
నగర శివారులో జింకమాంసం కలకలం
నగర శివారు ప్రాంతం గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగర శివారు ప్రాంతం గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో జింకను వేటాడి చంపిన దుండగులు దాని మాంసాన్ని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఓ ప్రభుత్వ అధికారి ప్రమేయం ఉన్నట్లు భావించిన పోలీసులు ఆయనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఏడాది కాలంలో ఈ ప్రాంతంలో జింకలను వేటాడిన ఘటనలు ఆరుకు పైగా నమోదైనప్పటికీ.. అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.