హైదరాబాద్: ఓ యువకుడు ఆనుమానాస్పద స్థితితో మృతి చెందిన సంఘటన నగరంలోని కోఠి ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానిక హరిద్వార్ హోటల్లో ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. అదిలాబాద్కు చెందిన లారీ ఓనర్ ప్రమోద్కుమార్ హోటల్ లోని కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గది తలుపులు తెరిచి శవాన్ని కిందికి దించారు. మృతుని వద్ద నుంచి సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతికి గల కారణాలు, సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోఠి హరిద్వార్ హోటల్ లో యువకుడి ఆత్మహత్య
Published Wed, Sep 30 2015 1:10 PM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM
Advertisement
Advertisement