పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారితోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణీత కాలవ్యవధిలో చర్యలు తీసుకొనేలా స్పీకర్ కు మార్గదర్శకాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్ను జస్టిస్ కురియన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది.