passenger
-
అమెరికాలో మరో విమానం ఆచూకీ గల్లంతు
వాషింగ్టన్ : అమెరికాలో మరో విమానం గల్లంతయ్యింది. 10 మంది ప్రయాణికులతో సెస్నా 208బీ విమానం అలస్కా మీదిగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో రాడార్ నుంచి జాడ అదృశ్యమైనట్లు సమాచారం. విమాన అదృశ్యంపై సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4 గంటలకు సెస్నా 208బీ విమానం ఉనల్కలేట్ నుంచి నోమ్కు వెళుతుంది. ఆ సమయంలో రాడార్ నుంచి విమానం జాడ అదృశ్యమైంది. విమాన అదృశ్యంపై సమాచారం అదుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. విమానం జాడ కోసం శోధించాయి. అయితే నార్టోన్ సౌండ్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన సహాయ బృందాలు అక్కడి చేరుకున్నాయి. ❗️Bering Air plane VANISHES over Alaska with ten people on board — rescue crews desperately hunt for missing aircraft#AlaskaRT pic.twitter.com/YosTNTRbrV— Moh Musthafa Hussain (@musthafaaa) February 7, 2025 -
‘ప్రయాణికులకు విజ్ఞప్తి.. రైలు నంబరు 13228.. 72 గంటలు లేటుగా ..’
భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్ను కలిగివున్నాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్ల సాయంతో తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అయితే పలుమార్లు రైళ్ల ఆలస్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పుడు మనం ఆలస్యంగా రావడంలో ప్రపంచ రికార్డు సృష్టించిన రైలు గురించి తెలుసుకుందాం.భారతీయ రైల్వేల(Indian Railways) ద్వారా దేశంలోని ఏ ప్రాంతానికైనా చేరుకోవచ్చు. రైల్వేలు నిరంతరం అభివృద్ధి, విస్తరణ దిశగా పయనిస్తున్నాయి. భారతీయ రైల్వే రోజుకు దాదాపు 13 వేల రైళ్లను నడుపుతోంది. భారతదేశంలో రైల్వే లైన్ల పొడవు 1,26,366 కిలోమీటర్లు. దీనిలో రన్నింగ్ ట్రాక్ పొడవు 99,235 కిలోమీటర్లు.యార్డులు, సైడింగ్లు వంటి వాటితో సహా మొత్తం మార్గం 1,26,366 కిలోమీటర్లు. భారతదేశంలో రైల్వే స్టేషన్ల సంఖ్య 8,800ను దాటింది. అయితే ఉత్తరప్రదేశ్లో రైలు నెట్వర్క్ పొడవు 9,077.45 కి.మీ.భారతదేశంలో రైళ్లు ఆలస్యంగా రావడమనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. శీతాకాలంలో చాలా రైళ్లు 5-6 గంటలు ఆలస్యంగా నడుస్తుంటాయి. అయితే గత కొన్ని సంవత్సరాల్లో పరిస్థితి మెరుగుపడింది. కానీ ఇప్పటికీ చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే భారతదేశ రైల్వే చరిత్రలో ఒక రైలు రికార్డు స్థాయి(Record level)లో లేటుగా వచ్చింది.మీడియా దగ్గరున్న వివరాల ప్రకారం ప్రకారం 2017లో కోట(రాజస్థాన్) - పట్నా(బీహార్) మధ్య నడుస్తున్న రైలు (13228) డౌన్ కోట-పట్నా ఎక్స్ప్రెస్ అత్యంత ఆలస్యంగా నడిచి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ రైలు ఏకంగా 72 గంటలకు పైగా ఆలస్యంగా నడిచింది. రైల్వే అధికారిక వెబ్సైట్ ప్రకారం దీనికిముందు అత్యంత ఆలస్యం(Very late)గా నడిచిన రైలు రికార్డు మహానంద ఎక్స్ప్రెస్ పేరిట ఉంది. డిసెంబర్ 2014లో మహానంద ఎక్స్ప్రెస్ మొఘల్సరాయ్-పట్నా సెక్షన్కు 71 గంటలు ఆలస్యంగా చేరుకుంది.ఇది కూడా చదవండి: మంచు దుప్పటిలో ఉత్తరాది.. 12 రాష్ట్రాలపై పొగమంచు దెబ్బ -
విమానంలోనూ వైఫై
దేశీయ ప్రయాణం కోసం విమానం ఎక్కుతున్నామంటే మన మొబైల్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాల్సిందే. నో సిగ్నల్స్.. నో ఇంటర్నెట్... సెల్ఫోన్ని మడిచి లోపల పెట్టుకోవాల్సిందే. ఇది ఒకప్పటి మాట. కానీ ఇకమీదట... విమానంలో ప్రయాణిస్తూ ఇంటర్నెట్ ద్వారా సినిమాలు చూడొచ్చు. మీ బంధువులు, స్నేహితులతో వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. ఆఫీస్ పని చేసుకోవచ్చు. ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఎయిర్ ఇండియా.దేశీయ విమాన ప్రయాణికులకు కొత్త ఏడాదిలో సరికొత్త కానుక అందిస్తోంది ఎయిర్ ఇండియా. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. తమ విమానాల్లో ప్రయాణించే దేశీయ ప్రయాణికులకు వైఫై ద్వారా జనవరి 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభ ఆఫర్లా ఈ సదుపాయాన్ని కొంతకాలం ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని సర్వీసులకే పరిమితమైన ఈ సౌకర్యం త్వరలో ఎయిర్ ఇండియాలోని అన్ని విమానాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తారట. ఒకరు ఒకే సమయంలో ఒకటికంటే ఎక్కువ ఫోన్లు, ల్యాప్టాప్ల వంటివాటితోనూ కనెక్ట్ కావొచ్చు. ఇప్పటికే ఎయిర్ఇండియా న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వెళ్లే విదేశీ విమానాల్లో పైలట్ ప్రోగ్రామ్గా ఈ సదుపాయం అందిస్తోంది.ఎయిర్ ఇండియా వైఫై ఇలా..ఈ సౌకర్యం వినియోగించుకోవాలంటే ప్రయాణికులు వైఫై ఆన్ చేసి, సెటింగ్స్లో ‘ఎయిర్ ఇండియా వైఫై నెట్వర్క్’ ఎంపిక చేసుకోవాలి. ఎయిర్ ఇండియా పోర్టల్కు వెళ్లాక పీఎన్ఆర్ వంటి వివరాలు ఇవ్వాలి. ఆ తరవాత ఇంటర్నెట్ సేవలు వాడుకోవచ్చు.ఏయే విమానాల్లో..?అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్బస్ ఎ350, బోయింగ్ 787–9, ఎంపికచేసిన ఎ321 నియో నియో విమానాలువిమానంలో నెట్ ఎలా?భూమ్మీద నెట్ వాడాలంటే మన చేతిలో ఒక ఫోనో ల్యాప్టాపో ఉండి.. సమీపంలో సెల్ టవర్ ఉంటే సరిపోతుంది. కానీ విమానం అలా కాదు కదా. విమానాల్లో వైఫై ద్వారా ఇంటర్నెట్ రావాలంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. మొదటిది.. భూమిపై ఉండే సెల్ టవర్లు. దీన్నే ఎయిర్ టు గ్రౌండ్ (ఏటీజీ) టెక్నాలజీ అంటారు. ఇక రెండోది శాటిలైట్ ఆధారిత కనెక్షన్. ఈ రెండూ పనిచేయాలంటే విమానం లోపలా, బయటా ప్రత్యేక యాంటెనాల వంటి కొన్ని పరికరాలు అమర్చాలి. వైఫై లేనప్పుడు మన సమీపంలో ఎవరికైనా నెట్ కావాలంటే ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో హాట్స్పాట్ ఆప్షన్ ఆన్ చేసి నెట్ ఇస్తాం. మన ఫోన్ మరొకరికి హాట్ స్పాట్లా ఎలా మారుతుందో.. యాంటెనాలూ, సర్వర్లు, రౌటర్ల వంటి వాటితో ఉన్న విమానం వందలాది మంది ప్రయాణికులకు ఒక హాట్ స్పాట్లా మారిపోతుంది.సెల్ టవర్ సిగ్నల్స్ఈ సిగ్నళ్లు అందుకోడానికి విమానం కింది లేదా అడుగు భాగంలో యాంటెనాలు ఏర్పాటు చేస్తారు. విమానం భూమి మీద బయలుదేరగానే ఆ యాంటెనాలు.. సమీపంలోని సెల్ టవర్ల నుంచి సిగ్నళ్లు అందుకుంటాయి. ఆ సిగ్నళ్లు క్యాబిన్ సర్వర్కు, అక్కడి నుంచి రౌటర్కు వెళ్తాయి. అక్కడి నుంచి ప్రయాణికులకు వెళ్లి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాయి.శాటిలైట్ సిగ్నల్స్సెల్ టవర్ల ద్వారా సిగ్నల్ అందు తున్నంతసేపూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సముద్రాలు, ఎడారి ప్రాంతాల వంటి వాటి పైనుంచి వెళ్లేటప్పుడు సెల్ టవర్ సిగ్నళ్లు అందవు. శాటిలైట్ సిగ్నళ్ల సాయం కావాల్సిందే. ఇందుకోసం విమానం పై భాగంలో యాంటెనా లు ఏర్పాటుచేస్తారు. అవి తమకు అత్యంత సమీపంలోని శాటిలైట్తో అనుసంధానమవుతాయి. ప్రయాణికుల ఫోన్లు, ల్యాప్టాపుల వంటివి విమాన క్యాబిన్లో ఉండే వైఫై యాంటెనాకు కనెక్ట్ అవుతాయి.ఆ పరికరాల నుంచి ఈ యాంటెనాలకు వచ్చే సిగ్నళ్లు విమానంలోని సర్వర్కు వెళ్తాయి. విమానం పైన ఉండే యాంటెనా ద్వారా ఆ సిగ్నళ్లు శాటిలైట్కు వెళతాయి. శాటిలైట్ వాటిని భూమిపై ఉండే స్టేషన్ లేదా టెలిపోర్టుకు పంపితే అక్కడి నుంచి తిరిగి సిగ్నళ్లు శాటిలైట్కు అందుతాయి. వాటిని విమానానికి పంపుతుంది శాటిలైట్. శాటిలైట్ సిగ్నళ్లు విమానంలోకి క్యాబిన్ సర్వర్కు, అక్కడి నుంచి రౌటర్కు వెళ్తాయి. అలా ప్రయాణికులు నెట్ వాడుకోవచ్చు.ఏటీజీ – శాటిలైట్ఏటీజీ ద్వారా ఇంటర్నెట్ అంటే చాలా పరిమితులు ఉంటాయి. అంతరాయాలు ఎక్కువ, స్పీడు కూడా తక్కువ ఉండొచ్చు. కానీ, శాటిలైట్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్లో అంతరాయాలు తక్కువని, స్పీడు కూడా ఎక్కువని అంతర్జాతీయ విదేశీ ప్రయాణికుల అనుభవాలు చెప్తున్నాయి.2003లో మొదటిసారిగా...⇒ 2003 జనవరి 15న జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ మొట్టమొదటగా తమ అంతర్జాతీయ విమానంలో ప్రయాణికులకు ఇంటర్నెట్ అందించింది.⇒ దేశీయ విమాన ప్రయాణికులకు (2013లో) ఇంటర్నెట్ అందించిన మొదటి సంస్థ అమెరికాకు చెందిన జెట్ బ్లూ.⇒ ప్రపంచంలో ప్రస్తుతంవైఫై ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్న కొన్ని విమానయాన సంస్థలు నార్వేజియన్ ఎయిర్లైన్స్, ఫిలిప్పీన్స్ ఎయిర్లైన్స్, ఫిజి ఎయిర్వేస్, జెట్ బ్లూ, ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్లైన్స్, ఖతార్ ఎయిర్వేస్, డెల్టా ఎయిర్వేస్, మొదలైనవి.‘ప్రయాణాల్లో ఇప్పుడు ‘కనెక్టివిటీ’ తప్పనిసరి అవసరమైపోయింది. కొంతమంది సరదాకోసం, షేరింగ్ కోసం ఇంటర్నెట్ వాడితే, మరికొందరు తమ వృత్తి, వ్యాపార అవసరాల కోసం వాడుతుంటారు. ఎయిర్ ఇండియా ఈ సదుపాయం తీసుకొచ్చి విమానాల్లో సరికొత్త ప్రయాణ అనుభూతి అందిస్తోంది. – ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అధికారి రాజేష్ డోగ్రా -
నీళ్లు పోసి నిద్ర లేపుతున్నారు..
-
Year Ender 2024: 999 బెదిరింపులు.. రెండు కంపెనీల మూసివేత.. ఎయిర్లైన్స్ పరిణామాలు
దేశంలోని విమానయాన రంగానికి 2024 మిశ్రమంగా గడిచింది. ఈ సంవత్సరం రెండు విమానయాన సంస్థలు మూసివేతకు గురయ్యాయి. ఒక విమానయాన సంస్థ దివాలా ప్రక్రియకు దారితీసింది. ఈ ఏడాది దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య రెండుసార్లు రికార్డు స్థాయిలో ఐదు లక్షలను అధిగమించింది.దేశంలో దీపావళి, ఛత్ సందర్భంగా విమానయాన టిక్కెట్ల ఛార్జీల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది నవంబర్ 14 వరకు విమానయాన సంస్థలకు మొత్తం 999 సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. విచారణలో అవి ఫేక్ అని తేలింది. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 వద్ద పైకప్పు కూలిపోయిన దుర్ఘటనలో ఒకరు మృతిచెందారు.2025లో చోటుచేసుకోబోయే మార్పులివే..శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ విమానయాన రంగం 2025లో పెను మార్పులను చూడబోతోంది. భారీ విలీనాలతో పాటు, విమానాల సంఖ్య మరింతగా పెరగనుంది. ఇంతేకాకుండా పలు కొత్త ఎయిర్లైన్స్లు ప్రారంభం కానున్నాయి. మార్చి 2025తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ట్రాఫిక్ 164 నుంచి 170 మిలియన్లకు పెరుగుతుందనే అంచనాలున్నాయి. వైడ్-బాడీ ఎయిర్క్రాఫ్ట్లను పెంచడం, ఎక్కువ సంఖ్యలో ప్రత్యక్ష విదేశీ విమాన లింక్లను ఏర్పాటు చేయడం, దేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్గా మార్చడంపై పరిశ్రమ దృష్టి కేంద్రీకృతమై ఉంది.ఇటీవల అకాసా ఎయిర్ హెడ్ వినయ్ దూబే మాట్లాడుతూ భారతీయ విమానయాన మార్కెట్కు అవకాశాలు అపరిమితంగా ఉన్నాయన్నారు. కాగా ఇండియన్ ఎయిర్లైన్స్ 60కి పైగా వైడ్ బాడీ ఎయిర్క్రాఫ్ట్లతో సహా 800 విమానాల సముదాయాన్ని కలిగి ఉంది. 157 విమానాశ్రయాలకు సేవలు అందిస్తోంది. సింగపూర్ ఎయిర్లైన్స్ భాగస్వామ్యమైన విస్తారాతో ఎయిర్ ఇండియా తన విలీనాన్ని ఇటీవలే పూర్తి చేసింది. ఎయిరిండియా ఫ్లైట్ రిటర్న్ ప్రోగ్రామ్ పేరును 'మహారాజా క్లబ్'గా మార్చాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. అలాగే ఎయిర్ ఇండియా మరో 100 ఎయిర్బస్ విమానాల కొనుగోలుకు ఆర్డర్ చేసింది. వీటిలో10 వైడ్-బాడీ ఏ350, 90 నారో బాడీ ఏ320 విమానాలున్నాయి.ఇది కూడా చదవండి: Kisan Diwas 2024: ఈ పథకాల వినియోగంతో రైతే రాజు -
శంషాబాద్.. షంషేర్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీకి సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ (ఆర్జీఐ) అగ్రగామిగా నిలిచింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజా డేటా వెల్లడించిన విశేషాలివే...మన తర్వాతే బెంగళూరుమునుపటి ఏడాదితో పోలిస్తే గత ఏప్రిల్–సెప్టెంబర్లో భారతదేశంలోని మొదటి ఐదు మెట్రోలలో ప్రయాణికుల రద్దీ పెరుగుదలలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అత్యధిక వృద్ధిని సాధించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మన ఎయిర్పోర్ట్లో 11.7 శాతం పెరుగుదల నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న బెంగళూరు (10.1), కోల్కతా (9.4), ఢిల్లీ (7.4), ముంబై (5.4), చెన్నై 3.3 శాతం రద్దీని పెంచుకున్నాయి. దేశ విదేశీ ప్రయాణికుల రద్దీతో...ప్రస్తుతం 72 దేశీయ, 18 అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతున్న శంషాబాద్ విమానాశ్రయం అమెరికా, యూకేలకు దాదాపు 20 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తోంది. గత అక్టోబర్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు 25 లక్షల మంది ప్రయాణికుల తాకిడి చవిచూసింది..ఆ నెలలో రద్దీ 22 శాతం పెరిగింది. దేశీయ అంతర్జాతీయ ప్రయాణాల్లోనూ ఈ వృద్ధి కనిపించింది. దేశీయ ప్రయాణికుల రద్దీ సంవత్సరానికి 22.7 శాతం, అంతర్జాతీయ ట్రాఫిక్ 16.3 శాతం వరకూ పెరిగింది. ఒక్కరోజే...87 వేలతో రికార్డుగత అక్టోబర్ 14న ఒక్కరోజే 87,000 మంది ప్రయాణికుల రాకతో శంషాబాద్ విమానాశ్రయం సరికొత్త రికార్డు సృష్టించింది. అదే నెలలో 17,553 విమానాల రాకపోకలు జరిగాయి. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 19 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. గత 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ 80 లక్షలు ఉండగా 2024లో 2.5 కోట్లకు నాలుగు రెట్లు పెరిగింది అంటే.. ఈ వృద్ధి రేటు 45 శాతం కావడం విశేషం. -
గగనతలంలో 17 కోట్ల మంది!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 16.4–17 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. 2023–24తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో దేశీయంగా 7.93 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించారు. 2023–24 ఏప్రిల్–సెప్టెంబర్తో పోలిస్తే 5.3 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. తీవ్రమైన వేడి గాలులు, ఇతర వాతావరణ సంబంధిత అంతరాయాలతో 2024 ఏప్రిల్–సెప్టెంబర్ కాలం పాక్షికంగా ప్రభావితమైంది. భారతీయ విమానయాన సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 16.2 శాతంగా ఉందని ఇక్రా వివరించింది. ద్వితీయార్థం పుంజుకోవచ్చు..గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య విమానయాన సంస్థల ఆదాయాలు క్షీణించాయి. విమానాలు నిలిచిపోవడం, అధిక ఇంధన ధరలు ఇందుకు కారణం. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం ప్రయాణికుల సంఖ్య పెరిగి ఆదాయాలు పుంజుకోవచ్చని అంచనా. ఎయిర్లైన్స్ వ్యయాల నిర్మాణం సాధారణంగా రెండు కీలక భాగాలైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు, రూపాయి మారకం కదలిక ఆధారంగా ఉంటుంది. గతేడాదితో పోలిస్తే 2024–25 మొదటి ఎనిమిది నెలల్లో సగటు ఏటీఎఫ్ ధరలు 6.8 శాతం తగ్గి కిలోలీటరుకు రూ.96,192కు చేరుకున్నాయి. అయితే కొవిడ్కు ముందు కాలం 2019–20 మొదటి ఎనిమిది నెలల్లో ఇది రూ.65,261 నమోదైందని ఇక్రా వివరించింది. విదేశీ కరెన్సీలో చెల్లింపులు..మొత్తం వ్యయాల్లో ఇంధన ఖర్చులు దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ఉంటాయి. నిర్వహణ వ్యయాలు 35–50 శాతంగా ఉన్నాయి. విమానాల లీజు చెల్లింపులు, ఇంధన ఖర్చులు, విమానాలు, ఇంజన్ నిర్వహణ వ్యయాలు డాలర్ పరంగా నిర్ణయించబడతాయి. కొన్ని విమానయాన సంస్థలు విదేశీ కరెన్సీ రుణాన్ని కలిగి ఉన్నాయి. దేశీయ విమానయాన సంస్థలు కూడా తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనుగుణంగా ద్వారా వచ్చే ఆదాయాలపై విదేశీ కరెన్సీలో నికర చెల్లింపులు చేయాల్సి ఉందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.ఇదీ చదవండి: యాపిల్లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!గత నష్టాల కంటే తక్కువగా..దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్లో నిరంతర వృద్ధి మధ్య భారతీయ విమానయాన పరిశ్రమపై ‘స్థిర(స్టేబుల్)’ రేటింగ్ను ఇక్రా కొనసాగించింది. 2024–25లో విమానయాన పరిశ్రమ నష్టం రూ.2,000–రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని చెబుతోంది. పరిశ్రమ 2025–26లో ఇదే స్థాయిలో నష్టాన్ని నివేదించవచ్చని అంచనా వేస్తున్నట్లు ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కో–గ్రూప్ హెడ్ కింజాల్ షా తెలిపారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ‘రాక్షసుడు’
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు భోలో కరమ్వీర్ జాట్ అలియాస్ రాహుల్..స్వస్థలం హర్యానాలోని రోహ్తక్లో ఉన్న మోక్రా ఖాస్...గతంలో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ల్లో నేరాలు చేశాడు. ఇటీవల ‘రైల్వే’ కిల్లర్గా మారాడు. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి ఆదివారం (ఈ నెల 24) మధ్య 35 రోజుల్లో ఎక్స్ప్రెస్ రైళ్లల్లో సంచరిస్తూ ఐదు రాష్ట్రాల్లో ఐదు మర్డర్లు చేశాడు. వీటిలో కొన్ని సొత్తు కోసమైతే..మరికొన్ని అత్యాచారం, హత్యలు. గుజరాత్లోని వల్సాద్ పోలీసులు ఈ నరహంతకుడిని సోమవారం పట్టుకున్నారు. విచారణలో ఆఖరి ఘాతుకాన్ని ఆదివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులకు వల్సాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో పీటీ వారెంట్పై కరమ్వీర్ను నగరానికి తీసుకురావడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. వల్సాద్ ఎస్పీ డాక్టర్ కరణ్రాజ్ సింగ్ వాఘేలాను మంగళవారం ‘సాక్షి’ ఫోన్ ద్వారా సంప్రదించింది. ఆయన ఈ సీరియల్ కిల్లర్ పూర్వాపరాలు వెల్లడించారు.చిన్ననాటి నుంచి చిత్రమైన ప్రవర్తన..హర్యానాలోని వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాహుల్కు ఎడమ కాలికి పోలియో సోకింది. ఫలితంగా చిన్నతనం నుంచి ఆటపాటలకు దూరంగా ఉంటూ ఒంటరిగా ఉండేవాడు. విపరీతమైన భావాలు, చిత్రమైన ప్రవర్తన కలిగి ఉండేవాడటంతో కుటుంబం దూరంగా పెట్టింది. ఐదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పిన రాహుల్ లారీ క్లీనర్గా పని చేస్తూ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అయితే పోలియో కారణంగా ఇతడికి ఎవరూ డ్రైవర్గా ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో హైవే దాబాలో కారి్మకుడిగా మారిన రాహుల్... అక్కడ పార్క్ చేసి ఉన్న లారీలను తస్కరించడం మొదలెట్టాడు. దీంతో పాటు లూటీలు, కిడ్నాప్లకు పాల్పడ్డాడు. ఈ ఆరోపణలపై రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ల్లో 13 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే వరకు రాజస్థాన్లోని జోద్పూర్ జైల్లో గడిపిన రాహుల్ బెయిల్పై విడుదలయ్యాడు. అక్కడ నుంచి గుజరాత్లోని ఉద్వాడ పట్టణానికి చేరుకుని ఓ హోటల్లో కారి్మకుడిగా చేరాడు. కొన్ని రోజులు పని చేసి వాపి ప్రాంతానికి చేరుకుని ఫుట్పాత్స్ పైన గడిపాడు.ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని..వివిధ రైళ్లల్లో దివ్యాంగుల కోసం చివరలో ప్రత్యేక బోగీలు ఉంటాయి. వీటిలో ప్రయాణించే దివ్యాంగులను సాధారణంగా టీసీలు సైతం తనిఖీ చేయరు. పాసులు కలిగి ఉంటారనే ఉద్దేశంలోనే వదిలేస్తుంటారు. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న రాహుల్ ఎక్స్ప్రెస్ రైళ్లల్లోని దివ్యాంగుల బోగీల్లో ఎక్కి దేశం మొత్తం తిరగడం ప్రారంభించాడు. ఈ ఏడాది జూన్ రెండో వారం నుంచి ఇలా దేశ సంచారం చేస్తున్న రాహుల్ అక్టోబర్ 17న తొలి హత్య చేశాడు. ఆ రోజు బెంగళూరు–మురుదేశ్వర్ రైలులో ప్రయాణిస్తుండగా బీడీ కాల్చడంపై తోటి ప్రయాణికుడు అభ్యంతరం చెప్పాడు. దీంతో విచక్షణకోల్పోయిన రాహుల్ గొంతు నులిమి చంపేశాడు. ఆపై అతడి వద్ద ఉన్న సొత్తు, సొమ్ము తీసుకుని రైలు దిగిపోయాడు. దీనిపై మంగుళూరులో ఉన్న ముల్కీ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. వరుసపెట్టి మరో నాలుగు హత్యలు..ఆపై కతిహార్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన రాహుల్ పశ్చిమ బెంగాల్ లోని హౌరా స్టేషన్లో మరో వృద్ధుడి గొంతు కోసి చంపి దోపిడీకి పాల్పడ్డాడు. పుణే–కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో మరో మహిళపై అత్యాచారం చేసి, కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. వీటిపై ఆయా ఠాణాలో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 14న ఉద్వాడలో తాను పని చేసిన హోటల్కు వెళ్లి జీతం తీసుకోవాలని భావించాడు. అక్కడకు వచ్చిన రాహుల్కు స్టేషన్ ఫ్లాట్ఫామ్పై ఒంటరిగా సంచరిస్తున్న యువతి కనిపించింది. ఆమెను సమీపంలోని మామిడి తోటలోకి లాక్కెళ్లి, అత్యా చారం చేసి చంపేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న వల్సాద్ పోలీసులు ఘటనాస్థలిలో లభించిన బ్యాగ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వివిధ రైల్వేస్టేషన్లలోని 2500 సీసీ కెమెరాల్లో ఫీడ్ను అధ్యయనం చేసి నిందితుడిని గుర్తించారు. ఉద్వాడ నుంచి రైలులో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం చేరుకు న్న రాహుల్ అట్నుంచి షిర్డీ, ఆపై బాంద్రా చేరుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మహిళ హత్య..అక్కడ నుంచి సికింద్రాబాద్ వచ్చిన రాహుల్ ఆదివారం తెల్లవారుజామున రైలు దిగాడు. ఆ సమయంలో తొమ్మిదో నెంబర్ ప్లాట్ఫామ్పై మంగుళూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ ఆగి ఉంది. దాని సీట్ కమ్ లగేజ్ ర్యాక్ (ఎస్ఎల్ఆర్) కోచ్లో ఓ మహిళ ఒంటరిగా ఉండటం గమనించాడు. ఆమెను గొంతునులిమి చంపేసిన రాహుల్ నగదు, సెల్ఫోన్ తస్కరించాడు. అక్కడ నుంచి రైలులోనే ఉడాయించాడు. ఈ హత్యపై సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివిధ రైళ్లు మారిన రాహుల్ బాంద్రా–భుజ్ ఎక్స్ప్రెస్లో సోమవారం గుజరాత్లోని వాపి చేరుకున్నాడు. అప్పటికే ఇతడి కదలికలు సాంకేతికంగా గమనిస్తున్న వల్సాద్ పోలీసులు అక్కడ వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి సికింద్రాబాద్లో చంపిన మహిళ నుంచి తీసుకున్న సెల్ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. ఇతడి అరెస్టుపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
రైలులో పాము కాటు.. ప్రయాణికుల తొక్కిసలాట
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. రైలులోని జనరల్ కోచ్లో ఝాన్సీ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ యువకుడిని పాము కాటు వేసింది. దీంతో ప్రయాణికులంతా భయపడిపోయారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. గ్వాలియర్లో అధికారులు రైలును నిలిపివేసి, బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్కు చెందిన 30 ఏళ్ల భగవాన్దాస్ ఢిల్లీకి వెళ్లేందుకు ఖజురహో-ఝాన్సీ రైలులోని జనరల్ కోచ్లో ఎక్కాడు. బోగీలో జనం ఎక్కువగా ఉండడంతో డోర్ వెనకే నిలబడ్డాడు. రాత్రి 10 గంటల సమయంలో దబ్రా-గ్వాలియర్ మధ్య రైలు నడుస్తుండగా భగవాన్దాస్ను పాము కాటువేసింది. దీంతో అతను భయంతో కేకలు వేశాడు. అక్కడున్న ప్రయాణికులు అ పామును చూసి, హడలిపోయిన దూరంగా జరిగే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది.ఇంతలో ఒక ప్రయాణికుడు రైల్వే హెల్ప్లైన్ నంబర్ 139కి కాల్ చేసి, సంఘటన గురించి అధికారులకు తెలియజేశాడు. రైలు 10.30 గంటలకు గ్వాలియర్కు చేరుకోగానే, రైలు అధికారులు బాధితుడిని రైలు నుండి దింపి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రైల్వే పీఆర్ఓ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ నిజానికి రైలులో ఇటువంటి పాములు ఉండవని, వికృత చేష్టలకు పాల్పడే కొందరు ఇలాంటి పనికి పాల్పడి ఉంటారన్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ మార్క్.. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి కీలక పదవులు -
రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్లు కలకలం రేపాయి. విజయవాడకు చెందిన ఎం.సుబ్బరాజు అనే ప్రయాణికుడు వద్ద బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఎయిర్పోర్ట్లో నిర్వహించిన భద్రతా తనిఖీల్లో ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో లైసెన్సుడ్ గన్ బుల్లెట్లు తన వద్ద ఉండిపోయాయని చెప్పారు. ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకుని ప్రయాణికుడు సుబ్బరాజును కోరుకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. -
లోయలో పడిన బస్సు.. 36 మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అల్మోరాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బస్సు పౌరీ నుంచి రాంనగర్ వైపు వస్తుండగా ప్రమాదానికి గురైంది. నైనిటాల్ జిల్లా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఒక కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఒక చిన్న నది ప్రవహించడాన్ని వీడియోలో గమనించవచ్చు.ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సంఘటనా స్థలంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. जनपद अल्मोड़ा के मार्चुला में हुई दुर्भाग्यपूर्ण बस दुर्घटना में यात्रियों के हताहत होने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ। जिला प्रशासन को तेजी के साथ राहत एवं बचाव अभियान चलाने के निर्देश दिए हैं।घटनास्थल पर स्थानीय प्रशासन एवं SDRF की टीमें घायलों को निकालकर उपचार के लिए…— Pushkar Singh Dhami (@pushkardhami) November 4, 2024ఇది కూడా చదవండి: హిందూ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి -
తృటిలో తప్పిన రైలు ప్రమాదం
పూర్ణియా: బీహార్లోని పూర్నియా జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. రాణిపాత్ర రైల్వే స్టేషన్ సమీపంలో కతిహార్ నుండి జోగ్బానీకి వెళ్తున్న డీఎంయూ రైలులోని ఓ చక్రానికి ఒక రాడ్డు అడ్డుపడింది. పైలట్ సమయస్ఫూర్తితో రైలును ఆపివేయడంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే రాణిపాత్ర స్టేషన్ అధికారులు జీఆర్పీ ఫోర్స్ సాయంతో రైలు చక్రానికి అడ్డుపడిన రాడ్ను తొలగించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రైల్వే ట్రాక్పై రాడ్ వేస్తున్న దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, నిందితులను గుర్తించి, తదుపరి చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: వినబడదు.. మాటలు రావు.. అయినా అన్నింటిలోనూ ఫస్టే -
రైలు ప్రమాదం.. ఒకరు మృతి
కైరో: ఈజిప్ట్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలును వెనుక నుంచి మరో రైలు ఇంజన్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మృతిచెందాడు. 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. రైల్వే అధికారులు గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.ఈ ప్యాసింజర్ రైలు కైరోకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు ఇంజిన్ ఢీకొనడంతో పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో ప్యాసింజర్ రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అనంతరం రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.ఉత్తరాఫ్రికా దేశమైన ఈజిప్టులో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం. కైరోకు దక్షిణాన 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినాయా ప్రావిన్స్లో ఘోర రైలు ప్రమాదం సంభవించిందని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి -
మెట్రోలో నవరాత్రి సందడి
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మెట్రోలోనూ ఈ వేడుకల సందడి కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీ మెట్రోకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి గిటార్ వాయిస్తూ అమ్మవారి పాటలు పాడటం కనిపిస్తుంది. ఈ వీడియో క్యాప్షన్గా ‘జై మాతా ది’ అని రాశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు.ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి గిటార్ ప్లేచేస్తూ పాటలు పాడుతుండగా, అక్కడున్న ఇతర ప్రయాణికులు అతనితో కలిసి పాడటం కనిపిస్తుంది. మరికొందరు దానిని వీడియో తీస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన చాలా మంది.. గిటార్ వాయిస్తూ పాటలు పాడుతున్న వ్యక్తిని మెచ్చుకుంటున్నారు. फूहड़ रील वालों ने मेट्रो को दूषित कर दिया था और इन्होंने मेट्रो का शुद्धिकरण कर दिया😍जय माता शेरावाली🙏 pic.twitter.com/pjOULqMCSu— Vikash Mohta (@VikashMohta_IND) October 5, 2024ఇది కూడా చదవండి: దుర్గమాసుర సంహారం -
లోయలో పడిన బస్సు.. 30 మంది దుర్మరణం
పౌరీ: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 30 మంది వరకు మృతిచెందివుంటారని ప్రాథమిక సమాచారం.ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలో ఓ వివాహ వేడుక కోసం అతిథులతో వచ్చిన ఒక బస్సు హరిద్వార్ సమీపంలోని లాల్ ధంగ్ ప్రాంతం నుంచి పౌరీ జిల్లాలోని బిరోంఖల్ గ్రామానికి వెళ్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సు గమ్యస్థానానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘాట్ రోడ్డులో కొండ పైకి వెళుతుండగా, బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోయలో పడిపోయింది.ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 నుంచి 50 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరిలో 30 మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: హర్యానా ఓటింగ్ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్ -
ఎయిర్పోర్ట్లో భారీగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు స్వాధీనం..
