koti
-
కోఠిలో కలకలం.. ప్రభుత్వ వైద్యుడిపై తోటి డాక్టర్ల దాడి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద కలకలం రేగింది. ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యులు దాడికి పాల్పడ్డారు. దీంతో డీఎంఈ కార్యాలయం ముందు బాధిత వైద్యుడు డాక్టర్ శేఖర్ ఆందోళనకు దిగారు.సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు అమలు చేయాలని డీఎంఈకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానని.. ఈ జీవో అమలు చేస్తే హైదరాబాద్లో పని చేస్తున్న వైద్యులు జిల్లాలకు, జిల్లాలలో పని చేస్తున్న వాళ్లు హైదరాబాద్కు 40 శాతం మేర బదిలీలు జరుగుతాయి. ఈ బదిలీ లను అడ్డుకునేందుకు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్, బొంగు రమేష్, రాథోడ్ , వినోద్ కుమార్లు కుట్ర చేస్తున్నారని డాక్టర్ శేఖర్ ఆరోపించారు.తాను డీఎంఈకు వినతి పత్రం ఇవ్వకుండా తనను అడ్డుకుని. తనపై దాడి చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ సిటీ లోనే తిష్ట వేశారు. వాటిపై ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నలుగురు వైద్యులపై చర్యలు తీసుకొనేంత వరకు తాను డీఎంఈ కార్యాలయం ముందే బైఠాయిస్తానని వైద్యుడు శేఖర్ చెబుతున్నారు. -
మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేతుల మీదుగా 'ప్రణయగోదారి' సాంగ్ విడుదల
సరికొత్తగా ఆవిష్కరిస్తున్న కథలకు, నాచురల్ లొకేషన్స్లో షూట్ చేస్తున్న సినిమాలకు ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉంటోంది. సరిగ్గా ఇదే పాయింట్ బేస్ చేసుకొని ఓ డిఫరెంట్ కంటెంట్తో 'ప్రణయగోదారి' అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్, ప్రియాంక ప్రసాద్, సునీల్ రావినూతల, 30 ఇయర్స్ పృథ్వీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.పిఎల్వి క్రియేషన్స్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ల లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న యూనిట్.. జోరుగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీలో నుంచి ఫీల్ గుడ్ సాంగ్ లాంచ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ చేశారు. కలలో కలలో.. అంటూ సాగిపోతున్న ఈ ప్రేమ గీతంలో లవ్ బీట్ అదిరిపోయిందని చెప్పుకోవాలి.ఈ సాంగ్ లాంచ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ.. ప్రణయగోదారి నుంచి ఈ సాంగ్ చూస్తుంటే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతోందని, అన్ని వర్గాల ఆడియన్స్ మెచ్చేలా ఈ సాంగ్ షూట్ చేశారని అన్నారు. పాటలోని లిరిక్స్, బీట్, అందుకు తగ్గ సన్నివేశాలు, నటీనటుల వేషధారణ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయని అన్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. -
కోఠిలోని డీఎంఈ కార్యలయాన్ని ముట్టడించిన ఆశా వర్కర్లు
-
‘హలో బేబీ’కథ విని ఆశ్చర్యపోయాను: మ్యూజిక్ డైరెక్టర్ కోటి
‘హలో బేబీ’కథ విని ఆశ్చర్యపోయాను. ఇలాంటి చిత్రానికి నేను సంగీతం అందించలేకపోయినందుకు బాధపడుతున్నాను’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి. భారతదేశంలోనే మొట్టమొదటి హాకింగ్ సోలో క్యారెక్టర్ చిత్రంగా హలో బేబీ తెరకెక్కుతుంది. ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రంలోని ఒక పాటను కోటి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మూవీ కథ చాలా బాగుంది. ప్రతిఒక్కరికి ఈ చిత్రం నచ్చుతుంది. ఇంతగొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ ,యూనిట్కి అభినందనలు. ఈ చిత్రాన్ని విజయంవంతం కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. రాంగోపాల్ రత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య కీర్తి ప్రధాన పాత్ర పోషించింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాత తెలిపారు. -
హైదరాబాద్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. కోఠీ గుజరాత్ గల్లిలోని ఓ గోదాంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అది సీసీటీవీల గోదాం అని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో భారీగా సీసీటీవీలు దగ్ధమైనట్టు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్ధలానికి చేరుకున్నట్టు సమాచారం. మొత్తం మూడు ఫైర్ ఇంజన్లుతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నట్టు తెలుస్తోంది. -
హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. లేడీస్ స్పెషల్ ట్రిప్లో భాగంగా.. లేడీస్ స్పెషల్ బస్సులను మళ్లీ రోడ్లపై పరుగులు పెట్టించబోతోంది. ఈ క్రమంలో.. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సు ఏర్పాటు చేసింది. లేడీస్ స్పెషల్ బస్సును ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరి.. లక్డికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషాకిరణ్, గుట్టల బేగంపేట్, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్రోడ్స్ మీదుగా కొండాపూర్కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. చదవండి: కాంగ్రెస్ రూట్లో కమలం.. సర్ప్రైజ్ అందుకే! ఇదిలా ఉంటే.. నగరంలో మహిళల ప్రత్యేక బస్సులు కొత్తేం కాదు. గతంలోనూ ఆర్డినరీ బస్సులు సైతం కొన్ని ఎంపిక చేసిన రూట్లలో తిరుగుతుండేవి. కాలక్రమేణా అవి తగ్గిపోతూ వచ్చాయి. నగరవాసులు సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అదే సమయంలో మెట్రో రైలు.. ఆర్టీసీ ఆదాయానికి బాగా గండికొట్టింది. సజ్జనార్ ఆర్టీసీ ఎండీ అయ్యాక.. ఆక్యుపెన్సీని పెంచేందుకు రకరకాల పద్ధతులను తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో నగరవాసులు బస్సు ప్రయాణాలకు ప్రాధాన్యత ఇచ్చేలా రకరకాల స్కీమ్ల్ని తీసుకొస్తున్నారు. మహిళా ప్రయాణికులకు శుభవార్త. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్,… pic.twitter.com/EhpJg85VUb — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 18, 2023 -
హైదరాబాద్: కోఠిలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కోఠి లోని ట్రూప్ బజార్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ట్రూప్ బజార్ లోని ఎల్.ఈ.డి లైట్స్ గోదాంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హాటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 4 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రమాద సమయానికి గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మూడు అంతస్తుల ఈ భవనంలో రెండు అంతస్తులలో మాటలు వ్యాపించాయి.. దీంతో స్థానికులు.. వ్యాపారులు భయాందోళకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాదం ఎలక్ట్రిక్ షాట్ సర్క్యూట్ వల్లనే జరిగిందని.. ప్రాధమికంగా నిర్దారించారు. చదవండి: HYD: తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను వేధించింది.. మమత కీలక వ్యాఖ్యలు -
వివేకా లేఖపై సునీతకు సీబీఐ ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. కేసులో కీలకంగా భావిస్తున్న వివేకా రాసిన లేఖపై ఇవాళ వివేకా కూతురు సునీతారెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. వివేకా కేసులో సునీతారెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి సునీతను పిలిపించుకుని లేఖపై ఆరా తీశారు సీబీఐ అధికారులు. ఆమె కూడా భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఆమెను పిలిపించుకుని స్టేట్మెంట్ నమోదు చేసింది సీబీఐ. మరోవైపు వివేకా కేసులో పలువురు సాక్షులను సైతం సీబీఐ ప్రశ్నిస్తోంది. రక్తపు మరకల లేఖ.. ఎందుకు గోప్యంగా ఉంచారు? వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకుగాను పక్కా కుట్ర ఒకటి జరిగినట్టు ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆరోపించారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్రెడ్డి దీని వెనక ఉన్నట్టు కొన్ని ఆధారాలు బయటపెట్టారు. వైఎస్ వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించినట్టు తేలింది. హంతకులు బెదిరించడంతో.. డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను మొదటగా అంటే ఆ రోజు ఉదయం 6.10లోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి.. ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. రక్తపు మరకలున్న ఆ లేఖ చూసినవారెవరికైనా.. వివేకాది హత్యేనని తెలిసిపోతుంది. కానీ లేఖ విషయాన్ని కృష్ణారెడ్డి చెప్పగానే.. తాము వచ్చే వరకు ఆ లేఖను, వివేకా సెల్ఫోన్ను ఎవ్వరికీ ఇవ్వవద్దని, దాచి ఉంచాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పినట్టు కృష్ణారెడ్డి వెల్లడించారు, అదే విషయాన్ని దర్యాప్తులోనూ చెప్పారు. ఆ తరవాతే నర్రెడ్డి మరో అడుగు ముందుకేసి శివ ప్రకాశ్ రెడ్డి ద్వారా అవినాష్రెడ్డికి చెప్పించారు. అవినాష్ కాల్ డేటా చూస్తే ఈ విషయం నిర్ధారణ అవుతుంది కూడా. అవినాశ్ అక్కడకు చేరాక కూడా ఆయనకు లేఖ చూపించలేదు. అసలు లేఖ ఉందన్న విషయం కూడా చెప్పలేదు. వాస్తవానికి వారు గనక ఆ లేఖను వెంటనే పోలీసులకు ఇవ్వాలని చెప్పి ఉంటే వివేకా హత్యకు గురయ్యారన్నది వెంటనే అందరికీ తెలిసిపోయేది. హత్య జరిగిందని తెలిస్తే ఎవ్వరూ మృతదేహాన్ని తాకేవారే కాదు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆ లేఖతోపాటు వివేకా సెల్ఫోన్ను కృష్ణారెడ్డి ఇచ్చారు. ఆ లేఖను చదివారు కానీ.. వెంటనే పోలీసులకు ఇవ్వలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్ఫోన్ను పోలీసులకు అప్పగించారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నదే ఈ హత్య కేసులో కీలకం కానుంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎంపీ అవినాష్రెడ్డి సిబీఐ దృష్టికి తీసుకెళ్లారు కూడా. -
చరిత్ర సృష్టించబోతున్న సంగీత దర్శకుడు కోటి
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సంగీత దర్శకుడికి పర దేశ (ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్) పార్లమెంట్లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం లభించబోతోంది. అది మరెవరికో కాదు, మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటల ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, మన అభిమాన హీరోల సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి, మన గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి కోటికి! కోటి తెలుగు సినిమా సంగీతానికి చేసిన సేవలకు గాను గుర్తింపుగా ఆస్ట్రేలియా ఇండియన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించనుంది. అంతే కాకుండా కోటి అక్కడ ఉన్న మన తెలుగు గాయనితో ఒక పాట కూడా పాడించబోతున్నారు. ఆ గాయని మరెవరో కాదు, తన మొదటి పాటతోనే ఆసియా రికార్డు పుస్తకంలో స్థానం దక్కించుకున్న మన తెలుగింటి ఆడపడుచు సుస్మిత రాజేష్. హరుడే వరుడై, హర హర శంభో తర్వాత మరో వినూత్నమైన పాటతో, కొత్త కలయికతో మన ముందుకు వస్తున్నారు సుస్మిత. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని AISECS అడ్వైజర్ రాజేష్ ఉప్పల మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత పెంపొందించడానికి దోహదపడతాయన్నారు. 4 వేల పాటల మైలురాయిని దాటిన కోటిని ఆస్ట్రేలియాలోని పార్లమెంట్లో గెస్ట్ ఆఫ్ హానర్గా పిలవడం తమకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. చదవండి: పెళ్లికి ముందు, నాకూ, నా భర్తకు వేరేవాళ్లతో ఎఫైర్లు: ప్రియాంక చోప్రా -
Antheema Theerpu: మంగ్లీ ‘టిప్ప.. టిప్ప’ సాంగ్ అదిరిందిగా..
