు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని, వీరి మాటల ప్రభావంతో ఓటర్లు తమ పార్టీ అభ్యరి్ధకి ఓటు వేస్తారని నేతల ప్రగాఢ నమ్మకం. మాజీ మంత్రి, ఇటీవలే హత్యకు గురైన బాబా సిద్దీఖీ తరపున గతంలో అనేక మంది ప్రముఖ బాలీవుడ్ నటులు ప్రచారంలో పాల్గొన్నారు. అప్పట్లో సిద్దిఖీ నిర్వహించే సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి అనేక మంది దిగ్గజ సెలిబ్రిటీలు కనిపించేవారు. ఆయన విజయంలో ఇది కూడా పరిగణించదగ్గ అంశమని రాజకీయ వర్గాల అభిప్రాయం. కానీ ఇటీవల ఆయన హత్యకు గురికావడంతో బాలీవుడ్ తారల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ హత్య తామే చేసినట్లు బిష్నోయి గ్యాంగ్ అంగీకరించడంతో పాటు పలువురు సెలబ్రిటీలకు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడంతో ప్రచార సభలకు సా««ధ్యమైనంత దూరంగా ఉండాలని వారంతా భావిస్తున్నారు. ప్రాంతీయ నటులతో ప్రచారం... గతంలో మాదిరిగా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల కోసం అనేక మంది సినీ తారలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించినప్పటికీ ఈసారి వారంతా ముఖం చాటేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్షంగా ప్రచార సభలకు హాజరయ్యేందుకు వారు నిరాకరిస్తుండటంతో రాజకీయ పారీ్టలు గత్యంతరం లేక ప్రాంతీయ సినిమా, స్టేజీ ఆరి్టస్టులను ప్రచారం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాయి. దీంతో మరాఠీ సినీ, నాటక రంగానికి చెందిన తారలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కొన్ని గంటల ప్రచారానికి కొంతమంది రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇక రోజంతా ప్రచారంలో పాల్గొనాలంటే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నారు. ఇక ఏ గ్రేడ్ తారలైతే రూ.20–35 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నారని సమాచారం. దీంతో మరోదారి లేక వారడిగినంత చెల్లించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాగా కొందరు మరాఠీ నటుల మాత్రం రాజకీయ పార్టీలతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచితంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం... దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన, జరగనున్న ఎన్నికల్లో ప్రచారం విషయంలో ఈసారి సోషల్ మీడియాదే అగ్రస్థానం. తాము చెప్పదలచుకున్న విషయాలను, వివరించదలచిన అంశాలను సూటిగా, స్పష్టంగా, నిమిషాల వ్యవధిలో ఓటర్లకు చేర్చడంలో ఇది అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం కావడంతో రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, రోడ్షోలు, ఇంటింటి ప్రచారంతోపాటు సోషల్ మీడియాను కూడా విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. బాలీవుడ్ తారలు ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొనక పోయినప్పటికీ వారి వాయిస్ రికార్డింగులు, వీడియోలను ఫేస్ బుక్, ఇన్స్ట్రాగామ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్గా మారి తమకు భారీగా ఓట్లు దక్కే అవకాశముందని అభ్యర్ధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు ఓటర్ల కోసం ప్రత్యేకంగా...ముంబై సహా మహారాష్ట్ర సరిహద్దులైన విదర్భ. మరఠ్వాడాలోని చంద్రాపూర్, నాందేడ్, బల్లార్పూర్తోపాటు నాసిక్, ముంబై. పుణే, సోలాపూర్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాల పరిధిలోని నియోజక వర్గాలలో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నటీనటులతోపాటు తెలుగు నేతలను ప్రచార రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, సీతక్క, ఇతర కాంగ్రెస్ నేతలు మహావికాస్ ఆఘాడి, కాంగ్రెస్లకు మద్దతుగా ర్యాలీలు, రోడ్ షోల ద్వారా విస్తత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. బీజేపీ, టీడీపల మధ్య పొత్తు కుదిర్చేందుకు పవన్ ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలుండే నియోజక వర్గాలలో బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేయడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది నో స్టార్స్... ఓన్లీ క్యాంపెయినింగ్ క్యాంపెయిన్లో పాల్గొననున్న మరాఠీ తారలు వీరే ...నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) (అజిత్ పవార్ వర్గం)–శాయాజీ శిందే, భావు కదం. శివసేన (ఏక్నాథ్ శిందే)–గోవిందా, శరద్ పోంక్షే. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)–ప్రజక్తా మాళీ, తేజస్వినీ పండిట్. ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)–అమోల్ కోల్హే. బీజేపీ–ప్రియా బేర్డే, నిశా పరుళేకర్. -
ట్రంప్ పుట్టిని ప్యూర్టోరీకో ముంచుతుందా?
విశాలమైన రహదారిపై ప్రయాణం సాఫీగా సాగుతున్న వేళ జరిగే ఓ చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చిట్టచివరి భారీ బహిరంగ సభ అనూహ్యంగా పెద్ద వివాదానికి, జాత్యహంకార వ్యాఖ్యలు వేదికగా మారింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన ప్రచార కార్యక్రమం చివరకు లాటిన్ అమెరికన్లు, యూదులు, ఆఫ్రో అమెరికన్లపై జాత్యహంకార వ్యాఖ్యలతో వివాదాస్పదంగా ముగిసింది.దీంతో రిపబ్లికన్ పార్టీ పట్ల ఆయా వర్గాల ఓటర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుందని కథనాలు వెలువడుతున్నాయి. వివాదం చిలికిచిలికి గాలివానగా వ్యతిరేక ఓట్ల దుమారంగా మారితే ట్రంప్ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదముంది. కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరీకో అమెరికా అ«దీనంలో ఉంది. ఇక్కడి ద్వీపవాసులకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేయకపోయినా పెద్దసంఖ్యలో ప్యూర్టోరికో వారసులు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఓటర్లుగా నివసిస్తున్నారు. తమ ద్వీపాన్ని అవహేళన చేయడంతో వాళ్లంతా ట్రంప్కు వ్యతిరేకంగా ఓటేసే అవకాశముంది.అసలేం జరిగింది?ఆదివారం జరిగిన ఈ సభలో ట్రంప్, భార్య మెలానియా ప్రసంగించారు. వీరితోపాటు ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ సైతం పాల్గొన్నారు. కార్యక్రమానికి ఊపు తెచ్చేందుకు ప్రచారానికి మరింత పాపులారిటీ వచ్చేందుకు స్టాండప్ కమేడియన్ టోనీ హించ్క్లిఫ్తో మాట్లాడించారు. నవ్వించాల్సిన ఆయన పలు వర్గాల ఓటర్లలో ఆగ్రహజ్వాలలు రగిల్చారు. ‘‘సముద్రం మధ్యలో కదిలే చెత్త కుప్ప ఒకటుంది. అదేంటో తెలుసా?. అదే ప్యూర్టోరీకో’’ అని హించ్క్లిఫ్ చేసిన వ్యాఖ్యలతో అమెరికాలోని ప్యూర్టోరికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.లక్షలాది మంది ప్యూర్టోరీకన్లకు అమెరికా పౌరసత్వం ఉంది. దశాబ్దాలుగా పోలింగ్లో క్రియాశీలకంగా ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం ప్యూర్టోరికో మూలాలున్న అమెరికా ఓటర్లు ఏకంగా 60 లక్షల మంది ఉన్నారని తెలుస్తోంది. 1898లో స్పానిష్–అమెరికా యుద్ధం తర్వాత స్పెయిన్ వలసరాజ్యమైన ఫ్యూర్టోరీకోను అమెరికా తన వశం చేసుకుంది. 1917లో తొలిసారిగా అక్కడి వారికి అమెరికా పౌరసత్వం ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్యూర్టోరికన్లు అమెరికాకు లక్షలాదిగా వలసవచ్చారు. అమెరికా ఓటర్లలో మెక్సికన్ల తర్వాత హిస్పానియన్ మూలాలున్న ఓటర్లలో రెండో అతిపెద్ద వర్గంగా ప్యూర్టోరికన్లు నిలిచారు. సొంత ద్వీపం కంటే అమెరికా గడ్డపై నివసించే వాళ్లే ఎక్కువ. కీలక రాష్ట్రాల్లో వీరి ప్రభావమెంత?ఏ పార్టీ కీ మద్దతు తెలపని తటస్థ ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలనే స్వింగ్ స్టేట్స్ అంటారు. మద్దతు పలికే రాష్ట్రాలను ఆయా పార్టీ లు ఎలాగూ గెల్చుకుంటాయి. కానీ స్వింగ్ రాష్ట్రాల ఓటర్లు ఎవరికి ఓటేస్తారో తెలీదుకాబట్టి వీళ్లను ప్రసన్నం చేసుకోవడమే ట్రంప్, హారిస్కు ముఖ్యం. పెన్సిల్వేనియా స్వింగ్ రాష్ట్రంలో 3.7 శాతం రాష్ట్రజనాభాకు సమానమైన 4.86 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రాన్ని గెల్చుకోవడం తప్పనిసరి. ఇక్కడ హారిస్పై ట్రంప్ కేవలం 0.2 శాతం ఆధిక్యతతో కొనసాగుతున్నారు. తాజా ఉదంతంలో ఈ ఆధిక్యత మటుమాయమై ట్రంప్ వెనుకంజ వేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. జార్జియాలోనూ 1.31 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. ఇక్కడ కూడా హారిస్పై ట్రంప్ ఆధిక్యత స్వల్పంగా ఉంది. వీళ్ల కోపంతో ఆ ఆధిక్యత పోవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. నార్త్ కరోలినా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. స్వింగ్యేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి ? ఏదో ఒక పార్టీ కే మద్దతు పలికే రాష్ట్రాల్లోనూ ప్యూర్టోరికన్ల ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్లోరిడా రాష్ట్రంలో వీళ్లు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. కనెక్టికల్ రాష్ట్ర జనాభాలో 8 శాతానికి సమానంగా 3 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. మసాచుసెట్స్లోనూ 3.26 లక్షల మంది వీళ్లే ఉన్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో ఏకంగా పది లక్షల మంది వీళ్లే ఉన్నారు. ఇన్నేసి లక్షల మంది ట్రంప్కు వ్యతిరేకంగా ఓటేస్తే హారిస్ విజయం నల్లేరుపై నడకేనని కథనాలు వెలువడుతున్నాయి. గతంలో జాత్యహంకార వ్యాఖ్యలుట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. 2018లో ఎల్సాల్విడార్, హైతీ, ఆఫ్రికా ఖండ దేశాలను దారుణంగా కించపరుస్తూ ట్రంప్ మాట్లాడారు. గత వారం సైతం వలసలపై ప్రసంగంలో ‘‘అమెరికా చెత్తకుప్పనా ఏంటి?. వ్యర్థాలు(వలసలు) అన్నీ అమెరికాకే వస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించడం తెల్సిందే. తాను అధికారంలోకి వచ్చాక దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో అనధికార వలసదారుల బహిష్కరణ కార్యక్రమం చేపడతానని ట్రంప్ అన్నారు. దీనికితోడు ఆదివారం హించ్క్లిఫ్ చేసిన వ్యాఖ్యలు ప్యూర్టోరీకో మూలాలున్న ప్రముఖుల్లో ఆగ్రహజ్వాలలను ఎగసేలా చేసింది. జెన్నీఫర్ లోపేజ్, రికీ మార్టిన్, బ్యాడ్ బన్నీ ఇలా పలువురు ప్యూర్టోరికో సంగీత దిగ్గజాలూ తమ నిరసన వ్యక్తంచేశారు. ‘‘ ట్రంప్ సంగతి తెల్సిందే. గెలిస్తే తానెంత ప్రమాదకరమో, దేశ ప్రజల మధ్య ఎంతగా విభజన తీసుకురాగలరో మరో సారి నిరూపించుకున్నారు’’ అని కమలా హారిస్ విమర్శించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సాయం సున్నా.. ప్రచార ఆర్భాటం వంద!
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం విజయవాడను ముంచేసిన వరదల విషయంలో సాయం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వరద బాధితులు పడుతున్న కష్టాలు, నష్టాల తీవ్రతను తగ్గించడం సంగతి ఎలా ఉన్నా మూడు నాలుగు రోజుల నిష్క్రియాపరత్వంతో దెబ్బతిన్న ప్రభుత్వ ప్రతిష్టను పునరుద్ధరించుకునేందుకే తంటాలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.వాస్తవానికి ప్రచారం చేసుకునే విషయంలో చంద్రబాబును మించిన వారెవరూ లేరు. కానీ.. ఆచంట మల్లన్న టైపు నేతలకు కూటమి ప్రభుత్వంలో లోటేమీ లేనట్టు స్పష్టమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంతి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్లు కూడా బాబును పొగడ్డమే తమ కర్తవ్యం అన్నట్టుగా వ్యవహరించారు. కాకపోతే పవన్ కళ్యాణ్ భజన కాస్తా వికటించి ఆయన పరువే తీసినట్టుగా కనిపిస్తోంది.ఐదు రోజుల క్రితం విజయవాడను వరద చుట్టేసిన తరువాత చంద్రబాబు చేయని విన్యాసమంటూ లేదు. రోజూ రెండు మూడు సార్లు మీడియాతో మాట్లాడటం, జేసీబీపై ఎక్కి ఒకసారి.. పడవలో వెళ్లి ఇంకోసారి, మోకాలి లోతు నీళ్లలో మరోసారి వెళ్లి తాను జనంలోనే ఉన్నట్లు.. వారి కోసమే పని చేస్తున్నట్లు గట్టి కృషే చేశారు. ఏదో ఒక పేరుతో వరద ప్రాంతాల్లో తిరుగుతూండటంతో అధికారులే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బాబు గారు మాత్రం మీడియా కవరేజీ కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.భజన మీడియా కూడా తనవంతుగా బాబుగారి ప్రచారానికి పోటాపోటీలు పడుతున్నాయి. అదేదో సినిమాలో ఉన్నట్లు.. ‘‘అన్న నడిచొస్తే మాస్.. అన్న మడతేస్తే.. మాస్.. మ మ మాస్’’ అనేలా ఉంది వీరి రాతలు. వరదలొచ్చిన ఐదు రోజులకు ఈనాడు ఓ కథనంలో... బుడమేరు వరదకు చంద్రబాబు చలించిపోయారని, బాధితులు, రైతుల కష్టాలు విన్నప్పుడు ఆయన కళ్లు చెమ్మగిల్లాయని, రాసుకొచ్చింది. విజయవాడలో వరదల కారణంగా ఇప్పటి వరకూ యాభై మంది మరణించారన్న సమాచారానికి మాత్రం అస్సలు ప్రాధాన్యత ఇవ్వలేదు. మొక్కుబడిగా కొన్ని వార్తలు రాసి చేతులు దులుపుకుంది.వరద సహాయ చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి తీసుకునే చర్యల గురించి రాయడం తప్పు కాదు. కానీ ప్రజల బాధల కన్నా చంద్రబాబు గురించే ఈనాడు, తదితర మీడియాలు కొన్ని తెగ దుఃఖిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అతిగా చేసే ప్రచారం ఒక్కోసారి నష్టం కూడా చేయవచ్చు. కేంద్ర మంత్రి చౌహాన్ వరద బాధితుల దగ్గరకు వెళ్లి పరామర్శ చేశారో, లేదో కాని, టీడీపీ ప్రభుత్వానికి సర్టిఫికెట్ మాత్రం ఇచ్చేశారు. వరద సహాయ చర్యలు బాగానే చేసిందని తేల్చేశారు. మిత్రపక్షం కనుక మర్యాద కోసం ఒక మాట అంటే ఫర్వాలేదు కాని, డబ్బా కొట్టినట్లు మాట్లాడితే ప్రజలలో బీజేపీ నవ్వులపాలు కాదా? చంద్రబాబు ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తోందని చౌహాన్ కితాబు ఇచ్చారు. ఇల్లు మునిగిపోయి చంద్రబాబు తన బస కలెక్టరేట్కు మార్చిన విషయాన్ని చెప్పకుండా చెప్పకుండా, ఆయన సారథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కలెక్టరేట్నే సచివాలయంగా మార్చుకుని చేస్తోందని వ్యాఖ్యానించడం విశేషం.వరదల వల్ల ఆస్తి నష్టం భారీగా జరిగినా ప్రాణ నష్టం మాత్రం స్వల్పంగా ఉందని కేంద్ర మంత్రి స్వయంగా చెబితే ఏమని అనుకోవాలి? వరదల కారణంగా యాభై మంది మరణిస్తే అది తక్కువ సంఖ్య అవుతుందా? మృతులు ఎందరో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ చెప్పలేని స్థితిలో ఉంటే... చౌహాన్ మాత్రం ఇలా విడ్డూరంగా మాట్లాడారు. పైగా తొలిసారి డ్రోన్ల ద్వారా బాధితులకు సాయం అందించారన్న చౌహాన్ మెచ్చుకోలు కూడా ఇప్పుడు విమర్శల పాలవుతోంది. ఉత్తరాఖండ్, కేరళల్లోనూ వరద సహాయక చర్యలకు డ్రోన్లను వాడిన విషయం కేంద్ర మంత్రికి తెలియదా? అని నెటిజన్లు ఎద్దేవ చేస్తున్నారు. కేంద్ర మంత్రి వరద నీటిలో అల్లాడుతున్న ప్రజలను పలకరిస్తే వారి బాధలు తెలుస్తాయి.పైపైన తిరిగి, ఎగ్జిబిషన్ పోటోలు చూసి, చంద్రబాబును పొగిడి, తన బాధ్యత తీరిపోయిందని అయిందని అనుకున్నట్లుగా ఉంది చౌహాన్ వ్యవహారం. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. ఈయనతై బాధితులను స్వయంగా చూడలేదు కానీ చంద్రబాబును మాత్రం ఆకాశానికి ఎత్తుతూ పొగిడేస్తున్నారు. పవన్ ఈ స్థాయిలో బాబుకు లొంగిపోతారని ఊహించ లేదు. గతంలో నర్రా రాఘవరెడ్డి అని సీపీఎం ఎమ్మెల్యే ఒకరు ఉండేవారు. పవన్ కళ్యాణ్లా లొంగిపోయే వారిపై సామెతలు కొన్ని చెబుతుండేవారు.. ‘‘పొగడరా, పొగడరా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత’’ అని చెప్పాడని ఎద్దేవ చేసేవారు. పవన్ కళ్యాణ్ తీరు కూడా అలాగే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ సృష్టించిన ఫోటోలను ఎక్స్లో పవన్ పెట్టి చంద్రబాబుకు బాకా ఊది ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు.ఒక వృద్దురాలు డ్రోన్ ద్వారా నడుం లోతు నీళ్లలో ఆహారపొట్లం అందుకున్నట్లు ఉన్న పోటోను పోస్టు చేశారు. ఇది తనకు సంతృప్తి ఇచ్చిందని, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కానీ అది కృత్రిమ ఫోటో కావడంతో ఆయన నవ్వుల పాలవయ్యారు. సోషల్ మీడియాలో దానిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో పవన్ తన వ్యాఖ్యను మార్చేశారు. చంద్రబాబుతోపాటు తిరగకుండా ఈయన ఏమి నేర్చుకున్నారో అర్ధం కాదు. చంద్రబాబే అధికార యంత్రాంగం విఫలం అయిందని ఒప్పుకుంటే ఈయన మాత్రం ప్రభుత్వం బాగా పనిచేసిందని గొప్పలు చెబుతున్నారు.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా వరదల్లాంటి విపత్తులు వచ్చినప్పుడు అధికారులకు ఆదేశాలిచ్చి.. అవి అమలయ్యాక జనం వద్దకు వెళ్లడాన్ని కూడా పవన్ తప్పుపట్టిన విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నాడు. వరదపీడిత ప్రాంతాలకు వెళితే అధికారుల విధులకు ఆటంకం అవుతుందని అంటున్నారు. మరి చంద్రబాబు పదే,పదే తిరుగుతూ అధికారులకు ఇబ్బంది కలిగించడం లేదా అని అంటే మాత్రం బాజా వాయిస్తారు.మీడియా తలచుకుంటే ఎలా ప్రచారం చేయవచ్చనడానికి ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలి. చంద్రబాబు బుడమేరు వంతెనపై నిలబడి ఉంటే ,ఆ పక్కగుండా రైలు వెళ్లింది. దానికి ఏమని ప్రచారం చేశారో తెలుసా! చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పిందని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇచ్చాయి. అదేమిటా అని పరిశీలిస్తే ఆ పక్కనే రైల్వే ట్రాక్ ఉంటే రైలు వెళ్లింది. ఆ టైమ్ లో ఆయన చుట్టూరా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. ఆయన రైలు వస్తున్న విషయం గమనించి ,అటువైపు తిరిగి చూస్తూ నిలబడ్డారు. మరి ఇందులో ప్రమాదం ఏమిటో అర్థం కాదు. ఇలా రాయమని చంద్రబాబు చెప్పి ఉండకపోవచ్చు.అయినా అతి భక్తి కల మీడియా ఇలా ప్రచారం చేసిందన్నమాట. ఈ నేపధ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం మీడియాలో ప్రచారం కోసమే తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఒరుగుతున్నది లేదని వ్యాఖ్యానించారు. పత్రికలు చేతిలో ఉండడంతో ఆయనను ఆకాశానికి ఎత్తుతున్నాయని ఎద్దేవ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ బుడమేరు ఆక్రమణల గురించి మాట్లాడడాన్ని ప్రస్తావించి, చంద్రబాబుతో మాట్లాడి కృష్ణా కరకట్టే మీద ఉన్న అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయించాలని రాంబాబు సూచించారు. పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ ధైర్యంగా ఆ విషయం మాట్లాడగలరా? ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వ్యవహార శైలి చూస్తుంటే అది అయ్యే పని కాదనిపిస్తుంది.తెలుగుదేశం నేతలకన్నా ఎక్కువగా పోటీపడి చంద్రబాబును పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు. వరద ప్రాంతాలవారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలోను, వరద బాధితులను ఆదుకోవడంలోను విఫలం అవడంతో నాలుగైదు రోజులపాటు ప్రజలు అల్లాడిపోయారు. ఇళ్లలోని సామానంతా పాడైపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో వారుంటే చంద్రబాబు, ప్రభుత్వ నేతలు తమ జబ్బలు తామే చరుచుకుని మురిసిపోతున్నారు.వరద బాధితులు అందరికి రేషన్ ఇవ్వలేకపోయామని అంటారు. వారి ఇళ్లకు రేషన్ చేర్చకుండా రేషన్ షాపుల వద్దకే వెళ్లి సరుకులు తీసుకోవాలని చంద్రబాబు చెప్పడం మాత్రం శోచనీయం. ఇది పెద్ద వైఫల్యం కాదా! అయినా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నేతలు ఒకరినొకరు పొగుడుకుని ఆత్మవంచన చేసుకుంటున్నారు. అనుకూల మీడియా ప్రచారం ద్వారా బాధితుల కష్టాలను కప్పిపుచ్చాలని చూస్తున్నారు. జనం ఈ ప్రచారానికే అన్నీ బాధలు మర్చిపోతారా!- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Chandrababu: రెడీ.. లైట్స్ ఆన్ స్టార్ట్ యాక్షన్!
