పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని గతంలో సొంత పార్టీ నాయకులను తిట్టిన ఘనుడు చంద్రబాబు అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కారుకు చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. కాకి లెక్కలు చెబుతూ ప్రజలను టీడీపీ ప్రభుత్వం మభ్యపెడుతోందని మండిపడ్డారు.