సాయి ధన్సిక, విమలారామన్, గణేష్ వెంకట్రామన్, అమిత్ తివారీ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘అంతిమ తీర్పు’. అభిరాం దర్శకత్వంలో సిద్ధి వినాయక డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘టిప్పా టిప్పా..టిప్ప.. టిప్పర్ లారీ నా ఒళ్లే.. రప్ప..రప్ప.. రప్ప వత్తే యాక్సిడేంటేలే’ అంటూ సాగే పాటను సాంగ్ ఇటీవల విడుదల చేశారు. కోటి సంగీతం అందించారు. (చదవండి: ఒకప్పటిలా కాదు.. హీరోయిన్స్ అంటే వాటికే పరిమితం కాదు) కాసర్ల శ్యామ్ రచించిన పాట ఇది. మంగ్లీ ఆలపించారు. అమిత్తివారీ, స్నేహా గుప్తా ఆ పాటలో ఆడాపాడారు. ఈశ్వర్ పెంటి ఈ పాటకు డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. మంగ్లీ హస్కీ వాయిస్తో పాడిన ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘చక్కని కథాంశంతో రూపొందిన చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. మంగ్లీ ఆలపించిన పాటకు మంచి స్పందల లభిస్తోంది. త్వరలోనే లో సెకెండ్ లిరికల్ సాంగ్, టీజర్ను విడుదల చేస్తాం’ అన్నారు. -
Hyderabad: ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు.. వచ్చేస్తున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: సిటీ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు భాగ్యనగర రహదారులపై పరుగులు పెట్టనున్నాయి. ఈసారి గతానికి భిన్నంగా ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందించనున్నాయి. హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ మాత్రమే కాదు. డబుల్ డెక్కర్ బస్సులు కూడా గుర్తొస్తాయి. 1990వ దశకంలో పుట్టినవారు డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరిగిన జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మళ్లీ హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సుల్ని తీసుకురావాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. సిటీలో డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పాలంటూ మంత్రి కేటీఆర్ను ట్విటర్లో నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పుతామని కేటీఆర్ హామీ కూడా ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను కోరారు. దీంతో నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని నడపనుంది. అద్దె ప్రాతిపదికన తీసుకుని.. ► ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను అద్దెకు తీసుకొని నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. సిటీలో మూడు వేర్వేరు రూట్లలో 10 ఈ– డబుల్ డెక్కర్ బస్సుల్ని అద్దెకు తీసుకొని నడపనుంది. ఇందుకు సంబంధించిన టెండర్ను మరో వారంలో ఆహ్వానించనుంది. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడపడానికి ఆసక్తి ఉన్న కంపెనీలు తమ బిడ్లను నమోదు చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఆహ్వానించనుంది. బిడ్ గెలుచుకున్న కంపెనీ ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు టీఎస్ఆర్టీసీతో ఒప్పందం చేసుకుంటుంది. ఆ కంపెనీకి టీఎస్ఆర్టీసీ అద్దెను ఫిక్స్డ్గా చెల్లిస్తుంది. ► చార్జీలు, రూట్లు లాంటి నిర్ణయాలన్నీ టీఎస్ఆర్టీసీ తీసుకుంటుంది. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ప్రయాణికుల రద్దీని పెంచి లాభాలవైపు పరుగులు తీసుకేందుకు టీఎస్ఆర్టీసీ అనేక చర్యల్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుపెట్టి బస్సుల్ని కొనకుండా అద్దెకు తీసుకొని నడపడం ద్వారా భారాన్ని తగ్గించుకుంటుంది. ఇక ఈ– డబుల్ డెక్కర్ బస్సుల్ని ఏ రూట్లో నడపాలన్నదానిపై ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అధ్యయనం జరిపారు. హైదరాబాద్లో పలు చోట్ల ఫ్లైఓవర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఫ్లైఓవర్లతో ఇబ్బంది లేని రూట్లోనే డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మూడు రూట్లు ఫైనలైజ్ చేశారని వార్తలొస్తున్నాయి. ► పటాన్చెరు– కోఠి, జీడిమెట్ల–సీబీఎస్, అఫ్జల్గంజ్– మెహిదీపట్నం రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే అవకాశాలున్నాయి. ఇక ముంబైలో ఇప్పటికే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్నాయి. స్విచ్ మొబిలిటీ 22 మోడల్ బస్సుల్ని ముంబైలో ప్రజా రవాణా కోసం తిప్పుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని ఇండియాలోనే డిజైన్ చేసి తయారు చేయడం విశేషం. బృహత్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఈ బస్సులు నడుస్తున్నాయి. (క్లిక్ చేయండి: బస్టాప్లో బస్సు ఆపొద్దంటూ బోర్డు.. పాపం ప్రయాణికులు..) -
కోఠి ప్రాంతంలో మహిళ హంగామా
-
‘పగ పగ పగ’.. ఫస్ట్డే ఫస్ట్ షో ఫ్రీ
ఏ సినిమాకైనా మొదటి రోజు మొదటి ఆట ఎంతో ముఖ్యం. మౌత్ టాక్తో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చిత్రాలెన్నో ఉన్నాయి. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోను ఉచితంగా వేస్తున్నారంటే.. సినిమా మీద ఎంత నమ్మకం ఉండాలి. ఇప్పుడు పగ పగ పగ సినిమా యూనిట్ కూడా అదే నమ్మకంతో ఉన్నట్టుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తోన్న చిత్రం పగ పగ పగ. సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా పగ పగ పగ చిత్రం రాబోతోంది. వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించారు. నిర్మాత సత్య నారాయణ సుంకర ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో అందరికీ ఫ్రీగా చూపించాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. సినిమా మీదున్న నమ్మకంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు తెలిపారు. బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కోటి అందించారు. -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
నైరుతి రుతుపవనాల ప్రవేశంలో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, బుధవారం సాయంత్రం హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమైంది. దీంతో నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి, బషీర్బాగ్, కోఠి, అబిడ్స్, అంబర్పేట్, సుల్తాన్బజార్, బేగంబజార్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మీర్పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. #15JUNE 7:45PM⚠️ Massive Rains Ahead Tonight in Entire #Telangana⛈️🥳 👉South #Hyderabad already Seeing Good Rains&More Rains Ahead in coming Hours 🌧️#HyderabadRains pic.twitter.com/ygx5SEoTru — Hyderabad Rains (@Hyderabadrains) June 15, 2022 -
వాహనాలు అక్కడ పార్కింగ్ చేస్తున్నారా.. డబుల్ జరిమానా తప్పదు
సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్నగర్, అమీర్పేట, కోఠి... ఇలా నగరంలోని అనేక వాణిజ్య ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆయా మార్గాల్లోని వర్తకులకు ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా అక్రమ పార్కింగ్స్, ఇబ్బందికర పార్కింగ్ తప్పట్లేదు. ఫలితంగా రద్దీ వేళల్లో ఆయా మార్గాల్లో వాహనచోదకులు నరకాన్ని చవి చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సిటీ ట్రాఫిక్ పోలీసులు ఆయా ప్రాంతాలను ట్రాఫిక్ పరంగా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాలని నిర్ణయించారు. ఈ ఏరియాల్లో పార్కింగ్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనచోదకులకు రెట్టింపు జరిమానా విధించడంతో పాటు ఆయా దుకాణాలు, వ్యాపార సంస్థల నిర్వాహకులపై చర్యలకు మార్గాలు అన్వేషిస్తున్నామని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ గురువారం వెల్లడించారు. వర్తక, వ్యాపార సముదాయాలు, దుకాణాల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్న ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా (కంజెషన్ జోన్) గుర్తించాలని నిర్ణయించారు. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా పక్కా సాంకేతికంగా వీటిని మార్క్ చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న అక్రమ పార్కింగ్, ఇబ్బందికర పార్కింగ్పై అనునిత్యం ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ ప్రాంతాల్లో ఇలాంటి పార్కింగ్స్కు పాల్పడిన ఉల్లంఘనులకు ఇతర ప్రాంతాల్లో విధించే జరిమానాకు రెట్టింపు వేయాలని యోచిస్తున్నారు. ఫలితంగా వారిలో మార్పునకు ప్రయత్నాలు చేయనున్నారు. నో పార్కింగ్, ఇబ్బందికర పార్కింగ్లను ప్రస్తుతం వేరుగా చూడట్లేదు. ఈ కారణంగా జమానాల్లోనూ మార్పులు లేవు. అయితే సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు పూర్తయిన తర్వాత ఆ రెంటికీ వేర్వేరుగా జరిమానాలు విధించనున్నారు. నో పార్కింగ్ కంటే ఇబ్బందికర పార్కింగ్కు ఎక్కువ మొత్తం ఉండనుందని సమాచారం. ఇప్పటి వరకు పార్కింగ్ ఉల్లంఘనపై కేవలం వాహనచోదకులకే జరిమానా పడుతోంది. అయితే వీరితో పాటు ఆయా వ్యాపార సంస్థలు, దుకాణాల నిర్వాహకులనూ బాధ్యులను చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం నిర్వాహకులపై చర్యలకు ఆస్కారం లేదు. సిటీ పోలీసు యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినా నామమాత్రపు జరిమానాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులపై చర్యలకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న ఇలాంటి పార్కింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ట్రాఫిక్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా! -
కోటి తనయుడి సినిమాకు రామ్ పోతినేని సాయం
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా నటించిన చిత్రం ‘11:11’. ‘కౌంట్ డౌన్ స్టార్ట్స్’ అనేది క్యాప్షన్. ఆర్కే నల్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని గాజుల వీరేష్ నిర్మించారు. తాజాగా ఈ చిత్రంలోని ‘ఏమయ్యిందో..’ అనే పాట లిరికల్ వీడియోను హీరో రామ్ రిలీజ్ చేసి చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పి, సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ‘ఏమయ్యిందో మనసైపోయే మాయం.. ఏమౌతుందో ఇకపై నా హృదయం’ అంటూ సాగే ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. ‘‘రాజీవ్, వర్ష లవ్ చేసుకుంటుంటారు. ఆ ఇద్దరి మధ్య ఓ వ్యక్తి అనూహ్యంగా ఎంటర్ అవుతాడు. కానీ ఆ వ్యక్తి హత్య చేయబడతాడు. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నదే కథ’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
కోఠి కాలేజ్ భవితవ్యం ఏమిటి?
హైదరాబాద్లోని ‘కోఠి మహిళా కళాశాల’ను ప్రభుత్వం ‘యూనివర్సిటీ’గా ప్రకటించింది. దీన్ని అందరం ఆహ్వానించాల్సిందే, కానీ ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన విధానపరమైన ప్రకటన రాకపోవడం విచారకరం. నూతనంగా ఏర్పాటయ్యే ‘కోఠి మహిళా విశ్వవిద్యాలయం’లో పెట్టే కోర్సులు, ఆర్థిక వనరులు, టీచింగ్, నాన్–టీచింగ్ పోస్టుల పూర్తిస్థాయి భర్తీ ప్రక్రియ, యూని వర్సిటీ ఎప్పుడు ప్రారంభమవుతుంది వంటి విషయాలు అస్పష్టం గానే ఉండిపోయాయి. యూనివర్సిటీ నిర్వహణకు కనీసం రెండు వందల ఎకరాల సువిశాలమైన భూమి ఉండాలి. ఇప్పటివరకు ఉన్న మహిళా కళాశాలను యూనివర్సిటీగా కొంతకాలం నిర్వహించి, తర్వాత వరంగల్లో కానీ, విజయవాడ రహదారి పక్కన కానీ భూమి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అలా కేటా యిస్తే... ఇప్పుడున్న మహిళా కళాశాల భూములను, భవనాలను కార్పొరేట్, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టకుండా... మంచి రీసెర్చ్ సెంటర్ని అభివృద్ధి చేయాలి. (క్లిక్: తొలి మహిళా వర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజీ) ఇప్పటికే రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి అందరికీ తెలిసిందే. నిధుల్లేక కునారిల్లుతున్నాయి. బోధన, బోధనేతర సిబ్బంది లేక క్లాసులు జరగడం లేదు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫెలోషిప్లు, స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జేఎన్టీయూ లాంటి విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమవుతున్నాయి. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు అను మతి ఇచ్చింది. ఫలితంగా ఉన్నత విద్యా వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రకటించిన ‘కోఠి మహిళా విశ్వవిద్యాలయం’ ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాలి! (క్లిక్: మరీ ఇంత రుసుమా.. ఉద్యోగాలకు అప్లై చేయాలా వద్దా?) – పి. మహేష్ పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
Hyderabad: ఐదో అంతస్తు నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
-
Hyderabad: ఐదో అంతస్తు నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్లోని కోఠి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తాలో ఉన్న బిల్డింగ్పై నుంచి దూకి ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ షాపింగ్ మాల్ సెంటర్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకిన ఆ యువకుడిని ప్రకాశం జిల్లాకు చెందిన డానియల్(25)గా పోలీసులు గుర్తించారు. పెళ్లి కావడంలేదనే మనస్తాపంతో గత కొంత కాలంగా మానసిక ఆందోళనతో ఉన్నట్లు సుల్తాన్ బజార్ సీఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. -
దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథే ‘1997’
‘‘ఒక దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథను చెప్పే ప్రయత్నమే ‘1997’ సినిమా. అంటరానితనం గురించి మా సినిమాలో ప్రశ్నిస్తున్నాం’’ అని నటుడు, దర్శక–నిర్మాత డా. మోహన్ అన్నారు. నవీన్ చంద్ర, డా. మోహన్, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘1997’. డా. మోహన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ– ‘‘1997లో జరిగిన సంఘటనలను మా తాతగారు నాకు చెప్పారు.. వాటి స్ఫూర్తితో కథ రాసుకున్నాను. అత్యాచారానికి గురైన మహిళ పడే మానసిక వేదన, ముఖ్యంగా ఆమె తల్లి తాలూకు భావోద్వేగాలను ఈ సినిమాలో చూపించాం. మొదటి సినిమాకే నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చేయడం రిస్కే.. నిజం చెప్పాలంటే వేరే దారిలేక నేనే చేయాల్సి వచ్చింది. ఈ సినిమా విషయంలో నటుడిగా, దర్శకుడిగా సంతృప్తి ఉంది. కోటిగారి సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. -
ఆ సినిమా తర్వాత అందుకే చిరంజీవితో పని చేయలేదు: కోటి
Music Director Koti Comments On Clash With Chiranjeevi Goes Viral: మ్యూజిక్ డైరెక్టర్ కోటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్హిట్ సినిమాలకు బ్లాక్ బస్టర్ సాంగ్స్ను అందించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి-కోటి కాంబినేషన్లో పదహారేళ్ల వయసు, అందమా అందుమా, ప్రియ రాగాలే.. వంటి ఎన్నో సూపర్హిట్ సాంగ్స్ వచ్చాయి. ఆ సమయంలో ఇద్దరికి మంచి అనుబంధం ఉండేదని, అయితే ఓ సంఘటన కారణంగా కొంత గ్యాప్ వచ్చిందని కోటి అన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కు ఇంటర్వ్యూలో ఇందుకు ఇద్దరి మధ్య ఎందుకు బ్రేక్ వచ్చిందో తెలిపారు. చదవండి: వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున వేసుకున్న షర్ట్ అంత ఖరీదా? 'ఓ సినిమా 100డేస్ ఫంక్షన్ ఓంగోలులో జరిగింది. అది మా అత్తగారి ఊరు కావడంతో ఒకరోజు ముందుగానే అక్కడికి వెళ్లా. అయితే హఠాత్తుగా నాకు హైఫీవర్ రావడంతో ఫంక్షన్కు రాలేకపోయాను. కానీ నేను కావాలనే ఫంక్షన్కు రాలేదని కొందరు చిరంజీవికి ఉన్నవి, లేనివి చెప్పారు. ఆ తర్వాత నేను అసలు విషయం చెప్పడానికి ఆఫీసుకు వెళ్లితే, అప్పుడు ఆయన మాట్లాడే మూడ్లో లేనని అన్నారు. చిరంజీవి అలా రియాక్ట్ కావడంలో తప్పులేదనిపించింది. దీంతో వెనక్కు వచ్చేశాను.హిట్లర్ తర్వాత మళ్లీ చిరంజీవితో పని చేయలేదు. అలా ఆ ఫంక్షన్ నన్ను ఆయనకి దూరం చేసింది' అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: నిన్ను నమ్మినవాళ్లను మోసం చేయొద్దు : వెంకటేశ్ దానికోసం అవసరమైతే గుండు కొట్టించుకుంటా : అనసూయ -
సంగీత దర్శకుడు కోటి తనయుడికి చిరు సాయం
కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలతో అలరిస్తున్న కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై 'ప్రొడక్షన్ నెంబర్ 1'గా ఓ కొత్త సినిమా రూపొందుతోంది. కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సాలూర్ ముఖ్య పాత్ర పోషిస్తుండటం విశేషం. సదన్, లావన్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. తాజాగా ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాకు మెగా సపోర్ట్ లభించింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జరిగేలా ప్లాన్ చేశారు. నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు గ్రాండ్గా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ వదిలింది చిత్రయూనిట్. ఈ సినిమాకు మణిశర్మ అందిస్తున్న సంగీతం మేజర్ అసెట్ కానుందని అంటున్నారు దర్శకనిర్మాతలు. తమ సంస్థ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని, చిత్రంలో రాజీవ్ సాలూర్ నటన హైలైట్ కానుందని అన్నారు నిర్మాత గాజుల వీరేష్ (బళ్లారి). రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్ మధ్య కెమిస్ట్రీ నేటితరం ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు. అతిత్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు. -
వాక్సినేషన్ లో కింగ్ కోఠి ఆసుపత్రిలో పరిస్థితి ఉద్రిక్తత
-
లేటెస్ట్ ఏమాయచేశావే పాట విన్నారా?
సముద్రాల సినీ క్రియేషన్స్ పతాకంపై బేబీ అన్య ఆనంద్ సమర్పణలో సముద్రాల మంత్రయ్య బాబు నిర్మిస్తున్న చిత్రం "లవ్ యు రా".. ప్రసాద్ ఏలూరి దర్శకుడు. చిను క్రిష్ హీరోగా గీతా రతన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో లవర్ స్టోరీ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో శేఖర్, సాయినాధ్, మధు ప్రియ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ఈశ్వర్ పెరవళి సంగీతం, రవి బైపల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. వైవిధ్యమైన ప్రేమ కథాంశంతో యూత్ ఆడియన్స్ కి నచ్చేలా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అతి త్వరలో రిలీజ్ కాబోతుంది. కాగా ఈ చిత్రంలోని "ఏమాయచేశావే" పాటను తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. లవ్ యూ రా సినిమా పాటను రిలీజ్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. పాట చాల బాగుంది. మంచి కంపోజ్ చేశాడు సంగీత దర్శకుడు ఈశ్వర్.. వినగానే క్యాచీ గా అనిపించింది. హరిచరణ్ గారు పాడిన ఈ పాటను మీ అందరికి నచ్చుతుంది. విజువల్స్ బాగున్నాయి.. కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. సాంగ్ వింటుంటే ఫ్రెష్ అనిపించింది.. టీం అందరికి అల్ ది బెస్ట్ అన్నారు.. చిను క్రిష్, గీతికా రతన్, శేఖర్, సాయినాధ్, మధు ప్రియ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్; ఈశ్వర్ పెరవళి, కెమెరా; రవి బైపల్లి, సుధాకర్ నాయుడు, పాటలు; రాజరత్నం బట్లూరి, కొరియోగ్రఫీ; బ్రదర్ ఆనంద్, పోస్ట్ ప్రొడక్షన్ సి2సి స్టూడియో, ప్రొడక్షన్ మేనేజర్; వి.సుధాకర్, పీఆర్ఓ; సాయి సతీష్, నిర్మాత; సముద్రాల మంత్రయ్య బాబు, దర్శకత్వం; ప్రసాద్ ఏలూరి. -
కోఠిలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కోఠిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్కూట్ కారణంగా శనివారం రాత్రి ఆంధ్రాబ్యాంక్కు ఎదురుగా ఉన్న ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఒక దుకాణంలో మొదలైన మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు షాపులకు వ్యాపించాయి. ప్రమాద సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పుతున్నారు. నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
చుక్కలాంటి అమ్మాయి చక్కగా ఉంది
నాగవర్మను హీరోగా పరిచయం చేస్తూ ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘విక్రమ్’. హరిచందన్ దర్శకత్వంలో నాగవర్మ నిర్మించారు. దివ్యా రావు కథానాయిక. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమాలోని మొదటి పాట ‘చుక్కలాంటి అమ్మాయి...’ని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి చేతుల మీదగా విడుదల చేయించారు. సురేశ్ ప్రసాద్ స్వరపరచిన ఈ పాటను పృథ్వీ చంద్ర పాడారు. కోటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని పాటలన్నీ బావున్నాయి. కథ కూడా బాగుంది. నా ప్రియ శిష్యుడు సురేశ్ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ‘‘ప్రేమలో పడే ఓ సినిమా రైటర్ సమాజంలోని కొన్ని కారణాల వల్ల ప్రేయసి నుంచి విడిపోవాల్సి వస్తుంది. మళ్లీ కలిసే ఒక అవకాశం వస్తే ఎలా ఉంటుందనేది ప్రధాన ఇతివృత్తం’’ అన్నారు నాగవర్మ. ‘లవ్ థ్రిల్లర్ చిత్రమిది. ఓ సినిమా రచయిత ప్రేమకథ ఇది’’ అన్నారు దర్శకుడు హరిచందన్. -
టీఆర్ఎస్ నేతల బాహాబాహి
సాక్షి, హైదరాబాద్ : రాంకోఠిలోని రూబీ గార్డెన్స్లో నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం ఆదివారం రసాభాసగా మారింది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలోనే టీఆర్ఎస్ నాయకులు బాహాబాహికి దిగడం చర్చనీయాంశంగా మారింది. అసలు విషయంలోకి వెళితే.. రూబీ గార్డెన్స్లో నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ, గోషామహల్ నియోజకవర్గ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే సమావేశం సందర్భంగా తనను వేదికపైకి ఎందుకు పిలవలేదంటూ సమావేశానికి హాజరైన ఉద్యమకారుడు ఆర్వి మహేందర్ కుమార్ నిలదీశాడు. దాంతో పక్కనే ఉన్న మరో వ్యక్తి అడ్డుచెప్పబోతే ఒకరిని ఒకరు తోసుకుంటూ హోంమంత్రి సమక్షంలోనే కొట్టుకున్నారు. దీంతో సమావేశం నిలిపివేసిన హోంమంత్రి మహమూద్ అలీ గొడవపడుతున్న నాయకుల దగ్గరకు వెళ్లి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. -
మూడు రకాలైన దొంగతనాలు.. ఆరు కేసులు
సాక్షి, సిటీబ్యూరో: నిఘా కళ్లకు చిక్కకుండా సందులూ గొందుల్లో సంచరిస్తూ, పక్కాగా రెక్కీ చేసి ఆపై చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు కుంచం కోటిని మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడు సెల్ఫోన్ స్నాచింగ్స్, వాహన చోరీలు, ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్నట్లు ఆదివారం డీసీపీ పి.రాధాకిషన్రావు తెలిపారు. నిందితుడు కోటి నుంచి రూ.1.2 లక్షల విలువైన సెల్ఫోన్లు, వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. డీసీపీ వివరాల ప్రకారం.. వరంగల్కు చెందిన కోటికి బంటి, ఈశ్వర్ అనే మారు పేర్లూ ఉన్నాయి. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఇతగాడు జియాగూడలో స్థిరపడ్డాడు. కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తూ దురవాట్లకు బానిసయ్యాడు. తనకు వచ్చే సంపాదనతో జల్సాలు చేయడం సాధ్యం కాకపోవడంతో దొంగతనాల బాటపట్టాడు. 2016 నుంచి చోరీలు చేయడం ప్రారంభించాడు. గతంలో టప్పాచబుత్రా, కాచిగూడ, మాదాపూర్, నార్సింగ్ ఠాణాల్లో ఇతడిపై ఆరు కేసులు ఉన్నాయి. ప్రధాన రహదారాల్లో సీసీ కెమెరాలు ఉంటాయనే ఉద్దేశంతో ఇతగాడు ఎక్కువగా చిన్న రూట్లు, సందుల్లో సంచరిస్తూ ఉంటాడు. ఓ ప్రాంతంలో నేరం చేయడానికి నిర్ణయించుకున్న తర్వాత పక్కాగా రెక్కీ నిర్వహిస్తాడు. స్నాచింగ్ లేదా చోరీ చేసిన తర్వాత ఎలాంటి గందరగోళానికి గురికాకుండా తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తాడు. ఆపై ఆ ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై ఎదురు చూస్తాడు. రాత్రి వేళల్లో, తెల్లవారుజామునే రంగంలోకి దిగే ఇతగాడు ఫోన్లో మాట్లాడే వారిని గుర్తిస్తాడు. వేగంగా వాహనంపై అతడి వద్దకు వెళ్లి ఫోన్ లాక్కుని ఉడాయిస్తాడు. అవకాశం చిక్కితే ఇళ్లల్లో చోరీలు, వాహనాల దొంగతనాలు కూడా చేస్తుంటాడు. ఇటీవల సైఫాబాద్, ఆసిఫ్నగర్ ఠాణాల పరిధుల్లో రెండు సెల్ఫోన్ స్నాచింగ్స్, ఓ వాహన చోరీ, మరో ఇంట్లో దొంగతనం చేశాడు. కోటిని పట్టుకోవడానికి మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్ నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షరీఫ్, టి.శ్రీధర్లతో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఆదివారం నిందితుడిని పట్టుకుని సొత్తు రికవరీ చేసింది. తదుపరి చర్యల నిమిత్తం సైఫాబాద్ పోలీసులకు అప్పగించింది. -
అందుకే నటించేందుకు ఒప్పుకున్నా
కోటి.. పరిచయం అక్కర్లేని సంగీత దర్శకుడు. ఇప్పటి వరకూ తన చేతులతో స్వరాలు సమకూర్చిన ఆయన తొలిసారి లాఠీ పట్టి పోలీస్ పవర్ ఏంటో చూపిస్తానంటున్నారు. దేవినేని నెహ్రూగా తారకరత్న నటిస్తున్న ‘దేవినేని’ సినిమాలో కోటి పవర్ ఫుల్ ఎస్పీ పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అన్నది ఉపశీర్షిక. నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. వంగవీటి రాధ పాత్రలో బెనర్జీ, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్ నటిస్తున్నారు. 1983 విజయవాడ తొలి పవర్ఫుల్ ఎస్పీ కెఎస్ వ్యాస్గారి పాత్రను కోటి పోషిస్తున్నారు. ఆయన పాత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. కోటి మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఇది సెకండ్ ఫేజ్. సంగీత దర్శకుడిగా 20 సంవత్సరాలు రాణించాను. శివనాగు వచ్చి ఎస్పీ పాత్ర చేయాలి అనగానే, ‘మా నాన్నగారు నన్ను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్గా చూడాలి’ అనుకున్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఒప్పుకున్నాను. 1983తో రాజ్ కోటిగా నా కెరీర్ స్టార్ట్ అయింది. కెఎస్ వ్యాస్గారి పాత్ర చేయడం అరుదైన సంఘటన. నా పాత్రని అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. నర్రా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్, దేవినేని నెహ్రూ పాత్రలో తారకరత్న పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తున్నారు. 75 శాతం షూటింగ్ పూర్తి అయింది. మరో షెడ్యూల్తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పతాక సన్నివేశాల్ని గుంటూరు జిల్లా చిలకలూరి పేట హైవేలో భారీగా చిత్రకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. . ‘‘1977లో దేవినేని నెహ్రూ స్టూడెంట్ లైఫ్ నుంచి మా సినిమా ప్రారంభం అవుతుంది. ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల షూటింగ్ జరుపుతున్నాం’’ అన్నారు రాము రాథోడ్. -
నేను అమ్మ అని పిలిచేవాణ్ని
-
టీడీపీ నేతల ప్రోద్భలంతోనే ఆ దుష్ప్రచారం?
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, సినీనటి పూనమ్కౌర్లపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటేశ్వరరావు అలియాస్ కోటి మంగళవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఇతడిపై హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసుస్టేషన్లో రెండు కేసులు నమోదై ఉన్నాయి. తనపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో జరిగిన దాడి వెనుక కోటి అనే వ్యక్తి ఉన్నాడని లక్ష్మీపార్వతి సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే సినీనటి పూనమ్కౌర్ కూడా తనపై గుర్తు తెలియని వ్యక్తులు అభ్యంతకరమైన పోస్టింగ్లు పెట్టారంటూ ఫిర్యాదు ఇచ్చారు. ఈ రెండు కేసులను సాంకేతికంగా దర్యాప్తు చేసిన సైబర్క్రైమ్ పోలీసులు రెండు కేసుల్లోనూ కోటినే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా, లాయర్తో కలిసి వచ్చి లొంగిపోతానంటూ కోటి కొన్నాళ్లుగా సైబర్క్రైమ్ పోలీసులకు వర్తమానం పంపుతూ వచ్చాడు. హఠాత్తుగా మంగళవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతని రాకని పసిగట్టి సైబర్క్రైమ్ పోలీసులు కోర్టుకు చేరుకునేలోపే కోటి న్యాయస్థానంలో లొంగిపోయాడు. చదవండి: (దురుద్దేశంతోనే నాపై దుష్ప్రచారం: లక్ష్మీ పార్వతి) ప్రముఖులకు దగ్గరై... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు సోషల్మీడియా కేంద్రంగా వైసీపీ నాయకులపై విషప్రచారం చేశారు. ఇందులో కోటిని కూడా ఉపయోగించారు. టీడీపీ నేతలు ఓ పథకం ప్రకారం వారు టార్గెట్ చేసిన వారి వద్దకు కోటిని పంపిస్తుంటారని సైబర్క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. వారి ‘లక్ష్యాల’తో పరిచయం, స్నేహాం ద్వారా తనపై నమ్మకం కలిగేలా ప్రవర్తించి కోటి ఆపై అసలు పని ప్రారంభిస్తాడు. అవకాశం చిక్కినప్పుడల్లా వారి ఫోన్లలో తనకు కావాల్సిన అంశాలు పొందుపరిచే వాడని, లక్ష్మీపార్వతి ఫోన్ను కూడా అలాగే ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు పేర్కొన్నారు. కోటిని అదే విధంగా పూనమ్కౌర్ వద్దకు కూడా పంపిన టీడీపీ నాయకులు ఆమెతో ఏపీకి చెందిన ఓ ప్రముఖ నటుడికి వ్యతిరేకంగా మాట్లాడించి, వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేసేలా చేశారని భావిస్తున్నారు. ఈ రెండు కేసులకు సంబంధించిన పలు వివరాలను కోటి నుంచి రాబట్టాల్సి ఉండటంతో సైబర్క్రైమ్ పోలీసులు అతణ్ణి కస్టడీకి కోరాలని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కోటి కార్యకలాపాలు, కోటికి, టీడీపీ నాయకులకు ఉన్న సంబంధాల గురించి నిర్థారణ కావాలంటే అతణ్ణి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని వారు చెప్తున్నారు. చదవండి: సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పూనమ్ కౌర్ -
వడిశలేరు బేబీకి మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానం
తూర్పుగోదావరి, రంగంపేట (అనపర్తి): సామాజిక మాద్యమాల ద్వారా తన పాటతో మంచి గుర్తింపు పొందిన రంగంపేట మండలం వడిశలేరుకు చెందిన గాయని పసల బేబికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పిలుపు మేరకు హైదరాబాద్ వెళ్లిన బేబీకి అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆహ్వానం లభించింది. కోటి సారథ్యంలోని బోల్ బేబి బోల్ కార్యక్రమంలో పాడే పాటలను ప్రాక్టీసు చేస్తున్న సమయంలో శుక్రవారం బేబీకి ప్రముఖ హీరో, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. శనివారం ఉదయం తమ ఇంటికి రావాలని ఆహ్వానించడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబయింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ శనివారం ఉదయం చిరంజీవి ఇంటికి వెళ్లనున్నట్టు తెలిపింది. హైదరాబాద్లోని మిర్రర్ కార్పొరేట్ కంపెనీ యాజమాన్యం శుక్రవారం ఉదయం తనను తమ కంపెనీకి తీసుకువెళ్లి సత్కరించారని బేబీ చెప్పింది. ఆ సంస్థ యాజమానులు విజయలక్ష్మి దంపతులు తన పాటలు విని అభినందించారని బేబీ తెలిపింది. సినీ పరిశ్రమలో తనకు పరిచయమున్న ప్రముఖ సినీ హీరోలైన బాలకృష్ణ, రామ్చరణ్లకు విజయలక్ష్మి ఫోన్చేసి తన గురించి వివరించి పాటలు పాడే అవకాశం కల్పించాలని కోరారని, దానిపై వారు స్పందిస్తూ తప్పకుండా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని బేబీ తెలిపింది. -
కోఠి ప్రసూతి ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాప్
-
కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో.. పసికందు అదృశ్యం!
-
ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. పసికందు అదృశ్యం!
హైదరాబాద్ : కోఠి సుల్తాన్ బజార్లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఆరు రోజుల పసికందు అదృశ్యమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ ప్రసూతి కోసం గతవారం ఆసుపత్రికి వచ్చారు. ఆమె ఓ ఆడశిశువుకు జన్మనిచ్చారు. ఆమె కదల్లేని స్థితిలో ఆస్పత్రిలో ఉండటంతో.. పక్కనే ఉన్న ఓ గుర్తుతెలియని ఓ మహిళ ఈ గమనించి.. శిశువుకు టీకా ఇప్పిస్తానటూ తీసుకెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తన బిడ్డను తీసుకురాకపోవడంతో విజయ తల్లిడిల్లిపోయారు. వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా శిశువును అపహరించిన మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పసికందు అదృశ్యమైన వార్తను కవర్ చేసేందుకు వచ్చిన మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మీడియాపై పోలీసులు, సెక్యూరిటీ గార్డులు దాడికి దిగారు. -
కోఠిలో భారీగా కొత్త రూ.10 నోట్లు పట్టివేత
-
కోఠి ఆంధ్రా బ్యాంకులో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని కోఠి ఆంధ్రా బ్యాంక్లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంకులోని 4 వ అంతస్తులో షార్టు సర్క్యూట్ ఏర్పడంతో ఈ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి సకాలంలో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. -
కోఠి ప్రసూతి వైద్యశాలలో బాలింత మృతి
-
భార్యను గొంతు నులిమి చంపిన భర్త రిమాండ్.
కందుకూరు (మహేశ్వరం): భార్యను గొంతు నులిమి చంపిన భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన కందుకూరు పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని దాసర్లపల్లి పరిధిలోని పెద్దమ్మతండాకు చెందిన రమావత్ రవీందర్(30), కోటి దంపతులు. వివాహేతర సంబంధం అనుమానంతో శుక్రవారం తన భార్య కోటిని గొంతు నులిమి చంపి ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. విషయం తెలిసిన తర్వాత పోలీసులు దర్యాప్తు చేసి ఆమెను భర్తే హత్య చేశాడని నిర్థారించి అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం నిందితుడు రవీందర్ను రిమాండ్కు తరలించారు. -
కోఠి ఉమెన్స్ కాలేజీ వద్ద కిడ్నాప్ కలకలం
హైదరాబాద్: కోఠి ఉమెన్స్ కళాశాలలో విద్యార్థిని కిడ్నాప్ కలకలం రేగింది. హాస్టల్లోకి వెళ్తున్న ఓ విద్యార్థినిని ఇద్దరు అగంతకులు కిడ్నాప్ చేయడానికి యత్నించారు. యువతి గట్టిగా కేకలు వేయడంతో.. అప్రమత్తమైన తోటి విద్యార్థినులు ఓ యువకుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. సుల్తాన్ బజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. శుక్రవారం రాత్రి హాస్టల్కు వెళ్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులు.. ఆమెను తమ వెంట తీసుకెళ్లడానికి యత్నించారు. దీంతో భయబ్రాంతులకు గురైన యువతి బిగ్గరగా కేకలు వేసింది. తోటి విద్యార్థినులు వెంటనే స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. హాస్టల్ సమీపంలో వీధిలైట్లు లేకపోవడంతో.. పోకిరీల బెడద ఎక్కువైందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
కోఠి ఈఎన్టీకి 50 ఏళ్లు
కోఠి(హైదరాబాద్): పేదల మనసుల్లో చిరస్థాయిగా నిలిచేలా సేవలందిస్తున్న కోఠిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రి ఆదివారంనాటికి 50 ఏళ్లు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది. మెహిదీపట్నంలోని సరోజని కంటి ఆస్పత్రిలో ఓ యూనిట్గా ఉన్న ఈఎన్టీ 1966లో కోఠిలోని నవాబ్ ప్రతాప్గిరి భవనంలోకి మారి పూర్తిస్థాయి ఆస్పత్రిగా సేవలు ప్రారంభించింది. మొదట బయట రోగులనే చూసేవారు. కాలక్రమంలో 125 పడకలతో ఇన్పేషంట్ విభాగాన్ని ఏర్పాటు చేయగా అత్యాధునిక వసతులను సమకూర్చుకుని దేశంలోనే పేరున్న ఈఎన్టీ ఆస్పత్రుల్లో ఒకటిగా నిలిచింది. ఓపీ విభాగంలో ప్రతిరోజూ 1200మందికిపైగా, ఇన్పేషెంట్ విభాగంలో 200మందికి పైగా వైద్య సేవలు పొందుతున్నారు. చిన్నారుల్లో వినికిడి లోపాన్ని సరిచేసేందుకు రూ.6 లక్షల ఖర్చుతో కూడుకున్న కాక్లియార్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇక్కడ పూర్తిగా ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటివరకు 250మందికి ఈ శస్త్రచికిత్సలను విజయవంతంగా చేశారు. శస్త్రచికిత్స జరిగిన చిన్నారులకు ఆస్పత్రిలోనే ఆరు నెలలపాటు ప్రత్యేక స్పీచ్ థెరపీ శిక్షణ తరగతులు నిర్వహిస్తుండడం విశేషం. -
శ్రీమఠంలో సంగీత దర్శకుడు కోటి
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం తెలుగు సినీ సంగీత దర్శకుడు కోటి గురువారం మంత్రాలయం వచ్చారు. ముందుగా ఆయన గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు పట్టారు. శ్రీరాఘవేంద్రస్వామి మూల బృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఆయనకు మఠం అసిస్టెంట్మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ మఠం మర్యాదలతో ఆహ్వానం పలికారు. అనంతరం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు రాఘవేంద్రుల జ్ఞాపిక, శేషవస్త్రం, ఫల, పూల మంత్రాక్షితలతో ఆశీర్వదించారు. -
కోఠి ఉమెన్స్ కళాశాల వద్ద పాము కలకలం
సుల్తాన్బజార్: ఎప్పుడూ జనసంచారం ఉండే కోఠి ఉమెన్స్ కళాశాల వద్ద శుక్రవారం ఓ నాగు పాము కలకలం సృష్టించింది. ఏదో మింగిన పాము చాలా నెమ్మదిగా పాకుతూ వెళ్తూ స్థానికుల కంటపడటంతో వారు భయందోళనకు గురై పరుగుతీశారు. స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పామును పట్టుకెళ్లారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉమెన్స్ కళాశాలలోని పొదల్లోంచి ఈ పాము వచ్చి ఉంటుందని అక్కడి సెక్యూరిటీ గార్డులు పేర్కొన్నారు. -
కారులో మంటలు.. కోఠిలో ట్రాఫిక్ జాం
హైదరాబాద్: రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.. శుక్రవారం మధ్యాహ్నం కోఠిలోని బగ్గా వైన్స్ ఎదుట.. వేగంగా వెళ్తున్న ఫోర్డ్ కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వారు కారును ఆపి బయటకు దూకారు. స్థానికులు నీరు చల్లినా మంటలు అదుపులోకి రాలేదు. సమాచారం అందటంతో ఫైరింజన్ అక్కడికి చేరుకుంది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనతో ఆ రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది. -
కథల ఎంపికలో నాన్నగారు కల్పించుకోరు
‘నోట్బుక్’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు రాజీవ్ సాలూరి. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి వారసునిగా ఇండస్ట్రీకొచ్చినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా రాజీవ్ నటించిన చిత్రం ‘టైటానిక్’. జి.రాజవంశీ దర్శకత్వంలో కె.శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజీవ్ చెప్పిన విశేషాలు... ఈ చిత్రంలో కార్తీక్ అనే కాలేజీ కుర్రాడి పాత్రలో నటించా. నేను, హీరోయిన్ ప్రేమించుకుంటాం. మనస్పర్థలు రావడంతో విడిపోతాం. అప్పుడు హీరోయిన్ను ఆమె మేనమామకు ఇచ్చి వివాహం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయిస్తారు. ఆ పెళ్లి ‘టైటానిక్’ అనే బోట్లో చేయాలనుకుంటారు. ఆ బోట్లోకి హీరో ఎలా ఎంటరయ్యాడు? పెళ్లిని ఎలా ఆపగలిగాడు? అన్నదే కథ గోదావరి నదిలో అంతర్వేది నుంచి అమలాపురం వెళ్లే టైటానిక్ బోట్లో ప్రయాణం కావడంతో ‘టైటానిక్’ అని టైటిల్ పెట్టాం. ‘గోదావరి’ చిత్రం కూడా బోట్లోనే చిత్రీకరించినా, రెండింటికీ పోలిక లేదు. దేనికదే డిఫరెంట్గా ఉంటుంది ‘సంగీత దర్శకుడివి అయ్యుంటే అండగా ఉండేవాణ్ణి. కానీ, నువ్వు హీరో అయ్యావు. కథల ఎంపికలో నీ నిర్ణయాలు నువ్వే తీసుకో’ అని నాన్నగారు అన్నారు. ఆయన సలహాలు ఇస్తారే కానీ, ఇన్వాల్వ్ కారు. ‘టైటానిక్’ తర్వాత ‘కేటుగాడు’ డెరైక్టర్ కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేశ్ బాలసాని నిర్మాతగా ఓ చిత్రం చేయనున్నా. -
కోఠి ప్రసూతి ఆస్పత్రిపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: కోఠి ప్రసూతి ఆస్పత్రి పరిస్థితులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రిలోని అసౌకర్యాలపై సుమోటోగా ఫిర్యాదు స్వీకరించిన న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఆస్పత్రిలో అపరిశుభ్ర వాతావరణం, అరకొర వసతులు, నిర్వహణ లోపం రోగులకు తీవ్ర ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంది. అక్కడి పరిస్థితులపై మూడు వారాల్లోగా సవివర నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ ఇద్దరు మహిళా న్యాయవాదులతో కమిటీని ఏర్పాటు చేసింది. -
కల్తీ రక్తం కలకలం
హైదరాబాద్ : పాలు...నీళ్లు...ఉప్పు..పప్పులే కాదు చివరకు మనుషుల ప్రాణాలను కాపాడే రక్తాన్ని కూడా వదలడం లేదు. పాలల్లో నీళ్లుపోసి అమ్మినంత సులభంగా రక్తంలో సెలైన్వాటర్ కలిపేస్తున్నారు. ఒక పాకెట్ రక్తాన్ని రెండు ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారు. అక్రమార్కుల రక్తదాహానికి అమాయకులు బలవుతున్నారు. రక్త సేకరణ, శుద్ధి, భద్రపరచడంలో సరైన ప్రమాణాలు పాటించక పోవడమే కాకుండా దాతల నుంచి రోగులు సమకూర్చుకున్న రక్తాన్ని సైతం కల్తీ చేస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. నగరంలోని సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తంలో నార్మల్ సెలైన్ వాటర్ కలిపి కల్తీ చేయడమే కాకుండా వాటికి స్టిక్కర్లు అతికించి విక్రయిస్తుండటం సంచలనం సృష్టించింది. ల్యాబ్ లో టెక్నీషియన్ గా పనిచేస్తున్న నరేంద్రప్రసాద్ అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఏడాది కాలంగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ కల్తీ రక్తం వ్యాపారం బ్లడ్బ్యాంక్ వాలంటరీ అసోసియేషన్ సహకారంతో గురువారం బయటపడింది. అధికారుల ఫిర్యాదు మేరకు ఔషధ నియంత్రణ మండలి అధికారులు, పోలీసులు సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించగా నకిలీ గుట్టు రట్టైంది. నరేంద్రప్రసాద్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. -
ప్రసూతి ఆస్పత్రిలో గర్భిణి మృతి
- కుటుంబసభ్యుల ఆందోళన హైదరాబాద్ : నగరంలోని కోఠి ప్రసూతి వైద్యశాలలో గర్భిణి మృతి చెందడంతో మృతురాలి కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. రంగారెడ్డి జిల్లా మాధపురం గ్రామానికి చెందిన మమత(25) పురిటినొప్పులతో సోమవారం సాయంత్రం కోఠిలోని ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. ఆమె మంగళవారం ఉదయం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మమత చనిపోయిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. -
వైవిధ్యమైన కథాంశంతో...
అలనాటి అందాల తార, సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో ‘శరభ’ చిత్రం తెరకెక్కింది. ఆకాష్ సహదేవ్, మిస్తి చక్రవర్తి జంటగా ఎన్.నరసింహారావు దర్శకత్వంలో ఏకేఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్వినికుమార్ సహదేవ్, గిరీష్ కపాడియా ఈ చిత్రాన్ని నిర్మించారు.. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిచిన చిత్రమిది. కోటిగారు మంచి పాటలిచ్చారు. ముఖ్యంగా 500మంది జూనియర్ ఆర్టిస్టులు, యాభై మంది డ్యాన్సర్స్తో శేఖర్ మాస్టర్ నేతృత్వంలో తెరకెక్కించిన జానపద పాట ఆకట్టుకుంటుంది. రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన ఫైట్ కథకు కీలకంగా నిలుస్తుంది. వాకాడ అప్పారావుగారి సహకారంతో నిర్మాణం సులువుగా జరిగింది’’ అని పేర్కొన్నారు. ‘‘సరికొత్త కథాంశంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. అతి త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: రమణ సాల్వ, సహ నిర్మాత: సురేష్ కపాడియా. -
బైక్ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కంభం పట్టణానికి చెందిన కోటి (25) అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సుల్తాన్బజార్లో వ్యాపారుల ఆందోళన
హైదరాబాద్: నగరంలోని కోఠి, సుల్తాన్ బజార్ ప్రాంతాలలో వ్యాపారులు ఆందోళన చేపట్టారు. మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనను నిరసిస్తూ వ్యాపారులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. నేడు సుల్తాన్ బజార్ బంద్ కు వ్యాపారులు పిలుపునిచ్చారు. మెట్రో ప్రాజెక్టు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని వ్యాపారులు హెచ్చరించారు. -
కోఠి హరిద్వార్ హోటల్ లో యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: ఓ యువకుడు ఆనుమానాస్పద స్థితితో మృతి చెందిన సంఘటన నగరంలోని కోఠి ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానిక హరిద్వార్ హోటల్లో ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. అదిలాబాద్కు చెందిన లారీ ఓనర్ ప్రమోద్కుమార్ హోటల్ లోని కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గది తలుపులు తెరిచి శవాన్ని కిందికి దించారు. మృతుని వద్ద నుంచి సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతికి గల కారణాలు, సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నేను లాడెన్ను.. నేను రాముడ్ని!
హైదరాబాద్: ‘నేను ఒసామా బిన్ లాడెన్ను.. నేను రాముడ్ని.. నేనే దేవుడ్ని..’ అంటూ గురువారం ఉదయం హైదరాబాద్ కోఠిలోని గాంధీ జ్ఞాన్ మందిర్ వద్ద ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్కుమార్(35) కొన్నేళ్లుగా నగరంలోని చప్పల్బజార్లో నివాసం ఉంటూ కోఠి బ్యాంక్ స్ట్రీట్లోని దేనా బ్యాంక్లో అకౌంట్స్ ఉన్నతాధికారిగా పని చేశాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో బ్యాంక్ అధికారులు అతడిని విధుల నుంచి తొలగించారు. గురువారం ఉదయం కోఠి గాంధీ జ్ఞాన్ మందిర్ వద్దకు వచ్చిన రామ్కుమార్.. ఇనుప రాడ్ను పట్టుకుని అక్కడ రోడ్డుపై వెళ్తున్న ప్రజలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో టోలీచౌకికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి సమీఉద్దీన్కు తీవ్ర గాయాలు అయ్యాయి. పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సైకోను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్కు తరలించారు. అయితే పోలీసుస్టేషన్లోనూ అతడు వీరంగం సృష్టించాడు. దుస్తులు విప్పేసి నగ్నంగా నిలబడి.. నేను దేవుడ్ని.. వెల్ ఎడ్యుకేటెడ్ని అని అరుస్తూ పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. చివరికి 20 మంది పోలీసులు కలసి అతడికి బేడీలు వేసి కట్టడి చేశారు. -
కోఠిలో సైకో వీరంగం
-
కోఠిలో సైకో వీరంగం
కోఠి: హైదరాబాద్ నగరం కోఠి ప్రాంతంలో గురువారం ఉదయం ఓ సైకో వీరంగం సృష్టించాడు. అటుగా వెళ్తున్న పాదచారులపై ఐరన్ రాడ్తో దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుణ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 'సాక్షి' సమాచారంతో పోలీసులు ఆ సైకోను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కోటి ఆత్మార్పణతోనైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దిరెడ్డి, భూమన - కోటి కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం - గాయాలపాలైన శేషాద్రికి రూ. 50 వేలు అందజేత తిరుపతి మంగళం: ముని కామకోటి ఆత్మాహుతితోనైనా ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 8వ తేదీన మునికోటి నిప్పంటించుకుని ఆత్మాహుతి చేసుకున్న విషయం తెలిసిందే. కోటి కుటుంబాన్ని మంగళవారం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సందర్భంగా ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆ హామీ మేరకు వైఎస్ జగన్ ఆదేశాలపై కోటి కుటుంబానికి పెద్దిరెడ్డి, భూమన రూ. 3 లక్షలు ఆర్థికసాయం అందించారు. బుధవారం ఉదయం కోటి ఇంటికి వెళ్లి అతని తమ్ముడు మురళికి రూ. 1.5 లక్షలు, కోటి భార్య దాక్షాయణికి రూ. 1.5 లక్షలు అందించారు. కోటిని కాపాడబోయి గాయాలపాలైన శేషాద్రికి రూ. 50 వేలు ఆర్థిక సాయాన్ని పెద్దిరెడ్డి, భూమన, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి సంయుక్తంగా అందించారు. -
కోటి జోహార్లు!
ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన ఉద్యమ నేత మునికామకోటికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన మృతదేహాన్ని చూసి బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు చలించిపో యారు. అతని జ్ఞాపకాలను నెమరువేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘నీ మనసు వెన్న.. ఆశయాలు మిన్న.. నిను మరువలేమన్నా.. అందుకో ఇవే మా జోహార్లు’ అంటూ పలువురు ఘన నివాళులర్పించారు. తిరుపతి కార్పొరేషన్: కోటికి జోహార్లు అర్పించారు. పలువురు ఆయన ఆఖరి ఘట్టానికి హాజరై అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. రాష్టానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ శనివారం ఆత్మహత్యాయత్యానికి పాల్పడిన తిరుపతికి చెందిన బెంగళూరు మునికామ కోటి అలియాస్ బీఎంకే కోటి (41) ఆదివారం చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చె న్నైలోని కెఎంసీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని సోమవారం తిరుపతికి తీసుకొచ్చారు. నగ రంలోని మంచాల వీధిలో ఉన్న కోటి నివాసానికి తీసుకొచ్చారు. బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోటి మృతదేహాన్ని చూడగానే ఉద్వేగానికి లోనయ్యారు. అతని జ్ఞాపకాలను నెమరు వేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు తరలివచ్చి కోటి కుటుంబాన్ని ఓదార్చారు. మధ్యాహ్నం 3.40 గంటలకు బీఎంకే కోటి అంతిమయాత్ర ప్రారంభమైంది. కోటి పాడిని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ బత్సల చెంగల్రాయులు మోసుకెళ్లి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్పపల్లకీ వాహనంలోకి ఎక్కించారు. అశేష జనవాహిని భవానీనగర్ సర్కిల్, వీవీ మహల్ సర్కిల్, మాస్కూ రోడ్డు మీదుగా కోటి అంతమయాత్ర సాగింది. దారి పొడవునా ప్రజలు కోటి పార్థివ దేహాన్ని సందర్శించి పూల వర్షం కురిపించారు. కోటి ఆత్మహత్యకు పాల్పడిన మున్సిపల్ కార్యాయం వద్ద మాజీ మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ కోటి మృతదేహంపై కాంగ్రస్ పార్టీ జెండా కప్పారు. ఇదే ప్రాంతంలో కోటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. అక్కడి నుంచి 4.30 గంటలకు హరిశ్చంద్ర శ్మశాన వాటికకు చేర్చారు. 4.41 గంటలకు చితిపై ఉన్న కోటి మృతదేహానికి ఆయన తమ్ముడు మురళి నిప్పుపెట్టి అంతిమ సంస్కారాలను అశ్రునయనాలతో పూర్తిచేశారు. కోటి మృతదేహానికి పలువురు ప్రముఖులు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. -
రేపు కోటి ఇంటికి జగన్ రాక
తిరుపతి సిటీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన కోటి కుటుంబభ్యులను పరామర్శించేందుకు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతికి రానున్నారు. సోమవారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జగన్మోహన్రెడ్డి మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆ కార్యక్రమం తరువాత ఢిల్లీనుంచి నేరుగా ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా కోటి కుటుంబసభ్యులు నివాసం ఉంటున్న మంచాల వీధికి చేరుకుని పరామర్శించనున్నారు. -
నిరసన జ్వాల
కోటి ఆత్మాహుతిపై జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నేడు తిరుపతి బంద్కు కాంగ్రెస్ పిలుపు తిరుపతి కార్పొరేషన్ : ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదంతో ఒంటికి నిప్పంటిం చుకుని తీవ్రంగా గాయపడిన మునికామ కోటిమరణవార్త తెలియగానే ఆదివారం జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. తిరుపతిలో కోటి ఒంటికి నిప్పు అంటించుకున్న ప్రదేశంలో నల్ల బ్యాడ్జీలు తగిలించుకుని పార్టీలకతీతంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మౌనదీక్షకు దిగారు. ఆయన మృతికి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు జిల్లా వ్యాప్తంగా మౌనదీక్షలు, కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్వంలో ఆదివారం సాయంత్రం నాలుగు కాళ్ల మండపం నుంచి కోటి నిప్పంటించుకున్న ప్రదేశం వ రకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. సోమవారం సాయంత్రంలోపు కోటి అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నేడు తిరుపతి...రేపు రాష్ట్ర బంద్కు పిలుపు.. సోమవారం తిరుపతి బంద్కు పిలుపునిచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా కమిటీ అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సన్నిహితులు, స్నేహితుల నివాళి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదంతో ఆత్మాహుతికి పాల్పడిన బీఎంకే కోటి సన్నిహితులు, స్నేహితులు అతని జ్ఞాపకాలను తలచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. తిరుపతి నగరంలో నిన్నటి వరకు తమను ఆప్యాయంగా పలకరిస్తూ, ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నా అంటూ పలకరించే స్నేహితుడు కోటి మృతి చెందాడని తెలిసి జీర్ణించుకోలేక పోతున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే మబ్బురామిరెడ్డి కుమారుడు మబ్బు చెంగారెడ్డి శిష్యుడిగా, మబ్బు యువసేన నాయకుడిగా గుర్తింపు పొందిన బెంగళూరు మునికామ కోటి అలి యాస్ బీఎంకే కోటి(41) తక్కువ సమయంలోనే ఉద్యమ నా యకుడిగా ఎదిగారు. మబ్బు చెంగారెడ్డితో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఆరు నెలల పాటు దశల వారీగా ఆందోళనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి తెలుగు జాతి సత్తాను చాటి చెప్పారని ఆయన సన్నిహితులు తెలిపారు. అది ప్రభుత్వ హత్యే.. కోటి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పలువురు ప్రజా సంఘాలు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నాయి. మధ్యాహ్నం 4.15 గంటలకు ఆత్యహత్యాయత్నానికి పాల్పడి తీవ్ర గాయాలపాలైన కోటిని రాత్రి 7.25 గంటలకు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించడం ఎంతవరకు సమంజసమని ఆ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే సమ యం మించిపోవడం, వేలూరు వెళ్లినా వారు కాదనడంతో అక్కడి నుంచి చె న్నై కీళ్లపాక మెడికల్ కళాశాల (కేఎంసీ)కు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో జరిగిన హత్యగా భావిస్తున్నామని మం డిపడుతున్నారు. ఈ పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణపాయ స్థితిలో రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడిని పరామర్శించకుండా కాంగ్రెస్ నాయకులు బహిరంగ సభను రెండు గంటల పాటు కొనసాగించారు. సభలో ప్రసంగాలు పూర్తయిన అనంతరం ఆస్పత్రికి వెళ్లి వారు పరామర్శించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
వేలూరు సీఎంసీకి కోటి తరలింపు
-
ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతి యత్నం
-
సమైక్య మేటి..ఉద్యమ కోటి!
-
ప్రత్యేక జ్వాల
-
తిరుపతి ఘటననపై బాబు ఆవేదన
తిరుపతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. యువత ఎలాంటి ఉద్రేకాలకూలోను కావద్దని చంద్రబాబు సూచించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోరుసభలో కోటి అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు వేలూరు సీఎంసీకి తరలించారు. -
కోటి, శేషాద్రిలకు చెవిరెడ్డి పరామర్శ
తిరుపతి: కాంగ్రెస్ నేతలు తిరుపతిలో నిర్వహించిన పోరు సభలో ఆత్మహత్యాయత్నం చేసిన కోటి, అతడిని కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన శేషాద్రిలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పరామర్శించారు. కోటి ఆత్మహత్యాయత్నానికి చంద్రబాబు, మోదీలే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీల తీరువల్లే కోటి బలిదానానికి సిద్ధపడ్డాడని ఆయన చెప్పారు. తక్షణమే కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్షకు సిద్ధపడ్డారని ఆయన చెప్పారు. -
వేలూరు సీఎంసీకి కోటి తరలింపు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం తిరుపతి కాంగ్రెస్ పోరుసభలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కోటిని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కోటి శరీరంలో 70 శాతం కాలిన గాయాలయ్యాయని తిరుపతి రుయా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ రోజు తిరుపతిలో కాంగ్రెస్ పోరుసభ ఆరంభమైన కాసేపటికే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు వెంటనే అతన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. కోటికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరుకు తరలించాలని వైద్యులు సూచించారు. -
కాంగ్రెస్ పోరుసభలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
తిరుపతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రారంభమైన పోరుసభలో కలకలం రేగింది. సభలో కోటి అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. కోటిని రక్షించబోయిన శేషాద్రి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కోటిని తిరుపతిలోని మంచాలవీధికి చెందినవాడిగా గుర్తించారు. శనివారం సాయంత్రం తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో పోరు సభ జరిగింది. ఏపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, పల్లంరాజు తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. వాటర్ బాటిల్ లో పెట్రోల్ తీసుకుని సభకు వచ్చిన కోటి.. సభ ప్రారంభమైన కాసేపటికి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో సభలో గందరగోళం ఏర్పడింది. అనూహ్య సంఘటనతో కాంగ్రెస్ నేతలు షాకయ్యారు. కోటికి మెరుగైన చికిత్స ఏర్పాట్లు చేస్తామని, 2 లక్షల రూపాయలను ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్టు రఘువీరారెడ్డి చెప్పారు. -
హ్యాపీ బర్త్ డే- 28-05-15
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కోటి (సంగీత దర్శకుడు), కైలీ మినోగ్ (ప్రముఖ గాయని, నటి) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. వీరు ఈ సంవత్సరమంతా విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అభివృద్ధి పథంలో పయనిస్తారు. ఊహించని ఆహ్వానాలు, సన్మానాలు, గుర్తింపు లభిస్తాయి. సంఘంలో వీరి మాట బాగా చెల్లుబాటు అవుతుంది. విద్యార్థులకు మంచి కాలం. గతంలో చేసిన రచనలు ఇప్పుడు వెలుగు చూస్తాయి. వాటికి పేరు వస్తుంది. ఉద్యోగులకు ప్రాధాన్యత గల స్థానాలకు బదిలీ అవుతంంది. రాజకీయ నాయకులకు పదవులు లభిస్తాయి. న్యాయవాదులకు చేతినిండా పని దొరుకుతుంది. మంచి ఆదాయం కళ్లజూస్తారు. అయితే అనుకున్న పనులన్నీ అవుతున్నందువల్ల గర్వంతో కూడిన మిడిసిపాటు పడతారు. ఫలితంగా అపనిందలు, అవహేళనలు ఎదుర్కొనవలసి రావచ్చు. అందువల్ల మాటలలో, చేతలలో సంయమనం పాటించాలి. ఆచితూచి వ్యవహరించాలి. లక్కీ నంబర్లు: 1, 5, 9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, గ్రీన్, గోల్డెన్; లక్కీ డేస్: బుధ, గురు, ఆదివారాలు. సూచనలు: పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం, తోబుట్టువులను... ముఖ్యంగా పెళ్లికాని సోదరీమణులను ఆదరించడం, సరస్వతిని, సాయినాథుని, దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు -
కోఠిలో టవరెక్కిన హోంగార్డ్
హైదరాబాద్ : కోఠి ఉమెన్స్ కాలేజీ చౌరస్తా వద్ద మంగళవారం సాయంత్రం ఓ హోంగార్డు టవరెక్కి తన నిరసన తెలుపుతున్నాడు. హైదరాబాద్లో హోంగార్డుగా పనిచేస్తున్న కృష్ణ .. అధికారుల వేధింపులు తట్టుకోలేకనే టవర్ ఎక్కానని అంటున్నాడు. హోంగార్డు కమాండర్ వస్తేగానీ కిందకు దిగనని కృష్ణ తేల్చిచెబుతున్నాడు. కృష్ణను పై నుంచి కిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
అనుమానాస్పద౦గా చిన్నారి మృతి
-
స్టార్ రిపోర్టర్@ కోటి
ట్రిపుల్ రైడర్స్కు టై.. ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ కంట పడతామేమోనని ! ఆటోవాలాకు హడల్ .. సిగ్నల్ జంప్ చేసినందుకు చలాన్తో ఇరగదీస్తాడని ! సెలబ్రిటీలకు భయం.. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద బుక్ చే సి ఇమేజ్ ఇస్త్రీ చేసేస్తాడని! రాంగ్ రూట్లో వెళ్లే వాళ్లు.. లెసైన్స్ ఇంట్లో మరచిపోయామని కాకమ్మ కబుర్లు చెప్పేవాళ్లు.. పాత బండికి ఇన్సూరెన్స్ ఎందుకని అడిగేవాళ్లు.. ట్రాఫిక్ పోలీసులంటే వసూల్రాజాలని నెగెటివ్గా భావిస్తారు. తప్పుదారిలో వెళ్తూ చిక్కిన వారికి చలాన్లు రాస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ను చూసిన వారందరూ అన్యాయంగా డబ్బులు గుంజుతున్నాడని అనుకుంటారు. నిబంధనల గీత దాటిన వారికి వాత పెడితేనే సెట్ అవుతారంటారు ట్రాఫిక్ పోలీసులు. పొల్యూషన్ పరుచుకున్న దారి.. చెవుల్లో జోరీగల్లా హారన్లు.. కంటిలో నలుసులా ధూళి.. గంటల తరబడి నిల్చుని అలసిన కాళ్లు.. సిటీ రోడ్లపై ట్రాఫిక్ సిబ్బంది పడే కష్టాలు ఇంతింత కాదు. ఇన్ని నెగెటివ్ యాస్పెక్ట్స్లో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులను ‘సిటీ ప్లస్’ తరఫున ‘స్టార్ రిపోర్టర్’గా మ్యూజిక్ డెరైక్టర్ కోటి పలకరించారు. కోటి: హాయ్.. స్టార్ రిపోర్టర్గా మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఉద్యోగంలో ఉన్నవారికి చాలా ఓర్పు కావాలి. రోజుకు వేల మందిని కంట్రోల్ చేస్తుంటారు.. శ్రీనివాసులు: వందలాది మందిని కంట కనిపెట్టాలి.. పొరపాటుగా డ్రైవ్ చేస్తున్నవారిని కంట్రోల్ చేయాలి. ఒకరు సిగ్నల్ జంప్ చేస్తారు.. ఇంకొకరు రాంగ్ రూట్లో వస్తుంటారు.. అన్నీ ఓపిగ్గా చూసుకోవాలి. మా డ్యూటీనే అంత కదా సార్. కోటి: సిటీ ట్రాఫిక్లో ఓ గంట ఇరుక్కుపోతేనే తట్టుకోలేం. అలాంటి ది మీరు రోజంతా దుమ్ము, ధూళిలో ఉంటారు కదా.. మీ పరిస్థితేంటి ? ఆజామ్: ఒక్క మాటలో చెప్పాలంటే మాది రిస్కీ జాబ్ సార్. ప్రతి రోజూ ఉదయం బెల్లం, నానబెట్టిన శనగలు కలిపి తింటే డస్ట్ నుంచి ఎలర్జీ రాకుండా ఉంటుంది. మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్లో ఇవి అందుబాటులో ఉంటాయి. సురేష్ కుమార్: ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా మిగతా ఉద్యోగులతో పోలిస్తే మా లైఫ్ టైం ఐదారేళ్లు తక్కువే సార్. కోటి: అవునా.. ఎలర్జీ రాకుండా బెల్లం, శనగలు పని చేస్తాయా..? శ్రీనివాసులు: యస్ సార్. పీల్చిన దుమ్ముని క్లియర్ చేసే శక్తి వాటికి ఉంటుంది. కోటి: గంటల తరబడి ఉండాలంటే ఓపిక కూడా బాగానే ఉండాలి కదా..! ధనుంజయ్: మాలో ఓపిక పెంచడం కోసం ఏడాదికి రెండు లేదా మూడు సార్లు బీఓసీ (బిహేవియర్ ఆఫ్ ఓరియంటేషన్ కోర్స్) ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో యోగా, మెడిటేషన్ ఉంటాయి. దాంతో మాకు సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది. కోటి: ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి గురించి చెప్పండి..? కుమారస్వామి: నేను చిక్కడపల్లి స్టేషన్ పరిధిలో పని చేస్తాను. అక్కడ ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. 80 శాతం మంది రూల్స్ ఫాలో అవుతారు. అసలు చిక్కల్లా 20 శాతం మందితోనే. గల్లీల్లో కూడా తమ స్పీడ్ ప్రదర్శించాలనుకుంటారు. సిగ్నల్స్ ఫాలో అవ్వరు. ఏమైనా అంటే మమ్మల్నే టీజ్ చేస్తూ పోతారు. కోటి: ఇప్పుడు సిటీలో వెహికల్స్ పెరిగాయి. ఇంటింటికీ బైకులు, కార్లున్నాయి! సురేష్కుమార్: సిటీలో చాలా రోడ్లు నిజాం జమానావే. ఆ కాలంలో ఉన్న వాహనాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగాయి. ఇక మా పరిస్థితి ఊహించుకోండి. కోటి: రోడ్డుపై చిన్న సంఘటన జరిగినా.