‘స్పీకర్ పై అవిశ్వాసం పెడతాం’
హైదరాబాద్: తెలంగాణ శాసనసభా స్పీకర్ మధుసూధనాచారి అప్రజాస్వామికంగా వ్యవహారిస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఫిరాయింపులపై మాట్లాడితే నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని అన్నారు. స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టే , ఆయన ముందు నిరసన చేపట్టామన్నారు. స్పీకర్ తీరు మారకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరించారు.