డప్పు కొట్టి చిందేసిన చంద్రబాబు | Cm chandrababu in the holi celebtration | Sakshi
Sakshi News home page

డప్పు కొట్టి చిందేసిన చంద్రబాబు

Published Thu, Mar 24 2016 8:43 AM | Last Updated on Tue, Aug 21 2018 11:49 AM

డప్పు కొట్టి చిందేసిన చంద్రబాబు - Sakshi

డప్పు కొట్టి చిందేసిన చంద్రబాబు

సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం డప్పు కొట్టి చిందేశారు. హోలీని పురస్కరించుకుని ఎన్‌టీఆర్ భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన గిరిజన మహిళలతో కలసి డప్పు కొట్టారు. నృత్యం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్ర శేఖరరెడ్డిలు పాల్గొన్నారు.

గవర్నర్‌ను కలసిన చంద్రబాబు : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.  గవర్నర్ ఇటీవలనే రాష్ట్ర శాసనసభ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ధన్యవాదాలు తెలపటంతో పాటు హోలీ పండుగను పురస్కరించుకుని గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారని అధికారవర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement