ఎయిర్పోర్ట్లో బుల్లెట్ కలకలం
Published Thu, Jul 21 2016 2:10 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
శంషాబాద్: శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఓ ప్రయాణికుడి దగ్గర బుల్లెట్ కనిపించడం కలకలం రేగింది. నాగాలాండ్ నుంచి వచ్చిన విద్యార్థిని భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా బుల్లెట్ లభించింది. దీంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ప్రయాణికుడి వివరాలు, ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement