'అప్పుల తెలంగాణగా మారుస్తున్నారు' | congress leader mallu ravi slams cm kcr over state debts | Sakshi
Sakshi News home page

'అప్పుల తెలంగాణగా మారుస్తున్నారు'

Published Fri, Feb 17 2017 4:36 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'అప్పుల తెలంగాణగా మారుస్తున్నారు' - Sakshi

'అప్పుల తెలంగాణగా మారుస్తున్నారు'

హైదరాబాద్‌: రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణగా మారుస్తున్నారని దుయ్యబట్టారు.

( చదవండి : రాష్ట్రం అప్పు రూ. 1.2 లక్షల కోట్లు )


మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి తోసేశారని, అప్పుల కోసమే ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మెదటి స్థానంలో ఉందని, ఈ అప్పులకు ఈ ఏడాది రూ.7,700 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోందని చెప్పారు. త్వరలోనే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా మేలుకోకపోతే తెలంగాణ మరో బీహార్లా బీమారీ స్టేట్‌గా మారుతుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement