బడ్జెట్ సమావేశాల తొలిరోజు అసెంబ్లీలో రచ్చకుదిగిన కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సభా మర్యాదలను మంటగలుపుతూ, పోడియంవైపునకు హెడ్సెట్ విసిరేయడం క్షమించరాని ఘటనగా స్పీకర్ పేర్కొన్నారు. ఈ మేరకు మొత్తం 11 మంది కాంగ్రెస్ సభ్యులపై వేటు వేస్తున్నట్లు మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. అటు శాసన మండలిలోనూ ఐదుగురిపై వేటు పడింది