రేవంత్రెడ్డి, సండ్రలపై వేటు
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారన్న ఆరోపణపై టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సస్పెండ్ చేశారు. ప్రసంగానికి అడ్డుతగలడంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సస్పెన్షన్ బడ్జెట్ సమావేశాల మొత్తం కొనసాగుతుందని పేర్కొన్నారు.