-
రెండోరోజూ పోలవరం ప్రాజెక్టు పరిశీలన
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం రెండోరోజైన సోమవారం కూడా పనులను క్షుణ్ణంగా పరిశీలించింది. డేవిడ్ వి.పాల్, గియాస్ ఫ్రాంకో డి. సిస్కో, రిచర్డ్ డొన్నెళ్లి, సీస్ హించ్ బెర్గర్లతో కూడిన బృందం సభ్యులు ఉ.10 గంటలకు రాజమహేంద్రవరం నుంచి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ప్రాంతాన్ని, క్షేత్రస్థాయిలో ప్రతి కట్టడం నిర్మాణాన్ని పరిశీలించారు.బృందం సభ్యులకు కేంద్ర జలసంఘం సీడబ్ల్యూసీ డైరెక్టర్ అశ్వినీకుమార్, జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ పి. నారాయణరెడ్డి, సీఈ నరసింహమూర్తిలు ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరును వివరించారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి ముందు చేసిన పనులు, తదుపరి చేసిన వివరాలను తెలుసుకుంటూ ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేశారు. డయాఫ్రం వాల్ ప్రాంతంలో వరద ఉధృతికి ఏర్పడ్డ అగాధాల పరిస్థితిపైనా ఆరా తీశారు. అగాధాలు పడిన ప్రాంతంలో శాండ్ ఫిల్లింగ్, జెట్ గ్రౌటింగ్ పనులను పరిశీలించి జల వనరుల శాఖాధికారుల నుంచి పనులు జరుగుతున్న తీరుతెన్నులను ప్రశ్నించారు.డయాఫ్రం వాల్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించి గతంలో పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి.. దీనిపై ఏవిధమైన నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై చర్చించారు. డయాఫ్రం వాల్ కట్టడం, పనితీరు తదితర అంశాలను ఇంజనీరింగ్ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఎగువ కాఫర్ డ్యాం నుంచి సీపేజ్ (ఊట నీరు) వస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి, మట్టి నాణ్యతా ప్రమాణాలపై ఆరా తీశారు. ఎగువ కాఫర్ డ్యాంపై జరుగుతున్న జియో టెక్నికల్ కోర్ ఇన్వెస్టిగేషన్ పనులు, అక్కడ సేకరించిన మట్టి నమూనాలను బృందం సభ్యులు పరిశీలించారు. అలాగే, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం, డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి, భూ భౌతిక పరిస్థితుల మార్పునకు చేస్తున్న ప్రయత్నాలు తదితర అంశాలపై నిపుణుల బృందం ఎక్కువ దృష్టిపెట్టింది.నేడు, రేపు కూడా సమీక్ష..ఇలా సుమారు మూడు గంటలపాటు డయాఫ్రం వాల్ మొత్తం పరిశీలించారు. పోలవరంలో ప్రధాన సమస్యలు ఇక్కడే ఉండటంతో, ప్రధాన డ్యాం నిర్మించాల్సిన మొదటి గ్యాప్ ప్రాంతాన్ని పరిశీలించి, ఇంజనీరింగ్ అధికా>రులతో ఎప్పటికప్పుడు చర్చించారు. ఈ పరిశీలనలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జల సంఘం నిపుణులు, సీఎస్ఎంఆర్ఎస్ సంస్థ ప్రతినిధులు, వాప్కోస్, బావర్, కెప్లర్, మేఘా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ డిజైన్ సంస్థ ఆఫ్రి ప్రతినిధులు కూడా ఉన్నారు. ముందుగా ప్రాజెక్టు వద్ద అధికారులు, ఏజెన్సీ ప్రతినిధుల భేటీ అనంతరం ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. ఇక మంగళ, బుధవారాల్లో కూడా బృందం సభ్యులు, జలవనరుల శాఖాధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు, ప్రాజెక్టు నిర్మాణం, పురోగతిపై తీసుకోవాల్సిన నిర్ణయాలు, జాగ్రత్తలు, చేయాల్సిన పనులపై సమీక్షిస్తారు. -
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం
-
పోలవరానికి ‘చంద్ర’శాపం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2014–19 మధ్య టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాల వల్లే పోలవరంలో పెను విధ్వంసం చోటు చేసుకుంది. ఆ తప్పిదాలే పోలవరానికి శాపంగా మారాయి. ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యానికి.. రూ.వేల కోట్ల నష్టానికి దారితీశాయి. కమీషన్లకు ఆశ పడి తాను చేసిన తప్పిదాల వల్ల ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం.. ఫలితంగా పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెడుతూ నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు పదే పదే అబద్ధాలు వల్లిస్తున్నారు.ఈనెల 17న పోలవరం పర్యటనలోనూ.. శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేస్తున్నప్పుడూ వైఎస్ జగన్పై వ్యక్తిగత దూషణలు చేస్తూ.. నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తూ.. పచ్చి అబద్ధాలతో కట్టుకథలు అల్లుతూ చంద్రబాబు చిందులు తొక్కారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తులకు అధికారం ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆక్రోశం వెళ్లగక్కారు. చివరకు పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తామనేది చెప్పలేక చేతులెత్తేశారు. సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వారు ఎవరు.. అర్హత ఉన్న వారు ఎవరో చూద్దాం..నిర్మాణ బాధ్యతల కోసం 30 నెలలు వృథా రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును వంద శాతం వ్యయంతో తామే పూర్తి చేస్తామని ఏపీ పునర్విభజన చట్టం–2014 ద్వారా కేంద్రం హామీ ఇచ్చింది. కమీషన్లకు ఆశపడిన నాటి సీఎం చంద్రబాబు.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకుని చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు. ద్రవ్యోల్బణం వల్ల ధరలు పెరిగి అంచనా వ్యయం పెరుగుతుందని తెలిసినా, 2013–14 ధరలతోనే పోలవరాన్ని పూర్తి చేస్తానని 2016 సెప్టెంబరు 7న కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. ఇది పోలవరానికి నిధుల సమస్యకు ప్రధాన కారణమైంది. ఆ మరుసటి రోజే.. జలాశయం పనుల అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ప్రకారం పెంచి రూ.1,481.41 కోట్ల మేర కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చారు. 2014 జూన్ 8 నుంచి 2016 డిసెంబర్ 30 వరకు ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టకుండా 30 నెలలు వృథా చేశారు.ప్రణాళికాయుతంగా వడివడిగా పనులు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–3లో 162 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్ నిర్మాణాన్ని వైఎస్ జగన్ పూర్తి చేశారు. గ్యాప్–1లో 543 మీటర్ల పొడవున పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మించారు. కుడి కాలువతోపాటు ఎడమ కాలువలో అత్యంత సంక్లిష్టమైన వరహ నదిపై అతి పొడవైన అక్విడెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి దాదాపుగా కొలిక్కి తెచ్చారు. జలాశయంతో కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్(హెడ్ రెగ్యులేటర్, సొరంగాలు)ను పూర్తి చేశారు.చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన భారీ అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో నింపి, వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చారు. గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా కొత్తది నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేయాలా? అన్నది తేల్చి.. డిజైన్లను ఖరారు చేస్తే 18 నెలల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ 2022 డిసెంబర్ నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి శాఖ, సీడబ్ల్యూసీ, పీపీఏలను కోరుతూ వచ్చింది.అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుని డిజైన్లను ఖరారు చేద్దామని సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్వీందర్సింగ్ వోరా ప్రతిపాదించారు. ఆ మేరకు కాంట్రాక్టు సంస్థ స్వీడన్కు చెందిన యాఫ్రిని అంతర్జాతీయ కన్సల్టెంట్గా నియమించుకుంది. ఫిబ్రవరిలో యూఎస్ఏకు చెందిన ఇద్దరు, కెనడాకు చెందిన మరో ఇద్దరు నిపుణులను పీపీఏ ఎంపిక చేసింది. యాఫ్రి, అంతర్జాతీయ నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన డిజైన్లతో సవాళ్లను అధిగమిస్తూ.. పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే.. 2022 నాటికే వైఎస్ జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగు నీటి రంగ నిపుణులు చెబుతున్నారు.కరోనా వేళ రికార్డు సమయంలో స్పిల్ వే పూర్తి వైఎస్ జగన్ సీఎంగా 2019 మే 30న బాధ్యతలు స్వీకరించారు. 2019 జూన్ రెండో వారంలోనే గోదావరి వరద ప్రారంభమైంది. నవంబర్కు తగ్గుముఖం పట్టింది. ఆ వెంటనే ప్రోటోకాల్ ప్రకారం.. నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2020 మార్చిలో కరోనా మహమ్మారి విజృంభించి.. 2021 ఆఖరు వరకు అతలాకుతలం చేసింది. అయినప్పటికీ స్పిల్ వే నిర్మాణాన్ని పరుగులెత్తించారు.స్పిల్ వే ఫియర్స్ను 53.32 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి.. వాటికి 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్ల మధ్య 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో ప్రపంచంలోనే అతి పెద్ద గేట్లను బిగించారు. వరద వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి, దించడానికి జర్మనీ, జపాన్ల నుంచి హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను దిగుమతి చేసుకుని వాటికి అమర్చారు. స్పిల్ వేపై రాకపోకలకు వీలుగా 1,118 మీటర్ల పొడవున స్పిల్ వే బ్రిడ్జిని పూర్తి చేశారు.నదీ ప్రవాహాన్ని స్పిల్ వే వైపునకు మళ్లించేందుకు వెయ్యి మీటర్ల వెడల్పు.. 2,100 మీటర్ల పొడవుతో అప్రోచ్ ఛానల్ తవ్వారు. స్పిల్ వే నుంచి దిగువకు వదలిన వరద ప్రవాహాన్ని తిరిగి నదిలోకి కలపడం కోసం 2,920 మీటర్ల పొడవున స్పిల్ ఛానల్, వెయ్యి మీటర్ల పొడవున పైలట్ ఛానల్లను పూర్తి చేశారు. ఆలోగా ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశారు. దాంతో 2021 జూన్ 11న గోదావరి వరద ప్రవాహాన్ని అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ మీదుగా 6.1 కి.మీల పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించి రికార్డు సృష్టించారు.కాఫర్ డ్యామ్ల లీకేజీల పాపం బాబు సర్కార్దే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పనులను చేపట్టడానికి వీలుగా లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి జెట్ గ్రౌటింగ్ చేయాలి. అయితే నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం గోదావరి నదిలో ఇసుక ఫర్మియబులిటీ విలువను 2018లో అప్పటి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ తప్పుగా మదింపు చేసింది. దాన్నే పరిగణనలోకి తీసుకుని 30 నుంచి 35 మీటర్ల లోతు వరకూ స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ చేయకుండా కేవలం 20 మీటర్ల లోతు వరకూ జెట్ గ్రౌటింగ్ చేసేలా డిజైన్లు రూపొందించింది.నవయుగ సంస్థ ఆ మేరకే జెట్ గ్రౌటింగ్ చేసి కాఫర్ డ్యామ్ల నిర్మాణం చేపట్టింది. జెట్ గ్రౌటింగ్ నిబంధనల మేరకు చేసి ఉంటే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లలో లీకేజీ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తన హయాంలో జరిగిన ఈ తప్పిదాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేందుకు సీఎం చంద్రబాబు యత్నించడం గమనార్హం.చారిత్రక తప్పిదంతో విధ్వంసం⇒ ఏదైనా నదిపై ఒక ప్రాజెక్టును కట్టాలంటే.. తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయాలి. ఆ తర్వాత ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతానికి ఎగువన, దిగువన నదికి అడ్డంగా కాఫర్ డ్యామ్లు నిర్మించాలి. దీని వల్ల నదీ ప్రవాహం స్పిల్ వే మీదుగా మళ్లుతుంది. అప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి, పూర్తి చేయవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇదే ప్రోటోకాల్ పాటిస్తారు. ⇒ కానీ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మాత్రం నాటి సీఎం చంద్రబాబు ప్రోటోకాల్ను తుంగలో తొక్కారు. నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయకుండా పునాది స్థాయిలోనే వదిలేశారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో నది గర్భంలో 1,396 మీటర్ల పొడవున పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 2018 జూన్ 11 నాటికే పూర్తి చేశారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి ప్రాంతానికి ఎగువన, దిగువన నదికి అడ్డంగా కాఫర్ డ్యామ్ల నిర్మాణాన్ని 2018 నవంబర్లో ప్రారంభించి పూర్తి చేయలేక 2019 ఫిబ్రవరిలో చేతులెత్తేశారు. ⇒ స్పిల్ వే, స్పిల్ ఛానల్ పూర్తి చేయకపోవడం వల్ల నదీ ప్రవాహాన్ని మళ్లించడం సాధ్యం కాదు. అప్పుడు కాఫర్ డ్యామ్ల మీదుగా వరద ప్రవాహిస్తే కొట్టుకుపోతాయనే నెపంతో.. కాఫర్ డ్యామ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద గోదావరి నది వెడల్పు 2,400 మీటర్లు. 2019, 2020లలో గోదావరికి వచ్చిన భారీ వరద 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిందిపోయి..ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీగా వదిలిన 800 మీటర్లకు కుంచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉద్ధృతి మరింత అధికమవడం వల్ల ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. గరిష్టంగా 36.5 మీటర్లు.. కనిష్టంగా 26 మీటర్ల లోతుతో నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. గ్యాప్–2లో 1396 మీటర్ల పొడవుతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఇదే పనుల్లో జాప్యానికి, రూ.వేల కోట్ల నష్టానికి కారణమైంది. ఐఐటీ (హైదరాబాద్), ఎన్హెచ్పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణులు ఇదే విషయాన్ని తేల్చి చెబుతూ నివేదిక ఇచ్చాయి.రూ.12,157.53 కోట్లకు మోకాలడ్డుపోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తానని 2016 సెప్టెంబరు 7న చంద్రబాబు కేంద్రానికి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఒప్పందం చేసుకున్నారు. 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లే. ఇందులో 2014 ఏప్రిల్ 1 వరకూ చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లుపోనూ మిగతా రూ.15,667.9 కోట్లే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.అయితే 2017–18 ధరల ప్రకారం పునరావాసం, భూసేకరణ వ్యయమే రూ.33,168.23 కోట్లు. అందువల్ల రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని 2019 మే 30 నుంచి పలుదఫాలు ప్రధాని మోదీని అప్పటి సీఎం వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. దానికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు అవసరమని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చింది. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్కు ప్రతిపాదన పంపింది.అప్పటికే బీజేపీతో పొత్తు కుదరడంతో పోలవరానికి నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందు పెట్టవద్దని, తమకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయంటూ చంద్రబాబు అడ్డుపుల్ల వేశారు. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున, ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్తో ఆమోద ముద్ర వేయిస్తే నిధుల సమస్య తీరుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం సీడబ్ల్యూసీ ద్వారా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని సాగు నీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
నేడు పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఎంపిక చేసిన అంతర్జాతీయ నిపుణులు యూఎస్ఏకు చెందిన డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్బెర్గర్, కాంట్రాక్టు సంస్థ మేఘా నియమించిన యాఫ్రి (స్వీడన్) ప్రతినిధులు ఆదివారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. నాలుగు రోజులపాటు వారు అక్కడే మకాం వేసి, ప్రాజెక్టుపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ఆదివారం, సోమవారం ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని, డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2 డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్, స్పిల్ వే, స్పిల్ ఛానల్లను పరిశీలిస్తారు. మంగళవారం, బుధవారం డయాఫ్రమ్వాల్ పనులు చేసిన బావర్, జెట్ గ్రౌటింగ్ పనులు చేసిన కెల్లర్, ప్రాజెక్టు పనుల నాణ్యతను పర్యవేక్షించే సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్స్) నిపుణులు, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, పీపీఏ సీఈవోతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్షేత్ర స్థాయి పరిశీలన, సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా ప్రాజెక్టులో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే విధానాన్ని ఖరారు చేస్తారు. నిర్మాణాలకు డిజైన్లపై కసరత్తు చేస్తారు. నలుగురు అంతర్జాతీయ నిపుణులు, యాఫ్రి సంస్థ ప్రతినిధులతో సీడబ్ల్యూసీ సభ్యులు (డిజైన్ అండ్ రీసెర్చ్ వింగ్) ఎస్కే సిబల్ శనివారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ నిపుణులకు పోలవరం ప్రాజెక్టు పనులపై అవగాహన కల్పించేందుకు పీపీఏ సీఈవో అతుల్జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.ప్రాజెక్టును పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్లుపోలవరం ప్రాజెక్టు పనులను ట్రైనీ ఐఏఎస్ల బృందం శనివారం పరిశీలించింది. ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి పనులను వీక్షించారు. ప్రాజెక్టు ఈఈ వెంకటరమణ పనులు జరుగుతున్న తీరును వివరించారు. ఈ బృందంలో 2023 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ట్రైనీలు సీహెచ్ కళ్యాణి, దామెర హిమ వంశీ, స్వప్నిల్ జగన్నాథ్, బొల్లిపల్లి వినూత్న, హెచ్ఎస్ భావన, శుభమ్ నోక్వాల్ ఉన్నారు. అనంతరం వీరు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. -
పోలవరంపై చంద్రబాబు కట్టుకథలు..శ్వేతపత్రం పేరుతో డ్రామా...
-
పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధం: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: పోలవరం ప్రాజెక్ట్లో జాప్యం జరగడానికి చంద్రబాబే కారణమన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. అలాగే, పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. ఇదే సమయంలో పరిపాలనలో, అభివృద్ధిలో మాతో పోటీపడండి.. గూండాగిరిలో టీడీపీతో పోటీ పడలేమని చురకలంటించారు.కాగా, మార్గాని భరత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధం. టీడీపీ హయాంలో ఏం జరిగిందో.. వైఎస్సార్సీపీ హయాంలో ఏం జరిగిందో చర్చిద్దాం రండి. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని కేంద్రానికే విడిచిపెట్టి ఉంటే ఈపాటికి పూర్తి అయ్యేది. గతంలో టీడీపీ ప్రభుత్వం పోలవరం విషయంలో ఇష్టారీతిన పనులు చేసింది. ఒక క్రమ పద్దతిలో పనులు చేయకపోవడం వల్లే భారీ వరద వచ్చినప్పుడు డయాఫ్రం వాల్ తీవ్రంగా దెబ్బతింది.స్పిల్ వే, స్పిల్ ఛానల్, హైడ్రాలిక్ గేట్స్, లోవర్, అప్పర్ డ్యామ్లు వైఎస్సార్సీపీ హయాంలోనే పూర్తి అయ్యాయి. కాపర్ డ్యామ్ జీవితకాలం మూడేళ్లు మాత్రమే.. ఇప్పుడు నూతన డయాఫ్రం వాల్ నిర్మిస్తారో లేదో స్పష్టంగా చెప్పాలి. జగనన్న అధికారంలోకి వచ్చాక పోలవరం సవరించిన అంచనాలు 55,000 కోట్ల రూపాయలకు ఆమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు ఎకరం భూమి వెయ్యి రూపాయలు నామమాత్రపు లీజుకు తీసుకున్న మాట వాస్తవం కాదా?. మీ పార్టీ కార్యాలయాలు ఎప్పుడైనా కూలగొట్టే ప్రయత్నం చేశామా?. పార్టీ కార్యాలయం కోసం హైదరాబాద్లో భూమి తీసుకుని ఎన్టీఆర్ ట్రస్ట్కు మార్చి వేశారు ఇది నిజం కాదా?. సాక్షి టీవీ, ఎన్టీవీ, టీవీ-9 ప్రసారాలు నిలిపి వేయించి మీడియాపై జులుం చూపిస్తున్నారు. రాజమండ్రిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి గతంలోనే శంకుస్థాపన చేశాం. పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అప్పటి శిలాఫలకాలు ధ్వంసం చేసి రెండోసారి శంకుస్థాపన చేయటం ఎంతవరకు సమంజసం?.పరిపాలనలో, అభివృద్ధిలో మాతో పోటీ పడండి. గుండాగిరిలో మీతో మేము పోటీ పడలేము. నా కార్యాలయం వద్ద ఉన్న వాహనం కాల్చివేతపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న రాజమండ్రి నగరాన్ని విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు రెండోసారి శంకుస్థాపన చేయటం దారుణం. మా పార్టీ నేతల ఇళ్లపై దొమ్మీలకు పాల్పడుతున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పార్లమెంటులో పోలవరంపై చర్చ
-
పోలవరం విషయంలో మేం ఎలాంటి తప్పిదాలు చేయలేదు
-
గోదాట్లో ముంచేసి ’తెల్ల’ మొహం!
సాక్షి, అమరావతి: పోలవరం పనులను ఈనెల 17న క్షేత్రస్థాయిలో పరిశీలించిన సమయంలో వ్యవహరించిన రీతిలోనే శ్వేతపత్రం పేరుతో శుక్రవారం సీఎం చంద్రబాబు మరోసారి పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా చెప్పేశారు! నిజాలను నిస్సిగ్గుగా గోదాట్లో కలిపేశారు! 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 మధ్య గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల దాహంతో చేసిన చారిత్రక తప్పిదాల వల్ల ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం.. ఫలితంగా పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్పై నెడుతూ నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు వల్లించారు. వైఎస్ జగన్పై వ్యక్తిగత దూషణలకు దిగి తన ఉక్రోషాన్ని వెళ్లగక్కారు. ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్నది మాత్రం చెప్పలేకపోయారు. చంద్రబాబు సర్కార్ 2014–19 మధ్య చేసిన చారిత్రక తప్పిదాలను 2019 మే 30న సీఎంగా బాధ్యతలు చేపట్టగానే సరిదిద్దుతూ కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు సమయంలో స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను వైఎస్ జగన్ పూర్తి చేశారు. 2021 జూన్ 11న గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. కుడి కాలువతోపాటు ఎడమ కాలువలో అత్యంత కీలకమైన వరాహ నదిపై అక్విడెక్టు లాంటి కీలక నిర్మాణాలతోపాటు కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం చేసే కనెక్టివిటీస్ను పూర్తి చేశారు. 960 మెగావాట్ల జలవిద్యుత్కేంద్రం పనులను కొలిక్కితెచ్చారు. చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదాలకు పాల్పడకపోయి ఉంటే 2022 జూన్ నాటికే జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగునీటిరంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు. పోలవరం పనుల్లో జాప్యం వల్ల జరుగుతున్న నష్టానికి చంద్రబాబుదే పూర్తి బాధ్యతని స్పష్టం చేస్తున్నాయి. పోలవరాన్ని కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని 2019లో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలే నాడు టీడీపీ సర్కార్ అవినీతికి నిదర్శనమని గుర్తు చేస్తున్నారు.బాబు చేస్తే ఒప్పు.. జగన్ చేస్తే తప్పా?పోలవరం హెడ్ వర్క్స్ పనుల నుంచి ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ని 2018లో తప్పించి రూ.2,917 కోట్ల విలువైన వాటిని నామినేషన్ పద్ధతిలో నవయుగకు నాడు చంద్రబాబు అప్పగించడాన్ని పీపీఏ తప్పుబట్టింది. దేశ చరిత్రలో నామినేషన్ పద్ధతిలో ఇంత పెద్ద ఎత్తున పనులు కట్టబెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. కాంట్రాక్టర్ను మార్చితే పనుల్లో ఏదైనా సమస్య తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి అమర్జీత్సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక చంద్రబాబు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన పనులను 2019 ఆగస్టులో రద్దు చేసి, వాటికి జలవిద్యుత్కేంద్రం పనులను జత చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. దీని ద్వారా ఖజానాకు రూ.784 కోట్లు ఆదా అయ్యాయి. రివర్స్ టెండరింగ్తో తన అక్రమాలు బయటపడటాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు కాంట్రాక్టర్ను మార్చడం వల్లే పోలవరం పనుల్లో విధ్వంసం చోటుచేసుకుందని తాజాగా సూత్రీకరించడం గమనార్హం. రివర్స్ టెండరింగ్లో పనులు దక్కించుకున్న మేఘా సంస్థ గోదావరి వరద తగ్గాక 2019 నవంబర్లో పనులు ప్రారంభించింది. 2020 మార్చి నుంచి 2021 ఆఖరు వరకూ కరోనా విజృంభించినా పనులను కొనసాగించింది. చంద్రబాబు సర్కార్ పునాది స్థాయిలోనే వదిలేసిన స్పిల్వేను 48 గేట్లతో సహా రికార్డు సమయంలో పూర్తి చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. వాస్తవాలు ఇలా ఉండగా 2021 వరకూ కాంట్రాక్టర్ లేకపోవడం వల్ల పనులు ఆగిపోయినట్లు సీఎం చంద్రబాబు చెప్పడంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.పోలవరం వైఎస్సార్ స్వప్నం..పోలవరం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు కాగా కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో 23.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చు. విశాఖ తాగు, పారిశ్రామిక అవసరాలతోపాటు 28.5 లక్షల మంది దాహార్తిని తీర్చవచ్చు. 960 మెగావాట్ల జలవిద్యుత్ కూడా అందుబాటులోకి వస్తుంది. అందుకే పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణిస్తారు. 1941లోనే ఈ ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించినా 2005 వరకూ ఏ ఒక్క సీఎం కూడా కన్నెత్తి చూడటానికి కూడా సాహసించలేకపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ 2005లో పోలవరం పనులను ప్రారంభించారు. కుడి, ఎడమ కాలువలలో అధిక భాగం పనులు చేయించారు. జలాశయం పనులకు అవసరమైన భూమిలో అధిక భాగం సేకరించారు.జలాశయం పనులను కొలిక్కి తెచ్చే క్రమంలోనే మహానేత అమరుడయ్యారు. వైఎస్సార్కు ముందు 1995 నుంచి 2004 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ రోజూ పోలవరం పనులు చేపట్టాలని ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఇప్పుడు పోలవరాన్ని తన కలగా చంద్రబాబు అభివర్ణించడం గమనార్హం.చారిత్రక తప్పిదం వల్లే విధ్వంసం» విభజన నేపథ్యంలో 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వంద శాతం వ్యయాన్ని తామే భరించి పూర్తి చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఆ మేరకు పనులు చేపట్టేందుకు పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని ఏర్పాటు చేసింది. 2014 జూన్ 8న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించాలని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమవడంతో 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి కేంద్రం అప్పగించింది. నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే 2013–14 ధరల మేరకు ఇస్తామని కేంద్రం పెట్టిన మెలికకు చంద్రబాబు అంగీకరించారు. ఆ మరుసటి రోజే అంటే 2016 సెప్టెంబరు 8న హెడ్వర్క్స్ (జలాశయం) పనుల అంచనా వ్యయాన్ని రూ.1,481 కోట్లు పెంచేశారు. » ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ ప్రోటోకాల్ను తుంగలో తొక్కిన చంద్రబాబు కమీషన్ల దాహంతో ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్వే, స్పిల్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పనులను పూర్తి చేయకుండానే.. 2017 నవంబర్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవున పునాది డయాఫ్రమ్ వాల్ పనులు చేపట్టి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. » స్పిల్వే పునాది స్థాయిలో ఉండగానే.. 2018 నవంబర్లో 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని పీపీఏ, సీడబ్ల్యూసీకి హామీ ఇచ్చి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను చంద్రబాబు ప్రారంభించారు. వాటిని ప్రధాన ప్రాజెక్టుగా భ్రమింపజేసి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది ఆయన ఎత్తుగడ. కానీ 2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. నిర్వాసితులకు పునరావాసం కల్పించలేక.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి చివరకు చేతులెత్తేశారు.» 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2019 జూన్ రెండో వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. ఆ ఏడాది వచ్చిన భారీ వరద ప్రవాహం ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై సగటున 26 నుంచి 36.5 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్వాల్ కోతకు గురై నాలుగు చోట్ల 485 మీటర్ల మేర దెబ్బతింది. » ఎగువ కాఫర్ డ్యామ్ ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్లే గోదావరి వరద అధిక ఉద్ధృతితో ప్రవహించి ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురై విధ్వంసం చోటు చేసుకుందని, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, ఇది పూర్తిగా మానవ తప్పిదం వల్లే జరిగిందని ఐఐటీ–హైదరాబాద్, ఎన్హెచ్పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణులు స్పష్టంగా తేల్చిచెప్పారు. తద్వారా చంద్రబాబు నిర్వాకాలను నిర్థారించారు. 2019 మే 30న వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగా అదే ఏడాది జూన్ రెండో వారంలో వరద ప్రారంభమైంది. అలాంటప్పుడు 12 రోజుల్లో కాఫర్ డ్యామ్ల ఖాళీలను పూర్తి చేసి, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం అసాధ్యం. దీన్నిబట్టి నాడు చంద్రబాబు సర్కార్ తప్పిదం వల్లే ఈ విధ్వంసం చోటుచేసుకుందని ఐఐటీ–హైదరాబాద్, ఎన్హెచ్పీసీలు తేల్చిచెప్పినట్లు స్పష్టమవుతోంది. తాను చేసిన ఈ చారిత్రక తప్పిదాన్ని వైఎస్ జగన్పై నెట్టేందుకు చంద్రబాబు పదేపదే యత్నిస్తుండటాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. 14 ఏళ్లలో... 24.85% ఐదేళ్లలోనే... 24.94%పోలవరం పనులను 2014–19 మధ్య తాను 72 శాతం చేస్తే.. 2019–24 మధ్య వైఎస్ జగన్ అరకొరగా చేశారంటూ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ.. పోలవరం పనులు ఇప్పటికి పూర్తయింది 49.79 శాతమే. ఇందులో 2005 నుంచి 2019 మధ్య జరిగిన పనులు 24.85 శాతం కాగా మిగతా 24.94 శాతం పనులు 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పూర్తి కావడం గమనార్హం. 2005–14 మధ్య దివంగత వైఎస్సార్ హయాంలో రూ.4,730.71 కోట్ల విలువైన పనులు జరిగాయి.2014–19 మధ్య చంద్రబాబు రూ.10,649.39 కోట్లు వ్యయం చేశారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.8,629 కోట్లు వ్యయం చేశారు. వాస్తవం ఇలా ఉంటే.. 2014–19 మధ్య తాను రూ.11,762.47 కోట్లు వ్యయం చేశానని.. 2019–24 మధ్య కేవలం రూ.4,167 కోట్లను మాత్రమే జగన్ సర్కార్ ఖర్చు చేశారని చంద్రబాబు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. ఇక పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వెచ్చించిన రూ.3,385.58 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. అంటే.. ఆ డబ్బు రాష్ట్ర ఖజానాలోకి చేరింది. కానీ.. దాన్ని వైఎస్ జగన్ సర్కార్ దారి మళ్లించినట్లుగా చంద్రబాబు చిత్రీకరించడాన్ని ఆర్థిక నిపుణులు తప్పుబడుతున్నారు.కొసమెరుపు‘గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను కట్టాలి. కట్టాక ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ వేయాలి’ అని అన్యాపదేశంగా తాజాగా సీఎం చంద్రబాబు అంగీకరించడం కొసమెరుపు. కాఫర్ డ్యామ్ల జీవితకాలం మూడు నాలుగేళ్లకు మించి ఉండదని అధికారులకు చెబుతున్న సమయంలో అన్యాపదేశంగా తాను చేసిన చారిత్రక తప్పిదాన్ని అంగీకరించారు. 45.72 మీటర్లకు ఒక్క ఇంచ్ కూడా తగ్గదుపోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గిస్తున్నారంటూ 2021 నుంచి పాడుతున్న పాటనే చంద్రబాబు తాజాగా మరోసారి పాడారు. అయితే ప్రాజెక్టు స్పిల్వేను ఇప్పటికే నిర్మించామని.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పూర్తయ్యాక టేపు తీసుకుని వెళ్లి కొలుచుకోవాలని.. 45.72 మీటర్ల కంటే ఒక్క ఇంచ్ కూడా తగ్గదని 2021 నుంచి 2024 దాకా వైఎస్ జగన్ చెబుతూనే ఉన్నారు. అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా ఇదే అంశాన్ని లోక్సభ, రాజ్యసభలో రాతపూర్వకంగా తేల్చి చెప్పారు. ఏదైనా ప్రాజెక్టు పూర్తయ్యాక డ్యామ్ భద్రత దృష్ట్యా ఒకేసారి గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయరు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టు పూర్తయిన మొదటి ఏడాది నీటి నిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు.. ఆ తర్వాత నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ 2/3వ వంతు.. డ్యామ్ భద్రతను పరిశీలిస్తూ, నిర్వాసితులకు పునరావాసం కల్పించి మూడో ఏడాది పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తారు. ఈ మార్గదర్శకాల మేరకే పోలవరంలో తొలి ఏడాది 41.15 మీటర్ల ఎత్తులతో నీటిని నిల్వ చేస్తారు. దాన్నే ప్రాజెక్టు ఎత్తుగా చంద్రబాబు చిత్రీకరించటాన్ని అధికారవర్గాలే తప్పుబడుతున్నాయి.సవాళ్లను అధిగమిస్తూ వడివడిగా..» చంద్రబాబు చారిత్రక తప్పిదాల వల్ల పోలవరంలో చోటుచేసుకున్న విధ్వంసాన్ని చక్కదిద్దుతూ పనులను వైఎస్ జగన్ ప్రణాళికాబద్ధంగా పరుగులెత్తించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పనులను ప్రారంభించడానికి ముందు అంటే 2018 నవంబర్కు ముందు.. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం గోదావరిలో ఇసుక సాంద్రతను ట్రాన్స్ట్రాయ్ తప్పుగా లెక్కించింది. ఆ తప్పుడు లెక్క ప్రకారమే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లకు పునాదిగా 20 మీటర్ల లోతు నుంచి స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ చేసింది. కానీ.. గోదావరి ఇసుక సాంద్రతను పరిగణలోకి తీసుకుంటే 30 నుంచి 35 మీటర్ల లోతు నుంచి స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ చేయాలి. కానీ 20 మీటర్ల లోతులోనే స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ వేయడం వల్ల ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లలో లీకేజీలు అధికంగా ఉన్నాయి. ఆ లీకేజీలను అధిగమిస్తూ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన భారీ అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యధాస్థితికి తెచ్చారు. » దెబ్బతిన్న డయాఫ్రమ్వాల్ స్థానంలో సమాంతరంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో కొత్త డయాఫ్రమ్వాల్ నిర్మించి పాత దానితో అనుసంధానం చేయాలా? అనే విషయంపై తేల్చి చెబితే 18 నెలలల్లోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుని వారు సూచించిన డిజైన్ల మేరకు పనులు చేపడదామని పీపీఏ, సీడబ్ల్యూసీ పేర్కొన్నాయి. ఆ మేరకు ఫిబ్రవరిలో అంతర్జాతీయ నిపుణులను ఖరారు చేశాయి. » 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,396 కోట్లుగా ఉంది. అయితే 2017–18 ధరల ప్రకారం నిర్వాసితుల పునరావాసం, భూసేకరణకే రూ.33 వేల కోట్లు అవసరం. ఈ నేపథ్యంలో పాత ధరలతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం పూర్తి చేసేందుకు సహకరించాలని ప్రధాని మోదీని నాడు వైఎస్ జగన్ పలుదఫాలు కోరారు. దీనిపై ఎట్టకేలకు సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ ఆ మేరకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో తొలిదశ పూర్తికి రూ.12,157.53 కోట్లు విడుదల చేయాలని సూచిస్తూ మార్చి 6న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కేంద్ర కేబినెట్కు ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికే బీజేపీతో టీడీపీకి పొత్తు కుదరడంతో నిధులు ఇచ్చే ఫైలుపై ఆమోదముద్ర వేస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని భావించిన చంద్రబాబు తెరచాటున బీజేపీ పెద్దలతో మంత్రాంగం నడిపారు. దీంతో ఆ ఫైలును కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. లేదంటే మార్చి ఆఖరులోనే రూ.12,157.53 కోట్లు పోలవరానికి విడుదలయ్యేవి. -
పోలవరం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు.. మరి మీరు ఎందుకు తీసుకున్నారు?
తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అబద్ధాలు, అసత్యాలతో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడాన్ని తూర్పారబట్టారు అంబటి రాంబాబు.ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఆధారాలతో సహా మీడియాకు వివరించారు అంబటి.అసలు స్పిల్వే చానల్ పూర్తి కాకుండా, అప్రోచ్ చానల్ పూర్తి కాకుండా, నది డైవర్షన్ పూర్తి కాకుండా కాపర్ డ్యామ్ను ప్రారంభించి డయా ఫ్రం వాల్ను నిర్మించడం గత చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన చారిత్రాత్మక తప్పిదమన్నారు. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టుని మీరు ఎందుకు వారి దగ్గర్నుంచి తీసుకున్నారని అంబటి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రాజెక్టుకు నిధులను ముందు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందని, ఆపై మీరు ఇవ్వమని 2013-14 రేట్లతో 2016వ సంవత్సరంలో అంగీకరించడం ద్రోహం, చారిత్రాత్మక తప్పిదం కాదా? అని నిలదీశారు. 2018 సంవత్సరానికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చంద్రబాబు అపరభగీరథుడు అనిపించుకునే ప్రయత్నం చేసి.. ఇప్పుడు ఆ తప్పులను మా మీద రుద్దే యత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాపై మీరు చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆ ప్రాజెక్టును మీరు పూర్తి చేసేటట్లు లేరనే విషయం అర్థం అవుతుందని, మళ్లీ జగనే దాన్ని పూర్తి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.అంబటి రాంబాబు ఏమన్నారంటే...మా ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో చిన్న తప్పుకూడా జరగలేదువైఎస్సార్సీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదుకరోనా సమయంలో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ఆగలేదుజగన్ అంటే భయం కాబట్టే చంద్రబాబు దూషిస్తున్నారుముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుకు అహం పెరిగిందిపోలవరంపై చంద్రబాబుకు శ్రద్ధ లేదుపోలవరం ప్రాజెక్టు విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కృషి వెలకట్టలేనిదిఆయన హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక అనుమతులొచ్చాయివైఎస్సార్ ఎన్నో అనుమతులు తీసుకొచ్చారువైఎస్సార్ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైందిపోలవరం ప్రాజెక్టు అంత తేలికగా అర్థం కాదు కాబట్టే చాలా స్టడీ చేసి నిర్ణయానికి వచ్చాంపదేపదే జగన్ను దూషించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారుఇచ్చిన వాగ్దాలను నిలబెట్టుకోవాలని జగన్ అంటే బాబుకు భయంమీరు చేసిన తప్పిదాల వల్లే పోలవరం సర్వనాశనం అయ్యిందనే విషయాన్ని కచ్చితంగా నిరూపించగలందీనికి సంబంధించి నిపుణులను కనుక్కోండివాస్తవం ఏంటో చెప్పండి అని అడగండిడయా ఫ్రమ్ వాల్ ఎందుకు కొట్టుకుపోయిందో అడగండిమీకు చెప్పడానికి వారు భయపడతారు కూడా.. ఎందుకంటే మీరు నాల్గోసారి ముఖ్యమంత్రి కాబట్టిబాబు హయాంలోనే డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయిందిపదే పదే దూషిస్తూ జగన్పై నింద వేసే ప్రయత్నం చేస్తున్నారువైఎస్సార్ కలలుగన్న ప్రాజెక్టు కాబట్టే పూర్తి తపనతో పని చేశాంచంద్రబాబు చేసిన తప్పులు వల్లే పోలవరం ప్రాజెక్ట్ నాశనంప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యంపోలవరం జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందిఅసలు కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టింది..దీనికి సమాధానం చెప్పండిఈ ప్రాజెక్టు మీరు తీసుకోవడానికి గల కారణాలేంటి?కమీషన్లు కొట్టేయడానికే తీసుకున్నారువేల కోట్ల ప్రాజెక్టు కాబట్టే కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంది.జాతీయ ప్రాజెక్టు అయినటువంటి పోలవరాన్ని నీ కరప్షన్ కోసం తీసుకోవడం జరిగిందనే విషయం అందరికీ తెలుసుకాంట్రాక్టర్లకు ఎక్కువ సొమ్ముకు ప్రాజెక్టును ఇచ్చావంటే దాంట్లో అర్థమేంటిఅందులో కమీషన్లు కొట్టేదామనే కదా చంద్రబాబుఇది ఏ కాంట్రాక్టర్కైనా అర్థమవుతుందిడబ్బులు కాజేయడం కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నాడని ఆనాటి ప్రధాని, ఇప్పటి ప్రధాని, మీ సహచరుడు నరేంద్ర మోదీనే చెప్పారుపోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని మోదీనే వ్యాఖ్యానించారంటే అందులో అర్థమేంటి? -
జగన్ పై నింద మోపే ప్రయత్నం... అబద్ధాలు, అర్ధసత్యాలతో పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రం
-
అబద్ధాలు, అర్ధసత్యాలు.. పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రం
సాక్షి, విజయవాడ: అబద్ధాలు, అర్ధ సత్యాలతో పోలవరంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు సీఎం చంద్రబాబు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చాలానే అవస్థలు పడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్పై ఆరోపణలతోనే తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు.. ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో మాత్రం చెప్పలేదు.చంద్రబాబు ప్రభుత్వ ప్రణాళిక లోపంతోనే డయాఫ్రం వాల్ కొట్టుకుపోగా, నాడు చంద్రబాబు పునాది స్థాయిలో వదిలేసిన స్పిల్ను 48 గేట్లతో సహా వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వమే కారణం. ఇదే అంశాన్ని ఐఐటీ హైదరాబాద్, ఎన్హెచ్పీసీ నివేదికలు స్పష్టం చేశాయి. రెండేళ్ల కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలవరం పనులను వైఎస్ జగన్ ప్రభుత్వం పరుగులు పెట్టించింది. సీడబ్ల్యూసీ డిజైన్ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా.. వైఎస్ జగన్పై నిందమోపే ప్రయత్నం చేశారు చంద్రబాబు.భజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్లకు ఆశ పడి దక్కించుకున్న చంద్రబాబు సర్కార్ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తుంగలో తొక్కింది. సులభంగా చేయగలిగి, కాంట్రాక్టర్లకు అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా వరదను మళ్లించేలా స్పిల్వే, కాఫర్ డ్యామ్లు కట్టాకే ప్రధాన డ్యామ్ పనులు చేపడతారు. 2014–19 మధ్య పోలవరంలో చంద్రబాబు సర్కార్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది.గోదావరి వరదను మళ్లించే స్పిల్వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను ప్రారంభించనే లేదు. కానీ.. డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్వాల్ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పింస్తామంటు హామీ ఇచ్చి 2018 నవంబర్లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించారు. ఇదే ప్రధాన డ్యామ్గా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు.2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరావాసం కల్పింంచకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్త⇒ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యామ్ల పనులు చేయాలని ఆదేశించింది. అయితే పునరావాసం కల్పింంచలేక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి పనులు ఆపేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడంతో అదే ఏడాది మే 30న సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. జూన్ రెండో వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. అంటే.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి, గోదావరి వరద ప్రారంభం కావడానికి మధ్య కేవలం 10 నుంచి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వ్యవధిలో కాఫర్ డ్యామ్లలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయడం ఎలా సాధ్యమన్నది చంద్రబాబే చెప్పాలి.గోదావరికి 2019లో భారీగా వరదలు వచ్చాయి. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 2.4 కి.మీ. వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద.. కాఫర్ డ్యామ్లు వదిలిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశానికి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్వాల్లో నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 26 నుంచి 36.50 మీటర్ల లోతుతో కూడిన అగాధాలు ఏర్పడ్డాయి.వీటిన్నింటినీ అధ్యయనం చేసిన ఐఐటీ–హైదరాబాద్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థలు మానవ తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం చోటుచేసుకుందని తేల్చి చెప్పాయి. అంటే ఆ తప్పిదం చేసింది చంద్రబాబేనని తేల్చాయని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. -
పోలవరంపై రివర్స్ గేర్ ఏం చెబుతుందంటే..
ఆంధ్రప్రదేశ్కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించాయి. కారణాలు ఏవైనా, ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదన్న సమాచారం బాధ కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించింది కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్డ్డిను విమర్శించడానికి, పోలవరం జాప్యం నెపం మొత్తాన్ని ఆయనపై నెట్టడానికే అన్నట్లు పర్యటన సాగించారు.2014 నుంచి ఐదేళ్లపాటు చేసిన పాలనలో ఈ ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశానని చెప్పుకుంటే చెప్పుకోనివ్వండి. అందులో వాస్తవం ఉందా? లేదా? అనేది వేరే విషయం. నిజంగా అంత పని పూర్తి అయిపోయి ఉంటే కీలకమైన డయాఫ్రం వాల్ వరదలలో కొట్టుకుని పోయేది కాదు కదా అనే లాజిక్కు సమాధానం దొరకదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మాణ సంస్థను మార్చిందని చంద్రబాబు అంటున్నారు. దానివల్ల జాప్యం అయిందని చెబుతున్నారు. ఒకవేళ అది నిజమే అనుకుంటే చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను ఎందుకు మార్చారో చెప్పాలి కదా! నామినేషన్ పద్దతిన నవయుగ సంస్థకు ఎందుకు ఇచ్చారో వివరించాలి కదా! డయాఫ్రం వాల్తో సహా ఆయా పనులు నామినేటెడ్ పద్దతిన కొన్ని కంపెనీలకు ఎందుకు కేటాయించారన్నది వివరించాలి కదా!2014 టరమ్లో కేంద్రంలో పొత్తులో భాగంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టి సత్వరమే పూర్తి చేయించేలా ఒత్తిడి తేవడం మాని, రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని ఎందుకు కోరినట్లు? ఆ ప్రాజెక్టు కాంట్రాక్టును తనకు కావల్సినవారికే ఇచ్చుకునేందుకే అన్న విమర్శలకు ఎందుకు తావిచ్చారు. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎమ్ అయిందని ఎందుకు విమర్శించారు. దానికి చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేదు! మళ్లీ పొత్తు కుదిరింది కనుక మోడీ కూడా ఆ పాయింట్ మర్చిపోయినట్లు నటిస్తుండవచ్చు. అది వేరే విషయం. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించదలచినప్పుడు వ్యయ అంచనాలపై కేంద్రంతో ఎందుకు సరైన అవగాహనకు రాలేదు?కేవలం ప్రాజెక్టు నిర్మాణమే కాకుండా, ప్రాజెక్టువల్ల ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అక్కడనుంచి తరలించడం, వారికి పునరావాసం కల్పించడానికి అయ్యే వ్యయం గురించి ఎందుకు కేంద్రంతో ఒప్పందం కాలేదు? కేంద్ర ప్రభుత్వం తాము ప్రాజెక్టు కడతాము కానీ, నిర్వాసితుల సమస్య రాష్ట్రమే చూసుకోవాలని చెప్పినప్పుడు ఎందుకు ప్రతిఘటించలేదు? అలాంటప్పుడు మొత్తం ప్రాజెక్టును కట్టి, రాష్ట్రానికి అప్పగించాలని ఎందుకు కోరలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పిల్ వే, గేట్ల అమరిక తదితర పనులను పూర్తి చేసింది నిజం కాదా? ఇవన్నీ అవ్వకుండానే పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు చెబితే అది నిజమే అవుతుందా?2018 నాటికే ప్రాజెక్టును పూర్తి చేస్తామని శాసనసభలోనే టీడీపీ ప్రభుత్వం ప్రకటించిందా? లేదా? అయినా ఎందుకు పూర్తి కాలేదు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ ద్వారా నిధులు ఆదాచేసే ప్రయత్నం చేసింది. పోలవరం ప్రాజెక్టులో కూడా సుమారు 850 కోట్ల మేర తక్కువ వ్యయానికి మెఘా సంస్థ టెండర్ పొందింది. దీనిని తప్పు పడుతున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్ను కొనసాగించదలిచారా? లేదా? పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంపుదల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారా? లేదా?బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత ఆ మొత్తం గురించి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా టీడీపీ నాయకత్వమే ఆపుచేయించిందన్న విమర్శల గురించి ఏమి చెబుతారు? బీజేపీతో పొత్తు పెట్టుకునే క్రమంలో ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల వ్యయం కేంద్రం పూర్తిగా భరించి సహకరించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఎందుకు కోరలేకపోయారు? చంద్రబాబు తన హయాంలో ఆయా కీలక పనుల ప్రాధాన్యతలను మార్చి పనులు చేయించడంవల్లే ఈ సమస్య వచ్యిందన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదన. దీనిని ఆయన గత అసెంబ్లీలో వివరణాత్మకంగా వివరించారు.కాఫర్ డామ్ పూర్తి కాకుండానే, గ్యాప్లు ఉంచి డయాఫ్రం వాల్ నిర్మాణం తలపెట్టింది చంద్రబాబు ప్రభుత్వమా? కాదా? డయాఫ్రం వాల్ నిర్మాణం వరద కారణంగా దెబ్బతిన్నదంటే అది నాణ్యతాలోపమా? లేక మరేదైనా కారణమా? దీనిపై కేంద్ర జల కమిషన్ ఎందుకు ఒక నిర్ణయం తీసుకోవడానికి తాత్సారం చేస్తోంది? కేంద్రంలో ఇప్పుడు కూడా టీడీపీ భాగస్వామి కనుక ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడానికి ఏమి చర్యలు తీసుకుంటుందో చెప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేస్తే ఏమి ప్రయోజనం. తాను పూర్తి చేసి చూపిస్తే ఆయనకే పేరు వస్తుంది కదా! ఇన్ని రాజకీయాలు ఎందుకు!మొత్తం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తే పూర్తి చేయిస్తామని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గతంలో అన్నారు కదా? ఆ ప్రకారం ముందుకు వెళ్లే ఆలోచన చేస్తారా? కీలకమైన ఢయాప్రం వాల్ నిర్మాణం, సీపేజీ నీరు రాకుండా అడ్డుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టి, డామ్ నిర్మాణం పూర్తి చేయడానికి నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు. దానిని ఎంత వీలైతే అంత తగ్గించడానికి ప్రయత్నించాలి కదా! కేవలం సాంకేతిక నిర్ణయం చేయడంలో కేంద్రం చేస్తున్న జాప్యాన్ని ఎందుకు చంద్రబాబు ప్రశ్నించడం లేదు?పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత వ్యయం చేసింది? అందులో ఎంత మొత్తాన్ని కేంద్రం తిరిగి చెల్లించింది?మొదలైన వివరాలను చంద్రబాబు ఎందుకు వెల్లడించలేదు? ఇప్పుడు సమస్య రాష్ట్రం పరిధిలో లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ చేతిలో ఉంది. వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిను తప్పు పట్టడానికే అయితే చంద్రబాబు సోమవారం.. పోలవరం కార్యక్రమం చేపట్టినా ప్రయోజనం ఉండదు.వైఎస్ జగన్మోహన్ రెడ్డిను రాజకీయంగా విమర్శిస్తే విమర్శించండి. తద్వారా రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తే యత్నించండి. ప్రాజెక్టు విషయంలో ఎవరు ఎలా ప్రవర్తించారు. ఎవరు ఏ మేరకు కృషి చేశారు? ఎవరు ద్రోహం చేశారు? ఎవరు మేలు చేశారు? అనే అంశాలు చరిత్రలో నిక్షిప్తమై ఉంటాయి. ప్రస్తుతం వాటి జోలికి వెళ్లడం ముఖ్యం కాదు. ప్రాజెక్టును పూర్తి చేసిన రోజున చంద్రబాబు కాలర్ ఎగురవేసుకుని ఏమి చెప్పినా వినవచ్చు. అలాకాకుండా కుంటి సాకులు చెబుతూ కాలక్షేపం చేస్తే మాత్రం రాష్ట్రానికి ద్రోహం చేసినట్లు అవుతుంది.ప్రాజెక్టులో తొలిదశలో నీటిని నిల్వ ఉంచే విషయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అప్పట్లో చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేసేవారు. మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో 194 టీఎమ్సీల నీటిని నిల్వ ఉంచాలంటే నిర్వాసితులకు ఇవ్వవలసిన పరిహారం సుమారు ముప్పైవేల కోట్లను కూడా కేంద్రం నుంచి ఎంత తొందరగా రాబట్టుకోగలిగితే అంత మంచిది. ఈ ప్రాజెక్టు ఆంధ్రుల దశాబ్దాల కల. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీలో చాలా వరకు నీటి సమస్య లేకుండా పోయే అవకాశం ఉంటుంది.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ ప్రాజెక్టు ఒక రూపానికి వచ్చింది. రాజశేఖరరెడ్డి కేంద్రం నుంచి అనుమతులు తేవడంలో చాలా కృషి చేశారు. అలాగే ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకు కూడా చొరవ తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన అనూహ్య మరణంతో ఉమ్మడి ఏపీ గతి మారిపోయింది. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై చూపవలసినంత శ్రద్ద చూపలేదు. కాంట్రాక్టర్ ఎంపికే పెద్ద వివాదంగా మారుతూ వచ్చింది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడం, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపడుతుందని పేర్కొనడంతో మళ్లీ ఆశలు చివురించాయి.వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం పనులపై ఎంతో శ్రద్దపెట్టి అనుమతులు తేకపోతే, విభజన సమయంలో ఈ ప్రాజెక్టు చట్టంలోకి కూడా వచ్చేది కాదేమో! విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ఈ ప్రాజెక్టు ఒక వరం అవుతుందని అంతా భావించారు. ఈ తరుణంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టకుండా పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్యింది. తదుపరి కేంద్రం బదులు తామే నిర్మిస్తామని తీసుకోవడంతో అనేక కొత్త సమస్యలు వచ్చాయి.తర్వాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని పనులు పూర్తి చేసినప్పటికీ, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోవడం, వరదలు, కరోనా వంటి సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇంతలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. దాంతో ప్రాజెక్టు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో టీడీపీపై ఆధారపడిన ప్రభుత్వం వచ్చింది కనుక బీజేపీపై ఒత్తిడి పెంచి సకాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఏపీకి మేలు జరుగుతుంది. మరి ఆ విధంగా చంద్రబాబు చేయగలుగుతారా? లేక జగన్మోహన్ రెడ్డిను నిందించడానికే ప్రాధాన్యత ఇస్తారా?– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
జీవనాడిపై దాడి!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి జీవనాడి. గరిష్టంగా 194.6 టీఎంసీల సామర్థ్యంతో గోదావరిపై నిర్మిస్తున్న అతి పెద్ద జలాశయం ఇదే. కుడి, ఎడమ కాలువ ద్వారా 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో గోదావరి, కృష్ణా డెల్టాల్లో 23.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లందించ వచ్చు. విశాఖ నగరం పారిశ్రామిక, తాగునీటి అవసరాలను తీర్చవచ్చు. ప్రాజెక్టులో నిర్మించే జలవిద్యుత్కేంద్రంలో 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయవచ్చు. పోలవరం పూర్తయితే రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారిపోవడం ఖాయం. దేశంలో ఈ స్థాయిలో సాగునీరు, తాగునీరు, విద్యుత్తు అవసరాలను తీర్చే బహుళార్థ సాధక ప్రాజెక్టు మరొకటి లేదు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో ప్రారంభించిన పోలవరాన్ని విభజన నేపథ్యంలో 2014లో కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. తామే వంద శాతం ఖర్చుతో పూర్తి చేస్తామని హామీ ఇచి్చంది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే పూర్తి చేయాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి మరీ 2016 సెప్టెంబరు 7న అధికారంలో ఉండగా చంద్రబాబు దక్కించుకున్నారు. 2013–14 ధరల ప్రకారం రూ.20,946 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని నమ్మబలికి కేంద్రానికి హామీ ఇచ్చారు. 2014 ఏప్రిల్ 1 వరకూ ఖర్చు చేసిన రూ.4,730.71 కోట్లు పోనూ మిగతా రూ.15,667 కోట్లే ఇస్తామని కేంద్రం తెగేసి చెబితే దానికీ చంద్రబాబు తలూపారు. సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఖరారు చేసిన ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను కమీషన్ల దాహంతో తుంగలో తొక్కి పనులు చేపట్టారు. వరదను మళ్లించేలా స్పిల్వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేయకుండానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్వాల్ను నిర్మించారు. చివరకు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేయలేక ఇరువైఫులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి 2019 ఫిబ్రవరిలో చేతులెత్తేశారు. ఈ నిర్వాకాల కారణంగా 2019 జూన్ తర్వాత గోదావరిలో పోటెత్తిన భారీ వరద కాఫర్ డ్యామ్ల ఖాళీల మీదుగా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో డయాఫ్రమ్వాల్ దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఇదే పోలవరం పనులను అత్యంత సంక్లిష్టంగా మార్చింది. స్పిల్వే, కాఫర్ డ్యామ్ల పనులను చంద్రబాబు గాలికొదిలేసి డయాఫ్రమ్వాల్ను నిర్మించడమే ఈ క్లిష్ట పరిస్థితికి మూల కారణం. జీవం తీసిన వారే బురద జల్లుతున్నారు తాజాగా పోలవరాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు జీవనాడి లాంటి ప్రాజెక్టును వైఎస్ జగన్ విధ్వంసం చేశారంటూ నిస్సిగ్గుగా బుకాయించారు. కమీషన్లకు ఆశపడి పోలవరం జీవం తీసిన చంద్రబాబు దీన్ని కప్పిపుచ్చి జీవం పోసిన వైఎస్ జగన్పై బురద జల్లే యత్నం చేయడాన్ని సాగునీటిరంగ నిపుణులు తప్పుబడుతున్నారు.అక్రమాలు అరికట్టి కీలక పనులు పూర్తి.. 2019 మే 30న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ సర్కార్ చేసిన చారిత్రక తప్పిదాలను సరిచేస్తూ ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు పనులు చేపట్టారు. పీపీఏ, సీడబ్ల్యూసీ అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ రూ.2,917 కోట్ల విలువైన పనులను నవయుగకు నాడు చంద్రబాబు సర్కార్ నామినేషన్పై కట్టబెట్టింది. వీటితోపాటు జలవిద్యుత్కేంద్రం పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా రూ.783 కోట్లను ఖజానాకు వైఎస్ జగన్ ఆదా చేశారు. రాత్రిపూట కాఫర్ డ్యామ్ పనులు చేస్తున్న దృశ్యం (ఫైల్) నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ స్పిల్వే, స్పిల్ చానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే కనెక్టివిటీస్ను పూర్తి చేశారు. ఎడమ కాలువలో వరాహ నదిపై అత్యంత పొడవైన అక్విడెక్టుతోసహా కీలకమైన పనులను విజయవంతంగా పూర్తి చేశారు. జలవిద్యుత్కేంద్రం పనులను సైతం కొలిక్కి తెచ్చారు. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చారు. ఇక డయాఫ్రమ్వాల్ భవితవ్యాన్ని తేల్చితే 18 నెలల్లోగా ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. అయితే అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుని డిజైన్లు ఖరారు చేసి పనులు చేపట్టేలా సీడబ్ల్యూసీ ప్రణాళిక రచించింది. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం వ్యయమే రూ.33,168.23 కోట్లని, అందువల్ల 2013–14 ధరల ప్రకారం రూ.20,946 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని ప్రధాని మోదీకి నాడు సీఎం హోదాలో వైఎస్ జగన్ అనేక సార్లు విన్నవించారు. ఈ క్రమంలో తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం పూర్తికి సహకరించాలన్న వైఎస్ జగన్ వినతిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు పోలవరం తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ మార్చి 6న కేంద్ర కేబినెట్కు ప్రతిపాదన పంపింది. అయితే అప్పటికే బీజేపీతో టీడీపీ–జనసేనకు పొత్తు కుదిరింది. ఈ నేపథ్యంలో పోలవరానికి నిధులు మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే అది ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారుతుందని, అందువల్ల దాన్ని ఆపేయాలని బీజేపీ అధిష్టానంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఇలా అడ్డుపుల్ల వేయడంతో నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. జలవిద్యుత్కేంద్రంపోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యామ్కు ఎడమ వైపున 960 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్కేంద్రాన్ని నిర్మించాలి. ఎడమ వైపు ఉన్న కొండను తొలిచి 12 ప్రెజర్ టన్నెల్స్ తవ్వి టర్బైన్లను అమర్చి విద్యుత్కేంద్రాన్ని పూర్తి చేయాలి.2014–19: టీడీపీ హయాంలోజలవిద్యుత్కేంద్రం నిర్మాణ పనుల్లో కొండను తొలిచే పనుల్లో కేవలం 25 శాతం మాత్రమే చేసి టీడీపీ సర్కార్ చేతులు దులుపుకొంది.2019–24: వైఎస్సార్ సీపీ పాలనలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జలవిద్యుత్కేంద్రం పనులు శరవేగంగా సాగాయి. కొండను తొలిచే పనులను యుద్ధప్రాతిపదిక పూర్తి చేసి 12 ప్రెజర్ టన్నెల్స్ను పూర్తి చేసింది. టర్బైన్లను అమర్చడానికి అవసరమైన అన్ని పనులు పూర్తి చేసింది. టర్బైన్ల తయారీ బాధ్యతను బీహెచ్ఈఎల్కు అప్పగించింది. జలవిద్యుత్కేంద్రం పనులను దాదాపుగా కొలిక్కి తెచి్చంది. పోలవరం జలాశయం పనులు పూర్తయ్యేలోగా విద్యుదుత్పత్తి ప్రారంభించే విధంగా జలవిద్యుత్కేంద్రం పనులను వేగవంతం చేసింది. 2014–19: టీడీపీ హయాంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను నిర్మించకముందే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్వాల్ను 1,396 మీటర్ల పొడవున పూర్తి చేసిన చంద్రబాబు 2018 జూన్ 11న జాతికి అంకితం చేశారు. ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మించాలంటే 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో ముంపునకు గురయ్యే 54 గ్రామాల్లోని 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఈమేరకు సీడబ్ల్యూసీ, పీపీఏకు హామీ ఇచ్చిన చంద్రబాబు సర్కార్ 2018 నవంబర్లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పనులు ప్రారంభించింది. అయితే రూ.484 కోట్లు ఖర్చు చేసి కేవలం 3,110 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. మిగతా నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, కాఫర్ డ్యామ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాన్ని వదిలేసిన చంద్రబాబు సర్కార్ ఆ పనులను పూర్తి చేయలేక చేతులెత్తేసింది. 2019 జూన్లో ప్రారంభమైన గోదావరి వరద ప్రవాహానికి ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారింది. దాంతో కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో గ్యాప్–2లో డయాఫ్రమ్వాల్ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో సగటున 26 మీటర్ల నుంచి 36.5 మీటర్ల లోతు వరకు భారీ అగాధాలు ఏర్పడ్డాయి.2019–24: వైఎస్సార్ సీపీ పాలనలో ఎగువ కాఫర్ డ్యామ్ ప్రభావం వల్ల ముంపునకు గురయ్యే 8,446 కుటుంబాలకు రూ.1,670 కోట్లతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పునరావాసం కల్పించింది. ఆ తర్వాత ఎగువ కాఫర్ డ్యామ్ను 43 మీటర్ల ఎత్తుతో, దిగువ కాఫర్ డ్యామ్లో కోతకు గురైన ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు 31.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లతోపాటు 2.1 కి.మీ. పొడవున అప్రోచ్ ఛానల్, 2.92 కి.మీ. పొడవున స్పిల్ ఛానల్, వెయ్యి మీటర్ల పొడవున పైలట్ ఛానల్ను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని మళ్లించింది.స్పిల్ వేగోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్వేను నిర్మించాలి. ప్రాజెక్టు పనుల్లో తొలుత పూర్తి చేయాల్సింది స్పిల్ వేనే. 1,118 మీటర్ల పొడవు, 53.32 మీటర్ల ఎత్తుతో నిర్మించే స్పిల్ వేకు 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్ల వరకూ 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో గేట్లు అమర్చాలి. వరద వచి్చనప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా అత్యాధునిక హైడ్రాలిక్ హాయిస్ట్లను గేట్లకు అమర్చాలి. ప్రపంచంలో గరిష్టంగా వరద జలాలను దిగువకు విడుదల చేసే అతి పెద్ద స్పిల్ వే పోలవరంలోనే ఉంది.2014–19: టీడీపీ హయాంలో 2014 జూన్ 8న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 2016 డిసెంబర్ 30న స్పిల్ వే పనులను ప్రారంభించారు. టీడీపీ అధికారం కోల్పోయే నాటికి అంటే 2019 మే 29 నాటికి స్పిల్ వే పనులు పునాది స్థాయిని కూడా దాటలేదు. స్పిల్ వేలో కేవలం రెండు (39, 40) పియర్స్ను 30 మీటర్ల వరకూ చేసి వాటి మధ్య ఒక ఇనుప రేకు పెట్టి గేట్ అమర్చినట్లు 2018 డిసెంబర్ 24న చంద్రబాబు ఘనంగా ప్రకటించుకున్నారు.2019–2024: వైఎస్సార్సీపీ పాలనలో2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఏడాది జూన్లో ప్రారంభమైన వరద ప్రవాహం నవంబర్ వరకూ కొనసాగింది. 2020 మార్చి నుంచి 2021 వరకూ కరోనా మహమ్మారి విరుచుకు పడింది. అయితే గోదావరి వరదలు, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ రికార్డు సమయంలో స్పిల్ వేను పూర్తి చేశారు. లాక్డౌన్లోనూ జర్మనీ, జపాన్ నుంచి హైడాల్రిక్ హాయిస్ట్ సిలిండర్లను దిగుమతి చేసుకుని స్పిల్ వేకు 48 గేట్లను బిగించారు. 2021 జూన్ 11న గోదావరి వరదను స్పిల్ వే మీదుగా విజయవంతంగా మళ్లించారు. -
పోలవరం.. దాచేస్తే దాగని నిజాలు
-
పోలవరం ప్రాజెక్టుపై ఎవరికీ తెలియని విషయాలు బయటపెట్టిన అంబటి
-
‘పోలవరం’ పనుల్లో సంక్షోభం.. బాబు తప్పిదం వల్లే..: అంబటి రాంబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2014–19 మధ్య అధి కారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదంవల్లే పోలవరం ప్రాజెక్టులో విధ్వంసం చోటుచేసుకుందని.. పనుల జాప్యానికి ఆయనే కారణమని మాజీమంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై సోమ వారం సీఎం చంద్రబాబు చెప్పిన మాటలన్నీ పూర్తి అవాస్తవాలు, పచ్చి అబద్ధాలన్నారు. పోలవరం పర్యటన సందర్భంగా ఆయన చేసిన తప్పులను గుర్తుచేసుకోకుండా.. వైఎస్ జగన్పై బురదజల్లేందుకు చంద్రబాబు ప్రయత్నించారని మండిపడ్డారు. ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేయడానికి 2019–24 మధ్య వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషిచేశారని.. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తిచేసి గోదావరి వరద ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించారని గుర్తుచేశారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ఒప్పుకుని చిత్తశుద్ధితో ప్రాజెక్టును పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని అంబటి చంద్రబాబుకు హితవు పలికారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..వాస్తవాలు అవాస్తవాలు అవుతాయా..?ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజులకే సోమవారం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించారు. అధికారంలోకి వచ్చిన ఉత్సాహంలో ఆయనచేసిన తప్పులన్నీ వైఎస్ జగన్పై నెట్టేందుకు యత్నించారు. కానీ, పోలవరం పూర్తిచేయాలంటే ఇంకా నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారంటూ బాబు వెల్లడించారు. పోలవరంలో విధ్వంసానికి వైఎస్ జగనే కారణమని ఆయన పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి.. 2019కి ముందు చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలే పోలవరం విషయంలో సంక్షోభం వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో బాబు వ్యూహాత్మక, చారిత్రక తప్పిదాలే ఈ పరిస్థితికి దారితీశాయి. ముందుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, తర్వాత ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం పూర్తిచేయకుండా డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టడమే దీనికి ప్రధాన కారణం. డయాఫ్రం వాల్తో పాటు ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ పనులు సమాంతరంగా చేపట్టారు. జర్మనీకి చెందిన బావర్ సంస్థ డయాఫ్రమ్ వాల్ను పూర్తిచేసి రూ.460 కోట్లు బిల్లులు తీసుకుంది. చివరకు కాఫర్ డ్యాంల మధ్య ఖాళీలు ఉంచేయడంతో వరదలకు డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతింది. ఇదీ వాస్తవం. దీన్ని దాచిపెట్టి, కాంట్రాక్టర్ను మార్చడంవల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నట్లుగా చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారు. అంతేకాక.. ఇటు స్పిల్ వే, కాఫర్ డ్యాం పూర్తిచేయకపోడం, గోదావరి నదిని డైవర్షన్ చేయకపోవడంవల్ల 54 గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొన్నాయనే వాస్తవాన్ని దాచిపెడుతున్నారు. వీటికి సమాధానం చెప్పకుండా మీరు చేసిన తప్పులను వైఎస్ జగన్ పైకి నెట్టేసి పబ్బం గడుపుకుందామనుకుంటున్నారా చంద్రబాబూ? పోలవరంలో జరిగిన అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు, మేధావులు, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్లు అర్థంచేసుకోవాలి.ఐదేళ్లలో పూర్తిచేస్తామని చెప్పలేకపోతున్నారు..నిజానికి.. చంద్రబాబువల్లే ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యానికి చంద్రబాబే కారణం. చివరకు.. ఇప్పుడు ప్రజలు అధికారం ఇచ్చినా సరే ఐదేళ్లలో పూర్తిచేస్తామనే మాట చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. 2019కి ముందు చంద్రబాబు అశాస్త్రీయంగా ఆలోచించడంవల్లే ఈ పరిస్థితి దాపురించింది.. అప్పట్లో సొంత తెలివితేటలు ఉపయోగించడంవల్ల ఆయన అనేక తప్పులు చేశారు. ఇవాళ వైఎస్ జగన్ మీద విరుచుకుపడడం అన్యాయం.శరవేగంగా పనులు చేసింది వైఎస్ జగనే..ఇక దెబ్బతిన్న డయాఫ్రం వాల్ను ఏం చేయాలన్న దానిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇప్పటికీ నిర్ధిష్టమైన నిర్ణయానికి రాలేదు. ప్రాజెక్టులో 72 శాతం పూర్తిచేశామని చంద్రబాబు చెబుతుండటం విడ్డూరం. ఎందుకంటే..– మేం కట్టిన పోలవరం స్పిల్వే మీద చంద్రబాబు ప్రయాణించారని తెలుసుకోవాలి. మేమే రెండు కాఫర్ డ్యాంలు పూర్తిచేశాం. – అలాగే, గోదావరి నదిని పూర్తిగా స్పిల్వే మీదుగా డైవర్షన్ చేశాం. – స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ కూడా పూర్తిచేశాం. – ఇవికాక క్రిటికల్ నిర్మాణాలు పూర్తిచేసి, గేట్లన్నీ పెట్టి ప్రస్తుతం ఎంత వరద వచ్చినా ఆపరేట్ చేసే పరిస్థితికి ప్రాజెక్టును తీసుకెళ్లాం. – కానీ, చంద్రబాబు మసిపూసి మారేడు కాయచేసే ప్రయత్నం చేస్తున్నాడు.జగన్ ఏ తప్పూ చేయలేదు..మరోవైపు.. చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం వెళ్తానంటున్నారు. వైఎస్ జగన్ను దూషించడమే పనిగా పెట్టుకోబోతున్నారు. కాబట్టి దీన్ని కూలంకషంగా ప్రజలు అర్థంచేసుకోవాలి. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా.. పోలవరం పనుల్లో జగన్ ఎలాంటి తప్పుచేయలేదు. శరవేగంగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి చిత్తశుద్ధితో కృషిచేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాలవల్లే పోలవరానికి ఈ దుస్థితి పట్టింది. నాలుగేళ్లకు పూర్తవుతుందా? ఐదేళ్లకు పూర్తవుతుందా? అనే అంశాన్ని అపర మేధావినని, చక్రం తిప్పానని చెప్పుకుంటున్న చంద్రబాబు కూడా చెప్పలేని దుస్థితికి రావడానికి కారణం.. ఆయన ప్రభుత్వం చేసిన తప్పిదం తప్ప మరొకటి కాదు. బాబు హయాంలో జరిగిన విధ్వంసంవల్ల ప్రతి తెలుగువాడూ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎలాంటి తప్పూ చేయలేదు. చంద్రబాబు తన తప్పులను ఒప్పుకోవాలి.‘హోదా’ తీసుకురాకపోతే ద్రోహిగా మిగిలిపోతారు..చంద్రబాబుకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. భగవంతుడు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. కూటమిని గెలిపించారు. టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఇచ్చారు. కేంద్రంలో ప్రధాని మోదీ చంద్రబాబు మీద ఆధారపడే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. చంద్రబాబు చాలా లక్కీ. ఆంధ్రప్రదేశ్కు కూడా లక్కీయే. ఇలాంటి పరిస్థితి రావాలని వైఎస్ జగన్ చాలాసార్లు కోరుకున్నారు. ఆయనకు రాని అవకాశం టీడీపీకి వచ్చింది. ఇప్పుడు ధర్మపోరాట దీక్షలు అవసరంలేదు. మీ చేతిలో పరిస్థితి ఉంది. ప్రత్యేక హోదాను తీసుకురావాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణం పోయండని చంద్రబాబును రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకోలేకపోతే రాష్ట్రానికి చంద్రబాబులాంటి ద్రోహి ఎవరూ ఉండరని మనవి చేస్తున్నా. ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం వంటివన్నీ వదిలేసి వైఎస్ జగన్ను రోజూ తిట్టుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు బాబూ? -
మీ హయాంలో పోలవరం దుస్థితి ఇది మీ కారు వెళ్లిన స్పిల్వే మేము కట్టిందే
-
చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యం: అంబటి
సాక్షి, గుంటూరు: గతంలో చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయ్యిందని ఏపీ మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం చంద్రబాబు తాజాగా పొలవరంలో పర్యటించడం.. ప్రెస్మీట్ నిర్వహించి గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో అంబటి స్పందించారు. తాడేపల్లిలో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. 2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. పోలవరానికి జగన్ ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. వైఎస్ జగన్పై బురద చల్లాలని ప్రభుత్వం ప్రయతిస్తోంది. కానీ, చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి. వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి. మా పాలనలో పోలవరం పనుల్లో ఎలాంటి తప్పిదాలు జరగలేదు. చంద్రబాబు ఇప్పటికైనా తాను చేసిన తప్పుల్ని గుర్తించాలి అని అంబటి హితవు పలికారు.‘‘చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. పోలవరాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు డబ్బులు సంపాదించాలని చూశారు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పిదాలను గుర్తించాలి’’ అని అంబటి రాంబాబు అన్నార‘‘ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. జగన్ హయాంలో ఎలాంటి తప్పులు జరగలేదు. త్వరగా నిర్మాణం చేశాం. ప్రపంచంలోనే అరుదైన ప్రాజెక్ట్ పోలవరం. ఇందులో డయాఫ్రం వాల్ నిర్మాణం కీలకమైనది. కాపర్ డ్యామ్లు పూర్తయ్యాకే డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా చేయడం వల్లే ప్రాజెక్టుకు నష్టం జరిగింది. ఐదేళ్లలో పోలవరం పూర్తి చేయలేమని చంద్రబాబు చేతులెత్తేశారు. జగన్ హయాంలోనే కాపర్ డ్యామ్లు, స్పిల్ వే నిర్మాణం చేశాం. చంద్రబాబుకు ప్రజలు చాలా గొప్ప అవకాశం ఇచ్చారు. గతంలో ప్రత్యేక హోదా అని ధర్మ పోరాటాలు చేసిన చంద్రబాబుకు ఇప్పుడు మంచి అవకాశం దక్కింది. అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రత్యేక హోదా తీసుకురావాలి. లేకపోతే రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసినట్టే’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘రాజధాని, పోలవరం పూర్తిచేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈవీఎంలపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. -
చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం పనుల్లో జాప్యం
-
పోల‘వరం’ మరో నాలుగేళ్లకే
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం పూర్తి కావాలంటే మరో నాలుగు సీజన్లు అంటే నాలుగు సంవత్సరాలు పడుతుందని అధికారులు చెబుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అది కూడా అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలు ప్రాజెక్టుకు శాపాలుగా మారాయని ఆరోపించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం చంద్రబాబు ఎంపిక చేసిన మీడియాతో మాట్లాడారు. తొలుత స్పిల్వే బ్లాక్–26 వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను పరిశీలించారు. గైడ్ బండ్, గ్యాప్ 1, 2, 3, డీఎస్ఈడీ పవర్ హౌస్ డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్లో జరుగుతున్న పనులను పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నా దూరదృష్టితో ముంపు మండలాల విలీనంపోలవరాన్ని చూస్తే బాధ, ఆవేదన కలుగుతోందని.. ప్రాజెక్టును ఏపీకి జీవనాడిగా భావించామని చంద్రబాబు చెప్పారు. తాను 2014లో గెలిచిన తరువాత దూరదృష్టితో తెలంగాణకు చెందిన ఏడు ముంపు మండలాలను కేంద్ర ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేయగలిగినట్లు తెలిపారు. అప్పటికే పోలవరం చాలా సంక్షోభాల్లో ఉందన్నారు. 2005లో వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్టు పనుల్లో అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. రాష్ట్ర విభజన అనంతరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారన్నారు. ప్రాజెక్టు 45.72 మీటర్ల ఎత్తుతో ఉంటే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, అయితే ఆ ఎత్తు తగ్గించడానికి ప్రయతి్నంచారని ఆరోపించారు.స్పిల్వే ద్వారా 50 లక్షల క్యూసెక్కులు వెళ్లేలా డిజైన్ చేశామన్నారు. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. చైనాలోని త్రీ గోర్జెస్ కన్నా అధిక స్థాయిలో నీటి విడుదల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు ఇదేనన్నారు. 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 320 టీఎంసీల వరకు వరద నీటిని వినియోగించుకోగలిగిన అవకాశం ఈ ప్రాజెక్టుకు ఉందన్నారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోలవరం పనులను తాను వేగవంతం చేశానని, ప్రాజెక్టుపై 100కి పైగా సమీక్షలు, 31 సార్లు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించినట్లు చెప్పారు. పోలవరంతో తనకు ఎంతో అనుబంధం ఉందని, ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో ఎక్కడా కరువు కనపడదన్నారు. రివర్స్ టెండరింగ్తో ఆగిపోయిందిగతంలోనే తమ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.13,683 కోట్లు ఖర్చు చేసి 72 శాతానికి పైగా పూర్తి చేసిందని, అదే వేగంతో పనులు కొనసాగి ఉంటే 2020 చివరి నాటికే పూర్తయ్యేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్తో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేసిందన్నారు. ఇరిగేషన్ కేటాయింపులు రూ.7,100 కోట్లకు తగ్గించి అది కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్సులుగా చెల్లించారన్నారు. తమ హయాంలో రూ.446 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిరి్మంచామని చెప్పారు. గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు పూర్తి చేయనివ్వకుండా కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ సిబ్బందిని మార్చడం లాంటి చర్యలకు పాల్పడిందన్నారు.కేంద్ర జలసంఘం అధికారులు వారించినా పెడచెవిన పెట్టిందన్నారు. 2019, 2020లో అధిక వర్షాల కారణంగా డయాఫ్రమ్ వాల్కు నాలుగు చోట్ల నష్టం వాటిల్లడంతో 35 శాతం దెబ్బతిందని చెప్పారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు మరమ్మతులు చేయాలంటే రూ.447 కోట్లు ఖర్చవుతుందని, దానికి సమాంతరంగా మళ్లీ కొత్తగా నిరి్మంచాలంటే రూ.996 కోట్ల వ్యయం అవుతుందని చెప్పారు. రెండు కాఫర్ డ్యాంలు రూ.550 కోట్లతో నిర్మించారని, కొంతమేర కాఫర్ డ్యామ్ కట్టకపోవడం వల్ల వరద తాకిడికి డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిందని చంద్రబాబు పేర్కొన్నారు. కాఫర్ డ్యామ్ గ్యాప్ నిర్మాణానికి రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. కాఫర్ డ్యామ్కు సీపేజ్లు ఉన్నాయని, వరదలు వస్తే మరింత నష్టం కలుగుతుందని చెప్పారు. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని గత ప్రభుత్వం వృథా చేసిందని ఆరోపించారు. ఇది క్షమించరాని నేరంరాజకీయాలకు పనికిరాని వ్యక్తి పాలించడం రాష్ట్రానికి ఎలా శాపంగా మారుతుందో చెప్పేందుకు గత ముఖ్యమంత్రి ఒక ఉదాహరణగా మిగులుతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్షమించరాని ఇన్ని తప్పిదాలు చేసిన గత ప్రభుత్వంపై ఏ చర్యలు తీసుకోవాలో ప్రజలే తెలియజేయాలన్నారు. పోలవరం పనులను ఎంత సంక్లిష్టం చేయాలో అంతా చేసి ప్రాజెక్ట్ను పనికిరాకుండా చేశారని విమర్శించారు. ఇది క్షమించరాని నేరమన్నారు. అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేదన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఇరిగేషన్ శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటే‹Ù, ఐజీ జీవీజీ అశోక్కుమార్, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘సాక్షి’కి నో ఎంట్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం వద్ద అధికారికంగా నిర్వహించిన విలేకరుల సమావేశానికి ‘సాక్షి’తో పాటు మరో మూడు ఛానళ్లకు అనుమతి లేదని ఐ అండ్ పీఆర్ అధికారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఉన్నత స్థాయి నుంచి తమకు ఆదేశాలు అందాయని, జాబితా ప్రకారం సాక్షి మీడియా, 10 టీవీ, ఎన్ టీవీ, టీవీ 9లకు అనుమతులు లేవని చెప్పారు. కాగా, యూట్యూబ్ ఛానళ్లకు, స్థానిక పత్రికలకు పాస్లు ఇచ్చినప్పటికీ వారిని కూడా అనుమతించలేదు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు దఫాలు పోలవరంలో పర్యటించగా అధికారిక కార్యక్రమాలకు ప్రతి పత్రిక, ఛానల్ను అనుమతించారు. -
Polavaram: పోలవరం వద్ద సీఎం చంద్రబాబు
అమరావతి/ఏలూరు, సాక్షి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టు వద్ద పనుల్ని గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారాయన.ఆపై ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో ప్రత్యేకంగా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం విలేకర్లతో మాట్లాడతారని తెలుస్తోంది. గతంలో.. 2014-19 మధ్య మూడో సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడూ సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనకు శ్రీకారం చుట్టారు. -
పోలవరంను సందర్శించనున్న చంద్రబాబు
-
Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు!
అసలింతకీ రామోజీరావుకు ఏం కావాలి? పోలవరం ప్రాజెక్టు పూర్తికావటమా... లేక ఎక్కడికక్కడ పనులు ఆగిపోవటమా? దీనికి ఆగిపోవటమే ఆయనకు కావాలన్న సమాధానం తేలిగ్గానే వచ్చేస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచి్చన దగ్గర్నుంచీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రామోజీరావు ‘ఈనాడు’లో అచ్చోసిన దుర్మార్గపు కథనాలు అన్నీఇన్నీ కావు. ఇంకేముంది ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశం లేదని కొన్నాళ్లు...కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేదని కొన్నాళ్లు... ఎత్తు తగ్గించి కట్టేస్తున్నారని కొన్నాళ్లు... ఇలా పదేపదే విషాన్ని చిమ్ముతూనే వస్తున్నారు.చిత్రమేంటంటే... రామోజీ అంచనాలకు భిన్నంగా పోలవరం వేగంగా ముందుకెళుతోంది. చంద్రబాబు వీసమెత్తయినా పట్టించుకోని పునరావాసాన్ని కూడా వైఎస్ జగన్ భుజాలకెత్తుకుని ప్రాజెక్టును నడిపిస్తున్నారు. కేంద్రాన్ని పదేపదే అభ్యఆర్థికస్తూ... రావాల్సిన నిధుల్ని రాబట్టుకుంటున్నారు. ఇదిగో... ఇదే ‘ఈనాడు’ కడుపు మంటను పెంచేస్తోంది. కాంట్రాక్టరుగా తన వియ్యంకుడిని తప్పించేసి మరీ ప్రాజెక్టును పూర్తి చేస్తుండటాన్ని రామోజీరావు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ‘పోలవరం నిధుల కోసం... జగన్ నేల చూపులు– బేల మాటలు’ అంటూ సోమవారం ప్రచురించిన కథనం కూడా ఇలాంటిదే!!. మరి దీన్లో నిజానిజాలెంత? ఏది నిజం?ఏది నిజం..?ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చేది ఇక రూ.12,911.15 కోట్లనేనని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్లో 2017లో ఆమోదించిన మొత్తానికి అదనంగా... రూ.12,911.15 కోట్లే ఇస్తామని పేర్కొంది. దీనికన్నా పైసా ఎక్కువరాదు.వాస్తవం: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి, ఆఆర్థికక శాఖ మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, నిర్మలాసీతారామన్లను కలుస్తూనే ఉన్నారు. కలిసిన ప్రతి సందర్భంలోనూ పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం కేంద్ర జలసంఘం ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు.ఈ క్రమంలోనే గతేదాది జనవరి 3న ప్రధాని మోదీతో సమావేశమైనపుడు... ప్రాజెక్టు తొలి దశను సత్వరమే పూర్తి చేసి, రైతులకు ముందస్తు ఫలాలు అందించడానికి తాత్కాలికంగా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించి... జల్ శక్తి, ఆర్థిక శాఖలకు తగు ఆదేశాలిచ్చారు. కేంద్ర జల్ శక్తి శాఖ సూచన మేరకు తొలి దశ పూర్తికి రూ.10,911.15 కోట్లు అవసరమని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.వాటిని జల్ శక్తి శాఖ ఆమోదించింది. అయితే చంద్రబాబు ఘోర తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడానికి, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటానికి రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందని గత మార్చి 5న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. దాంతో తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్లు (10,911 ప్లస్ 2వేలు) విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఆఆర్థికక శాఖ జూన్ 5న అంగీకరించింది. అదీ కథ.వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు 2013–14 ధరల ప్రకారం.. 2014, ఏప్రిల్ 1 నాటికి ఇరిగేషన్ కాంపొనెంట్ ఖర్చులో మిగిలిన మొత్తం అంటే రూ.15,667.9 కోట్లకు మించి ఇచ్చేది లేదని, ఆ తర్వాత పడే అదనపు భారంతో కేంద్రానికి సంబంధం లేదని 2017 మార్చి 15న కేంద్రం ఒక తీర్మానాన్ని ప్రతిపాదించగా... దాన్ని కేబినెట్ ఆమోదించింది కూడా.జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,128.78 కోట్లు ఖర్చు చేయగా.. కేంద్రం రూ.14,418.39 కోట్లు రీయింబర్స్ చేసింది. అంటే 2017, మార్చి 15న కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రకారం పోలవరానికి ఇక విడుదల చేయాల్సింది రూ.1249.51 కోట్లే. ఈ నేపథ్యంలో... తొలి దశ పూర్తిచేయడానికి అవసరమైన రూ.12,911.15 కోట్లు విడుదల చేయాలంటే.. 2017, మార్చి 15 నాటి కేబినెట్ తీర్మానాన్ని సవరించాలి.ఆ మేరకు ప్రతిపాదన పంపాలని కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆఆర్థికక శాఖ సూచించిందే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వబోమని గానీ.. ఇచ్చేది ఇక ఇంతేననిగానీ ఆర్థిక శాఖ నోట్లో ఎక్కడా లేదు. రామోజీరావు మాత్రం ఇచ్చేది ఇక ఇంతేనని కేంద్ర ఆఆర్థికక శాఖ నోట్లో పేర్కొన్నట్లు తప్పుడురాతలు రాసేశారు. చంద్రబాబులా రామోజీది కూడా చంద్రబాబు తరహా బ్రీఫ్డ్ మీ ఇంగ్లీషే అయితే.. ట్యూషన్ పెట్టించుకోవాలి గానీ తనకు అర్థమైనదే వాస్తవమన్న రీతిలో రాసేస్తే ఎలా? అజా్ఞనంతో తప్పుడురాతలు అచ్చేస్తే ఎలా?ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులివ్వబోమని కేంద్రం చెప్పినా సీఎం వైఎస్ జగన్ నోరెత్తడం లేదు. లోక్సభలో బీజేపీకి కావాల్సినంత బలం ఉన్నా రాజ్యసభలో లేదు. రాజ్యసభలో ఉన్న రాజకీయ బలాన్ని పోలవరం నిధులు, ప్రత్యేక హోదా సాధనకు సీఎం వైఎస్ జగన్ ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు?వాస్తవం: విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే నిరి్మంచాలి. కానీ.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కోసం రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ... దాని నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని 2014, జూన్ నుంచి 2016, సెపె్టంబరు 6 వరకూ నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. చివరకు కేంద్రం మంజూరు చేశాక యనమల రామకృష్ణుడు బావమరిదికి, రామోజీరావు వియ్యంకుడికి ఈ కాంట్రాక్టు పనులు నామినేషన్పై కట్టబెట్టేశారు. భారీగా కమీషన్లు దండుకున్నారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న క్రమంలో చంద్రబాబు చేసిన ఇంకో ఘోరమైన తప్పిదమేంటంటే... 2013–14 నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని 2016, సెపె్టంబరు 7న అంగీకరించడం. మరి ఆ మూడేళ్లలో ధరలు పెరిగి ఉండవా? ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేకుంటే ఎలా?2016, సెపె్టంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని.. 2018, డిసెంబర్లోగా ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే.. విడుదల చేసిన నిధులను రుణంగా పరిగణిస్తామంటూ కేంద్రం పెట్టిన మెలికకు సైతం చంద్రబాబు తల ఊపేశారు.2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆఆర్థికక శాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకు అయ్యే (ఇరిగేషన్ కాంపొనెంట్) వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది.ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులిస్తామని స్పష్టం చేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి నోరు మెదపలేదు.2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే .. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసినా సరే... చంద్రబాబు స్పందించలేదు.2016, సెపె్టంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండం ప్రకారం... 2014, ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి.. నిధులిస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2018, జనవరి 12న నాటి సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు.2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఆమోదించిన నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లను మినహాయిస్తే కేవలం రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినా.. చంద్రబాబు దానికి అంగీకరించారు. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ. 33,168.23 కోట్లు. అలాంటిది కేవలం రూ.15,667.9 కోట్లు ఇస్తే పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా అంగీకరించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.నిజానికి ఎలాంటి ప్రాజెక్టు అయినా... ఎంత ప్రతిష్టాత్మకమైనది అయినా కాలం గడుస్తున్న కొద్దీ ముందుగా వేసిన అంచనా వ్యయం పెరుగుతుంది. అది నాగార్జున సాగర్కైనా.. శ్రీశైలానికైనా కూడా!!. పోలవరానికైనా అంతే. 2013–14లో ఉన్న ధరలు ఇప్పుడెందుకు ఉంటాయి? అన్నిరకాల సామగ్రి, లేబర్ చార్జీలు అప్పటితో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువే పెరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ఏకంగా లేఖ రాసేయటంతో... ఇప్పుడు తాజా ధరల ప్రకారం నిధులడిగిన ప్రతిసారీ కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. అసలు చంద్రబాబు ఇలా ఎందుకు చేశారంటే... ఆయనకు కమీషన్లు వస్తే చాలనుకున్నారు కనక.చంద్రబాబు నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నిధుల కొరత ఎదురవుతోందన్నది నిజం. ç2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ, జల్ శక్తి శాఖ మంత్రులను సీఎం వైఎస్ జగన్ కోరుతూ వస్తున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. పోలవరం ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్తోపాటు సీఎం వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ చర్చల వల్ల 2014–15 నాటి రెవెన్యూ లోటు రూ.10,421 కోట్లను ఇటీవల కేంద్రం విడుదల చేసింది. పోలవరం తొలి దశ పూర్తికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేయడానికి అంగీకరించింది. ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు సీఎం వైఎస్ జగన్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై అటు లోక్సభ, ఇటు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇవేవీ కని్పంచడం లేదా రామోజీ?ఈనాడు ఆరోపణ: రెండో దశ పునరావాసానికి రాష్ట్రం ఏమీ చేయలేదని సీఎం స్వయంగా ప్రకటించారు. రాష్ట్రం నిధులు ఇచ్చే పరిస్థితుల్లో లేదని చెప్పారు.వాస్తవం: కొత్తగా నిర్మించే ఏ ప్రాజెక్టులోనైనా నీటిని నిల్వ చేయాలంటే.. ఐఎస్(ఇండియన్ స్టాండర్డ్) ఆపరేషన్ ఆఫ్ రిజర్వాయర్స్ గైడ్ లైన్స్, కేంద్ర జలసంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేయకుండా.. మూడు దఫాలుగా నిల్వ చేసుకుంటూ పోవాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి ఏడాది 41.15 మీటర్ల వరకూ నీటిని నింపి.. ప్రాజెక్టులో అన్ని భాగాలను పరిశీలిస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతారు.ఆ తర్వాత 44 మీటర్ల కాంటూర్ వరకూ నీటిని నింపి, లోటుపాట్లు ఏవైనా ఉత్పన్నమైతే వాటిని సరిదిద్దుతారు. ఆనక 45.72 మీటర్లలో అంటే గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తారు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ పలు మార్లు శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. తొలుత 41.15 మీటర్ల వరకూ నిర్వాసితులకు పునరావాసం కలి్పస్తామని.. ఆ తర్వాత దశలవారీగా పునరావాసం కల్పించి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేస్తామని ఉద్ఘాటించారు.ప్రాజెక్టు ఎత్తు ఏమాత్రం తగ్గదని.. కావాలంటే పూర్తయ్యాక టేపు తెచ్చుకుని కొలుచుకోవాలని చంద్రబాబు, రామోజీరావు ఎల్లో మీడియాకు సవాల్ విసిరారు. ఇదే అంశంపై అటు లోక్సభ, ఇటు రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందిస్తూ.. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి ఒక్క ఇంచు కూడా తగ్గదని, నిర్వాసితులు అందరికీ పునరావాసం కల్పించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.ఇటీవల నిర్వహించిన లైడార్ సర్వేలో పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలో అదనంగా 36 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలటంతో ఆ గ్రామాల ప్రజలకూ పునరావాసం కల్పించడానికి రూ.5,122 కోట్ల నిధులివ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అభ్యఆర్థికంచారు. దీనికీ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. దీన్ని బట్టి చూస్తే ప్రాజెక్టు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టమవుతుంది. అయినా సరే.. రామోజీరావు పదే పదే విషం చిమ్ముతున్నారు.ఇదే అంశాన్ని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శాసనసభలో పలు మార్లు ఎత్తిచూపుతూ.. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లని.. అలాంటిది కేంద్రం ఇస్తామన్న రూ.15,667.9 కోట్లతో ఎలా పూర్తి చేస్తారని నిలదీస్తే.. నాటి సీఎం చంద్రబాబు వాటిని తోసిపుచ్చుతూ వచ్చారు. అంటే చంద్రబాబుకు కావాల్సింది కమీషన్లు తప్ప ప్రాజెక్టు పూర్తవటం కాదు.అందుకే రాష్ట్రమే చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ... ప్రత్యేక హోదా అడగబోమని తాకట్టుపెట్టేశారు. అంచనా వ్యయాన్ని సవరించకున్నా నోరు మెదపలేదు. ఆఖరికి పునరావాసం ఊసెత్తకుండా కేవలం ఇరిగేషన్ కాంపొనెంట్ మాత్రమే ఇస్తామన్నా... సై అనేశారు.అసలు పునరావాసం లేకుంటే ప్రాజెక్టు ఉంటుందా? ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే పేదలకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి, వారికి తగిన పరిహారం ఇవ్వకుంటే వారు అక్కడి నుంచి వెళతారా? వారు వెళ్లకపోతే ప్రాజెక్టు పూర్తి చేసినా నీటిని నిల్వ చేయగలరా? నీటిని నిల్వ చేసే పరిస్థితి లేనపుడు ఎంత ఎత్తు కడితే లాభమేంటి? మరి పునరావాస నిధుల ఊసెత్తకుండా చంద్రబాబు ఎందుకు నోరుమూసుకున్నారు? -
ప్రధాని పదవికి విలువ లేకుండా చేశారు
సాక్షి, విశాఖపట్నం: దేశంలో బీజేపీదే అతి పెద్ద అవినీతి చరిత్ర అని, ఆ పార్టీ చేస్తున్న అవినీతి దేశంలో ఏ పార్టీ చెయ్యలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రధాని పదవికి మోదీ విలువ లేకుండా చేశారని మండిపడ్డారు. బొత్స మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మోదీకి తోడు దొంగ అయిన చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే సోమవారం సభల్లో చదివారని చెప్పారు. తోడు దొంగల కూటమి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆది చదివేయడమేనా, నిజాలు పరిశీలించొద్దా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. మోదీ అదే నోటితో పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నాడని చెప్పిన విషయాన్ని మర్చిపోయారా! అని అన్నారు. ప్రధాన మంత్రి మాటలంటే వాటికి పవిత్రత ఉండాలని చెప్పారు. ఇంతలా దిగజారిపోయి మాట్లాడే ప్రధానిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. పోలవరంపై విచారణ చేసుకోండి పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని భావిస్తే విచారణ జరిపించుకోవచ్చు కదా అని అన్నారు. రూ.15 వేల కోట్లకు ఈసీలు ఇవ్వకుండానే ప్రధాని నిధులు విడుదల చేశారా అని ప్రశ్నించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత నిరాధారపూరితంగా మాట్లాడకూడదని చెప్పారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి కేంద్రం సహకారం ఉంటే తప్పకుండా పూర్తవుతుందన్నారు. చంద్రబాబు హయాంలో పునరావాసం సొమ్మును ఫ్రీజ్ చేశారని షెకావత్ చెప్పారన్నారు. అప్పట్లో చూపిన లబ్దిదారులు సరైనవాళ్లు కాదని వాస్తవ లబ్దిదారులు ఆరోపిస్తున్నారని అన్నారు. నిర్వాసితులకు డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందన్నారు. చంద్రబాబు తప్పులను కూడా తాము సరిచేస్తున్నామని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మంచి కార్యక్రమమని బీజేపీ వాళ్లు చెప్తుంటే.. చంద్రబాబు, పవన్ మాత్రం ప్రజల్ని మోసం చేసేలా మాట్లాడుతున్నారన్నారు. వాళ్లిద్దరికీ సుద్దులు చెప్పాల్సిన మోదీ.. తమకు చెప్తున్నారని మండిపడ్డారు.నీచంగా మానవత్వం లేకుండా కూటమి చర్యలుటీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ పథకాలకు మోకాలడ్డుతూ నీచంగా, మానవత్వం లేకుండా పేదల కడుపు కొడుతున్నాయని బొత్స ధ్వజమెత్తారు. వలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని అడ్డుకొని, రెండు నెలల్లో 40 మంది అవ్వా తాతలను పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. సుమారు 79 లక్షల మంది లబ్దిదారులున్న వైఎస్సార్ ఆసరా పథకంలో చివరి విడతలో ఇంకా రూ.1,839 కోట్లు చెల్లించకుండా అడ్డుకొన్నారని చెప్పారు. విద్యాదీవెన పథకంలో కూడా 28 లక్షల మంది లబి్ధదారులకు రూ.703 కోట్లు ఇవ్వకుండా అడ్డుపడ్డారన్నారు. తుపాను, కరవు వల్ల నష్టపోయిన 13.60 లక్షల మంది రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ రూ.1,294.58 కోట్లు బ్యాంకుల్లో ఉన్నా లబ్ధిదారుల ఖాతాల్లో వేయకుండా అడ్డుకున్నారన్నారు. వైఎస్సార్ చేయూత నాలుగో విడత కింద 33 లక్షల మందికి రూ.565 కోట్లు విడుదల చేయడానికీ ఒప్పుకోలేదన్నారు. ఈబీసీ నేస్తం కింద 4.20 లక్షల మందికి రూ.629 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇవన్నీ అమలులో ఉన్న పథకాలే అని, సాధారణంగా జరగాల్సినవేనని, అందుకే ఎన్నికల సంఘాన్ని గత నెలలోనే అనుమతి కోరామని, అయినా అనుమతివ్వలేదని చెప్పారు. 2019లో పసుపు కుంకుమ కార్యక్రమం ఎన్నికల నోటిఫికేషన్ తరవాత ఇచ్చారని, తాము దానికి అడ్డుపడ్డామా అని ప్రశ్నించారు. దీనికి తోడు సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు కారు కూతలు కూస్తున్నారని, 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడవచ్చా! అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉందన్నారు. తమకూ అలాంటి మాటలు వచ్చని, అయితే తమకు సభ్యత సంస్కారం ఉన్నాయని చెప్పారు. ప్రజలు 15 రోజులు ఓపిక పడితే మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఏ కూటమి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదని అన్నారు.ఈసీ వాస్తవాలు పరిశీలించాలి.. కూటమికి ఎన్నికల సంఘం వత్తాసు పలుకుతూ ఏ ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించడం సరికాదని అన్నారు. ఎన్నికల నిబంధనలకు, రాజ్యాంగానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఈసీ విజ్ఞతతో వాస్తవాలు పరిశీలించాలని కోరారు. కూటమి ఫిర్యాదు వల్ల వ్యక్తులకు, వ్యవస్థకు నష్టమా అనేది ఆలోచించకుండా వృద్ధుల చావుకు కారణం అవ్వడం భావ్యమా అని అన్నారు. చంద్రబాబు నీచమైన భాషపై ఈసీ తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. వృద్ధుల చావులకు కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ అందక రైతులకు జరిగే నష్టానికి, ఫీజులందక విద్యార్థులను పరీక్షలు రాయనివ్వకపోవడం, టీసీలు ఇవ్వకపోవడం జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టీడీపీ కార్యక్రమాలకు ఈసీ ఓకే చెప్పిందన్నారు. అందుకే నిన్న సీఎం వైఎస్ జగన్ సజావుగా ఎన్నికలు జరుగుతాయా! అన్న అనుమానం వ్యక్తం చేశారని తెలిపారు.