సీబీఐ విచారణకు ఆదేశించాలి | Botsa Satyanarayana demands CBI investigation on Visakha land scam | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణకు ఆదేశించాలి

Published Tue, Jun 20 2017 1:19 AM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM

సీబీఐ విచారణకు ఆదేశించాలి - Sakshi

సీబీఐ విచారణకు ఆదేశించాలి

చంద్రబాబుకు బొత్స డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌ : విశాఖపట్టణం భూ కుంభకోణంపై సిట్‌ దర్యాప్తును ఆదేశించిన తీరు చూస్తూంటే దొంగ చేతికే తాళాలు ఇచ్చి నట్లుగా ఉందని ఈ భారీ కుంభకోణంలో సిట్‌ విచారణతో ప్రయోజనం ఏ మాత్రం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. కచ్చితంగా ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని, ఇందులో సూత్రధారులు, పాత్రధారుల బండారం బయట పడుతుందని ఆయన అన్నారు.

సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కుంభకోణాన్ని ఓవైపు తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నం చేస్తూనే మరో వైపు సిట్‌ వేయడం చూస్తూంటే ఈ అంశంపై ప్రజలతో పాటు మంత్రులు, టీడీపీ భాగస్వామి అయిన బీజేపీ నేతల్లో కూడా అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement