Madhusudhana Chary
-
‘కాంగ్రెస్ పాలనపై గ్రామస్థాయి నుండి వ్యతిరేకత’
హనుమకొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత వస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనచారి. ఎన్నికల ముందు అధికారం కోసం 420 హామీలు ఇచ్చి, ఇప్పటివరకూ ఏ ఒక్క హానమీ నెరవేర్చలేనది మధుసూదనచారి ఆరోపించారు. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యం పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీని ఎమ్మెల్సీ మధుసూదనచారి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మధుసూదనచారి మాట్లాడుతూ.. ‘కడియం శ్రీహరి తన స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారాడు. పార్టీ మారిన ఎమ్మెల్యే లతో రాజీనామా చేయించి పోటీలో నిలబెట్టు. బీఆర్ఎస్ కార్యకర్తల ఉద్యమంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాం. పూర్తి స్థాయిలో కులగణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి. BRSసాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన మహనీయుడు కేసీఆర్. నూటికి నూరు శాతం బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం. ఎక్కడికి వెళ్తే రేవంత్రెడ్డి పబ్బం గడుస్తదో అక్కడికి వెళతాడు’ అని విమర్శించారు మధుసూదనచారి. -
కేటీఆర్ పర్యటనలో మాజీ స్పీకర్ మదుసుదనాచారికి చేదు అనుభవం!
గణపురం: మంత్రి కేటీఆర్ గణపురం మండల పర్యటనలో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసుదనాచారికి చేదు అనుభవం ఎదురైంది. కేటీఆర్కు స్వాగతం పలికేందుకు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు వెళ్తున్న క్రమంలో గణపురం ప్రధాన రోడ్డుపై ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తాను మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసుదనాచారిని అని తెలపడంతో ఆయన వాహనాన్ని వదిలిపెట్టారు. కానీ ఆయన వెంట వచ్చే నాయకుల వాహనాన్ని సైతం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన సిరికొండ వాహనంలో నుంచి దిగి వచ్చి నన్ను, నా వెంట వచ్చే నేతలను అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వాహనాన్ని హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు అనుమతిచ్చారు. అక్కడ నుంచి హెలిప్యాడ్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన మరో బందోబస్తు వద్ద కూడా సిరికొండ వాహనాన్ని నిలిపి ఆయన అధికార పీఏను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కాగా.. కేటీఆర్ పర్యటనలో కావాలనే సిరికొండను అడుగడుగునా అవమానించారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత పర్యటనలో టీబీజీకేఎస్ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకంలో సిరికొండ పేరు లేకపోవడం ఆయన వర్గీయులను ఆగ్రహానికి గురిచేసింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే గండ్ర వ్యవహారంపై అసంతృప్తితో ఉన్నారు. ఈక్రమంలో కవిత సమక్షంలోనే సిరికొండ, గండ్ర వర్గీయులు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. కాగా.. కేటీఆర్ పర్యటనలో సిరికొండ వాహనాన్ని పోలీసులు తెలియక అడ్డుకున్నారా? లేక గండ్ర ఆదిపత్య పోరు కోసం చేయించారా? అని సిరికొండ వర్గీయులు, ప్రజలు చర్చింకుంటున్నారు. అంతటా వర్గపోరే.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటనలో ఆసాంతం బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు కనిపించింది. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వర్గీయులు నినాదాలతో హోరెత్తించారు. డబుల్ బెడ్ రూంల ప్రారంభోత్సవం, బహిరంగ సభ వద్ద జై సిరికొండ, చారి సాబ్ జిందాబాద్ అంటూ కొందరు నినాదాలు చేయగా.. మరికొందరు జై గండ్ర జైజై గండ్ర అంటూ నినదించారు. బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతున్న సమయంలో అభిమానులు చాలామంది జై సిరికొండ అంటూ నినాదాలు చేయడంతో.. ‘మీకు దండం పెడతా, ఆపండి.. ఇది మన కార్యక్రమం, సజావుగా జరగనివ్వండి’ అని మంత్రి కోరారు. ఇదిలా ఉండగా సభలో కూర్చున్న పలువురు ‘భూకబ్జాదారులు.. ఎమ్మెల్యే అనుచరులు’ అంటూ నినాదాలు చేశారు. -
కవిత సమక్షంలోనే కస్సుబుస్సు.. ‘రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేను తానే..’
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో అధికార పార్టీ నాయకులు బజారున పడ్డారు. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు మంత్రి సత్యవతి రాథోడ్, సీఎం కేసిఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత సమక్షంలోనే బహిర్గతమయ్యాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ భవనం ప్రారంబోత్సవానికి హాజరైన మంత్రి సత్యవతి, ఎమ్మెల్సీ కవిత సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి బలప్రదర్శనకు దిగారు. రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేను తానేనని చాటిచెప్పేందుకు ఇదదరూ తీవ్రంగా ప్రయత్నించారు. అనుచరగణాన్ని రెచ్చగొట్టి వారిమధ్య ఉన్న వైరాన్ని బహిర్గతం చేసుకున్నారు. పార్టీ శ్రేణులను ఆయోమయానికి గురిచేశారు. ఎవరి గోల వారిదే బిఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ భవన శిలాఫలకం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసింది. శిలాఫలకంపై ఎమ్మెల్సీ మదుసూధనాచారి, జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి పేరు లేకపోవడంతో వారిద్దరి అనుచరులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్సీ చారికి, జడ్పీ చైర్మన్ శ్రీహర్షిణికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తామేమి తక్కువ కాదన్నట్లు గండ్ర అనుచరులు సైతం నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంత ఇరువర్గాల నినాదాలు, గోలతో కార్మికసంఘ భవనం వర్గపోరుకు వేదికలా మారిపోయింది. వేదికపై ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్, కేసిఆర్ తనయ కవిత అవాక్కయ్యారు. ఘర్షణ పడుతున్నవారిని వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. నివురు గప్పిన నిప్పు వాస్తవానికి భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి రాజకీయ ప్రత్యర్థులు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గండ్ర అధికార పార్టీ అభ్యర్థి మధుసూదనాచారిపై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్కు చేయిచ్చి కేసిఆర్ సమక్షంలో కారెక్కారు గండ్ర వెంకటరమణారెడ్డి. రాజకీయ ప్రత్యర్థులిద్దరూ ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పటికీ అంతర్గత విబేధాలు మాత్రం అలానే ఉన్నాయి. గులాబీ దళపతి ఎవ్వరిని తక్కువ చేయకుండా ఓడిపోయిన మధుసూదనాచారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తగిన ప్రాధాన్యత కల్పించారు. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో బయటపడడం పార్టీలో కలకలం సృష్టించింది. వీరి గొడవ పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేసింది. కారులో అసంతృప్తి ఎమ్మెల్యే గండ్ర మీద జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి సైతం అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనను భూపాలపల్లికి చెందిన పార్టీ నేతలు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆమె బాహాటంగానే విమర్శలు చేశారు. భూపాలపల్లికి జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి అయితే వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతికి భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చి స్థానికులకు ప్రాధాన్యత లేకుండా చేశారనే ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని నియోజకవర్గ ఇంఛార్జీ పుట్ట మధు అనుచరురాలుగా ముద్రపడ్డ శ్రీహర్షిణికి భూపాలపల్లిలో తగిన ప్రాధాన్యత లభించడం లేదనే చర్చ సాగుతోంది. భూపాలపల్లి బీఆర్ఎస్లో విబేధాలకు రాబోయే ఎన్నికలే కారణంగా జనం భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గండ్ర బిఆర్ఎస్ నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతుండగా ఎమ్మెల్సీ చారి సైతం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అందులో భాగంగానే ఒకరిపై మరొకరిపై చేయి సాధించేందుకు పోరు సాగిస్తున్నారట. ఇప్పటికే సిట్టింగ్లకే టిక్కెట్ ఇస్తామని గులాబీ దళపతి ప్రకటించడంతో ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకుని టిక్కెట్ పొందే పనిలో చారి ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గండ్ర వెంకటరమణారెడ్డి సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుటుంబం నుంచి భూపాలపల్లి చేజారిపోకుండా అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ తనకు టిక్కెట్ ఇవ్వకపోతే...తన భార్య గండ్ర జ్యోతిని బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
గులాబీ కోటలో భూపాలపల్లి ఫైట్.. మాజీ స్పీకర్ VS సిట్టింగ్ ఎమ్మెల్యే
గులాబీ కోటలో భూపాలపల్లి ఫైట్ మొదలైందా? మాజీ స్పీకర్కు, సిట్టింగ్ ఎమ్మెల్యేకు మధ్య పోరు షురూ అయిందా? టీఆర్ఎస్ నాయకత్వం ఎవరికి మద్దతిస్తోంది? భూపాలపల్లిలో అధికార పార్టీ తరపున పరీక్ష రాసేదెవరు? సీటు రానివారి పరిస్థితి ఏంటి? జయశంకర్ భూపాలపల్లిలోని ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం భూపాలపల్లిలో అధికార పార్టీలో సెగలు మొదలయ్యాయి. అసెంబ్లీ మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సిటింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య సీటు కోసం పంచాయతీ అక్కడి రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. ఎమ్మెల్సి మధుసూదనాచారి పుట్టినరోజు వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. సారు రావాలి.. మీరు కావాలి అంటూ ఆయన అనుచరులు, అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరపడం వెనుక మతలబేంటని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మధుసూదనాచారి భూపాలపల్లి నుండి మళ్ళీ పోటీ చేస్తారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. అధిష్టానం నుండి వచ్చిన స్పష్టమైన సూచనల ప్రకారమే చారి మళ్ళీ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి? 2018 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో మధుసూదనాచారి ఓడిపోవడం, తర్వాత గండ్ర అధికార పార్టీలో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో చారి భూపాలపల్లి నియోజకవర్గానికి దాదాపు దూరమయ్యారు. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన మధుసూదనాచారి, ముఖ్యమంత్రి మాట మేరకే నియోజకవర్గానికి దూరంగా ఉన్నారన్న మాటలు వినిపించాయి. కేసీఆర్ మాట జవ దాటకుండా ఉండి మళ్ళీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సి పదవి పొందారు. భూపాలపల్లిలో అధికార పార్టీకి వ్యతిరేకత మొదలైందని కేసీఆర్ చేయించిన సర్వేలో వెల్లడైందన్న వార్తలు అప్పట్లో బాగానే వినిపించాయి. బర్త్డే పాలిట్రిక్స్? మాజీ స్పీకర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదనే ఆలోచన ప్రజల్లో మొదలైనట్లుగా సీఎం దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రజల్లో చారీ పట్ల మళ్ళీ ఆదరణ మొదలైందని ఊహాగానాలు వినిపించాయి. దీనికి తగ్గట్టుగానే మధుసూదనాచారి నియోజకవర్గంలో వరుసగా పర్యటించడం...ఎమ్మెల్సీ నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించుతుండటంతో ఆయన వర్గం నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 13న నియోజకవర్గ వ్యాప్తంగా మధుసూదానాచారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగటంతో భూపాలపల్లిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నియోజకవర్గంలో మధుసూదనాచారి మళ్ళీ యాక్టివ్ అవుతుండటంతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య ఎమ్మెల్యే చేస్తున్న వాఖ్యలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే పరీక్ష రాయబోతున్న మీ సహాయ సహకారాలు కావాలి అనడం, ఎమ్మెల్యే సీటు నాదే.. గెలుపు నాదే అని మాట్లాడుతుండటంతో భూపాలపల్లి ఎమ్మెల్యే సీటు విషయంలో ఏదో జరుగుతుందనే చర్చ సాగుతోంది. స్థానికంగా అధికార పార్టీ పట్ల వ్యతిరేకత మొదలవడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మధుసూదనాచారి మళ్ళీ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరో ఏడాదిలో జరిగే ఎన్నికల పరీక్షలో రాసేదెవరో.. ఉత్తీర్ణులయ్యేదెవరో అన్న చర్చ నియోజకవర్గంలో తీవ్రంగా జరుగుతోంది. -
నేను ఈ స్థాయికి రావడానికి ప్రేక్షకులే కారణం: కమెడియన్ అలీ
సినీ నటుడు అలీకి జీవన సాఫల్య రజిత కిరీట జాతీయ పురస్కారాన్ని అందజేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతిని పురస్కరించుకొని త్యాగరాయ గానసభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మధుసూదనచారి మాట్లాడుతూ.. పీవీ నరసింహరావు ప్రతికూలపరిస్థితులలో జాతీయ స్థాయికి ఎదిగారని అలీ కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని సినీ రంగంలో ఉన్నతస్థాయికి ఎదిగి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నారని కొనియాడారు. నటుడు అలీ మాట్లాడుతూ చిన్న దర్జీగా మా నాన్న పనిచేసేవారని, అలాంటి కుటుంబం నుంచి ఈ స్థాయికి రావటానికి ప్రేక్షకులే కారణమని అన్నారు. పీవీ ప్రభాకర్రావు, గానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి, తదితరులు పాల్గొన్న సభకు సురేందర్ స్వాగతం పలుకగా దైవజ్ఞశర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు 101 జయంతిని పురస్కరించుకుని 101 మంది నృత్యకళాకారులు విభిన్న నృత్యాలు చేయగా సంస్థ అధ్యక్షురాలు పుష్ప రికార్డ్ పత్రం అందుకొన్నారు. చదవండి: థియేటర్లో రెండే, ఓటీటీలో మాత్రం బోలెడు సినిమాలు రిలీజ్కు రెడీ! సెట్లో నోరుపారేసుకున్న హీరో, చెంప చెల్లుమనిపించిన సిబ్బంది -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి
సాక్షి, హైదరాబాద్:తెలంగాణలో గవర్నర్ కోటా నామినెటేడ్ ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి శానసమండలికి ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది జూన్ 16న ముగిసిన సంగతి తెలిసిందే. అయితే శ్రీనివాస్రెడ్డి స్థానంలో మధుసూదనాచారి పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదిందారు. మధుసూదనాచారిని శాసన మండలికి నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం నుంచి మధుసూదనాచారి పదవీకాలం ప్రారంభం కానుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
గవర్నర్ కోటాలో మండలికి మధుసూదనాచారి
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అసెంబ్లీ మాజీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అభ్యర్థిత్వానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ కోటాలో మధుసూదనాచారి పేరును రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల 16న సర్క్యులేషన్ పద్ధతిలో సిఫారసు చేసింది. ఈ కోటాలో ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొఫె సర్ శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం ఈ ఏడాది జూన్లో ముగిసింది. ఈ ఖాళీ భర్తీ చేసేందుకు ఆగస్టు 2న పాడి కౌశిక్రెడ్డి పేరును రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదించింది. అయితే కౌశిక్రెడ్డిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదై ఉండటంతో ఆ ప్రతిపాదనను గవర్నర్ వెనక్కి పంపారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్రెడ్డి నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మధుసూదనాచారిని గవర్నర్ కోటాలో మండలికి పంపుతారనే ఊహాగానాలు వెలువడగా.. చివరకు అదే నిజమైంది. మధుసూదనాచారి పేరును గవర్నర్ కోటాలో ప్రతిపాదిస్తూ కేబినెట్ సమావేశంలో కాకుండా మంత్రులకు విడివిడిగా సంబంధిత పత్రాలు సర్క్యులేట్ చేశారు. అనంతరం మంత్రుల సంతకాలతో కూడిన సిఫారసును గవర్నర్కు సమర్పించారు. ఎమ్మెల్యే కోటాలోనే దక్కుతుందనుకున్నా.. విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి మండలిలో ప్రాతినిథ్యం కల్పిస్తామని గతంలో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మధుసూదనాచారికి ఎమ్మెల్యే కోటాలోనే అవకాశం దక్కుతుందని అంతా భావించారు. అయితే అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో అనూహ్యంగా జరిగిన మార్పులు, చేర్పులతో ఆయనను గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 22న ఆరుగురి ఎన్నిక ప్రకటన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఈ నెల 16న టీఆర్ఎస్ తరఫున నామినేషన్లు వేసిన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తక్కల్లపల్లి రవీందర్రావు, బండా ప్రకాశ్ ముదిరాజ్, వెంకట్రామ్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ నెల 17న జరిగిన నామినేషన్ల పరిశీలనలో ఆరుగురి అభ్యర్థిత్వం చెల్లుబాటు కాగా, స్వతంత్రులుగా నామినేషన్ వేసిన ఇద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నెల 22తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా, ఇతరులెవరూ పోటీలో లేకపోవడంతో అదే రోజు ఈ ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఆ 12 టీఆర్ఎస్ ఖాతాలోకే..! స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఈ నెల 16 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 23 వరకు కొనసాగనుంది. స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్కు అత్యధిక మెజారిటీ ఉండటంతో ఈ 12 స్థానాలు కూ డా అధికార పార్టీ ఖాతాలోనే చేరే అవకాశముంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కసర త్తు చేస్తుండగా ఈ నెల 22 లేదా 23 తేదీల్లో జాబితా ప్రక టించే అవకాశం ఉంది. వచ్చే నెల 10వ తేదీలోగా ఈ ప్రక్రి య ముగియనుంది. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత శాస న మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక, మంత్రివర్గ వి స్తరణ వంటి అంశాలు తెరమీదకు వచ్చే అవకాశముంది. -
జయశంకర్ను ఆదర్శంగా తీసుకోవాలి
వనస్థలిపురం: ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి పిల్లలను బాగా చదివించుకోవాలని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సూచించారు. స్వర్ణకార సమాజం బలమైన శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వనస్థలిపురంలోని బొమ్మిడి లలితా గార్డెన్లో ఆదివారం జరిగిన ఆ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు వింజమూరి రాఘవా చారి, ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి, కోశాధికారి చంద్రశేఖరాచారి తదితర కార్యవర్గంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడు వీరబ్రహ్మేంద్రస్వామి ప్రపంచాన్ని శాసించారని, కానీ విశ్వకర్మీయులు ఇంకా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర నూతన అధ్యక్షులు రాఘవాచారి మాట్లాడుతూ విశ్వకర్మీయులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమి కేటాయించాలని, స్వర్ణకారులపై దాడులను నివారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు చిట్టన్నోజు ఉపేంద్రాచారి, ఏపీ స్వర్ణకార సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్, కందుకూరి పూర్ణాచారి, కన్నెకంటి సత్యం, కీసరి శ్రీకాంత్, ఆర్.సతీష్కుమార్, రాచకొండ గిరి తదితరులు పాల్గొన్నారు. -
మరి నేనెక్కడికి వెళ్లాలి?
ములుగు/భూపాలపల్లి: ‘ఈ సమావేశం అయిపోయాక మీరంతా మీ ఇళ్లకు వెళ్లిపోతారు.. మరి నేను ఎక్కడికెళ్లాలి.. నాకు కనీసం ఇల్లు కూడా లేదు’అని మాజీ స్పీకర్ మధుసూదనాచారి కంటతడి పెట్టారు. సోమవారం భూపాలపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘పేదలందరికీ ఇళ్లు కట్టించాకే నేను ఇల్లు కట్టుకుంటా అని ప్రమాణం చేసిన.. మీరంతా ఇళ్లకు వెళ్లిపోతే.. నేను ఎక్కడికెళ్లాలి. అయినా అధైర్యపడను.. నన్ను ఆదరించి ప్రేమ చూపించిన భూపాలపల్లిని విడిచి వెళ్లలేను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నియోజకవర్గంపై ప్రేమ చూపిస్తా’అంటూ గద్గద స్వరంతో మాట్లాడారు. భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. దీంతో సభ మీద, కింద ఉన్న పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బోరున విలపించారు. అలాగే ములుగులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ మీడియా పిచ్చోళ్లు కావాలని తనపై 15 రోజులపాటు పిచ్చిపిచ్చి వార్తలు రాశారని, వార్తలు రాసిన వారు ఖబడ్దార్ అని హెచ్చరించారు. పత్రికలకు తాను చేసిన అభివృద్ధి కనిపించకపోవడం సిగ్గుచేటని పేర్కొంటూ ఆయన కంటతడిపెట్టారు. ఇదే సభలో ఆయన కుమారుడు ప్రహ్లాద్ మాట్లాడుతూ అందరూ తన మనుషులు అనుకుంటే కలసికట్టుగా మోసం చేశారన్నారు. టీఆర్ఎస్లో చేరేందుకు ఎమ్మెల్యేల రాయబారం: బాలమల్లు ములుగు: తమ పార్టీలో చేరడానికి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాయబారాలు పంపుతున్నారని పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి, టీఎస్ఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ గాదరి బాలమల్లు అన్నారు. అయితే.. ఇద్దరు స్వతంత్ర సభ్యులతో కలసి 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిగతావారి అవసరం లేదని సీఎం కేసీఆర్ తిరస్కరిస్తున్నారని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. -
ఓటు మీది.. అభివృద్ధి బాధ్యత నాది
సాక్షి, భూపాలపల్లి: ‘మీరు ఓటు వేసి నన్ను గెలిపించండి.. అభివృద్ధి బాధ్యత నాది.. గడిచిన 50 నెలల పదవీ కాలంలో రూ.3 వేల కోట్లతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను’ అని శాసన సభాపతి, టీఆర్ఎస్ భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని కాశీంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన స్పీకర్కు కాశీంపల్లి వాసులు పూల వర్షం, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మధుసూదనాచారి మాట్లాడుతూ.. నాడు అభివృద్ధిలో వెనుకబడి ఉన్న కాశీంపల్లికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అంతర్గత రోడ్లు, సైడ్ కాల్వలు తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. మహాకూటమికి ఓటు వేస్తే అధికారాన్ని మరోమారు ఆంధ్రులకు అప్పగించినట్లేనని అన్నారు. భూపాలపల్లి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దానని, ఫలితంగానే వ్యాపార రంగం అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి మునిసిపాలిటీ చైర్పర్సన్ బండారి సంపూర్ణరవి, కౌన్సిలర్లు తాటి హైమావతిఅశోక్, టీఆర్ఎస్ నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, మేకల సంపత్కుమార్, చెరకుతోట శ్రీరాములు, మారెల్ల సేనాపతి, సింగనవేని చిరంజీవి, మాడ హరీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గొంగడి... గొర్రెపిల్లతో చారి..
సాక్షి, టేకుమట్ల: ఎన్నికల వేళ ప్రతి రాజకీయ నాయకుడు సామాన్యుడిని ఆకర్షించడానికి వింత వింత ప్రచారలు, వేశాలు వేస్తుంటారు. వెంకట్రావుపల్లిలో యాదవులు బహుకరించిన గొర్రెపిల్లతో టీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి ప్రచారాలు చేశారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని భవిష్యత్ చెప్పారు. -
గండ్రలు గెలిస్తే చేస్తారా?
చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.మధుసూదనాచారి పార్టీ బలహీనతల గురించి ప్రస్తావించిన కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన జిల్లా చిట్యాలలో మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు రైతుబంధు పథకం చెక్కులు సరిగా అందలేదని, దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, కార్పొరేషన్ రుణాల గురించి మైనస్ ఉందని నాయకులు, కార్యకర్తలు చెప్పడంతో వారిపై మధుసూదనాచారి కన్నెర్ర చేశారు. గండ్రలు గెలిస్తే చేస్తారా..? ఏం మాట్లాడుతున్నారు? అంటూ గద్దించడంతో వారు నిరాశతో వెళ్లిపోయారు. ‘ఈయన మారడు.. చెబితే అర్థం చేసుకోడు.. పలకరింపు సరిగా ఉండదు.. అంటూ పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు విమర్శించుకుంటూ వెళ్లిపోవడం విశేషం. -
చల్లారని అసమ్మతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్ల చిచ్చు కొనసాగుతోంది. అభ్యర్థిత్వం కావాలని కొందరు, అభ్యర్థులను మార్చాలని మరికొందరు అధిష్టానానికి డిమాండ్లు వినిపిస్తున్నారు. 20కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసమ్మతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అసమ్మతి, అసంతృప్త నేతలతో అభ్యర్థులు చర్చలకు ప్రయత్నిస్తున్నా వారు అంగీకరించకపోవడంతో మంత్రి కేటీఆర్కు విన్నవించుకుంటున్నారు. కేటీఆర్తో చర్చల సమయంలో అన్నింటికీ అంగీకరిస్తూనే నియోజకవర్గానికి వెళ్లాక మాత్రం అభ్యర్థులకు పోటాపోటీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు కేటీఆర్తో చర్చలకు సైతం రావడంలేదు. ఆశావహులు ఎందరో... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకేసారి 105 అభ్యర్థులను ప్రకటించారు. టీఆర్ఎస్కు ఉన్న 90 మంది ఎమ్మెల్యేలలో 83 మందికి అభ్యర్థులుగా మళ్లీ అవకాశం ఇచ్చారు. జాబితా ప్రకటించగానే కొందరు అభ్యర్థుల పేర్లు మారతాయనే ప్రచారం మొదలైంది. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ అసమ్మతి నేతలు అభ్యర్థుల కంటే ముందే ప్రచారంలోకి దిగారు. మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థిని మారిస్తేనే పార్టీ విజయం సాధిస్తుందని అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. 20కిపైగా నియోజకవర్గాల్లో రెబల్స్... - శాసనసభ స్పీకర్ మధుసూదనచారి భూపాలపల్లిలో ప్రచారం ప్రారంభించకముందే అసమ్మతి నేత గండ్ర సత్యనారాయణరావు ప్రచారంలోకి దిగారు. టీఆర్ఎస్ టికెట్ ఇస్తామని కేటీఆర్, కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ హామీ ఇచ్చినందునే పార్టీలో చేరానని, కానీ తనకు అన్యాయం జరిగిందని చెబుతున్నారు. - ములుగులో మంత్రి చందులాల్ను మార్చాలని ద్వితీయశ్రేణి నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోరిక గోవింద్ నాయక్, తాటి కృష్ణ, రూప్శంకర్లలో ఒకరికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. - స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే టి. రాజయ్యను తొలగించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వాలని ద్వితీయశ్రేణి నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. - పాలకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావుకు పోటీగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు ప్రచారాన్ని ప్రారంభించారు. - జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని మారిస్తేనే టీఆర్ఎస్ గెలుస్తుందని, అభ్యర్థిని మార్చకుంటే ప్రచారం చేయబోమని ద్వితీయశ్రేణి నేతలు ప్రకటనలు చేస్తున్నారు. - మహబూబాబాద్ అభ్యర్థి శంకర్ నాయక్ను మార్చాలంటూ ప్రచారంలో అడ్డుకుంటున్నారు. - వేములవాడలో టీఆర్ఎస్ అభ్యర్థి రమేశ్బాబును తప్పించి ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీని గెలిపించుకుంటామని ద్వితీయశ్రేణి నేతలు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. - రామగుండంలో తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతోపాటు కోరుకంటి చందర్ ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. - ఆలేరులో గొంగడి సునీతను మార్చకుంటే ఆమెను ఓడిస్తామని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. - ఖానాపూర్లో రేఖానాయక్కు పోటీగా రమేశ్ రాథోడ్ సిద్ధమయ్యారు. లంబాడీ వర్గం నేతలకు టికెట్ ఇవ్వడాన్ని ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. - నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డికి పోటీగా దుబ్బాక నరసింహారెడ్డి ప్రచారం చేస్తున్నారు. - మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి పోటీగా వేనేపల్లి వెంకటేశ్వర్రావు ప్రచారం చేస్తున్నారు. కచ్చితంగా పోటీలో ఉంటానని ప్రకటిస్తున్నారు. - దేవరకొండ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్కు మళ్లీ టికెట్ ఇవ్వగా జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్ పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. - మిర్యాలగూడలో తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావుకు టికెట్ ఇవ్వగా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అలుగుబెల్లి అమరేందర్రెడ్డి సైతం టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సొంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. - నాగార్జునసాగర్లో నియోజకవర్గ ఇన్చార్జి నోముల నర్సింహయ్యకు టికెట్ కేటాయించడంపై పార్టీ నేతలు భగ్గుమన్నారు. స్థానికుడికే టికెట్ ఇవ్వాలని ఎం.సి. కోటిరెడ్డి, బొల్లెపల్లి శ్రీనివాసరాజు భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. - ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డికి వ్యతిరేకంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కంచర్ల చంద్రశేఖర్రెడ్డి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. - రాజేంద్రనగర్ సెగ్మెంట్లో పార్టీ అభ్యర్థి టి. ప్రకాశ్రెడ్డికి పోటీగా టికెట్ ఆశించి భంగపడ్డ తోకల శ్రీశైలంరెడ్డి బరిలో ఉంటారని చెబుతున్నారు. - షాద్నగర్ అభ్యర్థి అంజయ్య యాదవ్కు పోటీగా వి.శంకర్, అందె బాబయ్యలలో ఒకరు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. - మక్తల్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా మహబూబ్నగర్ ఎంపీ జితేందర్రెడ్డి అనుచరులుగా ముద్రపడిన ఆరుగురు నేతలు ఒక్కటయ్యారు. తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. - పటాన్చెరు టికెట్ మహిపాల్రెడ్డికే ఇవ్వగా పార్టీ నేతలు సఫాన్దేవ్, కె. బాల్రెడ్డి, గాలి అనిల్కుమార్ టికెట్ ఆశిస్తూ బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. - నారాయణఖేడ్లో తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ రాములు నాయక్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. - ఆందోల్లో నియోజకవర్గ నేతలకు చెప్పకుండా పార్టీ అభ్యర్థిని ఖరారు చేసినందుకు నిరసనగా టీఆర్ఎస్ ఏకైక జెడ్పీటీసీ సభ్యురాలు మమత బ్రహ్మం పార్టీకి రాజీనామా చేశారు. - సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవికి పోటీగా గత ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన మట్టా దయానంద్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. - వైరా అభ్యర్థి మదన్ లాల్ను మార్చాలని అసంతృప్తులు డిమాండ్ చేస్తున్నారు. -
స్పీకర్కు నోటీసులపై కోర్టుమెట్లెక్కిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ల సభా బహిష్కరణ వ్యవహారంలో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల సభా బహిష్కరణ తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ తానిచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహించిన విషయం తెలిసిందే. తీర్పును అమలు చేయనందుకు కోర్టు ధిక్కారం కింద ఎందుకు నోటీసులు జారీ చేయరాదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఎమ్మెల్యేల కేసుపై సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. డివిజన్ బెంచ్లో అప్పీలు చేసింది. ప్రభుత్వం వేసిన పిటిషన్ స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఆగస్తు 21కి వాయిదా వేసింది. -
బైక్పై నుంచి కిందపడ్డ స్పీకర్ మధుసూదనాచారి
-
బైక్పై నుంచి పడిపోయిన తెలంగాణ స్పీకర్
శాయంపేట: బైక్ అదుపుతప్పి స్పీకర్ మధుసూదనాచారి కిందపడి పోయారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రం శివారులో మంగళవారం జరిగింది. ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. పల్లె ప్రగతి నిద్ర కార్యక్రమంలో భాగంగా స్పీకర్ సోమవారం రాత్రి శాయంపేట మండల కేంద్రంలో నిద్రించారు. మంగళవారం ఆరెపల్లి గ్రామానికి బైక్ ర్యాలీ నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో శాయంపేట శివారుకు చేరుకోగానే మూలమలుపు వద్ద ఎదురుగా ఎడ్లబండి రావడంతో బైక్ను రోడ్డు కిందికి దించారు. మళ్లీ రోడ్డెక్కే క్రమంలో టైర్ స్కిడ్ అయి అదుపుతప్పి బైక్ పై నుంచి కిందపడిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది స్పీకర్ను పైకి లేపారు. మళ్లీ యథావిధిగా స్పీకర్ బైక్పై ర్యాలీ కొనసాగించారు. -
కోమటిరెడ్డి–సంపత్ కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆది నుంచీ అనేక మలు పులు తిరుగుతూ వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ల సభా బహిష్కరణ వ్యవహారంలో మంగళవారం సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల సభా బహిష్కరణ తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ తానిచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహించింది. తీర్పును అమలు చేయనందుకు కోర్టు ధిక్కారం కింద ఎందుకు నోటీసులు జారీ చేయరాదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది! అంతేగాక కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సహ ప్రతివాదిగా చేర్చి, ఫాం 1 నోటీసులిచ్చి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఎందుకివ్వరాదో కూడా తెలియజేయాలని నోటీసుల్లో స్పీకర్కు స్పష్టం చేసింది. బహిష్కరణ నోటిఫికేషన్ ఉపసంహరణకు స్పీకర్ అనుమతివ్వకపోవడం ఎలా చూసినా కోర్టు తీర్పును అమలు చేయకపోవడమేనని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో కోర్టు తీర్పు పట్ల స్పీకర్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆక్షేపించింది. ‘‘ఇందుకు కోర్టు ధిక్కార పిటిషన్లో స్పీకర్ను నేరుగా ప్రతివాదిగా చేర్చే అవకాశమున్నా అలా చేయకుండా నిగ్రహం పాటిస్తున్నాం. అలా ఎందుకు చేర్చకూడదో చెప్పాల్సిందిగా స్పీకర్ను కోరుతున్నాం’అని షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు మంగళవారం ఈ మేరకు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఓ స్పీకర్కు నోటీసులు జారీ చేయడం, అది కూడా కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలని కోరడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. కోమటిరెడ్డి, సంపత్ భద్రతను పునరుద్ధరించకపోవడంపైనా న్యాయమూర్తి స్పందించారు. డీజీపీ, నల్లగొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల ఎస్పీలను సుమోటోగా ధిక్కార పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ఫాం 1 నోటీసు జారీ చేసి ఎందుకు కోర్టు ధిక్కార చర్యలు తీసుకోరాదో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో అధికారులంతా మోసగించే ఆలోచలు చేశారని న్యాయమూర్తి తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. కోర్టు తీర్పును అమలు చేయకుండా ఏ ఒక్కరూ తప్పించుకోజాలరన్నారన్నారు. తీర్పును అమలు చేసి న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడాల్సిందన్నారు. ‘‘బహిష్కరణ తీర్మానం రద్దుతో వారి శాసనసభ్యత్వాలు వాటంతటవే పునరుద్ధరణ అవుతాయి. ఇందుకు ప్రత్యేక ఆదేశాలేవీ అవసరం లేదు. మా తీర్పుతో ఎమ్మెల్యేలిద్దరూ చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలకూ అర్హులు. అందులో భాగంగా వారికి గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ ఎస్పీలు తమకు ఆదేశాలు రాలేదంటూ మౌనం వహించారు. కోర్టు తీర్పు ఉన్నాక వారికింకా ఏ ఆదేశాలు అవసరమో అర్థం కాకుండా ఉంది. బహిష్కరణ తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదని, కాబట్టి ఎమ్మెల్యేలకు భద్రతను పునరుద్ధరించాల్సిన అవసరం లేదని డీజీపీ నేతృత్వంలోని కమిటీ అభిప్రాయపడింది. ఇదెంతమాత్రమూ సరికాదు’’అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 2018 జనవరి నుంచి ఈ రోజు దాకా కోమటిరెడ్డి, సంపత్కుమార్ తీసుకున్న అలవెన్సులు, సమర్పించిన బిల్లుల వివరాలను ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. కార్యదర్శులకు ఫాం 1 నోటీసులు మరోవైపు తమ బహిష్కరణను రద్దు తీర్పును అమలు చేయకపోవడంపై అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయ శాఖ కార్యదర్శి వి.నిరంజన్రావులకు కోర్టు ధిక్కార చట్టం కింద ఫాం 1 నోటీసులను జస్టిస్ శివశంకరరావు జారీ చేశారు. వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని వారికి స్పష్టం చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేశారు. వీరిద్దరు కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా జరిగింది ఇదీ... కోమటిరెడ్డి, సంపత్కుమార్లను బహిష్కరిస్తూ సభ తీర్మానం చేసింది. ఆ వెంటనే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. బహిష్కరణ తీర్మానాన్ని, నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఏప్రిల్ 17న జస్టిస్ శివశంకరరావు తీర్పు ఇచ్చారు. దీనిపై అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేయలేదు. వారికి బదులు 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. వారికి ఆ అర్హత లేదంటూ అప్పీల్ను ధర్మాసనం కొట్టేసింది. అయినా అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు కోర్టు తీర్పును అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్ వారిపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు ఇద్దరు కార్యదర్శులూ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. వారికి ఫాం 1 నోటీసులిస్తానని స్పష్టం చేశారు. దాంతో కార్యదర్శులు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు 61 రోజుల ఆలస్యంతో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ధర్మాసనం వారికి అనుకూలంగా ఉత్తర్వులివ్వకుండా విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు మంగళవారం మధ్యాహ్నం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు నోటీసులిస్తూ 83 పేజీలతో ఉత్తర్వులు, ఇరువురు కార్యదర్శులకు వ్యక్తిగత హాజరుకు ఫాం 1 నోటీసులిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. -
మెకానిక్ల సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తా
భూపాలపల్లి అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా టూ వీలర్స్ మెకానిక్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించడానికి కృషి చేస్తానని అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. స్థానిక ఎస్ఎస్ఆర్ గార్డెన్స్లో ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్ర టూ వీలర్స్ మెకానిక్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక రకాల వృత్తుల వారు అభివృద్ధి చెందున్నప్పటికీ మెకానిక్లు మాత్రం వెనుకబడి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు అంబేడ్కర్ సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సదస్సుకు సుమారు రెండు వేల మంది మెకానిక్లు హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర స్థానిక నాయకులు తోడేటి బాబు, స్వామి, రమేష్, ఆశోక్రెడ్డి, సుజేందర్, రాము, రవికాంత్, లక్ష్మణ్, రాజు, రాజినీకాంత్, మనోహర్, జాఫర్, రమేష్, పాషా, శంకర్, సురేష్, వినయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
స్పీకర్కు పోలీసుల గౌరవ వందనం
ఖమ్మంఅర్బన్ : నగరానికి వచ్చిన స్పీకర్ మధుసూదనాచారి పోలీసులు ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ ఇంటి వద్ద ఆదివారం పోలీసులు మర్యాదపూర్వకంగా ఆయనకు గౌరవ వందనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సీఐ నాగేంద్రాచారి తదితరులు ఉన్నారు. -
చదువుతోనే బంగారు భవిష్యత్
చిట్యాల: చదువు ద్వారానే విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంది.. అందుకోసం మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. స్థానిక కస్తూరిబాగాంధీ బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ తరగతులను స్పీకర్ శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థులకు దుప్పట్లు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎంతో కష్టపడి చదువుకుని రాజ్యాంగ నిర్మాత అయ్యారని, పీపీ నర్సింహారావు బహుభాషా కోవిదుడిగా పేరుగాంచి భారత ప్రధానమంత్రి అయ్యారని గుర్తు చేశారు. గతంలో చదువుకోవడం కష్టంగా ఉండేదని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని, క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసి ఉత్తమ ఫలితాలు సాధించాల ని కోరారు. ఉపాధ్యాయులు ప్రణాళిక ప్రకారం విద్యాబోధన చేయాలని సూచించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్పీకరును టీచర్లు, విద్యార్థులు సత్కరించారు. డీఈఓ శ్రీనివాసరెడ్డి, సెక్టోరియల్ అధికారి నిర్మల, ఎంపీడీఓ చందర్, సర్పంచ్ పుల్లూరి రమాదేవి, పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ కుంభం రవీందర్రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సుమలత, తహసీల్దార్ షరీఫ్మొహినొద్దీన్ పాల్గొన్నారు. -
రైల్వేకోర్టుకు హాజరైన స్పీకర్ మధుసూదనాచారి
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వేకోర్టుకు రైల్రోకో కేసులో భాగంగా మంగళవారం స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2013 సంవత్సరంలో చేపట్టిన రైల్రోకో కేసులో స్పీకర్ మధుసూదనచారి, అచ్చ విద్యాసాగర్, ఎస్.శ్రీనివాస్, డి.దయాసాగర్, ఎ.వినోద్, దిడ్డి నరేష్, వి.సత్యనారాయణ, బొల్లం సంపత్, మేకల రవి, రామగళ్ల పరమేశ్వర్ హాజరయ్యారు. అదేవిధంగా ధర్మారం రైల్వే గేట్ వద్ద 2014 సంవత్సరంలో జరిగిన రైల్రోకో కేసులో స్పీకర్ మధుసూదనచారి, ల్యాదెళ్ల బాలు, విజయ్, ఎల్.రామారావు, పి.ప్రేమ్కుమార్, జి.రమేష్, జి.రాజు, కె.రాములు, వి.లింగారెడ్డి, జి.సందీప్లు హాజరుకాగా వరంగల్, ధర్మారం కేçసులను పరిశీలించిన రైల్వే మెజీస్ట్రేట్ ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పు చెప్పినట్లు వారు తెలిపారు. -
స్పీకర్, రేవంత్ల మధ్య స్వల్ప వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కమార్ల సభ్యత్వ రద్దు విషయంలో హైకోర్టు తీర్పు అమలు చేయడంలేదంటూ సీఎల్పీ బృందం సోమవారం స్పీకర్ మధుసూదనచారిని కలసి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి, సంపత్ల సభ్యత్వాన్ని పునరుద్దరించాలని వారు స్పీకర్ను కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస నేతలు ఉత్తమ్ కుమార్రెడ్డి, జనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్, అసెంబ్లీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని స్పీకర్కు సలహాలు ఇవ్వాలని సూచించారు. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడంలేదని స్పీకర్ను అడిగినట్టు వారు పేర్కొన్నారు. కోర్టు తీర్పును అమలు చేయకుంటే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. అవసరమైతే సుప్రీం కోరుఓటను కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు. స్పీకర్, రేవంత్ మధ్య స్వల్ప వాగ్వాదం కాంగ్రెస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేస్తున్న సమయంలో స్పీకర్కు, రేవంత్కు మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పును అమలు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని రేవంత్ స్పీకర్ని ప్రశ్నించారు. దీంతో అక్కడి వాతావరణం కొద్దిగా వేడెక్కింది. ఒకింత అసహనానికి లోనైన స్పీకర్ రేవంత్ ఇలా మాట్లాడితే తాను ఇక్కడి నుంచి వెళ్లిపోతానని తెలిపారు. దీంతో కొందరు కాంగ్రెస్ నేతలు స్పీకర్ను సముదాయించారు. -
స్పీకర్కు తప్పిన ప్రమాదం
గణపురం: శాసన సభాపతి మధుసూదనాచారికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్పైకి లారీ దూçసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రంలో శుక్రవారంరాత్రి స్పీకర్ పల్లెనిద్ర చేశారు. శనివారం ఉదయం గణపురంలో నిర్మించిన బస్టాండ్ను ప్రారంభించి తిరిగి భూపాల పల్లికి బయలుదేరారు. ఈ క్రమంలో గణపసముద్రం చెరువు మత్తడి సమీపంలోకి స్పీకర్ కాన్వాయ్ చేరుకుంది. గాంధీనగర్ నుంచి ములుగు వైపు దేవాదుల పైపులను తీసుకుని ఎదురుగా వస్తున్న లారీ కాన్వాయ్పైకి దూసుకెళ్లింది. స్పీకర్ వెనుక వస్తున్న ఎస్కార్ట్ డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కకు దిం పాడు. అంతలో లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. వెనకాల వస్తున్న మరో లారీ ముందున్న లారీని ఢీకొట్టింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురై వాహనాలను నిలిపి వేశారు. స్పీకర్ వాహనాన్ని పక్క నుంచి మళ్లించారు. కాన్వాయ్లోని వాహనానికి, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు, టీఆర్ఎస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. -
స్పీకర్ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం
-
స్పీకర్ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం
సాక్షి, జయశంకర్ భూపాల్పల్లి: తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో ప్రమాదం తప్పింది. భూపాలపల్లి జిల్లాలోని గణపురం శివారులో స్పీకర్ కాన్వాయిలోని వాహనాన్ని లారీ ఢీకొట్టింది. తన నియోజవర్గమైన గణపురంలో పల్లెనిద్ర ముగించుకుని భూపాలపల్లికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. లారీ ఢీకొనడంతో కాన్వాయిలోని వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అంతకుముందు గణపురం మండల కేంద్రంలో మధుసూదనాచారి పల్లె నిద్ర చేశారు. ఉదయం స్థానిక ప్రజలతో కలిసి నడుచుకుంటూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. -
దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ: స్పీకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటైన నాలుగేళ్లలోనే దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతోందని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకొని అసెంబ్లీ ఆవరణలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రంలో, అమరుల ఆశయాలను సాధించుకోవడానికి నిరంతర కృషి జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి దేశమే ఆశ్చర్యపోతోందని వ్యాఖ్యానించారు. ఇదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధించుకోవాలన్నారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ అమ్మ వారి గుడిలో స్పీకర్ ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ భవన్లోనూ.. రాష్ట్రావతరణ వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జాతీయజెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. -
స్పీకర్పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
-
దూరదృష్టి ఉంటే అద్భుత ఫలితాలు
హైదరాబాద్: నాయకుడికి దూరదృష్టి ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్ఐఆర్డీ)లో 14 రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గ్రామీణాభివృద్ధిపై నిర్వహిస్తున్న నాలుగు రోజుల శిక్షణను ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణులకు ప్రభుత్వ పథకాల గురించి తెలియకపోవడంతో వారి జీవన విధానంలో ఇప్పటికీ ఎలాంటి మార్పూ లేదన్నారు. ప్రజలకు అవసరమైన వాటిని తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలన్నారు. పల్లెనిద్ర, పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా ఇప్పటికీ ప్రపంచానికి తెలియని కులాల వారిని కలుసుకున్నానని, అదేవిధంగా ప్రజాప్రతినిధులంతా తమ నియోజకవర్గ సమస్యలపై అవగాహన పెంచుకుని అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. అవగాహన పెంచుకుంటాను మొదటిసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. ఈ శిక్షణ ద్వారా గ్రామీణుల సమస్యలపై అవగాహన పెంచుకుని వారికి సేవ చేసేందుకు కృషిచేస్తాను. – సుష్మాపాటిల్, బీఎస్పీ ఎమ్మెల్యే, ఉత్తరప్రదేశ్ సేవ చేసేందుకు శిక్షణ ఉపయోగం గ్రామీణులకు కేంద్ర, రాష్ట్ర పథకాలను పూర్తిస్థాయిలో అందిం చేందుకు ఈ శిక్షణ ఉపయోగపడనుంది. నా నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషిచేస్తాను. గ్రామీణ ప్రాంత ప్రజలతోనే అభివృద్ధి సాధ్యం. – పవన్సైనీ, బీజేపీ ఎమ్మెల్యే, హరియాణా -
‘ కేసీఆర్ పాలనలో రైతులకు స్వర్ణయుగం’
సాక్షి, పరకాల: వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరందించి, రాష్ట్రంలో కరువు పరిస్థితులు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పరకాల పట్టణంలోని జీఎంఆర్ గార్డెన్లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం కిసాన్ మేళా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరై 50 మంది రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే వ్యవసాయానికి అత్యంత అనుకూలమైన ప్రాంతం తెలంగాణ రాష్ట్రమన్నారు. కేసీఆర్ పరిపాలన రైతులకు స్వర్ణయుగమని చెప్పారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెద్దపీట వేశారని కొనియాడారు. రుణాల కోసం ఎదురుచూడకుండా ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులకు పెట్టుబడి అందించడం చారిత్రకమైందని తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాళ్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ బొల్లె భిక్షపతి, వరంగల్ వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ కొంపెల్లి ధర్మారాజు, పరకాల, ఆత్మకూరు ఎంపీపీలు నేతాని సులోచన, మల్లికార్జున్, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, పరకాల ఏడీఏ విద్యాసాగర్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, మండలంలోని వ్యవసాయా విస్తీర్ణ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల పరిరక్షణే చట్టసభల కర్తవ్యం
సాక్షి, న్యూఢిల్లీ : సమాజంలో అసమానతల్లేకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధి విధానాలు రూపొందించి చట్టాలను అమలు చేయడమే చట్టసభల ప్రధాన కర్తవ్యమని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. సోమవారం ఢిల్లీలో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ సమీక్షలో పలు రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, మండలి చైర్మన్లు పాల్గొన్నారు. ప్రజల హక్కులను పరిరక్షించేందుకు సభలను నడపాలని మధుసూదనాచారి పేర్కొన్నారు. గత కామన్వెల్త్ పార్లమెంటరీ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై సమావేశంలో చర్చించారు. తదుపరి సమావేశం జూన్ 2న ముంబైలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో రాష్ట్ర అసెంబ్లీ పనితీరు ప్రశంసనీయమని సుమిత్రా మహాజన్ కొనియాడినట్లు పేర్కొన్నారు. చట్టసభల్లో ఎదురవుతున్న సమస్యలు, ఇతర అంశాల పరిష్కారానికి ఇలాంటి సమావేశాలు ఉపయోగపడుతాయని మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. అన్ని రాష్ట్రాల స్పీకర్లు, మండలి చైర్మన్లతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించాలని కోరడంపై సుమిత్రా మహాజన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. సమాజంలోని అసమానతల తొలగింపునకు విశేష కృషి చేసి దేశానికి దశ, దిశ చూపిన మహనీయులు జ్యోతిబా పూలే, బీఆర్ అంబేడ్కర్ అని మధుసూదనాచారి, స్వామిగౌడ్ కొనియాడారు. తెలంగాణ పూలే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే, అంబేడ్కర్ల జయంతి వేడుకలను ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. -
ప్రతి గ్రామానికి సేవ చేస్తా
టేకుమట్ల: పల్లెల అభివృద్ధే నా ఎజెండా.. ప్రతీ పల్లె అభివృద్ధి చెందేవరకూ విశ్రమించనని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని వెంకట్రావుపల్లి(బి) గ్రామంలో పల్లె ప్రగతి నిద్ర ముగింపు సందర్భంగా ప్రతి వాడలో తిరుగుతూ ప్రజల అవసరాల ను తెలుకున్నారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు భరోసానిచ్చారు. గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన బండి రాజు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎవరూ చేయలేని అభివృద్ధి పనులను చేశానని, అందుకు ప్రజలే సాక్ష్యమన్నారు. కరీంనగర్ నుంచి టేకుమట్ల మండలం మీదుగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి జాతీయ రహదారి, ఓడేడు మానేరుపై అంతర్జిల్లా వంతెనతో గోదావరిఖని నుంచి హన్మకొండకు డబుల్ రోడ్డుతో ప్రయాణికుల రవాణాను త్వరలో మెరుగుపర్చే కార్యక్రమం ముందుకు సాగుతుందన్నారు. రైతుల సాగు నీటికి ఇబ్బంది కలుగకుండా భారీ బడ్జెట్తో మానేరులో చెక్డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశానన్నారు. చెరువు శిఖం భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్న తీరును గ్రామస్తులు స్పీకర్కు తెలపడంతో స్పందించిన ఆయన వెంట నే తహసీల్దార్తో మాట్లాడి అక్రమార్కుల నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట నాయకులు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, ఏకు మల్లేష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఒరంగంటి సధాకర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కూర సురేందర్రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు నేరేళ్ల శ్రీనివాస్గౌడ్, నాయకులు కొలిపాక రాజయ్య, వంగ కుమారస్వామి, రాంరెడ్డి, డాక్టర్ ఏకు నవీన్, సంగి రవి, కమురోద్ధిన్, పైడిపెల్లి సతీష్, మామిండ్ల ఎల్లస్వామి, వర్థాచారి, బందెల శ్రీనివాస్ యువజన నాయకులు అభిరాజు, తోట సాగర్, అందె కుమార్, బీనవేని ప్రభాకర్గౌడ్, దొడ్ల కోటి, బండమీది అశోక్, గునిగంటి మహేందర్, మల్లికార్జున్, శ్రీపతి రాకేష్, నాంపెల్లి వీరేశం, బొజ్జపెల్లి తిరుపతి, గంధం సురేష్, కిష్టస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
మధుసూదనాచారిపై సోషల్ మీడియాలో సెటైర్లు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిపై సోషల్మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా ఆయన పాలాభిషేకం వీడియో ఒకటి నెట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధి అయివుండి ఇలాంటి పనులను ప్రొత్సహించటమేంటని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘పాలను వృధా చేశారు. తెలంగాణలో కనీసం వాటిని కొనలేని ప్రజలు ఉన్నారని గుర్తించండి’ అని కొందరు.. ‘సాధారణంగా సినిమా వాళ్లకు కటౌట్లకు ఇలాంటి పాలాభిషేకం చూస్తుంటాం. కానీ, ఇప్పుడది వేరే మలుపు తీసుకున్నట్లుంది’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే ఓ మెట్టుదిగి ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో కొత్తగా గ్రామపంచాయతీలు ఏర్పాటుచేసినందుకు కృతజ్ఞతగా తన నియోజకవర్గం భూపాలపల్లిలోని పెద్దపల్లి గ్రామంలో అనుచరులు మధుసూదనాచారికి పాలాభిషేకం చేసిన విషయం తెలిసిందే. Damn.... is it this hard to see the wastage.... Ironic making a fool out of themselves on April Fool's day... — Manisha Palai (@manishapalai) 1 April 2018 What a wastage of milk! You do realize Telangana has a lot of people who actually don't have money to afford it. — Dr. Sugandha (@sugandhakohli) 1 April 2018 -
స్పీకర్కు పాలాభిషేకం... వైరల్!
-
అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
-
కోమటిరెడ్డి, సంపత్ల సభ్యత్వాలు రద్దు
సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాల తొలిరోజు అసెంబ్లీలో నిరసనకు దిగిన కాంగ్రెస్ పార్టీ సభ్యులకు గట్టి షాక్ తగిలింది. బడ్జెట్ సమావేశాల తొలిరోజున ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నినాదాలతో నిరసనకు దిగారు. అందులో భాగంగా ప్లకార్డులు ప్రదర్శించడమే కాకుండా కాగితాలను చించి పోడియం వైపు విసిరారు. ఆ ప్రయత్నంలో సభ్యుడు కోమటిరెడ్డి వేదికపైకి హెడ్సెట్ విసిరిన సంగతి తెలిసిందే. మంగళవారం సభ ప్రారంభమైన తర్వాత సోమవారం కాంగ్రెస్ సభ్యులు ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. వాటిని క్షమించరాని ఘటనగా స్పీకర్ పేర్కొన్నారు. సభా మర్యాదలు మంటగలిపే చర్యలకు పాల్పడిన కారణంగా కాంగ్రెస్ కు చెందిన మొత్తం 11 మంది సభ్యులపై వేటు వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ ఘటనలకు సంబంధించి శాసన మండలిలోనూ ఐదుగురు సభ్యులపై వేటు పడింది. కోమటిరెడ్డి, సంపత్ల సభ్యత్వం రద్దు : క్రమశిక్షణ చర్య కింద 11 మంది కాంగ్రెస్ సభ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి చెప్పారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు సోమవారం ఘటనలను నిరసిస్తూ సంబంధిత సభ్యులపై చర్యలు కోరుతూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వం రద్దు చేయగా మిగిలిన సభ్యులపై బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ వర్తిస్తుందని స్పీకర్ తెలిపారు. సస్పెండైన ఎమ్మెల్యేలు వీరే : స్పీకర్ సస్సెండ్ చేసిన కాంగ్రెస్ సభ్యుల్లో ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఉపనేత జీవన్రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తం కుమార్రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క, రామ్మోహన్రెడ్డి, వంశీచంద్రెడ్డి, పద్మావతిరెడ్డిలు ఉన్నారు. మాధవరెడ్డి కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మండలిలోనూ : సోమవారంనాటి దాడి ఘటనకు సంబంధించి శాసన మండలిలోనూ సస్సెన్షన్ నిర్ణయాలు జరిగాయి. మండలిలో కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీతోపాటు పొంగులేటి సుధాకర్రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, దామోదర్రెడ్డిలను సస్సెండ్ చేస్తున్నట్లు ఉప సభాపతి నేతి విద్యాసాగర్ ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల వరకే వీరిపై సస్పెన్షన్ ఉంటుందని పేర్కొన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12 నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాసనభ స్పీకర్ మధుసుదనాచారి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్లు గురువారం అధికారులతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం రాష్ట్ర డీజీపీ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు, అసెంబ్లీ అధికారులతో కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై ఈ సమావేశం జరుగనుంది. ఈ నెల 12న బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉభయసభల సభ్యులనుద్దేశించి ప్రసగించనున్నారు. అదే రోజు తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అసెంబ్లీ వద్ద తీసుకోవాల్సిన భద్రతాచర్యలపై వీరు చర్చించనున్నట్టు సమాచారం. -
పర్యావరణాన్ని పరిరక్షించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అద్భుతమైన అటవీ ప్రాంతాలు, సహజ ఆవాసాలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, వాటిని పరిరక్షించుకోవాలని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. రాష్ట్రాన్ని పర్యాటకంగానే కాకుండా దేశంలోనే గొప్ప ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇందుకోసం అటవీ, పర్యాటక శాఖలకు తోడు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణపై ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో స్పీకర్ అధ్యక్షతన జరిగింది. అటవీ సంపద, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఎకో టూరిజం అభివృద్ధిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని, దానిని అసెంబ్లీ కమిటీ తరఫున ప్రభుత్వానికి పంపుదామని స్పీకర్ సూచించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, ఫరీదుద్దీన్, ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, కిషన్రెడ్డి, దివాకర్రావు, బాపూరావు రాథోడ్, గువ్వల బాలరాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పర్యావరణహిత టూరిజం అభివృద్ధికి ప్రణాళిక వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణకు అటవీశాఖ తరఫున చేపట్టిన కార్యక్రమాలు, పథకాలపై సమావేశంలో పీసీసీఎఫ్ పీకే ఝా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వేట నియంత్రణకు పోలీసులు, అటవీ సిబ్బం దితో ఉమ్మడి నియంత్రణకు చర్యలు తీసుకుంటామని, పర్యావరణహిత టూరిజం అభివృద్ధికి త్వరలోనే ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని అటవీశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో అర్బన్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆహ్వానం మేరకు హరితహారం, అటవీ పునరుజ్జీవన చర్యలు, అర్బన్ పార్కుల సందర్శనకు కమిటీ త్వరలోనే వెళ్తుందని స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. -
నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన స్పీకర్
సాక్షి, భూపాలపల్లి: శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి శనివారం మేడారం సమ్మక్క-సారాలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నిలువెత్తు బంగారాన్ని సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ జాతర ఇంకా ప్రారంభం కాకముందే ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారన్నారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో తగిన ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు. కుంభమేళాలు నదీ పరివాహక ప్రాంతాల్లో జరిగితే.. తెలంగాణలో అటవీ ప్రాంతాన కుంభమేళా జరగడం విశేషమన్నారు. ప్రపంచంలో అరుదైన జాతర మేడారమని అభివర్ణించారు. తెలంగాణ ప్రజల జీవితాలు ప్రకృతితో ముడిపడి ఉన్నాయన్నారు. కుటుంబ సమేతంగా ఈ నెల 31న ఎడ్ల బండి పై మరోసారి వచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటానని మధుసూదనాచారి తెలిపారు. -
అసెంబ్లీలో గణతంత్ర వేడుకలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, మండలిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభలో స్పీకర్ మధుసూదనాచారి, మండలిలో చైర్మన్ స్వామిగౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసనసభా కార్యదర్శి నరసింహాచార్యులు, శాసనసభ సచివాలయ ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర వేడుకలు జరిపారు. -
‘డైలాగ్స్ పలకడంలో ఆయనకు ఆయనే సాటి’
‘‘ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడం సుబ్బరామిరెడ్డిగారికే సాధ్యం. కళాకారులను సన్మానించడానికి ఆయన 120 ఏళ్లు జీవించి ఉండాలి’’ అని మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావు అన్నారు. ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి బుధవారం ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు మంచు మోహన్బాబుని ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుతో సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యాసాగర్ రావు మాట్లాడుతూ– ‘‘భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ తర్వాత తెలుగే అని మనం సగర్వంగా చెప్పుకోవాలి. మారుమూల ప్రాంతాల్లోని పేద కళాకారులను సైతం గుర్తించి సన్మానం చేయాలని సుబ్బరామిరెడ్డిగారికి నేను మనవి చేస్తున్నా. ప్రపంచంలోని తెలుగువారందర్నీ కలిపి ఓ వెబ్సైట్ తయారు చేయాలి. తెలుగు భాషకు సంబంధించిన చరిత్ర, అన్ని విషయాలు అందులో ఉండేలా చూడాలి. తెలుగు భాష పేద విద్యార్థులకు ఎంత ఉపయోగపడుతుందనే విషయం మరచిపోకూడదు. సిటీల్లో గ్రాడ్యుయేషన్ వరకూ చదవాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. పల్లె ప్రాంతంలో అయితే దాదాపు ఖర్చు లేకుండానే వాళ్లు చదువుకుంటున్నారు. కానీ, గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంజినీరింగ్ కావొచ్చు.. కలెక్టర్ కావొచ్చు.. ధనిక విద్యార్థులతో పోటీ పడుతున్నారు గ్రామీణ విద్యార్థులు. ఈ శక్తి వారికి ఎలా వచ్చిందంటే తల్లిలా ఉండే తెలుగు భాషవల్లే. తెలుగు భాష వల్ల కొన్ని వేల రూపాయల సబ్సిడీ దొరుకుతోంది. అటువంటి భాషను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కులరహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలి. పదునైన పదజాలాన్ని పలకడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు మోహన్బాబుగారు. డైలాగులంటే ఎన్టీఆర్ తర్వాత గుర్తుకు వచ్చే వ్యక్తి మోహన్బాబుగారే’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ– ‘‘మోహన్బాబు నటన అద్భుతం. ఐదు తరాల ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న ఆయన ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుకు సంపూర్ణ అర్హులు’’ అన్నారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ– ‘‘మోహన్బాబుగారి సినిమాలు భారతీయులు.. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రజల గుండెల్లో చెక్కబడి ఉంటాయని చెప్పగలను. ఆయన జీవితం అంతా కళారంగానికే అంకితం చేశారు’’ అన్నారు. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మోహన్బాబు 42 ఏళ్లలో 600 చిత్రాలకు పైగా నటించారు. భారతదేశ చలనచిత్ర రంగంలో విలన్గా ఉండి హీరో అయ్యి 150 సినిమాలు (హీరోగా) చేసిన ఘనత మోహన్బాబుది. ఎంత గొప్ప నటుడో అంత ఖలేజా, దమ్ము ఉన్న మనిషి. 14వేల మంది విద్యార్థులున్న కాలేజీ పెట్టి 4వేల మందికి ఉచితంగా విద్య అందిస్తున్నారు. అటువంటి మోహన్బాబుని ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుతో సత్కరించుకోవడం సంతోషం’’ అన్నారు. అవార్డు గ్రహీత మోహన్బాబు మాట్లాడుతూ– ‘‘మంచి వ్యక్తి అయిన విద్యాసాగర్ రావు నా ఆత్మీయులు కావడం సంతోషం. ఓరుగల్లు అంటే వరంగల్.. పౌరుషాల గడ్డ. ఆ ప్రాంతం గురించి నాకు పెద్దగా తెలియదు కానీ. కులమతాలకు అతీతంగా తెలుగు వారంతా కలిసి మెలసి ఉండాలని పోరాడిన వీర వనిత రుద్రమదేవి గురించి తెలుసు. డబ్బున్న వాళ్లు ఎందరో ఉంటారు. అందరికీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన రాదు. పూర్వం రాజులు చేసేవారు. ఇప్పుడు సుబ్బరామిరెడ్డిగారు చేస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని నేనీ స్థాయికి వచ్చా. భక్తవత్సలం నాయుడు అయిన నన్ను మా గురువు దాసరిగారు మోహన్బాబుగా మార్చారు. 1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ని స్థాపించి అన్నగారు ఎన్టీఆర్తో కొబ్బరికాయ కొట్టించాను. 1992లో నా ఆస్తులు తాకట్టు పెట్టి ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా తీస్తే అది సిల్వర్ జూబ్లీ హిట్ అయింది. మళ్లీ అన్నగారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టా. ఆ మహానుభావుడు నన్ను రాజ్యసభకు పంపారు. అందరికీ కోపం ఉంటుంది. కానీ, నాకు ఎక్కువ ఉంటుంది. ‘తన కోపమే తన శత్రువు’ అన్నట్టు నా కోపం నాకు నష్టాన్ని కలిగించిందే తప్ప ఎవరికీ నష్టం కలిగించలేదు’’ అన్నారు. హీరో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికీ లలిత కళలు బతికి ఉన్నాయంటే సుబ్బరామిరెడ్డిగారిలాంటి వారివల్లే. ‘కాకతీయ కళా పరిషత్’ స్థాపించిన తొలిసారి మోహన్బాబుగారిని సత్కరించుకోవడం మా చలనచిత్ర రంగాన్ని సన్మానించడంగా నేను భావిస్తున్నా’’ అన్నారు. హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ఏ నుంచి జెడ్ వరకూ మోహన్బాబుగారికి అభిమానులే’’ అన్నారు. ఈ సందర్భంగా దివంగత నటులు టీఎల్ కాంతారావు కుటుంబానికి సుబ్బరామిరెడ్డి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. పలువురు కళాకారులను ఈ వేదికపై సత్కరించారు. దర్శకులు కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బి.గోపాల్, హీరోలు మంచు విష్ణు, మనోజ్, నటులు అలీ, సంగీత దర్శకుడు కోటి, నటీమణులు జయప్రద, జయసుధ, మంచు లక్ష్మి, హీరోయిన్లు శ్రియ, ప్రగ్యా జైస్వాల్, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, డీకే అరుణ, ఎమ్మెల్సీ షబ్బీర్ హుస్సేన్తో పాటు డి.శ్రీనివాస్, దానం నాగేందర్, గీతారెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. -
గెలుపెవరిదో?
ఆర్కేనగర్ రేసులో గెలుపు గుర్రంగా నిలబడబోతోంది ఎవరో అని ఉత్కంఠ నెలకొంది. గెలుపు ధీమా ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల్లో ఉన్నా, ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందో అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు ఆర్కేనగర్ ఉప ఎన్నిక రెఫరెండంగా మారింది. ఈ గెలుపుతో తాము బలహీనపడలేదని చాటుకునేందుకు అన్నాడీఎంకే తీవ్ర వ్యూహాల్నే అమలు చేసింది. అదే గెలుపు తన వశం చేసుకుని సత్తా చాటు కోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం కుస్తీలు పట్టింది. పాలకుల మీద ప్రజలు తీవ్ర ఆక్రోశంతో ఉన్నారని చాటే రీతిలో, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, అధికారం తమదేనని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికల్ని డీఎంకే తీవ్రంగానే పరిగణలోకి తీసుకుంది. ఎన్నికల రేసులో చాంతాడంత క్యూ ఉన్నా, గెలుపు ఓటములు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే, అన్నాడీఎంకే అమ్మ శిబిరాల మధ్య ఉందని చెప్పవచ్చు. 21వ తేదీ జరిగిన ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుతో తీర్పును ఈవీఎంలలో భద్రతపరిచారు. ఓటింగ్ శాతం మేరకు డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్ మధ్య గెలుపు ధీమా ఉన్నా, ఓటరు నాడి ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ తప్పడం లేదు. మరి కొన్ని గంటల్లో ఈవీఎంలలోని ఫలితాలు బయటకు రానుండడంతో ఆర్కేనగర్ రేసులో గెలుపు గుర్రంగా నిలబడబోతున్నదెవరోనన్న ఎదురుచూపులు పెరిగాయి. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ఓటింగ్కు ఉపయోగించిన ఈవీఎంలు అన్నీ థౌజండ్ లైట్స్లోని క్వీన్ మేరిస్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్ర పరిచారు. ఈ పరిసరాల్లో ఐదు అంచెల భద్రతను కల్పించారు. ఆదివారం ఉదయాన్నే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అక్కడే అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఉదయం ఏడు గంటల్లోపు అక్కడికి చేరుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు. పాస్లన్నీ ఇప్పటికే అందించారు. కౌంటింగ్ కేంద్రం, పరిసరాల్లో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించి, భద్రత కల్పించారు. ఎప్పటికప్పుడు ఫలితాల్ని అందించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. వెబ్ టెలికాస్టింగ్ పద్ధతి ద్వారా ఢిల్లీ, చెన్నై కార్పొరేషన్లోని కంట్రోల్ రూమ్ల నుంచి లెక్కింపు, ఫలితాల సరళిని ఎన్నికల అధికారులు పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు. పూర్తిగా వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు. 19 రౌండ్లుగా లెక్కింపు ఓట్ల లెక్కింపు 19 రౌండ్లుగా సాగనుంది. ఒక్కో రౌండ్కు 14 పోలింగ్ బూత్ల ఓట్ల లెక్కింపు సాగుతుంది. చివరి రౌండ్లో మాత్రం ఆరు పోలింగ్ బూత్లలో లెక్కింపు జరగనున్నట్టు చెన్నై జిల్లా ఎన్నికల అధికారి, కార్పొరేషన్ కమిషన్ కార్తికేయన్ తెలిపారు. కౌంటింగ్ విధులకు హాజరు కానున్న 200 మంది సిబ్బందికి శనివారం కార్తీకేయన్, ఎన్నికల అధికారి ప్రవీణ్ నాయర్ శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ సరళి, ఏజెంట్లకు సమాచారాలు, అధికారులకు సమాచారాలు, రిటర్నింగ్ అధికారికి వివరాలు, ఇలా అన్ని రకాల అంశాలతో ఈ శిక్షణ సాగింది. -
మేం మంచి దోస్తులం
సాక్షి, గుంటూరు: ఉమ్మడి రాష్ట్రంలో తామిద్దరం కలిసి పనిచేశాం. గతంలో ఒకే పార్టీలో పనిచేసిన మా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. మేము మంచి దోస్తులం అంటూ ఏపీ అసెంబ్లీ కోడెల శివప్రసాదరావు, తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతూ బుధవారం ఉదయం గుంటూరులో ఏపీ స్పీకర్ కోడెల ఇంటికి వెళ్లారు. ఈ సందర్బంగా కోడెల కుటుంబ సభ్యుల నుంచి వారికి సాదర స్వాగతం లభించింది. తిరుమలతోపాటు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా మధుసూదనాచారి కుటుంబ సభ్యులకు దర్శన భాగ్యం కల్పించాలని సంబంధిత దేవాలయాల అధికారులను స్పీకర్ కోడెల ఆదేశించారు. సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్ళి కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు స్పీకర్లు విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రం విడిపోయినా రెండు రాష్టాలు సఖ్యతతో పనిచేస్తున్నాయన్నారు. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన ఉందన్నారు. శాసనసభ వ్యవహారాలలో ఇద్దరం సమన్వయంతో పనిచేస్తున్నామని వారు పేర్కొన్నారు. -
వికలాంగుల సంక్షేమానికి రూ.30 కోట్లు కేటాయింపు
-
స్పీకర్ను కలసిన ‘ఆస్ట్రేలియా’ బృందం
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియా–తెలంగాణ పార్లమెంట్ సంబంధాల అధ్యయన యాత్రలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా పార్లమెంట్ ప్రతినిధుల బృందం శాసనసభా స్పీకర్ మధుసూదనాచారిని కలిసింది. శుక్రవారం స్పీకర్ చాంబర్లో ఆస్ట్రేలియా ఎంపీ ఆంథోని అల్బెన్స్ నేతృత్వంలోని బృందం ఆయనను కలసి వివిధ అంశాలపై చర్చించింది. చట్టసభల కార్యకలాపాల గురించి ఆ బృందం అడిగి తెలుసుకుంది. అనంతరం ప్రతినిధుల బృందాన్ని స్పీకర్, శాసన సభా కార్యదర్శి నర్సింహాచార్యులు సత్కరించారు. -
అసెంబ్లీ నడిపే తీరు గౌరవంగా లేదు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల తీరుపై విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ సభ నడిపే తీరు గౌరవంగా లేదంటూ ఆయన చాంబర్కు వెళ్లి నిరసన తెలిపారు. ఈ పరిస్థితి మారకపోతే తాము శాసనసభకు రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బుధవారం ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభాపతి మధుసూదనాచారితో కాంగ్రెస్ సభ్యులు భేటీ అయ్యారు. బీజేపీ, టీడీపీ, సీపీఎం సభ్యులతో కలసి స్పీకర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ జరుగుతున్న తీరుపై కాంగ్రెస్ సభ్యులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి గౌరవం ఇవ్వకపోవడంతో సభకు హుందాతనం పోతోందని స్పీకర్కు విన్నవించారు. సభా నాయకుడికి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మధ్య సమన్వయం చేయాలని సూచించారు. ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదన్నారు. స్పీకర్, శాసనసభ గురించి మాట్లాడే పరిస్థితి రావటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సభ నిర్వహణ సజావుగా లేకపోతే బాధ్యత స్పీకర్దేనని, ఇది మీ గౌరవానికి కూడా మంచిదికాదని స్పీకర్కు విన్నవించారు. అసెంబ్లీ ప్రభుత్వ సచివాలయం కాదని, అన్ని రాజకీయ పార్టీలకు వేదిక లాంటిదని విపక్ష సభ్యులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. -
బాలల చట్టాలపై సరైన ప్రచారం లేదు
స్పీకర్ మధుసూదనాచారి సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ కారణాల వల్ల 18 ఏళ్లలోపు పిల్లల పరిస్థితి దయనీయంగా మారిందని శాసన సభ స్పీకర్ ఎస్.మధుసూదనా చారి ఆవేదన వ్యక్తం చేశారు. బాలల హక్కుల చట్టాలపై సరైన ప్రచారం కూడా ఉండడం లేదన్నారు. యూనిసెఫ్ సహకారంతో కర్ణాటక లెజిస్లేటర్స్ ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ బాలల హక్కులు, వాటి అమలు అంశంపై కర్ణాటక విధాన సభ బెంగళూరులో గురువారం ఒక రోజు లెజిస్లేటర్స్ ప్రాంతీయ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో కర్ణాటక రాష్ట్రంతో పాటు 8 దక్షిణాది రాష్ట్రాల్లోని 80 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో స్పీకర్ మధుసూదనాచారి ప్రసంగిస్తూ.. బాలల హక్కుల చట్టాల పట్ల సమాజానికి ఏరకమైన అవగాహన కల్పించామనే అంశాన్ని ప్రజా ప్రతినిధులు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బాలల హక్కుల విషయంలో తీసుకుంటున్న అంశాలను ఆయన వివరించారు. మండలి చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడూతూ రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బాలల హక్కులు, అవగాహన సదస్సును నిర్వహిస్తామన్నారు. ఈ సదస్సులో తెలంగాణ నుంచి మండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, వివేకానందా, ఎమ్మెల్సీలు భూపాల్ రెడ్డి, భాను ప్రసాద్, గంగాధర్ గౌడ్, భూపతిరెడ్డి, ఆకుల లలిత, అసెంబ్లీ సహాయ కార్యదర్శి కరుణాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారని స్పీకర్ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది. -
రాజ సదారాం సేవలు చిరస్మరణీయం
- పదవీ విరమణ వీడ్కోలు సభలో స్పీకర్ మధుసూదనాచారి - ఆయన సేవలను వినియోగించుకుంటాం: హరీశ్రావు సాక్షి, హైదరాబాద్: శాసనసభకు రాజ సదారాం చేసిన సుదీర్ఘ సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. శాసనసభ కార్యదర్శిగా సదారాం పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం వీడ్కోలు సభ జరిగింది. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. శాసనసభ చక్కగా నడవడానికి సదారామే కారణమని కొనియాడారు. తామిద్దరం వరంగల్ వాళ్లమేనని, జయశంకర్ శిష్యులమని, ఇద్దరమూ కేసీఎం కళాశాల విద్యార్థులమని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ బిల్లు సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారని మంత్రి హరీశ్రావు కొనియాడారు. సదారాం సేవలను భవిష్యత్తులో తమ ప్రభుత్వం వినియోగించుకుం టుందని పేర్కొన్నారు. మండలిని సజావుగా నడిపేందుకు సదారాం అనుభవం తనకు ఎంతగానో ఉపయోగపడిందని మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. కొత్తగా సభకు ఎన్నికైన వారికి విలువైన సూచనలు చేసేవారని మంత్రి ఈటల పేర్కొన్నారు. శాసనసభకు విలువైన సేవలు అందించారని, ఆయన స్ఫూర్తినే కొత్త కార్యదర్శి కొనసాగించాలని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. రాష్ట్ర శాసనసభ దేశానికే ఆదర్శంగా నిలవడంలో ఆయన పాత్ర మరువలేనిదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శాసనసభను బాగా నడపడంలో ఎంతో కృషి చేశారని హోంమంత్రి నాయిని కొనియాడారు. పదవీ విరమణ చేస్తున్నం దుకు ఒకింత బాధ, సంతోషం కలుగుతోందని సదారాం పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, బీజేఎల్పీ నేత కిషన్రెడ్డి, పీఏసీ చైర్మన్ గీతారెడ్డి, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
గతంకంటే భిన్నంగా సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ మధుసూదనాచారి సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు గతం కంటే ఎంతో భిన్నంగా జరుగుతున్నాయని శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అన్నారు. కొత్త రాష్ట్రమైనా కేవలం మూడేళ్లలో ఎన్నో రంగాల్లో అభివృద్ధిలో పురోగమిస్తోందని, మూడేళ్లుగా సాగుతున్న అసెంబ్లీ సమావేశాల తీరు సంతృప్తికరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ మీడియా సలహా కమిటీ (ఎంఏసీ) తొలి సమావేశం సోమవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో జరిగింది.శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంఏసీ చైర్మన్ వి.సూరజ్కుమార్, కమిటీ సభ్యులు, శాసనసభ కార్యదర్శి రాజసదారాం ఇందులో పాల్గొన్నారు. మీడియా లాంజ్లో ఏర్పాట్లు, అసెంబ్లీ గ్యాలరీ పాసులు, సీట్ల కేటాయింపు, పార్కింగ్, శాసనసభ వార్తలను కవర్ చేసే మీడియా ప్రతినిధులకు ఓరియంటేషన్ తదితర అంశాలపై చర్చ జరిగింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలను ప్రజలంతా చూస్తున్నారని, ఈ నేపథ్యంలోనే సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించి మీడియా కమిటీ సహకారంతో ముందుకు సాగుదామని స్పీకర్ అన్నారు. తరచూ ఇలాంటి సమావేశాల ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవచ్చని స్వామిగౌడ్ అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. -
భారత్ భిన్న సంస్కృతులకు నిలయం: స్పీకర్
భూపాలపల్లి: అద్భుతమైన సంప్రదాయాలు భారత దేశం సొత్తని రాష్ట్ర శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలోని రాంనగర్లో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తీజ్ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ భారత దేశం భిన్న సంస్కృతులకు నిలయమన్నారు. బంజార యువతులకు పెళ్లిళ్లు కావాలని, జీవితం పచ్చగుండాలని కోరుకుంటూ తొమ్మిది రోజులపాటు నియమ నిష్టలతో జరుపుకునే మహా పండుగే తీజ్ అని అన్నారు. అధునిక సమాజంలో కూడా ఇలాంటి సంప్రదాయాలను కాపాడుతున్న లంబాడీ యువతులను అభినందించారు. గోధుమ గింజలకు పద్దతి ప్రకారం నీరు పోస్తుంటే పచ్చదనం సంతరించుకున్నట్లు మనిషి కూడా పద్దతి ప్రకారం నడుచుకుంటే జీవితం పచ్చగానే ఉంటుందన్న నీతిని ఈ పండుగ తెలియజేస్తుందని ఆయన అన్నారు. ఈ యువతులకు సేవాలాల్ మరియమ్మ దీవెనలు ఉండాలని వేడుకున్నారు. యువతులతో కలిసి మధుసూదనాచారి బుట్టను తలపై పెట్టుకుని పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంబాడ మహిళలు, యువతులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇందులో సేవాలాల్ సంఘం సభ్యులు కూడా పాల్గొన్నారు. -
ఘనంగా స్పీకర్ కుమారుడి వివాహం
-
‘చిత్రం’పై చిక్కిన అర్చకుడు, సస్పెన్షన్ వేటు
భద్రాచలం: భద్రాచలం రామాలయ అర్చకుడు మధుసూదనాచార్యులుపై సస్పెన్షన్ వేటు పడింది. రామాలయం గర్భగుడిలో మూలవిరాట్ ఫొటోలను తీసిన అర్చకుడిని దేవస్థానం అధికారులు గుర్తించారు. అతనిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతోనే ఇలా జరిగిందని భావించి ఆలయ ప్రధాన అర్చకుడితో పాటు మరో ముఖ్య అర్చకుడిని సంజాయిషీ కోరుతూ ఆలయ ఈఓ ప్రభాకర్ శ్రీనివాస్ బుధవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. గర్భగుడిలోని మూలవరులను సెల్ఫోన్తో ఫొటోలు తీసి బయటికి పంపించడంతో అవి సామాజిక మాధ్యమాల్లో విస్త్రతంగా చక్కర్లు కొట్టాయి. దీనిపై పత్రికలలో వార్తలు రావడంతో స్పందించిన ఈఓ విచారణకు ఆదేశించారు. ఆలయ సూపరింటెండెంట్ భవాని రామకృష్ణ దీనిపై విచారణ చేపట్టారు. గర్భగుడిలోని మూలవరులకు బెంగుళూరుకు చెందిన భక్తుడు బంగారు ఆభరణాలు సమర్పించగా వాటిని శుక్రవారం రోజున అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పటి వరకు మూడు శుక్రవారాలలో మాత్రమే స్వామి వారికి బంగారు కవచాలను అలంకరించగా, ఆయా రోజుల్లో గర్భగుడిలో విధులను నిర్వహించిన అర్చకుల నుంచి విచారణ అధికారి భవాని రామకృష్ణ వివరాలను రాబట్టారు. మూడు శుక్రవారాలలో స్వామి వారి అలంకరణను నిశితంగా పరిశీలించారు. కాగా సెల్ఫోన్లో బయటకు వచ్చిన ఫొటోలు ఈనెల 16న తీసినట్టుగా గుర్తించారు. ఆ రోజు ఆలయ విధుల్లో ఉన్న మదన్మోహనాచార్యులు గర్భగుడిలో మూలవరుల మూర్తులను సెల్ఫోన్ ద్వారా తీసినట్లు వెల్లడయింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఈఓ ఆయనపై సస్పెన్షన్ వేటు విధించారు. అర్చకుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ప్రధాన అర్చకుడు, మరో ముఖ్య అర్చకుడు ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని భావించి.. ఇందుకు గల కారణాలపై వివరణ కోరుతూ సంజాయిషీ నోటీసు జారీ చేశారు. ఎంతో పవిత్రంగా భావించే స్వామి వార్ల మూలవరుల ఫొటోను అర్చకుడే సెల్ఫోన్ ద్వారా తీసి సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు పంపించటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిణామాలు మరోసారి జరగకుండా దేవస్థాన అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. -
ఆర్టీసీని ఆదరించండి
♦ కార్లు ఉన్నా బస్సుల్లో ప్రయాణించండి ♦ ప్రజలకు పిలుపునిచ్చిన స్పీకర్ ‘సిరికొండ’ ♦ భూపాలపల్లి నుంచి వరంగల్కు బస్సులో ప్రయాణించిన మధుసూదనాచారి శాయంపేట(భూపాలపల్లి): తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన రవాణా సౌక్యం కల్పిస్తోంది.. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సంస్థను ఆదరించాలని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. స్పీకర్గా ఉన్నప్పటికీ తాను నెలలో ఒకసారైనా ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులోనే ప్రయాణిస్తానని, టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం దీనిని పాటించాలని సూచించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి రేగొండ మండల పరిధి గ్రామాలు, శాయంపేట మండలంలోని గంగిరేణిగూడెం, వసంతాపూర్, ప్రగతిసింగారం, పత్తిపాక, శాయంపేట, మాందారిపేట మీదుగా హన్మకొండకు ఆర్టీసీ బస్సును సోమవారం పునరుద్ధరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గతంలో ఈ రూట్లో ఆర్టీసీ బస్సు నడిచినప్పటికీ ఆదరణలేక నిలిపివేశారని, ఇన్నాళ్లుకు పునరుద్ధరించినందుకు ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాకముందు భూపాలపల్లిలో 37 బస్సులు మాత్రమే ఉండేవని, ప్రత్యేక రాష్ట్రంలో మరో 57 కొత్త బస్సులు అందించామని చెప్పారు. అత్యధికంగా గ్రామీణ ప్రజలకు జీవితకాలంలో ఎక్కువ సేవచేసేది ఆర్టీసీ మాత్రమేనని, ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనలో ఎంత మం దికి కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్నప్పటికీ బస్సులో ప్రయాణించాలని, తద్వారా వాతావరణ కాలుష్యం నుంచి గ్రామాలను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని, రోడ్డు ప్రమాదాలను సైతం నివారించవచ్చని తెలిపారు. ప్రజలు ఆదరించకపోతే మళ్లీ బస్సు నిలిపివేసే ప్రమాదం ఉందని, దీంతో సామాన్యులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. త్వరలో పెద్దకోడెపాక, కొప్పుల గ్రామాలకు సైతం బస్సు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, తెలంగాణ జాగృతి యువత జిల్లా కోకన్వీనర్ అమ్మ అశోక్, టీఆర్ఎస్ మహిళ మండల అధ్యక్షురాలు బాసని సుధారాణి, నాయకులు బాసని వెంకటేశ్వర్లు, దుబాసి కృష్ణమూర్తి, అరికిల్ల విజయ్, దుంపల మహేందర్రెడ్డి, గాజే రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీని ఆదరించండి
కార్లు ఉన్నా బస్సుల్లో ప్రయాణించండి ప్రజలకు పిలుపునిచ్చిన స్పీకర్ ‘సిరికొండ’ భూపాలపల్లి నుంచి వరంగల్కు బస్సులో ప్రయాణించిన మధుసూదనాచారి శాయంపేట(భూపాలపల్లి): తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన రవాణా సౌక్యం కల్పిస్తోంది.. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సంస్థను ఆదరించాలని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. స్పీకర్గా ఉన్నప్పటికీ తాను నెలలో ఒకసారైనా ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులోనే ప్రయాణిస్తానని, టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం దీనిని పాటించాలని సూచించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి రేగొండ మండల పరిధి గ్రామాలు, శాయంపేట మండలంలోని గంగిరేణిగూడెం, వసంతాపూర్, ప్రగతిసింగారం, పత్తిపాక, శాయంపేట, మాందారిపేట మీదుగా హన్మకొండకు ఆర్టీసీ బస్సును సోమవారం పునరుద్ధరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గతంలో ఈ రూట్లో ఆర్టీసీ బస్సు నడిచినప్పటికీ ఆదరణలేక నిలిపివేశారని, ఇన్నాళ్లుకు పునరుద్ధరించినందుకు ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాకముందు భూపాలపల్లిలో 37 బస్సులు మాత్రమే ఉండేవని, ప్రత్యేక రాష్ట్రంలో మరో 57 కొత్త బస్సులు అందించామని చెప్పారు. అత్యధికంగా గ్రామీణ ప్రజలకు జీవితకాలంలో ఎక్కువ సేవచేసేది ఆర్టీసీ మాత్రమేనని, ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనలో ఎంత మం దికి కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్నప్పటికీ బస్సులో ప్రయాణించాల ని, తద్వారా వాతావరణ కాలుష్యం నుంచి గ్రామాలను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని, రోడ్డు ప్రమాదాలను సైతం నివారించవచ్చని తెలిపారు. ప్రజలు ఆదరించకపోతే మళ్లీ బస్సు నిలిపివేసే ప్రమాదం ఉందని, దీంతో సామాన్యులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. త్వరలో పెద్దకోడెపాక, కొప్పుల గ్రామాలకు సైతం బస్సు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
దుర్గమ్మ సన్నిధిలో తెలంగాణ స్పీకర్
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ వారిని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసుధనాచారి సోమవారం దర్శించుకున్నారు. బెజవాడ దర్గమ్మ దర్శనానికి వచ్చిన స్పీకర్కు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్పీకర్ మాట్లాడుతూ దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖఃసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. -
విజ్ఞానం పేరుతో విధ్వంసం
స్పీకర్ మధుసూదనాచారి సాక్షి, హైదరాబాద్: విజ్ఞానం పేరుతో విధ్వంసం జరుగుతోందని, ప్లాస్టిక్ బియ్యం వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని శాసనసభా స్పీకర్ మధుసూదనా చారి అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలోని తన చాంబర్లో కాకతీయ వర్సిటీ పరిశోధనా విద్యార్థులు రూపొందించిన ‘తెలంగాణ ఎకానమి – దృక్కోణం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, ‘సమూలంగా ఒక జాతిని ఏ జీవీ చంపదని.. ప్లాస్టిక్ బియ్యం తింటే మానవ జాతి మనుగడ ఉంటుందా? సమాజం ఎటు పోతోందని ప్రశ్నించారు. నా జీవితంలో ఇద్దరు కాల జ్ఞానులను చూశానని, ఒకరు జయశంకర్ కాగా, రెండో వ్యక్తి సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళాలని 2000 సంవత్సరంలొనే అనుకున్నాం. ఏం జరుగుతుందో ఆనాడే కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఒక వైవిధ్యమైన ఉద్యమం’అని స్పీకర్ పేర్కొన్నారు. ‘తెలంగాణ ఎకానమి – దృక్కోణం’ పుస్తకాన్ని తెచ్చిన ప్రొ.భాస్కర్ను ఆయన అభినందించారు. -
'ప్రతిపక్షాలకే ఎక్కువ సమయం ఇస్తున్నాం'
హైదరాబాద్ : శాసనసభలో ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకుంటున్నామని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా సభ నడుస్తుందన్న విపక్ష సభ్యుల వ్యాఖ్యలపై స్పీకర్ బుధవారం ఉదయం స్పందించారు. పద్దులపై మాట్లాడేందుకు ప్రతిపక్ష సభ్యులకు అన్నుకున్న దాని కంటే ఎక్కువ సమయమే ఇచ్చామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత పట్ల అందరికీ అపారమైన గౌరవం ఉందన్నారు. జానారెడ్డి పట్ల తమకు గౌరవం ఉన్నదని సీఎం కేసీఆర్ కూడా చాలా సార్లు చెప్పారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సమయం ఇచ్చామన్నారు. తమకు సమయం ఇవ్వలేదని కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. నిన్న సభలో అధికార పక్షం కన్నా.. విపక్షాలకు అధిక సమయం కేటాయించామని తెలిపారు. సభలో అందరూ హుందాగా వ్యవహరించాలన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. -
రేవంత్రెడ్డి, సండ్రలపై వేటు
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారన్న ఆరోపణపై టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సస్పెండ్ చేశారు. ప్రసంగానికి అడ్డుతగలడంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సస్పెన్షన్ బడ్జెట్ సమావేశాల మొత్తం కొనసాగుతుందని పేర్కొన్నారు. -
నేటి నుంచే బడ్జెట్ సమావేశాలు
♦ తొలి రోజున అసెంబ్లీ, మండలి సంయుక్త సమావేశం ♦ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ♦ 13న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సర్కారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభ మవుతున్నాయి. తొలి రోజున శాసనసభ, శాసన మండలిల సంయుక్త సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నర సింహన్ ప్రసంగిస్తారు. అనంతరం సభలు వాయిదా పడనున్నాయి. 13న (సోమ వారం) ప్రభుత్వం శాసన సభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలతో పాటు వివిధ శాఖలు, పథ కాలు, కార్యక్రమాలకు కేటాయించే నిధుల పద్దులను ప్రకటించనుంది. మరోవైపు ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై నిలదీసేం దుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ ప్రసంగానికి మూడు రోజుల కిందే ఆమోదం గతేడాది ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన విజయాలతో పాటు ఎంచుకున్న ప్రాధాన్యతలు, ప్రభుత్వ లక్ష్యాలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించనున్నారు. ప్రభుత్వం గ్రామీణ ఆర్థికాభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంలో ఉండే అంశాలు ప్రాధాన్యాన్ని సంతరించు కోనున్నాయి. కాగా గవర్నర్ ప్రసంగానికి రాష్ట్ర మంత్రివర్గం మూడు రోజుల కిందే ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించే ఆనవా యితీ ఉంది. కానీ అందుకు భిన్నంగా ఈసారి సర్క్యులేషన్ పద్ధతిలోనే మంత్రుల సంతకాలు సేకరించి ఆమోదం తెలిపారు. బీఏసీలో పనిదినాల ఖరారు తొలిరోజున సభలు వాయిదా పడిన తర్వాత స్పీకర్ మధుసూదనాచారి సమక్షం లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన అసెంబ్లీలో బీఏసీ సమావేశం జరుగనుంది. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, బడ్జెట్పై సాధారణ చర్చకు ఎన్ని రోజులు.. వివిధ పద్దులపై చర్చకు ఎంత సమయం కేటాయించాలనేది ఆ భేటీలో ఖరారు చేస్తారు. -
నగరం నాకు రిలీఫ్ ఇచ్చింది
‘నగరం’ కథ విన్నప్పుడే, ఆ కాన్సెప్ట్కి కనెక్ట్ అయిపోయా. వాస్తవానికి దగ్గరగా ఉన్న కథ కావడంతో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు’’ అని సందీప్ కిషన్ అన్నారు. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ, మధుసూదన్ ముఖ్య పాత్రల్లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘నగరం’ ఈరోజు విడుదలవుతోంది. సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘ప్రతి మనిషిలో మంచీ, చెడూ ఉంటాయి.. వారిలోని మంచితనం కరెక్ట్ టైమ్కి బయటపడితే బాగుంటుంది’ అన్నదే ‘నగరం’ కథ. ఈ యూనిట్ అంతా కొత్తవారే. సినిమాపై ఉన్న ప్యాషన్తో ఉద్యోగాలు వదులుకుని మరీ తీశారు. ఒక మంచి డైరెక్టర్ నా చిత్రం ద్వారా పరిచయమవుతున్నందుకు గర్వంగా ఉంది. నా గత చిత్రాలు ‘రన్, ఒక్క అమ్మాయి తప్ప’ సరిగ్గా ఆడలేదు. దాంతో నాపై నాకే డౌట్ వేసింది. నేను సరైన కథలను ఎంచుకుంటున్నానా? అని. ‘నగరం’ ప్రివ్యూ చూసిన తెలుగు, తమిళ పరిశ్రమ పెద్దలు ‘చాలా బాగుంది’ అని అభినందిస్తుంటే రిలీఫ్ అనిపించింది. -
ఉన్నతాధికారులతో స్పీకర్ భేటీ
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పలు సూచనలు హైదరాబాద్: శాసన సభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్, సీఎస్ ఎస్.పి.సింగ్ హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అధికారులకు స్పీకర్ పలు సూచనలు చేశారు. గత సమావేశాలకు సంబంధించి జీరో అవర్, ప్రత్యేక ప్రస్తావనలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలను వెంటనే శాసనసభ సచివాలయా నికి పంపించాలని ఆదేశించారు. శుక్రవారం మొదలు కానున్న బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలు, ఇతర నిబంధలనకు సంబంధించిన సమాచారం వెంటనే శాసన సభ సచివాలయానికి పంపించాలని సూచించారు. సమావేశాల సందర్భంగా భద్రత, తదితర అంశాలపై కూడా చర్చించారు. మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పాల్గొన్నారు. -
రేపు శాసన సభ వెబ్సైట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన సభ తెలుగు, ఉర్దూ వెర్షన్లలో ఒక వెబ్సైట్ను ఆవిష్కరించనుంది. దీనిని అసెంబ్లీ కమిటీ హాలులో స్పీకర్ మధుసూదనాచారి సోమవారం ఉదయం 10.30కి ప్రారంభిస్తారని శాసన సభ కార్యదర్శి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఇంగ్లిష్ వెర్షన్లో మాత్రమే వెబ్సైట్ పనిచేస్తోంది. శాసన సభ ఉద్యోగులకు, శాసన సభ, మండలి సభ్యులకు ఉపయోగపడేలా కొత్త వెబ్సైట్ను రూపొందించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి హరీశ్రావు, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పాల్గొంటారు. -
సత్యసాయి సేవలు వెలకట్టలేనివి
స్పీకర్ మధుసూదనాచారి పుట్టపర్తి టౌన్: సత్యసాయి బాబా మానవాళికి అందించిన సేవలు వెలకట్ట లేనివని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కొనియాడారు. ఏపీలోని అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న శివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన పుట్టపర్తి చేరుకున్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాలో తాగునీటిని అందించిన మహాను భావుడు సత్యసాయి అని, తెలంగాణలో సైతం పలు జిల్లాల్లో ఆయన సేవలు కొనసాగుతున్నాయన్నారు. అనంతరం శివరాత్రి వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలో జరుగుతున్న అఖండ భజన కార్యక్రమంలో పాల్గొని సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. -
సత్యసాయి సేవలు వెలకట్టలేనివి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి బాబా మానవాళికి అందించిన సేవలు వెలకట్టలేనివని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కొనియాడారు. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న శివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఆయన పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రత్యేక కాన్వాయ్లో బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన చేరుకున్న ఆయనకు ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్ అతిథి గృహం వద్ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వర్గాలు, ఇన్చార్జ్ తహసీల్దార్ వసంత్కుమార్, డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి, సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు రూ.వందల కోట్లు ఖర్చు చేసి తాగునీటిని అందించిన మహానుభావుడు సత్యసాయి అని కొనియాడారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆయన సేవలు కొనసాగుతున్నాయన్నారు. విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో ఆయన సేవలు ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు. అనంతరం శివరాత్రి వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలో జరుగుతున్న అఖండ భజన కార్యక్రమంలో పాల్గొని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
బౌద్ధ క్షేత్రాలకు తెలంగాణ నెలవు
అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో ప్రభుత్వం ♦ నాలుగు రోజులపాటు సదస్సు ♦ విదేశీ ప్రతినిధుల హాజరు సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే అద్భుత బౌద్ధ క్షేత్రాలకు తెలంగాణ నెలవని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. బౌద్ధ ఆరామాలు, చైత్యాలు, స్థూపాలు ఎన్నో ఈ ప్రాంతంలో ఉన్నాయని, బుద్ధుడు జీవించి ఉన్న సమయంలోనే ప్రత్యక్షంగా ఆయనను అనుసరించి బౌద్ధం వ్యాప్తికి కృషి చేసిన బావరి నడయాడిన నేల ఇది అంటూ విదేశీ ప్రతిని ధులకు వివరించింది. గురువారం నగరంలోని హరితప్లాజాలో అంతర్జాతీయ బౌద్ధ సదస్సు ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు 15 దేశాల నుంచి 63 మంది ప్రతినిధులు సహా జాతీయ, స్థానిక ప్రతినిధు లు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సీఎం రాకపోవడంతో ప్రభుత్వ ప్రతినిధిగా అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సదస్సును ప్రారం భించారు. పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, పురావస్తు శాఖ సంచాలకురాలు విశాలాచ్చి తదితరులు సదస్సులో పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో బుద్ధుడి బోధనలను ఆయన బతికుండగానే ప్రారంభించిన బావరి, అతని అనుచరులు పుట్టిన బాదన్కుర్తి కూడా తెలం గాణలోనే ఉండటం విశేషమని వక్తలు అన్నా రు. ఇటీవలే ఇక్కడ దాని సాక్ష్యాలు కూడా వెలుగుచూడటం, బౌద్ధ గ్రంథం సుత్తనిపాతం లో బాదన్కుర్తి ప్రస్తావన ఉన్న నేపథ్యంలో తెలంగాణలోని బౌద్ధ క్షేత్రాలకు అంతర్జాతీయ గుర్తింపు తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. తెలంగాణలో ఎన్నో బౌద్ధ క్షేత్రాలున్నాయని, వాటిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. బుద్ధుడు చూపిన శాంతి మార్గంలోనే సీఎం చంద్రశేఖర్రావు ఉద్యమించి తెలంగాణ సాధించారన్నారు. బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు: మంత్రి చందూలాల్ తెలంగాణలో ప్రధాన బౌద్ధ క్షేత్రాలను కలిపి బుద్ధిస్ట్ సర్క్యూట్ను అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి చందూలాల్ ప్రకటించారు. ఇప్పటికే బుద్ధవనం పేరుతో అంతర్జాతీయ స్థాయిలో నాగార్జునసాగర్ పరిసరాలను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. బుద్ధుడి బోధనలను అనుసరిస్తే ఎలాంటి సమస్యలనైనా జయించొచ్చని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. తెలంగాణలో వెలుగు చూసిన 28 బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. గుడ్మార్నింగ్ వద్దు... గుడ్మార్నింగ్ బదులు, బుద్ధుడు బోధించినట్టుగా సుఖీహోతూ అని పరస్పరం పలకరించుకోవాలని మలేషి యా నుంచి వచ్చిన బౌద్ధ ప్రతినిధి ఆనంద కుమార సెరీ పిలుపునిచ్చారు. యూరో పియన్ సంస్కృతిని విడనాడి సనాతన బౌద్ధ ఆచారాలను అనుసరించటం మంచి దన్నారు. తెలంగాణను గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రశేఖర్ రావు శ్రమిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. బౌద్ధ క్షేత్రాల పునరుద్ధరణే కాకుండా, వాటి ఔన్నత్యాన్ని జనాల్లోకి తీసుకెళ్లే తాత్వికత అవసరమని ఆయన అన్నారు. కాగా, సదస్సులో శుక్రవారం విదేశీ ప్రతినిధుల ప్రసంగాలుంటాయి. శని, ఆదివారాల్లో పలు బౌద్ధ క్షేత్రాల పర్యటన ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. -
సీఎం పళనిస్వామిపై వేటు
-
తమిళ రాజకీయాల్లో తాజా ట్విస్ట్
-
సీఎం పళనిస్వామిపై వేటు
చెన్నై: అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం, శశికళ వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది. అసెంబ్లీలో రేపు పళనిస్వామి ప్రభుత్వం బలం నిరూపించుకోనున్న నేపథ్యంలో సెల్వం వర్గం దూకుడు పెంచింది. పార్టీపై పట్టు సాధించేందుకు శశికళ వర్గీయులను బయటకు పంపుతోంది. ఏకంగా మఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామినే పార్టీ పదవి నుంచి తప్పించినట్టు ప్రకటించింది. సాలేం జిల్లా కార్యదర్శిగా ఉన్న పళనిస్వామితో సహా 13 మంది జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శులను తొలగిస్తున్నట్టు పన్నీర్ వర్గంలో ఉన్న ప్రిసిడియం చైర్మన్ మధుసూదనన్ ప్రకటించారు. అన్నా డీఎంకే నుంచి శశికళను, ఆమె బంధువులు దినకరన్, వెంకటేష్లను బహిష్కరించినట్టు ఈ ఉదయం ఆయన తెలిపారు. పార్టీ నిబంధనల ప్రకారం శశికళను తొలగించే అధికారం మధుసూదనన్ కు లేదని అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా నియమితులైన విద్యాశాఖ మంత్రి సెంగోట్టయన్ అన్నారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని పన్నీర్ సెల్వం వర్గం ఇప్పటికే జాతీయ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి... తమిళ రాజకీయాల్లో తాజా ట్విస్ట్ పోలీసులకు పన్నీర్ సెల్వం లేఖ ‘అమ్మ’ పార్టీలో న్యూ పవర్ సెంటర్! పన్నీర్ తిరుగుబాటు చేయకుంటే..? ఎమ్మెల్యేల ఝలక్.. పళనిస్వామికి టెన్షన్! -
'శశికళను మేమే బహిష్కరిస్తున్నాం'
చెన్నై: తమపై చర్యలు తీసుకునే అధికారం శశికళ నటరాజన్ కు లేదని అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నాయకుడు మధుసూదనన్ అన్నారు. శశికళను తామే పార్టీ బహిష్కస్తున్నామని చెప్పారు. పార్టీలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవే లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శి పదవికి త్వరలో ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి ఎవరో కేడర్ తేలుస్తుందని పేర్కొన్నారు. పొయేస్ గార్డెన్ లోని 'అమ్మ' వేద నిలయం ప్రజల ఆస్తి అని చెప్పారు. వేద నిలయంలో తిష్టవేసిన వారిని వెళ్లగొట్టేందుకు 2 రోజుల్లో అక్కడకు వెళ్లనున్నట్టు మధుసూదన్ వెల్లడించారు. పన్నీర్ సెల్వం గూటికి చేరిన మధుసూదన్ ను ప్రిసీడియం చైర్మన్ పదవితో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు శశికళ అంతకుముందు ప్రకటించారు. -
నేను.. నా కథ!
తెలంగాణ ఆకాంక్ష.. అక్షరబద్ధం ►ఆత్మకథ రాస్తున్న సీఎం కేసీఆర్ ►ఉద్యమం నుంచి రాష్ట్రావిర్భావం దాకా.. ►పుస్తకంలో అనేక కీలక ఘట్టాలు, మలుపులు ►రాజకీయ ప్రస్థానంపై పూర్తి వివరాలు.. పూర్వీకుల స్థానికతపై వివరణ ►సహకారం అందిస్తున్న స్పీకర్ మధుసూదనాచారి ►సంచలనాత్మకంగా నిలుస్తుందంటున్న గులాబీ నేతలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుడికారంతో ఆయన మాట్లాడే ప్రతీ మాటా.. పేలే ఒక తూటా ! పల్లెజనం భాషలో వారి మనసుల్లోకి సూటిగా విషయాన్ని చేర్చగల మాటల మాంత్రికుడు.. కటువైన పదజాలం వాడకుం డానే విమర్శలు ఎక్కుపెట్టే నేర్పరితనం.. సమ కాలీన రాజకీయాల్లో సంచలన నేతగా పేరు పడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మరో సంచలనానికి తెరలేపనున్నారు. టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకా రం.. సీఎం ఆత్మకథ రాసే పనిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ అనుభవాలు, పోరాటం, కలిసొచ్చిన దోస్తులు.. మధ్యలో చేయిచ్చిన నేస్తాలు.. తన పుట్టుక.. బాల్యం, రాజకీయ అరంగేట్రం.. కాంగ్రెస్, టీడీపీల్లో తన రాజకీయ జీవితం.. ఆ పార్టీలను వీడటానికి దారి తీసిన పరిస్థితులు.. టీఆర్ఎస్ ఏర్పాటు.. ప్రత్యేక రాష్ట్ర పోరాటం.. పూర్వీకుల స్థానికతపై నడిచిన వివాదం.. హస్తిన రాజకీయాలు.. సోనియాతో ఒప్పందాలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో కీలక మలుపులకు అక్షర రూపం ఇవ్వ నున్నారు. ఈ క్రతువులో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్తో కలిసి నడిచిన శాసన సభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి రచనా సహకా రం అందిస్తున్నారని సమాచారం. తెలంగాణ పోరాట నేపథ్యంలోనే కేసీఆర్ ఆత్మకథ రాస్తు న్నారని, ఇందులో ఇప్పటిదాకా వెలుగు చూడని అనేక అంశాలపై తన మనోగతాన్ని కుండబద్దలు కొట్టనున్నారని అంచనా. వంశవృక్షంపై పూర్తి సమాచారం తెలంగాణ ఉద్యమంలో స్థానిక–స్థానికేతర అంశాల చర్చ జరిగినప్పుడు .. కేసీఆర్ తాతలు విజయనగరం నుంచి వచ్చారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. తన పూర్వీకుల స్థాని కతపై పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చేందుకు ‘వంశ వృక్షం’ పూర్తి వివరాలను పుస్తకంలో పొందుపరుస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ లో రాజకీయ ఓనమాలు దిద్దుకున్న కేసీఆర్ తర్వాత టీడీపీలో ప్రజాప్రతినిధిగా పూర్తిస్థాయి రాజకీయ జీవితం మొదలు పెట్టారు. మంత్రి పదవి దక్కనందుకే టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పెట్టారని పెద్ద ఎత్తున ప్రచా రం జరిగింది. తాను టీడీపీ నుంచి బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది? టీఆర్ఎస్ ఆవి ర్భావానికి దారితీసిన పరిస్థి తులను ఆత్మ కథలో వివరించనున్నారు. పద్నా లుగేళ్ల పాటు అడ్డంకులు, ఆటుపోట్లు ఎదుర్కొంటూ నడిపిన తెలంగాణ ఉద్యమంలో అనేక మలు పులు, రాజకీయ వ్యూహాలు, ఎత్తు గడలు, ఫలి తాలు, విఫల ప్రయోగాలు, గుణ పాఠాలను సవివరంగా పొందుపరుస్తున్నారని తెలిసింది. సమకాలీన తెలంగాణ ఉద్యమకారులు ఎంత గా ఆయన వ్యూహాల్ని వేలెత్తి చూపినా.. గత పోరాటాలకు భిన్నంగా పూర్తిగా ‘లాబీయింగ్ ’ మంత్రాన్ని నూటికి నూరుశాతం నమ్మడం, అందుటో భాగంగానే నాడు కేంద్రంలో అధికా రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అధినేత సోనియాగాంధీ వద్ద జరిపిన మం త్రాంగం, ఢిల్లీ పెద్దలతో సంబంధాలు.. ఏకాభి ప్రాయం సాధనలో ప్రాంతీయ పార్టీ నేతల మద్దతు కోరడం, ఇందులో కలిసొచ్చిన వారు, చివరల్లో చేయిచ్చిన వారు.. తదితర అంశాలకు అక్షర రూపం ఇస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ పోరాట చరిత్రలో దాగున్న అనేక చీకటి కోణాలను బయట పెట్టడంతో పాటు.. రాష్ట్రావిర్భావం తర్వాత ‘బంగారు తెలంగాణ’ నిర్మాణం కోసం ప్రణాళికలు, చేసిన కసరత్తు తదితరాలకు కేసీఆర్ ఆత్మకథలో చోటు ఉంటుందం టున్నారు. తమ అధినేత రాస్తున్న ఆత్మకత కచ్చితంగా సంచలనాత్మకమవుతుందని గులాబీ నేతలు చెబుతున్నారు. -
ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య చిచ్చుకు కుట్ర
టీఎన్జీవోస్ 70 వసంతాల వేడుకలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హన్మకొండ: ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య ఉన్న సత్సంబంధాన్ని చూసి జీర్ణించుకోలేని కొన్ని శక్తులు ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలు చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం రాత్రి హన్మకొండలో టీఎన్జీ వోస్ యూనియన్ 70 వసంతాల వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో కడియం మాట్లా డుతూ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వ కంగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా యూనియన్ పని చేస్తుందని, ఉద్యోగుల సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. స్పీకర్ సిరికొండ మధు సూదనాచారి మాట్లాడుతూ రాష్ట్రాన్ని బంగా రు తెలంగాణ చేయాలని విశ్వాసం టీఎన్జీ వోస్ ఉద్యోగుల్లో కనిపిస్తుందన్నారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ఉద్యోగుల సమ స్యలు సీఎం పరిష్కరిస్తారని, ఈ విషయం లో ఎవరూ ఎలాంటి ఇబ్బంది పడవద్ద న్నారు. టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావడం, తెలంగాణ పునర్నిర్మాణమే వరంగల్ డిక్లరేషన్ అన్నారు. టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడితేనే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం రద్దవుతుందన్నారు. ఈ దిశగా మార్చిన 2న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా పల్స్పోలియో ప్రారంభం
హైదరాబాద్: రాష్ర్టవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. 24,574 కేంద్రాల ద్వారా ఐదేళ్లలోపు వయసున్న 41,52,210 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రయాణాల్లో ఉన్నవారి కోసం వివిధ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో కూడా 897 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో 55 మంది అధికారులు, జిల్లా స్థాయిలో 120, క్షేత్రస్థాయిలో 2,455 సూపర్వైజర్లు, 733 సంచార బృందాలను కార్యక్రమం పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేశారు. చిన్నారులందరికీ వ్యాక్సిన్లు వేసేలా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నిర్మల్ జిల్లా బాసరలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్ఞానసరస్వతి ఆలయంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల్లోని చిన్నారులకు కూడా పోలియో చుక్కలు వేశారు. అలాగే రంగారెడ్డిజిల్లా ఆదిభట్లలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పలువురు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఖమ్మంజిల్లా సత్తుపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. కరీంనగర్ నగరంలోని కార్ఖానగడ్డ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పోలియో చుక్కలు వేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రారంభించి పోలియో చుక్కలు వేశారు. -
సాంస్కృతిక సారథుల పాత్ర కీలకం
హైదరాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణానికి సాంస్కృతిక సార«థి కళాకా రులు పునాది రాళ్లు లాంటి వారని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. బుధవారం రవీంద్రభారతిలో సారథి ప్రజా చైతన్య రూపాల ప్రదర్శన వేడుకల్లో పలువురు మంత్రులతో పాటు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బంగా రు తెలంగాణ సాధనలో రాష్ట్ర సాంస్కృతిక సార«థుల పాత్ర చాలా కీలకమన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న తెలంగాణ సాంస్కృతిక సారథి సాధించిన విజయా లను సంస్థ కళాకారులు అద్భుతంగా ఆవిష్కరిం చారు. గడచిన రెండన్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివిధ కళారూపాల ద్వారా ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు. రెండన్నరేళ్లలోనే ఏ రాష్ట్రం చేపట్టలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి చూపామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ పథకాలను ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసు కుంటున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలను సారథి కళాకారులు ప్రజల్లోకి తీసుకెళ్లి జాగృతం చేస్తున్న తీరును ప్రశంసించారు. అర్హులకే పథకాలు అందాలి: హరీశ్ తెలంగాణ ఉద్యమంలో కళాకారులు ఎలాంటి పాత్ర పోషించారో బంగారు రాష్ట్ర నిర్మాణంలోనూ అలాంటి పాత్రే పోషించాలని హరీశ్రావు కోరారు. ప్రభుత్వ పథకాలన్నీ నిజమైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేస్తారని ఆకాంక్షించారు. మంత్రి అజ్మీరా చందూ లాల్ మాట్లాడుతూ.. కళలు, కళాకారులను పరిరక్షించుకుంటా మని, సీఎం కేసీఆర్కు కూడా కళలంటే ఎంతో ఇష్టమని అన్నారు. తెలంగాణ సాంస్కృతిక సార«థి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ కేసీఆర్ ఆశయాలను, ఆకాంక్షలను వమ్ము చేయకుండా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి సాంస్కృతిక సారథి తీసుకెళ్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలుగు వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, సీఎం కార్యాలయం ప్రజా సంబంధాల అధికారి రమేశ్ హజారీ, తెలంగాణ రీసోర్స్ సెంటర్ డైరెక్టర్ బండి సాయన్న, తెలంగాణ సాంస్కృతిక సార«థి రచయితల కో–ఆర్డినేటర్ యశ్పాల్, ప్రజా సంబంధాల అధికారి విద్యానందాచారి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
రెండ్రోజులపాటు సమావేశాలు సాక్షి, హైదరాబాద్: పది రోజుల విరామం తర్వాత అసెంబ్లీ, శాసనమండలి తిరిగి సమావేశం కానున్నాయి. గత నెల 16న మొదలైన ఉభయ సభలు ఇప్పటికే పదహారు రోజుల పాటు జరిగాయి. ఈ నెల 6న స్పీకర్ మధుసూదనాచారి సభను 17వ తేదీకి వాయిదా వేశారు. మొత్తం పది రోజుల పాటు అసెంబ్లీకి సెలవులు ఇచ్చారు. రెండు రోజుల పాటే సమావేశాలు ఉంటాయని అసెంబ్లీ సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 18వ తేదీతో సమావేశాలు ముగించి, కేంద్ర బడ్జెట్ తర్వాత, తిరిగి ఫిబ్రవరి చివరి వారంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతిరోజు ఒక లఘు చర్చ రూపంలో ప్రభుత్వం చర్చకు పెట్టింది. మంగళవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక హైదరాబాద్ అభివృద్ధిపై లఘు చర్చ చేపట్టనున్నారు. బుధవారం (18వ తేదీ) ఎస్సీ, బీసీ సంక్షేమంపై చర్చ జరపాలని ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. మరో రెండ్రోజుల పాటు సమావేశాలను పొడిగించే వీలుందని చెబుతున్నా, ఇప్పటి దాకా పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. ప్రతిపక్షాలు కోరిన దానికంటే ఎక్కువ రోజులే సభను నడిపామని, అర్థవంతమైన చర్చ జరిపామని, ఇంకా సమావేశాలను పొడిగించాల్సిన అవసరం లేదని అధికార పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అసెంబ్లీతో పాటు మండలి కూడా రెండ్రోజుల పాటు సమావేశమవుతుంది. -
మాట్లాడనివ్వకుంటే సభకు మేమెందుకు?
-
మాట్లాడనివ్వకుంటే సభకు మేమెందుకు?
శాసనసభను ఒకరోజు బహిష్కరించిన ప్రతిపక్షాలు - స్పీకర్ ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్నారని ధ్వజం - అధికారపక్షం ఇష్టారాజ్యంగా అసెంబ్లీ నడుస్తోందని మండిపాటు - స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాసిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం సాక్షి, హైదరాబాద్: అధికారపక్షం కనుసన్నల్లో, ఏకపక్షంగా శాసనసభను నడుపుతూ, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే సభకు రావడం ఎందుకంటూ ప్రతిపక్షాలు శాసన సభను బహిష్కరించాయి. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా ఒక రోజు శాసనసభను బహిష్క రిస్తున్నామంటూ కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీ ఎం పార్టీలు శాసనసభ స్పీకర్ మధుసూదనా చారికి గురువారం లేఖలు రాశాయి. సభలో వివిధ అంశాలపై చర్చ సందర్భంగా ముఖ్య మంత్రి, మంత్రులు, అధికారపక్ష సభ్యులకు మాత్రమే అవకాశం ఇస్తూ ప్రతిపక్షపార్టీల సభ్యులను పట్టించుకోవడంలేదంటూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఎంలు వేర్వేరుగా స్పీకర్కు లేఖలు రాశాయి. సీఎల్పీనేత కె.జానారెడ్డి, కాంగ్రెస్ సభ్యులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, టి.జీవన్రెడ్డి, కోమటిరెడ్డి వెం కటరెడ్డి, జి.చిన్నారెడ్డి, డి.కె.అరుణ, పద్మావతి, వంశీచంద్రెడ్డి, సంపత్కుమార్ తదితరులు స్పీకర్కు లేఖను అందజేశారు. అలాగే టీటీడీపీ నేత ఎ.రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అలాగే.. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా విడిగా తన లేఖలను అందించారు. అనంతరం మీడియా పాయింట్ దగ్గర వేర్వేరుగా మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రచారం కోసమే శాసనసభా?: కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి శాసనసభను వేదికగా వాడుకుంటూ, సభను టీఆర్ఎస్ కార్యాలయంగా మారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కాంగ్రెస్ సభ్యులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టివిక్ర మార్క, టి.జీవన్రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ ఏకపక్షంగా వ్యవహ రిస్తున్నారని, తమ వాదన వినాలని ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించు కోక పోవడంతోనే సభా కార్యక్రమాలను ఒకరోజు బహిష్కరిస్తున్నామని తెలిపారు. సీఎం శాసనసభలో పచ్చి అబద్ధాలను మాట్లాడు తున్నారని విమర్శించారు. భూనిర్వాసితు లకు పదిరెట్లు నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. భూసేకరణ చట్టం ఆమోదం పొందినట్టుగా చెబుతున్నా రని, దానిపై వాస్తవాలను దాచిపెడుతున్నా రని ఉత్తమ్ విమర్శించారు. భూసేకరణ బిల్లుకు సవరణో, కొత్త చట్టమో ఎవరికీ తెలియదన్నారు. బిల్లుపై స్పీకర్ దగ్గర కూడా వాస్తవాలు లేకపోవడం దురదృష్టకరమ న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ కార్యదర్శి కలసి సభను తప్పుదోవ పట్టిస్తు న్నారని, ఇది దారుణమని జీవన్రెడ్డి విమర్శించారు. సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. 2013 భూసేకరణ చట్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచితంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. పార్ల మెంటు చేసిన చట్టంపై కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడారని అన్నారు. సభా సాంప్రదా యాలను, నిబంధనలను స్పీకర్ పాటించడం లేదన్నారు. టీఆర్ఎస్ కనుసైగల మేరకే.. స్పీకర్పై రేవంత్, సండ్ర ధ్వజం టీఆర్ఎస్ పార్టీ కనుసైగల మేరకు నడుచు కుంటూ, శాసనసభ స్పీకర్ తమకు మాట్లాడటానికి మైక్ ఇవ్వకుంటే ఇంకా సభలో తామెందుకు అని టీడీపీ సభ్యులు రేవంత్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నిం చారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా సభ నడవడం లేదన్నారు. భూసేకరణ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ అభిప్రాయాలను చెప్పడానికి కూడా మైక్ ఇవ్వలేదని రేవంత్రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షపార్టీల అభిప్రాయాలను, వైఖరిని కూడా చెప్పే అవకాశం ఇవ్వకుండా బిల్లును ఆమోదిం చినట్టుగా శాసనసభ స్పీకర్ ప్రకటిస్తే ప్రజా స్వామ్యానికి, శాసనసభకు గౌరవం ఎలా ఉంటుందన్నారు. బాధతోనే శాసనసభకు హాజరుకాకుండా బహిష్కరిస్తున్నామని రేవంత్రెడ్డి, సండ్ర తెలిపారు. -
స్పీకర్పై అవిశ్వాస తీర్మానం!
పరిశీలిస్తున్నామన్న సీఎల్పీ - స్పీకర్ తమ హక్కులను హరిస్తున్నారని నేతల ఆరోపణ సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలను, సంప్రదాయాలను గౌరవించని స్పీకర్ మధుసూదనా చారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామని కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రకటించింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, టి.జీవన్రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జి,చిన్నారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్, వంశీచంద్రెడ్డి, రామ్మోహన్రెడ్డి తది తరులు సోమవారం అసెంబ్లీ వాయిదా అనంతరం విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో ప్రజాస్వామ్య విలువలను, ప్రతిపక్షాల అభిప్రాయాలను గౌరవించే సంప్రదాయాన్ని స్పీకర్ ఉల్లంఘించారని జానారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతుంటే అడుగడుగునా అడ్డుతగులుతూ, అవాంతరాలను కల్పిం చారని విమర్శించారు. సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సభను ఆర్డరులో ఉంచుతూ, అడ్డుతగిలే సభ్యుడు అధికారపక్షానికి చెందినవారైనా నియంత్రించాల్సిన బాధ్యత స్పీకర్పై ఉంద న్నారు. గ్యాంగ్స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ కేసును సీబీఐకి అప్పగిం చాలన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దీనిపై సభలోని అన్ని పార్టీల అభిప్రాయాలను స్పీకర్ తీసుకోకపోవడం అప్రజాస్వామికమన్నారు. స్పీకర్ తీరుపై ప్రశ్నించామని, దానికి సమాధానం ఇవ్వలేకపోయారని చెప్పారు. సభలో తమ అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఇవ్వకపోవడంవల్లనే బహిరం గంగా చెప్పాల్సి వస్తుందని జానారెడ్డి అన్నారు. నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. వారి కనుసైగల మేరకు నడుపుతున్నారు: ఉత్తమ్ ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ, అధికారపక్షంవైపు చూస్తూ.., వారి కనుసైగలకు అనుగుణంగా స్పీకర్ మధుసూదనాచారి సభను నడుపుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధికారపార్టీలో చేరారని, వారిపై చర్య తీసుకోవాలని కోరితే సభ్యులను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని విమర్శించారు. శాసనసభలో నిరసన వ్యక్తంచేసే హక్కును హరించారని అన్నారు. ప్రతిపక్షసభ్యులు మాట్లాడుతున్నప్పుడు మంత్రులు లేచి నిలబడితే మైకును ఇస్తున్నారన్నారు. శాసనసభలో మంత్రులకు ప్రత్యేక అధికారాలు ఉంటాయా అని ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వ్యవహరి స్తున్న అప్రజాస్వామిక తీరుపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ సభ్యులను కూడా సభలో మాట్లాడనివ్వడంలేదన్నారు. ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనివ్వకుండా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకరుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామమన్నారు. టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని నిర్వహించినట్టుగా ఈ అసెంబ్లీని స్పీకర్ నడుపుతున్నారని విమర్శించారు. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత దొరికిన డైరీ, నగదు, రాజకీయపార్టీల నేతలతో సంబంధాల వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని జీవన్రెడ్డి ప్రశ్నించారు. -
‘స్పీకర్ పై అవిశ్వాసం పెడతాం’
హైదరాబాద్: తెలంగాణ శాసనసభా స్పీకర్ మధుసూధనాచారి అప్రజాస్వామికంగా వ్యవహారిస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఫిరాయింపులపై మాట్లాడితే నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని అన్నారు. స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టే , ఆయన ముందు నిరసన చేపట్టామన్నారు. స్పీకర్ తీరు మారకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరించారు. -
నేడు బీఏసీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాల(ఆరో సెషన్) నిర్వహణపై చర్చించేందుకు బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) గురువారం భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలను కనీసం 10 రోజుల పాటు జరపాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రతిపక్షాలు 15 రోజలైనా సమావేశాలు ఉండాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ, మండలి ఎన్ని రోజులు నడవాలన్న అంశంపై బీఏసీలో స్పష్టత రానుంది. దీంతోపాటు ప్రధానంగా చర్చించాల్సిన అంశాలు, సెలవు రోజులు, మొత్తం పనిదినాలపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. -
పౌరసరఫరాల శాఖపై స్పీకర్ సమీక్ష
వరంగల్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పౌరసరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థపై సమీక్షించారు. అలాగే రైతులకు వరి ధాన్యానికి మద్దతు ధరపై కూడా అధికారులతో సమీక్షించారు. సమీక్షా సమావేశానికి కలెక్టర్ మురళి, జాయింట్ కలెక్టర్ అమోయ్కుమార్, పౌరసరఫరాల శాఖాధికారులు హాజరయ్యారు. -
ఎప్పటిలోగా పరిష్కరిస్తారు?
► ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్కు ‘సుప్రీం’ ప్రశ్న ► వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ ఉత్తర్వులు ► వచ్చే నెల 8వ తేదీకి విచారణ వాయిదా ► ఆదేశాలను వెంటనే అమలు చేయాలి: ఎమ్మెల్యే సంపత్ సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఎప్పటిలోగా పరిష్కరిస్తారని శాసన సభాపతిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై వారంరోజుల్లో సమాధానం చెప్పాలంటూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిరాయిం పుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలంటూ తెలంగాణ శాసన సభాపతికి పిటిషన్ సమర్పించామని.. కానీ స్పీకర్ ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదని, తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ సుప్రీం లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. తొలుత ప్రతివాదుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తమ తరఫు సీనియర్ న్యాయవాది, అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అందుబాటులో లేరని... స్పీకర్కు, ఇతర ప్రతివాదులకు నోటీసులు కూడా అందనందున కొంత సమయం కావాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనిని పిటిషనర్ తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తప్పుబట్టారు. ఈ కేసులో జాప్యం చేసేందుకు ప్రతివాదులు ప్రయత్నిస్తున్నారని, నోటీసులు అందలేదనడంలో వాస్తవం లేదని కోర్టుకు వివరించారు. పిటిషనర్ స్వయంగా స్పీకర్కు శాసనసభలోనే నోటీసులు అందజేశారని.. దానిపై ప్రసార సాధనాలు వార్తలు కూడా ప్రసారం చేశాయని తెలిపారు. అంతేగాకుండా గతేడాది ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించినప్పుడు స్పీకర్ అనర్హత పిటిషన్లను త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నదని.. కానీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లేదని చెప్పారు. దీంతో జస్టిస్ కురియన్ జోసెఫ్ స్పందిస్తూ.. ‘అనర్హత పిటిషన్లను పరిష్కరించేందుకు ఎంత సమయం కావాలో వారం రోజుల్లో ఐదో ప్రతివాది (స్పీకర్) సమాధానం చెప్పాలి..’’ అని ఆదేశించారు. తగిన సూచనలు తీసుకుని విచారణకు రావాలని ప్రతివాదుల తరఫు న్యాయవాదులకు సూచిస్తూ విచారణను నవంబర్ 8కి వాయిదా వేశారు. కాగా టీడీపీ నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర్రావు కూడా.. టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కోసం అప్పట్లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ స్వయంగా తానే టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లడంతో తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. సాగదీత యత్నాలకు కోర్టు చెక్: సంపత్ సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన అనంతరం ఎమ్మెల్యే సంపత్కుమార్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, నైతిక విలువలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ‘‘టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ నుంచి ఏడుగురిని, మిగతా పార్టీలన్నింటి నుంచి 24 మందిని లాక్కుంది. డబ్బు సంచులు, పదవులు ఎరచూపి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ విప్గా వివిధ స్థాయిల్లో న్యాయ పోరాటం చేస్తున్నా. సుప్రీంకోర్టు నుంచి ఈరోజు చక్కటి ఆదేశాలు వెలువడ్డాయి. వాయిదాలతో జాప్యం చేసే కుయుక్తులకు ఇదొక పరిష్కారం. సాగదీత ప్రయత్నాలను ధర్మాసనం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. నోటీసులు అందలేదని ప్రతివాదులు చేసిన వాదనలను కూడా నమ్మలేదు. నైతిక విలువలపై నమ్మకముంటే ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలి..’ అని సంపత్ పేర్కొన్నారు. 2014లో ఎన్నికలు జరిగితే అదే ఏడాది ఆగస్టులో అనర్హత పిటిషన్ వేశామని.. కానీ స్పీకర్ పరిష్కరించలేదని న్యాయవాది జంధ్యాల రవిశంకర్ పేర్కొన్నారు. హైకోర్టుకు వెళితే త్వరితగతిన పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిందని... అయినా స్పీకర్ ఇప్పటివరకు పరిష్కరించలేదని చెప్పారు. తాజాగా సుప్రీంకోర్టు మా పిటిషన్లో ఐదో ప్రతివాది అయిన స్పీకర్కు ఆదేశాలు జారీచేసిందని.. ఇది ప్రజాస్వామ్య విజయమని వ్యాఖ్యానించారు.