సాక్షి, అమరావతి: టీవీల్లో వరదలు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఓ ఫొటో..! ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఓ వీడియో క్లిప్..! మీడియా ప్రతినిధులను పిలిచి చేతులు అటూ ఇటూ ఊపుతూ ఏదో వివరిస్తుంటే 360 డిగ్రీల్లో కెమెరా రోల్ చేస్తూ షూట్..! ఎవరక్కడ? అనడమే ఆలస్యం.. ‘సిద్ధం దొరా..!’ అంటూ సదా అందుబాటులో ఉంటున్న కలెక్టర్, పోలీస్ కమిషనర్ నుంచి యావత్ యంత్రాంగం...!!ఇదెక్కడో హైదరాబాద్ శివారులోని ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ అనుకునేరు! కానే కాదు.. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో రెండు రోజులుగా సాగుతున్న సీను ఇదీ! ఓవైపు కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది ‘అన్నమో రామచంద్రా’ అని అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు యావత్ యంత్రాంగాన్ని తన చుట్టూ మోహరించి కలెక్టరేట్లో పండిస్తున్న ప్రచార సీన్ ఇదీ..!!నా ఫొటోలూ.. నా వీడియోలూ.. అంతా నేనేపీక్స్కు చేరిన చంద్రబాబు ప్రచార పిచ్చిస్పైడర్ సినిమాలో విలన్ ఎస్జే సూర్య ప్రజల హాహాకారాలు, ఆర్తనాదాలు వింటూ పైశాచిక ఆనందంతో పరవశించిపోతుంటాడు. సినిమాలో అది ఊహాజనిత పాత్ర కావచ్చుగానీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి అందుకే మాత్రం భిన్నంగా లేదన్న విమర్శలు మరోసారి బలంగా వినిపిస్తున్నాయి.వరద బాధితులు ఎలా పోతేనేం..! కరకట్టలు తెగి ఊళ్లు, చేలూ కొట్టుకుపోతేనేం... పేపర్లలో నా ఫొటోలు రావాలి..! టీవీ చానళ్ల తెర నిండా నేనే కనిపించాలి..! సోషల్ మీడియాలో నేనే వైరల్ కావాలి!! అనే రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తుండటం ఆయన ప్రచార కండూతికి నిదర్శనం. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలోనో ఉండవల్లి కరకట్ట మీద ఉన్న తన క్యాంప్ ఆఫీసు నుంచో నిరభ్యంతరంగా సమీక్షించవచ్చు. కానీ అలా చేస్తే చంద్రబాబు ఫొటోలు, వీడియోలు మీడియాలో పెద్దగా రావు కదా!! ఇక టెక్నాలజీకి తాను బ్రాండ్ అంబాసిడర్నని తరచూ చెప్పుకునే చంద్రబాబు విజయవాడకు భారీ వరద ఐఎండీ రెండు రోజులు ముందు నుంచే హెచ్చరిస్తున్నా ముప్పును అంచనా వేయడంలో ఘోర వైఫల్యం చెందారు. కూటమి సర్కారు వైఫల్యం విజయవాడ ప్రజల పాలిట శాపంగా మారింది. దాంతో తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చేందుకు దీంతో చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెరతీశారు. విజయవాడ కలెక్టరేట్కు మకాం మార్చి తానేదో ఒంటి చేత్తో వరదను అడ్డుకుంటున్నట్లు ‘బిల్డప్ బాబాయ్’ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు.టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులతోపాటు అప్పటికప్పుడు జాతీయ మీడియాను కూడా పిలిపించుకుని చుట్టూ కూర్చొబెట్టుకుని మరీ ప్రచార సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. బోటులో తిరుగుతున్న చంద్రబాబు... బుల్ డోజర్పై ఎక్కి చేతులు ఊపుతూ ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు... లైఫ్ జాకెట్ వేసుకుని వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న చంద్రబాబు... అధికారులతో మాట్లాడుతున్న చంద్రబాబు... డ్రోన్లను పరిశీలిస్తున్న చంద్రబాబు.. ఇలా సాగుతోంది ఈ ప్రహసనం. ముఖ్యమంత్రి వస్తున్నారంటే సహాయక చర్యలు వేగంగా చేపట్టి ఆర్థిక సహాయం చేస్తారని, వైద్య సేవలు అందేలా చూస్తారని బాధితులు ఆశిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం చేతులు ఊపుతూ కెమెరాలకు ఫోజులిస్తూ వెళ్లిపోయారు. దీంతో బాధితులు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించేవారు లేక.. ఆహారం అందక, తాగునీరు లేక అల్లాడుతున్నారు.బాబు సేవలో యంత్రాంగం ముఖ్యమంత్రే వచ్చి కలెక్టరేట్లో తిష్ట వేయడంతో అధికార యంత్రాంగం అంతా ఆయన చుట్టూ చేతులు కట్టుకుని నిలబడి వరద బాధితులను గాలికి వదిలేసింది. ఇక ఓ వందమందితో కూడిన చంద్రదండు అనే ప్రైవేట్ సైన్యం అక్కడే మోహరించి చంద్రబాబు ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. కేవలం 24 గంటల్లో వందల సంఖ్యలో చంద్రబాబు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం గమనార్హం. సీఎం ఆఫీసు మునక... కరకట్ట ఇంట్లోకి వరదఅమరావతిని వరదలు ముంచెత్తడంతో అక్కడ రాజధాని నిర్మాణంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక కరకట్ట మీద చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. అటు సచివాలయం ఇటు కరకట్ట నివాసం రెండూ చంద్రబాబు అవినీతి, వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తుండటంతో విజయవాడ కలెక్టరేట్లో మకాం వేసి హైడ్రామాకు తెరతీశారు. 2015లో రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రచార కండూతి ఏకంగా 29 మంది భక్తుల ప్రాణాలను బలిగొన్న విషయం మరోసారి అందరికీ గుర్తుకొస్తోంది. ఇప్పుడు కూడా దాదాపు అదే రీతిలో ప్రచార కండూతితో వ్యవహరిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది.తన ప్రచారానికే సీఎం ప్రాధాన్యంసీఎం చంద్రబాబు చేసేది తక్కువ.. ప్రచారం చేసుకునేది ఎక్కువ అని చెప్పేందుకు తాజా వరద ప్రత్యక్ష సాక్ష్యం. విజయవాడలో బుడమేరు వరద ధాటికి సింగ్నగర్తో పాటు పలు ప్రాంతాలు ముంపునకుగురై ప్రజలు విలవిల్లాడుతున్నారు. వారికి అందించే సహాయ చర్యలను పర్యవేక్షించడానికంటూ చంద్రబాబు అవసరం లేకపోయినా అతిగా పర్యటనలు చేస్తున్నారు. కానీ అదంతా కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి కోసమేనని అర్థమైంది. టీడీపీ సోషల్ మీడియాలో రెండు రోజులుగా పెడుతున్న ఫొటోలు, వీడియోలే ఇందుకు సాక్ష్యం.టీడీపీ అధికారిక ‘ఎక్స్’ లో 225 టీడీపీ ఫేస్బుక్ గ్రూపులో 245ఐటీడీపీ ఫేస్బుక్లో 52సీఎంఓ అధికారిక ‘ఎక్స్’లో 30రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ వాట్సప్ గ్రూపులో వందలాది ఫొటోలు, వీడియోలు పోస్ట్ -
వంధ్యత్వం కాదు.. అంధత్వం!
ప్రకృతిలోని జీవరాశులను ప్రేమించే వాళ్లంతా మాతృత్వం కలవారే! దీనికి జెండర్ లేదు. వాత్సల్యం, కరుణే దానికి కొలమానం! అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వాన్ని ఫాలో అవుతున్నవాళ్లకు అర్థమయ్యే ఉంటుంది ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకో! అవును, కమలా హ్యారిస్ గురించి జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ ప్రస్తావన. రాజకీయ ఎన్నికల ప్రచారంలో హుందాతనం.. అగ్రరాజ్యంలోనూ పూజ్యమని అర్థమైంది. అవతలి పక్షాన్ని ఎదుర్కోవడానికి ముఖ్యంగా మహిళానేతల విషయంలో ఎక్కడైనా వాళ్ల దక్షత కన్నా వ్యక్తిగతేచ్ఛలే పరిగణనలోకి తీసుకునేట్టున్నారు.దీనికి అభివృద్ధి చెందిన దేశాలు, వర్తమాన దేశాలనే వ్యత్యాసం లేనట్టుంది. పిల్లల్లేని మహిళలు దుర్భర జీవితాన్ని గడుపుతారని, వాళ్లు సమాజానికి భారమే తప్ప వాళ్ల వల్ల ఒరుగుతున్నదేమీ లేదని రిపబ్లికన్పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వాక్రుచ్చాడు. ఈ కామెంట్.. పిల్లల్లేని కమలా హ్యారిస్నుద్దేశించేనని ప్రపంచమంతా గ్రహించి, ఆమె పక్షాన నిలిచింది. పిల్లలను కనాలా వద్దా అనేది పిల్లల్ని కనే శారీరక స్థితి, పెంచే సామాజిక పరిస్థితులను బట్టిమహిళ నిర్ణయించుకోవాలని, ఆ నిర్ణయాధికారం ఆమె హక్కని నాగరిక సమాజం గొంతు చించుకుని అరిచింది. దాని మీద ఉద్యమాలనూ లేవనెత్తింది.ఇంతలోతైన ఆలోచన, అంత విశాలమైన దృక్పథం లేని వాన్స్ లాంటి వాళ్లకు కనీసం దాన్ని ఓ పర్సనల్ చాయిస్గా గుర్తించాలనే స్పృహ కూడా లేనట్టుంది. పెళ్లి, పిల్లలు అనేది వ్యక్తిగతం. పిల్లల్లేని చాలామంది ఆడవాళ్లు అనాథలను చేరదీసి, ఇరుగుపొరుగు పిల్లలను పోగేసి.. బంధువుల బిడ్డలను అక్కున చేర్చుకుని వాళ్లను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దిన ఉదంతాలు కోకొల్లలు! ఇందుకు కమలా హ్యారిస్ కూడా ఉదాహరణగా నిలుస్తారు. కడుపున పుట్టిన పిల్లల్లేక΄ోయినా ఆమె అద్భుతమైన మాతృమూర్తి! తన భర్త పిల్లలకు అమ్మతనాన్ని పంచింది. జేడీ వాన్స్ వ్యాఖ్యల క్రమంలో ఆ పిల్లలు కమలా హ్యారిస్ చేయి వదల్లేదు.ఆమె భుజాల చుట్టూ చేయివేసి ఆమె మనోనిబ్బరాన్ని మరింత పెంచుతున్నారు. దీన్ని ప్రపంచమూ హర్షిస్తోంది. అలాంటి మాతృమూర్తి మీద నోరుపారేసుకున్న వాన్స్.. తండ్రైనా హృదయం లేనివాడిగా ముద్రపడ్డాడు. నిజానికి అమెరికా అధ్యక్ష్య పదవికి తమ అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్ని ప్రకటించగానే ఆపార్టీ విజయావకాశాలు అనూహ్యంగా పెరిగాయి. ఆ ధాటిని తట్టుకోలేక రిపబ్లికన్పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు ప్రతిపక్ష అభ్యర్థి జెండర్ను లక్ష్యంగా చేసుకుని, ఆమె వ్యక్తిగత జీవితం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.కమలా హ్యారిస్ మాతృత్వానికి.. అమెరికా అవసరాలకు లంకె ఏంటి? అక్కడే కాదు ఎక్కడైనా సరే.. స్త్రీల వ్యక్తిగత విషయాలకు.. దేశ పురోగతికి ఏమిటి సంబంధం? ఒకవేళ సంబంధమే ఉంది అనుకుంటే అప్పుడు పురుషుడి వ్యక్తిగత విషయాలూ అంతే ప్రభావం చూపిస్తాయి కదా! పెళ్లి, పిల్లలు.. ఎవరికైనా వాళ్ల వ్యక్తిగతమే! ఒకవేళ వాన్స్ అన్నదే తీసుకున్నా.. పెళ్లి, పిల్లలు అనే బాధ్యత లేని స్త్రీలు దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక పురోగతిలో చెప్పుకోదగ్గపాత్రేపోషిస్తున్నారు. మాతృత్వాన్ని మహత్తర అనుభూతిగా చూపి ఆ బంధనంతో స్త్రీలను కట్టిపడేసి.. తమకుపోటీలేకుండా చూసుకోవాలనుకున్న పురుషాధిపత్య భావజాలం అమెరికన్లలోనూ జాస్తి అని వాన్స్ ద్వారా మరోసారి రుజువైంది. :::సరస్వతి రమ -
పిల్లల భవిష్యత్ కోసం.. అబ్ ఇండియా బనేగా 7-స్టార్
పిల్లలకు వచ్చే వ్యాధులను దూరం చేయడానికి.. వారి భవిష్యత్తకు మద్దతుగా నిలబడటానికి జీఎస్కే (GSK) 'అబ్ ఇండియా బనేగా 7-స్టార్' అనే కార్యక్రమం ప్రారంభించింది. భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఈ ప్రచారం ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తోంది.అబ్ ఇండియా బనేగా 7-స్టార్ ద్వారా పోలియో, చికెన్పాక్స్, హెపటైటిస్ A, హెపటైటిస్ బి, మెనింజైటిస్, మీజిల్స్, గవదబిళ్లలు, రుబెల్లా, న్యుమోనియా, ఇన్ఫ్లుఎంజా, డిఫ్తీరియా, టెటానస్, పెర్టుసిస్, హైబి ఇన్ఫెక్షన్ వంటి 14 వ్యాధులకు వ్యతిరేఖంగా 7 టీకాలు పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతామని జీఎస్కే వెల్లడించింది. ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వయసున్న పిల్లలకు ఈ 7 టీకాలను వేయాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) సిఫార్సు చేస్తోంది.పిల్లల మొదటి పుట్టిన రోజు నుంచి.. కొన్ని వ్యాధులను నివారించడానికి టీకాలు చాలా అవసరమని జీఎస్కే మెడికల్ డైరెక్టర్ డాక్టర్ షాలినీ మీనన్ వెల్లడించారు. టీకాల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచవచ్చని.. ఈ విషయాలను తల్లితండ్రులకు తెలియజేయడానికి ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.జీఎస్కే ప్రారంభించిన ఈ కార్యక్రమం గురించి టీవీ, రేడియో, సోషల్ మీడియా, ఓటీటీ వంటి మల్టిపుల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రచారం చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా షెడ్యూల్ గురించి తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించాలి లేదా 'మైవ్యాక్సినేషన్ హబ్.ఇన్' వంటి సైట్లను సందర్సించాల్సి ఉంటుంది. -
ట్రంప్పై దాడి.. ముందే హింట్ ఇచ్చిన క్రూక్స్!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఇటీవల కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ ట్రంప్పై కాల్పులు జరపగా.. ఆయన చెవిని తాకుతూ బుట్లెట్ పక్కకు దూసుకువెళ్లింది. వెంటనే ఆప్రమత్తమైన సిక్రెట్ సర్వీస్ ఎజెంట్లు ఆయన ఆస్పత్రి తీసుకెళ్లారు. అనంతరం వారి జరిపిన కాల్పుల్లో నిందితుడు క్రూక్స్ మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తోంది. తాజాగా క్రూక్స్కు సంబంధించిన ఓ విషయాన్ని ఎఫ్బీఐ అధికారులు వెల్లడించారు. ట్రంప్పై హత్యాయత్నానికి ముందు సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో సందేశం ద్వారా కాల్పులు జరపనున్నట్లు సంకేతం ఇచ్చినట్లు తెలిపారు. ‘జూలై 13 నాకు చాలా ముఖ్యమైంది. ఆ రోజు ఏం జరుగుతుందో చూడండి’అని క్రూక్స్ సోషల్మీడియా పోస్ట్ చేశాడని తెలిపారు. అదేవిధంగా దర్యాప్తు అధికారులు అతడు షూట్ చేడానికి వాడిన గన్ టెక్నాలజీ, వాడిన మొబైల్, లాప్టాప్పై పరిశీలిస్తున్నారు.క్రూక్స్ మొబైల్లో డొనాల్డ్ ట్రంప్, ప్రెజిడెంట్ బైడెన్ ఫోటోలు, డొమెక్రటిక్ నేషనల్ కన్వేషన్ షెడ్యూల్, ట్రంప్ పెన్సిల్వేనియా ప్రచార ర్యాలీకి సంబంధించి సమాచారం ఉన్నట్లు ఎఫ్బీఐ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. క్రూక్స్ రెండు మొబైల్స్ కలిగి ఉన్నాడని ఒకటి కాల్పుల ఘటనాస్థలిలో స్వాధీనం చేసుకోగా.. మరోఫోన్ అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు తెలిపారు. అందులో కేవలం 27 కాంటక్ట్ నెంబర్లు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎఫ్బీఐ పేర్కొంది. -
నేటితో చివరి అంకం..ప్రచారం ముగింపు
-
TG: ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27న మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేశ్రెడ్డి (భారాస), ప్రేమేందర్రెడ్డి (భాజపా) ఉన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ 5న వెలువడనుంది.సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ప్రచార గడవు శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27వ తేదిన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్కు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుంది. మొత్తం 605 పోలింగ్ బూత్లు, 4,63,839 ఓట్లర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో పురుషులే అధికంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోరులో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్రెడ్డి పోటీ పడుతున్నారు.పోలింగ్ డే 27వ తేదిన ప్రత్యేక సెలవు ప్రకటించారు అధికారులు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ 5న వెలువడనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది, నల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక పోలింగ్ రోజు ఉ.6 నుంిచి సా.8 వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. -
కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?
ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి, కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ మధ్య పోరు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. జేఎన్యూ విద్యార్థి సంఘం నేతగా రాజకీయాల్లో కాలుమోపిన కన్హయ్య ఆ తరువాతి కాలంలో కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నారు.కన్హయ్య కుమార్ తన ప్రచార ఖర్చుల కోసం గడచిన ఏడు రోజుల్లో రూ. 52 లక్షలను క్రౌడ్ ఫండింగ్ రూపంలో సేకరించారు. ఆయన మే 15 నుంచి ఫ్యూయల్ డ్రీమ్ అనే వెబ్సైట్ ద్వారా చందాలను స్వీకరించడం ప్రారంభించారు. బుధవారం రాత్రి నాటికి కన్హయ్య కుమార్కు మొత్తం 2,250 మంది రూ. 52 లక్షలను చందాల రూపంలో అందించారు. కన్హయ్యకు చందాలు ఇచ్చిన వారిలో హాస్య కళాకారుడు కుణాల్ కుమార్, సినీ నిర్మాత విశాల్ భరద్వాజ్, అతని భార్య, గాయని రేఖా భరద్వాజ్, జెఎన్యూ మాజీ ప్రొఫెసర్ జయతి ఘోష్, మాజీ ప్రొఫెసర్ మోహన్రావు తదతరులు ఉన్నారు.కన్హయ్య కుమార్ ‘క్రౌడ్ ఫండింగ్’ రూపంలో మొత్తం రూ. 75 లక్షలు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ ఫండ్ సేకరణకు ముందు కన్హయ్య కుమార్ ఒక వీడియో విడుదల చేస్తూ తాను శాంతి, ప్రగతి, న్యాయం కోసం ఎన్నికల బరిలోకి దిగుతున్నానని పేర్కొన్నారు. ఫ్యూయల్ డ్రీమ్ అనే వెబ్సైట్ ద్వారా తాను చందాలు సేకరిస్తున్నానని, అలాగే గూగుల్ పే నంబర్ ద్వారా కూడా చందాలు సేకరిస్తున్నానని తెలియజేశారు. -
గుడుల పేరుతో మేం ఓట్లడగలేదు: కేటీఆర్
సాక్షి,యాదాద్రి భువనగిరిజిల్లా: మేకిన్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా అని ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు నెరవేరలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భువనగిరిలో ఆదివారం(మే19) జరిగిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘మోదీ గుడి కట్టినం అని ఓట్లు అడుగుతుండు. మేం కూడా గుడి నిర్మించాం. గుడి పేరుతో ఓట్లు అడగలేదు. మేము ప్రాజెక్టులు కట్టాం. అవికూడా దేవుళ్ళ పేరు మీద కట్టాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు నాట్లు వేస్తునప్పుడు రైతు బంధు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓట్లు వేస్తునప్పుడు మాత్రమే రైతులకు రైతు బంధు వేస్తున్నారు.కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామకపత్రాలు ఇచ్చి నేనిచ్చా అని చెప్పుకోవడానికి రేవంత్రెడ్డికి సిగ్గుండాలి. ఒక వైపు బిట్స్ బిలాని చదువుకున్న అభ్యర్థి ఉన్నాడు. మరోవైపు బ్లాక్ మెలర్, లాబీయింగ్, పైశాచిక ఆనందం పొందే అభ్యర్థి ఉన్నాడు. ఎవరికి ఓటు వేయాలో పట్టభద్రులు తేల్చుకోవాలి’అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
మోదీ నుంచి నడ్డా వరకు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ హైవోల్టేజీ ప్రచారం ముగిసింది. ప్రధాని నరేంద్రమోదీ మొదలు కేంద్ర హోంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల పర్యటనలతో ప్రచారపర్వాన్ని దూకుడుగా పూర్తి చేసింది. బహిరంగసభలు, వివిధ సామాజికవర్గాల వారీగా సమావేశాలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, ఇంటింటికి బీజేపీ వంటి కార్యక్రమాలతో హోరెత్తించింది. ముఖ్యంగా మోదీ, అమిత్షా, నడ్డా వంటి అగ్రనేతలు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవ ర్గాలను ఒక ప్రణాళికాబద్ధంగా చుట్టివచ్చేలా ఎన్నికల ప్రచార కార్యక్రమాల రూపకల్పన ఆ పార్టీకి కలిసొచ్చిందనే చెప్పాలి. పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశమున్న సీట్లు, ఇంకా కొంచెం కష్టపడితే గెలవగలిగే స్థానాలు, పోటీలో ఉన్న స్థానాలు...ఇలా వర్గీకరించుకుని తప్పకుండా విజయం సాధిస్తామనే చోట్ల అధిక దృష్టిని కేంద్రీకరించారు. ఇందుకు అనుగుణంగానే.. ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ప్రచార గడువు ముగిసే వరకు బీజేపీ నేతలు ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార పర్వం పూర్తయ్యే ముందురోజు అంటే...శుక్రవారం సాయంత్రం ఎల్బీస్టేడియంలో ఐదు ఎంపీ సీట్ల పరిధిలో నిర్వహించిన బహిరంగసభలో మోదీ ప్రసంగించారు. అదేరోజు మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొన్నారు. ఇక ప్రచారం ముగిసిన శనివారం చేవేళ్ల ఎంపీ సీటు పరిధిలోని వికారాబాద్లో, నాగర్కర్నూల్లోని వనపర్తిలో నిర్వహించిన సభల్లో అమిత్షా పాల్గొన్నారు.ప్రచారంలో దూకుడుగానేప్రధానపార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ప్రకటనతో పాటు ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడేలోగానే తొలివిడత ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన బీజేపీ.. మొత్తంగా రాష్ట్రంలో ప్రచార విషయంలో మాత్రం బీజేపీ‘అడ్వాంటేజ్ పొజిషన్’లోకి ప్రవేశించిందనే చెప్పాలి. పదేళ్లపాటు కేంద్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు, తెలంగాణకు వివిధ రూపాల్లో రూ.10 లక్షల కోట్ల వరకు నిధుల కేటాయింపు వెరసి మోదీ సర్కార్ సాధించిన విజయాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రచారాన్ని ఉరకలెత్తేలా చేసింది. అయితే సీఎం రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ఆరోపించిన రిజర్వేషన్ల రద్దు అంశం, మళ్లీ బీజేపీ వస్తే హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేస్తారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ నేతలు సర్వశక్తులూ ఒడ్డాల్సి వచ్చింది. ఈ రెండు విషయాలపై ఏకంగా మోదీ, అమిత్షా సహా రాష్ట్ర పార్టీ అ«ధ్యక్షుడు కిషన్రెడ్డి కూడా ప్రధానంగా ఫోకస్ చేయాల్సి వచ్చిందనే చెప్పాలి. -
Andhra Pradesh: నేటితో ప్రచారానికి తెర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంతో హోరెత్తించిన రాజకీయ పార్టీల మైకులు మూగబోనున్నాయి. మే 13న జరిగే పోలింగ్కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం, ప్రసారం చేయకూడదు. పోలింగ్ ప్రక్రియ దగ్గరపడటంతో వచ్చే 72 గంటల్లో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖే‹Ùకుమార్మీనా ఆదేశాలు జారీ చేశారు. హింసకు, రీ పోలింగ్కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను మీనా ఆదేశించారు. ఆ ఆదేశాల్లో పేర్కొన్న ప్రకారం. 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం (సైలెంట్ పీరియడ్) అమల్లోకి వస్తుంది. ఆ సమయంలో ఎన్నికల ప్రచారానికి పూర్తిగా తెరపడుతుంది.చట్టవిరుద్ధమైన సమావేశాలపై నిషేధం ఉంటుంది. పోలింగ్ ముగింపు సమయం ఆధారంగా మద్యం దుకాణాలకు 48 గంటల డ్రై డే సవరించబడుతుంది. నియోజకవర్గం వెలుపల నుంచి ప్రచారం నిమిత్తం తీసుకువచ్చిన, నియోజకవర్గ ఓటర్లు కాని రాజకీయ కార్యకర్తలు/పార్టీ కార్యకర్తలు అంతా ప్రచార సమయం ముగిసిన వెంటనే నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలి. 48 గంటల వ్యవధిలో ఓటర్లు కాని ఇతర వ్యక్తులు స్థానిక లాడ్జిలు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు మొదలైన వాటిలో లేరని అధికారులు నిర్ధారించుకోవాలి.ఏజెంట్ల జాబితా ఇవ్వాల్సిన అవసరం లేదు పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామక జాబితాను రిటరి్నంగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పించి విధులకు హాజరు కావచ్చు. -
సీఎం జగన్ రేపటి ప్రచార షెడ్యూల్ ఇలా...
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం( మే11) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని తాలూకా ఆఫీస్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. చివరిగా మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఉప్పాడ బస్స్టాండ్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. -
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్
అన్నమయ్య జిల్లా, సాక్షి: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని.. పొరపాటున బాబుకు ఓటస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు రోడ్డులో ప్రచార సభలో మాట్లాడుతూ చంద్రబాబు.. మోదీ, అమిత్షాను తీసుకొచ్చి సభలు పెట్టించారు. ప్రత్యేక హోదా హామీ వస్తుందేమోనని ప్రజలు ఎదురుచూశారు.. వాళ్లు ప్రత్యేక హోదా హామీ ఇవ్వకుండా.. విమర్శించి వెళ్లిపోయారు’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.‘‘చంద్రబాబు అంతటి అవినీతిపరుడు దేశంలోనే లేడని మోదీ అన్నారు. కూటమిలో చేరగానే అదే నోటితో చంద్రబాబును పొగుడుతున్నాడు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఏం కావాల్లో అది మాత్రమే మాట్లాడారు. పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి’’ అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు.‘‘2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?. చంద్రబాబు కూటమి.. పెత్తందార్ల కూటమి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే.. వ్యతిరేకించారు. పెత్తందార్ల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా? 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. అక్క చెల్లెమ్మలకు నేరుగా రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించాం’’ అని సీఎం వివరించారు.గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు. ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన. ఇంటర్నేషనల్ యూనివర్శిటీలతో సర్టిఫైడ్ కోర్సులు. పిల్లల చదువు కోసం తల్లులను పోత్సహిస్తూ అమ్మఒడి. విద్యారంగంలో జరిగిన విప్లవాలు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?. మహిళా సాధికారతకు అర్థం చెప్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. మొదటిసారి మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.⇒రాజంపేటలో అక్కచెల్లెమ్మల పేరిట 4వేల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఇళ్ల నిర్మాణం..⇒మరో 4 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది..⇒జరగబోయే ఈ ఎన్నికలు పథకాల కొనసాగింపును నిర్ణయించేవి..⇒మీ జగన్ తీసుకొచ్చినన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?⇒ఈ తరహాలో పేదవాడి మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో చూశారా? ⇒ప్రత్యేకహోదాను అమ్మేశారు, పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి..⇒చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని జిల్లా కేంద్రం చేస్తా అంటున్నాడు..⇒రాజంపేట, మదనపల్లి, రాయచోటిలను జిల్లా కేంద్రం చేస్తానంటున్నాడు నమ్ముతారా?⇒రాజంపేటలో పింఛా డ్యాం ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం⇒అన్నమయ్య ప్రాజెక్ట్, గాలేరు-నగరి కాల్వ పనులు పూర్తి చేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి⇒రాజంపేట కేంద్రంగా అన్నమయ్య కాలేజ్ను యూనివర్శిటీగా తీర్చిదిద్దాం⇒మీ బిడ్డ తీసుకున్న నిర్ణయం రాజంపేట చరిత్రలో నిలిచిపోతుంది⇒అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు -
ఢిల్లీలో పంజాబ్ సీఎం ఎన్నికల ప్రచారం!
దేశంలో లోక్సభ ఎన్నికలు కొనసాగున్నాయి. వివిధ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదల చేసి, ప్రచారాలు ముమ్మరం చేశాయి. దేశరాజధాని ఢిల్లీలో జరిగే లోక్సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరపున ప్రచారం చేయనున్నారు.సీఎం భగవంత్ మాన్ మే 11న తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. ఢిల్లీ సీఎం జైలుకు వెళ్లిన తర్వాత సునీతా కేజ్రీవాల్ రాజకీయాల్లో చురుకుగా మారారు.ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 25న ఆరో దశలో ఓటింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను మే 21న ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి కేజ్రీవాల్ తీహార్ జైలులో కస్టడీలో ఉన్నారు. -
టీడీపీ కార్యకర్త దాష్టీకం
కంకిపాడు: టీడీపీ కార్యకర్తలు పెట్రేగిపోతున్నారు. నేతల అండ చూసుకుని దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. అధికారంలోకి రానివ్వండి తేలుస్తాం.. అంటూ పెనమలూరు నియోజకవర్గంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రచారం పేరుతో ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడి దాషీ్టకం ప్రదర్శించాడు. ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేయడమేగాక ఆమెపై దాడిచేసి తీవ్రంగా కొట్టాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ అవుతోంది. కంకిపాడుకు చెందిన గుమ్మడి కిరణ్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో టీడీపీ ప్రచారం పేరుతో.. మహిళ ఒంటరిగా ఉన్న ఇంట్లోకి చొరబడ్డాడు. నువ్వు ఫోన్ చేస్తే వచ్చానని, ఫోన్లో డబ్బులు వేశానని అంటూ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. సామగ్రి ధ్వంసం చేసి భయాందోళనలకు గురిచేశాడు. అతడి చేష్టల్ని వీడియోలో చిత్రీకరిస్తున్న ఆమెను తిడుతూ.. తనకు యార్లగడ్డ, బోడె, పార్థసారథి అండ ఉందని హెచ్చరించాడు. ఆమెపై దాడిచేసి కొట్టాడు. తెలుగుదేశం వర్గీయుల దౌర్జన్య వ్యవహారాలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. -
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ
సాక్షి, విజయవాడ: టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ చేపట్టింది. చంద్రబాబు ఏ1గా, లోకేష్ ఏ2గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ఐవీఆర్ఎస్ కాల్స్తో టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారంపై వైఎస్సార్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ.. విచారణ చేపట్టింది. చంద్రబాబు, లోకేష్తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదైంది.కాగా, ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్ సెల్) అడిషనల్ డీజీకి అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరీంధర ప్రసాద్ ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్ టైట్లింగ్ యాక్ట్పై ఐవీఆర్ఎస్ కాల్స్తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది.వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్ చేయగానే.. ‘వైఎస్ జగన్ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్ కాజేస్తాడు, ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్ మెసేజ్లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.వీటికి సంబంధించిన వాయిస్ రికార్డులను వైఎస్సార్సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది.ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ తన ఫిర్యాదులో కోరింది -
నేడు తెలంగాణకు అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. కాగజ్నగర్, నిజామాబాద్, హైదరాబాద్లలో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టనున్నారు. మూడు చోట్ల జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది.అమిత్ షా షెడ్యూల్ ఇలా.. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏపీలోని శ్రీసత్యసాయి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 1:55 గంటలకు బేగంపేటకు అమిత్ షా చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ వెళ్లనున్నారు. అక్కడి ఎస్పీఎం క్రికెట్ గ్రౌండ్లో మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4 గంటల దాకా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 4:15 గంటలకు కాగజ్నగర్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 5 గంటలకు నిజామాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం 5:10 గంటల నుంచి 5:50 గంటల వరకు అక్కడి గిరిరాజ్ కాలేజీలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి 6:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం 6:45 గంటలనుంచి రాత్రి 7:30 గంటల దాకా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రి 7:55 నిమిషాలకు బేగంపేట నుంచి పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్కు బయలుదేరనున్నారు.నేడు తెలంగాణకు రాహుల్.. రెండు సభలకు హాజరులోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. నాందేడ్ నుంచి నేరుగా నిర్మల్కు రానున్న రాహుల్.. అక్కడ జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా అలంపూర్ వెళ్లి అక్కడ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత అలంపూర్ నుంచి హైదరాబాద్ చేరుకొని పార్టీ నేతలతో కాసేపు భేటీ కానున్నారు. అనంతరం ఆయన ఢిల్లీ వెళ్తారని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. -
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉత్తరాఖండ్ టూరిజం విభాగం దేశంలోనే తొలిసారిగాఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని ప్రారంభించింది. ఆకాశంలో అద్భుతాలను చూడాలని కోరుకునే ఔత్సాహికులే లక్ష్యంగా ‘నక్షత్ర సభ’ను లాంచ్ చేసింది. స్టార్స్కేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు సంపూర్ణ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తోంది.ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో, స్థానిక నివాసితులకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడమే కాకుండా భారతదేశంలో డార్క్ స్కైస్ పరిరక్షణకు పనిచేయనుంది. ఖగోళ శాస్త్ర వెంచర్ డార్క్ స్కై ప్రిజర్వేషన్ పాలసీని రూపొందించడం, ఏడాది పొడవునా ప్రాంతమంతటా అమలు చేయనుంది. దీనిపై ప్రచారం అవగాహన కల్పిస్తుంది, శిక్షణ ఇస్తుంది. వాలంటీర్లను ,డార్క్ స్కై అంబాసిడర్లనుతయారు చేస్తుంది. అంతేకాదుఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీ కూడా నిర్వహిస్తుంది. రాత్రి ఆకాశంలోని అందాలను ఫోటో తీసిన వారికి ఆకర్షణీయమైన రివార్డులు కూడా అందిస్తుంది.అంతర్జిక్ష టూరిజానికి మద్దతుగా 'నక్షత్ర సభ'ను తీసుకొచ్చింది. ఇందులో స్టార్ గేజింగ్, ప్రత్యేక సౌర పరిశీలనలు, ఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీలు, క్యాంపింగ్ లాంటివి అందించనుంది. ఈ ప్రచారంలో భాగంగా తొలి ఎడిషన్ జూన్లో ముస్సోరీలోని జార్జ్ ఎవరెస్ట్లో ప్రారంభమవుతుంది.ఖగోళ శాస్త్రం, పర్యాటకం కలయికగా ఆస్ట్రో-టూరిజం ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతోంది. భారతదేశంలో, భూ సంబంధమైన ఆస్ట్రో-టూరిజంను విస్తరించేందుకు వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. కొన్ని ప్రదేశాలలో ఆస్ట్రో-స్టేలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఉదాహరణకు, లడఖ్లోని పాంగోంగ్ సరస్సు వద్ద, సందర్శకులు పగటిపూట సరస్సు అద్భుతమైన అందాలను ఆస్వాదిస్తారు. రాత్రి వేళలో,స్థానికులు వారి సంప్రదాయాలు , జానపద కథలను పంచుకుంటూ నక్షత్రరాశులను గుర్తించడానికి వారికి మార్గనిర్దేశం చేస్తారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ భారతదేశంలోని ప్రముఖ ఆస్ట్రో-టూరిజం కంపెనీ స్టార్స్కేప్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నక్షత్ర సభ 2025 మధ్యకాలం వరకు కొనసాగుతుంది, ఉత్తరాఖండ్ అంతటా వివిధ ప్రదేశాలలో లీనమయ్యే ఈవెంట్ల శ్రేణిని అందిస్తుంది. ఉత్తరకాశీ, పితోర్గఢ్, నైనిటాల్, చమోలి జిల్లాల్లోని డార్క్ స్కై పొటెన్షియల్ సైట్లతో పాటు నిపుణులతో సెమినార్లు, వెబ్నార్లను నిర్వహిస్తుంది. విశ్వం అందాలను వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, సాహసికులను ఒకచోట చేర్చడం ఈ కార్యక్రమం లక్ష్యం. -
బీజేపీ అగ్రనేతలతో ప్రచార దూకుడు!
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా.. బీజేపీ అధినాయకత్వం దూకుడు పెంచుతోంది. పోలింగ్ దగ్గరపడుతుండటంతో.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వరుసగా సభలు, సమావేశాల్లో పాల్గొననున్నారు. ఒకే రోజున రెండు మూడు సభలతో.. 1వ తేదీన హైదరాబాద్ ఎంపీ స్థానం పరిధిలో రోడ్ షో నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మళ్లీ ఈ నెల 5న రాష్ట్రానికి వస్తున్నారు. ఒకేరోజు 3 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్లోని సిర్పూర్ కాగజ్నగర్లో, మధ్యాహ్నం 1.30 గంటలకు నిజామాబాద్లో, సాయంత్రం 4 గంటలకు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో జరిగే బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగిస్తారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. ఈ నెల 6న ఉదయం 11 గంటలకు పెద్దపల్లిలో, మధ్యాహ్నం ఒంటి గంటకు భువనగిరిలో, మధ్యాహ్నం 3.30 గంటలకు నల్లగొండలో జరిగే సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. మూడు నెలల్లో ఎనిమిది సార్లు మోదీ.. ప్రధాని మోదీ ఈ నెల 8, 10వ తేదీల్లో రాష్ట్రానికి వస్తున్నారు. ఈ పర్యటనతో కలిపితే.. మూడు నెలల్లోనే ఎనిమిది సార్లు ఆయన రాష్ట్ర పర్యటన చేసినట్టు అవుతుంది. మోదీ ఇంతకుముందే.. ఫిబ్రవరి మొదటివారంలో రెండు సార్లు, మార్చిలో మూడుసార్లు, ఏప్రిల్ చివరిలో ఒకసారి రాష్ట్రానికి వచ్చారు. ఇక ఈ నెల 8న వేములవాడ, వరంగల్లలో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.10న హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలను కవర్ చేసేలా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ సభలో పాల్గొంటారు. అదేరోజున నారాయణపేటలో ప్రచారసభలోనూ మోదీ పాల్గొననున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్, గుజరాత్, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. అయితే వారికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. పోలింగ్కు ముందు మరోసారి ఇంటింటి ప్రచారం పార్టీ అగ్రనేతలు హాజరయ్యే సభలను మాత్రమే భారీగా నిర్వహించి.. మిగతా అంతా కూడా ఇంటింటి ప్రచారానికే ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు నిర్ణయించాయి. అందులో భాగంగా ఇప్పటికే రెండు విడతల పాటు ‘హర్ఘర్ బీజేపీ’కార్యక్రమాన్ని పూర్తి చేసిన బీజేపీ నేతలు.. పోలింగ్కు ముందు 9, 10, 11 తేదీల్లో తుది విడత ఇంటింటి ప్రచారం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. బుధవారం రాత్రి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల భేటీలో.. పోలింగ్ తేదీ వరకు వీలైనన్ని ఎక్కువ సార్లు ఓటర్లను కలుసుకోవడంపై దృష్టి పెట్టాలని అమిత్ షా సూచించారు. -
జయరాం.. రాం!
గుంతకల్లులోని 18వ వార్డులో బుధవారం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎదుటే టీడీపీలోని తలారి మస్తానప్ప వర్గం, మధు, శివల వర్గం మాటల యుద్ధానికి దిగారు. గుమ్మనూరు నచ్చజెప్పినా వినలేదు. దీంతో విసిగిపోయిన జయరాం.. ‘‘మీకు చేతులు జోడించి మొక్కి చెబుతున్నా.. పార్టీని భ్రష్టు పట్టించకండి..’’ అని నిట్టూరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు.. ఇప్పటివరకూ గుమ్మనూరు ప్రచారం నిర్వహించిన ప్రతి చోటా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని, ఏదేదో అనుకుని గుంతకల్లు బరిలో దిగితే ఇంకేదో జరుగుతుండడంతో ‘గుమ్మనూరు’ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గుంతకల్లు: ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే... జేబులు ఖాళీ ఆయెనే’’ అదేదో సినిమాలోని ఈ పాట టీడీపీ గుంతకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరామ్కు సరిగ్గా సరిపోతోంది. డబ్బుతో ఎన్నికలు గట్టెక్కవచ్చు అనుకున్న ఆయన అంచనాలు తలకిందులవుతున్నాయి. తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు జయరామ్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలే ఆరాచకవాదిగా ముద్ర పడిన జయరామ్ పట్ల ఇప్పటికే గుంతకల్లు ప్రజల్లో సదభిప్రాయం లేదు. ఈ క్రమంలోనే సొంత పార్టీ కేడర్ కూడా కలిసి రాకపోవడంతో ఆయన ఏటికి ఎదురీదుతున్నారు.పుండుపై కారం.. 👉 గుంతకల్లు నియోజకవర్గంలో చాలా చోట్ల టీడీపీ నాయకుల మధ్య కోల్డ్వార్ నడుస్తున్నా ఇప్పటి వరకూ బయటపడలేదు. అయితే, ప్రచారం నిమిత్తం గుమ్మనూరు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సమయాల్లో తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తూ రచ్చకెక్కుతున్నారు. 👉 టీడీపీ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ భర్త, ప్రస్తుతం గుంతకల్లు పదో వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ ఐదేళ్లుగా పారీ్టకి దూరంగా ఉన్నాడు.👉 దీంతో ఆ వార్డు బాధ్యతలను రాయల్ వెంకటే‹Ùకు పార్టీ అధిష్టానం అప్పగించింది. ఇటీవల వెంకటేష్ ఆహా్వనం మేరకు గుమ్మనూరు జయరాం 10వ వార్డుకు రాగా, దీన్ని జీరి్ణంచుకోలేని చంద్రశేఖర్.. గుమ్మనూరు ఎదుటే వెంకటేష్తో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ వర్గానికి చెందిన పలువురు వెంకటే‹Ùపై దాడికి దిగారు. తమ కులానికి చెందిన వ్యక్తిపై దాడి జరగడంతో బలిజ సంఘం నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. చంద్రశేఖర్తో బేషరుతుగా క్షమాపణలు చెప్పించాలంటూ ఇప్పటికే గుమ్మనూరు సోదరుల వద్దకు పంచాయితీకి వెళ్లినా ఏ మాత్రం స్పందన లేకపోవడంతో గుమ్మనూరు తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. 👉 10 రోజుల కిత్రం జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో ఏబీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన అత్మీయ సమావేశానికి గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ఈ సమావేశంలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు బహిరంగంగా విమర్శించారు. మాజీ కౌన్సిలర్లు ఆమ్లేట్ మస్తాన్యాదవ్, కేశప్ప మధ్య వాగ్వాదం చేటు చేసుకొని, బూతులు తిట్టుకున్నారు. 👉 కథలగేరిలోని మాజీ కౌన్సిలర్ ఆమ్లేట్ మస్తాన్యాదవ్, మరో మాజీ కౌన్సిలర్ కథల మారెప్ప, కుమారుడు మహేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం గుమ్మనూరు నిర్వహించిన ప్రచారంలో తారస్థాయికి చేరాయి. మస్తాన్యాదవ్ను వార్డులో తిరగనీయనంటూ గుమ్మనూరు ఎదుటే మహేష్ హెచ్చరికలు జారీ చేశాడు. జనసేన, బీజేపీ నాయకులూ గరంగరం..👉కూటమిలో భాగస్వామ్య పారీ్టలైన జనసేన, బీజేపీల నుంచి కూడా గుమ్మనూరుకు వ్యతిరేకతే ఎదురవుతోంది. ఇటీవల జనసేన నాయకుడు పూలరమణ తన నివాసంలో ఆతీ్మయ సమావేశం ఏర్పాటు చేయగా, జయరాంతోపాటు టీడీపీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షురాలు పత్తి హిమబిందు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ జన సైనికులు ఆవేశం తగ్గించుకుని మాట్లాడాలని అనడంతో ఒక్కసారిగా ఆ పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదని గుమ్మనూరు ఎదుటే హిమబిందును హెచ్చరించారు.👉 బీజేపీలో నాయకుల మధ్య వర్గ పోరు కూడా గుమ్మనూరుకు మైనస్లా మారింది. బీజేపీ నాయకులు మంజుల వెంకటే‹Ù, కొలిమి రామాంజనేయులు మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇలా.. గుంతకల్లు నియోజకవర్గంలోని ప్రతి వార్డులో, గ్రామాల్లో వ్యతిరేకతకు తోడు బీజేపీ, జనసేనల నుంచి కూడా చిక్కుముళ్లు ఎదురవుతుడడంతో గుమ్మనూరు జయరామ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది. -
గాంధీ మార్గంలో ప్రచారం.. భేష్ అంటున్న జనం!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ జరగని స్థానాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నాయకులు వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే గుజరాత్లోని పోర్బందర్ లోక్సభ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రత్యేక రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. పోర్బందర్.. జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలం. అందుకే మన్సుఖ్ మాండవియా.. మహాత్మాగాంధీని స్పూర్తిగా తీసుకుని ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.మన్సుఖ్ మాండవియా గ్రామ గ్రామాన పాదయాత్ర చేస్తూ రోడ్ షోలకు దూరంగా ఉంటున్నారు. ఈ పాత విధానంలో ప్రచారానికి కారణమేమిటని విలేకరులు అడగగా, ఆయన తాను పోర్బందర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, అందుకే మహాత్మాగాంధీ పాదయాత్రలు చేపట్టిన మాదిరిగా ప్రచారం కొనసాగిస్తున్నానని అన్నారు.తన ఎన్నికల పాదయాత్ర ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు వస్తున్నదని ఆయన తెలిపారు. కాలినడకన ఇంటింటికీ ప్రచారం చేయడం వల్ల ఎన్నికల ఖర్చు కూడా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అనవసర ఖర్చులు తగ్గించాలని అన్నారు. బహిరంగ సభ నిర్వహిస్తే, వేడి వాతావరణంలో జనం కూర్చోలేరని, అందుకే ఇంటింటికీ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. కాగా పోర్బందర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ వసోయాపై మాండవ్య పోటీ చేస్తున్నారు. గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మే 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. -
ఆమ్ఆద్మీపార్టీకి ‘ఈసీ’ షాక్
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కి ఎన్నికల కమిషన్(ఈసీ)కి షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచార సభలో భాగంగా ఆప్ వాడుతున్న పాటలో పలుసార్లు రిపీట్ అవుతున్న నినాదం పట్ల ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటలో మార్పులు చేయాలని ఆప్ను ఆదేశించింది. పాటలో మార్పులు చేసిన తర్వాత మళ్లీ తమ ఆమోదం తీసుకోవాలని కోరింది. ఎన్నికల ప్రచార ప్రకటనలో ‘జైల్ కె జవాబ్ మే హమ్ ఓట్ సే దేంగె’అన్న నినాదం వచ్చినపుడు కేజ్రీవాల్ జైళ్లో ఉన్న చిత్రాన్ని ప్రదర్శిస్తున్న గుంపు అంతా కలిసి న్యాయవ్యవస్థను దూషించినట్లుగా పాటలో ఉంది. న్యాయవ్యవస్థపై నిందలు వేయడం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమేనని ఈసీ పేర్కొంది. కాగా, తమ ప్రచార ప్రకటనపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు బీజేపీ కుట్ర అని ఆప్ మండిపడింది. ఎన్నికల చరిత్రలో ఒక ప్రచార పాటపై నిషేధం విధించడం ఇదే మొదటిసారని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. సీబీఐ, ఈడీలపై నిందలు వేస్తే ఎన్నికల కమిషన్ తమ ప్రచార పాటపై నిషేధం విధించడమేంటని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలు తమని అక్రమ అరెస్టులు చేస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. -
‘నా ఓటు మార్పు కోసం... ద్వేషం కోసం కాదు’
‘‘ఎవరో ఒకరు... ఎపుడో అప్పుడు...నడవరా ముందుగా.. అటో.. ఇటో.. ఎటో వైపు’’అప్పుడెప్పుడో వచ్చిన సినిమా ‘అంకురం’ కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన గీతం!ఈ వీడియో చూస్తే ఆ పాట గుర్తుకు రాక మానదు. బెంగళూరు ట్రాఫిక్ కూడళ్లలో పండు ముదుసలి ఒకరు.. ‘‘నా ఓటు మార్పు కోసం... ద్వేషం కోసం’ కాదు అన్న ప్లకార్డ్ పట్టుకుని ఒంటరిగా ప్రచారం చేశారు. ఆ అనుభవజ్ఞుడి ప్రచారానికి జనాలూ ఫిదా అయ్యారు. ‘‘మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు’’ అంటూ కొందరు ప్రశంసించడమూ ఈ వీడియోలో చూడొచ్చు. ನನ್ನ ಮತ ದ್ವೇಷಕ್ಕಾಗಿ ಅಲ್ಲ❌ನನ್ನ ಮತ ಬದಲಾವಣೆಗಾಗಿ✅ಒಂದು ವಿನೂತನ ಕ್ಯಾಂಪೇನ್👇 pic.twitter.com/MwkXcYe3JR— Mamatha R (@mamathcr) April 25, 2024 ఇక.. రేపు (శుక్రవారం) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు.. షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: 22 రోజుల్లో 23 జిల్లాలు.. 86 నియోజకవర్గాలు.. 2,188 కి.మీలు.. 9 భారీ రోడ్ షోలు 6 ప్రత్యేక సమావేశాలు 16 బహిరంగ సభలు.. జన ప్రభంజనం మధ్య జైత్ర యాత్రలా సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సాగింది. మండుటెండైనా, అర్ధరాత్రయినా పిల్లలు, పెద్దలు ఆత్మీయ స్వాగతం పలికారు. యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. మరో జైత్రయాత్రకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఈ నెల 28న తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించనున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో సీఎం పాల్గొననున్నారు. 28న ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండేపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకారావుపేట, ఏలూరులో జరిగే సభలకు సీఎం జగన్ హాజరుకానున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు30న కొండెపి, మైదుకూరు, పీలేరుమే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు -
డీజిల్ మొదలుకొని సభల వరకూ.. ప్రజల సొమ్ముతోనే ప్రచారం!
దేశంలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. పలు పార్టీలకు చెందిన నేతలు తమ ప్రచారాలను ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో పలు వింత దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. గుజరాత్లోని బనస్కాంత లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన గనీబెన్ ఠాకూర్ ప్రచారతీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకువెళుతున్న గనీ బెన్ అందుకు అయ్యే ఖర్చును అక్కడి జనం నుంచి వసూలు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ తన ఎన్నికల ఖర్చుల కోసం చాలామంది విరాళాలు ఇచ్చారని తెలిపారు. అందుకు ప్రతిగా బనస్కాంత ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. గత 10 రోజుల్లో తాను నిర్వహించిన బహిరంగ సభల ఏర్పాటుకు అయ్యే ఖర్చులను పలువురు భరించారని తెలిపారు. తన కారు డీజిల్ ఖర్చును కూడా జనమే చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజల నుండి ఆర్థిక సహాయం కోరేందుకు కాంగ్రెస్ ‘దేశం కోసం విరాళం’ ప్రచారాన్ని ప్రారంభించిందని ఆమె తెలిపారు. బనస్కాంతలో కాంగ్రెస్ అభ్యర్థి గనీ బెన్పై బీజేపీ నుంచి ప్రొఫెసర్ రేఖా చౌదరి ఎన్నికల బరిలోకి దిగారు. రేఖా చౌదరి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గుజరాత్లోని మొత్తం 26 లోక్సభ స్థానాలకు మే 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా 2013లో జరిగిన ఉప ఎన్నికతో సహా గత మూడు లోక్సభ ఎన్నికల్లో బనస్కాంత సీటును బీజేపీ గెలుచుకుంది. -
ప్రచారం చేస్తా.. బెయిల్ ఇవ్వండి: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు శుక్రవారం(ఏప్రిల్ 12) విచారించింది. ఈ నెల 20లోపు సిసోడియా బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐలకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికలు సమీపించింనదున ఆమ్ఆద్మీపార్టీ తరపున ప్రచారం కోసం తనకు మధ్యంత బెయిల్ ఇవ్వాలని కోర్టును సిసోడియా కోరారు. ఈ నెల 20వ తేదీన కోర్టు సిసోడియా మధ్యంతర బెయిల్పై విచారణ జరిపే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. అనంతరం ఈడీ కూడా సిసోడియాను ఇదే కేసులో అరెస్టు చేయడం గమనార్హం. అరెస్టు అనంతరం ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అరెస్టయిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుల అరెస్టు.. స్పందించిన ‘దీదీ’ -
ఎన్నికల సిత్రాలు : మండుటెండలో హేమమాలిని జోరు
ప్రముఖ నటి బీజేపీ ఎంపీ హేమమాలిని లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మథురలో ఎన్నికల ప్రచారంలో రైతులను కలిసిన హేమమాలిని గోధుమ పొలంలో గడ్డికోసి సందడి చేశారు. పొలాల్లో పని చేసే మహిళలతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ఈ పదేళ్లుగా తాను క్రమం తప్పకుండా కలుస్తున్న రైతులతో మరోసారి మమేకమయ్యేందుకు వారిని కలిసానని, వారి మధ్యలో ఉండటం వారికి కూడా సంతోషాన్నిచ్చిందని, రైతు మహిళలతో కలిసి ఫోటోలకు పోజులివ్వాలని పట్టుబట్టారంటూ ఆమె రాసుకొచ్చింది. మథుర లోక్సభ స్థానం నుంచి బీజేపీ వరుసగా మూడోసారి హేమమాలిని బరిలోకి దిగింది. 1991 నుండి 1999 వరకు, మధుర నాలుగు సార్లు బీజేపీకి కంచుకోటగా ఉంది. అయితే 2004లో మధుర కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. 2009లో ఆర్ఎల్డీకి చెందిన జయంత్ చౌదరి మధుర నుంచి ఎంపీ అయ్యారు. ఇక ఆ తరువాత 2014లో హేమమాలినిని బీజేపీ రంగంలోకి దించింది. 2019 ఎన్నికల్లో, హేమ భర్త, నటుడు ధర్మేంద్ర కూడా ఆమె కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. Today I went into the farms to interact with the farmers who I have been meeting regularly these 10 years. They loved having me in their midst and insisted I pose with them which I did❤️ pic.twitter.com/iRD4y9DH4k — Hema Malini (@dreamgirlhema) April 11, 2024 తిరిగి ఇదే స్థానం బీజేపీ తరఫున 2024 ఎన్నికల్లో హేమమాలిని నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న మధురలో రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. 80 మంది పార్లమెంటు స్థానాలున్న యూపీలో మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 19, 26 మే 7, మే 13, మే 20, మే 23 , జూన్ 1 ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. -
గుర్తుతెలియని ప్రచార హోర్డింగ్లపై ఈసీ నిషేధం
సాక్షి,అమరావతి: ఎన్నికల ప్రచార హోర్డింగులపై ప్రింటర్ మరియు పబ్లిషర్ల స్పష్టమైన గుర్తింపును తప్పనిసరి చేస్తూ భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను బుధవారం( ఏప్రిల్ 10) ఆదేశించింది. మున్సిపాలిటీల స్థలాల్లో గుర్తింపు లేకుండా ఉన్న హోర్డింగ్లపై ఈసీకి ఫిర్యాదులు అందడంతో ప్రధాన ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 127A, ప్రింటర్ మరియు ప్రచురణకర్త పేరు, చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ప్లకార్డులు లేదా బ్యానర్లను ముద్రించడం లేదా ప్రచురించడాన్ని నిస్సందేహంగా నిషేధిస్తున్నట్లు ఈసీ తెలిపింది. పార్టీ, అభ్యర్థి ప్రచారం కోసం ఇచ్చే ప్రకటనలు, వ్యతిరేకంగా ఇచ్చే ఎలాంటి ప్రకటనపై అయినా చిరునామా లేకపోతే నిషేధం వర్తిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వం ప్రకటనలకు సంబంధించి ప్రభుత్వ ఖజానా ఖర్చుతో విడుదల చేసే రాజకీయ ప్రకటనలను కూడా ఈసీ నిషేధించింది. ఇదీ చదవండి.. రూ.200 కోట్ల హవాలా గుట్టురట్టు -
జోషీమఠ్లో కానరాని ప్రచారం.. కారణమిదేనా?
ఉత్తరాఖండ్లోని జోషీమఠ్ పేరు వినగానే గతంలో అక్కడ చోటుచేసుకున్న భూమి కుంగుబాటు ఉదంతం గుర్తుకు వస్తుంది. ఇంతకుమునుపు ఈ ప్రాంతం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నేతలు ఈసారి ఈ సమీప ఛాయలకు కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు శరవేగంగా ప్రచారం సాగిస్తున్నాయి. నేతలు వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్లోని జోషిమఠ్, చమోలి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం కనిపించడం లేదు. రాజకీయ నేతలు ఈ ప్రాంతానికి దూరంగా ఉంటున్నారు. ఉత్తరాఖండ్లోని పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో జోషీమఠ్, దసౌలి డెవలప్మెంట్ బ్లాకులో భూమి కుంగిన దరిమిలా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడి ప్రజలు తమను ప్రశ్నిస్తారనే భయంతో ప్రచారానికి నేతలు వెళ్లడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జోషీమఠ్కు చెందిన బీజేపీ నేతలు కూడా ఈ ప్రాంతంలో ప్రచారం నిర్వహించకపోవడం విశేషం. కాగా లోక్సభ ఎన్నికల మొదటి దశలో అంటే ఏప్రిల్ 19న ఉత్తరాఖండ్లోని ఐదు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్లోని తెహ్రీ గర్వాల్, గర్వాల్, అల్మోరా, నైనిటాల్-ఉధమ్ సింగ్, హరిద్వార్ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. -
తుక్కుగూడ నుంచే సమర శంఖం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జన జాతర పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన హామీలను కూడా ప్రకటించనున్నారు. మరోవైపు ఈ సభలోగానీ, అంతకుముందుగానీ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు పారీ్టలో చేరుతారని అంటున్నారు. ఇందులో ముగ్గురి నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తుక్కుగూడ సభ ప్రారంభానికి ముందు నోవాటెల్ హోటల్లో రాహుల్ సమక్షంలో ఈ చేరికలు జరగొచ్చని.. తర్వాత వారు సభలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. చేరేది ఎవరన్నదానిపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి.. టీపీసీసీ జన జాతర సభకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం, 550 ఎకరాల్లో పార్కింగ్ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి.. సోనియా గాం«దీతో ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల శంఖారావానికి కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఇక ఎండలు మండిపోతున్న నేపథ్యంలో సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మంచినీటి కొరత రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు స్థానాల వారీ ఇన్చార్జులు, అసెంబ్లీ సమన్వయకర్తల సమన్వయంతో.. సభకు 10లక్షల మందికిపైగా తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కా>ంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన విజయాలను ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణకు ప్రత్యేక హామీలు తుక్కుగూడ సభలో కాంగ్రెస్ జాతీయ స్థాయి మేనిఫెస్టో ‘పాంచ్ న్యాయ్’ను తెలుగులో విడుదల చేయనుంది. దీనితోపాటు రాహుల్ గాంధీ తెలంగాణకు ప్రత్యేక హామీలను ఇవ్వనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన ఐదు భద్రాచలం సమీప గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని.. విభజన చట్టం హామీలన్నీ అమలు చేస్తామని హామీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఐటీఐఆర్ వంటి ఉపాధి ప్రాజెక్టును కేటాయిస్తామనే హామీ కూడా ఉంటుందని తెలిసింది. చేరికలపై గోప్యత జన జాతర సభ సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చేరికల అంశాన్ని టీపీసీసీ గోప్యంగా ఉంచుతోంది. పార్టీ ముఖ్య నేతతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ నాయకుడికి మాత్రమే దీనిపై స్పష్టత ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చేరే అవకాశం ఉందని.. నోవాటెల్ హోటల్లో రాహుల్ గాం«దీని ఎంపీ కె.కేశవరావు కలుస్తారని మాత్రం పేర్కొంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్లో చేరేవారు వీరే అంటూ కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారం అవుతున్నాయి. కాలేరు వెంకటేశ్, కోవ లక్ష్మి, కాలె యాదయ్య, బండారి లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, టి.ప్రకాశ్గౌడ్, మాణిక్రావు, డి.సు«దీర్రెడ్డి, అరికెపూడి గాం«దీ, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ ఈ జాబితాలో ఉన్నట్టు చెప్తున్నారు. కానీ వీరిలో ఎందరు చేరుతారు, ఎవరు చేరుతారన్నది స్పష్టత లేదు. దీనిపై టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడమైతే ఖాయమే. అన్ని సన్నివేశాలను వెండితెరపై చూడాల్సిందే..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. శంషాబాద్ నుంచి నోవాటెల్కు.. తర్వాత సభకు.. రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్కు వస్తారు. కొంతసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యాక.. తుక్కుగూడ సభకు చేరుకుంటారు. సభ ముగిశాక రాత్రి 7 గంటల సమయంలో శంషాబాద్ మీదుగా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. -
‘జన జాతర’కు ప్రియాంక
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన మెదక్ లోక్సభ స్థానంతో పాటు పార్టీకి విజయావకాశాలున్న పలు చోట్ల ఆమె చురుగ్గా ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ పరిధిలో ఆమె సేవలు వినియోగించుకోవాలని ఏఐసీసీ స్థాయిలో నిర్ణయించిన కారణంగానే ఈనెల 6వ తేదీన తుక్కుగూడలో జరగనున్న ‘జనజాతర’సభకు హాజరు కానున్నట్టు సమాచారం. తొలుత ఈ సభకు రాహుల్గాందీ, మల్లికార్జు న ఖర్గే మాత్రమే రావాలని నిర్ణయించినా ప్రియాంకను కూడా పంపాలని ఏఐసీసీ నిర్ణయించింది. తుక్కుగూడ సభతో పాటు లోక్సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్ను ఏఐసీసీతో సమ న్వయం చేసే బాధ్యతలను టీపీసీసీ ముఖ్య నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది. మేనిఫెస్టో.. మరుసటి రోజే తుక్కుగూడ సభను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ వ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికల కోసం ఈనెల ఐదో తేదీన మేనిఫెస్టో విడుదల చేసిన మరుసటి రోజే తుక్కుగూడలో సభ జరుగుతుండడం, సభకు రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితర ముఖ్యులు హాజరు కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టాలని భావిస్తోంది. భారీ జనసందోహం మధ్య లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ నుంచే ఏఐసీసీ జంగ్ సైరన్ మోగిస్తుందని టీపీసీసీ వర్గాలు చెపుతున్నాయి. ఈ సభలో పార్టీ మేనిఫెస్టోతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేయనున్న ఐదు గ్యారంటీలను తెలుగులో విడుదల చేయనున్నారు. అచ్చొచ్చిన చోట.. పది లక్షల మందితో తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జన జాతర బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మైదానం పక్కనే వాహనాల పార్కింగ్ కోసం 300 ఎకరాల స్థలాన్ని అందుబాటులో ఉంచారు. ఈ సభకు కనీసం పదిలక్షల మంది హాజరవుతారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు పెద్ద ఎత్తున పార్టీ కేడర్ తరలివచ్చేలా ఎక్కడికక్కడ ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఈ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా తుక్కుగూడ నుంచే రేవంత్ నేతృత్వంలో టీపీసీసీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా గత ఏడాది సెపె్టంబర్ 17న ఇక్కడ నిర్వహించిన సభకు సోనియాగాంధీ హాజరై ఆరు గ్యారంటీలను ప్రకటించారు. విజయభేరి పేరుతో సభ నిర్వహించిన ఈ ప్రాంతం కలిసివచ్చిందని, తెలంగాణలో అధికారంలోకి తెచ్చిన ప్రారంభ సభ ప్రాంతాన్నే లోక్సభ ఎన్నికల కోసం ఎంచుకున్నామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభ స్ఫూర్తితోనే దేశంలో పదేళ్లనియంతృత్వ, అప్రజాస్వామిక బీజేపీ పాలనకు తెరదించుతామని చెబుతున్నాయి. ఆసక్తి రేపుతున్న రేవంత్ వ్యాఖ్యలు గత ఎన్నికలకు ముందు తుక్కుగూడలో నిర్వహించిన సభలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతుందని అప్పటి పీసీసీ అధ్య క్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 9న కొలువుదీరే ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అందరూ ఆహా్వనితులేనని చెప్పుకొచ్చారు. ఈనెల 6న జరిగే సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు రెండురోజుల కిందట తుక్కుగూడకు వచ్చిన సీఎం.. జూన్ 9న ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. దీంతో తుక్కుగూడ వేదికగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
‘మా ఊరికి రావద్దు.. అన్ని ఓట్లూ నోటాకు వేసేస్తాం’
ఎన్నికల ప్రచారం ఎక్కడికక్కడే ఊపందుకుంటోంది కానీ కేరళ రాష్ట్రం కన్నూర్లోని నడువిల్ గ్రామ వాసులు మాత్రం ప్రచారానికి నో చెబుతున్నారు. కారణం అధ్వాన్నమైన రోడ్లు. మెరుగైన రోడ్లు వేయనందుకు నిరసనగా తమ గ్రామంలో ఎలాంటి ఎన్నికల ప్రచారానికి అనుమతించబోమని ఆ గ్రామస్తులు ప్రకటించారు. తమ ప్రాంతానికి ఓట్లు అడగడానికి అభ్యర్థులెవరూ రాకూడదంటూ వివిధ చోట్ల ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేశారు. నడువిల్లి పంచాయతీ పరిధిలోని 9, 10, 11, 12 వార్డుల్లోని నాలుగు ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. రోడ్ల మరమ్మతులకు ఎన్నిసార్లు విన్నవించినా ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లు అధ్వానంగా ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో తమ గ్రామానికి డ్రైవర్లు ఎవరూ రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహిస్తున్నారు. "ఎన్నో ఏళ్లుగా ఈ బూటకపు వాగ్దానాలు వింటూనే ఉన్నాం. వారి మాటలను ఇకపై విశ్వసించం. ప్రజాప్రతినిధులు, అధికారులు రాతపూర్వక హామీ ఇస్తేనే ఈ ఎన్నికల్లో పాల్గొంటాం. లేకపోతే అన్ని ఓట్లు నోటా వేసేస్తాం" అని నడువిల్లి గ్రామస్తులు తెగేసి చెప్పేస్తున్నారు. కాగా ఇటీవలే రెండు రోడ్లకు నిధులు కేటాయించామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు చేపడతామని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. -
మొదలైన యూసఫ్ పఠాన్ ప్రచారం: అధీర్ చౌదరి కీలక వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రకటించిన 42 మంది అభ్యర్థులలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ 'యూసఫ్ పఠాన్' (Yusuf Pathan) పేరు కూడా ఉంది. ఈయన బహరంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. 'అధీర్ రంజన్ చౌదరి'కి కాంగ్రెస్ కంచుకోట అయిన బహరంపూర్ నియోజకవర్గంలో యూసఫ్ పఠాన్ నిలబడటం సర్వత్రా చర్చలకు దారి తీసింది. నిజానికి ఇప్పటికే చౌదరి బహరంపూర్ నుంచి ఐదుసార్లు గెలిచారు. అలాంటి చోట నుంచి ఇప్పుడు యూసఫ్ పఠాన్ పోటీ చేయనున్నారు. #WATCH | West Bengal: Former cricketer and Trinamool Congress (TMC) candidate from Berhampore Yusuf Pathan says, "The field is very different but the expectations of the people remain the same- that I work for them, and carry forward the work done by my team (TMC)... I am as… pic.twitter.com/1XGmyrKhTW — ANI (@ANI) March 21, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి యూసఫ్ పఠాన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారాన్ని ప్రారంభించిన సమయంలో యూసుఫ్ పఠాన్ మాట్లాడుతూ.. తాను క్రికెట్ ఆడేటప్పుడు ప్రజల ప్రేమను పొందానని, ఇప్పుడు లోక్సభ పోటీదారుగా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. 'అధీర్ రంజన్ చౌదరి' యూసుఫ్ పఠాన్ బెర్హంపూర్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంపై వ్యాఖ్యానిస్తూ.. రాజకీయాలు & క్రికెట్ ఒకేలా ఉండవని అన్నారు. అయితే చౌదరిని బెర్హంపూర్ స్థానం నుంచి లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ అధికారికంగా నామినేట్ చేయలేదు. బెర్హంపూర్ లోక్సభ స్థానానికి మే 13న నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. #WATCH | Murshidabad, West Bengal: Yusuf Pathan, former cricketer and Trinamool Congress (TMC) candidate from Berhampore says, "I am grateful to Mamata Didi (CM Mamata Banerjee) for giving me the opportunity to serve you. I hope that the way you people have given me love for the… pic.twitter.com/N7ihjlPXhU — ANI (@ANI) March 21, 2024 -
ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ సిద్ధం..ప్రచారం అక్కడినుండే..
