
రెచ్చి పోయిన చైన్ స్నాచర్లు
మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని లక్ష్మిగూడలో బుధవారం ఓ మహిళ మెడలో చైన్ స్నాచింగ్ జరిగింది.
హైదరాబాద్ సిటీ: మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని లక్ష్మిగూడలో బుధవారం ఓ మహిళ మెడలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఇంటి ముందు నీళ్లు పట్టుకుంటున్న రాధిక అనే మహిళ మెడలో బంగారు గొలుసును గుర్తుతెలియని ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. ఎత్తుకెళ్లిన బంగారు గొలుసు సుమారు 5 తులాలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు రాజేంద్రనగర్ పోలీస్ స్టేసన్ పరిధిలో భవాని కాలనీలో నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోంచి 6 తులాల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. లంగర్ హౌస్ పరిధిలో జ్యోతివద్ద 3 తులాలు, అత్తాపూర్ లో లక్ష్మీ భాయ్ వద్ద 6 తులాలలను దుండగులు ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం నుంచి సుమారు 20 తులాలు చోరికి గురైనట్టు సమాచారం.