
భువనేశ్వర్ : ఒడిశాలో రైలు ప్రమాదం జరిగింది. నెర్గుండి సమీపంలో కామాఖ్య ఎక్స్ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 11 బోగీలు పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.
ఈస్ట్కోస్ట్ రైల్వే సీపీఆర్వో అశోక్ కుమార్ మిశ్రా వివరాల మేరకు.. కటక్లోని నెర్గుండి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ నెంబర్ 12551 కామాఖ్య సూపర్ పాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది.
ట్రైన్ ప్రమాదం జరిగిన వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన క్షతగాత్రులకు చికిత్స అందించారు. సీనియర్ రైల్వే అధికారులు సైతం ఘటన స్థలానికి చేరుకున్నారు.ప్రమాదానికి గల కారణాల్ని ఆరా తీస్తున్నారు. మరోవైపు, రైల్వే రాకపోకలకు ఎలాంటి అంతరాయం జరగకుండా రూట్లను మళ్లించారు.
#WATCH | Bhubaneswar, Odisha: On Kamakhya Express train derailed near Nergundi Railway Station in Cuttack, Ashoka Kumar Mishra, CPRO, East Coast Railway says "We got information about the derailment of some coaches of 12551 Kamakhya Superfast Express. As of now, we have the… pic.twitter.com/olrYv7CRRX
— ANI (@ANI) March 30, 2025