మాంసాహారం వడ్డన.. వందేభారత్‌ రైలులో వెయిటర్‌పై దాడి | Passenger Attack On Waiter In Vandebharat Express | Sakshi
Sakshi News home page

మాంసాహారం వడ్డన.. వందేభారత్‌ రైలులో వెయిటర్‌పై దాడి

Published Mon, Jul 29 2024 8:21 PM | Last Updated on Mon, Jul 29 2024 8:49 PM

Passenger Attack On Waiter In Vandebharat Express

కలకత్తా: వందేభారత్‌ రైల్లో ఇటీవల అనుకోని ఘటన జరిగింది. భోజనం అందించిన వెయిటర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. కొద్ది రోజుల క్రితం ఓ వృద్ధుడు పశ్చిమ బెంగాల్‌లోని హవ్‌డా నుంచి రాంచీకి వందేభారత్‌ రైలులో ప్రయాణించాడు. భోజనం కోసం థాలీ ఆర్డర్‌ చేశాడు. అయితే ఒక వెయిటర్‌ పొరబాటున మాంసాహారం వడ్డించారు. ఆ వృద్ధ ప్రయాణికుడు కొద్దిసేపటికి  అది నాన్‌-వెజ్‌ భోజనం అని గుర్తించాడు. 

 శాకాహారి అయిన తనకు మాంసాహారాన్ని వడ్డించాడన్న ఆగ్రహంతో వెయిటర్‌పై దాడికి దిగాడు. ఎంతమంది అడ్డుకున్నా ఆగకుండా వెయిటర్‌పై చేయి చేసుకున్నాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రయాణికుడి తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు.  ఈ ఘటనపై తూర్పు రైల్వే స్పందించింది. ‘అవును, పొరబాటు జరిగింది.  అంగీకరిస్తున్నాం. సమస్యను పరిష్కరించాం’అని క్లారిటీ ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement