హైదరాబాద్ : ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ అధికారి విజయ్ కుమార్ అక్రమ ఆస్తులను కలిగి ఉన్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.12 కోట్ల విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. అలకాపురి, నల్లకుంటలో రెండు ఇళ్లు, కావూరి హిల్స్లో రెండు ఫ్లాట్లు, ఆదిభట్లలో మరో మూడు ఫ్లాట్లు, ఓఆర్ఆర్ సమీపంలో 5 ఎకరాల వ్యవసాయ భూమి, 6లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దాడులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.