-
‘ప్రచార బుల్లెట్’ ఎక్కిన బెంగాల్ బీజేపీ చీఫ్
పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుల్లెట్ వాహనంపై బాలూర్ఘాట్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు బాలూర్ఘాట్ రైల్వేస్టేషన్లో రైలు దిగిన మజుందార్కు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నాయకుల నినాదాల మధ్య దాదాపు మూడు కిలోమీటర్ల మేర మోటర్ సైకిల్ నడుపుతూ మజుందార్ ప్రచారం నిర్వహించారు . మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఎంసీపై పలు విమర్శలు చేశారు. ‘ఓ వైపు ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తుంటే మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. తృణమూల్ ఇక్కడి నుంచి అనేక కుంభకోణాలు చేసిన దొంగను అభ్యర్థిగా నిలబెట్టింది. ఇది దొంగలు, మంచి వ్యక్తుల మధ్య పోరు. తృణమూల్ కాంగ్రెస్ ఈ నియోజకవర్గాన్ని మోసం చేసింది’ అన్నారు. బాలూర్ఘాట్ నియోజకవర్గం నుండి టీఎంసీ తన లోక్సభ అభ్యర్థిగా బిప్లబ్ మిత్రను నిలబెట్టింది. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి దూరం జరిగిన తృణమూల్ కాంగ్రెస్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ స్థానాలకు తమ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. -
ప్రచార భేరి.. విస్తృతంగా ఎన్నికల ప్రచారానికి సీఎం వైఎస్ జగన్ ప్రణాళిక
సాక్షి, అమరావతి: ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి జనవరి 27న భీమిలి వేదికగా సమర శంఖం పూరించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా క్షేత్రంలో దూసుకెళ్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలకు కడలిలా జనం కదలి రావడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్ర, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడులో నిర్వహించిన సభ అతి పెద్ద ప్రజా సభగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. రాబోయేది వైఎస్సార్సీపీ సునామీనేనని ఎన్నికలకు ముందే రాప్తాడు సభ ద్వారా జనం చాటి చెప్పారని విశ్లేషిస్తున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ఆదివారం మేదరమెట్లలో నిర్వహించే సిద్ధం సభే చివరిది కానుండటంతో విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. జన బలమే గీటు రాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా, గెలుపే లక్ష్యంగా శాసనసభ, లోక్సభ సమన్వయకర్తల నియామకం ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు తుది దశకు చేరుకుంది. తన ప్రచారంలో మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన వెంటనే ప్రచార పర్వానికి తెరతీసి.. రోజుకు రెండు లేదా మూడు సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళిక రచించారు. రోజూ ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో సభలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. విప్లవాత్మక మార్పులు వివరిస్తూ.. గత ఎన్నికల్లో ఇచి్చన హామీల్లో 99 శాతం సీఎం జగన్ అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా 58 నెలల్లోనే డీబీటీ రూపంలో రూ.2,58,855.97 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1,79,246.94 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి మొత్తం రూ.4,38,102.91 కోట్ల లబ్ధిని పేదలకు చేకూర్చారు. రాష్ట్రంలో సగటున 87 శాతం కుటుంబాల ప్రజలు సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల లబ్ధి పొందారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి.. ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తున్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. వాటి వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ప్రతి జిల్లాలో.. ప్రతి నియోజకవర్గంలో.. ప్రతి గ్రామంలో.. ప్రతి ఇంటా వచ్చిన విప్లవాత్మక మార్పులను వివరిస్తూ.. ప్రభుత్వం వల్ల మంచి జరిగి ఉంటేనే అండగా నిలబడి, ఆశీర్వదించాలని కోరుతున్నారు. మరింతగా మంచి చేసే పాలన తెచ్చేందుకు వైఎస్సార్సీపీని గెలిపించాలని ప్రచారం చేయనున్నారు. అవకాశవాద పొత్తులను ఎండగడుతూ విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ–బీజేపీ–జనసేన కూటమిగా పోటీ చేస్తే.. వైఎస్సార్సీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో 650 హామీలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేస్తే.. వాటి అమలుకు నాది పూచీ అని పవన్ కళ్యాణ్ ప్రజలకు మాట ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీల్లో పది శాతం కూడా అమలు చేయని చంద్రబాబు.. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో మేనిఫెస్టోను టీడీపీ వెబ్సైట్ నుంచే మాయం చేయించారు. వ్యవసాయ రుణాల మాఫీ చేయకుండా రైతులను, డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మహిళలను.. ఇంటికో ఉద్యోగం లేదా రూ.2 వేల చొప్పున నిరుద్యోగభృతి ఇవ్వకుండా యువతను ఇలా అన్ని వర్గాలను మోసం చేశారు. హామీల అమలుకు పూచీ పడ్డ పవన్ కళ్యాణ్ ఏనాడూ వాటిపై చంద్రబాబును ప్రశ్నించిన పాపాన పోలేదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు.. కమీషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నారు. చివరలో అంటే 2018లో బీజేపీతో విభేదించి ఎన్డీయే నుంచి వేరుపడి ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత దూషణలకు దిగారు. తిరుపతిలో రక్షణమంత్రి అమిత్ షాపై టీడీపీ శ్రేణులతో దాడి చేయించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు 2019 ఎన్నికల్లో జనసేనతో వేరుగా పోటీ చేయించారు. ఇప్పుడు మళ్లీ ఓటమి భయంతో జనసేనతో జట్టు కట్టిన చంద్రబాబు.. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో జత కలిశారు. వైఎస్సార్సీపీని ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమన్న భయంతో.. పచ్చి అవకాశ వాదంతో.. అనైతికంగా చంద్రబాబు పొత్తులు పెట్టుకొని, మళ్లీ మోసం చేసేందుకు వస్తుండటాన్ని సీఎం జగన్ తన ప్రచారపర్వంలో ఎండగట్టనున్నారు. ప్రచార సన్నద్ధతపై వరుసగా సమీక్షలు ఎన్నికల ప్రచారానికి సన్నద్ధతపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసనసభ, లోక్సభ స్థానాల సమన్వయకర్తలతో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో కలిసి సమీక్షిస్తున్నారు. అందులో భాగంగా గురువారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమన్వయకర్తలతో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త అయోధ్య రామిరెడ్డితో కలిసి సజ్జల చర్చించారు. శనివారం ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమన్వయకర్తలతో ప్రచార సన్నద్ధతపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆ ప్రాంత పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డితో కలిసి సమీక్షించారు. -
‘చీపురు’ ప్రచారం షురూ! నినాదం ఇదే..
రానున్న లోక్సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారాన్ని షురూ చేసింది. 'సంసద్ మే బీ కేజ్రీవాల్, తో ఢిల్లీ హోగీ ఔర్ ఖుష్ హాల్' నినాదంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ‘చీపురు’ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. 4:3 ఫార్ములా సీట్ల షేరింగ్తో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆప్ గతంలో ప్రకటించింది. ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ‘నా కుటుంబ సభ్యులైన ఢిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు నేను అన్ని ప్రయత్నాలు చేశాను. మా నినాదం 'సంసద్ మే బీ కేజ్రీవాల్, తో ఢిల్లీ హోగీ ఔర్ ఖుష్ హాల్' (పార్లమెంట్లో కేజ్రీవాల్తో ఢిల్లీ మరింత అభివృద్ధి)" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్ ఇప్పటికే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. మిగిలిన మూడు స్థానాల్లో అంటే నార్త్ ఈస్ట్, చాందినీ చౌక్, నార్త్ వెస్ట్ (ఎస్సీ రిజర్వ్డ్) సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలబెడుతోంది. -
కొత్త నినాదంతో వైఎస్సార్సీపీ సిద్ధం
సాక్షి, తాడేపల్లి: ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ.. కొత్త ప్రచార అస్త్రాన్ని రెడీ చేసింది. ఇప్పటి వరకు ‘సిద్ధం పేరుతో హోర్డింగులు కనిపించగా, తాజాగా ‘నా కల..’ అంటూ ఆయా వర్గాల పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 10న జరగనున్న సిద్ధం సభ కోసం వైఎస్సార్సీపీ ప్రచారం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో సరికొత్త హోర్డింగ్లతో ఆకర్షనీయమైన ప్రచారానికి దిగింది. ప్రజల కల నెరవేర్చే దిశగా అడుగులు వేస్తానంటూ సీఎం జగన్ పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది వైఎస్సార్సీపీ. రైతుల కల- జగనన్న కల, కార్మికుల కల - జగనన్న కల, విద్యార్థుల కల - జగనన్న కల తదితర పేర్లతో రూపొందించిన హోర్డింగులు.. ఆయా వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మేలును తెలుపుతున్నాయి. కొత్త ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. -
రామ్రాజ్ కాటన్ ప్రచారకర్తగా కాంతారా హీరో
కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టిను రామ్రాజ్ కాటన్ కంపెనీ తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా నియమించింది. ఇకపై రామ్రాజ్ కంపెనీ తయారుచేస్తున్న ధోతీలు, షర్ట్స్, కుర్తాలకు రిషబ్ ప్రచారం చేయనున్నట్లు రామ్రాజ్ కాటన్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ ఈశ్వర్ తెలిపారు. రామ్రాజ్ బ్రాండ్కు ప్రచారం చేయడం పట్ల రిషబ్ శెట్టి హర్షం వ్యక్తం చేశారు. నటుడు, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి ప్రచారంతో రామ్రాజ్ బ్రాండ్ వినియోగదారులకు మరింత చేరువ అవుతుందని సంస్థ ఎండీ అరుణ్ తెలిపారు. ఇదీ చదవండి: ఎగుమతులకు ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలుంటాయా..? 1983లో ప్రారంభమైన ఈ సంస్థ 2023 మార్చి లెక్కల ప్రకారం దాదాపు రూ.119 కోట్లు మార్కెట్ క్యాపిటల్ను కలిగి ఉందని అంచనా. సంస్థలో భాగంగా ఉన్న రామ్రాజ్ సర్జికల్ కాటన్ మిల్స్లో కాటన్యార్న్, ఫాబ్రిక్స్ తయారవుతున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
అభివృద్ధి నినాదమే సమర నాదం
బులంద్షెహర్/రేవారీ: ఉత్తరప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ లేదు లేదంటూనే ఎన్నికల ఊసెత్తి పరోక్షంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని బులంద్షెహర్ జిల్లాలో రూ.19,100 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ప్రధాని మోదీ అక్కడి ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం యావత్తూ ప్రచారధోరణిలోనే కొనసాగింది. ‘‘ నేను ప్రత్యేకంగా ఎన్నికల సమర నినాదం ఇవ్వాల్సిన పని లేదు. ప్రజలే నా కోసం ఆ పని చేస్తారు. మోదీ గ్యారెంటీల బండి ప్రతి ఒక్క లబి్ధదారుని చెంతకొస్తుంది. ప్రభుత్వ పథకాలు చిట్టచివరి లబ్ధిదారునికి చేరిన నాడు సమాజంలో వివక్ష, అవినీతి అనేవే ఉండవు. అదే అసలైన లౌకికవాదం. అప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాకారమైనట్లు లెక్క. మీరే నా కుటుంబం. మీ కలలే నాకు సంకల్పాలు. మీలాంటి సాధారణ కుటుంబాలు ఆర్థికాభివృద్దితో సాధికారత సాధించినప్పుడే నా ‘ఆస్తి’ మరింత పెరిగినట్లు సంతోషిస్తా. మా ప్రభుత్వం ఏం చెబుతోందో దానిని చేసి చూపిస్తుంది. మీరు సంతృప్తి చెందే గ్యారెంటీ నాది. 100 శాతం లబి్ధదారులకు పథకాలు చేరేలా నేను కృషిచేస్తా’’ అని మోదీ ప్రకటించారు. కాంగ్రెస్పై విమర్శలు ‘‘ చాన్నాళ్ల క్రితం ఒకరు గరీభీ హఠావో అని గట్టిగానే నినదించారు. కానీ సామాజిక న్యాయం కలగానే మిగిలిపోయింది. కొందరు మాత్రమే సంపన్నులై, వారి రాజకీయాలు మాత్రమే నడవడం పేదలు కళ్లారా చూశారు’’ అని కాంగ్రెస్ను విమర్శించారు. ‘‘ ఈ రోజు కార్యక్రమం ద్వారా ఎన్నికల ప్రచారానికి నేను శ్రీకారం చుడుతున్నానని మీడియాలో ప్రచారం జరిగింది. నేను ఆ పని అస్సలు చేయను. నాకు అవసరం లేదు కూడా. బీజేపీకి భవిష్యత్తులో కూడా ఆ అవసరం పడదు. ప్రజలే నా కోసం ఆ పని చేస్తారు. ప్రజలే నా కోసం ఎన్నికల సమర శంఖం పూరిస్తున్నపుడు నేను ప్రత్యేకంగా ప్రచారానికి సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. నా సమయమంతా ప్రజాసేవకే కేటాయిస్తాను. అభివృద్ది నినాదం మాత్రమే నేను ఇస్తా. దానినిప్రజలే ఎన్నికల సమర నినాదంగా దేశవ్యాప్తంగా మార్మోగిస్తారు’ అని సభికుల హర్షధ్వానాల మధ్య మోదీ అన్నారు. కుటుంబ పారీ్టలను ఓడించండి మరోవైపు, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా యువ ఓటర్లతో మాట్లాడారు. ‘‘ లోక్సభ ఎన్నికల్లో కుటుంబ పారీ్టలను ఓడించండి. భారత దేశ దశ, దిశలను నిర్ణయించే సత్తా యువ ఓటర్లకు ఉంది. పది, పన్నెండేళ్ల క్రితం నాటి ప్రభుత్వాల పాలనలో నాటి యువత అంధకారంలో మగ్గిపోయింది. మేమొచ్చాక దేశాన్ని అంధకారం నుంచి బయటికి తెచ్చాం. ఇప్పుడు యువతరానికి అవకాశాలు మెరుగయ్యాయి. బీజేపీ మేనిఫెస్టోకు మీరూ సలహాలు, సూచనలను నమో యాప్ ద్వారా పంపండి. మీ చక్కని ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు బీజేపీ ప్రయతి్నస్తుంది’’ అని యువ ఓటర్లకు మోదీ సూచించారు. -
ఏడు టీకాలతో 7-స్టార్ రక్షణ : పిల్లల టీకాలపై జీఎస్కే ప్రచారం
ప్రముఖ ఫార్మా సంస్థ గ్లాక్సో స్మిత్క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (GSK) పిల్లలకు క్లిష్టమైన రక్షణను అందించే టీకాల గురించి అవగాహన కల్పిస్తోంది. ఒకటి నుండి రెండేళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు అందించాల్సిన టీకాలపై జనవరి 25 నుంచి ప్రచారాన్ని ప్రారంభించింది. 1-2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఏడు కీలకమైన టీకాల ద్వారా '7-స్టార్ ప్రొటెక్షన్' అందించాలంటూ తల్లిదండ్రులను కోరుతోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) పిల్లలకు ఏడు టీకాలును సిఫార్సు చేస్తోంది, చికెన్పాక్స్ హెపటైటిస్ ‘ఏ’ తొలి డోస్ , ఎంఎంఆర్ (MMR) మెనింజైటిస్ రెండో డోస్, పీసీవీ DTP Hib IPV బూస్టర్ డోస్, ఫ్లూ వార్షిక మోతాదు ప్రధానంగా ఉన్నాయి. పలు రకాల ఇన్ఫెక్షన్లనుంచి కాపాడి, రోగ నిరోధక వ్యవప్తను బలోపేతం చేసే టీకాలు వేయవలసిన అవసరంపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తోంది. బిడ్డ పుట్టిన తొలి ఏడాదిలో టీకాలపై ఎక్కువ ఆసక్తి ఉన్నప్పటికీ, రెండో సంవత్సరంలో టీకాలు వేయించుకోని వారి సంఖ్య పెరుగుతోందని జీఎస్కే తెలిపింది. దీంతో పాక్షికంగా టీకాలు తీసుకుంటున్న పిల్లల సంఖ్య దేశంలో బాగా పెరుగుతోందని పేర్కొంది. అంటే తొలి ఏడాది శ్రద్దగా వాక్సీన్లు వేయించిన తల్లిదండ్రులు, రెండో ఏడాదికి వచ్చేసరికి మునుపటి శ్రద్ధ చూపించడలేదు. అలా కాకుండా క్రమంగా తప్పకుండా పిల్లలకు టీకాలు వేయిస్తే వారి ఆరోగ్య భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్టు అవుతుందనే సందేశంతో జీఎస్కే ఈ ప్రచారాన్ని చేపట్టింది. పాక్షికవ్యాక్సినేషన్ వల్ల పిల్లల్ని తీవ్రమైన సమస్యలకు గురి చేస్తుందని జీఎస్కే చెబుతోంది. అందుకే రెండో సంవత్సరంలో కూడా క్రమం తప్పకుండా టీకాలు వేయించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఇది పిల్లల్ని చాలా రోగాల నుంచి పిల్లలను కాపాడుతుందంటోంది. అలాగే రెండో ఏడాదిలో టీకాలను తీసుకోని పిల్లలు స్వయంగా ప్రమాదంలో పడటంతోపాటు, ఇంట్లో వారి మిగిలిన తోబుట్టువులను, అమ్మమ్మ తాత,నానమ్మ తదితర వృద్ధులకు ఇన్ఫెక్షన్ వ్యాపించి వారిని మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని కంపెనీ పత్రికా ప్రకటన తెలిపింది. టీకాలతో నివారించగలిగే చికెన్పాక్స్, మీజిల్స్ , ఫ్లూ వంటి వ్యాధులు గత మూడేళ్లలో దేశంలో బాగా వ్యాపించాయని జీఎస్కే ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ , మెడికల్ అఫైర్స్, డాక్టర్ రష్మీ హెగ్డే తెలిపారు. పిల్లల అభివృద్ధిపై టీకాల దీర్ఘకాలిక ప్రభావాన్ని నొక్కి వక్కాణించిన ఆయన సంబంధిత టీకాలను పూర్తి చేయడం ద్వారా ఆరోగ్య కరమైన సంతోషకరమైన బాల్యం అందించినట్టు అవుతుందన్నారు. రెండేళ్ల వయసున్న పిల్లల ఎదుగుదలకు భరోసా ఇచ్చే టీకాల గురించి తెలిదండ్రులకు అవగాహన కల్పించడమే తమ ప్రచార లక్ష్యమని హెగ్డే వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల వైద్యుల క్లినిక్లలో టెలివిజన్, సోషల్ మీడియా, పోస్టర్లు వంటి బహుళ ఛానెల్లలో ప్రచారాన్ని ప్రారంభించింది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వివరాలపై మరింత సమాచారం కోసం శిశు వైద్యులను సంప్రదించాలి. 7 కీలకమైన VPDల గురించి అదనపు సమాచారాన్ని MyVaccinationHub.inలో కూడా పొందవచ్చు. -
అమాయక చక్రవర్తి కాదు
మహారాణిపేట (విశాఖ): చంద్రబాబు ‘స్కిల్’ దొంగేనని, ఆయన అమాయక చక్రవర్తి అని ఏ కోర్టూ సర్టిఫికెట్ ఇవ్వలేదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. చంద్రబాబు అన్ని కేసుల్లోనూ బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారని తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చింన తీర్పు ఒకటైతే.. ఎల్లో మీడియా మరో రకంగా ప్రచారం చేస్తోందని అన్నారు. కొన్ని చానళ్లు బాబు గొప్ప విజయం సాధించారని, ఆయనకు ఏదో ఊరట కలిగిందని, ఆయన సుప్రీం కోర్టులో వేసిన కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింనట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. 2019లో చంద్రబాబుకు వచ్చిన 23 సీట్లను గొప్ప విజయంగా చూపిస్తే ఏ రకంగా ఉంటుందో.. నేడూ అదే విధంగా కనిపిస్తోందన్నారు. సుప్రీం కోర్టు తీర్పులో చంద్రబాబుకు ఏ రకమైన రిలీఫ్ కలగలేదన్నారు. వాస్తవానికి ముందుగా గమనించాల్సింది సెక్షన్ 17 ఏ వర్తిస్తుందా లేదా అనేది ఒక ప్రొసీజరల్ సెక్షన్ మాత్రమే అని అన్నారు. 2018లో అమల్లోకి వచ్చింన ఈ సెక్షన్ ఈ కేసుకు వర్తించదని, స్కిల్ స్కాం 2015 ప్రాంతంలోనే జరిగిందని చెప్పారు. చంద్రబాబు, పార్టీ నాయకులు తప్పు చేయలేదని వారి లాయర్లు కూడా ఎక్కడా అనడంలేదన్నారు. రూ. 370 కోట్ల ప్రజాధనాన్ని దోచుకోలేదని ఎక్కడా వారి వాదనల్లో చెప్పలేదని గుర్తు చేశారు. గవర్నర్ అనుమతి లేదనో, స్పీకర్కు చెప్పలేదనో 17 ఏని చూపించి క్వాష్ చేయాలని కోరారని తెలిపారు. రిమాండ్ ప్రక్రియలో లోపం లేదని ఇద్దరు న్యాయమూర్తులు ఏకాభిప్రాయాన్ని చెప్పారని, 17 ఏ వర్తించే విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని చెప్పారు. రిమాండ్ అంతా పద్ధతి ప్రకారమే జరిగిందని ఇద్దరు జడ్జిలూ చెప్పారన్నారు. గతంలోనూ ఇదే ధోరణి చంద్రబాబు గతంలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినప్పుడు కూడా ఇదే రకమైన వాదనలు చేశారని, సెక్షన్ 8 అమల్లో ఉందని, మీకూ పోలీసులున్నారని.. మాకూ ఉన్నారని.. మీకూ ఏసీబీ ఉందని.. మాకూ ఉంది అంటూ చంద్రబాబు మాట్లాడారని మంత్రి గుర్తు చేశారు. ఇలాంటి వితండ వాదం చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. గతంలో కేసులకు సెక్షన్ 17ఏ వర్తించదని దాదాపు ఆరు కోర్టులు చెప్పాయన్నారు. అంత క్లియర్గా ఉందని అన్నారు. ఈ రోజు వచ్చింన తీర్పు చూసిన తర్వాత చంద్రబాబు న్యాయస్థానంలో బోనులో, విచారణ సంస్థల ముందు దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సిందేనన్నారు. బాబు 52 రోజులు జైలు శిక్ష అనుభవించి, ఆరోగ్య కారణాలు చెప్పి బెయిల్పై ఉన్న ఒక దొంగే తప్ప నిజాయితీపరుడు, అమాయక చక్రవర్తి అని న్యాయస్థానాలు చెప్పలేదని మంత్రి అన్నారు. లేని పార్టీకి ఎవరు అధ్యక్షులయితే మాకేంటి? ఈ రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే మాకేంటి అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు 0.4 శాతమేనని, నోటా కంటే తక్కువని అన్నారు. అటువంటి పార్టీ గురించి చర్చించుకోవడం అనవసరమన్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు చాలా మందికి తోబుట్టువులు ఉంటారని, వారంతా ప్రధానులు, రాష్ట్రపతులు కాలేరు కదా అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్కి సీట్లు కాదు కదా ఓట్లేసే వారూ లేరన్నారు. ఈ రాష్ట్రానికి వారు చేసిన అన్యాయమే అందుకు కారణమన్నారు. కలిసి నిర్మించుకున్న ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టి, రాష్ట్ర భవిష్యత్తును గొడ్డలితో నరికిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి ఉండకూడదని ప్రజలు అనుకున్నారని, అలానే లేకుండా చేశారని మంత్రి అన్నారు. -
‘శ్రీరామునికి రెండు నూలు పోగులు’ ఉద్యమానికి అనూహ్య స్పందన!
మహారాష్ట్రలోని పూణెలో ‘దో ధాగే శ్రీరామ్ కే లియే’ (శ్రీరామునికి రెండు నూలుపోగులు) ఉద్యమం ప్రారంభమైంది. అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరామునికి వస్త్రాలు సిద్ధం చేసేందుకు వేలాది మంది చేనేత కార్మికులు మగ్గాలపై నేత పనులకు ఉపక్రమించారు. ఈ ఉద్యమ ప్రచారం 13 రోజుల పాటు కొనసాగనుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం, పూణేకు చెందిన హెరిటేజ్ హ్యాండ్వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ డిసెంబర్ 10న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారానికి ప్రజల నుంచి ఉత్సాహంతో కూడిన మద్దతు లభిస్తున్నదని ప్రచార నిర్వాహకురాలు అనఘా ఘైసాస్ తెలిపారు. రానున్న 13 రోజుల్లో ఈ పనుల్లో భాగస్వాములయ్యేందుకు దాదాపు 10 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆమె తెలిపారు. చేనేత కళను ప్రోత్సహిస్తూనే, ఈ పనిలో ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ఈ ప్రచారం సాగుతున్నదన్నారు. చేనేత పని అంత సులభం కాదని, ఇది గణితంతో ముడిపడివుందని, అలాగే ఎంతో సహనం అవసరమన్నారు. శ్రీరామునికి అందించబోయే దుస్తులు పట్టుతో తయారవుతున్నాయని, వెండి బ్రోకేడ్తో ఈ వస్త్రాలను అలంకరిస్తామని ఆమె తెలిపారు. కాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రామమందిరం ట్రస్ట్కు చెందిన గోవింద్ దేవ్ గిరి మహారాజ్లు ఈ ప్రచార ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఆ ఎంపీ అదృశ్యం అంటూ పోస్టర్లు.. ఆ చూకీ చెబితే రూ. 50 వేలు! -
వార్ రూం... వేదికగా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో నేటి పోలింగ్ ప్రక్రియకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితి సానుకూలంగా ఉందన్న అంచనాల నేపథ్యంలో ఆ సానుకూలతను ఓట్ల రూపంలో మార్చుకునే అంశంపై దృష్టి సారించింది. బుధవారమంతా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే గాంధీభవన్ వార్ రూం నుంచి సమీక్షించారు. ఏ నియోజకవర్గంలో ప్రచార తీరు ఎలా ఉందన్న విషయాలను తెలుసుకోవడంతోపాటు పోలింగ్ ఏజెంట్ల నియామకం, పోల్ మేనేజ్మెంట్ లాంటి విషయాలపై అభ్యర్థులతోపాటు నియోజకవర్గాల పరిశీలకులు, సమన్వయకర్తలు, స్థానిక నేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ ముగిసేంతవరకు అభ్యర్థులతో సహా కేడర్ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, ఇతర పార్టీల వ్యూహాలు, డబ్బు, మద్యం పంపిణీ లాంటి అంశాలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ వర్గాలను సంప్రదించాలని సూచించారు. పూజలు... ప్రమాణాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ ప్రజలకు బాండ్పేపర్లు రాసిచ్చిన కాంగ్రెస్ నేతలు ప్రచారం ముగిసిన మరుసటి రోజు దేవుడి సన్నిధిలో పూజలతో ప్రమాణాలు చేశారు. ఉదయం గాంధీభవన్కు వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, మాణిక్రావ్ ఠాక్రే, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, అంజన్కుమార్ యాదవ్ కొంతసేపు ప్రచార సరళిపై సమీక్ష జరిపారు. అనంతరం బిర్లామందిర్కు వెళ్లి అక్కడ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆరు గ్యారంటీలకు మొదటి మంత్రివర్గంలోనే చట్టబద్ధత కల్పిస్తామని, మేనిఫెస్టోను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ప్రమాణం చేశారు. ఆ తర్వాత నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశారు. కేటీఆర్పై ఫిర్యాదు మంత్రి కేటీఆర్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ను నిర్వహించాలంటూ ఆయన మీడియాలో పిలుపునివ్వడం, 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కార్యాలయంలో రక్తదానం లాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు లేఖ రాశారు. అదేవిధంగా తెలంగాణలో ఓటు హక్కు ఉండి ఏపీలో నివసిస్తున్న వారిని ఎలాంటి ఆంక్షలు లేకుండా ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరెక్కడ ఉన్నారంటే...! ఉదయం ప్రత్యేక పూజల అనంతరం రేవంత్రెడ్డి.. జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వెళ్లారు. రాత్రికి కొడంగల్కు చేరుకున్నారు. గురువారం కొడంగల్లోని జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేయనున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బుధవారమంతా మధిర నియోజకవర్గంలోనే ఉన్నారు. కార్యకర్తలతో తీరిక లేకుండా భేటీలు జరిపారు. మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్ల వారీగా పోలింగ్ ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి హుజూర్నగర్లోని తన నివాసం నుంచి పోలింగ్ ఏర్పాట్లపై పార్టీ కేడర్తో సమీక్షించారు. -
తెలంగాణలో ముగిసిన బీజేపీ అగ్రనేతల ప్రచారం
-
జోరుగా ప్రచారం.. హైదరాబాద్లో స్తంభించిన ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి దశకు వచ్చింది. దీంతో రాజధాని హైదరాబాద్లో పార్టీల అగ్రనేతల ప్రచారం ఊపందుకుంది. ఒక్కసారిగా సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లు పెరిగిపోవడంతో నగరంలో సామాన్య జనాలకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. సోమవారం సాయంత్రం నగరంలో వీఐపీల ప్రచార టూర్లు ఎక్కువగా ఉండడంతో నగరంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు హైదరాబాద్లోని ప్రధాన రూట్లలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. అమీర్పేట్, సికింద్రాబాద్ నుంచి బేగంపేట, సికింద్రాబాద్ వైపు వెళ్లే రోడ్డు, సికింద్రాబాద్ నుంచి కోఠి వైపు వెళ్లే రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక కిలో మీటర్ దూరం వెళ్లడానికి సుమారు గంట సమయంపైగా పట్టడంతో విసుగు చెందిన నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీలు సాధారణంగా జెడ్ ప్లస్ లేదా ఆ పై స్థాయి సెక్యూరిటీ భద్రతలో ఉంటారు. సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం వారి కాన్వాయ్ వెళ్లేందుకు రోడ్లపై ట్రాఫిక్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు నగరంలో పీక్ అవర్స్ ఉన్నప్పటికీ ట్రాఫిక్ను ఆపేయాల్సిన పరిస్థితి పోలీసులకు ఎదురవుతోంది. పీక్ అవర్స్లో ట్రాఫిక్ ఆపడం కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు చాలా ఇబ్బందులెదుర్కొంటున్నారు. గత కొద్దిరోజులుగా హైదరాబాద్లో వీఐపీల పర్యటనలతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్న నగరవాసులకు ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుండడంతో ఉపశమనం లభించనుంది. గురువారం(నవంబర్ 30) న పోలింగ్ ఉండడంతో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 48 గంటల ముందే పచారం ఆపాల్సి ఉంటుంది. దీంతో మంగళవారం సాయంత్రం 5 గంటలకు మైకులన్నీ మూతపడనున్నాయి. -
TS: ఊపు ఊపిన సోషల్ ప్రచారం
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. జనాలకు ఇదొక నిత్యవ్యవహారం(నిత్యావసరం!). కానీ, రాజకీయ పార్టీలకు, నేతలకు మాత్రం అవసరాన్ని బట్టి వాడకంగా మారింది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఇది వాళ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే అంశం. త్వరగతిన ప్రజలకు చేరాలంటే సోషల్ మీడియాను మించిన వేగవంతమైన వేదిక వాళ్లకు మరొకటి కనిపించడం లేదు మరి. అందుకే.. అన్ని మాధ్యమాల్లో ఈసారి ఎన్నడూ లేనంతంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల Telangana Assembly Election 2023 కంటెంట్ వైరల్ అయ్యింది. నిస్సారంగా సాగుతున్న నేతల ప్రసంగాల నడుమ.. ఒక రకంగా ఎన్నికల సమరానికి ఊపు తెచ్చింది కూడా ఈ సామాజిక మాధ్యమ ప్రచారమే! సోషల్ మీడియా ప్రచారంలో నేతల ఊకదంపుడు ఉపన్యాసాలుంటేనే సరిపోదు. జనంలోకి దూసుకెళ్లే స్థాయిలోనే కంటెంట్లో దమ్ముండాలి. అయితే ఇక్కడ నేతల డిజిటల్ క్యాంపెయినింగ్పైనా ఎన్నికల సంఘం నజర్ ఉంటుంది. అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ.40లక్షలు దాటకూడదని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయి. కాబట్టి తమ ప్రచార ఖర్చులన్నింటిలోనే సోషల్ మీడియా నిర్వహణ కూడా ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత ఖాతాల నిర్వహణ.. వాటి కోసం ఎంత మంది పని చేస్తున్నారు.. వాళ్ల జీతభత్యాలు, ఇతర ఖర్చుల వివరాలు.. నేతల ప్రసంగాల్లో ఈసీ కోడ్ ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా?.. నిశిత పరిశీలన ఉండాలి. అదే.. ఎన్నికల నిబంధనల్లో ఎక్కడా పార్టీల ఖర్చు పరిమితిపై ఆంక్షలు లేవు. దీంతో నేతల పేర్ల ప్రస్తావన తేకుండా.. పార్టీలను గెలిపించాలంటూ ప్రధానంగా సోషల్ మీడియా ప్రచారం ఉవ్వెత్తున సాగింది. పాటలు.. పదనునైన తూటాలు గులాబీల జెండలే రామక్క.. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి.. సాలు దొర, సెలవు దొర అంటూ.. ప్రకటనలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపాయి స్వరాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగేసేలా చేసి.. ఇక్కడి ప్రజల నరాల్ని ఉత్తేజితం చేసిన తెలంగాణ పాటకు ఇప్పుడు రాజకీయ రంగు పలుముకుంది. ఉద్యమ గాయకులు, జానపద కళాకారులుగా పేరొందిన ఎందరో.. పూర్తిగా పార్టీలకు ఆస్థాన గాయకులుగా పని చేశారు. పొగడ్తలు, విమర్శలతో.. విడివిడిగా, కలగలిపి రూపొందించిన పాటలు ఈసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో Telangana Assembly Election 2023 ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్పెషల్ సాంగ్స్తో పాటుగా జానపద గేయాలకు.. ఆఖరికి సినిమా పాటల పేరడీలు సైతం జనాదరణతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తెలంగాణ బ్యాక్డ్రాప్తో జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్ట్ చేసిన బలగం సినిమాను సైతం.. ఏ నేత వదలకుండా ‘ప్రజలే మా బలగం’ అంటూ పోస్టర్లు వదిలారు. ఇంటర్వ్యూల పర్వం.. వయసు తారతమ్యాలు లేకుండా యూట్యూబ్కు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోంది. ఫుల్ వీడియోలతో పాటు షార్ట్ వీడియోలపై ఎక్కువ స్క్రీన్ టైం గడిపేస్తున్నారు. అందుకే యూట్యూబ్ ప్లాట్ఫామ్ను తమ ప్రచారం కోసం వాడేసుకున్నాయి పొలిటికల్ పార్టీలు. రాజకీయ మేధావులు, ప్రముఖ జర్నలిస్టులతో పాటు అటు జాతీయస్థాయిలో.. ఇటు స్థానికంగానూ జనాల నోళ్లలో ఎక్కువగా నానుతుండే యూట్యూబర్లు, బుల్లి తెర నుంచి జనాలకు ఎక్కువగా పరిచయమున్న వాళ్లు.. రాజకీయ నేతల్ని ఇంటర్వ్యూలు చేశారు. లీడర్లు సైతం తమ ప్రచారానికి ఉపయోగపడే రీతిలో ఉండేలాగానే ఆ ఇంటర్వ్యూల్ని ప్లాన్ చేయించుకోవడం గమనార్హం. ఈ విషయంలో ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదురైనా సరే నేతలు తేలికగా తీసుకున్నారు. డిజిటల్ ఫ్లాట్ఫామ్ ఇంటర్వ్యూలలో పాడ్కాస్ట్, రేడియోలను సైతం వదల్లేదు. వ్యక్తిగత దూషణలు ఈసారి తెలంగాణలో ప్రధాన పార్టీల కీలక నేతల ప్రచారాల ప్రసంగాల్లో పెద్దగా ప్రత్యేకత ఏం కనిపించలేదు. సామెతలు, పిట్ట కథలతో సమాజాన్ని ఆకట్టుకునే కేసీఆర్ సైతం.. ప్రతిపక్షాలపై సాధారణ విమర్శలతోనే సరిపెట్టారు. అయితే వ్యక్తిగత విమర్శల పర్వం మాత్రం షరా మామూలుగా కొనసాగింది. ‘‘చిప్పకూడు తిన్న సిగ్గు రాలే..!!’’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని ఉద్దేశించి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బక్కోడు భూబకాసరుడు అంటూ కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు.. ఓ మోతాడు డోసుతో సాగింది విమర్శల పర్వం. బడా-చోటా నేతలు ప్రచారంలో విమర్శలు-ప్రతివిమర్శలకు దిగి ఎన్నికల సమరాన్ని హీటెక్కించారు. రాజకీయ ప్రసంగాలు సాదాసీదాగా సాగినప్పటికీ.. అక్కడక్కడ మాత్రం ఆ విమర్శలు బూతుల దాకా వెళ్లాయి. ఉదాహరణకు.. మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్.. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పేసుకుని కేసీఆర్పైనే వ్యక్తిగత దూషణలకు దిగారు. మైనంపల్లి, మల్లారెడ్డిల మధ్య విమర్శలైతే ఒక పరిధిని దాటాయి. ఇక.. పార్టీల మధ్య దూషణలు, విమర్శలు తీవ్రతరమై యాడ్స్ రూపేణా కనిపించడంతో ఎన్నికల సంఘం కలుగజేసుకుని చర్యలతో వాటిని కట్టడి చేసింది. Credits: Nenu Mari Antha Yedvanaaaa Insta Page ఇదేందయ్యా ఇది.. ఇది ఊహించలే! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు Telangana Assembly Election 2023 ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇదే. సాధారణంగా.. నేతలు తమ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలలో, పార్టీలు తమ అధికారిక పేజీలలో.. ఇవేగాక ఫలానా నేతల ‘సైన్యం’(ఆర్మీ) పేరిట పేజీలు, ఫ్యాన్ మేడ్ హ్యాండిల్స్ ఉండనే ఉన్నాయి. అయితే అదేం విచిత్రమో.. నిత్యం సినిమా డైలాగులు, ఫన్నీ సీన్ల ఫొటోలతో మీమ్స్ వేసి ఫాలోవర్లకు వినోదం పంచే సోషల్ మీడియా పేజీలు సైతం పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఫలానా పేజీ ఫలానా రాజకీయ పార్టీకి.. వకాల్తా పుచ్చుకుని మరీ పోస్టింగ్లు చేశాయి. ప్రభుత్వ, పార్టీ విజయాలపై లబ్ధిదారులతో ప్రచారం. ఈసారి వ్యహారమంతా పార్టీల పరాజయాలపై పోస్టులు. నేతల స్పీచ్లలోని తప్పులు.. చేష్టలపై మీమ్స్.. ట్రోల్స్ ఇలా నడిచింది. ఆఖరికి.. పార్టీల మేనిఫెస్టోలను కూడా సోషల్ మీడియా పేజీలు ప్రచారం చేశాయంటే ఈసారి సోషల్ ప్రచారం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 29ఏళ్ల లోపు ఓటర్లు 72లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 10 లక్షల మంది 18-19 వయసులో(కొత్త ఓటర్లు) ఉన్నవాళ్లు ఉన్నారు. ఇక 30పైబడిన వాళ్లలోనూ సామాజిక మాధ్యమాలలో టైంపాస్ బాపతు ఎక్కువే ఉన్నారు. వీళ్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే.. ఇలాంటి పేజీలను పొలిటికల్ పార్టీలు తమ ఆధీనంలోకి తీసుకుని ఉంటాయనేది స్పష్టంగా తెలుస్తోంది. ట్రెండింగ్లో హెలికాఫ్టర్ ఎక్కడో ఆదిలాబాద్లో పార్టీ ప్రచార సభలో మాట్లాడిన నేత.. గంటన్నర తర్వాత సంగారెడ్డి మీటింగ్లో కనిపిస్తారు. ఆ తర్వాత గంటకు ఎక్కడో నల్లగొండ బహిరంగ సభలో ప్రసంగిస్తుంటారు. వందల కిలోమీటర్ల దూరం.. వాయువేగంతోనే వెళ్తే సాధ్యమవుతుంది కదా!. అలా ఈసారి ఎన్నికల్లో నేతల హెలికాఫ్టర్ల వాడకం ఎక్కువగా కనిపించింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు మాత్రమే కాదు.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నవాళ్లూ, కీలక నేతలు, ఓ మోస్తరు నేతలు సైతం విమానల్లో చక్కర్లు కొట్టేశారు. అదే సమయంలో.. రెంట్కు హెలికాఫ్టర్లను అందించే కంపెనీలకైతే ఫుల్ గిరాకీ నడిచింది. అలా హెలికాఫ్టర్ ట్రెండ్ కూడా సోషల్ మీడియాకు ఎక్కింది. బర్రెలక్క నాగర్ కర్నూల్ పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల కర్నె శిరీష.. ‘బర్రెలక్క’గా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఇప్పుడు. స్వతంత్ర అభ్యర్థినిగా నాగర్ కర్నూల్ బరిలో నిలిచిన శిరీష గురించి మీడియా, సోషల్ మీడియా విపరీతంగా చర్చించింది. చాలాకాలం కిందట.. డిగ్రీ చదివి కూడా నిరుద్యోగిగా ఉన్నానంటూ ఉద్యోగాల నోటిఫికేషన్.. నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ బర్రెలను మేపుతూ సరదాగా వీడియో అప్లోడ్ చేసి ‘బర్రెలక్క’ ఫేమస్ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడం.. ప్రచారం చేసుకునేందుకు సైతం డబ్బులు లేవంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు.. ఆ వీడియోకు నిరుద్యోగ యువత కదిలివచ్చి చందాలేసుకుని మరీ ఆమె కోసం ప్రచారంలోకి దిగడం.. గుర్తుతెలియని వర్గం ఆమె బృందంపై దాడి చేయడం.. కన్నీళ్లతో ఆమె మాట్లాడిన మాటలు.. ఆ వెంటనే ఆమె లభించిన మేధోవర్గాల, కొందరు రాజకీయ నేతల మద్ధతు.. హైకోర్టు ఆదేశాలతో గన్మెన్ సెక్యూరిటీ.. ఈ పరిణామాలన్నింటిని నడుమ సోషల్మీడియాలో ఆమెకు విపరీతంగా పెరిగిన సానుభూతి రప్పించి ఈ దఫా ఎన్నికల్లో ఈమె గురించి చర్చించుకునేలా చేశాయి. ఇవేకావు తమ నియోజకవర్గ ఓటర్లు ఏ ప్రాంతంలో ఉన్నా.. ఫోన్లు చేసి, మెసేజ్లు పంపి మీటింగ్లకు రమ్మని ఆహ్వానాలు పంపడం. వాట్సాప్లో సందేశాలు.. ఒక అడుగు ముందుకేసి రాజకీయ ప్రత్యర్థుల అవినీతి-అసమర్థతలను ఎండగట్టే రీతిలో రూపొందించిన కరపత్రాల పంపిణీ.. ఫేక్ ప్రచారాలు వాటిని ఖండిస్తూ వచ్చిన ఫ్యాక్ట్ చెకింగ్ కౌంటర్లు.. ఇలా షరామాములుగానే కనిపించింది. నవంబర్ 28 సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో కథనం -
ఈ రెండు రోజులూ కీలకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్న 111 (జనసేన 8 సీట్లు కలిపితే 119) అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుత వాస్తవ పరిస్థితి, అభ్యర్థుల విజయావకాశాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సమీక్షించారు. చివరి రెండు రోజుల ప్రచారం ఎంతో కీలకమని, ఉధృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు పోల్ మేనేజ్ మెంట్పై దృష్టి పెట్టాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. పోల్ మేనేజ్మెంట్ను పటిష్టంగా అమలు చేయాలని, ఎక్కడా లోటుపాట్లు లేకుండా అన్ని నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో పోలింగ్ బూత్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించేలా చూడాలని పార్టీ నాయకులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇందుకు రాష్ట్ర పార్టీకి జాతీయనాయకత్వం చేదోడువాదోడుగా నిలుస్తుందని నడ్డా భరోసానిచ్చినట్టు చెబుతున్నారు. ఆదివారం నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన నడ్డా, తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన విధుల్లో నిమగ్నమైన జాతీయనేతలు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, సంస్థాగత సహ ఇన్చార్జి శివప్రకాష్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్తో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు పనిచేసింది ఒక ఎత్తు.. చివరి రోజుల్లో పార్టీకి ప్రజల్లో పెరిగిన మద్దతును ఓట్ల రూపంలో పోలింగ్బూత్ల దాకా తీసుకెళ్లి విజయం సాధించడం మరొక ఎత్తు అని పేర్కొన్నట్టు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్షాలు నిర్వహించిన తర్వాత పరిస్థితిలో అనూహ్యంగా మార్పు వచ్చిందని, అభ్యర్థుల విజయావకాశాలు చాలా సీట్లలో మెరుగయ్యాయని వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. ఆ సీట్లపై పూర్తిస్థాయిలో ఫోకస్ 45–50 స్థానాల్లో అభ్యర్థులు గట్టి పోటీనిస్తున్నారని, వీటిలో అత్యధిక సీట్లను గెలుచుకోవడం ద్వారా తెలంగాణలో బీజేపీ సత్తా చాటాల్సి ఉంటుందని నడ్డా పేర్కొన్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలలో పరిస్థితి ఏమిటి అని నడ్డా ప్రశ్నించినపుడు ఆ రెండుచోట్లా కేసీఆర్కు బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారని, గెలిచే అవకాశాలూ ఉన్నాయని ప్రకాష్జవదేకర్, సునీల్బన్సల్ వెలిబుచ్చినట్టు పార్టీవర్గాల సమాచారం. -