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్పోర్టులో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు భారీగా పట్టుబడ్డాయి. ఇటీవలే యాపిల్ సంస్థ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అచితూ ఈ ఫోన్లను అక్రమంగా తీసుకెళ్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ తన వ్యానిటీ బ్యాగ్లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను టిష్యూ పేపర్లలో చుట్టి దాచిపెట్టిందని అధికారులు తెలిపారు. కాగా ఐఫోన్ సిరీస్లో.. 16 ప్రో మాక్స్ టాప్ మోడల్.ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. హాంగ్కాంగ్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఓ మహిళ 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను తీసుకొచ్చింది.ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ఆమెను పట్టుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి మరింత విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. స్మగ్లింగ్ చేసిన ఆ ఫోన్లు ఖరీదు సుమారు 37 లక్షలు ఉంటుందని అంచనా. -
అమెరికాలో బస్సు హైజాక్ కలకలం
వాషింగ్టన్ డీసీ : అమెరికాలో బస్ హైజాక్ కలకలం రేపుతోంది. అయితే ఆ బస్సులో హైజాకర్స్ ఎంత మంది ఉన్నారు. బందీలు ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.పలు అమెరికన్ మీడియా కథనాల ప్రకారం.. లాస్ ఏంజిల్స్లోని 6వ స్ట్రీట్, సౌత్ అలమెడా స్ట్రీట్ సమీపంలో నిందితులు బస్సును హైజాక్ చేశారని, ప్రయాణికుల్ని బంధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.హైజాక్పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీలను క్షణ్ణంగా పరిసీలించారు. బస్సుల్లో డ్రైవర్, ప్రయాణికులు, హైజాకర్స్ ఉన్నట్లు తేలింది. అయితే హైజాకర్స్ నుంచి డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతుండగా.. హైజాక్ గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు అధికారులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో సైతంఈ ఏడాది మార్చిలో సైతం లాస్ ఏంజెల్స్ డౌన్టౌన్లో బస్సును నిందితుడు బస్సును హైజాక్ చేశాడు. బస్సును తన ఆధీనంలోకి తీసుకున్న హైజాకర్ ఇతర వాహనాల్ని ఢీకొట్టి నానా హంగామా చేశాడు. ⚡️ Los Angeles Police engaged in a standoff with a hijacked bus, the driver and passengers are reportedly being held insideOnline images show that a SWAT team is at the sceneFollow us on Telegram https://t.co/8u9sqgdo0n pic.twitter.com/jQlQQbiDN6— RT (@RT_com) September 25, 2024 -
శంషాబాద్ ఎయిర్పోర్టులో విషాదం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో విషాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురై ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. ఎయిర్పోర్టులోనే ప్రయాణికులు కుప్పకూలారు. గోవా నుంచి వచ్చిన ప్రయాణికుడు నితిషా, జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికురాలు సకీనా అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరిని ఎయిర్పోర్టులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు.ఇదీ చదవండి: నాకే కెమెరా పెడతారా?.. మీడియాపై జానీ భార్య చిందులు -
తిరోగమనంలో విమానయానం
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం తర్వాత వేగంగా కోలుకున్న రాష్ట్ర విమానయాన రంగం తొలిసారిగా నేలచూపులు చూసింది. లాక్డౌన్ తర్వాత ప్రతీ నెలా క్రమంగా పెరుగుతూ వచి్చన ప్రయాణికుల సంఖ్య జూలై నెలలో తగ్గిపోయింది. తాజాగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ఒక్క విజయవాడ తప్ప రాష్ట్రంలోని మిగిలిన ఐదు విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్యలో భారీ క్షీణత నమోదయ్యింది. రాయలసీమ ప్రాంతంలో ఆ క్షీణత ఇంకా ఎక్కువగా ఉంది.తిరుపతి విమానాశ్రయంలో 4.4 శాతం తగ్గితే కర్నూలులో 63.5 శాతం, కడప విమానాశ్రయంలో 47.4 శాతం తగ్గింది. గతేడాది జూలై నెలలో కడప విమానాశ్రయం నుంచి 6,944 మంది ప్రయాణిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 3,650కు పడిపోయింది. అదే సమయంలో కర్నూలులో ప్రయాణికుల సంఖ్య 3,419 నుంచి 1,247కు పడిపోయింది. తిరుపతి విమానాశ్రయంలో కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గడం గమనార్హం. విశాఖపట్నంలో కూడా ప్రయాణికుల సంఖ్య 2,28,897 నుంచి 2,25,261కు తగ్గిపోయింది. కానీ ఒక్క విజయవాడలో 15.5 శాతం పెరిగింది.తగ్గించేస్తున్న సరీ్వసుల సంఖ్యప్రయాణికుల సంఖ్య తగ్గడంతో విమానయాన సంస్థలు తమ సరీ్వసులను తగ్గించేస్తున్నాయి. కర్నూలులో విమాన సరీ్వసులు 108 నుంచి 64కు తగ్గిపోయాయి. కడపలో 200 నుంచి 138కు రాజమండ్రిలో 748 నుంచి 694కు సరీ్వసులు తగ్గాయి. ఒక్క విజయవాడలో మాత్రం విమాన సర్వీసులు 1,272 నుంచి 1,553కు పెరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్థిక కార్యకలాపాలు తగ్గడంతో విమాన ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.ప్రభుత్వం రాజధాని అమరావతి అంటూ ఆ ఒక్క ప్రాంతానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో మిగిలిన ప్రాంతాల్లో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయని, దానికి నిదర్శనమే విశాఖతో సహా మిగిలిన విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణంగా నిపుణులు విశ్లేíÙస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన కె.రామ్మోహన్నాయుడు ఉన్నప్పటికీ విమాన సరీ్వసులు, ప్రయాణికుల సంఖ్య తగ్గుతున్నాయని, ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే త్వరలోనే కడప, కర్నూలు విమానాశ్రయాల్లో సేవలు నిలిచిపోయే ప్రమాదముందని ఆ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
Delhi: మెట్రో సరికొత్త రికార్డు.. ఒక్క రోజులో 77 లక్షల మంది ప్రయాణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తుంటారు. ఆగస్టు నెలలో ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అన్ని రికార్డులను అధిగమించింది. ముఖ్యంగా ఆగస్టు 20వ తేదీన ఒక్కరోజులో ఢిల్లీ మెట్రోలో 77,49,682 మంది ప్రయాణించారు. ఇది ఇప్పటి వరకు ఒక్కరోజులో అత్యధికంగా ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య.ఢిల్లీ మెట్రోలో ప్రతిరోజూ ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య సాధారణంగా 72 లక్షల నుంచి 78 లక్షల మధ్య ఉంటుంది. పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) శుక్ర, శనివారాల్లో అన్ని లైన్లలో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు మెట్రో అధికారులు తెలిపారు.డీఎంఆర్సీ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) అనూజ్ దయాల్ మీడియాతో మాట్లాడుతూ పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, డీఎంఆర్సీ అన్ని లైన్లలో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించిందన్నారు. మొత్తం 84 అదనపు ట్రిప్పులను శుక్రవారం, శనివారాల్లో నడపనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: Hindi Day: హిందీ అధికారిక భాష ఎలా అయ్యింది? -
Uttar Pradesh: నేడు వందేభారత్ రైలులో ఉచిత ప్రయాణం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీరట్-లక్నోల మధ్య నేటి నుంచి వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. మీరట్-లక్నో-మీరట్(22490/22491) వందే భారత్ ఎక్స్ప్రెస్ ఛార్జీలు, రాకపోకల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది.ఈరోజు (శనివారం) ఈ రైలు తొలిసారిగా పట్టాలు ఎక్కనుంది. నేడు అతిథి ప్రయాణికులకు రైల్వేశాఖ మీరట్-లక్నోల మధ్య ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. లక్నో-మీరట్(22491), మీరట్-లక్నో(22490) వందే భారత్ ఎక్స్ప్రెస్ల రెగ్యులర్ ఆపరేషన్ ఆదివారం నుండి ప్రారంభంకానుంది. శుక్రవారం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఈ రైలు అప్డేట్ అయిన తర్వాత టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు.బరేలీ జంక్షన్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ రైలు మీరట్-లక్నో మధ్య మొరాదాబాద్, బరేలీ జంక్షన్లలో మాత్రమే ఆగుతుంది. ఈ రైలుకు సంబంధించిన బుకింగ్ ప్రారంభమైన నేపధ్యంలో సెప్టెంబర్ 5 తర్వాత తేదీల ప్రయాణం కోసం సీట్లు వేగంగా బుక్ అవుతున్నాయి. ప్రస్తుతం బరేలీ జంక్షన్లో రైలుకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మీరట్-లక్నో వందే భారత్ మీరట్ నుండి ఉదయం 6:35 గంటలకు బయలుదేరి, 8:35 గంటలకు మొరాదాబాద్, 9:56 గంటలకు బరేలీ చేరుకుని మధ్యాహ్నం 1:45 గంటలకు లక్నో చేరుకుంటుంది. అలాగే లక్నో-మీరట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లక్నో నుండి మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:02 గంటలకు బరేలీకి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి రాత్రి 7:32 గంటలకు మొరాదాబాద్, రాత్రి 10 గంటలకు మీరట్ చేరుకుంటుంది. -
నేటి నుంచి ర్యాపిడ్ రైలు సేవల్లో మరో ముందడుగు
దేశంలో నేటి నుంచి ర్యాపిడ్ రైలు మరింత దూరం పరుగులు తీయనుంది. ఇది ఆధునిక రైల్వే యుగంలో మరో ముందడుగు కానుంది. మీరట్ సౌత్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ నుంచి ర్యాపిడ్ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయిని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) తెలిపింది. దీంతో ఢిల్లీలోని ప్రయాణికులు ఎన్సీఆర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని మీరట్ వరకు రాకపోకలు సాగించగలుగుతారు.82 కిలోమీటర్ల రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్)లో 42 కి.మీల వినియోగం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఎన్సీఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈరోజు (ఆదివారం) మీరట్ మొదటి స్టేషన్ మధ్యాహ్నం రెండు గంటలకు తెరుచుకోనుంది. ఇప్పటి వరకు నమో భారత్ రైలు సర్వీసులు ఘజియాబాద్ నుంచి మోదీనగర్ నార్త్ వరకు మాత్రమే నడిచేవి. ఇప్పుడు మీరట్ నగరంలో సర్వీసు ప్రారంభం కావడంతో ఘజియాబాద్, ఢిల్లీ వైపు వెళ్లే వారి ప్రయాణం మరింత సులభతరం కానుంది.ఆర్ఆర్టీఎస్ 2023, అక్టోబర్లో ఘజియాబాద్లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఘజియాబాద్లోని సాహిబాబాద్- దుహై డిపోల మధ్య 17 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో 22 లక్షల మంది ప్రయాణించారు. ఢిల్లీ - మీరట్ మధ్యనున్న కారిడార్లో మొత్తం 25 స్టేషన్లున్నాయి. జూన్ 2025 నాటికి ఢిల్లీ- మీరట్ మధ్య మొత్తం విస్తరణను పూర్తి చేయాలని ఎన్సీఆర్టీసీ భావిస్తోంది. -
‘బ్యాగులో బాంబుందా’?: ప్రశ్నించిన ప్రయాణికుడి అరెస్టు
కొచ్చి: కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం(ఆగస్టు11) ఉదయం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మనోజ్కుమార్(42) అనే ప్రయాణికుడు సెక్యూరిటీ చెక్ వద్ద తన బ్యాగ్ తీసుకుంటూ అందులో బాంబేమైనా ఉందా అని ప్రశ్నించాడు. దీంతో ఎయిర్పోర్టు ఎక్స్రే బ్యాగేజ్ స్కాన్ పాయింట్ వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది బాంబు స్క్వాడ్ను రప్పించి తనిఖీలు చేశారు. మనోజ్కుమార్ క్యాబిన్ బ్యాగులతో పాటు చెకిన్ బ్యాగేజీని బాంబు డిటెక్షన్ మెషిన్తో జల్లెడ పట్టారు. తనిఖీల తర్వాత మనోజ్కుమార్ను పోలీసులకు అప్పగించారు. మనోజ్కుమార్ ఎయిర్ఇండియా విమానంలో కొచ్చి నుంచి ముంబై వెళ్లాల్సిఉంది. -
ఇకపై ట్రైన్ లో పేదవాడు ప్రవేశించలేని పరిస్థితి
-
మాంసాహారం వడ్డన.. వందేభారత్ రైలులో వెయిటర్పై దాడి
కలకత్తా: వందేభారత్ రైల్లో ఇటీవల అనుకోని ఘటన జరిగింది. భోజనం అందించిన వెయిటర్పై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. కొద్ది రోజుల క్రితం ఓ వృద్ధుడు పశ్చిమ బెంగాల్లోని హవ్డా నుంచి రాంచీకి వందేభారత్ రైలులో ప్రయాణించాడు. భోజనం కోసం థాలీ ఆర్డర్ చేశాడు. అయితే ఒక వెయిటర్ పొరబాటున మాంసాహారం వడ్డించారు. ఆ వృద్ధ ప్రయాణికుడు కొద్దిసేపటికి అది నాన్-వెజ్ భోజనం అని గుర్తించాడు. Kalesh b/w a Passenger and Waiter inside Vande Bharat over A person slapped a waiter for mistakenly serving him non-vegetarian foodpic.twitter.com/Oh2StEthyX— Ghar Ke Kalesh (@gharkekalesh) July 29, 2024 శాకాహారి అయిన తనకు మాంసాహారాన్ని వడ్డించాడన్న ఆగ్రహంతో వెయిటర్పై దాడికి దిగాడు. ఎంతమంది అడ్డుకున్నా ఆగకుండా వెయిటర్పై చేయి చేసుకున్నాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ప్రయాణికుడి తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై తూర్పు రైల్వే స్పందించింది. ‘అవును, పొరబాటు జరిగింది. అంగీకరిస్తున్నాం. సమస్యను పరిష్కరించాం’అని క్లారిటీ ఇచ్చింది. -
అమృత్సర్: రైల్లో మంటలు.. ప్రయాణికుల హహాకారాలు
పంజాబ్లోని అమృత్సర్ రైల్వే స్టేషన్కు కిలోమీటరు దూరంలో అమృత్సర్-హౌరా మెయిల్ కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు రైలు డ్రైవర్కు సమాచారం అందించడంతో వెంటనే రైలును నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణం అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రైలులో మంటలు చెలరేగాయని తెలియగానే కొందరు ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ రైలు దిగిపోయారు.ఈ నేపధ్యంలో ఓ మహిళా ప్రయాణికురాలికి కాలికి గాయమైంది. దీంతో అధికారులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. మంటలు చెలరేగిన కంపార్ట్మెంట్ను రైలు నుంచి వేరు చేశాక, మిగిలిన రైలును అధికారులు గమ్యస్థానానికి తరలించారు. కాగా ఇటీవల మధ్యప్రదేశ్లోని విదిశాలో జోధ్పూర్-భోపాల్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. వెంటనే భద్రతా సిబ్బంది రైలును ఆపి, మంటలను అదుపులోకి తెచ్చారు. -
నాన్స్టాప్గా ఎగిరిపోదాం!
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్ తదితర దేశాలకు వెళ్లే భారతీయ విమాన ప్రయాణికులు ఇన్డైరెక్ట్ ఫ్లయిట్ల కన్నా నాన్–స్టాప్, డైరెక్ట్ ఫ్లయిట్లకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ ట్రావెల్ డేటా సంస్థ ఓఏజీ గణాంకాల ప్రకారం గత కొన్నాళ్లుగా ఈ ధోరణి పెరుగుతోంది.2023లో 3.72 కోట్ల మంది ప్యాసింజర్లు నాన్–స్టాప్ ఫ్లయిట్స్లో ప్రయాణించారు. కోవిడ్ పూర్వం 2019తో పోలిస్తే ఇది ఇరవై లక్షలు అధికం. ఇదే వ్యవధిలో ఒకటి లేదా అంతకు మించి స్టాప్స్లో ఆగుతూ వెళ్లే ఇన్డైరెక్ట్ ఫ్లయిట్స్లో ప్రయాణించిన వారి సంఖ్య 25 లక్షలు తగ్గి 2023లో 2.74 కోట్లకు పరిమితమైంది. 2023లో ప్రయాణించిన మొత్తం 6.46 కోట్ల మంది ప్యాసింజర్లలో 57 శాతం మంది నాన్–స్టాప్ ఫ్లయిట్స్నే ఎంచుకున్నారు. 2019లో ఇది 53 శాతంగా ఉంది.పశ్చిమాసియా హబ్లకు తగ్గిన ప్రయాణికులు అమెరికా, యూరప్లకు వెళ్లే ఫ్లయిట్స్ కోసం భారతీయులు ఎక్కువగా పశ్చిమాసియా హబ్ల వైపు మొగ్గు చూపే ధోరణి తగ్గింది. ఓఏజీ గణాంకాల ప్రకారం 2019–2023 మధ్య కాలంలో పశ్చిమాసియా హబ్లకు ప్యాసింజర్ల సంఖ్య 10 లక్షల మేర తగ్గింది. ఆ నాలుగేళ్ల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ఇతర హబ్లకు కూడా ప్రయాణికుల సంఖ్య 28 లక్షల మేర తగ్గింది. మరోవైపు, కొత్తగా 52 అంతర్జాతీయ రూట్లను జోడించడంతో ఇన్డైరెక్ట్ ఫ్లయిట్ ప్యాసింజర్లకు సంబంధించి దేశీ హబ్లలో ప్రయాణికుల సంఖ్య 10 లక్షల మేర పెరిగింది.ఓఏజీ విశ్లేషణ ప్రకారం గల్ఫ్ దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో (యూఏఈ) 36 లక్షల మంది, సౌదీ అరేబియాలో 26 లక్షల మంది ఉన్నారు. ఇంటర్నేషనల్ రూట్లలో భారతీయులను గమ్యస్థానాలకు చేరవేయడంలో పశ్చిమాసియా దేశాల ఎయిర్లైన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ విషయంలో దశాబ్దం క్రితం గల్ఫ్ దేశాల ఎయిర్లైన్స్ వాటా 48 శాతంగా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్లో ఇది 50 శాతానికి పెరిగింది. -
బోగీల్లో మంటలు
సాక్షి, హైదరాబాద్/ సికింద్రాబాద్: నగరంలోని ఏదో ఒక రైల్వేస్టేషన్లో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం ఏసీ బోగోల్లో మంటలు చెలరేగిన సమయంలో అదృష్టవశాత్తు ప్రయాణికులెవరూ లేరు. ⇒ గతంలో నాంపల్లి స్టేషన్లో ప్లాట్ఫామ్పైన నిలిపి ఉన్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్లోనూ ఇలాగే మంటలు చెలరేగాయి. అప్పటికే ప్రయాణికులు దిగి వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ట్రైన్లో పేలుడు స్వభావం ఉన్న పదార్థాల వల్లనే మంటలు అంటుకున్నట్టు అప్పట్లో గుర్తించారు. ⇒ సికింద్రాబాద్ స్టేషన్లోనూ చారి్మనార్ ఎక్స్ప్రెస్ కూడా ప్రమాదానికి గురైంది. విశాఖ నుంచి నగరానికి చేరుకున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే యార్డుకు చేరుకున్న కొద్దిసేపటికే అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన నాలుగేళ్ల క్రితం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.ఒకవేళ యార్డుకు చేరుకోకముందే అగ్నిప్రమాదం చోటుచేసుకొని ఉంటే భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేది. ఇలా తరచుగా ఏదో ఒక ట్రైన్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కొన్ని రైళ్లలో పొగలు రావడంతోనే గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు భారీ ఎత్తున మంటలు అంటుకొని ప్రయాణికులు, అధికారులు, సిబ్బందిని భయాందోళనకు గురిచేసిన సంఘటనలూ ఉన్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యమే కారణమా..రైల్వేయార్డులు, వాషింగ్లైన్లు, పిట్లైన్లలో నిలిపి ఉంచే బోగీలకు భద్రత ఉండటం లేదనే ఆరోపణలున్నా యి. కోచ్లను శుభ్రం చేసేందుకు రైళ్లను పిట్లైన్లకు తరలిస్తారు. కొన్నింటిని డిపోల్లో నిలిపివేస్తారు. రైళ్లు, బోగీలు ఎక్కడ నిలిపి ఉంచినా, వాటిపైన భద్రతా సిబ్బంది నిఘా కొరవడుతోంది. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు ఈ బోగీలు అడ్డాలుగా మారుతున్నాయి. తాగుబోతులు, ర్యాగ్పిక్కర్స్, అసాంఘిక శక్తులు రాత్రి వేళల్లో బోగీల్లో తిష్టవేస్తూ మద్యం సేవిస్తున్నారు. సిగరెట్లు, గంజాయి వంటివి తాగి మండుతున్న పీకలను బోగీల్లోనే వేస్తున్నారు. దీంతో సిగరెట్ పీకలు, వెలిగించిన అగ్ని పుల్లలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ⇒ ఏసీ బోగీల నిర్వహణలో వైఫల్యం వల్ల తరచూ విద్యుత్ షార్ట్సర్క్యూట్ వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నా యి. ఏసీ బోగీల్లో ప్రయాణికులు చెత్తాచెదారం, ఆహారపదార్ధాలు వదిలేస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో ఎలుకలు, బొద్దింకలు వచ్చి చేరుతున్నాయి. ఎలుకలు తరచుగా విద్యుత్ వైర్లు కట్ చేయడం వల్ల షార్ట్సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరుగుతున్నట్టు రైల్వే భద్రతా నిపుణుడు ఒకరు చెప్పారు. ఆరీ్పఎఫ్, జీఆర్పీ వంటి పోలీసు విభాగాలు పిట్లైన్లు, యార్డుల్లో నిరంతరం నిఘా కొనసాగించాలి. బయటి వ్యక్తులు యార్డుల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.ఏసీ కోచ్ల్లో అగ్ని ప్రమాదంసికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి గురువారం ఉద యం 10.30 గంటలకు ఏసీ కోచ్లను వాషింగ్ కోసం మెట్టుగూడ వద్దనున్న క్లీనింగ్ పిట్ యార్డ్ తీసుకెళ్లారు. క్లీనింగ్ పూర్తయ్యాక 11 గంటల ప్రాంతంలో తిరిగి రైల్వే స్టేషన్కు తరలిస్తుండగా ఏసీ బోగీల్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇది గమనించిన చిలకలగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రైల్వే అధికారులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది స్టేషన్లో మంటలు ఆర్పే యంత్రాలతో తగలబడుతున్న బోగీలను అదుపు చేసే ప్రయ త్నం చేశారు. మంటలు ఇతర బోగీలకు వ్యాపించ కుండా రైల్వే సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలోనే అక్కడకు చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేశాయి. రైలు కోచ్లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. విషయం తెలియగానే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై సమీక్షించి, భవిష్యత్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డివిజనల్ అధికారులను ఆదేశించారు. -
బెంగాల్ రైలు ప్రమాదం కేసులో ఊహించని మలుపు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ కాంచన్జంగా రైలు ప్రమాదం కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ యాక్సిడెంట్లో ఇప్పటిదాకా పది మంది మరణించగా.. 40 మందికిపైగా గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంపై ఫిర్యాదు చేసిన ప్రయాణికురాలు మాట మార్చారు. అసలు తాను ఫిర్యాదే చేయలేదని బాంబ్ పేల్చారు.బెంగాల్ రైలు ప్రమాదంపై జల్పాయ్గురి రైల్వే పోలీసులు(GRP) మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లోకో పైలట్, కో-పైలట్ నిరక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతూ.. చైతలి మజుందార్ అనే ప్రయాణికురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘రైలు రంగపాణి-నిజ్బరి స్టేషన్ల మధ్య ఉండగా.. హఠాత్తుగా కుదుపులకు లోనైంది. మా బోగీలో ఉన్నవాళ్లమంతా అంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఈలోపు స్థానికులు తీవ్రంగా గాయపడిన మమ్మల్ని బయటకు తీశారు. బయటకు వచ్చి చూస్తే మా రైలును వెనుక నుంచి గూడ్స్ ఢీ కొట్టింది. బోగీలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలోనూ కొందరు చనిపోయారు. పైలట్-లోకో పైలట్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నా’’ అని ఫిర్యాదులో ఉంది. అయితే ఈ ప్రమాదంలో లోకో పైలట్ మరణించగా.. లోకో పైలట్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు చైతలి ఫిర్యాదు ఆధారంగానే ఇండియన్ రైల్వేస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. ఈలోపే ఆమె ట్విస్ట్ ఇచ్చారు. తాను అసలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆమె మీడియా ముందుకు వచ్చారు. జీఆర్పీ అధికారులు ఓ తెల్లకాగితంపై తనతో సంతకం చేయించుకున్నారని.. దానినే ఫిర్యాదులేఖగా మార్చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆమె ఆరోపించారు. అయితే మజుందార్ ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది. -
‘వందేభారత్’లో టికెట్లేని ప్రయాణికులు.. స్పందించిన రైల్వే శాఖ
న్యూఢిల్లీ: భారత్ రైళ్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి వాటిపై రాళ్లదాడులు జరగడం సర్వ సాధారణమైపోయింది. వందేభారత్కు సంబంధించి రోజూ ఏదో ఒక వార్త ఎక్కడో ఒక చోట చూస్తుంటాం. అయితే తాజాగా లక్నో-డెహ్రాడూన్ వందేభారత్ రైలులో టికెట్లేని ప్రయాణికులు చాలా మంది ఎక్కి టికెట్ ఉన్న ప్రయాణికులకు ఇబ్బందులు కలుగజేసిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్గా మారింది.ప్రీమియం రైలులో ఈ పరిస్థితి తలెత్తితే మిగిలిన రైళ్ల పరిస్థితి ఏంటని వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రైళ్ల సంఖ్యను పెంచడంతో పాటు బోగీలను కూడా పెంచాలని వారు రైల్వే శాఖను డిమాండ్ చేశారు.అయితే వందేభారత్ వీడియోపై రైల్వేశాఖ స్పందించింది. ఇది పాత వీడియో అని తెలిపింది. కొందరు రైతులు గతంలో బలవంతంగా రైలులోకి ఎక్కినపుడు తీసిన వీడియో అని వెల్లడించింది. ఇలాంటి పాత వీడియోలను మళ్లీ వైరల్ చేసి ప్రయాణికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని కోరింది. -
విమానంలో నగ్నంగా పరుగెత్తిన ప్రయాణికుడు
పెర్త్: ఆస్ట్రేలియాలోని ఓ విమానంలో ఒక ప్రయాణికుడు నగ్నంగా పరుగులు తీశాడు. అంతటితో ఆగకుండా సిబ్బందిని కిందకు తోసేసి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో జరిగింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి మెల్బోర్న్కు వీఏ 696 విమానం సోమవారం(మే27) రాత్రి బయలుదేరింది. పెర్త్లో విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. దుస్తులను తొలగించి నగ్నంగా విమానంలో అటూ, ఇటూ పరిగెత్తాడు. అడ్డుకున్న సిబ్బందిని తోసేశాడు. అతడి చేష్టలతో తోటి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. విమాన సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఎయిర్పోర్టుకు చేరుకుని నగ్నంగా పరుగులు తీసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. -
విమానంలో స్టాండింగ్
ముంబై: బస్సు, రైల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణించడం చూస్తుంటాం. కానీ విచిత్రంలో విమానంలో ఓ వ్యక్తి నిలబడి వెళ్లేందుకు సిద్దపడ్డాడు. ఈ ఘటన ముంబై నుంచి వారణాసి వెళ్లే ఫ్లైట్లో మంగళవారం జరిగింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ఇండిగో ప్లైట్ టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నపుడు ఓ ప్రయాణికుడు నిలబడి ఉండటం చూసిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని దింపేశారు. ఆ ప్రయాణికుడు ఇండిగో ఉద్యోగి. సిబ్బంది ఎయిర్లైన్ టికెట్లను తగ్గించడంలో భాగంగా కలిగించే ప్రయోజనం స్టాఫ్ లీజర్ ట్రావెల్లో భాగంగా ప్రయాణిస్తున్నాడు. (సిబ్బందికి ఇలా ప్రయాణించే అవకాశం ఉంటుంది) టేకాఫ్కు ముందు తనిఖీ చేయగా.. ఇండిగో ఫ్లైట్లో రావాల్సిన ఓ ప్రయాణికుడు రాలేదనే సమాచారం వచ్చింది. ఆ సీటును స్టాండ్బైగా ఇండిగో ఉద్యోగికిచ్చారు. తీరా ఫ్లైట్లోకి వెళ్లాక చూస్తే ప్రయాణికుడు ఉన్నాడు. దీంతో ఉద్యోగి నిలబడ్డాడు. అది సిబ్బంది గుర్తించి, నిలిపివేయడంతో టేకాఫ్ ఆలస్యమైంది. అది బోర్డింగ్ ప్రాసెస్ తప్పిదంగా గుర్తించారు. -
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లేజర్ ఎయిర్లైన్స్ ప్రయాణికులకు షాకింగ్ ఘటన ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానంలో పొగలు రావడంతో.. అత్యవసర స్లైడ్ ద్వారా విమానం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రయాణికులు గాయపడ్డారు. వెనెజులా రాజధాని కారకాస్ శివారులోని మైక్వేటియా సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాలు లేజర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం వెనెజులా నుంచి డొమినికన్ రిపబ్లికన్కు బయలుదేరింది. ప్రయాణ సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఉన్నట్టుండి విమానంలో పొగలు గుర్తించిన సిబ్బంది వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. విమానాన్ని ఖాళీ చేయాల్సిందిగా ప్రకటన చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.కొందరు వెంటనే అత్యవసర స్లైడ్ ద్వారా బయట పడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నుంచి స్లైడ్ ద్వారా బయటపడే సమయంలో తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. విమానంలో పొగకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Following an APU failure aboard a <a href="https://twitter.com/laserairlines?ref_src=twsrc%5Etfw">@laserairlines</a> MD-80, passengers were evacuated due to smoke in the cabin. Regrettably, most passengers exited with their carry-on luggage, resulting in avoidable hazards. <a href="https://t.co/7FsfZ3Zkuk">pic.twitter.com/7FsfZ3Zkuk</a></p>&mdash; Enrique Perrella (@Enrique77W) <a href="https://twitter.com/Enrique77W/status/1784737773464735912?ref_src=twsrc%5Etfw">April 29, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script> -
రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం
ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అభ్యంతర కర తరహాలో బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కింది. దీంతో తోటి ప్రయాణీకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోపై నెటిజన్లలో విభిన్న స్పందనలు కనిపించాయి. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో బుధవారం ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ మహిళ టూపీస్ బికినీలో బస్సెక్కడం కనిపించింది. అప్పటికే అక్కడ నిలబడి ఉన్న ఓ వృద్ధురాలు పక్కకు వెళ్లిపోగా సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు సైతం లేచి వెళ్లిపోవడం గమనార్హం. దీపికా నారాయణ భరద్వాజ్ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకి దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. (ఫుడ్ ఫోటోగ్రాఫర్ అవార్డుల పోటీ : ఈ అద్భుతమైన ఫోటోలు చూశారా?) బికినీలో ఆమెను చూసి షాక్ అయ్యామని కొందరు వ్యాఖ్యానించారు. ఆమె తీరును అభ్యతరకరంగా ఉందననారు. మరికొందరు మాత్రం ఆమె బట్టలు ఆమె ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛను గట్టిగా సమర్థించారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్లోనూ ఓ మహిళ బ్రా, మినీ స్కర్ట్ తో ప్రయాణించి కలకలం రేపింది.అలాగే హోలీ సందర్భంగా ఇద్దరు అమ్మాయిలు చేసిన రీల్స్ కూడా వివాదాన్నా రేపిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతంపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది. తాజా ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు. (కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు) What's really happening 😵💫😵💫pic.twitter.com/rfjavOsWMp — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 17, 2024 -
‘ఆటోమేటిక్ డోర్కు అలవాటు పడలేదు’
‘వందే భారత్’ రైలులో ప్రయాణించాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఆధునిక సౌకర్యాలతో తళతళలాడుతున్న ఈ రైలు ఎక్కాలని చాలామంది తహతహలాడిపోతుంటారు. అయితే ఈ రైలులోని కొన్ని సాంకేతిక విషయాలు తెలియక కొందరు చిక్కుల్లో పడుతున్నారు. సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా రైలు ప్రయాణానికి బయలుదేరినప్పుడు వారిని దిగబెట్టేందుకు తోడుగా ఎవరో ఒకరు వెళుతుంటారు. ఇదేవిధంగా ఒక భర్త తన భార్యను వందేభారత్ రైలు ఎక్కించేందుకు వెళ్లాడు. ఆమె తన సీటులో కూర్చున్నాక భర్త కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. అయితే ఇంతలో వారుంటున్న కోచ్ డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. మరి అప్పుడేం జరిగింది? వివరాల్లోకి వెళితే ఒక మహిళ తన కుమార్తె దగ్గర ఉండేందుకు తొలిసారిగా వందే భారత్ రైలులో గుజరాత్లోని వడోదర నుంచి ముంబైకి బయలుదేరింది. ఆ మహిళకు తోడుగా స్టేషన్ వరకూ ఆమె భర్త వచ్చాడు. లగేజీని ఆమె కూర్చున్న సీటు దగ్గర ఉంచి, కాసేపు కూర్చున్నాడు. ఇంతలో రైలు తలుపులు మూసుకుపోయిన శబ్ధం వినిపించింది. ఆ వ్యక్తి రైలు దిగకముందే డోర్ మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి టీసీతో మాట్లాడి రైలును ఆపాలనుకున్నాడు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో రైలు వేగం అందుకుంది. దీంతో ఆ వ్యక్తి తనకు ఇష్టం లేకపోయినా తదుపరి స్టేషన్ వచ్చే వరకు ప్రయాణించవలసి వచ్చింది. అతని కుమార్తె తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ పోస్ట్ను ఇప్పటివరకూ కొన్ని లక్షలమంది వీక్షించారు. ఈ పోస్ట్ చూసిన ఒక యూజర్.. ‘అతను స్టేషన్లోని నో పార్కింగ్ జోన్లో పెట్టిన తన కారు గురించి ఆందోళన చెందుతున్నాడేమోనని’ రాయగా, మరొక యూజర్ ‘ఇది అతనికి అందమైన జ్ఞాపకంగా మిగులుతుందని’ రాశాడు. మరో యూజర్ ‘అతనింకా ఆటోమేటిక్ డోర్కు అలవాటుపడలేదని’ పేర్కొన్నాడు. My mother is travelling for the first time in Vande Bharat from Vadodara to Mumbai today to visit me. As it is going to be a longer stay, she had two big bags to travel with. (1/4) — Kosha (@imkosha) April 2, 2024 -
మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు: సెల్ఫీ వీడియో పుణ్యమే!
సెల్ఫీ వల్ల చాలామంది మనుషుల ప్రాణాలు బలైన సంఘటనలు అనేకం చూశాం. కానీ ఒక సెల్ఫీ వీడియో నిందితుడిని పట్టిచ్చిన వైనం వైరల్గా మారింది. ఓ రైలు ప్రయాణికుడి సెల్ఫీ వీడియో మరో ప్రయాణికుడి మరణం వెనకున్ మిస్టరీ ఛేదించిన ఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి: బ్యాంకు ఉద్యోగి ప్రభాస్ భాంగే హోలీ వేడుకలకు ఇంటికెళ్లి అనంతరం తిరిగి పూణే వెళ్లేందుకు ఈ నెల 24న సిద్దేశ్వర్ ఎక్స్ప్రెస్లో బయలుదేరాడు. కానీ అనూహ్యంగా అతని మృతదేహం విఠల్వాడి రైల్వే స్టేషన్లో పట్టాలపై దర్శనమిచ్చింది. అయితే జారి పడి దుర్మరణం పాలై ఉంటాడని పోలీసులు తొలుత భావించారు. అయితే ఇక్కడే అసలు కథ వెలుగులోకిచ్చింది. రైలు విఠల్వాడి స్టేషన్ వద్దకు వచ్చేసరికి ప్రభాస్ భాంగే బయట రైలు డోరు దగ్గర నిలబడి ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన సెల్ఫోన్ దొంగ ఆకాశ్ జాదవ్ హఠాత్తుగా అతని ఫోన్ లాక్కున్నాడు. అతని మొబైల్ ఫోన్ను లాక్కోవడానికి ప్రయత్నించినపుడు అదుపు తప్పి పట్టాలపై పోయాడు. అయితే ఈ మొత్తం ఉందంతం మరో రైలు ప్రయాణికుడు జాహిద్ జైదీ సెల్ఫీ వీడియోలో రికార్డు అయింది. జాహిద్ ఫోన్ కొట్టేసేందుకు కూడా ఆకాశ్ జాదవ్ ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. అది వీడియోలో రికార్డు అయింది.దీనిపై అతను ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీనిపై విచారించాల్సిందిగా పోలీసులను కోరాడు.ఇది వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానితుడిగా ఆకాశ్ జాదవ్ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు కూడా నిజం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అతడి నుంచి ప్రభాస్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నామని రైల్వే పోలీసు అధికారి పండరీనాథ్ కాండే వెల్లడించారు. -
అండర్ వాటర్ మెట్రోకు అనూహ్య ఆదరణ
దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇలీవల పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నీటి అడుగున నడిచే మెట్రో రైలును ప్రారంభించారు. అది మొదలు ఈ మెట్రోపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ మెట్రోలో తాజాగా సాధారణ ప్రయాణికుల సేవలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోల్కతా మెట్రో ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ అండర్వాటర్ మెట్రోలో ప్రయాణించడానికి జనం ఎంతో ఉత్సాహం చూపడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో జనం మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ‘వందే భారత్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తున్నారు. #CommercialServices on #KaviSubhash-#HemantaMukhopadhyay stretch begins this morning.... pic.twitter.com/6bCxoz5oO9 — Metro Railway Kolkata (@metrorailwaykol) March 15, 2024 కోల్కతాలోని ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్లోని హౌరా మైదాన్ స్టేషన్ నుండి శుక్రవారం ఉదయం 7 గంటలకు మెట్రో రైలు ప్రయాణాన్ని ప్రారంభించింది. అదే సమయంలో ఎస్ప్లానేడ్ స్టేషన్ నుండి మరో మెట్రో బయలుదేరింది. కోల్కతా మెట్రోపాలిటన్ రవాణా నెట్వర్క్లోని హౌరా మైదాన్-ఎస్ప్లానేడ్ విభాగం హుగ్లీ నదికి దిగువన ఉంది. నది కింద ఉన్న ఈ సొరంగం పొడవు 520 మీటర్లు. Regular service on Howrah Maidan - Esplanade, Kolkata Metro started today! pic.twitter.com/Rp2ofTHFS9 — Ashwini Vaishnaw (मोदी का परिवार) (@AshwiniVaishnaw) March 15, 2024 కోల్కతా మెట్రో సోషల్ మీడియాలో షేర్ చేసిన పలు ఫొటోలలో ప్రయాణికులు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడాన్ని గమనించవచ్చు. ప్రయాణ సమయంలో, ఒక ప్రయాణికుడు ప్లకార్డుపై ‘భారతదేశాన్ని గర్వించేలా చేసినందుకు చాలా ధన్యవాదాలు మోడీ జీ’ అని రాశారు. కాగా హుగ్లీ నది దిగువ భాగాన్ని గుర్తించే సొరంగ భాగాన్ని నీలిరంగు ఎల్ఈడీ లైట్లతో అలంకరించారు. ఈ వాటర్ మెట్రో మార్గంలో ప్రతి 12 నుండి 15 నిమిషాలకు రైళ్లు నడుస్తాయి. #Metro passengers queuing up at #Esplanade Metro station this morning to be a part of the history..... pic.twitter.com/smVgUQX9uJ — Metro Railway Kolkata (@metrorailwaykol) March 15, 2024 -
విమానంలో సీట్ కుషనింగ్ మాయం! - ఏం జరిగిందంటే..
ఇటీవల ఓ మహిళకు ఇండిగో ఎయిర్లైన్స్లో ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. విమానంలోని కుషనింగ్ లేకుండా ఉన్న సీటు చూసి ఒక్కసారిగా షాకయింది. దీనికి సంబంధించిన ఫోటో తీసి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. యవనిక రాజ్ షా అనే మహిళ బెంగళూరు నుంచి భోపాల్కు వెళ్లే సమయంలో ఆమె ప్రయాణించే ఇండిగో 6E 6465 విమానంలో కుషనింగ్ లేని సీటు చూసి, ఫోటోను ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. బ్యూటిఫుల్ @IndiGo6E నేను సురక్షితంగా ల్యాండ్ అవుతానని ఆశిస్తున్నానని ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన ఇండిగో.. మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు అంటూ.. క్లీనింగ్ కోసం కుషన్లను మార్చామని, క్యాబిన్ సిబ్బందికి సమాచారం అందించినట్లు, శుభ్రమైన సీట్లను కేటాయించడంలో భాగంగా ఇలా జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు వావ్ మసాజ్ సీట్లు అని పేర్కొన్నారు. మరో వ్యక్తి బహుశా మునుపటి ప్రయాణికులు వాటిని తీసుకెళ్లిపోయారేమో అని అన్నారు. Beautiful @IndiGo6E — I do hope I land safely! :) This is your flight from Bengaluru to Bhopal 6E 6465. pic.twitter.com/DcPJTq3zka — Yavanika Raj Shah (@yavanika_shah) March 6, 2024 -
జనరల్ టిక్కెట్తో ఏసీ కోచ్లోకి మహిళ.. ప్రతాపం చూపిన టీటీఈ!
నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్ష విధించాలి.. కానీ శిక్ష పేరుతో ఒక్కోసారి అధికారులు చెలరేగిపోతుంటారు. ఇటువంటి ఉదంతమొకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళ జనరల్ టిక్కెట్తో రైలులోని ఏసీ కోచ్ ఎక్కేసింది. ఈ విషయాన్ని గమనించిన టీటీఈ ఆమెపై తన ప్రతాపం చూపాడు. ఈ ఘటన ఢిల్లీ ఎన్సీఆర్ లోని ఫరీదాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. జనరల్ టిక్కెట్తో ఒక మహిళ జీలం ఎక్స్ప్రెస్లోని ఏసీ బోగీలోకి ఎక్కేసింది. దీనిని గమనించిన అదే రైలులోని టీటీఈ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైలులో నుంచి తోసివేశాడు. దీంతో ఆమె రైలు- ప్లాట్ఫారమ్ మధ్య చిక్కుకుపోయింది. ఆ మహిళ ఆర్తనాదాలు విన్న పోలీసులు అతి కష్టం మీద ఆమెను కాపాడగలిగారు. బాధితురాలికి తల, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను ఝాన్సీలో ఒక వివాహానికి హాజరు కావాల్సి ఉందని, అయితే తను స్టేషన్కు చేరుకునే సమయానికి, రైలు నెమ్మదిగా కదులుతున్నదని, దీంతో కనిపించిన బోగీలో వెంటనే ఎక్కేశానని తెలిపింది. ఈ విషయాన్ని టీటీఈకి చెప్పినా పట్టించుకోలేదని, తగిన జరిమానా చెల్లిస్తానని తాను చెప్పినా వినకుండా రైలు నుంచి తోసివేశారని ఆమె ఆరోపించింది. కాగా ఈ ఉదంతపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఉబర్ ఛార్జ్ చూసి ఖంగుతున్న ప్యాసింజర్.. 40 కిమీ దూరానికి..
టెక్నాలజీ పెరగడంతో ఎక్కడికి వెళ్లాలన్నా.. ఉబర్, ఓలా యాప్లలో వెహికల్స్ బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో క్యాబ్ చార్జీలు చూసి వినియోగదాదారులు తప్పకుండా ఖంగుతింటారు. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా వైరల్ అయినప్పటికీ.. తాజాగా ఇలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. రాజేష్ భట్టాడ్ అనే వ్యక్తి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెచ్ఎస్ఆర్ లేఔట్ వెళ్లాలనుకున్నారు. ఆ సమయంలో ఉబర్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే దాదాపు రూ.2000 చూపించింది. ఇది చూసిన రాజేష్ ఒక్కసారిగా షాకయ్యారు. దీనిని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చివరకు రాజేష్ భట్టాడ్ బస్సులో కేవలం రూ. 265లతో గమ్యస్థానం చేరుకుని BMTCకి కృతజ్ఞతలు చెప్పారు. 40 కిలోమీటర్ల దూరానికి రూ. 2000 చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. దీనిపైన పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. విమానాశ్రయం దగ్గర చార్జీలు ఎక్కువగా ఉంటాయని, బస్సులో వెళితే చార్జీలు బాగా తగ్గుతాయని కామెంట్స్ చేశారు. గత ఏడాది కూడా బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి ఉబెర్ క్యాబ్ ఎక్కువ ఛార్జీలను వసూలు చేసిన స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 50 కిలోమీటర్ల రైడ్కు రూ. 4,000 వరకు వసూలు చేసినట్లు ఇందులో తెలిసింది. స్క్రీన్షాట్ వైరల్ కావడంతో, క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీకు నగర రవాణా శాఖ నోటీసులు అందించింది. The Uber pricing past midnight from Bengaluru Airport to HSR🥲 Thank you BMTC🙏 pic.twitter.com/gWAHgXbtpD — 📊 Rajesh Bhattad | theRevOpsGuy (@theRevOpsGuy) February 28, 2024 -
ఎయిరిండియా ఇన్ఫ్లైట్ సేఫ్టీ వీడియో : విభిన్న నృత్య రీతులతో
టాటా గ్రూపు యాజమాన్యంలో ఎయిరిండియా ఇటీవల సరికొత్తగా ముస్తాబైంది. విమానాల్ని కలర్ఫుల్గా, ముఖ్యంగా ఎయర్హెస్టెస్ తదితర సిబ్బంది డ్రెస్ కోడ్ను అందంగా తీర్చిదిద్దింది. తాజాగా మరో కొత్త అప్డేట్ను కూడా ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజనులను బాగా ఆకట్టుకుంది. దేశ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కొత్త ఇన్ఫ్లైట్ సేఫ్టీ వీడియోను తీసుకొచ్చింది. ఎయిరిండియా విమానం బయలు దేరడానికి ముందు వినిపించే ప్రయాణీకుల కోసం 'సేఫ్టీ ముద్ర' అనే కొత్త ఇన్ఫ్లైట్ సేఫ్టీ వీడియోను పరిచయం చేసింది. వివిధ కళారూపాల నుండి ప్రేరణ పొందినట్టు తెలిపింది. "శతాబ్దాలుగా, భారతీయ శాస్త్రీయ నృత్యం , జానపద-కళా రూపాలు కథలు, సూచిక మాధ్యమంగా పనిచేశాయి. నేడు, అవి విమాన భద్రత గురించి మరొక కథను చెబుతున్నాయి." అని ట్వీట్ చేసింది. సుసంపన్నమైన, విభిన్నమైన నృత్య రీతుల ప్రేరణతో కొత్త సేఫ్టీ ఫిల్మ్అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. మెకాన్ వరల్డ్గ్రూప్కు చెందిన ప్రసూన్ జోషి, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ , డైరెక్టర్ భరతబాల సంయుక్తగా 'సేఫ్టీ ముద్రాస్'ను దీన్ని తీసుకొచ్చారు. భరతనాట్యం, బిహు, కథక్, కథాకళి, మోహినియాట్టం, ఒడిస్సీ, ఘూమర్ .గిద్దా, ఎనిమిది విభిన్న నృత్య రూపాల్లో ముద్రలు లేదా నృత్యవ్యక్తీకరణలు ఇందులో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణీకులకు భారతదేశ గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, అవసరమైన భద్రతా సూచనలను అందించేలా దీన్ని తీర్చిదిద్దడం సంతోషదాయమన్నారు ఎయిరిండియా సీఎండీ కాంప్బెల్ విల్సన్ For centuries, Indian classical dance and folk-art forms have served as medium of storytelling and instruction. Today, they tell another story, that of inflight safety. Presenting Air India’s new Safety Film, inspired by the rich and diverse dance traditions of India.#FlyAI… pic.twitter.com/b7ULTRuX1Z — Air India (@airindia) February 23, 2024 -
అమెరికా విమానంలో వ్యక్తి అలజడి..
వాషింగ్టన్: అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అలజడి సృష్టించాడు. విమానం గాల్లో ఎగురుతుండగానే అత్యవసర ద్వారం తెరిచేందుకు ప్రయతి్నంచాడు. తోటి ప్రయాణికులు భయాందోళనతో గట్టిగా అరుస్తున్నా పట్టించుకోలేదు. దాంతో వారంతా అతడిని బంధించి, బలంతంగా సీట్లో కూర్చోబెట్టి, మళ్లీ లేవకుండా టేపుతో కట్టేశారు. అమెరికాలో న్యూమెక్సిలో రాష్ట్రంలోని అల్బుక్విర్కీ సిటీ నుంచి షికాగోకు బయలుదేరిన 1219 విమానంలో(బోయింగ్ 737) ఇటీవలే ఈ ఘటన చోటుచేసుకుంది. అల్బుక్విర్కీ ఎయిర్పోర్టు నుంచి విమానం బయలుదేరిన 30 నిమిషాలకు సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులంతా అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి, అల్బుక్విర్కీ ఎయిర్పోర్టులో దించారు. గందరగోళానికి కారణమైన ప్రయాణికుడిని కిందికి దించి, పోలీసులకు అప్పగించారు. అతడు ఎందుకలా చేశాడన్నదానిపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. -
ఎయిర్పోర్టులో రామస్మరణ
-
Kolkata: విమానంలో మహిళతో అసభ్య ప్రవర్తన
కలకత్తా: పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తా నుంచి బాగ్డోరా వెళుతున్న స్పైస్జెట్ విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలితో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ మేరకు ఎయిర్లైన్స్ ఆదివారం(ఫిబ్రవరి 4) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన జనవరి 31నాడు జరిగినట్లు ఎయిర్లైన్స్ వెల్లడించింది. పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేసిన వెంటనే అతని సీటు మార్చినట్లు ఎయిర్లైన్స్ సిబ్బంది తెలిపారు. అయితే తాను అసభ్యంగా ప్రవర్తించలేదని ఆ వ్యక్తి సిబ్బందికి స్పష్టం చేశాడు. ‘విమానం బాగ్డోరాలో ల్యాండ్ అయిన వెంటనే ఇద్దరు ప్రయాణికులను సీఐఎస్ఎఫ్ సిబ్బంది వద్దకు తీసుకెళ్లాం. తనకు క్షమాపణలు చెప్పాలని మహిళా ప్రయాణికురాలు ఆ వ్యక్తిని కోరింది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి క్షమాపణలు చెప్పాడు. దీంతో ఆ మహిళా ప్రయాణికురాలు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయింది’ అని ఎయిర్లైన్స్ సిబ్బంది తెలిపారు. గడిచిన కొన్ని నెలల్లో విమానాల్లో ఇలాంటి పలు సంఘటనలు నమోదయ్యాయి. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఒక వ్యక్తి వయసులో పెద్దదైన మహిళపై మూత్ర విసర్జన చేశాడని కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. నెల జైలు తర్వాత అతడికి బెయిల్ వచ్చింది. ఇదీచదవండి.. రాష్ట్ర హోదా కోసం లడఖ్లో నిరసనలు -
క్యాబ్ బిల్లు చూసి షాకైన ప్యాసెంజర్..చివరికి ఏం చేశాడంటే..?
క్యాబ్ సేవల సంస్థ ఓలాకు సంబంధించి మరో షాకింగ్ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేసుకున్న ఓ విద్యార్థికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బుక్ చేసుకున్నపుడు ఉన్న ఫీజుకి, తీరా చెల్లించాల్సిన సొమ్ముకి ఉన్న తేడా చూసి కంగు తిన్నాడు. ఇదేం చోద్యం బాసూ అంటూ లబోదిబోమన్నాడు. చివరికి ఏమైందంటే..? కోల్కతా నుంచి బెంగళూరుకు వచ్చిన అనురాగ్ కుమార్ సింగ్ అనే కాలేజీ విద్యార్థి కెంపేగౌడ విమానాశ్రయంలో ఓలా 'మినీ' క్యాబ్ను చేసుకున్నాడు. ఓలా బుక్ చేసుకున్న మతికెరె ప్రాంతానికి సమయంలో ధర రూ.730 చూపించింది. తీరా రైడ్ ముగిసిన తరువాత రూ.5194 చెల్లించాలని డ్రైవర్ డిమాండ్ చేశాడు. దిగ్భ్రాంతికి గురైన అనురాగ్ వెంటనే తన ఫోన్లో చెక్ చేస్తే రైడ్ క్యాన్సిల్ అయినట్లు చూపించింది. క్యాన్సిల్ అయిన రైడ్కు అంత డబ్బులు ఎలా వసూలు చేస్తావంటూ డ్రైవర్ని నిలదీశాడు.దీంతో ఇద్దరి మధ్యా కాసేపు వాగ్వాదం జరిగింది. ఓలా కస్టమర్కేర్ను కూడా సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అయినా ఫలితం లేదు. చివరికి అక్కడున్న తోటివారి సలహా మేరకు డ్రైవర్కు రూ. 1,600 చెల్లించాడు. తన ఫిర్యాదుకు ఓలా నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంపై అనురాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బెంగళూరు మొత్తం తిరిగినా ఇంత ఖర్చు కాదు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని సోషల్మీడియాలో వైరల్గా మారింది. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని, రైడ్ వివరాల స్క్రీన్షాట్లను తీసుకొని, ఏదైనా తేడా వస్తే కస్టమర్ సపోర్ట్ టీమ్లకు రిపోర్ట్ చేయాలని నెటిజన్లు సూచించారు. -
బస్సు కిటికీలో ఇరుక్కున్న తల
-
స్పైస్జెట్ విమానం టాయిలెట్లో చిక్కుకున్న ప్రయాణికుడు
ముంబయి: స్పైస్జెట్ విమానం టాయిలెట్స్లో చిక్కుకుని ఓ ప్రయాణికుడు నరకయాతన అనుభవించాడు. ముంబయి నుంచి బెంగళూరు వరకు వెళ్లే స్పైస్జెట్ విమానంలో ఈ ఘటన జరిగింది. టేకాఫ్ అయిన దగ్గర నుంచి బెంగళూరులో ల్యాండ్ అయ్యేవరకు గంటకుపైగా టాయిలెట్లోనే ఉండిపోయాడు. విమానం ముంబయిలో టేకాఫ్ అయ్యాక ఓ వ్యక్తి టాయిలెట్స్కి వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో టాయిలెట్స్ డోర్ లాక్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు. క్రూ సిబ్బంది అతనికి సహాయం చేసే ప్రయత్నం చేశారు. తీరా బెంగళూరులో ల్యాండ్ అయ్యాక.. ఇంజినీర్ వచ్చి డోర్ ఓపెన్ చేసేవరకు బాధిత వ్యక్తి టాయిలెట్స్లోనే ఉండిపోయాడు. The note from the crew to the passenger locked on #Spicejet flight. #Avgeek #Aviation pic.twitter.com/pPrvXq8mJm — Aman Gulati 🇮🇳 (@iam_amangulati) January 17, 2024 "జనవరి 16న ముంబయి నుంచి బెంగళూరుకు వెళ్తున్న స్పైస్జెట్ విమానంలో దురదృష్టవశాత్తూ ఒక ప్రయాణికుడు సుమారు గంటసేపు టాయిలెట్స్లో చిక్కుకుపోయాడు. డోర్ లాక్ లోపం కారణంగా విమానం గాలిలో ప్రయాణించింది. ప్రయాణమంతా మా సిబ్బంది ఆ ప్రయాణికునికి మార్గనిర్దేశం చేశారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం." అని స్పైస్జెట్ తెలిపింది. ఇదీ చదవండి: రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో గోడలపై ఖలిస్థానీ రాతల కలకలం -
Video: విమానం ఆలస్యంపై ప్రకటన.. కెప్టెన్పై ప్రయాణికుని దాడి
ఢిల్లీ: ప్రయాణాల ఆలస్యం వివాదంపై ఇండిగో ఎయిర్లైన్స్ ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఈ క్రమంలోనే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. విమానం ఆలస్యం గురించి ప్రకటిస్తున్న నేపథ్యంలో ఓ ప్రయాణికుడు కెప్టెన్పై దాడికి యత్నంచాడు. కెప్టెన్ చెంప చెల్లుమనిపించాడు. ఇంతలో ఇతర ప్రయాణికులు అడ్డుతగలడంతో వెనక్కి తగ్గాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. A passenger punched an Indigo capt in the aircraft as he was making delay announcement. The guy ran up from the last row and punched the new Capt who replaced the previous crew who crossed FDTL. Unbelievable ! @DGCAIndia @MoCA_GoI pic.twitter.com/SkdlpWbaDd — Capt_Ck (@Capt_Ck) January 14, 2024 వీడియోలో చూపిన విధంగా ఢిల్లీ విమానాశ్రయంలో 6E-2175 విమానాన్ని నిలిపి ఉంచారు. గోవా వెళ్లాల్సిన ఆ విమానం ఎప్పుడు గాల్లోకి ఎగురుతుందా? అన్నట్లు ప్రయాణికులంతా ఎదురుచూస్తున్నారు. ఇంతలో కెప్టెన్ లోనికి వచ్చాడు. పొగమంచు కారణంగా దాదాపు 13 గంటలు విమానం ఆలస్యం అవుతుందని ప్రకటిస్తున్నాడు. ఇంతలో పసుపు రంగు చొక్కా ధరించిన వ్యక్తి ముందుకు దూసుకొచ్చాడు. కెప్టెన్ చెంప చెల్లుమనిపించాడు. ఈ వీడియోను నటి రాధికా ఆప్టే ఎక్స్లో షేర్ చేయగా వైరల్గా మారింది. నిందితున్ని సాహిల్ కటారియాగా గుర్తించారు. అతనిపై ఇండిగో ఎయిర్లైన్స్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ సహా ఉత్తరాదిలో ఇటీవల తీవ్ర పొగమంచు వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైళ్లు సహా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పొగమంచు కారణంగా ఢిల్లీలో శనివారం 110 విమానాలు ఆలస్యంగా నడిచాయి. అటు 79 విమాన ప్రయాణాల్ని రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చదవండి: Makar Sankranti: గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? శ్రీరామునితో సంబంధం ఏమిటి? -
ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల్లో సరికొత్త రికార్డ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా హోల్సేల్లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 2023లో 40 లక్షల యూనిట్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు నమోదైంది. తయారీ కంపెనీల నుంచి గతేడాది డీలర్లకు 41,01,600 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు చేరాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) శుక్రవారం తెలిపింది. యుటిలిటీ వెహికిల్స్కు పెద్ద ఎత్తున డిమాండ్ ఇందుకు కారణమని వెల్లడించింది. ‘హోల్సేల్లో 2022లో జరిగిన ప్యాసింజర్ వాహన అమ్మకాలతో పోలిస్తే గతేడాది నమోదైన విక్రయాలు 8 శాతం అధికం అయ్యాయి. యుటిలిటీ వాహనాల అమ్మకాలు 22.4 శాతం వృద్ధి చెంది గత ఏడాది 23,53,605 యూనిట్లకు పెరిగాయి. వ్యాన్స్ 1,32,468 నుంచి 1,46,122 యూనిట్లకు ఎగశాయి. ప్యాసింజర్ కార్స్ 8 శాతం క్షీణించి 16,01,873 యూనిట్లకు పడిపోయాయి. అక్టోబర్–డిసెంబర్లో డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాలు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతం అధికమై 10,12,285 యూనిట్లను తాకాయి’ అని సియామ్ వివరించింది. ఇతర విభాగాల్లో ఇలా.. గతేడాది తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ద్విచక్ర వాహనాల సంఖ్య 9 శాతం పెరిగి 1,70,75,160 యూనిట్లుగా ఉంది. వాణిజ్య వాహనాలు 9.33 లక్షల నుంచి 9.78 లక్షల యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహనాలు 4,18,510 నుంచి 6,80,550 యూనిట్లకు ఎగశాయి. అన్ని విభాగాల్లో కలిపి హోల్సేల్లో వాహన విక్రయాలు గతేడాది 10 శాతం వృద్ధితో 2,28,36,604 యూనిట్లకు పెరిగాయి. 2022లో ఈ సంఖ్య 2,07,92,824 యూనిట్లుగా ఉంది. ఆటోమొబైల్ రంగానికి 2023 సహేతుకంగా సంతృప్తికరంగా ఉందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. ప్యాసింజర్, వాణిజ్య, ద్విచక్ర వాహనాలు సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేశాయి. త్రిచక్ర వాహనాలు చాలా మంచి రికవరీని సాధించాయని ఆయన పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహన విభాగంలోని మొత్తం అమ్మకాలలో యుటిలిటీ వాహనాల వాటా ఏకంగా 62 శాతానికి చేరిందని వివరించారు. 2024లో సైతం వృద్ధి జోరు కొనసాగుతుందని ఆటో పరిశ్రమ ఆశాజనకంగా ఉందన్నారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో..: న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ మండపంలో ఫిబ్రవరి 1–3 తేదీల్లో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో జరుగనుంది. రెండేళ్లకోసారి జరిగే ఆటో ఎక్స్పో కంటే ఈ ప్రదర్శన విస్తృత స్థాయిలో ఉంటుందని వినోద్ అగర్వాల్ చెప్పారు. ఆటోమొబైల్తో ముడిపడి ఉన్న అన్ని విభాగాల కంపెనీల భాగస్వామ్యంతో ఇది మరింత విస్తృత ఈవెంట్గా మారనుందని ఆయన అన్నారు. వాహన తయారీ సంస్థలతోపాటు ఈ ప్రదర్శనలో టైర్లు, స్టీల్, బ్యాటరీ, ఇతర విభాగాల కంపెనీలు సైతం పాల్గొంటాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 600 మందికిపైగా ఎగ్జిబిటర్లు పాలుపంచుకుంటారని వివరించారు. -
430 నగరాల నుంచి అయోధ్యకు నేరుగా 72 రైళ్లు..
అయోధ్యలో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అనంతరం అయోధ్యను సందర్శించేవారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయోధ్య సందర్శనకు వచ్చే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఏసీ మొదలుకొని స్లీపర్ క్లాస్, జనరల్ సౌకర్యాలతో కూడిన అన్ని రకాల రైళ్లు నడిపేందుకు సిద్ధమవుతోంది. అయోధ్య వైపు వెళ్లే రైళ్ల షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నదని సమాచారం. ప్రస్తుతం అయోధ్యకు 35 రైళ్లు నడుస్తున్నాయి. రోజువారీ రైళ్లతో పాటు, వీక్లీ రైళ్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పాటు జనవరి 22 నుంచి 37 అదనపు రైళ్లను నడపనున్నారు. దీంతో దేశంలోని 430 నగరాల నుంచి మొత్తం 72 రైళ్లు అయోధ్యకు నడవనున్నాయి. దీని గురించి రైల్వే మంత్రిత్వ శాఖ సమాచార, ప్రచురణ డైరెక్టర్ శివాజీ మారుతీ సుతార్ మాట్లాడుతూ భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు అదనపు రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. మరిన్ని నగరాలను నేరుగా అయోధ్యకు అనుసంధానం చేసేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోందని అన్నారు. ఇది కూడా చదవండి: బాలరామునికి బొమ్మల బహుమానం -
ఇండియన్ రైల్వే సూపర్ యాప్ ఎలా ఉపయోగపడుతుంది?
భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. రైలు టికెట్ బుకింగ్, రైలు ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్ చేయడం, ఫిర్యాదు చేయడం... ఇలా అన్ని సేవలను ఒకే చోట ప్రయాణికులకు అందించేందుకు భారతీయ రైల్వే కొత్త సూపర్ యాప్ను రూపొందిస్తోంది. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే రైల్వే విభాగం అందించే అన్ని సేవలను ఒకే చోట పొందవచ్చు. ఇన్నాళ్ల మాదిరిగా ప్రయాణికులు వేర్వేరు యాప్లపై అధారపడనవసరం లేదు. ఈ యాప్ ప్రాజెక్టును రైల్వే ఐటి వింగ్, సీర్ఐఎస్ పర్యవేక్షిస్తున్నదని రైల్వే విభాగానికి చెందిన ఒక అధికారి తెలిపారు. రైల్ మదద్, యూటీఎస్, నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్, పోర్ట్రెయిట్, విజిలెంట్ తనిఖీ కార్యకలాపాల టీఎంఎస్, ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్, ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్, ఐఆర్సీటీసీ ఎయిర్ మొదలైన సేవలన్నీ కొత్త సూపర్ యాప్లో విలీనం కానున్నాయి. ఈ యాప్ అందుబాటులోకి వచ్చాక కోట్లాది మంది రైల్వే వినియోగదారులు ప్రత్యేక మొబైల్ యాప్లను డౌన్లోడ్ చేసుకోనవసరం లేదు. రైల్వేకు సంబంధించిన అనేక పనులు ఇక వినియోగదారులకు సులభతరం కానున్నాయి. రైల్వే విభాగానికి ఈ సూపర్ యాప్ తయారీకి దాదాపు రూ. 90 కోట్ల ఖర్చు కానుంది. మూడు సంవత్సరాలలో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు అందుకున్న మొత్తం బుకింగ్లలో దాదాపు 5,60,000 బుకింగ్లు (సగానికి పైగా) ఐఆర్సీటీసీ యాప్ ద్వారా అందాయి. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా రైళ్ల వివరాలిలా.. ► సికింద్రాబాద్–బ్రాహ్మణ్పూర్–వికారాబాద్ (07089/07090) స్పెషల్ ట్రైన్ ఈ నెల 7, 8, 14, 15 తేదీల్లో రాత్రి 7.45కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15కు బ్రాహ్మణ్పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12.30గంటలకు బ్రాహ్మణ్పూర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. ► వికారాబాద్–బ్రాహ్మణ్పూర్–సికింద్రాబాద్ (07091/07092) స్పెషల్ ట్రైన్ ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజుఉదయం 11.15 గంటలకు బ్రాహ్మణ్పూర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 12.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► విశాఖపట్టణం–కర్నూల్ (08541/08542) ప్రత్యేక రైలు ఈ నెల 10,11, 17, 18, 24, 25 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.35కు కర్నూల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ► శ్రీకాకుళం–వికారాబాద్ (08547/08548) స్పె షల్ ట్రైన్ ఈ నెల 12, 13, 19, 20, 26, 27 తేదీ ల్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో రాత్రి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు వికారాబాద్కు చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–తిరుపతి (02764/02763) స్పెషల్ ట్రైన్ ఈ నెల 10, 11, 17,18 తేదీల్లో సాయంత్రం 6.40 కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కు చేరుకుంటుంది.తిరుగుప్రయాణంలో సాయంత్రం 5.15కు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5.55 గం.కు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–కాకినాడ (07271/07272) ప్ర త్యేక రైలు ఈనెల 12న రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చే రుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉద యం 8.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
2023లో ఢిల్లీ మెట్రోలో ఏం జరిగింది? వీడియోలు ఎందుకు వైరల్ అయ్యాయి?
ఢిల్లీ మెట్రో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేసిన తరువాత కూడా కొందరు ప్రయాణికులు తమ తీరు మార్చుకోలేదు. మెట్రోలో ముద్దులు పెట్టుకోవడం, సరసాలు ఆడటం, కొట్టుకోవడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం లాంటి పనులు 2023లో తరచూ కనిపించాయి. ఇటువంటి ఉందంతాలకు సంబంధించిన వీడియోలు ఏడాది సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఒక వీడియోలో ఒక యువతి బ్రా, షార్ట్ స్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించింది. ఈ వీడియో వైరల్ కావడంతో, ఆ అమ్మాయిని ఢిల్లీ మెట్రోలో ‘ఉర్ఫీ జావేద్’ అనే పేరు పెట్టారు. మరో వీడియోలో ఢిల్లీ మెట్రోలో ఒక బాలుడు హస్తప్రయోగం చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను చూసిన వారంతా తెగ అసహ్యించుకున్నారు. ఇంకొక వీడియోలో ఢిల్లీ మెట్రోలో ఓరల్ సెక్స్ చేస్తున్న జంట కనిపించింది. దీనిని ప్రయాణికులెవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోలో ఒక బాయ్ఫ్రెండ్ తన గర్ల్ఫ్రెండ్కి శీతల పానీయం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ ప్రియురాలు శీతల పానీయాన్ని తన నోటితో స్ప్రే చేసి.. ప్రియుడి నోట్లో పోస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా ఈ జంటను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీ మెట్రో కోచ్లో ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న వీడియో కూడా వైరల్గా మారింది. అయితే దీనిని ఎవరో అడ్డుకోవడంతో అతను సిగ్గుపడకుండా సీసాలో మూత్ర విసర్జనను కొనసాగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఢిల్లీ మెట్రోలో సీట్ల కోసం జరిగిన గొడవలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. వాటిలోని ఒక వీడియోలో సీటు విషయంలో ఓ మహిళ, పురుషుడి మధ్య గొడవ జరిగింది. ఆ మహిళ అతని ముఖంపై బలంగా కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ‘మెట్రో’ వీడియోలో కొంతమంది మహిళలు చప్పట్లు కొడుతూ భజనలు చేయడం కనిపిస్తుంది. మరో వీడియోలో ఒక అంధ జంట తమ ముగ్గురు పిల్లలతో మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీనిని చూసిన యూజర్స్ భావోద్వేగానికి లోనయ్యారు. మరో వైరల్ వీడియోలో ఒక జంట ప్రేమలో మునిగి తేలుతూ.. ముద్దులు పెట్టుకోవడం కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలన్నీ ఢిల్లీలో మెట్రోలో 2023లో చోటుచేసుకున్నాయి. ఇది కూడా చదవండి: 10 ఒళ్లు గగుర్పొడిచే దారుణాలు.. 2023 మిగిల్చిన చేదు గురుతులు! -
2023.. భారతీయ రైల్వేలో అద్భుతాలివే..
2023 సంవత్సరం ముగియబోతోంది. కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో ప్రవేశించనుంది. 2023లో భారతీయ రైల్వే అనేక విజయాలను నమోదు చేసుకుంది. ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే భారతీయ రైల్వే 2023లో ఏమి సాధించిందో ఇప్పుడు చూద్దాం. అత్యంత పొడవైన రైల్వే స్టేషన్.. ప్రపంచంలో భారీ నెట్వర్క్ కలిగిన రవాణా సాధనాలలో భారతీయ రైల్వే ఒకటి. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్గా భారత్లోని ఒక రైల్వే స్టేషన్ రికార్డు సృష్టించింది. గతంలో యూపీలోని గోరఖ్పూర్ స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్గా రికార్డు సృష్టించింది. దీని పొడవు 1,366.4 మీటర్లు. అయితే ఈ సంవత్సరం మార్చి లో హుబ్లీ రైల్వే స్టేషన్ అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారం కలిగిన స్టేషన్గా కొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్లాట్ఫారమ్ పొడవు 1,507 మీటర్లు. ఈ ప్లాట్ఫారం ఘనత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. అమృత్ భారత్ స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ల ద్వారా భారతీయ రైల్వే రూపురేఖలు మారనున్నాయి. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఆగస్టు 6న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నాయి. వీటి అభివృద్ధికి రూ.24,470 కోట్లు ఖర్చుకానుంది. ఈ పథకం ద్వారా దేశంలోని 1,309 రైల్వే స్టేషన్లు మరింత అభివృద్ధి చెందనున్నాయి. మూడువేల కొత్త రైళ్లు.. పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా భారతీయ రైల్వే రాబోయే నాలుగైదు సంవత్సరాలలో మూడువేల అదనపు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రస్తుతం రైల్వే ఏటా ఎనిమిది వందల కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేస్తున్నదని అన్నారు. ప్రయాణికుల పెరుగుదల దృష్ట్యా మరో మూడువేల రైళ్లు అవసరమని అన్నారు. ప్రతి సంవత్సరం 200 నుండి 250 కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు. 400 నుండి 450 వందే భారత్ రైళ్లకు ఇవి అదనం అని పేర్కొన్నారు. లిఫ్ట్లు/ఎస్కలేటర్లు సుగమ్య భారత్ అభియాన్లో భాగంగా భారతీయ రైల్వేలు రైల్వే ప్లాట్ఫారమ్లలో వికలాంగులు, వృద్ధులు, పిల్లలకు ఉపయోగపడేలా లిఫ్టులు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. 2021-22లో 208 లిఫ్టులు, 182 ఎస్కలేటర్లు ఏర్పాటు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 215 లిఫ్టులు, 184 ఎస్కలేటర్లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ దాదాపు మూడు కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారతీయ రైల్వేలు 68 వేల కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్వర్క్ను కలిగివుంది. ఉపాధి కల్పన విషయంలో భారతీయ రైల్వే చాలా దేశాల కంటే ముందుంది. భారతీయ రైల్వేలో 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: సీతారాముల స్వస్థలాలు ‘అమృత్ భారత్’తో అనుసంధానం! -
వచ్చే ఏడాది 25.7 బిలియన్ డాలర్ల లాభాలు
న్యూఢిల్లీ: ప్రయాణికులు, కార్గో విభాగాల వృద్ధి మళ్లీ సాధారణ స్థాయికి తిరిగొస్తున్న నేపథ్యంలో 2024లో అంతర్జాతీయంగా విమానయాన పరిశ్రమ నికర లాభాలు 25.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగలవని ఎయిర్లైన్స్ సమాఖ్య ఐఏటీఏ తెలిపింది. 2023లో ఇది 23.3 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని పేర్కొంది. ఈ ఏడాది జూన్లో అంచనా వేసిన 9.8 బిలియన్ డాలర్ల కన్నా ఇది గణనీయంగా ఎక్కువగా ఉండనున్నట్లు వివరించింది. ‘2024లో రికార్డు స్థాయిలో 470 కోట్ల మంది ప్రయాణాలు చేయొచ్చని అంచనా. 2019లో కరోనాకు పూర్వం నమోదైన రికార్డు స్థాయి 450 కోట్ల మందికన్నా ఇది అధికం‘ అని ఐఏటీఏ తెలిపింది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ తిరిగి 2019 స్థాయికి చేరుతుండటంతో ఎయిర్లైన్స్ ఆర్థికంగా కోలుకునేందుకు తోడ్పాటు లభిస్తోందని 2023 సమీక్ష, 2024 అంచనాల నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఐఏటీఏ డైరెక్టర్ (పాలసీ, ఎకనామిక్స్) ఆండ్రూ మ్యాటర్స్ చెప్పారు. మరోవైపు, ప్రస్తుత ఏడాది కార్గో పరిమాణం 58 మిలియన్ టన్నులుగా ఉండగా వచ్చే ఏడాది 61 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2.7 శాతం మార్జిన్.. ‘అవుట్లుక్ ప్రకారం 2024 నుంచి ప్యాసింజర్, కార్గో విభాగాల వృద్ధి మళ్లీ సాధారణ స్థాయికి తిరి గి వచ్చే అవకాశం ఉంది. రికవరీ ఆకట్టుకునే విధంగానే ఉన్నా నికర లాభాల మార్జిన్ 2.7 శాతానికే పరిమితం కావచ్చు. ఇలాంటి మార్జిన్లు ఏ రంగంలోనూ ఇన్వెస్టర్లకు ఆమోదయోగ్యం కావు‘ అని ఐఏ టీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్‡్ష చెప్పారు. విమానయాన సంస్థలు కస్టమర్ల కోసం ఒకదానితో మరొ కటి తీవ్రంగా పోటీపడటమనేది ఎప్పుడూ ఉంటుందని.. కాకపోతే నియంత్రణలు, మౌలిక సదుపాయాల వ్యయాలు, సరఫరా వ్యవస్థల్లో కొందరి గు త్తాధిపత్యం వంటివి పరిశ్రమకు భారంగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్ ఎంతో ఆసక్తికరంగా ఉందని, తాను అత్యంత ఆశావహంగా ఉన్నానని వాల్‡్ష తెలిపారు. ఐఏటీఏలో 300 పైచిలుకు ఎయిర్లైన్స్కు సభ్యత్వం ఉంది. ఐఏటీఏ నివేదికలో మరిన్ని విశేషాలు.. ► 2023లో ఎయిర్లైన్స్ పరిశ్రమ నిర్వహణ లాభం 40.7 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చు. వచ్చే ఏడాది ఇది 49.3 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. 2024లో పరిశ్రమ మొత్తం ఆదాయం 2023తో పోలిస్తే 7.6 శాతం వృద్ధి చెంది 964 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. ►ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కరోనా ప్రభావాల నుంచి భారత్, చైనా, ఆ్రస్టేలియా దేశాల్లో అంతర్గత మార్కెట్లు వేగంగా కోలుకున్నాయి. అయితే, 2023 మధ్య నాటికి గానీ అంతర్జాతీయ ప్రయాణాలపై చైనాలో ఆంక్షలు పూర్తిగా సడలకపోవడంతో ఆసియా పసిఫిక్ మార్కెట్లో ఇంటర్నేషనల్ ప్రయాణికుల రాకపోకలు అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతం 2023లో 0.1 బిలియన్ డాలర్ల నికర నష్టం ప్రకటించవచ్చని, 2024లో మాత్రం 1.1 బిలియన్ డాలర్ల నికర లాభం నమోదు చేయొచ్చని అంచనా. ►అంతర్జాతీయంగా ఆర్థిక పరిణామాలు, యుద్ధం, సరఫరా వ్యవస్థలు, నియంత్రణలపరమైన రిసు్కలు మొదలైనవి ఎయిర్లైన్స్ పరిశ్రమ లాభదాయకతపై సానుకూలంగా గానీ లేదా ప్రతికూలంగా గానీ ప్రభావం చూపే అవకాశం ఉంది. -
దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయి ఆదాయం
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లుగా గరిష్ట స్థాయి ఆదాయాన్ని ఆర్జిస్తూ తన పాత రికార్డులు అధిగమిస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు మరో ఘనతను సాధించింది. నవంబర్ నెలకు సంబంధించి రైల్వే శాఖ ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. ఇటు ప్రయాణికుల రైళ్ల ద్వారా, అటు సరుకు రవాణా రైళ్ల ద్వారా నవంబర్లో రూ.1,600.53 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది నవంబర్లో గరిష్ట ఆదాయం రూ.1,454 కోట్లు మాత్రమే కాగా, ప్రయాణికుల రైళ్ల ద్వారా రైల్వే ఈ సంవత్సరం నవంబర్లో 469.40 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ప్రయాణికుల అవసరాల మేరకు 342 అదనపు ట్రిప్పులను నడిపింది.ఇది 64 రైళ్లకు సమానం. వీటిల్లో 3.39 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. అలాగే రైల్వే శాఖ ఈ నవంబర్లో 11.57 మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసింది. దీని ద్వారా రూ.1,131.13 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇది గతేడాది నవంబర్ ఆదాయం కంటే పది శాతం ఎక్కువ. కొత్త క్లైంట్లతో ఒప్పందాలు చేసుకోవటం, సరుకు రవాణా చేసే కొత్త గమ్యస్థానాలను జోడించటం, కొత్త ట్రాక్ను అందుబాటులోకి తేవటం వంటి చర్యల ద్వారా ఇది సాధ్యమైందని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆదాయాన్ని భారీగా పెంచడానికి కృషి చేసిన ఉద్యోగులు, ఇతర సిబ్బందిని జోన్ జీఎం అరుణ్కుమార్ జైన్ అభినందించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించి కూడా ఇదే తరహా రికార్డును సాధించాలని ఆయన సూచించారు. -
రైలులో కలుషిత ఆహారం.. 40 మందికి అనారోగ్యం
మహారాష్ట్రలోని పూణె రైల్వే స్టేషన్లో కలకలం చెలరేగింది. చెన్నై నుంచి పుణెకు వస్తున్న భారత్ గౌరవ్ రైలులో 40 మంది ప్రయాణికుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. రైలు పూణె చేరుకోగానే ప్రయాణికులకు వైద్య చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రైలు పూణే చేరుకోగానే 80 మంది ప్రయాణికుల అనారోగ్యానికి గురైనట్లు తమకు ఫిర్యాదు అందిందని పూణే రైల్వే అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఆ తర్వాత వారికి రైల్వేస్టేషన్లోనే ప్రథమ చికిత్స అందించి, ఆ తరువాత బాధితులను ససూన్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రైలులో ఉన్న కొందరు యువకులు రైలులోనివారికి కలుషిత ఆహారం ఇచ్చారు. రైల్వేశాఖ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. ఇది కూడా చదవండి: ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే.. Bharat Gaurav Train Food Poisoning: 40 Passengers Fall Sick After Eating Food on Chennai-Pune Train (Watch Video)#BharatGauravTrain #FoodPoisoning #ChennaiPuneTrain #ViralVideo #Chennai #Punehttps://t.co/0Y63ZBmPVL — LatestLY (@latestly) November 29, 2023 -
26/11 తరువాత ముంబై రైల్వే స్టేషన్ల పరిస్థితి ఇదే..
మహానగరం ముంబైలో నిత్యం రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ)ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు 2008, నవంబరు 26న దాడులు జరిపారు. ఈ దాడుల్లో 50 మంది రైల్వే స్టేషన్లోనే మృతి చెందారు. ఈ ఘటన అనంతరం రైల్వేశాఖ స్టేషన్లలో భద్రతకు పలు చర్యలు చేపట్టింది. ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, రౌండ్ ది క్లాక్ భద్రతను కల్పించారు. సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్లలోని 80 సున్నితమైన ప్రదేశాలలో 3,459 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశాల్లోని రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది ఫుటేజీని పర్యవేక్షిస్తారు. పశ్చిమ రైల్వే లైన్లోని ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ కింద 31 స్టేషన్లలో 2,770 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీడియో సర్వైలెన్స్ సిస్టమ్ ద్వారా 62 స్టేషన్లకు మరో 1,039 సీసీ కెమెరాలు మంజూరయ్యాయని, నిర్దిష్ట స్టేషన్లలో ఇప్పటికే 160 కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. వాకీ-టాకీలు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్హెల్డ్ మెటల్ డిటెక్టర్లు, బారికేడ్లు వంటి అవసరమైన భద్రతా పరికరాలను కొనుగోలు చేశామని, వీటిని ప్రయాణికుల భద్రత కోసం ఉపయోగిస్తున్నామని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు. ఇది కూడా చదవండి: నాడు కసబ్ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది? -
వందేభారత్ స్నాక్ ట్రేలు ధ్వంసం చేస్తున్న పిల్లలు?
భారతీయ రైల్వేకు సంబంధించిన ఓ వింత ఘటన బుధవారం వెలుగు చూసింది. రైలులో పరిశుభ్రత లోపించడం, సరిగా లేని ఆహారం తదితర విషయాలపై ప్రతిరోజూ రైల్వే అధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా రైల్వే అధికారి ఒకరు ప్రయాణికులపై ఆరోపణలు చేశారు. అనంత్ రూపనగుడి అనే రైల్వే అధికారి ఇద్దరు చిన్నారుల ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వందే భారత్, ఇతర రైళ్లలో స్నాక్ ట్రేలు విరిగిపోవడానికి లేదా పాడైపోవడానికి ఇదే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఫోటోలో ఆ పిల్లలు ట్రేపై కూర్చున్నారు. అయితే ఆ ఫోటో సరైనదో కాదో ఇంకా తెలియరాలేదు. ఈ పోస్ట్ను లక్ష మందికి పైగా నెటిజన్లు చూశారు. వెయ్యిమందికిపైగా యూజర్లు లైక్ చేశారు. 350 మందికి పైగా యూజర్లు ఈ పోస్టును షేర్ చేశారు. దీనిపై స్పందించిన ఒక యూజర్.. ఇలాంటి పిల్లల తల్లిదండ్రుల నుండి జరిమానా వసూలు చేయాలని రాశారు. అయితే రైల్వేశాఖ నుంచి ఈ ఘటనపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది కూడా చదవండి: మనిషి పాదరక్షలు ఏనాటివి? ఆశ్చర్యపరుస్తున్న పరిశోధనలు! One of the main reasons for breaking of snack trays or defective snack trays in #VandeBharat and other trains! Even with photographic evidence, whiners would say that I pass on the blame only to passengers! #IndianRailways #Responsibility #passengers pic.twitter.com/ykv0VNED9a — Ananth Rupanagudi (@Ananth_IRAS) November 22, 2023 -
మెట్రోలో ఇకపై పిచ్చిపిచ్చి వీడియోలు కుదరవ్!
ఢిల్లీ మెట్రోకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఒక్కోసారి ప్రేమికుల రొమాన్స్, మరోసారి యువకుల ఫైట్స్, ఇంకొన్నిసార్లు యువతీయువకుల డ్యాన్స్.. ఇలాంటి వీడియోలు తరచూ కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు అభ్యంతరకరంగా ఉంటున్నాయి. వీటిని గమనించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) చీఫ్ వికాస్ కుమార్ ఇలా వీడియోలు తీసేవారిని హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు మెట్రో అధికారులు పలు కఠిన చర్యలు చేపడుతున్నారని తెలిపారు. వీడియో మేకింగ్ ఘటనలను నివారించేందుకు ఒక బృందం మెట్రోలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుందన్నారు. అభ్యంతరకర వీడియోలు తీస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరగా ఫేమస్ అయ్యేందుకు చాలామంది మెట్రో లోపల వీడియోలు షూట్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం జరుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు వేగంగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కురచ దుస్తులు ధరించి యువతులు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇటువంటి ఘటనలను నియంత్రించేందుకు మెట్రో లోపల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తోటి ప్రయాణికులు మెట్రో అధికారులకు తెలియజేయాలని డీఎంఆర్సీ చీఫ్ వికాస్ కుమార్ కోరారు. ఇది కూడా చదవండి: సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల! -
AP: విమానయానం ఫుల్ జోష్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విమానయానరంగం జోరుమీద కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల ద్వారా 27,49,835 మంది ప్రయాణించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్యలో 17.22శాతం వృద్ధి నమోదైంది. 2022-23 సంవత్సరంలో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల నుంచి 23,45,795 మంది ప్రయాణించగా, ఆ సంఖ్య ఈ ఏడాది 27,49,835కు చేరింది. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయన్న విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విశాఖలో అత్యధిక వృద్ధి... పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం విమానాశ్రయం అన్నిటికంటే అత్యధికంగా 30.5శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. గత ఏడాది విశాఖ నుంచి 11.50 లక్షల మంది ప్రయాణించగా, ఆ సంఖ్య ఈ ఏడాది ఏకంగా 15.03 లక్షలకు పెరిగింది. పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి విశాఖకు విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, గత కొన్ని నెలలుగా నమోదవుతున్న గణాంకాలే దీనికి నిదర్శనమని ఎయిర్పోర్టు అధికారులు పేర్కొన్నారు. విశాఖ తర్వాత గడిచిన ఆరు నెలల్లో విజయవాడ నుంచి 5.41 లక్షల మంది, తిరుపతి నుంచి 4.30 లక్షల మంది, రాజమండ్రి నుంచి 2.11 లక్షల మంది ప్రయాణించారు. కడప ఎయిర్పోర్టు నుంచి 41,056 మంది, కర్నూలు ఎయిర్పోర్టు నుంచి 21,326 మంది ప్రయాణించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల విమానాలు రద్దు కావడంతో తిరుపతి, కర్నూలు విమానాశ్రయాల నుంచి ప్రయాణించేవారి సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైందని, రానున్నకాలంలో ఈ రెండు చోట్ల నుంచి కూడా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ‘భోగాపురం’తో డబుల్ ప్రస్తుతం నడుస్తున్న విశాఖపట్నం విమానాశ్రయం ఎయిర్ఫోర్స్ వారిది కావడంతో రాత్రిపూట అనేక ఆంక్షలు ఉన్నాయని, భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఆంక్షలు తొలగిపోతాయని, ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో భోగాపురం విమానాశ్రయం నిర్మిస్తున్నారు. ఈ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ విమానాశ్రయం 2025 నాటికి అందుబాటులోకి రానుంది. చదవండి: వావ్..విశాఖ! -
సూరత్లో ‘దీపావళి ప్రయాణికుల’ తొక్కిసలాట.. పలువురికి అస్వస్థత!
దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. గ్రామాలకు వెళ్లేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను రద్దీగా మారాయి. ఈ నేపధ్యంలో కొన్నిచోట్ల తొక్కిసలాటలు కూడా చోటుచేసుకుంటున్నాయి. గుజరాత్లోని సూరత్ రైల్వే స్టేషన్కు సొంతూళ్లకు వెళ్లేందుకు భారీగా ప్రయాణికులు తరలివచ్చారు. వీరంతా రైళ్లు రాగానే ఒక్కసారిగా రైలులోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో టిక్కెట్లు ఉన్న వారు కూడా రైలు ఎక్కలేని పరిస్థితి నెలకొంది. दीपावली घर जाने को सूरत रेलवे स्टेशन पहुंचे यूपी और बिहार के मजदूर दम घुटने के कारण घायल हो गए। pic.twitter.com/zPMRZ0mpbg — Rakesh chaudhari (@Rakeshchau58578) November 11, 2023 ఈ సమయంలో తోపులాట జరిగి, పలువురు ప్రయాణికులు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. కొందరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీనిని గమనించిన రైల్వే పోలీసులు బాధిత ప్రయాణికులకు సీపీఆర్ ఇచ్చి వారిని కాపాడారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఉపాధి రీత్యా సూరత్లో ఉంటున్నారు. వీరంతా దీపావళి పండుగకు తమ ఊళ్లకు వెళ్లాలని రైల్వే స్టేషన్కు తరలివస్తున్నారు. ఫలితంగా రైల్వే స్టేషన్లో రద్దీ నెలకొంటోంది. ఇది కూడా చదవండి: ‘గ్రేవ్యార్ట్ ఫర్ చిల్డ్రన్’ అంటే ఏమిటి? -
ఎలాగైనా.. ఊరికి పోవాల్సిందే!
నగర దారులన్నీ పల్లె‘టూరు’ దారి పడుతున్నాయ్. బస్సూ, రైలూ, కారూ, బైకూ.. ఏదైనా సరే ఊరికి పోవడమే లక్ష్యం. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం దసరా పండగ కావడంతో శనివారం పట్నవాసులు పల్లెలకు పయనమయ్యారు. సొంతూరిని ఓసారి మనసారా చూసొద్దామని ఆశగా బయలుదేరారు. నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర బస్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. – సాక్షి, స్టాఫ్ఫొటోగ్రాఫర్ -
రైలు పక్కనే కాచుకుని ఉంటారు, చటుక్కున మొబైల్ లాగేసుకుంటారు
-
ఎయిర్పోర్టు సిబ్బంది చేతివాటం.. సీసీటీవీ కెమెరాలో రికార్డు
ఎయిర్పోర్టులో అంతర్జాతీయ ప్రయాణికులు అక్రమంగా బంగారం, డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డ ఘటనలు తరుచూ రావడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఎయిర్పోర్టు సిబ్బంది చేతివాటం చూపించారు. అది కూడా ప్రయాణికుడికి సంబంధించిన బ్యాగ్ నుంచి డబ్బులు, వస్తువులు కొట్టేశారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో జరిగింది. అయితే జూన్ 29న జరిగిన ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఆలస్యంగా వెలుగులోకి చ్చింది. అసలేం జరిగిందంటే.. మియామి ఎయిర్పోర్టులోని చెక్ పాయింట్ వద్ద ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది ప్రయాణికుల సామాన్లను భద్రపరుస్తున్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ స్కానర్ మెషిన్పై ఉంచిన బ్యాగ్లో నుంచి 600 డాలర్లను కాజేశారు. ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తున్నట్లు నటిస్తూ.. ఎవరికి కనపడకుండా మెల్లగా ఆ డబ్బులను బ్యాగ్ నుంచి కాజేసి తన జేబులో వేసుకున్నారు. డబ్బులతోపాటు ఇతర వస్తులను సైతం దొంగిలించాడు. TSA Agents caught on surveillance video stealing hundreds of dollars in cash from passengers’ bags at Miami airport. pic.twitter.com/LhFW9yNRNV — Mike Sington (@MikeSington) September 13, 2023 ఈ దృశ్యాలన్నీ ఎయిర్పోర్టులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రయాణికుల వస్తువులు కనిపించకపోవడంతో.. అక్కడున్న సెక్యురిటీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. నిందితులను టీఎస్ఏ సిబ్బంది 20 ఏళ్ల జోస్యు గొంజాలెజ్, 33 ఏళ్ల లాబారియస్ విలియమ్స్గా గుర్తించారు. వారిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులు కలిసి అనేక దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకు రోజు దాదాపు వెయ్యి డాలర్లు దొంగిలించినట్లు అంగీకరించారు. అలాగే విచారణ పూర్తయ్యే వరకు ముగ్గురిని స్క్రీనింగ్ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. కాగా ఇలాంటి చర్యలను తాము ఉపేక్షించమని, చోరీకి పాల్పడిన వారిని ఆధారాలతో సహా పోలీసులకు అప్పగించామని టీఎస్ఏ ఓ ప్రకటనలో తెలిపింది. -
జనం.. గగనయానం!
హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఏపీలోని విశాఖపట్నంలో ఓ శుభకార్యానికి వెళ్లాల్సి వచ్చింది. రైలులో వెళ్లి రావాలంటే.. మూడు, నాలుగు రోజులు సెలవు పెట్టాలి. పైగా సుదీర్ఘ ప్రయాణంతో ఇబ్బంది. దీంతో విమానంలో వెళ్లాడు. మరుసటి రోజు ఉదయానికల్లా హైదరాబాద్కు వచ్చేసి యథావిధిగా ఆఫీసుకు వెళ్లాడు. కీసర ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. నాలుగు రోజుల పాటు సరదాగా ఎక్కడికైనా వెళ్లాలనుకున్నారు. విమాన టికెట్లు అందుబాటులో ఉండటంతో బుక్ చేసుకుని సింగపూర్ చుట్టి వచ్చేశారు. ఇదీ ప్రయాణికుల రద్దీ 2022 ఏప్రిల్నుంచి జూలై వరకు ప్రయాణికుల సంఖ్య: 26,73,979 పెరిగిన ప్రయాణికుల శాతం:28.2% ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు సంఖ్య: 34,29,083 ..రాష్ట్రంలో విమాన ప్రయాణికులు పెరుగుతున్నారనేందుకు ఈ రెండు చిన్న ఉదాహరణలే. దూర ప్రయాణాలకు ఎక్కువ సమయం పట్టడం, ప్రయాణ బడలిక, ఇతర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చాలా మంది విమాన ప్రయాణాలకు మొగ్గుచూపుతున్నారు. విమాన టికెట్ల ధరలు అందుబాటులో ఉండటం, విదేశాలకు వెళ్లేందుకు వీసాలు కూడా సులువుగా లభిస్తుండటంతో విదేశాలకు వెళ్లేవారూ పెరుగుతున్నారు. మరోవైపు చదువుల కోసం విదేశాలకు వెళ్లివచ్చే విద్యార్థుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. దీనితోనూ విమానాలకు డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగాయి. ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు, ఆహా్వనం పలికేందుకు వస్తున్న బంధువులు, స్నేహితుల రద్దీని నియంత్రించేందుకు ఎయిర్పోర్టు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి రావడం గమనార్హం. ఒక్క జూలై నెలలోనే 3.68 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు, 16.40 లక్షల మంది దేశీయ ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించడం విశేషం. 25శాతం పెరిగిన ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విదేశాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు కలిపి రోజూ సుమారు 400 వరకు విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. సగటున రోజూ 65వేల మందికిపైగా వీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. కొన్నిరోజులుగా ఈ సంఖ్య 70వేలకుపైగా ఉంటోందని, విదేశాలకు వెళ్లే విద్యార్ధులే రోజూ సుమారు 5 వేల మంది వరకు ఉంటున్నారని ఎయిర్పోర్టు అధికారులు చెప్తున్నారు. అమెరికాకు వెళ్లే విద్యార్ధులతోపాటు పర్యాటకులు, బంధువుల వద్దకు వెళ్లేవారు కూడా పెరిగారని అంటున్నారు. ఇక దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, జైపూర్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు,వ్యాపారం,ఇతర పనులపై రాకపోకలు సాగించేవారు ఎక్కువయ్యారని చెప్తున్నారు. గత ఏడాది జూలైలో 16,01,281 మంది విమాన ప్రయాణం చేయగా.. ఈసారి ఆ సంఖ్య 25శాతం పెరిగి 20 లక్షలకుపైగా నమోదైంది. అవసరం ఏదైనా విమానం ఎక్కాల్సిందే.. దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాలు, ఇతర ముఖ్యమైన నగరాలకు హైదరాబాద్ నుంచి విమాన కనెక్టివిటీ పెరిగింది. యూరప్తోపాటు దుబాయ్, సింగపూర్, మలేసియా, థాయ్లాండ్, మాల్దీవులు, ఢాకా వంటి దేశాలు, అంతర్జాతీయ నగరాలకు ఇక్కడి నుంచి నేరుగా విమానాలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు కోవిడ్ తర్వాత చాలా మంది విమాన ప్రయాణానికి మొగ్గుచూపుతున్నట్టు ట్రావెల్ ఏజెన్సీలు, పర్యాటక రంగ సంస్థలు చెప్తున్నాయి. ఒకప్పుడు తప్పనిసరి అయితే తప్ప విమాన ప్రయాణం జోలికి వెళ్లనివారు కూడా.. ఏమాత్రం అవకాశం ఉన్నా విమానంలో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నాయి. కొంత ఖర్చయినా ఫర్వాలేదు, విమానంలో వెళ్లాలనే కోరికతో సాధారణ, మధ్య తరగతి వర్గాలవారు కూడా విమానం ఎక్కేస్తున్నారని పేర్కొంటున్నాయి. -
‘లోకల్’లో హోరాహోరీ.. ‘మెట్రో’తో పోటీ అంటూ..
రద్దీగా ఉన్న ముంబై లోకల్ ట్రైన్లో సీటు కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ చెలరేగడాన్ని గమనించవచ్చు. Just a Normal daily scene inside a crowded #MumbaiLocal Loved the Super Cool Referee.. pic.twitter.com/i0X9yAperP — मुंबई Matters™ (@mumbaimatterz) September 1, 2023 ముంబైలోని కిక్కిరిసిన లోకల్ రైళ్లలో పరిమిత సీటింగ్ స్థలం కోసం ప్రయాణికులు పోటీ పడుతుంటారు. అయితే ఈ వీడియోలో ఇద్దరు ప్రయాణికులు కొట్టుకుంటుండగా ఒక ప్రయాణికుడు జోక్యం చేసుకుని వారిద్దరి ఆగ్రహాన్ని చల్లార్చాడు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో ఇంటర్నెట్లో ముంబై లోకల్.. ఢిల్లీ మెట్రో మధ్య పోలికలు మొదలయ్యాయి. ఢిల్లీ మెట్రోలో ఘర్షణలు, ఇబ్బందికర పరిస్థితులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఢిల్లీ మెట్రోతో ముంబై లోకల్ రైలు పోటీపడుతున్నదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పుట్టాడు ఏలియన్ లాంటి పిల్లోడు.. చేస్తున్నాడు వింతవింత శబ్ధాలు! Fight in Delhi metro. Passengers were fighting into the train during the journey. #delhimetro #Metro #Delhi pic.twitter.com/kDUOydRQEY — anuj kumar singh (@sanuj42) June 28, 2023 -
నిద్రలో భుజంపై వాలితే అలా కొడతారా..?
న్యూయార్క్: నిద్రలో భుజంపై వాలిపోయినందుకు పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడో వ్యక్తి. మోచేయితో భీకరంగా దాడి చేయగా.. బాధితుడు అక్కడే మూర్చపోయాడు. బాధితుని స్నేహితులు తిరగబడటంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఈ దారుణ ఘటన న్యూయార్క్లోని మెట్రో రైలులో జరిగింది. మెట్రో రైలు ఫారెస్ట్ హిల్స్ 71వ అవెన్యూ స్టాప్ సమీపంలో సబ్వేకు చేరేసరికి ఉదయం 5:30 గంటల సమయం అవుతోంది. నిద్రలో పక్కనే ఉన్న ఓ ప్యాసింజర్ భుజంపై అనుకోకుండా వాలిపోయాడో వ్యక్తి. దీంతో ఆ ప్యాసింజర్ వాగ్వాదానికి దిగాడు. నిద్రలో ఉన్న వ్యక్తి స్నేహితులు ఆ ప్యాసింజర్తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆగ్రహంతో పక్కనే ఉన్న వ్యక్తిని మోచేతితో బలంగా దాడి చేశాడు. అంతే.. ఆయన అక్కడే మూర్చపోయాడు. New York man elbows another passenger on the subway #subwaycreatures #nyc #frailego pic.twitter.com/N6KX6ltBIz — Rama (@EyesWitness00) August 24, 2023 బాధితుని స్నేహితులు గొడవకు దిగారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో మెట్రో ఆ కంపార్ట్మెంట్ రణరంగంగా మారింది. ఆ వెంటనే స్టాప్ రావడంతో అందరూ దిగిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన వ్యక్తిని గాలిస్తున్నారు. ఇదీ చదవండి: ఏంటి గురూ..! ఏకంగా విమానంలోనే ఇలా చేస్తావా..? -
కోలుకుంటున్న బస్సు ప్రమాద బాధితులు
సాక్షి, పాడేరు: పాడేరు ఘాట్ లోయలో ఆర్టీసీ బస్సు దూసుకుపోయిన ఘటనలో గాయపడిన ప్రయాణికులు కోలుకుంటున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో 21 మందికి నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన సేవలందుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, జిల్లా ఇన్చార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్లు.. కలెక్టర్, ఇతర వైద్య శాఖ అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్పర్సన్ గదల బంగారమ్మ, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ కణితి వెంకటరావులు ఆస్పత్రికి వెళ్లి బాధిత ప్రయాణికులను పరామర్శించారు. తీవ్ర గాయాలపాలైన బోడిరాజు, చిన్నమ్మలకు విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో ఉన్నత వైద్య సేవలు అందడంతో ప్రాణాపాయం తప్పిందని పాడేరు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు చెప్పారు. మెడికవర్ ఆస్పత్రిలో బాధితులను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ శంకరరావు సోమవారం పరామర్శించారు. ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆయన తెలిపారు. ఆయా ఆస్పత్రుల్లో బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, పౌష్టికాహారం, ఇతర సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి కలెక్టర్ సుమిత్కుమార్, ఇతర అధికారులు నివేదికలు పంపుతున్నారు. ప్రయాణికులు కొండన్న, నారాయణమ్మల మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
8 కిలోల బంగారం దుస్తుల్లో దాచేశారు..
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న 8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారు జామున బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఓ ప్రయాణికుడు ప్యాంటులో దాచి తీసుకొచ్చిన 2 కేజీల బంగారం బిస్కెట్ ముక్కలు బయటపడ్డాయి. వీటి విలువ రూ.1.21 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. అదే విమానంలో వచ్చిన మరో ప్రయాణికుడు కూడా లోదుస్తుల్లో దాచుకుని తీసుకొచ్చిన 1.75 కేజీల బంగారం బయటపడింది. దీని విలువ 1.8 కోట్లుగా నిర్ధారించారు. షార్జా నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద లో దుస్తుల్లో దాచుకుని తీసుకొచ్చిన 2.17 కేజీల బంగారం పేస్టును బయటికి తీశారు. దీని విలువ 1.31 కోట్లుగా నిర్ధారించారు. దుబాయ్ నుంచి వచ్చిన మరో వ్యక్తి ధరించిన లో దుస్తుల్లో 2.05 కేజీల బంగారం బయటపడింది. దీని 1.24 కోట్లుగా నిర్ధారించారు. ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం పట్టుబడిన 8 కేజీల బంగారం విలువ రూ.4.86 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ ఏడాదిలో ఒకే రోజులో అత్యధికంగా పట్టుబడిన బంగారం ఇదేనని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. -
సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రయాణికులను వదిలేసి ఇండిగో విమానం టేకాఫ్
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో విమానయాన సంస్థల నిర్లక్ష్యం ప్రయాణికులకు సంకటం కలిగిస్తోంది. 6 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండా ఇండిగో విమానం వెళ్లిపోయింది. బెంగళూరు నుంచి మంగళూరుకు వెళ్లే ఇండిగో 6ఈ 6162 విమానంలో ప్రయాణించడానికి 6 మంది టికెట్లు బుక్ చేసుకుని విమానాశ్రయంలో వేచి ఉన్నారు. కానీ విమానం 12 నిమిషాలు ముందుగా టేకాఫ్ తీసుకుంది. దీంతో 6 మంది ఆ సంస్థ సిబ్బందిని నిలదీయడంతో వారిని మరో విమానంలో మంగళూరుకు పంపించారు. -
ఆ విమానంలో ప్రయాణం.. గంటన్నరపాటు నరకం అంటున్న ప్యాసింజర్లు
ఇటీవల విమాన ప్రయాణికులకు సంబంధించిన అంశాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రయాణికులు అసభ్యకరంగా ప్రవర్తించడమో, లేదా సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమో లాంటి ఘటనలు తెరపైకి వస్తున్నాయి. అనంతరం వీటిపై చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే వీటిని పునరావృతం కాకుండా మాత్రం చేయలేకపోతున్నారు అధికారులు. తాజాగా ఇండిగో విమానంలోని ప్యాసింజర్లు గంటకు పైగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ఇండిగో విమానంలో చండీఘడ్ నుంచి జైపూర్ వెళుతుండగా ఈ పరిస్థితి ఎదురైనట్టు సమాచారం. దీనిపై పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ రాజా వార్రింగ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముందంటే... విమానంలో ఏసీలు పనిచేయకపోవడంతో తాము 90 నిమిషాల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డాం. తొలుత తాము విమానంలోకి వెళ్లేందుకు దాదాపు 15 నిమిషాల వరకు సెగలు కక్కుతున్న వాతావరణంలో క్యూలో నిలబడాల్సి వచ్చిందన్నారు. ఆ తరువాత ఏసీ ఆన్లో లేనప్పటికీ విమానాన్ని టేకాఫ్ చేసినట్లు చెప్పారు. అమరీందర్ సింగ్ దీనిపై స్పందిస్తూ.. ‘‘విమానం బయలుదేరిన సమయం నుంచి ప్రయాణం ముగిసే వరకూ ప్రయాణికులందరూ ఏసీ లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇంత పెద్ద సమస్యను ఎవరు పట్టించుకోలేదు. శ్వేదం తుడుచుకునేందుకు మా అందరికీ ఎయిర్హాస్టస్ బోలెడన్ని టిష్యూ పేపర్లు ఇచ్చింది. ప్రయాణికులు తమ వద్ద ఉన్న పేపర్లు, టిష్యులతో విసురుకుంటూ కనిపించారు’’ అసలు విమానంలో ఈ పరిస్థితి ఏంటో నాకు అర్థంకావడంలేదన్నారు. కాగా ఈ ట్వీట్ను డీజీసీఏ, ఏఏఐలను కూడా ట్యాగ్ చేశారు. కొంద మంది ప్రయాణికులు 90 నిమిషాలు నరకం అనుభవించినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇదిలా ఉండగా.. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం సంభవించడం ఇది మూడవది. శుక్రవారం ఢిల్లీ వెళ్లే ఇండిగో విమానాన్ని పాట్నాలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇంజిన్ వైఫల్యం కారణంగా విమానం టేకాఫ్ అయిన మూడు నిమిషాల తర్వాత ఈ అత్యవసర ల్యాండింగ్ జరిగింది. ఈ విమానం ఉదయం 9.11 గంటలకు పాట్నాలోని జై ప్రకాష్ నారాయణ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి రాంచీకి తిరిగి వస్తున్న మరో విమానంలో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన అరగంట తర్వాత, పైలట్ ఈ విషయాన్ని ప్రకటించాడు. విమానాన్ని తిరిగి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువెళుతున్నట్లు చెప్పాడు. Had one of the most horrifying experiences while traveling from Chandigarh to Jaipur today in Aircraft 6E7261 by @IndiGo6E. We were made to wait for about 10-15 minutes in the queue in the scorching sun and when we entered the Plane, to our shock, the ACs weren't working and the… pic.twitter.com/ElNI5F9uyt — Amarinder Singh Raja Warring (@RajaBrar_INC) August 5, 2023 -
దారుణం: ఘోర రైలు ప్రమాదం..33 మంది మృతి..
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దాదాపు 33 మంది మరణించారు. సుమారు 80 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఎక్స్ప్రెస్ రైలు రావల్పిండికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ప్రారంభించామని అధికారులు తెలిపారు. Pakistan: 30 dead, 80 injured after 10 coaches of Hazara Express derail in Sindh Read @ANI Story | https://t.co/76FRYrynMI#Pakistan #hazaraexpress #Sindh pic.twitter.com/apJHUHBxFE — ANI Digital (@ani_digital) August 6, 2023 హజరా ఎక్స్ప్రెస్ రావల్పిండికి వెళ్తుండగా.. షాజాద్పూర్, నవాబ్షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో దాదాపు 10 బోగీలు పట్టాలు తప్పిపోయాయి. దీంతో 15 మంది అక్కకిడక్కడే మృతి చెందారు. కరాచీ నుంచి పంజాబ్కు వెళ్లే ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇదీ చదవండి: అవయవ మార్పిడికి దేశంలో 56 వేల మంది వెయిటింగ్ -
విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్:మెగా సేల్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ బడ్జెట్ ధరల ఆకాశ ఎయిర్ గుడ్ న్యూస్ చెప్పింది. తొలి వార్షికోత్సవం సందర్భంగా తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. స్పెషల్ వార్షికోత్స సేల్స్ ద్వారా విమాన టికెట్లపై 15 శాతం మేర డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ 16 డొమెస్టిక్ రూట్లకు వర్తిస్తుందని ఆకాశ ఎయిర్ తెలిపింది. ఆకాశ ఎయిర్ వెబ్సైట్, యాప్లోకి వెళ్లి వార్షికోత్సవం ఆఫర్ కింద 15 శాతం తక్కువ ధరకే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఆగస్టు 7 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ సేల్ ఆకాశ ఎయిర్ సేవల్, ఫ్లెక్సీ ఫేర్ టికెట్లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు ఆకాశ ఎయిర్ వెబ్సైట్లో AKASA1 కోడ్ ఉపయోగించడం ద్వారా ఆఫర్ పొందవచ్చు. అలాగే ఆకాశ ఎయిర్ లైన్స్ యాప్లో APPLOVE కోడ్ ఉపయోగించి ఆఫర్ అందుకోవచ్చు. దేశీయంగా 16 రూట్లలో ప్రయాణానికి ఈ మెగా సేల్ ఆఫర్ను వినియోగించుకోవచ్చు. కంపెనీ యాప్లో ప్రత్యేకంగా బుక్ చేసుకున్న తర్వాత, ప్రయాణీకులు జీరో కన్వీనియన్స్ ఫీజు పొందే అవకాశం కూడా ఉంది. తద్వారా ప్రతి బుకింగ్పై అదనంగా రూ. 350 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి ఎయిర్లైన్ నిబద్ధతలో భాగంగా అందిస్తున్న పరిమిత-కాల ఆఫర్అని కంపెనీ వెల్లడించింది. అంతేకాదు అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించే క్రమంలో ఆగస్ట్ 1న, అకాశఎయిర్ 20వ ఎయిర్క్రాఫ్ట్ 737 MAX ను తన ఖాతాలో చేర్చుకున్నట్లు ప్రకటించింది. 12 నెలల్లోపు సున్నా నుండి 20 విమానాలకు వెళ్లడం కేవలం ఆకాసా రికార్డు మాత్రమే కాదు రికార్డు" అని ఆకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ దూబే పేర్కొన్నారు. కాగా ప్రముఖ స్టాక్మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్ఝన్వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ లైన్ 2022, ఆగస్టులో తన సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 35 మార్గాల్లో వారానికి 900 విమానాలను నడుపుతోంది. ప్రధానంగా ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గువాహటి, అగర్తల, పుణే, లఖ్నవూ, గోవా, హైదరాబాద్, వారణాసి, భువనేశ్వర్, కోల్కతాలకు విమాన సేవలు అందిస్తోంది. Coming soon: Long Weekend. Have you booked yet? Get up to 15% off on over 900 weekly flights across India. Use promo code: AKASA1 Valid till: 7th Aug, 2023 Book NOW: https://t.co/aYCnmVC8ip#ItsYourSky #AkasaAir #flightoffer #longweekend #weekend #flights pic.twitter.com/W4Q1GR6DAi — Akasa Air (@AkasaAir) August 2, 2023 Thank you for being a part of our journey, @BoeingAirplanes! https://t.co/PbUIEgBmf5 — Akasa Air (@AkasaAir) August 2, 2023 -
చెన్నై విమానాశ్రయంలో శ్రీలంక మహిళ మృతి
అన్నానగర్: చైన్నె నుంచి శ్రీలంకలోని జాఫ్నాకు అలయనన్స్ ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం శనివారం ఉదయం 10.05 గంటలకు బయలుదేరేందుకు సిద్ధమైంది. ఆ విమానంలో ప్రయాణించాల్సిన వారు భద్రతా తనిఖీలు ముగించుకుని బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. శ్రీలంకకు చెందిన శివకజన్ లిట్టి(43) తమిళనాడులో ఆధ్యాత్మిక పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లడానికి వచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆమె స్పృహతప్పి పడిపోయారు. వైద్యులు పరీక్షించి ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడించారు. ఎయిర్పోర్టు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చైన్నె ఎయిర్పోర్ట్ పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం చైన్నెలోని శ్రీలంక రాయబార కార్యాలయానికి కూడా సమాచారం అందించారు. దీంతో విమానం గంట ఆలస్యంగా బయలుదేరింది. -
బస్సులో మొదట మహిళ ఎక్కితే.. కలిసిరాదా..? ఇది ఏం మూఢత్వం..?
భువనేశ్వర్: శాస్త్ర సాంకేతికత పెరిగినా మనిషి మూఢత్వాన్ని వదలడంలేదు. ఎవరో ఎదురువస్తే మంచిదంటూ, మరెవరో వస్తే చెడు జరుగుతుందంటూ కొందరు భావిస్తున్నారు. ఏదో ఒక విధంగా ఏదో ఒక వర్గంపై వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఒడిశాలో ఎదురైంది. కొత్తగా తీసుకువచ్చిన బస్సుల్లో మహిళలను మొదటి ప్యాసింజర్గా ఎక్కకుండా ఆపేసిన ఘటనపై ఒడిశా మహిళా కమిషన్ మండిపడింది. ఇలాంటి వివక్షను ఆపేయాలని రవాణా డిపార్ట్మెంట్కు సూచనలు చేసింది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా తీసుకువచ్చిన బస్సుల్లో మహిళలను మొదటి ప్యాసింజర్గా ఎక్కకుండా భువనేశ్వర్లోని బారాముండా బస్సు స్టేషన్లో ఆపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాజిక కార్యకర్త ఘాసిరామ్ పాండా రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కమిషన్ రాష్ట్ర రవాణా యంత్రాంగానికి తగు సూచనలు చేసింది. మహిళలు మొదటి ప్యాసింజర్గా ఎక్కితే.. ఆ రోజు బస్సుకు ప్రమాదమో లేక తక్కువ వసూలు చేయడమో జరుగుతుందని భావించడం వివక్షాపూరితం అంటూ తెలిపింది. ఇది పూర్తిగా మూఢత్వం అని పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన మహిళా కమిషన్.. మహిళలను తొలి ప్రయాణికులుగా ఎక్కేందుకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని రవాణాశాఖకు సూచనలు చేసింది. గతంలోనూ ఈ తరహా ఘటనలు వెలుగుచూసినట్లు గుర్తుచేసింది. ఇకముందు మహిళా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా వారి గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు తమ మొదటి ప్యాసింజర్గా మహిళలనూ అనుమతించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సిబ్బందికి ఈ మేరకు అవగాహన కల్పించాలని కోరింది. బస్సుల్లో మహిళల రిజర్వేషన్ను 50 శాతానికి పెంచాలని మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్ప్రెస్ ట్రైన్ -
బస్సు వైపు దూసుకొచ్చిన ఏనుగు..అంతా చివరి రోజు అనుకున్నారు.. కానీ
మనం చేసే ప్రయాణాల్లో ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపాన వస్తాయో గ్రహించడం కష్టమే. అయితే కొందరు ఈ ప్రమాదాల బారిన పడగా.. మరికొందరు మాత్రం తృటిలో వీటి నుంచి తప్పించుకుని హమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకుంటారు. ఇటీవల ఓ ప్రయాణీకులతో నిండుగా ఉన్న బస్సు వైపు ఏనుగు కోపంగా దూసుకువస్తుంది అయితే చివరికి ప్యాసింజర్లకు హానికలిగించకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్లో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. మనం జంతువులను హాని కలిగించకపోతే అవి కూడా మనకు ఎటువంటి హాని కలిగించవు. ఈ విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మాటను రుజువు చేసిందో ఘటన. ఓ వీడియోలో బస్ నిండుగా ప్రయాణికులతో రోడ్డుపై వెళ్తుంటుంది. అడవి ప్రాంతంలోకి వెళ్లగానే అకస్మాత్తుగా రోడ్డు పై ఓ ఏనుగు కనిపిస్తుంది. డ్రైవర్ కంగారు పడక... బస్సును రోడ్డు పక్కకు ఆపుతాడు. అంతలో ఆ ఏనుగు కోపంగా బస్సు వైపు దూసుకువచ్చింది. దీంతో బస్సులోని ప్రయాణికులంతా ఇదే చివరి రోజని అనుకుంటున్నారు. అయితే అదృష్టవశాత్తు ఆ ఏనుగు బస్సుకు లేదా ప్రయాణీకులకు ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్లడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఏనుగు తమ పక్క నుంచి వెళుతుండగా బస్ డ్రైవర్తో పాటు ప్రయాణీకులు మౌనంగా ఉంటూ దాన్ని ప్రశాంతంగా వెళ్లనిచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. భయపడకండి.. ఆ ఏనుగు బస్లో ప్రయాణీకులను చెక్ చేయడానికి వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. When the tusker decided to check out passengers in the bus, everyone led by the bus driver displayed nerves of steel, a great sense of calm and understanding and everything went off well. Video - in Karnataka. Shared by a friend. #coexistence #peopleforelephants pic.twitter.com/OJG4uPRvoi — Supriya Sahu IAS (@supriyasahuias) July 24, 2023 చదవండి : UP Anju Facebook Love Story: ఇదో వింత ప్రేమ.. ఇద్దరు పిల్లలున్నా పాక్ యువకుడితో ప్రేమ.. అతడి కోసం సరిహద్దు దాటి. -
ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!
ఇటీవల జరిగిన ఘోర రైలు ప్రమాదం తరువాత ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ ప్రయాణీకులకు బీమా సౌకర్యాన్ని డీఫాల్ట్గా అందివ్వనుంది. తాజా నిర్ణయంతో వెబ్సైట్/యాప్లో టికెట్ బుక్ చేసుకొనే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం బీమా ఆప్షన్ పక్కనున్న టిక్ బాక్స్ను ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక నుంచి ఈ ఆప్షన్ను ఐఆర్సీటీసీ డిఫాల్ట్గా ఇస్తోంది. అంటే ఐఆర్సీటీసీ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అనేది ఆటోమెటిక్గానే వస్తుంది. ఒకవేళ బీమా ప్రయోజనాలను వద్దనుకున్నవారు మాత్రం ఆ టిక్ మార్క్ను తొలగించుకునే సౌలభ్యం కూడా ఉంది. కానీ ప్రతి ప్రయాణీకులు దీన్ని వినియోగించుకోవడమే చాలా అవసరం. ఐఆర్సీటీసీ పోర్టల్లో తమ రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఇప్పుడు ఆటోమేటిక్గా రూ. 10 లక్షల బీమా సౌకర్యం లభిస్తుందని బీమా పరిశ్రమలోని సీనియర్ అధికారి పేర్కొన్నారని ఐఏఎన్ రిపోర్ట్ చేసింది. అయితే దీనిపై ఐఆర్సీటీసీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ఇందుకోసం భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డిఎఐ)ఐఆర్సీటీసీకి మాత్రం వెసులుబాటు ఇచ్చింది. రైల్వే బీమాను ఎంచుకున్న ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం లభిస్తుంది. రైలు ప్రమాదంలో మరణించినా, లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడితే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ను రైల్వే శాఖ అందిస్తుంది. ఒకవేళ తీవ్రంగా గాయపడి పాక్షిక అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షల వరకు బీమా లభిస్తుంది. అలాగే గాయపడిన వైద్యఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల వరకు అందిస్తారు. అయితే బీమా పాలసీని ఎంచుకున్న ప్రయాణికులు నామినీ వివరాలను జత చేయాల్సి ఉంటుంది. కాగా ఇప్పటివరకు రైల్వే టికెట్లు బుక్ చేసుకునే సమయంలో రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ క్లిక్ చేసి నపుడు బీమా సౌకర్యం అందించే సౌకర్యం ఉండేది. ఈ రూ. 10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ఐఆర్సీటీసీ కేవలం 35 పైసలు మాత్రమే చార్జ్ చేసేది. ఈ బీమా కింద ప్రయాణికులు తమ రైలు ప్రయాణంలో విలువైన వస్తువులు, లగేజీని పోగొట్టుకుంటే పరిహారం లభించే సౌకర్య అందుబాటులోఉండేదన్న సంగతి తెలిసిందే. -
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ.. ఇకపై
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. ప్రతి వీకెండ్కు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి దర్శనంతో పాటు పాతాళగంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2700, పిల్లలకు రూ.1570గా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖరారు చేసింది. ప్రతి శనివారం ఉదయం ఈ టూర్ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్ లోని జేబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్కు వెళ్తుంది. మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్లో బస ఉంటుంది. రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం.. టిఫిన్ పూర్తవగానే హోటల్ చెక్అవుట్ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం సందర్శన ఉంటుంది. సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్కు, 8.30 గంటలకు జేబీఎస్కు బస్సు చేరుకుంటుంది. రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుం ప్యాకేజీలో చేర్చారు. ఆహారం, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. "ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి ప్రతి రోజు శ్రీశైలానికి 40 సర్వీసులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. వీకెండ్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీని సంస్థ అందిస్తోంది.భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ ప్యాకేజీని యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీని భక్తలందరూ వినియోగించుకోవాలి. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ tsrtconline.in లోకి వెళ్లి మీ టికెట్లను బుకింగ్ చేసుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలి" అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు. చదవండి సీఎం కేసీఆర్కు ఊహించని షాక్.. హైకోర్టు నోటీసులు -
మెట్రో ప్రయాణికులకు తీపి కబురు.. ఇకపై వెయిట్ చేయాల్సిన అవసరం లేదు!
శివాజీనగర(బెంగళూరు): ‘నమ్మ మెట్రో’ ప్రయాణికులకు మరో తీపి కబురు. త్వరలో ‘మెట్రోమిత్రా’ యాప్ విడుదల కానుంది. ప్రయాణికుల అనుకలం కోసం మెట్రోమిత్రా యాప్ ఆధారిత ఆటోరిక్షా సదుపాయాన్ని ఆరంభించబోతోంది. ఆటో– మెట్రో స్టేషన్ల ఆరంభం నుంచి ఆఖరి వరకు సేవలు అందుబాటులో ఉంటుందని ఆటో డ్రైవర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి రుద్రమూర్తి సమాచారం అందించారు. దీనిద్వారా మెట్రో దిగిన తక్షణమే వేరే ఆటో కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. తొలి రెండు కిలోమీటర్లకు రూ.30, ఆ తరువాత ప్రతి కిలోమీటర్కు రూ.15తో పాటుగా రూ.10 అదనపు చార్జీ ఫిక్స్ చేశారు. ఆగస్టు 15న యాప్ విడుదలవుతుందని సమాఖ్య ప్రధాన కార్యదర్శి రుద్రమూర్తి తెలిపారు. చదవండి: పెళ్లి రోజు నుంచి ప్రియుడితో వీడియో కాల్.. భర్త ఇంట్లోకి వచ్చి చూసేసరికి షాక్!