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది. ధనుంజయ్: దానికి కారణం.. ఇరుకు రోడ్లు, పెరిగిన వాహనాలు, పద్ధతి లేని డ్రైవింగ్ అనుకోరు. మేం సరిగా పనిచేయకపోవడం వల్లే ట్రాఫిక్ జామ్ అయిందనుకుంటారు. శ్రీనివాసులు: నడిరోడ్డు మీద ఏదైనా పెద్ద బండి ఆగిపోతే ట్రాఫిక్ స్తంభించిపోతుంది. అందరూ ట్రాఫిక్ పోలీసులేరని ఆవేశపడిపోతుంటారు. వాళ్లు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలోనే ఉన్నారని ఏ ఒక్కరూ అర్థం చేసుకోరు. కోటి: డ్రంక్ అండ్ డ్రైవ్ని ఎంత వరకూ కంట్రోల్ చేయగలుగుతున్నారు? శ్రీనివాసులు: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇండియాలో చేసిన సర్వేలో.. రోడ్డు ప్రమాదాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగినవే ఎక్కువని తేలింది. హైదరాబాద్, జలంధర్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించింది. తాగడం అనేది వారి పర్సనల్. కానీ.. తాగి డ్రైవ్ చేసే హక్కు వాళ్లకు లేదు. రాజు: డ్రంక్ అండ్ డ్రైవ్పై అవగాహన కల్పించడానికి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ వెహికల్ ఏర్పాటు చేశాం. దీన్ని నగరంలో అక్కడక్కడ రోడ్డుపక్కన ఆపి ఉంచుతాం. రోడ్డు ప్రమాదాలపై సీసీ ఫుటేజ్ ఆధారంగా రూపొందించిన ప్రోగ్రామ్స్ అందులో తిలకించవచ్చు. కోటి: రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు మీరు స్పందించే తీరుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. శ్రీనివాసులు: ఉద్యోగ ధర్మంగా మాత్రమే కాదు సార్.. అలాంటి సందర్భాల్లో ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తుంటాం. అలాగే అంబులెన్స్ వెళ్లే దారులను క్లియర్ చేయడంలో వేగంగా స్పందిస్తాం. ఆ టైంలో ఒక ప్రాణాన్ని కాపాడే బాధ్యత మాపై ఉందని గుర్తుంచుకుంటాం. కోటి: చివరిగా ప్రశ్న.. ప్రజలందరూ అడుగుదామనుకునే ప్రశ్న. ట్రాఫిక్ పోలీసులు అనగానే చలాన్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తారని ఆరోపణ, అలాగే లంచాలు కూడా.. శ్రీనివాసులు: మేం వసూలు చేసే డబ్బులను చూస్తారు కానీ మేం ఇచ్చే చలాన్ స్లిప్ చూడరు. ఆ వాహనదారుడు చేసిన తప్పు ఎవరికీ పట్టదు. ముందు మమ్మల్ని నెగటివ్గా చూడ్డం మానేయాలి సార్. కోటి: ట్రాఫిక్ పోలీస్ అంటే తప్పు చేయకుండా కాపు కాసే అన్న అనే భావన అందరికీ రావాలి. తప్పు చేసినపుడు మన పెద్దలు దండించినట్టే వీరు కూడా ప్రవర్తిస్తారు. ఎండనకా, వాననకా గంటల తరబడి నిలబడి మన ప్రాణాలను కాపాడుతున్న వీరికి మనం సహకరిద్దాం. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడంలో సిటీ ఈజ్ ద బెస్ట్ అనిపించుకుందాం. ఇదే ఈ ‘కోటి’ ఆశ. కోటి : నేనొకసారి కేబీఆర్ పార్కు దగ్గర అందరూ పార్కు చేశారు కదా అని నేనూ రాంగ్ ప్లేస్లో పార్క్ చేశాను. వచ్చి చూస్తే కార్కు లాక్ వేసేశారు. పోలీసుల దగ్గరికి వెళ్లి సారీ చెప్పి ఫైన్ కట్టాను. అమెరికా వెళ్లొచ్చిన ప్రతి ఒక్కరు అక్కడి ట్రాఫిక్ రూల్స్ గురించి గొప్పగా చెబుతారు. అక్కడ రూల్స్ పాటించిన వారు ఇక్కడకు వచ్చేసరికి రాంగ్ పార్కింగ్లు, సిగ్నల్ జంప్ చేస్తారు. అమెరికాలో రెడ్ సిగ్నల్స్ పడగానే వెహికల్స్ ఆటోమేటిక్గా ఆగిపోతాయి. గ్రీన్ సిగ్నల్ పడగానే స్టార్ట్ చేసుకుని వెళ్లాలి. అలాంటి టెక్నాలజీ మనకూ అందుబాటులోకి వస్తే పొల్యూషన్ కొంతైనా తగ్గుతుంది. సుద్దాల పాటకు కోటి ట్యూన్ ట్రాఫిక్ పోలీసులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రాఫిక్ ఎడ్యుకేషన్ వెహికల్లో కోటి కాసేపు గడిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా రూపొందించిన రోడ్డు ప్రమాదాల సంఘటనల వీడియోను వీక్షించారు. దానికి బ్యాక్గ్రౌండ్ సాంగ్ హిందీలో ఉండటాన్ని గమనించిన కోటికి.. ఆ పాట తెలుగులో ఉంటే బాగా అర్థమవుతుంది కదా అన్న ఆలోచన వచ్చింది. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు విషయం చెప్పగానే ఆయన లిరిక్స్ రాయడానికి ఓకే అన్నారు. పాట రాగానే తానే ట్యూన్ కట్టి సిటీ ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థకు డెడికేట్ చేస్తానని చెప్పారు కోటి. -
స్నేహగీతం.. మెలోడి ఆఫ్ లైఫ్
డ్యాన్స్ బేబీ డ్యాన్స్.. లిటిల్ చాంప్స్.. ఢీ.. పాడుతా తీయగా... రియాలిటీ షో ఏదైతేనేం టాలెంట్తో పాటు ఫ్రెండ్షిప్నూ పెంపొందించే ఆధునిక అడ్డాలు ఇవి! ఈ షోలన్నీ ఆన్స్క్రీన్లో పోటీని పెంచితే ఆఫ్ స్క్రీన్లో స్నేహాన్ని పంచుతున్నాయి! పోటీల ప్రారంభంలో అపరచితులుగా ఉన్న కాంపిటీటర్స్.. ముగింపు వచ్చేసరికి ప్రాణస్నేహితులుగా మారుతున్నారు. అలాంటి స్నేహ వీచికలకు వేదికగా నిలిచిన షోల్లో బోల్ బేబీ బోల్ ఒకటి ! స్నేహానికి సంబంధించి ఆ టీమ్ సభ్యులది ఒక్కొక్కరిది ఒక్కో జ్ఞాపకం.. సీరియస్ మ్యుజీషియన్లోని జోవియల్ యాంగిల్ గిటార్తో చెలిమి తప్ప ప్రపంచంతో పరిచయంలేని సీనియర్.. సీరియస్ మ్యుజీషియన్గానే కోటిని గుర్తిస్తారు చాలామంది! కానీ ఆయన్ను పిల్లల్లో పిల్లాడిగా... పెద్దల్లో పెద్దవాడిగా... మొత్తంగా అందరికీ కావాల్సిన ఆప్తుడుగా.. భరోసాగా నిలిచే సన్నిహితుడిగా చూపింది ఈ రియాలిటీ షోనే! ఈ షోలో గళం విప్పిన చిన్నారులు రాహత్, శ్రీలలిత.. సోలోగా ఎంట్రీ ఇచ్చి జంటగా మారిన హేమచంద్ర, శ్రావణ భార్గవి.. బోల్ బేబీ బోల్ ప్రొడ్యూసర్ సాయివంశీ మైత్రీ బంధాన్ని ‘సిటీప్లస్’ పలకరించింది. వీరంతా కోటితో పంచుకున్న కులాసా కబుర్లు స్నేహగీతమై పల్లవించింది.. లొకేషన్.. రామానాయుడు స్టూడియోస్లోని లాన్ బ్లూజీన్స్.. బ్లూ షర్ట్.. గాగుల్స్తో ఎంట్రీ ఇచ్చిన కోటిని చూసి ‘సూపర్ సర్’ అంటూ హేమచంద్ర, శ్రావణ భార్గవి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ‘నిజంగా బాగుందా?’ కోటి. ‘బాగుందా ఏంటీ సర్.. యంగ్గా కనపడుతుంటే’ అన్నాడు హేమచంద్ర. ‘ఇది మా అబ్బాయి షర్ట్. అందుకే యంగ్గా కనిపిస్తున్నట్టున్నాను’ అని హేమచంద్ర చెవిలో జోకేశాడు కోటి! ‘సర్ మీరు మరీ..’ అంటూ నవ్వేశాడు హేమచంద్ర! గంభీరంగా కనిపించే కోటిలో సరదా కోణం అది. సినిమా ఇండస్ట్రీ అంటే యాటిట్యూడ్ ర్యాంప్ అనే భావనలో ఉండేవారికి ఆయన ప్రవర్తన ఆశ్చర్యం. ‘నాలాంటి సీనియర్ మ్యుజీషియన్.. ఇలాంటి పిల్లల (తన పక్కనే ఉన్న రాహత్, శ్రీలలితను చూపిస్తూ) దగ్గర ‘ఏం పాడావు? ఆ శ్రుతేంటి?’ అని సీరియస్గా అంటే పిల్లలు బిగుసుకుపోతారు. అసలా టెన్షన్లో లేని తప్పులు పాడేస్తారు. అలాంటి వాతావరణం ఉండకూడదనే పిల్లలతో కలిసిపోయి అదేదో యుద్ధరంగం కాదు చక్కగా ఆడుతూపాడుతూ పనిచేసుకునే ప్లేస్ అనే ఫీల్ కల్పిస్తా! ఈ పిల్లలు మహా పిడుగులు. వీళ్లు మమ్మల్ని ఆటపట్టిస్తారు. నేర్చుకునేటప్పుడు గురువుగా చూస్తారు.. తప్పులు సరిదిద్దుతున్నప్పుడు పేరెంట్గా అనుకుంటారు.. అల్లరి చేస్తున్నప్పుడు స్నేహితులుగా భావిస్తారు. ఇంత కంఫర్ట్నెస్కి ఫుల్స్పేస్ ఇస్తాను’ అంటాడు కోటి! కోతిచేష్టలు.. కుచేలుడి స్నేహాలు చిలిపి పనులు.. కోతిచేష్టల కూనలు పిల్లలు. అలా ఇల్లు పీకి పందిరేసే ఆ వేషాలే కొత్తాపాతాలేక అందరితో కలిసేలా చేస్తాయి.. విడిపోని మిత్రులుగా మారుస్తాయి! దానికి ఈ సంభాషణే నిదర్శనం... శ్రీలలిత (రియాలిటీ షోలో ఓ చిన్నారి)కు మనం పెట్టిన పేరేంటీ?’ శ్రీలలితను టీజ్ చేస్తూ కోటి.‘ఈలరాణి’ అని ఆన్సర్ చేశాడు రాహత్ అదే రియాలిటీ షోలో ఇంకో లిటిల్ పార్టిసిపెంట్.‘నీకూ ఓ పేరుంది తమ్ముడూ మర్చిపోయావా?’ రాహత్ను టీజ్ చేస్తూ శ్రావణ భార్గవి ‘హాలిడే బాయ్’ చెప్పింది శ్రీలలిత ‘ఎప్పుడూ హాలిడే మూడ్లో ఉంటాడు.. ఈవెన్ డ్రెస్సింగ్ కూడా!’ రాహత్ వెసుకున్న త్రీఫోర్త్ ప్యాంట్ వైపు చూపిస్తూ హేమచంద్ర. ‘ఆల్కలర్స్లో ఈ ప్యాంట్లు వీడి దగ్గర ఉంటాయి’ శ్రావణ భార్గవి యాడ్ చేసింది. ‘ఎవరి పాటైనా తనకు నచ్చితే సెట్ అదిరిపోయేలా ఈల వేసేది. అందుకే ఈ పిడుగుని ఈలరాణి అని పిల్చుకుంటాం. అంతేకాదు ఈమెకు ఇంకో విద్య కూడా వచ్చు. ఎవరినైనా ఇట్టే ఇమిటేట్ చేస్తుంది. ఉషా ఉతుప్లాంటి వాళ్లతో సహా!’ చెప్పాడు కోటి శ్రీలలితను చూపిస్తూ! స్నేహం.. పరిణయం కొన్ని సమయాలు మైత్రిని కల్పిస్తే ఇంకొన్ని సందర్భాలు దాన్ని ప్రణయంగా మార్చి పరిణయంగా ముడివేస్తాయి. హేమచంద్ర, శ్రావణ భార్గవిల పెళ్లి అలాంటిదే! దానికి పీటవేసింది ఈ రియాలిటీ షోనే! ‘సాయిగారూ.. (సాయివంశీ బోల్ బేబీ బోల్ ప్రొడ్యూసర్) ఈ ప్రోగ్రామ్కి మా ఇద్దరినే యాంకర్స్గా సెలక్ట్ చేసుకోవడానికి కారణమేంటండి? మా ప్రేమ గురించి మీకు ముందే తెలుసా ఏంటి?’ అని అడిగింది శ్రావణ భార్గవి. ‘అలాంటిదేమీ లేదు.. మీరిద్దరూ కలిసి అప్పటికి యాంకరింగ్ చేయలేదు కాబట్టి కలిపి చేయిస్తే కొత్తదనం ఉంటుందని సెలక్ట్ చేసుకున్నానంతే!’ చెప్పాడు సాయివంశీ. ‘ఏమైతేనేం ఆ షో చేస్తున్నప్పుడే మీరిద్దరూ ఓ ఇంటివారయ్యారు కదా...!’ అన్నాడు కోటి. ‘అదొక్కటే కాదు సార్.. బిజీగా ఉన్న మా ఇద్దరికీ కలసి కొంత టైమ్ స్పెండ్ చేసే చాన్సూ ఇచ్చింది. అందరూ చూస్తారనే భయంతో అసలు బయట కలుసుకోలేకపోయేవాళ్లం. ఆ మిస్సింగ్ ఈ షోతో తీరిపోయింద’ని చెప్పింది భార్గవి! ఫ్యామిలీ షోలు ఈ షోలు పార్టిసిపెంట్లు.. జడ్జీలు.. యాంకర్స్ మధ్య అనుబంధాలనే కాదు కూడా వచ్చిన పెద్దలనూ ఒక్కటి చేస్తున్నాయి. రెండురోజుల షూట్ కోసం జరిగే పదిరోజుల రిహార్సల్స్ కూడా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కొత్త స్నేహాలను చిగురింపచేస్తున్నాయి. ఈ మాట నిజమే అనిపిస్తుంది సాయివంశీ చెప్పింది వింటే... ‘ఆఫ్ సెట్స్ రిలేషన్స్ చూస్తే రియాలిటీ షోను ఓ ఫ్యామిలీ షో అనుకుంటారు. ఈ పిల్లల పేరెంట్స్ మధ్య ఫ్రెండ్షిప్ డెవలప్ అవడం నాకెంత ఆశ్చర్యమో అంతకు మించిన ఆనందం! పిల్లల మధ్య పోటీ స్టేజ్ మీదే.. మా పిల్లలే గెలవాలన్న కాంక్ష పేరెంట్స్లో ఆ కొద్దిసేపే! సెట్స్: దిగారంటే చాలు అందరూ కలిసిపోతారు.. ఎవరు గెలిచినా అందరూ సంతోషిస్తారు. వండర్ఫుల్ మూమెంట్స్! ఒక్క షో ఎంతమందిని అసలైన స్నేహితులుగా మారుస్తోంది! రియల్లీ గ్రేట్!’ ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ ఇవి రియాలిటీ షోల్లోని రియల్ అనుభూతులు.. మంచి జ్ఞాపకాలు! కాలం మారుతుంది.. కొత్తద్వారాలు తెరుచుకుంటాయి.. అదే స్నేహం ఇంకాస్త కొత్తగా ఆయువు నింపుకుంటుంది! - సరస్వతి రమ -
'వి.వి.పి ప్రధాన కార్యాలయం మాకే చెందాలి'
వైద్య విధాన పరిషత్ ప్రధాన కార్యాలయాన్ని ఆంధప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడంపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అందులోభాగంగా శనివారం కోటిలోని ప్రధాన కార్యాలయం ఎదటు తెలంగాణ ఉద్యోగులు బైఠాయించారు. ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్య విధాన పరిషత్ ప్రధాన కార్యాలయాన్ని తమకు కేటాయించాలని డిమాండ్ చేశారు. జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డే. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందాల్సిన ఆస్తులను ఉన్నతాధికారులు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు కేటాయించిన సంగతి తెలిసిందే. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - కోటి
-
ఓరి దేవుడో మూవీ స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్
-
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : ఇద్దరు: మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై ॥ మంచు తెర లే తెరుచుకుని మంచి తరుణం తెలుసుకుని నవ్వులే పువ్వులై విరియగా... ఓ... ॥ చరణం : 1 ఆమె: నాలో కులుకులు కులుకులు రేపే లోలో తెలియని తలపులు రేపే పిలిచే వలపుల వెలుగును చూపి లాగే రాగమిది అతడు: నీలో మమతల మధువుని చూసి నాలో తరగని తహతహ దూకి నీకై తరగల పరుగులు తీసి చేరే వేగమిది ఆ: ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా అ: ఏడేడు జన్మాల బంధాలతో ఈనాడు నీ ఈడు పండించనా ఆ: మరి తయ్యారయ్యి ఉన్న వయ్యారంగా సయ్యంటు ఒళ్లోకి వాలంగా అ: దూసుకొచ్చానమ్మ చూడు ఉత్సాహంగ చిన్నారి వన్నెల్ని ఏలంగా ఆ: ప్రతిక్షణం పరవశం కలగగా ఓ...॥ చరణం : 2 అ: ఆడే మెరుపుల మెలికల జాణ పాడే జిలిబిలి పలుకుల మైనా రాణి తొలకరి చినుకులలోన తుళ్లే థిల్లానా ఆ: రేగే తనువుల తపనలపైన వాలే చినుకుల చమటల వాన మీటే చిలిపిగ నరముల వీణ తియ్యని తాళాన అ: బంగారు శృంగార భావాలతో పొంగారు ప్రాయాన్ని కీర్తించనా ఆ: అందాల మందార హారాలతో నీ గుండె రాజ్యాన్ని పాలించనా అ: ఇక వెయ్యేళ్లైన నిన్ను విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా ఆ: నువ్వు వెళ్లాలన్న ఇంక వీల్లేదంటూ స్నేహాల సంకెళ్లు కట్టేయనా అ: కాలమే కదలక నిలువగా... ఓ... ॥ చిత్రం : శుభాకాంక్షలు (1997), రచన : సిరివెన్నెల సంగీతం : కోటి, గానం : బాలు, చిత్ర, బృందం -
కొత్త దనాన్ని ఆశిస్తున్నారు
- సంగీత దర్శకుడు కోటి ప్రస్తుతం సంగీత ప్రియులు కొత్తదనాన్ని ఆశిస్తున్నారని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి అన్నారు. పాత తరం సంగీతాన్ని నేటికీ మరచిపోలేకున్నారన్నారు. ఓజిలి సమీపంలో తన మామిడి తోటలో సోమవారం ‘న్యూస్లైన్’తో తన అభిప్రాయాలను కోటి పంచుకున్నారు. - న్యూస్లైన్, ఓజిలి న్యూస్లైన్: ఎన్ని సినిమాలకు సంగీతం అందించారు? కోటి: 1983లో తెలుగుచిత్రసీమకు పరిచయం అయ్యా. ప్రళయ గర్జన చిత్రం రాజ్తో కలసి తెలుగులో తొలి సినిమా చేశా. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 475కు పైగా చిత్రాలకు సంగీతం అందించా. న్యూస్లైన్: రాజ్తో కలసి భవిష్యత్తులో సినిమాలు చేస్తారా? కోటి: పదేళ్ల పాటు రాజ్తో కలసి సినిమాలు చేశా. కొత్తగా ఫీల్డ్కు పరిచమైనప్పుడు సంగీతంలో నూతన ట్రెండ్ను తీసుకొచ్చా. పదేళ్ల అనంతరం రాజ్, నేను ఫ్రెండ్లీగా 1993లో విడిపోయాం. (రాజ్తో కలసి పనిచేయడంపై సున్నితంగా తిరస్కరించారు.) న్యూస్లైన్: అత్యంత ప్రజాదరణ తెచ్చిన చిత్రాలేవీ? కోటి: పెదరాయుడు, నువ్వేకావాలి, యముడికి మొగుడు, అరుంధతి, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. న్యూస్లైన్: ఖైదీ నం 786 వంటి చిత్రాలిచ్చిన సంగీతం ప్రస్తుతం రాకపోవడానికి కారణం? కోటి: కాలాన్ని బట్టి సంగీతం మారిపోతుంది. అప్పట్లో ఖైదీనంబర్ 786 సినిమాలోని గువ్వా గోరింక పాట సినిమా ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. యువత కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే సంగీతం అందిస్తున్నా. -
గీత స్మరణం
నేడు కె.జె.ఏసుదాస్ పుట్టినరోజు పల్లవి : నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా (2) చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా మార్గం చూపే దీపం కాదా ధైర్యం ॥ చరణం : 1 జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం దేహానికైనా గాయం ఈ మందుతోను మాయం విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం స్త్రీల తనువులోనే శీలమున్నదంటే పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే ఇల్లాళ్ల దేహాలలో శీలమే ఉండదనా భర్తన్న వాడెవ్వడూ పురుషుడే కాదు అనా శీలం అంటే గుణం అనే అర్థం ॥ చరణం : 2 గురివింద ఈ సమాజం పరనింద దాని నైజం తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం తన కళ్ల ముందు ఘోరం కాదనదు పిరికి లోకం అన్యాయమన్న నీపై మోపింది పాప భారం పడతి పరువు కాచే చేవలేని సంఘం సిగ్గు పడకపోగా నవ్వుతోంది చిత్రం ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్లది అంతేగాని నీలో లేదే దోషం ॥ చిత్రం : పెళ్లి చేసుకుందాం (1997), రచన : సిరివెన్నెల సంగీతం : కోటి. గానం : కె.జె.ఏసుదాస్ -
గీత స్మరణం
పల్లవి : అతడు: అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది ఓ ముద్దమందారంలా ముస్తాబయ్యింది ఆమె: వైశాఖమొచ్చేసింది ఇవ్వాళో రేపో అంది ఓ మంచి ముహూర్తం చూసి సిద్ధం కమ్మంది అ: ఓ ఓ ఓ... ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపుకథలో ఆ: మనువే కుదిరి కునుకే చెదిరి మురిపెం ముదిరి నా మనసు నిలవనంది కొమ్మల్లో చిలక మోమాటం పడక వచ్చి వాలమ్మా ॥ చరణం : 1 అ: ఈ గాలి రోజూలా వీస్తున్నా ఈవేళ వేరేలే వింటున్నా సన్నాయి రాగాలుగా ఆ: నావైపు రోజూలా చూస్తున్నా ఈనాడే ఏదోలా ఔతున్నా నీ కన్ను ఏమన్నదో... నా ఈడు ఏం విన్నదో అ: ఆశపెట్టి పెట్టి పెట్టి చంపొద్దమ్మా ఇట్టా ఆ: నువ్వు పట్టి పట్టి పట్టి చూస్తూవుంటే ఎట్టా అ: ఎన్నెన్నో అనిపించి ఉక్కిరిబిక్కిరి ఔతున్నా ॥॥ చరణం : 2 ఆ: ముత్యాల మేనాలే రప్పించి మేఘాల వీధుల్లో తిప్పించి ఊరేగనీ హాయిగా అ: అందాల హద్దుల్నే తప్పించి వందేళ్ల కౌగిళ్లే అందించి ఊరించు ఆ వేడుక... ఓ... ఊహించ నీ నన్నిలా ఆ: ఏంటి గిచ్చి గిచ్చి రెచ్చగొట్టేలా నువ్వు అ: ఇంత పిచ్చి పిచ్చి పిచ్చి పెంచేస్తోందే నువ్వు హోయ్ ఆ: కవ్వించి కరిగించి కరిగే వయసును కాపాడు ఆ: కొమ్మల్లో చిలక మోమాటం పడకా వచ్చి వాలమ్మా ॥ చిత్రం : నువ్వే నువ్వే (2002), రచన : సిరివెన్నెల సంగీతం : కోటి, గానం : రాజేష్, కౌసల్య నేడు తరుణ్ బర్త్డే నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : ఆమె: ఏదో మనసు పడ్డానుగానీ కల్లో కలుసుకున్నాను గానీ నీపై ప్రేమా ఏమో నాలో ఏదో మనసు పడ్డానుగానీ ఎంతో అలుసు అయ్యాను గానీ నాపై ప్రేమో ఏమో బోలో రావా పడుచు మది తెలుసుకొనలేవా... తలపునపడు తనువు ముడి మనువై మమతై మనదైపోయె అనురాగాలు కలనే ॥మనసు॥ చరణం : 1 అతడు: ఒక హృదయం పలికినది జతకోరే జతులు శ్రుతులు కలిపి ఒక పరువం పిలిచినది ప్రేమించి... ఒక అందం మెరిసినది ఎదలోనే చిలిపి వలపు చిలికి ఒక బంధం బిగిసినది వేధించి... ఆ: తె లుసా తేటిమనసా పూలవయసేమంటుందో తెలిసి చంటి మనసే కంటి నలుసై పోతుందో అ: ఓ భామా రమ్మంటే నీ ప్రేమా బాధే సరి మెడ ఉరి గడుసరి సరిసరిలే ॥మనసు॥ చరణం : 2 అ: ఒక మురిపెం ముదిరినది మొగమాటం మరిచి ఎదుట నిలిచి ఒక అధరం వణికినది ఆశించి ఒక మౌనం తెలిసినది నిదురించి కలలు కనుల నిలిపి ఒక రూపం అలిగినది వాదించి ఆ: బహుశా బావ సరసాలన్నీ విర సాలాయెనేమో ఇక సాగించు జతసాగించు మనసే ఉన్నదేమో అ: ఓ పాపా నిందిస్తే నా పాపం నాదేమరి విధిమరి విషమని మరి తెలిసే ॥మనసు॥ చిత్రం : అమ్మదొంగా (1995) రచన : వేటూరి సంగీతం : కోటి గానం : మనో, కె.ఎస్.చిత్ర, శైలజ నిర్వహణ: నాగేశ్