తెలంగాణ ఎన్నికల్లో ప్రచార హోరు...అధినేతల జోరు (ఫొటోలు)
-
హైకోర్టును ఆశ్రయించిన శిరీష అలియాస్ బర్రెలక్క
-
రేపు రాష్ట్రానికి రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ మరోమారు తెలంగాణకు రానున్నారు. ఈనెల 25న ఆయన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తా రని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. నాందేడ్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు బోధన్ చేరుకోనున్న రాహుల్ అక్కడ ఎన్నికల ప్రచార సభ లో పాల్గొంటారు. ఆ తర్వాత హెలికాప్టర్లో మధ్యా హ్నం 2 గంటలకు ఆదిలాబాద్ వెళ్లి సభకు హాజరవు తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు వే ములవాడలో జరిగే సభకు హాజరవుతారని, అక్కడి నుంచి బేగంపేటకు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. ఖమ్మంలో బస చేయనున్న ప్రియాంక ఇంతకుముందు ఖరారైన ప్రియాంకాగాంధీ ప్రచార షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. 24, 25 తేదీల్లో ఆమె వరంగల్, సిద్దిపేట, కొత్తగూడెం, ఖ మ్మం జిల్లాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభలకు హాజ రవుతారు. శుక్రవారం మధ్యాహ్నం పాలకుర్తి, ఆ త ర్వాత హుస్నాబాద్, అనంతరం కొత్తగూడెం నియో జకవర్గాల్లో జరిగే సభల్లో పాల్గొననున్నారు. నేడు ఖ మ్మంలోనే బస చేయనున్న ప్రియాంక 25న ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో సభలకు హాజరవుతారు. అక్కడి నుంచి విజయవాడకు వెళ్లి గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. నేడు, రేపు శివకుమార్ బెంగళూరు నుంచి శుక్రవారం ఉదయం హైద రాబాద్కు రానున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ మధ్యా హ్నం 12 గంటలకు స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, అంబర్పేట నియోజకవర్గాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌ డ్తో కలిసి ఎన్నికల ప్రచార సభలకు హాజరవుతా రు. శుక్రవారం రాత్రి హైదరాబాద్లోనే బస చేయనున్న శివకుమార్ 25న హైదరాబాద్లోని పలు ని యోజకవర్గాల్లో జరిగే రోడ్షోలు, కార్నర్ మీటింగ్ల కు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఉత్తర తెలంగాణపై కమలం ఫుల్ ఫోకస్!
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణపై కమలనాథులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సంప్రదాయబద్ధంగా పట్టున్న ఈ ప్రాంతంనుంచి ఈసారి కూడా మంచి ఫలితాల సాధనకు పార్టీ ఉత్తర తెలంగాణను నమ్ముకుంది. సంస్థాగతంగానూ, రాజకీయంగానూ ఇతర ప్రాంతాల కంటే ఇక్కడే పార్టీ పటిష్టంగా ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తోంది. ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల పరిధిలో అధిక సీట్లు గెలుస్తామన్న ధీమాను బీజేపీ ముఖ్యనేతలు వ్యక్తం చేస్తున్నారు. 2019 ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కీలకమైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సీట్లు బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉత్తర తెలంగాణలో అధిక స్థానాల్లో గెలుపొంది సత్తా చాటాలనే పట్టుదలతో బీజేపీ నాయకత్వముంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల పట్ల ప్రజల్లో క్రమంగా సానుకూలత పెరుగుతున్నదని అంచనా వేస్తున్నారు. ముమ్మరంగా ప్రచారం చేసేలా... ముఖ్యంగా పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అధిక సీట్లు గెలుచుకునే దిశలో వివిధ రూపాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామన్న హామీని వివిధ వర్గాల ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు ఉపకులాల వారీగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ప్రధాని మోదీ పూర్తి మద్దతు తెలపడంతో పాటు సమస్యల పరిష్కారంపై కచ్చితమైన హామీ ఇవ్వడంతో ఈ వర్గాల్లో బీజేపీపై సానుకూల స్పందన వ్యక్తమవుతోందని చెబుతున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా బీసీ, ఎస్సీ, ఇతర వర్గాల నుంచి బీజేపీకి మద్దతు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన వైఖరి తీసుకోవడంతో బీజేపీకి ఎమ్మార్పిఎస్ నాయకత్వం మద్దతు తెలపడంతో పాటు బీసీ సీఎం నినాదాన్ని కూడా బలపరుస్తూ ప్రచారం చేయడం కూడా తమకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కంటే అధికంగా 36 సీట్లను బీసీలకు బీజేపీ కేటాయించడం ద్వారా బీసీలకు పెరిగిన ప్రాధాన్యతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. -
ఫొటో పంపు.. పైసలు తీసుకో!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు పెట్టిన ప్రతీ పైసాకు ఫలితం దక్కేలా జాగ్రత్త వహిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్లి ప్రచారం చేయాలని స్థానిక నాయకులు, కార్యకర్తలను పురమాయిస్తున్నారు. కొందరు ప్రచారం చేయకున్నా చేసినట్టు చెబుతూ అభ్యర్థుల జేబులకు చిల్లు పెడుతున్నారు. వీటిని నివారించేందుకు ‘ఫొటో పంపు, పైసలు తీసుకో’ అనే పద్ధతి అనుసరిస్తున్నారు. ప్రతిరోజూ ఎంతమంది వచ్చారో, ఫొటోలు, వీడియోలు తీసి వాట్సాప్ చేయాలనే నిబంధన విధిస్తున్నారు. వీటిని పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. ఉదాహరణకు ఓ వాడలో వంద మంది ప్రచారం నిర్వహించామని సంబంధిత ఇన్చార్జ్ చెబితే ఆ వంద మంది తప్పనిసరిగా ఫొటో, వీడియోల్లో కనిపించాలి. ఒకవేళ తక్కువ మంది కనిపిస్తే ఆ మేర డబ్బులు ఇవ్వడం లేదు. ఇక బైక్ ర్యాలీలు, ఆటోలు, ప్రచార రథాలు గ్రామాలు, పట్టణాల్లో తిరిగే సమయంలో మీటర్ రీడింగ్లను ఫొటో తీసి పంపి, రాత్రి వరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగి ప్రచారం చేశారో లేదో చెక్ చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక ఎన్నికల్లో తీసుకున్న డబ్బుల ప్రకారం తప్పనిసరిగా పనిచేయాలి వస్తోంది. -
గట్టిపోటీ... అధిక సీట్లు...
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ రాష్ట్రంలో కమలదళం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 25 నుంచి 30 సీట్లలో బీజేపీ నిర్ణయాత్మకంగా వ్యవహరించడంతో పాటు వాటిలో అధిక స్థానాలు గెలుచుకోవడంపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. ఆ స్థానాల్లో పార్టీ అగ్రనేతలు విస్తృత ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఎస్సీ వర్గీకరణ, బీసీ సీఎం నినాదంతోపాటు కీలక స్థానాల్లో ప్రచారం చివరి రోజుల్లో అగ్రనేతల విస్తృత ప్రచారం పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసి వస్తుందని రాష్ట్ర నేతలు అంచనా వేస్తున్నారు. త్రిముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఆయా వర్గాల ఓట్లు చీలితే పలుచోట్ల బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్న నమ్మకాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అగ్రనేతలంతా ఇక్కడే... ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర ముఖ్య నేతలు విస్తృత పర్యటనలు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ హైదరాబాద్లోనే మకాం వేసి సంస్థాగతంగా పార్టీ యంత్రాంగం ఏ మేరకు ఎన్నికల యాజమాన్య నిర్వహణ చేస్తోందో లోతుగా సమీక్షిస్తున్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్చుగ్, రాష్ట్ర సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్తో సంతోష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి ఒక ముఖ్యనేతను ఇన్చార్జిగా నియమించి, పోలింగ్ ముగిసేదాకా అన్ని అంశాలను సమన్వయం చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ప్రధాని సుడిగాలి పర్యటనపై ఆశలు ప్రచారపర్వం ముగిసేలోగా పీఎం మోదీ వరుసగా మూడురోజులు...ఆరుసభల్లో పాల్గొనడంతో పాటు చివర్లో హైదరాబాద్లో రోడ్షో నిర్వహించనున్నారు. 25న కామారెడ్డి (కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ) నిజామాబాద్ (అర్బన్), నిజామాబాద్ (రూరల్), రంగారెడ్డి జిల్లా(మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కల్వకుర్తి,), 26న తూఫ్రాన్ (గజ్వేల్, దుబ్బాక, మేడ్చల్, మెదక్, నరసాపురం), నిర్మల్ (నిర్మల్, ముథోల్, బాల్కొండ, ఖానాపూర్), 27న మహబూబాబాద్ (మహబూబాబాద్, ములుగు, తదితర ఎస్టీ స్థానాలు) కరీంనగర్ (కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, వేములవాడ, చొప్పదండి, కోరుట్ల) ఇలా ఆయా ఉమ్మడి జిల్లాలు, నియోజకవర్గాల పరిధిలోని వివిధ వర్గాల ఓటర్లపై ప్రభావం చూపేలా మోదీ ప్రచార కార్యక్రమాలను ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. బీసీ, ఎస్సీల అండపై అంచనాలు..ఎస్టీలకు హామీ? అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలను దీటుగా ఎదుర్కోవడంతో పాటు ఆ పార్టీలకు చెక్ పెట్టేలా బీసీ నేతను సీఎంను చేస్తామన్న ప్రకటన తమకు కలిసి వస్తుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. కాస్త అలస్యంగా ప్రకటించినా..ఈ నినాదాన్ని బీజేపీ తన ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రంగా మలచుకోగలిగింది. బీసీ సీఎం నినాదంతో పాటు ఎస్సీ ఉపకులాల వారీగా రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ మద్దతు ప్రకటన మేలు చేస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఎస్టీల జనాభాకు అనుగుణంగా 9 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామనే హామీ కూడా బీజేపీ నేతలు త్వరలోనే ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఓ అంచనా ప్రకారం బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు... ♦ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని... ముథోల్, నిర్మల్, బోథ్, ఖానాపూర్, సిర్పూర్ ♦ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో... కామారెడ్డి, నిజామాబాద్ (అర్బన్), ఆర్మూరు, జుక్కల్ ♦ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో... హుజూరాబాద్, కరీంనగర్, కోరుట్ల, మానకొండూరు ♦ ఉమ్మడి వరంగల్ జిల్లాలో... వరంగల్ (ఈస్ట్), పరకాల, ములుగు, మహబూబాబాద్ ♦ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో... మహేశ్వరం, ఎల్బీనగర్, చేవెళ్ల, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ♦ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో... కల్వకుర్తి, మహబూబ్నగర్, మక్తల్ ♦ ఉమ్మడి మెదక్ జిల్లాలో... దుబ్బాక, పటాన్ చెరు, నరసాపూర్, ♦ నల్లగొండ జిల్లాలో... సూర్యాపేట, మునుగోడు ♦ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో... గోషామహల్. అంబర్పేట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, మల్కాజిగిరి -
తెలంగాణలో ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
-
మరీ అన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా ఉండాల్సింది సార్!
మరీ అన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా ఉండాల్సింది సార్! -
ప్రచార వాహనంపై స్పృహతప్పిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి, జగిత్యాల: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ప్రచార వాహనంలో స్పృహతప్పి పడిపోయారు. రాయికల్ మండలం ఇటిక్యాలలో శుక్రవారం కవిత రోడ్ షోలో పాల్గొన్నారు. జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ క్రమంలో ప్రచార వాహనంపై నిలబడి ఉండగా కవిత ఒక్కసారిగా కళ్లుతిరిగి పడిపోయారు. వెంటనే స్పందించిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఆమెకు సపర్యలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న గ్రంధాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్.. కవితకు ప్రాథమిక చికిత్స అందించారు. అయితే కాసేపటికే కోలుకున్న కవిత తిరిగి ప్రచారం ప్రారంభించారు. డిహైడ్రేషన్ వల్ల ఎమ్మెల్సీ కవిత స్పల్ప అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. Sorry for the little scare. I’m doing just well, also happened to have met this sweet little girl and after spending time with her I’m feeling a little more energetic. #KCROnceAgain campaign to resume shortly. ✊🏻 pic.twitter.com/YaO1Siw7Vk — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 18, 2023 చదవండి: Video: ఆసక్తికర వీడియోను షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత -
వారి అవినీతి సంపదను ప్రజలకు పంచుతాం
సాక్షి, వరంగల్/ వరంగల్/ నర్సంపేట/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రమిస్తే.. ఆ ఫలాలు పూర్తిగా ఒక్క కల్వకుంట్ల కుటుంబానికే దక్కాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు అవినీతి పాల్పడ్డారని.. కాంగ్రెస్ వచ్చాక ఆ అవినీతి సంపదను వెలికితీసి ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో పంచుతామని చెప్పారు. కాంగ్రెస్ గెలిస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారంటీ హామీలపై తొలి సంతకం లేదా తొలి నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. కేసీఆర్ను ఇంటికి పంపడమే తమ లక్ష్యమని.. తర్వాత ఢిల్లీలో మోదీని గద్దె దింపుతామని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో, వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో పర్యటించారు. స్థానికంగా పాదయాత్రలు, కార్నర్ మీటింగ్లు, రోడ్షోలు నిర్వహించి ప్రసంగించారు. వివరాలు రాహుల్ గాంధీ మాటల్లోనే.. ‘‘బీజేపీ, బీఆర్ఎస్ ఒకే చెట్టు కొమ్మలు. మోదీ వాహనానికి పంక్చరైతే కేసీఆర్ గాలి కొడతారు. కాంగ్రెస్ ధాటికి మోదీ వాహనం పచ్చడైంది. అందుకే పరోక్షంగా కేసీఆర్కు సహకరిస్తున్నారు. పార్లమెంట్లో బిల్లు ఏదైనా బీజేపీ నేతలు కనుసైగ చేస్తే బీఆర్ఎస్ నేతలు తలూపుతారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ను ఓడించడానికి ఎంఐఎంను బీజేపీ వాడుకుంటోంది. గల్లీలో కేసీఆర్, ఢిల్లీలో మోదీ జాతుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రేమ బీజాలను నాటుతుంది. తెలంగాణతో కాంగ్రెస్కు ఉన్నది రాజకీయ బంధం కాదు.. రక్త సంబంధం. ప్రస్తుతం దొరల తెలంగాణ– ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రజల తెలంగాణ కోసం ఈ యుద్ధంలో పోరాడుతోంది. బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధిచెప్పి.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. రైతులను మోసం చేశారు బీఆర్ఎస్ సర్కారు రైతులను మోసం చేసింది. భూములను క్రమబద్దికరిస్తామని చెప్పి ధరణి పోర్టల్తో 20 లక్షల కుటుంబాల భూమిని గుంజుకున్నారు. రుణమాఫీ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీరందరికీ న్యాయం చేస్తాం. తెలంగాణకు కాంగ్రెస్ ఏమీ చేయలేదని కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ చదువుకున్న బడి, కాలేజీ, యూనివర్సిటీలను కాంగ్రెస్ ప్రభుత్వాలే కట్టించాయని గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ ఐటీ క్యాపిటల్గా మారేందుకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మావి ఉత్త మాటలు కాదు: కేసీఆర్, మోదీలు చెప్తున్నట్టుగా మావి ఉత్తుత్తి హామీలు కాదు. ఆరు గ్యారంటీలను అధికారంలోకి రాగానే అమలుచేసి తీరుతాం. రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఎకరాకు రూ.15,000 పెట్టుబడి సాయం, వృద్ధులకు రూ.4 వేల పింఛన్, ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన నిర్వహించి, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్ వల్ల కొత్త నాయకత్వం వచ్చే అవకాశం ఉంటుంది..’’ అని రాహుల్గాంధీ పేర్కొన్నారు. జ్యూస్ తాగి.. చేతి గుర్తుకు ఓటేయాలని.. వరంగల్ తూర్పు సెగ్మెంట్ పరిధిలో పాదయాత్ర చేసిన రాహుల్గాందీ.. జేపీఎన్ రోడ్డులోని ఓ జ్యూస్ సెంటర్ వద్ద ఆగారు. ప్రూట్ సలాడ్ తిని, జ్యూస్ తాగారు. షాప్ నిర్వాహకుడు పుల్లూరి శ్రీధర్తో కరచాలనం చేసి..హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. ప్రగతిభవన్ను ‘ప్రజాపాలనా భవన్’గా మారుస్తాం రాహుల్ గాంధీ ట్వీట్ సాక్షి, హైదరాబాద్: జవాబుదారీతనం, పారదర్శకతతో ప్రజల తెలంగాణను నిర్మించేందుకు తమ తో కలిసి రావాలని రాహుల్ గాంధీ పిలుపుని చ్చారు. ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’ ట్యాగ్లైన్తో శుక్రవారం ఎక్స్ యాప్లో ట్వీట్ చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజల తెలంగాణలో స్వర్ణ యుగానికి నాంది పలకనుంది. ప్రగతి భవన్ పేరును ప్రజా పాలనా భవన్గా మారుస్తాం. 24 గంటలపాటు ఆ భవన్ ద్వారాలు తెరిచే ఉంటాయి. సీఎంతోపాటు మంత్రులు క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ నిర్వహించడం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని 72 గంటల్లో వాటి పరిష్కారానికి కృషి చేస్తారు..’’ అని రాహుల్ పేర్కొన్నారు. -
ఆసక్తికరంగా ఛత్తీస్గఢ్ పోరు.. ఎవరి ధీమా వారిదే!
కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోరు తుది దశకు చేరింది. రెండో, చివరి దశలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. రైతు అనుకూల ప్రభుత్వమనే ముద్రతో అధికారం నిలుపుకుంటామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. వరి రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు అనేకానేక సంక్షేమ పథకాలు తమకు శ్రీరామరక్ష అని సీఎం భూపేశ్ బఘేల్ అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు సీఎం, మంత్రులపై అవినీతి ఆరోపణలు తమకు కలిసొస్తాయని బీజేపీ భావిస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం దుబాయ్ బెట్టింగ్ యాప్ నుంచి 508 కోట్ల దాకా ముడుపులు అందుకున్నారంటూ బఘేల్పై వచ్చిన ఆరోపణలు ఓటర్లపై గట్టి ప్రభావం చూపుతాయని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే... 2008 అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైన తొలినాళ్లలో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నడిచింది. కానీ పోలింగ్ సమీపించే కొద్దీ పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. ముఖ్యంగా సీఎం రమణ్సింగ్ మిస్టర్ క్లీన్ ఇమేజీ ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. దాంతో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించింది. 50 స్థానాలు సాధించి అధికారం నిలుపుకుంది. ఇటు బస్తర్ మొదలుకుని అటు సర్గుజా దాకా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలన్నింట్లోనూ బీజేపీ హవా సాగింది. అక్కడి 26 స్థానాలకు గాను ఆ పార్టీ ఏకంగా 23 చోట్ల నెగ్గింది! ప్రజల్లో బాగా ఆదరణ ఉన్న కాంగ్రెస్ నాయకుడు అజిత్ జోగి సుడిగాలి ప్రచారం చేసినా లాభం లేకపోయింది. ఆ పార్టీ చివరికి 38 సీట్లతో సరిపెట్టుకుంది. దానికి పోలైన ఓట్లు కూడా 38 శాతమే కావడం విశేషం. బీజేపీ 40 శాతం ఓట్లు సాధించింది. బీఎస్పీ రెండు సీట్లు నెగ్గింది. 2013 ముఖ్యమంత్రిగా రమణ్సింగ్ హ్యాట్రిక్ కొట్టారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆయన విజయ పథంలో నడిపి తొలిసారి సీఎం అయ్యారు. అప్పట్నుంచీ 15 ఏళ్లపాటు రాష్ట్రంలో ఆయన హవా సాగింది. రమణ్ పరిపాలనా శైలి కాంగ్రెస్ నేతల నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం విశేషం! 2008 ఎన్నికల విజయం తర్వాత ఆయన అమలు చేసిన ఆహార భద్రత పథకం ఛత్తీస్గఢ్లో 60 శాతం మంది కనీసావసరాలు తీర్చింది. దాంతో ప్రజలు మరోసారి రమణ్ పాలనకే ఓటేశారు. బీజేపీకి 49 సీట్లు రాగా కాంగ్రెస్కు 39 స్థానాలొచ్చాయి. మొత్తమ్మీద బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్కు 40 శాతం పోలయ్యాయి. బీఎస్పీకి ఒక స్థానం దక్కింది. 2018 సుదీర్ఘంగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ప్రతికూలంగా మారింది. దీనికి తోడు రైతు రుణ మాఫీని పాక్షికంగా అమలు చేసి చేతులెత్తేయడం కూడా రమణ్సింగ్ సర్కారుకు బాగా ప్రతికూలంగా మారింది. మార్పుకు పట్టం కట్టండంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారానికి జనం జై కొట్టారు. దాంతో హస్తం పార్టీ 68 సీట్లతో ఘన విజయం సాధించింది. బీజేపీ కంచుకోటలైన సర్గుజా వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఏకంగా క్లీన్స్వీప్ చేయడం విశేషం! దాంతో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ సరిగ్గా 15 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్ ఏకంగా 43 శాతం ఓట్లు కొల్లగొట్టగా బీజేపీ కేవలం 33 శాతంతో ఘోరంగా చతికిలపడింది. ఇక బీఎస్పీ మరోసారి రెండు స్థానాలతో రాష్ట్రంలో ఉనికి నిలుపుకుంది. -
రేపు రాహుల్ సుడిగాలి పర్యటన ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ఈనెల 17న తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు మొత్తం ఐదు నియోజకవర్గాల్లో ఆయన రోడ్షోలు, పాదయాత్రలు చేపట్టనున్నారు. కార్నర్ మీటింగ్లలో ప్రసంగించనున్నారు. పినపాక, నర్సంపేట, వరంగల్ ఈస్ట్, వెస్ట్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయనున్నట్టు గాందీభవన్ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈనెల 17 నుంచి వరుసగా ఐదారు రోజుల పాటు రాహుల్ తెలంగాణలో పర్యటిస్తారని అనుకున్నప్పటికీ, ప్రస్తుతానికి శుక్రవారం ఒక్కరోజు షెడ్యూల్ మాత్రమే ఖరారైంది. రాహుల్ పర్యటన ఇలా... ఈనెల 17న ఉదయం 9:30 గంటల సమయంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు రా నున్న రాహుల్గాంధీ హెలికాప్టర్లో ఉద యం 11 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక చేరుకుంటారు. అక్కడ 12 గంటల వరకు రోడ్షో నిర్వహించి కార్న ర్ మీటింగ్లో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నర్సంపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించి రోడ్డు మార్గంలో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడ నుంచి పాదయాత్ర ద్వారా వెస్ట్ నియోజకవర్గానికి చేరుకుని అక్కడ కార్నర్మీటింగ్లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో సాయంత్రం 6:30 గంటలకు రాజేంద్రనగర్కు వస్తారు. అక్కడ సభలో పాల్గొన్న అనంతరం ఢిల్లీ వెళ్లనున్నట్టు గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. -
ఎన్నికల ప్రచారం ఆఖరి క్షణంలో ఖర్గే సభ రద్దు!
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంగా ప్రచారానికి సిద్ధమైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నిరాశ ఎదురయ్యింది. ఈ నెల 17న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఈరోజే (నవంబరు15) చివరిరోజు కావడంతో అన్ని పార్టీలు తమ ప్రచారాలను హోరెత్తించాయి. ఈరోజు బేతుల్ జిల్లా ఆమ్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారధ్యంలో బహిరంగ సభ, ర్యాలీ జరగాల్సి ఉంది. అయితే ఇంతలో ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిముషంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సివచ్చింది. మల్లికార్జున ఖర్గే బుధవారం ఉదయం 11.20 గంటలకు ఆమ్లాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉందని, అయితే హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా బహిరంగ సభ రద్దు అయ్యిందని స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. బెరాసియా, భోపాల్లలో జరిగే ర్యాలీలలో కూడా ఖర్గే పాల్గొనాల్సి ఉందని ఆయన తెలిపారు. నవంబర్ 17న మధ్యప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బుధవారం చివరి రోజు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. 25న ఓటింగ్ రద్దు! -
మాట్లాడితే పంచ్ పడాలంతే..!
ఎన్నికల ప్రచారంలో వాడీవేడి కొటేషన్లు ‘‘నాకు ఏం మాట్లాడినా పంచ్ ఉండాలంతే.. పంచ్ లేకుంటే కుదరదంతే’ అని ’ఆర్య’ సినిమాలో సునీల్ చేసిన హడావుడి బాగా పేలింది. ఇప్పుడు ప్రచారంలో పంచ్ డైలాగ్లు లేకుంటే పస ఉండదని భావిస్తున్న పార్టీల అభ్యర్థ్ధులు మంచి మంచి కొటేషన్లతో పంచ్లు విసురుతున్నారు. సోషల్ మీడీయాలో వాటిని వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట :ఈ నెల 30న అందరి వేళ్లకు ఇంక్.. రాష్ట్రమంతా పింక్ అంటూ, అప్పుడు ఎట్లుండే తెలంగాణ..ఇప్పుడు ఎట్లయ్యింది తెలంగాణ అని బీఆర్ఎస్ అభ్యర్థుల కొటేషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు కాకముందు 2014లో ఎలా ఉండే.. 2023లో ఎలా ఉందని బీఆర్ఎస్ అభ్యర్థులు డైలాగ్ కొటేషన్తో ప్రశ్నిస్తున్నారు. వీటితోపాటు కాంగ్రెస్, బీజేపీ కొటేషన్లు కూడా సోషల్ మీడియాలో ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆకట్టుకున్న కొటేషన్లు కొన్ని.. అన్నా... జిల్లాజిల్లాకూ ఐటీ టవర్.. మా గుండెల్లో ఉంటాడు కేటీఆర్ ఫరెవర్ మా అన్నను ప్రేమిస్తారు మహబూబ్నగర్ క్రౌడ్.. డెవలప్మెంట్ ఆగొద్దంటే రావాలి మా అన్న శ్రీనివాస్ గౌడ్ మర్చిపోతామా సాయన్న చేసిన సాయమూ.. కంటోన్మెంట్లో లాస్యమ్మ గెలుపు ఖాయమూ.. బాల్కొండలో ఎగురబోతుంది గులాబీ జెండా... ప్రశాంత్ అన్న మన అందరికీ అండా దండా.. ఎవరికి పడితే వాడికి కొట్టం జిందాబాద్... మా గోవర్న రూరల్ నిజాంబాద్ కాంగ్రెస్ బీజేపీ అందరు పక్కకు జరగాలి... మెదక్లో భారీ మెజారిటీ రాబోతుంది మా పద్మక్క కాంగ్రెస్ మారుస్తుంది తెలంగాణ భవిష్యత్ ఇప్పుడు ఇస్తుంది 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ బాగుండాలి ఐదేళ్ల జీవితం.... రావాలి ఐదు వేళ్ల హస్తం కాంగ్రెస్ మనకు అండ దండ... ఇస్తుంది రూ. 500కే గ్యాస్ బండ కాంగ్రెస్ వస్తే ఎన్నో ఉపయోగాలు.... యువతకు దొరుకుతాయి లక్షల్లో ఉద్యోగాలు తెలంగాణలో కమలం జెండా ఎగరాలి.. బీజేపీ గెలవాలి... బీసీ సీఎం కావాలి బద్దలు కొడదాం దొరల గడీ సాలు దొర... సెలవు దొర. -
ఓట్ తో దుమ్ము రేపుదాం..!
-
కాంగ్రెస్ తప్పుల మీద తప్పులు చేస్తోంది
-
వచ్చినప్పుడల్లా ఏదో కథలు చెబుతూనే ఉంటారు!
వచ్చినప్పుడల్లా ఏదో కథలు చెబుతూనే ఉంటారు! -
16 నుంచి కాంగ్రెస్ ప్రచార హోరు
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాందీలతోపాటు కీలక నేతలను రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వారు వారం రోజుల పాటు ఇక్కడే మకాం వేసి, జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేలా షెడ్యూల్ రూపొందిస్తోంది. ఈ నెల 15న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో 16వ తేదీ నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలనూ ప్రచార బరిలోకి దింపాలని భావిస్తోంది. అయితే భారీ సభలు కాకుండా రోడ్షోలు, కార్నర్ మీటింగ్ల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించేలా.. ఈ నెల 16 తర్వాత రాహుల్, ప్రియాంకా గాందీలతో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ తయారవుతోంది. పెద్ద సభలను ఏర్పాటుచేసి ప్రజలను అక్కడికి తీసుకురావడం కంటే ప్రజల వద్దకే వెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీసీసీ సిద్ధమైంది. అన్ని కొత్త జిల్లాల్లో ఇద్దరు అగ్రనేతలతో రోడ్షోలు చేయించాలని, అక్కడే కార్నర్ మీటింగ్ల ద్వారా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సిద్ధరామయ్య, అశోక్గెహ్లోత్, సుఖ్విందర్సింగ్ సుక్కు, భూపేశ్ బఘేల్లను కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకురానుంది. హిమాచల్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేసిన పథకాల గురించి వారు వివరించనున్నట్టు టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇక కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి నేతలను ప్రచార భాగస్వాములను చేయనుంది. ఈ ప్రచారమంతాపూర్తయ్యాక చివరిగా ఏఐసీసీ అగ్రనేత, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోగానీ, ఉత్తర తెలంగాణలోని కీలక ప్రాంతంలోగానీ భారీ బహిరంగ సభ నిర్వహించి, పోలింగ్ మూడ్లోకి వెళ్లిపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. నేడు కామారెడ్డిలో బీసీ గర్జన సభ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం కామారెడ్డిలో బీసీ గర్జన సభ నిర్వహించనుంది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి గా నామినేషన్ వేయనున్నారు. ఆ కార్యక్రమం ముగిశాక బీసీ గర్జన సభ నిర్వహించనున్నారు. దీనిలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సభలో పాల్గొంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన స్పష్టమైన ప్రకటన చేస్తారని.. బీఆర్ఎస్ ఆరోపణలకు తగిన విధంగా బదులిస్తారని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. -
అంతా జనంలోనే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుండటంతో పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రచారంపై ఫోకస్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. వచ్చే 20రోజుల పాటు పార్టీ యంత్రాంగం మొత్తాన్ని ప్రజాక్షేత్రంలోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలతోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావులతో రోడ్షోలు, సభల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ప్రచార గడువు ముగిసేవరకు కూడా పార్టీ అభ్యర్థులు, ఇన్చార్జులు, ఇతర ముఖ్య నేతలెవరూ తమకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించిన చోటి నుంచి కదలవద్దని పార్టీ అధినేత ఆదేశించారు. పార్టీ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న సెగ్మెంట్లతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థులు బలహీనంగా ఉన్నచోట ఇప్పటికే సుమారు 60కి మందికిపైగా నాయకులకు ఇన్చార్జులుగా సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కీలక నియోజకవర్గాల్లో స్థానికంగా పార్టీ యంత్రాంగాన్ని కదిలించి ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మండల స్థాయిలోనూ ఇన్చార్జులను నియమిస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో సొంత నియోజకవర్గం వదిలి ఇతర నియోజకవర్గాలకు వెళ్లేందుకు పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థులపై అసంతృప్తి ఉన్న నేతలను గుర్తించి వారికి ఇతర నియోజకవర్గాల్లో మండల స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనితో ఇటు ఆయా సెగ్మెంట్లలో పారీ్టకి నష్టం జరగకుండా చూసుకోవడంతోపాటు ఇతర నియోజకవర్గాల్లో బాధ్యతల అప్పగింత ద్వారా వారిని విశ్వాసంలోకి తీసుకుంటున్నామనే భరోసా ఇవ్వొచ్చని భావిస్తున్నారు. దీపావళి తర్వాత మళ్లీ కేసీఆర్ సభలు అభ్యర్థుల ఎంపిక, బీఫారాల జారీతోపాటు బహిరంగ సభల నిర్వహణలోనూ బీఆర్ఎస్ విపక్షాలతో పోలిస్తే దూకుడుగా వ్యవహరిస్తోంది. గత నెల 15న బీఫారాల జారీని ప్రారంభించడంతోపాటు హుస్నాబాద్లో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గత నెల 15 నుంచి ఈ నెల 9 వరకు 17 రోజుల వ్యవధిలో 43 చోట్ల కేసీఆర్ సభలు నిర్వహించారు. దీపావళి పండుగ నేపథ్యంలో 10 నుంచి 12వ తేదీ వరకు విరామం ప్రకటించారు. తిరిగి ఈ నెల 13 నుంచి 28వ తేదీ వరకు 54 నియోజకవర్గాల్లో జరిగే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. మొత్తంగా ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి 97 నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పోటీచేస్తున్న జనగామలో ఇప్పటికే ఒక బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. ఆ నియోజకవర్గంలోని చేర్యాలలో ఈ నెల 18న రోడ్షో నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రచారంలో ఇదొక్కటి మాత్రమే రోడ్షో. మిగతావన్నీ సభలే. ఈ నెల 28న గజ్వేల్లో ప్రచారంతో కేసీఆర్ పర్యటనలు ముగుస్తాయి. ఇక తొలి విడతలో సీఎం కేసీఆర్ సభలు జరిగిన నియోజకవర్గాల్లో కేటీఆర్, హరీశ్రావుల రోడ్షోలు, బహిరంగ సభలు ఉండే అవకాశముంది. మరోవైపు 38 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో కూడిన జాబితాను బీఆర్ఎస్ గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి సమరి్పంచినట్టు తెలిసింది. అఫిడవిట్లను జల్లెడ పడుతున్న లీగల్ సెల్ నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారం ముగుస్తుండగా పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను బీఆర్ఎస్ లీగల్ సెల్ జల్లెడ పడుతోంది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లపై న్యాయపరమైన చిక్కులు తలెత్తిన నేపథ్యంలో.. వీలైనంత మేర నామినేషన్ల పత్రాల్లో లోపాలు దొర్లకుండా లోతుగా పరిశీలించి గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. వార్రూమ్లతో సమన్వయం నియోజకవర్గాల స్థాయిలో వార్రూమ్లను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. వాటిని హైదరాబాద్లోని సెంట్రల్ వార్రూమ్తో అనుసంధానం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్తోపాటు కేటీఆర్, హరీశ్రావుల దిశానిర్దేశం మేరకు సెంట్రల్ వార్ రూమ్ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వార్రూమ్లతో సమన్వయం చేసుకుంటోంది. ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రచార తీరుతెన్నులు తదితరాలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు పంపుతోంది. వాట్సాప్, ఎక్స్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలు వేదికగా కూడా పార్టీ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. వివిధ సంస్థల నుంచి అందుతున్న సర్వే నివేదికలు, ఫీడ్బ్యాక్ ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థులు, ప్రచార తీరుతెన్నులను బీఆర్ఎస్ పెద్దలు మదింపు చేస్తూ.. వ్యూహాలకు పదును పెడుతున్నారు. -
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ‘రాష్ట్రానికి జగనన్నే ఎందుకంటే’ ప్రచార కార్యక్రమం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
భువనగిరిలో కాంగ్రెస్ ప్రచారం
-
బీఆర్ఎస్ బహుముఖ వ్యూహం 50 మంది ఓటర్లకో లీడర్
సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో నియోజకవర్గంలో బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. గడపగడపకూ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బూత్ కమిటీలను నియమించిన పార్టీ.. కుల సంఘాల మద్దతు కూడగట్టేందుకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన మంత్రులను రంగంలోకి దింపింది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలను తమవైపు తిప్పుకునేందుకు చేరికలపైనా ఫోకస్ చేసింది. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తారన్న ప్రకటన వెలువడకముందే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు విడుదల చేసింది. దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు వంటి సంక్షేమ పథకాల్లో ఎక్కువ యూనిట్లు కేటాయించారు. మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్లు అందించారు. ఆలయాలు, కుల సంఘాల భవనాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. కేసీఆర్ అభ్యర్థిత్వం ఖరారయ్యాక మంత్రి కేటీఆర్ కామారెడ్డిపై ఫోకస్ మరింత పెంచారు. బూత్ కమిటీలతో ప్రచారం..: 266 పోలింగ్ బూత్లుండగా, ప్రతి బూత్కు పది మందితో కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ గ్రామానికి చెందిన గ్రామ/మండల/ నియోజకవర్గ/ జిల్లా స్థాయి లీడర్ను బూత్ కమిటీకి ఇన్చార్జ్గా నియమించారు. 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జ్ ఉండేలా బూత్ కమిటీలు ఏర్పాటయ్యాయి. రోజూ బూత్ కమిటీ సభ్యులు తమకు కేటాయించిన యాభై మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లడం, మేనిఫెస్టోను వివరించడంతో పాటు ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి జరిగిన ప్రయోజనాలను చెప్పి ఓట్లు అభ్యర్థించాలన్నది ఈ కమిటీల ఏర్పాటు ఉద్దేశం. కుల సంఘాలతో ములాఖత్లు..: వివిధ కుల సంఘాలతో ఆయా సామాజికవర్గాలకు చెందిన మంత్రులు సమావేశమవుతున్నారు. ఆదివారం మైనారిటీలతో ఏర్పాటు చేసిన సమావేశానికి హోం మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. బీఆర్ఎస్ మైనారిటీల సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలను వివరించారు. సీఎం కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గౌడ కులస్తులతో జరిగిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. రెడ్డి సంఘం సమావేశానికి మంత్రి ప్రశాంత్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి హాజరుకావాల్సి ఉండగా.. ఆ సమావేశం వాయిదా పడింది. పద్మశాలి కులస్తులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ రమణ పాల్గొన్నారు. ఎస్సీ కుల సంఘాలతో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే రసమయి హాజరుకావాల్సి ఉండగా.. ఆయన కార్యక్రమం రద్దయింది. ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, ఎమ్మెల్సీ సుభా‹Ùరెడ్డి ఆ సమావేశంలో పాల్గొని ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. యూత్తో నిర్వహించే సమావేశానికి బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్లను రప్పిస్తున్నారు. ఇలా కామారెడ్డిలో విజయం కోసం బీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది.